Dr B R Ambedkar Konaseema
-
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై 7–1 స్కోర్తో ఛత్తీస్గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, కేరళ సెక్టార్పై ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో, మధ్య ప్రదేశ్ సెక్టార్పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు
ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వానికి, పొరబాట్లకు తావివ్వవద్దని పది పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు మువ్వా రామలింగం అన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అధ్యక్షతన పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో సమావేశం జరిగింది. ముఖ్య అతిథి రామలింగం మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి విషయాన్ని సీరియస్గా పరిగణించాలన్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, ఫర్నిచర్ వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థులు కింద కూర్చుని రాయడానికి వీల్లేదన్నారు. ఫర్నిచర్ కొరత ఉంటే ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా పేపర్పై ప్రత్యేక నంబర్ను ముద్రిస్తున్నందున లీకేజీ ఎక్కడ జరిగినా, ఏ పరీక్షా కేంద్రం నుంచి లీకై నా వెంటనే తెలిసిపోతుందన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ప్రతి దశలోను కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈఓ డా. సలీం బాషా మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 19,227 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల స్థాయి గురువు రొక్కం తాతారావును రామలింగం శాలువాతో సత్కరించారు. జిల్లా స్థాయి సైన్స్ వారోత్సవాల పోస్టర్లను రామలింగం, డా.సలీం బాషా తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు, అమలాపుం, రామచంద్రపురం డీవైఈఓలు జి.సూర్యప్రకాశరావు, సి.రామలక్ష్మణమూర్తి, డీఈఓ కార్యాలయ ఏడీ నక్కా సురేష్, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా, మండల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు సాక్షి, అమలాపురం: ప్రజల దైనందిన జీవితంలో సైన్స్కు ఎంతో ప్రాముఖ్యం ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నట్టు డీఈఓ షేక్ సలీం బాష అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడుతూ ఆధునిక మానవాళి అభివృద్ధికి వైజ్ఞానిక శాస్త్రం కీలకమైందన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు శాసీ్త్రయ విజ్ఞానం దోహదపడుతుందన్నారు. సైన్స్తోనే సమాజ పురోగతి ఆధారపడి ఉందన్నారు. జిల్లాలో ఈ నెల 21న అన్ని మండల కేంద్రాల్లో, 25న జిల్లా స్థాయిలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ ఫోరం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా శాఖ, జిల్లా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్స వాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వాలి టెన్త్ ఎగ్జామ్స్పై రాష్ట్ర పరిశీలకుడు రామలింగం -
మడికి మార్కెట్లో నెల రోజుల్లో ధరల వ్యత్యాసం
కూరగాయలు గత నెలలో ప్రస్తుతం పది కేజీల పది కేజీల ధర(రూ.ల్లో) ధర(రూ.ల్లో) ఉల్లి 600 500 మిరపకాయ 700 170 అల్లం 1,500 450 బంగాళదుంప 450 220 వంకాయలు 440 120 బెండకాయ 600 360 బీట్రూట్ 750 250 చిక్కుళ్లు 800 300 నాటు చిక్కుళ్లు 1,100 450 దొండకాయ 350 170 టమాట 600 120 బీరకాయ 700 280 గోరు చిక్కుళ్లు 650 350 కాకరకాయ 700 250 కంద 700 500 పెండలం 600 450 కీర దోస 60 250 దోసకాయలు 450 100 క్యాలీఫ్లవర్(ఒకటి) 25 5 క్యాబేజీ(ఒకటి) 50 18 ఆనపకాయ(ఒకటి) 20 06 ములక్కాడ(ఒకటి) 12 3 గుమ్మడి(ఒకటి) 35 15 అరటి(ఒకటి) 10 3 కొత్తిమీర 1,200 180 -
నష్టాల పంట
● ఉద్యాన రైతుకు కూర‘గాయాలు’ ● కూలీ ఖర్చులూ రాని దుస్థితి ● హోల్సేల్ మార్కెట్లకు జోరుగా పంట ఉత్పత్తులు ● ఒకేసారి దిగుబడి రావడమూ కారణమే.. నిన్నటివరకు ధరాభారంతో ప్రజలపై విరుచుకుపడ్డ కూరగాయలు ప్రస్తుతం చతికిల పడ్డాయి. ఇటీవల కూరగాయల దిగుబడి గణనీయంగా పెరగడంతో.. లాభాలు గడించవచ్చని ఆశించిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. దాదాపు ఏకకాలంలో కూరగాయల దిగుబడులు మార్కెట్ను ముంచెత్తడంతో.. వాటిని పండించిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.ఆలమూరు: రేయింబవళ్లు శ్రమించి పండించిన కూరగాయల ఉత్పత్తులను అమ్ముకునే సమయానికి సరైన ధర లేకపోవడం ఉద్యాన రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. పంట చేతిలో లేని సమయంలో అత్యఽధిక ధర పలికిన కూరగాయలు, ప్రస్తుతం సమృద్ధిగా పంట అందుబాటులోకి వచ్చినా, ఆశించిన ధర లేకపోవడంతో ఉద్యాన రైతు కుదేలైన దుస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉత్పన్నమవుతోంది. ఉమ్మడి జిల్లాల్లోని హోల్సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా దారుణంగా పడిపోయాయి. ఉద్యాన రైతులకు కనీసం రవాణా చార్జీలే కాక, కోత ఖర్చులూ రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పండించిన కూరగాయలను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోంది. ఒకప్పుడు పది కేజీల ధరలు రూ.500కు పైగా పలికిన కూరగాయలు ప్రస్తుతం రూ.150లోపు పడిపోవడాన్ని కూరగాయల రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకకాలంలో దిగుబడి ఉమ్మడి జిల్లాలోని లంక, చాగ్నలాడు, మెట్ట ప్రాంతాల్లో ఏటా సుమారు 35 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. వర్షాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో, మెట్ట, చాగల్నాడు రైతులు గతేడాది అక్టోబర్ నుంచి కూరగాయల సాగును చేపట్టారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా పెరిగిపోయింది. సాగు చేసిన కూరగాయల తోటల దిగుబడి అంతా దాదాపు ఒకేసారి ఈ ఏడాది జనవరి నెలాఖరుకు దశల వారీగా అందుబాటులోకి రావడంతో, వాటి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ఎగుమతులకు బ్రేక్ ఉమ్మడి జిల్లాలోని మడికి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్తో పాటు, రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం హోల్సేల్ మార్కెట్ నుంచి నిత్యం వందలాది టన్నుల కూరగాయలు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు ఎగుమతి జరిగేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూరగాయల పంట అందుబాటులో ఉండటంతో, నెల రోజుల నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి ఎగుమతులు స్తంభించాయి. స్థానికంగా పండించిన పంట ఉమ్మడి జిల్లాల ఆవసరాల కంటే ఎక్కువగా ఉండటంతో కూరగాయలకు డిమాండ్ తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలోని హోల్సేల్ మార్కెట్లో దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి టమాట చేరుకోవడంతో వాటి ధర కూడా కేజీ రూ.పదిలోపు పతనమైంది. ఆకుకూరలూ అంతంతమాత్రమే.. కూరగాయల ధరల మాదిరిగానే ఆకుకూరల ధరలు కూడా అంతకంటే వేగంగా క్షీణిస్తున్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో ఉండటంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర తదితర ఆకుకూరల కొనుగోలుకు వినియోగదారులు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. దీంతో హోల్సేల్ మార్కెట్లో ఆకు కూర కట్ట రూ.ఐదు నుంచి రూ.ఏడు మాత్రమే పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.20 వరకూ ఉంది. ఒకప్పుడు డబుల్ సెంచరీకి చేరువైన కొత్తిమీర ప్రస్తుతం కేజీ రూ.12 పలుకుతోంది.టమాట ముంచేసింది టమాట ధరలు ఆశాజనకంగా ఉన్నాయని ఎకరం పొలంలో దానిని సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయానికి కోత ఖర్చులు రాని పరిస్థితి నెలకొంది. వారం రోజుల నుంచి మడికి హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.10 నుంచి రూ.15 వరకూ పలకడంతో నష్టపోతున్నాం. – కడియాల శ్రీనివాసు, ఉద్యాన రైతు, మూలస్థాన అగ్రహారం, ఆలమూరు మండలం క్యాలీఫ్లవర్ దెబ్బ తీసింది గతేడాది క్యాలీఫ్లవర్ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పాటు, ధర కూడా నిలకడగా ఉండి లాభాలొచ్చాయి. ఈసారి క్యాలీఫ్లవర్ పంట అర ఎకరంలో సాగు చేశాను. గత పక్షం రోజుల వరకూ రూ.20 నుంచి రూ.30 వరకూ పలికిన ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ధర ప్రస్తుతం రూ.ఐదుకు తగ్గింది. – యర్రంశెట్టి శ్రీనివాసు, ఉద్యాన రైతు, బడుగువానిలంక, ఆలమూరు మండలం -
కరాటే పోటీల్లో విద్యార్థులకు పతకాల వెల్లువ
అమలాపురం రూరల్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో అమలాపురం మండలం కామనగరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్నారు. కాకినాడ ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన సెకండ్ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్షిప్లో విద్యార్థులు ప్రఽథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సుమారు 650 మంది విద్యార్థులు పోటీలకు హాజరు కాగా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి 54 మంది పాల్గొన్నట్టు కోచ్ పడాల అంజి తెలిపారు. సత్తా చాటిన స్కూల్ విద్యార్థులు 24 బంగారు పతకాలు, 30 వెండి పతకాలను సాధించి, ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నారు. -
మార్చి నెలాఖరుకు రీ సర్వే పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: భూముల రీ సర్వే ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రెవెన్యూ, సర్వే ఉద్యోగులను ఆదేశించారు. రీ సర్వే పురోగతిపై బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మహేష్కుమార్ అధికారులతో మాట్లాడుతూ, పాత–కొత్త సర్వే నంబర్ల వ్యత్యాసాలను సరిచేయాలని, మ్యాప్లను రూపొందించాలని ఆదేశించారు. పొరబాట్లకు తావు లేకుండా, పకడ్బందీగా మార్గనిర్దేశాలకు అనుగుణంగా నిర్వహించాలని చెప్పారు. బ్లాకుల ఆధారంగా ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. ఫిర్యా దుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా, భూ యజమానుల సమక్షంలోనే సర్వేను నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి బ్లాక్లో 250 ఎకరాలకు మించకుండా సర్వే చేపట్టాలన్నారు. జేసీ టి.నిషాంతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశం -
వీరేశ్వరుని సన్నిధిలో మహా శివరాత్రికి ఏర్పాట్లు
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 26 నుండి మార్చి 2 వరకు నిర్వహించే మహా శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆలయ అర్చక, పురోహితులు, వేద పండితులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యేక చలువ పందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, ప్రత్యేక క్యూలైన్లు, మెడికల్ క్యాంప్, చంటి పిల్లలకు పాలు, బిస్కట్ల పంపిణీ వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఆఖరి రోజు మార్చి రెండున ఆలయం వద్ద నుంచి భారీ ఊరేగింపుతో, వివిధ రకాల విన్యాసాలతో, మేళతాళాలతో రథంపై గ్రామోత్సవం నిర్వహించి, పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో అర్చకులు యనమండ్ర సుబ్బారావు, యనమండ్ర సత్యసీతారామశర్మ, పేటేటి శ్యామలకుమార్, తేజ, పురోహితులు నాగాభట్ల రామకృష్ణమూర్తి, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
● 40 కేంద్రాల్లో మార్చి ఒకటి నుంచి 20 వరకు థియరీ ● డీఐఈవో సోమశేఖరరావు అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థులకు ఈ నెల ఐదున, జనరల్ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 10న మొదలైన ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈవో) వనుము సోమశేఖరరావు ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల ఒకటి నుంచి 20 వరకూ ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు జిల్లాలోని 40 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి వివిధ ప్రభుత్వ శాఖాధికారుల సమన్వయం కోరామన్నారు. ఈ నెల 23న పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఆయా శాఖాధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లకు అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సూచనలు ఇస్తామని డీఐఈవో తెలిపారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని డీఈఓ షేక్ సలీం బాష ఉపాధ్యాయులు, ఎంఈఓలకు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
డిజిటల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ
సామర్లకోట: సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ రెండో రోజు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం(ఈటీసీ)లో బుధవారం కొనసాగింది. ఎన్ఐఆర్డీపీఆర్(హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. గురువారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. ప్రతి జిల్లా నుంచి నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఈ.కృష్ణమోహన్ తెలిపారు. ఎన్ఐఆర్డీపీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వర్ శిక్షణ ఇస్తున్నారు. యువకుడి అదృశ్యం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బైక్ లభ్యం కొవ్వూరు: దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గురోతు సాయి తేజ(25) బుధవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన అతడి వాహనాన్ని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బంధువులు గుర్తించారు. గోదావరి నదిలో దూకాడా, లేక బైక్ను ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికై నా వెళ్లాడా అన్నది తెలియడం లేదని, అతడి సెల్ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ గేదెల ఫామ్లో సాయి తేజ పనిచేస్తున్నాడు. నిత్యం దొమ్మేరు నుంచి ఉదయాన్నే వెళ్లి, మళ్లీ 11 గంటల సమయానికి ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పటిలాగే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న బంధువులకు స్థానికుల ద్వారా బైక్ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో గోదావరి నదిలో జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. సాయితేజ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
రూ.3.60 లక్షల ఎరువుల సీజ్
పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు ముమ్మిడివరం: బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్సై డి.జ్వాలాసాగర్ తెలిపారు. అనాతవరం గ్రామానికి చెందిన పరమట దుర్గాప్రసాద్(బులి చంటి) అక్కడి ప్రభుత్వ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను సోమవారం కిడ్నాప్ చేశాడు. ఆమెను అమలాపురం తీసుకెళ్లి, అక్కడ ఓ ఇంట్లో ఉంచి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులకు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ విషయం దుర్గాప్రసాద్కు తెలియడంతో, బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్ర వంతెన వద్ద బస్సు ఎక్కించి పంపేశాడు. తన ఇంటికి చేరిన బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్, ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అనాతవరం సెంటర్లో అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు తరలించగా, మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు.కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్లోని ప్లాట్ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు. -
‘చలో తుని’కి వెళ్లనీయకుండా పోలీస్ ఆంక్షలు
వైఎస్సార్ సీపీ నేతలకు నోటీసులు అమలాపురం టౌన్: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం ఇచ్చిన చలో తుని కార్యక్రమానికి అమలాపురం నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలువురి పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చలో తుని కార్యక్రమానికి అనుమతులు లేని దృష్ట్యా ఎవరూ ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక వేళ అనుమతులు లేని ఆ కార్యక్రమానికి అమలాపరం నియోజకవర్గం నుంచి ఎవరైనా వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని అమలాపురం పట్టణ, మూడు మండలాల పార్టీ అధ్యక్షులకు పోలీసులు నోటీసులు జారీ చేసి తుని వెళ్లకుండా కట్టడి చేశారు. అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి. ప్రశాంత్కుమార్ ఆధ్వర్యంలో ఆంక్షలు, నోటీసులు అమలయ్యాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు హౌస్ అరెస్ట్ రావులపాలెం: మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావును మంగళవారం రావులపాలెంలో ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాకి నాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపద్ధ్యంలో అక్కడ వెళ్ళకుండా ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. -
క్రీడలతోపాటు క్రమశిక్షణ
ముసలయ్యను సత్కరిస్తున్న డీఈవో సలీంబాషా పీఈటీల సెమినార్లో జేసీ నిషాంతి సాక్షి, అమలాపురం: పాఠశాల విద్యార్థులకు క్రీడలు నేర్పించడమే కాకుండా క్రమశిక్షణ అలవరచడంలో వ్యాయామోపాధ్యాయుల పాత్ర కీలకమని, వారు తమ వృత్థికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తే దేశానికి ఆరోగ్యవంతమైన మంచి విద్యార్థులను అందించిన వారవుతారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాస్థాయి వ్యాయామోపాధ్యాయుల సెమినార్ మంగళవారం జరిగింది. జిల్లా ఏర్పడిన తరువాత నూతన ఓరవడికి నాంది పలుకుతూ వ్యాయామ విద్య ఆవశ్యకతను తెలియజేసేందుకు నిర్వహించిన సెమినార్కు జిల్లాస్థాయిలో 237 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ విద్యతో పాటుగా క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. అమలాపురం ఆర్డీవో కె.మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించాల్సి ఉందన్నారు. కొంతమంది రెగ్యులర్ పీఈటీలు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీలు పద్ధతి మార్చుకోవాలని డీఈవో సలీంబాషా సూచించారు. సమయపాలన, విధి నిర్వహణలో అలసత్వం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా రెండవ అదనపు జడ్జి వి.నరేష్, ఉప విద్యా శాఖ అధికారి పి.వి.సుబ్రహ్మణ్యం, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అడబాల శ్రీనివాస్, పీఈటీల సంఘం ప్రతినిధులు సీహెచ్.వి.ఎస్.ప్రసాద్, బి.ఎస్.ఎన్.మూర్తి, ఉండ్రు ముసలయ్య పాల్గొన్నారు. పీడీ ముసలయ్యకు సన్మానం అమలాపురం రూరల్: ఈ నెల 28న పదవీ విరమణ చేస్తున్న అల్లవరం మండలం కొడూరుప్పాడు ఉన్నత పాఠశాల పీడీ ముసలయ్యను డీఈవో బాషాతో పాటు వ్యాయామోపాధ్యాయుల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అమలాపురం వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా ముసలయ్య విలువైన సేవలు అందించారన్నారు. ఎంతోమంది పాఠశాల విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ముసలయ్య జిల్లాలో జరిగిన పలు క్రీడా పోటీలలో ముఖ్య భూమిక పోషించారన్నారు. -
రండి బాబూ... రండి
● క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ● రైలు.. బస్సు టికెట్లు ఉచితంగా పొందండి ● ఓటు వేసేందుకు సొంత ఊర్లకు రండి ● దూర ప్రాంత వాసులకు కూటమి అనుకూల నేతల ఆఫర్ ● పట్టభద్రుల ఎన్నికలకు తాయిలాలు ● సూదూర ప్రాంతాల వారికి ఉచిత రవాణా ఎర సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో రోజులు గడుస్తున్న కొద్దీ గెలుపు ధీమా తగ్గిపోతుండడంతో కూటమి నేతలు ఓటర్ల ప్రసన్నం కోసం కొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం సుదూర ప్రాంతాలలో ఉంటున్న స్థానిక ఓటర్లకు గాలం వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ముంబై వంటి ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో ఉంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 3,15,261 వరకు ఉన్నాయి. వీరిలో 22 శాతం నుంచి 25 శాతం వరకు ఇతర ప్రాంతాలలో ఉన్నారని అంచనా. మొత్తం ఓటర్లలో సుమారు 75 వేల మంది వరకు ఇతర ప్రాంతాల్లో ఉండగా, వీరిలో 50 వేల మంది వరకు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ప్రతి ఓటు కీలకంగా మారడంతో వీరిలో తమకు అనుకూలంగా ఉండేవారిని రప్పించేందుకు కూటమి నేతలు యత్నాలు ప్రారంభించారు. ఓటర్ల సెల్ ఫోన్లకు వాట్సాప్, టెలిగ్రామ్ల ద్వారా క్యూఆర్ కోడ్లను పంపిస్తున్నారు. అలాగే సంప్రదించాల్సిన నంబర్లు కూడా ఇస్తున్నారు. తమ పేరు బయటకు రాకుండా కూటమి పార్టీలతో పెద్దగా పరిచయం లేనివారి సెల్ నంబర్లు ఇస్తున్నారు. వీటిని స్కాన్ చేస్తే సంబంధించి వ్యక్తులు వీరితో మాట్లాడి రైళ్లు, బస్సుల మీద తీసుకువచ్చే ఏర్పాట్లు చేయనున్నారు. రైల్వే రిజర్వేషన్లు నిండుకోవడం, తాత్కాల్ టిక్కెట్లు పెద్ద ఎత్తున చేయడం సాధ్యం కానందున ఆలస్యంగా స్కాన్ చేసినవారిని బస్సుల మీద తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి నేతలు ఇచ్చిన ఈ ఆఫర్ ఈనెల 16వ తేదీతో ముగిసిపోయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు సునాయాసం కాదని, క్షేత్రస్థాయిలో పలుచోట్ల ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో క్యూ ఆర్ కోడ్ గడువును పెంచినట్టు సమాచారం. -
చమురు సంస్థలపై పోరాటానికి సిద్ధం
అమలాపురం టౌన్: కేజీ బేసిన్ పేరిట గత 30 ఏళ్లుగా ఈ ప్రాంత భూముల్లోకి వేలాది అడుగుల లోతు కెమికల్స్ పంపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న చమురు సంస్థలపై యాంటీ పొల్యూషన్ సొసైటీ ద్వారా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నామని సొసైటీ కన్వీనర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. తాను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయిన క్రమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను, ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా పార్టీలను కలుపుకుని చమురు సంస్థలపై ఇక నుంచి పోరాటాలు చేసేందుకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నానని చెప్పారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, వేదాంత తదితర చమురు సంస్థలు తమ కార్యకలాపాలతో ఇక్కడి భూమిని గుల్ల చూస్తూ తిరిగి ఆ ప్రాంత అభివృద్ధికి అరకొర నిధులు విదుపుతున్నాయని ఆరోపించారు. తమ ఉత్పత్తులు, భారీ వాహనాల రాకపోకల వల్ల కేజీ బేసిన్లో రోడ్లు, వంతెనల జీవిత కాలాన్ని చమురు సంస్థలు హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు కాకినాడలో ఆదివారం చమురు సంస్థల విధ్వంసకర ఘటనలపై పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం కాకినాడలో సీపీఐ ఇదే డిమాండ్పై చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి అన్ని పార్టీల, ప్రజా సంఘాల నుంచి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, బాబి గ్రాబియేల్ పాల్గొన్నారు. -
కార్డ్ 2.0తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్
జిల్లా రిజిస్ట్రార్ నాగ లింగేశ్వరరావు అమలాపురం టౌన్: తమ శాఖలో అమలవుతున్న కార్డ్ 2.0 విధానం వల్ల కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆస్తుల క్రయ విక్రయదారులను పంపిస్తున్నామని జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్. నాగ లింగేశ్వరరావు స్పష్టం చేశారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. అమలాపురం రిజిస్ట్రార్ –1 శ్రీలక్ష్మి, రిజిస్ట్రార్ –2 లక్ష్మణరాజుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై చర్చించారు. కార్డ్ 2.0 విధానం అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం పట్టణం, పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్లు నిర్వహిస్తున్న బిల్డర్లతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించారు. కార్డ్ 2.0 విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన బిల్డర్లకు సూచించారు. కన్వర్షన్ సమస్యలపై జిల్లా అధికారికి ఏకరువు ఎకరా భూమిలో 10 సెంట్లు కన్వర్షన్ అయితే ఆ భూమి మొత్తం గజాల్లో పరిగణించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని బిల్డర్లు జిల్లా అధికారి నాగ లింగేశ్వరరావుకు వివరించారు. భూమిని కన్వర్షన్ చేయడంలో కూడా రెవెన్యూ అధికారులు పెడుతున్న ఆంక్షలు, చేస్తున్న ఆలస్యం వల్ల తాము నష్టపోతున్నామని బిల్డర్లు పేర్కొన్నారు. ఆరు నెలలకు కూడా కన్వర్షన్ చేయడం లేదని వివరించారు. కన్వర్షన్ పరంగా బిల్డర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని నాగ లింగేశ్వరరావు స్పప్టం చేశారు. నిర్మాణం పూర్తయిన ప్లాట్లకు పన్ను విధించే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా జిల్లా అధికారుల దృష్టికి బిల్డర్లు తీసుకుని వచ్చారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో మీ ఇబ్బందులు, సమస్యలపై చర్చిస్తామని నాగ లింగేశ్వరరావు స్పష్టం చేశారు. బిల్డర్లు చిక్కాల గణేష్, కల్వకొలను తాతాజీ, సుంకర నాయుడు, అరిగెల బుజ్జి, చింతపల్లి చిన్నా, మండేల బాబి, ఆశెట్టి ఆదిబాబు, ముద్రగడ తాసు, ఎరుబండి నాని జిల్లా రిజిస్ట్రార్తో మాట్లాడారు. -
‘చలో తుని’కి వెళ్లనీయకుండా పోలీస్ ఆంక్షలు
వైఎస్సార్ సీపీ నేతలకు నోటీసులు అమలాపురం టౌన్: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం ఇచ్చిన చలో తుని కార్యక్రమానికి అమలాపురం నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలువురి పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చలో తుని కార్యక్రమానికి అనుమతులు లేని దృష్ట్యా ఎవరూ ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక వేళ అనుమతులు లేని ఆ కార్యక్రమానికి అమలాపరం నియోజకవర్గం నుంచి ఎవరైనా వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని అమలాపురం పట్టణ, మూడు మండలాల పార్టీ అధ్యక్షులకు పోలీసులు నోటీసులు జారీ చేసి తుని వెళ్లకుండా కట్టడి చేశారు. అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి. ప్రశాంత్కుమార్ ఆధ్వర్యంలో ఆంక్షలు, నోటీసులు అమలయ్యాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు హౌస్ అరెస్ట్ రావులపాలెం: మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావును మంగళవారం రావులపాలెంలో ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాకి నాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపద్ధ్యంలో అక్కడ వెళ్ళకుండా ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. -
తునిలో గూండాగిరీ
ప్రజాస్వామ్యంపై తుని పట్టణంలో కొద్ది రోజులుగా క్రూర పరిహాసం జరుగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న టీడీపీ.. ఆ పురపాలికలో చిన్నపాటి ‘ఏలిక’ పదవి కోసం అడ్డమైన దారులూ తొక్కుతోంది. ప్రజాస్వామిక విలువలను, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలను అడ్డగోలుగా కాలరాసి.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గూండాగిరీకి తెగబడుతోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లపై దాడులకు దిగుతూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా మున్సిపాలిటీలో తిష్ట వేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నాలు సాగిస్తోంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అధికార మదానికి తల వంచి, చేష్టలుడిగి చూస్తూండటం ప్రజాస్వామిక వాదులను నివ్వెరపరుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తునిలో తెలుగుదేశం పార్టీ గుండాగిరీ రాజ్యమేలుతోంది. పోలీసు సహా అధికార వ్యవస్థలన్నీ ఆ పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ, వారు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉంచుకుని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో టీడీపీ అరాచకవాదులు మంగళవారం మరోసారి దౌర్జన్యకాండకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగోసారి కూడా వాయిదా వేయించారు. కౌన్సిలర్లపై మూకుమ్మడి దాడి తుని మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా డ్రామాను రక్తి కట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు రక్షణ బాధ్యతలను జిల్లా అదనపు ఎస్పీ ఎంవీజే భాస్కరరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజుకు అప్పజెప్పారు. తద్వారా కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా రక్షణ కల్పిస్తామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఆ భరోసాతో కౌన్సిల్ హాలుకు ఓటింగ్కు బయలుదేరిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు తమ కుట్రలో భాగంగా మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనికి పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాలుకు 200 మీటర్ల దూరాన పోస్టాఫీసు వీధిలో ఉన్న పిఠాపురం డాక్టర్ ఆస్పత్రి దాటి ముందుకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, టీడీపీ శ్రేణులను మాత్రం కౌన్సిల్ హాలు దగ్గర వరకూ అనుమతించి, ‘పచ్చ’పాత ధోరణి చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి మరీ ‘పచ్చ’ గూండాలు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల పైకి దూసుకుపోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నిలువరించిన దాఖలాలు కనిపించ లేదు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పిస్తామన్న జిల్లా యంత్రాంగం మాటలు చివరకు గాలిలో కలసిపోయాయి. ‘చలో తుని’ అడ్డగింపు తునిలో అధికార టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన ‘చలో తుని’ పిలుపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో తుని తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలకు 41 నోటీసులు జారీ చేసి, తెల్లారేసరికి హౌస్ అరెస్టులు చేశారు. నియోజకవర్గాల నుంచి తుని బయలుదేరిన నేతలను మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంపై క్రూర పరిహాసం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి అడ్డుకున్న టీడీపీ పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు కౌన్సిలర్లపై దాడికి యత్నం భయంతో పరుగు తీసిన కౌన్సిలర్లు కోరం లేక నాలుగోసారీ ఎన్నిక వాయిదా -
‘తెలుగు వ్యాకరణం’ పుస్తకావిష్కరణ
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవి, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి రచించిన ‘తెలుగు వ్యాకరణం’ పుస్తకాన్ని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల తన కార్యాలయంలో డీఐఈవో సోమశేఖరరావు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పుస్తక రూపకర్త నరసింహమూర్తిని అభినందించారు. ఆ పుస్తకాన్ని సమీక్షించిన డీఐఈవో సోమశేఖరరావు మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ వ్యాకరణ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్న నరసింహమూర్తి అభినందనీయుడన్నారు. తెలుగు అధ్యాకునిగానే కాకుండా కవిగా, సాహితీవేత్తగా నరసింహరావు నాలుగు దశాబ్దాలుగా తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. పుస్తక రూపకర్త నరసింహరావు మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పద్యాలు, పద్య భావాలు, పద దోషాలు, ఏక వాక్య పద రూప సమాధానాలు ఈ పుస్తకంలో రూపొందించినట్టు తెలిపారు. బాలాజీ హుండీ ఆదాయం రూ.43.30 లక్షలు మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామివారికి హుండీల ద్వారా 68 రోజులకు రూ.43,30,182 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. 13 గ్రాములు బంగారం, 130 గ్రాములు వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం దేవదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. బ్యాంకు ఉద్యోగులు, స్థానికులు, ఆలయ ఉద్యోగులు, పలు సంస్థలకు చెందిన సేవకులు లెక్కింపులో పాల్గొన్నారు. -
టీడీపీ ‘అధికార’ దుర్వినియోగం
గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణతో 30కి 30 కౌన్సిలర్ స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోని టీడీపీ.. ప్రస్తుతం తునిలో అరాచకాలకు పాల్పడుతోంది. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా ఎన్నిక ప్రశాంతంగా జరిపించలేక చేతులెత్తేయడం విచిత్రం. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగం తునిలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది. ● గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ● జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం, యువ నాయకుడు తోట రాంజీ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను తుని రైల్వే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ● మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులను తుని రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ● రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త జక్కంపూడి గణేష్లను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని తీరుపై నిరసన తెలిపారు. రాజాను అరెస్టు చేశారనే సమాచారంతో మాజీ మంత్రి, చెల్లుబోయిన వేణు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్లు ఆయనఇంటికి వెళ్లగా పోలీసులు నిర్బంధించారు. ● రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును రావులపాలెం వద్ద, పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లిలోను హౌస్ అరెస్టు చేశారు. -
గల్ఫ్ దోపిడీకి చెక్ పెట్టేందుకు హెల్ప్డెస్క్
అమలాపురం రూరల్: గల్ఫ్ దేశాలలో ఉపాధి లభిస్తే ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో అప్పు చేసి ఏజెంట్లు చేతిలో డబ్బు పెట్టి మోసపోతున్నారని, అటువంటి బాధితుల కోసం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు. వెళ్లి మోసపోయిన వారు, ఏజెంట్లతో గల్ఫ్ ఉద్యోగాలపై మంగళవారం కలెక్టరేట్ గోదావరి భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏజెంట్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు హెల్ప్డెస్క్ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆరు మాసాలుగా నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. కలెక్టరేట్లో15 రోజుల్లో ఏడుగురు సిబ్బందితో హెల్ప్ డెస్క్ ప్రారంభిస్తామన్నారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఈ హెల్ప్ డెస్క్ యువతకు వరంగా నిలుస్తుందన్నారు. వలసదారుల రక్షణ చట్టం హైదరాబాద్ ప్రతినిధి అంగర రవికుమార్, డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, వికాస పీపీ కె.లచ్చారావు, డీఎస్డీఓ హరి శేషు, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు. పరిష్కారాలు చూపాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై స్పందించి సకాలంలో పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి భూ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంశాలపై సమీక్షించారు. -
తుని: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాల దాడి
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా👉నాలుగోసారి ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గూండాలు👉బలం లేకపోవడంతో అడ్డుకున్న టీడీపీ గూండాలు👉ఎన్నిక జరిగితే ఓడిపోతామన్న భయంతో కూటమి సర్కార్ కుట్రతునిలో టీడీపీ నేతల దౌర్జనకాండ👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతల దాడి👉మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం👉ప్రాణభయంతో వెనుదిగిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు👉మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా టీడీపీ గూండాలు👉కర్రలతో భారీగా టీడీపీ గూండాలు మోహరింపుతునిలో ప్రజాస్వామ్యం ఖూనీ👉మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు👉నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలు👉తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కుట్రలు👉తునిలో 30కి 30 కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వారే👉ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మందిని లాక్కున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు👉తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు👉144 సెక్షన్ అమల్లో ఉన్న పట్టించుకోని టీడీపీ గూండాలుతునిలో పోలీస్ బందోబస్తు లేదు: దాడిశెట్టి రాజా👉తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.👉ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు👉పిఠాపురం టోల్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు👉తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడిని అడ్డుకున్న పోలీసులు👉పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తల వాగ్వాదంనేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్షసాధిపు చర్యలు దిగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి, కౌన్సిలర్ల పై అక్రమ కేసు నమోదు చేశారు.దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైఎస్సార్సీపీ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు.చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్-2 ఎన్నికకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం కలెక్టర్ షాన్ మోహన్తో దాడిశెట్టి రాజా మాట్లాడారు. మరికాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి నివాసం నుంచి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడ ఎఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమ కేసులు బనాయింపు, బెదిరింపులను దాడిశెట్టి రాజా ఖండించారు. బీసీ మహిళ అయిన తనపై అక్రమ కేసు బనాయింపుపై మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ⇒కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తుని మున్సిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది.⇒జంటిల్మెన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్ వైస్చైర్పర్సన్–2 పీఠాన్ని పోలీసులను కీలు»ొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు.⇒ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్చైర్పర్సన్ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్ పెట్టారు. ⇒అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్లను కౌన్సిల్ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్ చైర్పర్సన్ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసైనా కౌన్సిల్లో కోరం సాధించి వైస్ చైర్పర్సన్ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్త, కో–ఆప్షన్ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు.⇒ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొలి్పంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్లు ఎవరూ వెళ్ల లేదు.⇒తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కలి్పస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి. ⇒వైస్ చైర్పర్సన్ అందునా జంటిల్మెన్ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్ చైర్పర్సన్ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.⇒అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్ చైర్పర్సన్ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్మీనాను కలెక్టర్ షన్మోహన్ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్ ప్రకటించారు. -
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ధర్నా
కాకినాడ సిటీ: అంగన్వాడీ వర్కర్ల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం.రమణ మ్మ, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నీరజ, జ్యోతి, రాజేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించాలని, తక్షణమే గ్రాట్యూటీ అమలు చేయాలని, పెరిగి ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఏళ్ల తరబడి మినీ సెంటర్లలో మెయిన్ సెంటర్లుగా మార్చా లని పోరాటం చేస్తున్నా అమలు చేయడంలేదన్నారు. మెనూ చార్జీలను పెంచి ఇవ్వాలన్నారు. నేడు రాష్ట్ర ప్ర భుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని, గత ప్రభుత్వ హయాంలో రాసుకున్న మిని ట్స్ అంగీకరించిన అంశాలను అమలు చేయాలని డి మాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నామన్నారు. ధర్నా అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఏ జ్యోతికి విన తి పత్రం అందజేశారు. రమ, విజయ, మున్ని, సరోజ, కనకదుర్గ, మేరీ రత్నం, సత్యవతి పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని ధర్నా చేస్తున్న అంగన్వాడీలు -
ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని ఆర్డీఓ కె.మాధవి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్లో అమలాపురం డివిజన్ పరిధిలో 45 పోలింగ్ కేంద్రాలకు ఈ నెల 27న నిర్వహించనున్న పోలింగ్ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ ఇతర ప్రీసైడింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారు వెయ్యి మంది లోపు ఓటర్లు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం ముందు భాగంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రదర్శించాలని, సిట్టింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, గుర్తింపు కార్డు ఆధారంగా ఓటర్ను ధ్రువీకరించాలన్నారు. డీఆర్వో బీఎల్ఎన్ రాజకుమారి, తహసీల్దార్ పి.అశోక్ కుమార్, కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ప్రవర్తన నియమావళికి అనుగుణంగా విధులు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా విధులు సక్రమంగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనీ, మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లలో 50 పోలింగ్ కేంద్రాల పోలింగ్ సిబ్బందికి, ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం స్థానిక గోదావరి భవన్లో జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని సృష్టం చేశారు. సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రకటనలకు ఆమోదం తప్పనిసరి
అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానికి మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ (ఎంసీఎంిసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ప్రకటనలపై ఈసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఎంసీఎంసీ మోనటరింగ్ సెల్ను ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని వివరించారు. సీహెచ్సీని పరిశీలించిన కేంద్ర బృందం పి.గన్నవరం: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకానికి ఎంపిక చేసేందుకు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్క్యూఏఎస్ (జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు) బృందం సోమవారం పరిశీలించింది. డాక్టర్ ఎలిజబెత్ మిలీవర్గీస్, డాక్టర్ మిర్యాన్ వి.వాషింగ్టన్లు ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వారికి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను డిప్యూటీ సివిల్ సర్జన్ యు.రాఘవేంద్రరావు వివరించారు. రోగులకు నాణ్యమైన సేవలను వారు పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగం, పేషెంట్ల వార్డులు, పారిశుధ్యం, మెడికల్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బృంద సభ్యులు తెలిపారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ రాయవరం: జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం నుంచి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం జ్ఞానజ్యోతిలో భాగంగా జరుగనుంది. పీపీ–1, 2 బలోపేతం చేసే చర్యల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు మండల స్థాయిలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,726 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ, అలాగే 22, 24, 25 తేదీల్లో మండల స్థాయిలో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో అంగన్వాడీ కార్యకర్తలకు తర్ఫీదు ఇస్తారు. ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీలో ప్రోగ్రామ్లో భాగంగా ఇప్పటికే 1వ తరగతి బోధించే 1,268 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా తరగతులు బోధిస్తున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాలను సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ పీఓలు పర్యవేక్షించనున్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంగోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వీర్లంకపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2025–26 సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎంయూవీ రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఇంగ్లిషు మీడియం ప్రవేశాలకు 80 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు, బైపీసీ గ్రూపులో40 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో మార్చి 3 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. -
తెలుగులో తొమ్మిది సూత్రాలు
తెలుగులో అవగాహన– ప్రతి స్పందనపై నాలుగు ప్రశ్నల ద్వారా 32 మార్కులు సాధించవచ్చు. వ్యక్తీకరణ – సృజనాత్మకత నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు వస్తాయి. వీటి ద్వారా 36 మార్కులు పొందవచ్చు. ప్రధానంగా పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు, రామాయణంలో పాత్రలు చదవడం ద్వారా 12 మార్కులు సాధించవచ్చు. 8వ ప్రశ్నగా కేవలం పద్యభాగ సారాంశాలు, 9వ ప్రశ్నగా రామాయణం, 10వ ప్రశ్నగా సృజనాత్మకత (లేఖ, కరపత్రం) ద్వారా 24 మార్కులు పొందవచ్చు. 32 మార్కులను కేవలం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న అభ్యాసాల ద్వారా సాధించవచ్చు. అవగాహన ప్రతిస్పందన నుంచి పరిచిత పద్యం ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మాత్రమే ఇస్తారు. – జి.ప్రభావతి, పాఠ్య పుస్తక రచయిత్రి, జెడ్పీహెచ్ఎస్, సఖినేటిపల్లిలంక బయాలజీలో ఈజీగా.. మారిన సిలబస్ను అనుసరించి బయాలజీ ప్రశ్న పత్రం 50 మార్కులకు 17 ప్రశ్నలతో ఉంటుంది. జవాబులు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. సెక్షన్–4లో ప్రయోగాలపై 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల జీవక్రియలు పాఠంపై అవగాహన అవసరం. అనువంశికత పాఠం నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఈ రెండు పాఠ్యాంశాలు బాగా చదివితే 16 మార్కులు తప్పనిసరిగా పొందవచ్చు. సెక్షన్–3లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఒక డయాగ్రామ్ తప్పనిసరిగా వస్తుంది. –మేకా రామలక్ష్మి, డీసీఈబీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మండపేట -
ఇలా అయితే కష్టమే..
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు కూటమికి ఎదురీత అయ్యింది. ఈ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడక అనుకున్న ఆ నేతలకు ఎన్నికల ప్రచారం మొదలైన తరువాత తత్వం బోధపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు ప్రధాన అవరోధంగా మారింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. మొత్తం 3,15,261 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి ప్రచారం మొదలయ్యే వరకూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితులకు.. ప్రచారం మొదలైన రోజులు గడుస్తున్న తరువాత క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతనలేదు. కూటమి అభ్యర్థికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ప్రచారం జోరుగా సాగుతున్నా మొదట్లో ఫలితాలు అనుకున్నంత సులువు కాదని.. ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా ఆశ్చర్యం లేదని అత్యధికుల అభిప్రాయం. ప్రోగ్రెసివ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. పీడీఎఫ్ కార్యకర్తలు చాపకింద నీరులా ప్రచారం చేసుకు పోతున్నారు. స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం ఆ ఓట్లకు గండి.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలన్నీ కూటమి పార్టీకి చెందినవారే గెలిచారు. ఇటీవల పెద్ద ఎత్తున కొత్త ఓటర్లను చేర్పించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఎన్నిక లాంఛనం కావాలి. కానీ కూటమి అభ్యర్థికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇది గుర్తించిన టీడీపీ తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచార జోరు పెంచాలని కార్యకర్తలకు సూచించింది. వారిపై నమ్మకం లేక ప్రతి ఓటరును కలిసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు మొక్కబడిగా చేస్తున్నారే తప్ప ఓటుగా మలుచుకోలేకపోతున్నారు. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేదు. ముఖ్యంగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఓట్లు ఉన్న రైతులు, మహిళలు, వెనుబడిన వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం మా అభ్యర్థికి మైనస్ అవుతోంది’ అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ‘సూపర్ సిక్స్ను అటకెక్కించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన డీఎస్సీని వాయిదాలు వేయడం, పెరిగిన నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీలు’ ఇవన్నీ కూటమి అభ్యర్థికి ఎన్నికల్లో పుట్టి ముంచనున్నాయి. దీనికితోడు గోదావరి జిల్లాలో ఉండే సామాజిక సమీకరణలు సైతం కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా మారనున్నాయి. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా నామినేటెడ్ పదవులు పంపిణీ చేయకపోవడం టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ ప్రభావం ప్రచారంపై పడుతోంది. వ్యతిరేకంగా ఉందనే భయం పరిస్థితి చేయి దాటుతోందని గుర్తించిన చంద్రబాబు ఆదివారం పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులతో సుమారు గంటన్నర పాటు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాటల్లో గెలుపు దీమా కనిపించలేదు సరికదా, ఇంత నిర్లిప్తంగా ఉంటే ఫలితం వ్యతిరేకంగా ఉంటుందనే భయం కనిపించింది. ‘మొన్నటి ఎన్నికల ఫలితాలే ప్రతీసారి రావు. మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమీ పట్టించుకోవడం లేదు. మీకు సీరియస్నెస్ అర్థం కావడం లేదు. మీ జిల్లాలో ప్రతి ఓటు కీలకంగా మారింది. పోలింగ్ జాగ్రత్తగా చేయించుకోవాల్సిందే’ అని చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురంలో పరిస్థితి అనుకూలంగా లేదని బాబు చెప్పుకొచ్చారు. మరోవైపు రాజమహేంద్రవరంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, క్యాడర్తో ఆ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేసి గెలుపును సీరియస్గా తీసుకోవాలని కోరారు. కూటమి నేతలు హైరానా చూస్తుంటే ఎన్నికలలో గెలుపు సులువు కాదనే తత్వం బోధపడిందని ఓటర్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వెనకబాటు కూటమి అభ్యర్థి ఎదురీత జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది భక్తులు ● రూ.30 లక్షల ఆదాయం ● ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు అన్నవరం: వివాహాల సీజన్ సందర్భంగా నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలకు వివిధ ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో రద్దీ పెరిగింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. ముత్తంగి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాలతో చేసిన కవచాల (ముత్తంగి) అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరుడు భక్తులకు కనువిందు చేశారు. -
అడుగులేద్దామిలా..
ఇంగ్లిషు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. గ్రామర్, ఒకాబ్యులరీపై అధికంగా సాధన చేయాలి. సెక్షన్–ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్–బీలో గ్రామర్ అండ్ ఒకాబ్యులరీ, సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి. సెక్షన్–ఏలో 30 మార్కులకు 24 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఆరు సాధారణ ప్రశ్నలుంటాయి. పేరాను బాగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా 24 మార్కులు స్కోర్ చేయవచ్చు. పాఠ్య పుస్తకాల చివర ఇచ్చే గ్రామర్ను బాగా చదివితే 25 మార్కులు ఈజీగా సాధించవచ్చు. క్రియేటివ్ రైటింగ్లో లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, స్పీచ్, డైరీ ఎంట్రీ, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రశ్నలు, పేరాగ్రాఫ్ రైటింగ్ ప్రశ్నలకు బాగా సాధన చేయాలి. కొత్త సిలబస్తో పాటు, నూతన విధానంలో ప్రశ్నపత్రం ఇస్తారు. నౌన్ మోడిఫయర్స్ కొత్తగా ప్రవేశపెట్టారు. – ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ హెచ్ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం గణితానికి ఓ లెక్కుంది గణిత భావనలు బాగా అవగాహన చేసుకుని సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరొకటి ఉండదు. 1, 3, 7, 13, 14 అధ్యాయాలను బాగా అధ్యయనం చేస్తే ప్రతి విద్యార్థి కచ్చితంగా 60 మార్కులు పొందే వీలుంది. ఈ ఐదు చాప్టర్లు గణితంలో పంచరత్నాలుగా భావించాలి. ఈ చాప్టర్ల నుంచే సులభమైన 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు మిగిలిన అధ్యాయాల్లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలపై పట్టు సాధిస్తే 100 మార్కులు సులభంగా స్కోర్ చేయవచ్చు. –టీఎస్వీఎస్ సూర్యనారాయణమూర్తి (గణితావధాని), జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, అమలాపురం -
రెండు బైక్ల ఢీ
ఆలమూరు/ కడియం: మండలంలోని మడికి నుంచి దుళ్ల వెళ్లే రహదారిలో రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన గంటి రాజు (33), కుమారి దంపతులు తమ వ్యక్తిగత పనిపై కొత్తపేట మండలం మందపల్లి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక షణ్ముక నర్సరీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో మళ్లీ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త రాజు మృతి చెందగా, భార్య కుమారి మృత్యువుతో పోరాడుతుంది. ఢీకొట్టిన బైక్ యజమానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై అశోక్ తెలిపారు. నాన్న లేడని ఎలా చెప్పేది వివాహానికి వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందగా, అతని భార్య కుమారి ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేశవరంలోని ఒక ప్రైవేటు కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తూ గంటి రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉంది. ఇంటి వద్ద పాపను వదిలి భార్యతో కలిసి రాజు మందపల్లిలో వివాహానికి శనివారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న రెండేళ్ల చిన్నారికి నాన్న ఎక్కడని అడిగితే ఏమని చెప్పాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రి మృత్యువాత పడి, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఫ ఒకరి మృతి ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ పట్టణానికి చెందిన మందపల్లి శ్రీదేవి వైఎస్సార్ ఫ్లై ఓవర్ విస్తరణలో భాగంగా తమ స్థలాలు పోయాయని భావించిన ప్రభుత్వం పక్కనే ఉన్న శ్మశాన భూమి, మరుగుదొడ్డిని పట్టాలుగా ఇచ్చిందని, ఆ భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా స్థలంపై ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఇప్పుడు పోలీసులతో వచ్చి ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. తమ కుటుంబాన్ని కాపాడాలని, లేదంటే కుటుంబం మొత్తం చనిపోయే పరిస్థితి ఉందని ఓ వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమటూ ఆమె పురుగుల మందు తాగారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. -
కూ... చిక్కుచిక్కు
● కోనసీమ రైలుకు మరోసారి ‘రెడ్ సిగ్నల్’ ● భూ సేకరణకు అవాంతరాలు ● ఇప్పుడు, గతంలో సేకరించిన భూమిపై వివాదం ● ఇప్పటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలంటున్న రైతులు సాక్షి, అమలాపురం: చుక్చుక్ బండి... కూత లేదండి. అడుగడుగునా ఆటంకమండి.. అన్నట్టుంది. కోనసీమ రైల్వే లైన్ పరిస్థితి. దీని నిర్మాణానికి ఓ అడుగు ముందుకు పడుతుంటే.. మూడు అడుగులు వెనకకు వెళ్తున్నాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగుతూ వస్తున్న కోనసీమ రైల్వే లైన్కు తాజాగా మరో అవాంతరం ఏర్పడింది. కొత్తగా చేపట్టిన భూ సేకరణకు అడుగడుగునా అడ్డంకులు రాగా.. ఇప్పుడు గతంలో సేకరించిన భూములపై సైతం వివాదాలు నెలకొనడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే ప్రాజెక్ట్ నత్తను తలపిస్తోంది. కోటిపల్లి వరకూ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయినా అది కూడా కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే లైన్కు తొలుత నిధుల కొరత పట్టిపీడించింది. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుండడంతో పనులు వేగం అందుకున్నాయి. గోదావరి నదీపాయలపై మూడు చోట్ల వంతెనల నిర్మాణాలకు సంబంధించి పిల్లర్లు పూర్తయ్యాయి. వీటిపై గెడ్డర్లు, ట్రాక్ నిర్మించాల్సి ఉంది. వైనతేయ వద్ద ఇటు బోడసకుర్రు, అటు పాశర్లపూడి వైపు ఏటిగట్టుకు లోపల (నదిలో పిల్లర్లు) పూర్తవడంతో, ఏటిగట్టుకు బయట ప్రాంతంలో ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. గౌతమీ నదిపై పిల్లర్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిపై గెడ్డర్ల నిర్మాణాలకు గత ఏడాది ఫిబ్రవరిలోనే రూ.275 కోట్లకు టెండర్లు ఖరారైనా ఇంకా పనులు మొదలు కాలేదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టెండర్లు ఖరారైన 28 నెలలకు పనులు పూర్తి కావాల్సి ఉంది. భూ సేకరణకు ఆటంకాలు మొన్నటి వరకూ నిధుల కొరత.. ఇప్పుడు భూసేకరణ ఈ ప్రాజెక్టుకు అవరోధంగా మారింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే ట్రాక్కు పాత అలైన్మెంట్ ప్రకారం 908 ఎకరాల భూమి అవసరం. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 791 ఎకరాల భూమి సేకరించాలి. కొత్త అలైన్మెంట్ ప్రకారం ఇది స్వల్పంగా పెరగనుంది. కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్కు 2001లో మొదటి అలైన్మెంట్ వచ్చింది. 2003లోనే కోటిపల్లి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ భూసేకరణ జరిగింది. తొలి అలైన్మెంట్ ప్రకారం భట్నవిల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ భూమి సేకరించారు. అయితే ఇక్కడ నాడు భూములు ఇచ్చిన భట్నవిల్లి రైతులు ఇప్పుడు ఎదురు తిరిగారు. భూములు ఇచ్చినా పొజీషన్ తీసుకోనందున ఇప్పుడిస్తున్న తరహాలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ 40 ఎకరాలకు సంబంధించి 24 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు రైల్వే శాఖ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఈ భూములకు పరిహారం చెల్లించడం, రైల్వే శాఖకు అప్పగించామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది భట్నవిల్లి నుంచి జిల్లాలోని దిండి వరకూ కొత్తగా చేపట్టిన భూ సేకరణకు సైతం అవాంతరాలు వీడడం లేదు. గతంలో రైల్వే శాఖ ఇచ్చిన అలైన్మెంట్ను ఆనుకుని 216 జాతీయ రహదారి వెళ్లింది. 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే లైన్కు ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి 216లో భాగంగా అమలాపురం బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇలా చేయకపోవడంతో ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ఇచ్చి అందుకు అనుగుణంగా అమలాపురం మండలం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది. ఈ అలైన్మెంట్కు సైతం రైతులు తొలి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైల్వే లైన్ తమ గ్రామాల మీదుగా వెళ్లేందుకు అంగీకరించమని, అలైన్మెంట్ మార్పు చేయాలని ఆ ప్రాంత వాసులు పలు సందర్భాల్లో నిరసనలు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్కు వారు వినతిపత్రాలు అందజేశారు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇలా భూ సేకరణ అంశాలు కోర్టుల వరకూ వెళ్లడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త ఆలైన్మెంట్కు సంబంధించి రెవెన్యూ శాఖ చేపట్టిన సర్వే దాదాపు పూర్తయ్యింది. కొత్త అలైన్మెంట్లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్లైన్లు, నివాసాలు, ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం పైప్లైన్లను ఈ సర్వేలో గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కొత్తపేట: ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాలపై సోమవారం ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు దాడులు చేశారు. కొంత కాలంగా పూతరేకులు తయారీలో నకిలీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్టెక్టర్లు గ్రామంలో పలు పూతరేకుల తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రొక్కయ్య, సుబ్బారావు, ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి టీమ్లు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయా కేంద్రాలు, దుకాణాల్లో పూతరేకులు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని, సీల్ ఫ్యాకెట్లను, ఇతర సరకులు, పరిసరాలు, పరిశుభ్రతను, షాపుల్లో పూతరేకులు, ఇతర తినుబండారాలను పరిశీలించారు. బ్రాండ్ నేమ్ లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లను గుర్తించారు. అలా ఒక తయారీ కేంద్రంలో 15 కిలోలు, మరో రెండు షాపుల్లో 142 కిలోల నెయ్యి ప్యాకెట్లు సీజ్ చేశారు. వీటికి సంబందించి 3 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 7 దుకాణాల్లో పూతరేకుల శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేని 10 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. తయారీ దారులు లూజ్ ప్యాకెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెయ్యినే వాడాలని చెబుతున్నామన్నారు. ప్రతి విక్రయదారుడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. తద్వారా నాణ్యమైన పూతరేకులు విక్రయించాలన్నారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రామంలో ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని షాపుల యజమానులు ఆ షాపులను మూసేశారు. ఫ ఆత్రేయపురంలో పూతరేకుల తయారీపై తనిఖీలు ఫ ఏడు షాపుల్లో శాంపిల్స్ సేకరణ -
రోడ్డు ప్రమాదంలో తోడి కోడళ్లు మృతి
రాజానగరం: రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతేనేగానీ గడవని పరిస్థితిలో భర్తకు సాయంగా కూలికి పోతున్న తోడి కోడళ్లు రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి, ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మండలంలోని దివాన్చెరువులో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానవరానికి చెందిన కప్పల చంద్రమ్మ (51), కప్పల రిప్కో(55)లు తోడికోడళ్లు. రిప్కో భర్త నాగేశ్వరరావుతో కలసి వారిద్దరూ పాలచర్లలోని నర్సరీలో ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బైక్పై తిరిగి వస్తుండగా దివాన్చెరువులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కింద పడిన వారి పైనుంచి లారీ దూసుకుపోయింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృత్యువులోనూ కలిసే.. తోడి కోడళ్లు అయిన చంద్రమ్మ, రిప్కోలు ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ల కంటే మిన్నగా కలిసి మెలసి ఉండేవారని, చివరికి మృత్యులోనూ కలిసే ఉన్నారని ప్రమాద దృశ్యాన్ని చూసిన కానవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం దూరంగా కూలికి వెళ్లి, కొద్దిసేపట్లోనే ఇళ్లకు చేరుకుంటారనుకునే లోపే మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది. చంద్రమ్మ భర్త గ్రామంలోనే మేకలను కాస్తుంటాడు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక రిప్కో భర్త నాగేశ్వరరావు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి తీవ్ర గాయాలు -
బాలిక కిడ్నాప్, అత్యాచారం
ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (15)ను ఓ వివాహితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. అనాతవరం గ్రామానికి చెందిన వివాహితుడు పరమట దుర్గాప్రసాద్ (బులి చంటి) సోమవారం స్కూల్కు వెళ్తున్న ఆ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఒక నివాసానికి తీసుకువెళ్లి అక్కడ ఆమైపె బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆమె తల్లిదండ్రులు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలాసాగర్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన బులి చంటి ఆ బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్రవంతెన వద్ద అనాతవరం వెళ్లే బస్సు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పదిలం.. విజయం
రాయవరం: పాఠశాల స్థాయిలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం సాగించిన విద్యార్థి తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు పదో తరగతిలోనే. విద్యార్థుల భవితకు తొలిమెట్టు ఇదే. అలాంటి పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో ఎలా ప్రిపేర్ కావాలో నిపుణుల సూచనలు ఇలా.. చరిత్రలో సమాచార విశ్లేషణ ముఖ్యం నూతన విధానంలో పటాలకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది. చరిత్ర నుంచి ఒకటి, రెండు పాఠ్యాంశాల్లోని పటాలు, భూగోళం నుంచి 6, 7 పాఠ్యాంశాల్లోని పటాలు చదవాలి. పటాల గుర్తింపు విషయంలో చరిత్రలో 3, 5, భూగోళంలో 1, 6, పౌరశాస్త్రంలో 4, 5, అర్థశాస్త్రంలో 3వ పాఠం అత్యంత ప్రధానమైనవి. 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే భూగోళంలో మూడు నాలుగు పాఠాల్లో విషయ అవగాహన కింద వస్తాయి. చరిత్రలో 2, 5 పాఠ్యాంశాల నుంచి అకడమిక్ స్టాండర్డ్–2 కింద ప్రశ్నలు ఇస్తారు. పౌరశాస్త్రంలో ప్రజాస్వామ్యం పాఠ్యాంశం నుంచి సమకాలీన అంశాల్లో ప్రతిస్పందన (అకడమిక్ స్టాండర్డ్–4) అనే అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో పట్టికలు, గ్రాఫ్లపై విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. పరీక్షలలో భారతదేశం మరియు ప్రపంచ పటం రెండు అవుట్లైన్ మ్యాప్లను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది. – కేఎస్వీ కృష్ణారెడ్డి, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్, ఈతకోట, రావులపాలెం మండలంరాజభాషలో.. ద్వితీయ భాష హిందీ పరీక్ష పత్రం 6 విభాగాలుగా ఉంటుంది. ఆ విభాగాల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొదటి భాగం నుంచి 12 మార్కులకు పాఠ్య పుస్తకంలోని వ్యాకరణ అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగం–2లో కాంప్రహెన్షన్ నుంచి 4 పేరాగ్రాఫ్లు ఇచ్చి ఒక్కో పేరాగ్రాఫ్కు 5 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్లను చదివి బాగా అర్థం చేసుకుని రాయాలి. భాగం–3లో కవి, రచయితల గురించి బాగా చదివి అవగాహన పెంచుకుంటే 10 మార్కులు పొందవచ్చు. 19వ ప్రశ్నగా ‘దోహా’ మొదటి పాఠం నాలుగు పద్యాల్లో ఒకటి ఇస్తారు. లేఖలో చుట్టీ పత్ర్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. – తాహెర్ పాషా, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్ (బాలికలు), రాజోలు భౌతికశాస్త్రం.. భయం వద్దు ఫిజిక్స్లో మొత్తం 8 పాఠ్యాంశాల్లో నాలుగు ఫిజిక్స్, నాలుగు కెమిస్ట్రీ పాఠ్యాంశాలున్నాయి. రెండు విభాగాల నుంచి 39 చొప్పున ఛాయిస్తో 78 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కాంతి, ఆమ్లాలు–క్షారాలు పాఠాల నుంచి రెండు పటాలు వస్తాయి. నాలుగు మార్కులు స్కోర్ చేయవచ్చు. లోహాలు – అలోహాలు పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రయోగం వస్తుంది. విద్యుత్ పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. –అడబాల వీఎల్ నరసింహారావు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, జెడ్పీహెచ్ఎస్, చింతల్లంక, అయినవిల్లి మండలం ఫ ప్రణాళికతో చదివితే మంచి మార్కులు ఫ విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సూచనలు -
పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు పండ్ల మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏఎస్ఆర్ ఫ్రూట్స్ గొడౌన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, క్షణాలలో ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు సైతం కంగారు పడ్డారు. ఇక మార్కెట్లో ఉన్నవారు చాలామంది ప్రాణభయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియడంలేదు. గొడౌన్ వెనుక భాగంలో చెత్తను పోగేసి మంట పెట్టడంతో ప్రమాదం జరిగిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ వల్ల అని మరికొందరు చెబుతున్నాయి. కాగా విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం అగ్నిమాపక దళాధికారి మార్టిన్ లూథర్కింగ్ ఆధ్వర్యంలో ఆర్యాపురం, ఇన్నీసుపేట, కొవ్వూరుల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గొడౌన్లో నిల్వ చేసిన యాపిల్స్, ఫైనాపిల్స్, ఖర్బూజా, దానిమ్మ, డ్రాగన్ వంటి వివిధ రకాల పండ్లు మంటలకు ఆహుతయ్యాయి. గొడౌన్ వద్ద పార్కు చేసిన రెండు పల్సర్ బైకులు కూడా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి గొడౌన్ యజమాని ఆరాధ్యుల శ్రీనివాసరావు (ఏఎస్ఆర్) మాట్లాడుతూ రూ. 10 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను గొడౌన్లో స్టోర్ చేశామని, అవి ఈ మంటలకు కాలిపోయాయన్నారు. అలాగే 15 వేల విలువైన ప్లాస్టిక్ ట్రేలు ఆనవాళ్లు లేకుండా బూడిదయ్యాయన్నారు. ఈ కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ మంటలకు ఆహుతైన గొడౌన్ ఫ సుమారు రూ.50 లక్షల నష్టం -
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి
పి.గన్నవరం: ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి తాడేపల్లిగూడెం నుంచి మోటార్ సైకిలుపై ఇంటికి వస్తూ బెల్లంపూడి వద్ద ప్రమాదానికి గురైన ఎల్.గన్నవరం గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ (46) రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న రామకృష్ణ బెల్లంపూడి వద్ద ప్రమాదవశాత్తూ పంట బోదెలో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను స్థానికులు పంట బోదెలోనుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సర్పంచ్కు భార్య సీతారత్నం, కుమారుడు పవన్ వెంకట సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
వ్యక్తిని కిడ్నాప్ చేసి దోపిడీ
పిఠాపురం: దారిలో గాయాలతో ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు ఆగిన ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న నగదు దోపిడీ చేసిన ఘటన గొల్లప్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గొల్లప్రోలు దేవినగరానికి చెందిన ఉమ్మడి గంగాధర్ టైల్స్ పని చేసుకుని సురేష్ కల్యాణ మండపం మీదుగా దేవినగరంలోని తన ఇంటికి వెళుతున్నాడు. దారిలో అప్పటికే అక్కడ ఇరువర్గాలు కొట్లాడుకుంటుండగా, పిఠాపురం రథాలపేటకు చెందిన ఒక వ్యక్తికి గాయం అవడంతో మానవత్వంగా అతనికి సాయం చేయడానికి ఆగి నీరు అందిస్తున్నాడు. ఇంతలో పిఠాపురం రథాలపేటకు చెందిన పెద్ద, చిన్న, ఆకాష్ లతో పాటు గొల్లప్రోలుకు చెందిన గణేష్ ,అంజి బాధితుడు ఉమ్మడి గంగాధర్ను బలవంతంగా బండిమీద ఎక్కించుకుని పిఠాపురం రథాలపేట ఏరియాలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బీరు సీసాలతో, ఇనుపరాడ్లతో బాధితుడిపై దాడి చేసి గాయపరిచి అతని జేబులో ఉన్న రూ.3,800లను దోచుకున్నారు. అతనిని అదే రోజు రాత్రి మూడు గంటల సమయంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వదిలివేసి వెళ్లిపోయారు. గాయాలతో ఉన్న బాధితుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకుని జరిగిన విషయం బంధువులకు చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు ఆదివారం గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తుని: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలతో బయటపడ్డ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకెళితే..విజయనగరం జిల్లా వేపాడ మండలం, వేలుపర్తికి చెందిన గోకడ రవికుమార్(25), అనకాపల్లి జిల్లా రాంబిల్లికి చెందిన నాగిరెడ్డి కిల్లాడి ద్విచక్ర వాహనంపై అన్నవరం వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్థానిక డీమార్టు సమీపంలో ఉన్న హవేలి రెస్టారెంటు దగ్గర నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గోకడ రవికుమార్ అక్కడకక్కడే మృతి చెందగా అతనితో ప్రయాణిస్తున్న నాగిరెడ్డి కిల్లాడి గాయాలతో బయట పడ్డాడు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ ఘటనా స్థలిని పరిశీలించారు. యువకుడు మోటారు వాహనాన్ని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్ఇండియా హాకీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఆర్ఎస్బీ (హైదరాబాద్), ఆర్ఎస్బీ (కొచ్చి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ హైదరాబాద్ జట్టు 8–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ(చంఢీఘర్), ఆర్ఎస్బీ (ముంబయి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ ముంబయి 5–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ (సిమ్లా), ఆర్ఎస్బీ (రాయ్పూర్) మధ్య నిర్వహించిన మ్యాచ్లో ఆర్ఎస్బీ రాయ్పూర్ 6–2 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్ సెక్టార్, గుజరాత్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో గెలుపొందింది. మధ్యప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ 4–3 స్కోర్ తేడాతోను, కేరళ సచివాలయం, ఢిల్లీ సచివాలయం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 9–0 స్కోర్తోను, పాండిచ్చేరి , ఒడిశా సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా జట్టు 6–0 స్కోర్తోను, గోవా , మహారాష్ట్ర సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు 18–0 స్కోర్తోను విజయం సాధించాయి. శ్రీకృష్ణ కోలాట బృందం, శ్రీఽభరత్ లిఖిత ఆర్కెస్ట్రా, ఆర్ టెక్నో రాక్ బ్యాండ్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
డాబాపై నుంచి పడి వ్యక్తి...
పి.గన్నవరం: ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పి.గన్నవరంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైవీపాలెంనకు చెందిన యర్రంశెట్టి వీరా స్వామినాయుడు (55) పి.గన్నవరం శివాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి డిష్ యాంటెన్నాను సరిచేసేందుకు డాబాపైకి ఎక్కాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న చెత్తను తీసి కిందకు పడేస్తుండగా అదుపుతప్పి స్వామినాయుడు కిందకు పడిపోయాడు. తలకు గాయాలపాలైన అతడిని స్థానికి సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతదేహానికి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
బైకులు ఢీకొని వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల వివరాలు ప్రకారం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన నక్కా సత్యనారాయణ(50) కత్తిపూడిలో ఒక కార్యక్రమం నిమిత్తం బైక్పై వచ్చి తిరిగి చెందుర్తి వెళ్లుతుండగా వజ్రకూటం సమీపంలో ఎదురుగా జగ్గంపేట మండలం కాట్రపల్లి నుంచి కత్తిపూడి వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అన్నవరం ఎస్సై హరిబాబు తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపడి వ్యవసాయ కూలీ...నిడదవోలు రూరల్: విద్యుత్ వైర్లు తెగిపడి అరటితోటలో పురుగుమందు స్ప్రే చేస్తున్న వ్యవసాయ కూలీ కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు ఆదివారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశాబత్తుల నరేష్(35) పందలపర్రు శివారులోని అరటితోటలో ఆదివారం ఉదయం పురుగుమందు స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి మీద పడటంతో కరెంట్షాక్కు గురై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు చెప్పారు. కరెంట్షాక్కు గురై మృతిచెందిన దళిత యువకుడు నరేష్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని విద్యుత్శాఖ అధికారులు ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నరేష్ భార్య మౌనికకు ప్రభుత్వం తరుపున ఉపాధి కల్పించాలన్నారు. -
కనకధార కురవాలని!
అన్నవరం: అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న అన్నవరం సత్యదేవునిపై ఎందువల్లనో కానీ కొంత కాలం నుంచి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు పూర్తి స్థాయిలో ప్రసరించడం లేదు. దీంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గత డిసెంబర్ 30న ‘లక్ష్మీ.. రావా.. రత్నగిరికి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావు దేవస్థానం ఆదాయం పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను, సిబ్బందిని కోరారు. దీనిపై ‘ఆదాయ మార్గాలు చెప్పండి’ శీర్షికన ‘సాక్షి’ జనవరి 28న వార్త ప్రచురించింది. కాగా, ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అనే రీతిలో ఉన్న దేవస్థానాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు రూపకల్పన చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖర్చులు తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. మిగులు కూడా స్వల్పంగానే ఉంది. ఈ ప్రతిపాదనలను దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. గత బడ్జెట్లో రూ.కోటి మిగులుతుందని అంచనా వేయగా.. అదికాస్తా తలకిందులైంది. పైగా, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కాస్తయినా మిగులు చూపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదైనా అద్భుతం జరిగి, భక్తుల నుంచి దండిగా విరాళాలు, కానుకలు వస్తే మాత్రం దేవస్థానం ఆర్థికంగా ఒడ్డున పడుతుంది. ఆ మేరకు కనకధార కురిపించాలని సిరులమాతల్లి శ్రీమహాలక్ష్మిని అధికారులు వేడుకుంటున్నారు. మిగులు స్వల్పమే.. మొత్తం రూ.162.55 కోట్లతో 2025–26 బడ్జెట్ను రూపొందించారు. ఇందులో వ్యయం రూ.162.13 కోట్లుగా పేర్కొన్నారు. తద్వారా రూ.42 లక్షలు మాత్రమే మిగులు చూపించారు. గత ఏడాది రూ.160 కోట్లతో బడ్జెట్ రూపొందించగా, వ్యయం రూ.159 కోట్లు, మిగులు రూ.కోటిగా అంచనా వేశారు. అయితే, అయితే అంచనాలకు మించి వ్యయం అవడంతో అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ దేవదాయ శాఖకు సప్లిమెంటరీ బడ్జెట్ ప్రతిపాదించారు. ఇది దేవదాయ శాఖ కమిషనర్ పరిశీలనలో ఉంది. నిత్యాన్నదాన ట్రస్టుకు.. రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్టుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై రూ.12 కోట్ల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తుల భోజనాల ఖర్చు, ఆ విభాగం సిబ్బంది జీతభత్యాలకు చెల్లింపులు అంతే మొత్తంలో అవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. భక్తుల సేవల్లో కుదింపు లేదు నూతన బడ్జెట్లో కొన్ని వ్య యాల్లో కోత విధించాం. అ యినప్పటికీ భక్తులకు అందించే సేవల్లో మాత్రం ఎటు వంటి కోతలూ విధించలే దు. ఆ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇంజినీరింగ్ నిర్మాణాల విషయంలో కూడా ముందుగా నిర్ణయించినవన్నీ కొనసాగుతాయి. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు (రూ.కోట్లలో) ఆదాయం షాపుల లీజులు, లైసెన్సుల ఆదాయం 14.50 సత్రాల అద్దెలు 15.00 హుండీల కానుకలు 20.00 ప్రసాదం విక్రయాలు 40.00 వ్రతాల ఆదాయం 50.00 డిపాజిట్లపై వడ్డీ 6.00 ఇతర ఆదాయ వనరుల ద్వారా 17.00 వ్యయం సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు 45.00 ముడిసరకుల కొనుగోళ్లు 35.00 ఉత్సవాల ఖర్చు 30.00 పారిశుధ్య విభాగం 8.00 ఇంజినీరింగ్ విభాగం 5.00 ఎలక్ట్రికల్ విభాగం 1.00 సీజీఎఫ్, ఆడిట్ ఫీజు వంటి చెల్లింపులు 25.00 ఇతర చెల్లింపులు 13.00 వచ్చే సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన రూ.162.55 కోట్లతో ప్రతిపాదనలు ఆర్థిక ఇబ్బందుల ప్రభావంతో ఖర్చుల్లో భారీగా కోత వ్యయం అంచనా రూ.162.13 కోట్లు -
బలిపీఠంపై పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏడాది అన్ని గ్రామాల్లోను మోడరన్, ఫౌండేషన్ స్కూల్స్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. – ఎస్కే సలీంబాషా,జిల్లా విద్యాశాఖాఽధికారి, అమలాపురం ● గ్రామానికి ఒకే పాఠశాల ఉండే విధంగా కార్యాచరణ ● ప్రతిపాదనలు సిద్ధం చేసిన రెవెన్యూ విద్యాశాఖలు ● విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ● మూసివేత దిశగా నాడు–నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలలు ఆలమూరు: రాష్ట్రంలో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిద్రావస్థలోకి చేర్చే విధంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఫౌండేషన్, మోడరన్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు అంటూ భవిష్యత్లో ప్రతి గ్రామంలోను ఒకే పాఠశాల ఉండే విధంగా విలీన ప్రక్రియను వేగవంతం చేసింది. దీనివల్ల రూ.కోట్ల వ్యయంతో నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేసిన అనేక ప్రాథమిక పాఠశాలలు క్రమేపీ మూతబడే ప్రమాదం ఏర్పడింది. విద్యావ్యవస్థ అభ్యున్నతికి, విద్యాహక్కు చట్టం పటిష్టతకు, విద్యార్థుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం జారీ చేసిన 117 జీవోను ఉపసంహరించుకుంది. ఆ జీఓలో రూపొందించిన నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ విద్యా విధానాన్ని అపహాస్యం చేస్తోంది. రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రస్తుతం అమలవుతున్న విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ప్రారంభించింది. ఒకే గ్రామంలో అనేక పాఠశాలలున్నా అందులోని 3,4,5 తరగతి విద్యార్థులను మాత్రం త్వరలో ఏర్పాటు చేయబోయే మోడరన్ ప్రైమరీ స్కూల్స్కు తరలించనున్నారు. దీంతో ఆ పాఠశాల ఏకోపాధ్యాయుడి పాఠశాలగా రూపాంతరం చెంది కేవలం 1,2 తరగతులు మాత్రమే నిర్వహించే అవకాశం ఉత్పన్నమవుతుంది. దీంతో ఆ ఏకోపాధ్యాయ పాఠశాలల పట్ల ఆసక్తి తగ్గిపోయి తమ పిల్లలను హైస్కూల్ స్థాయి వరకూ బోధన ఉండే ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించవలసిన అగత్యం తల్లిదండ్రులకు ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు లేక ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి మోడరన్ ప్రైమరీ స్కూల్స్ అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. దీనివల్ల విలీనం అయ్యే పాఠశాలల్లో కూడా 1,2 తరగతుల విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి నెలకొంటుందని ప్రజలు భావిస్తున్నారు. 350 పాఠశాలలు మూతపడే అవకాశం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో జిల్లా విద్యాశాఖ 87 క్లస్టర్లుగా విభజించగా అందులో 1.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,582 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 1,275 మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 307 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విద్యావిధానం వల్ల జిల్లాలో ఉన్న 1,275 పాఠశాలల్లో మండలానికి 15 నుంచి 20 చొప్పున దాదాపుగా 350 పాఠశాలలు దశల వారీగా మూతపడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేసేందుకని విద్యాశాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని విద్యాశాఖ నిపుణులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 117 జీవో ద్వారా ఒక పాఠశాల కూడా మూతపడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీఓను రద్దు చేసి విద్యాశాఖలో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోవడంతో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలల కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మోడరన్ స్కూల్స్ ఏర్పాటుకు కసరత్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈవిద్యా సంవత్సరం నుంచి కిలోమీటరు లోపు పరిధిలో ఒక మోడరన్ స్కూల్ ఏర్పాటుకు కసరత్తు పూర్తయ్యింది. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని ఆర్డీఓల పర్యవేక్షణలో తహసీల్దార్, ఎంఈఓల బృందం ఇప్పటికే విలీనం చేయబోయే పాఠశాలలను గుర్తించి నివేదికను రూపొందించింది. తొలి దశలో 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న 3,4,5 తరగతుల విద్యార్థులందరిని సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. తద్వారా ఒక గ్రామంలో మోడరన్ ప్రైమరీ స్కూల్గా పిలిచే ఒకే పాఠశాల ఉంటుంది. ఆ గ్రామంలో లేదా కిలోమీటరు పరిధి లోపు ఉన్న గ్రామాల్లోని పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేయబోయే మోడరన్ స్కూల్స్లో విలీనం చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు ప్రతి మండలంలోను మిగులు దశకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం పరోక్షంగా డీఎస్సీసై పడి ఉపాధ్యాయుల భర్తీ సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఉన్నతమైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు గత ప్రభుత్వం 3,4,5 తరగతులను సమీప జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే రాద్ధాంతం చేసిన నాటి ప్రతిపక్ష కూటమి నేతలు ఇప్పుడు వేలాది పాఠశాలలను మూసి వేసే దిశగా చర్యలు తీసుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విద్యాహక్కు చట్టానికి తూట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా పనిచేస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయున్ని నియమించవలసి ఉంది. ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విద్యా విధానంలో 30 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన 117 జీవో ఉపసంహరణ సమయంలో 3,4,5 తరగతులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోనే విలీనం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా మూతబడని వైనాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఒక గ్రామంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలున్నాయనే సంబంధం లేకుండా భవిష్యత్లో మాత్రం ఒక మోడరన్ స్కూల్ మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే విధానం వల్ల నిబంధనలన్ని అస్తవ్యస్తంగా మారడంతో మండల ప్రజా పరిషత్ పాఠశాలలపై విలీనం అనే కత్తి వేలాడుతుంది. ఆలమూరు మండలంలో ఇలా.. ఆలమూరు మండలంలో 18 గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 43 ఉన్నాయి. దాదాపు 21 పాఠశాలలు 1,2 తరగతుల విద్యార్థులు లేక దశలవారీగా మూతబడే అవకాశం ఉంది. పినపళ్ల, పెదపళ్ల, సంధిపూడి గ్రామాల పాఠశాలల్లోని విద్యార్థులందరిని సంధిపూడిలో ఏర్పాటు చేయబోయే మోడల్ స్కూల్లో విలీనం చేయబోతున్నట్లు తెలియవచ్చింది. దీనివల్ల ఆ మూడు గ్రామాల్లో దాదాపు నాలుగు పాఠశాలల్లో 1,2 తరగతుల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు మాత్రమే మిగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. -
క్రీడలతో ఉన్నత శిఖరాలు
రావులపాలెం: క్రీడలతో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకోవాలని డాన్బాస్కో ప్రిన్సిపాల్ ఐ.బల్తాజార్ అన్నారు. రాష్ట్ర స్థాయి పదో జూనియర్ నెట్బాల్ పోటీలు ఆదివారం డాన్బాస్కో స్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బల్తాజార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అండర్ –19 విభాగంలో 13 జిల్లాలకు చెందిన బాల బాలికలు సుమారు 350 మంది నెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు నెట్బాల్ రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. లీగ్ కం నాకౌట్ విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర, బాలికల విభాగాల్లో 11 జట్లు లీగ్ దశలో పాల్గొంటాయన్నారు. రావులపాలెంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలు -
చమురు సంపదపై హక్కుకు ఉద్యమం
23న కాకినాడలో సదస్సు కాకినాడ సిటీ: చమురు, సహజ వాయువు, ఖనిజాలు, ప్రకృతి వనరులపై రాష్ట్ర ప్రజల హక్కును కాపాడుకునేందుకు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఈ నెల 23న కాకినాడలో నిర్వహిస్తున్న సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలోని చమురు, సహజవాయు నిక్షేపాలు మనకే దక్కాలని, దీనికోసం, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేసినా, గ్యాస్ కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోయామని చెప్పారు. కువైట్, మన దేశంలోని ముంబై కన్నా గోదావరి బేసిన్లోనే సహజ వాయు నిల్వలు అధికంగా ఉన్నాయని ముప్పాళ్ల తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, మన తీరంలోని సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కోనసీమ జిల్లా కార్యదర్శి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. -
వక్క.. లాభాలు పక్కా
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయం పరవళ్లు తొక్కుతుందనడానికి నిదర్శనమే కొత్త పంటల సాగు. వైవిధ్యమైన వ్యవసాయ విధానాలను రైతులు అవలంబిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా సాగు చేయని పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జాజికాయ, జాపత్రి వంటి అరుదైన పంటలను పరిచయం చేసిన స్థానిక రైతులు ఇప్పుడు పోకచెక్క సాగు చేపట్టారు. ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడులు ఇచ్చే సాగు పోక చెక్క. రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా తక్కువ నీటి వసతి ఉన్నా సాగు చేసుకునే ఈ పంటను కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. పంట సాగు చేసిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభం నుంచి వందేళ్ల వరకు ఎటువంటి పెట్టుబడి లేకుండా నిరంతరాయంగా ఆదాయం పొందే అవకాశం వక్క సాగులో మాత్రమే ఉంది. ఒక ఎకరం పొలంలో 450 నుంచి 500 వరకు మొక్కలు నాటుతున్నారు. పంట నాటిన నాలుగేళ్ల అనంతరం ఎకరానికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా సుమారు 100 కేజీల వరకు పోకచెక్క కాయల దిగుబడి వస్తుంది. దీని నుంచి 30 శాతం వరకు పోకచెక్క వస్తుంది. మార్కెట్లో ధరలు బాగుంటే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి తోటలు వేస్తుంటారు. ఈ మొక్కలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు. కేవలం అవసరమైనప్పుడు నీరు పెట్టుకోవడం, సేంద్రియ ఎరువులు ఏడాదికి రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఏడాదిలో వక్క దిగుబడి వచ్చే నాలుగు నెలలు మాత్రమే రైతుకు పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సేంద్రియ పద్ధతిలో సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతాంగం వక్క తోటల పెంపకం చేపట్టింది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాకినాడ జిల్లాలోని తొండంగి, రౌతులపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఒక్కసారి సాగు చేస్తే వందేళ్ల ఆదాయం సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా సాగు జిల్లాలో పోకచెక్క సాగు 15.20 హెక్టార్లు సాగు చేస్తున్న రైతులు 50 మంది సాగవుతున్న మండలాలు 5 సాగు బాగుంది ఇప్పటి వరకు పలు రకాల వాణిజ్య పంటలు సాగు చేశాను. అయితే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, తెగుళ్లు పంటలను తీవ్రంగా దెబ్బతీయడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల కిత్రం ఎకరం పొలంలో చెక్క సాగు ప్రారంభించాను. మరో ఏడాదిన్నరలో పంట ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి అనువైనది కాకపోయినా ప్రస్తుతం పంట బాగానే ఉంది. – దేశినీడి నాగేశ్వరరావు, చెక్క సాగు చేసిన రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులు ఆసక్తి చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చెక్క సాగుకు స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో పోకచెక్క సాగు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు బాగానే ఎదుగుతున్నాయి. కొన్నింటి దిగుబడి ప్రారంభమైంది. మిగిలిన చోట్ల దిగుడులు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. – ఎన్.మల్లిఖార్జునరావు, ఉద్యానశాఖాధికారి, కాకినాడ -
నేటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 17తేదీ సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం), మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు నిర్వహించడం లేదని తెలిపారు. కేవలం గ్రామ సచివాలయాలలో మాత్రమే అర్జీదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకొనవచ్చునని స్పష్టం చేశారు. పేరూరులో 22 అంగుళాల దూడఅమలాపురం రూరల్: 22 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమలాపురం ముండలం పేరూరుకు చెందిన పితాని రాధాకృష్ణకు చెందిన ఆవుకు ఇటీవల ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యతో మేలు అమలాపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్తగా భూ ఆధార్ ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ద్వారా పీఎం కిసాన్ చెల్లింపు పెట్టుబడి సాయం, పంటల బీమా, దిగుబడుల విక్రయాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, అన్నదాత సుఖీభవ రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, పంట రుణాలు, వడ్డీ రాయితీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ వంటి ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. ఈ భూ ఆధార్ ఉన్నవారికి మాత్రమే పీఎం కిసాన్ వంటి పథకాలు వర్తింపజేస్తారని, భూమి ఉన్న ప్రతి రైతు ఆధార్ నంబర్, ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబరు, కొత్త పట్టాదార్ పాస్ బుక్ తీసుకుని గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పోర్టల్లో లాగిన్ అయ్యి ఫిబ్రవరి 25 తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,65,000 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 48 వేల మంది పోర్టల్లో నమోదు చేసుకున్నారన్నారు. లోవలో భక్తుల రద్దీ తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, ప్రసాదం, లడ్డూల విక్రయం ద్వారా రూ.1,10,115, పూజా టికెట్లకు రూ.44,930, కేశఖండన శాలకు రూ.9,600, వాహన పూజలకు రూ.5,100, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.21,910, విరాళాలు రూ.48,108 కలిపి మొత్తం రూ.2,39,763 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. రత్నగిరిపై 26న సరస్వతీ పూజఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఈ నెల 26వ తేదీన సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విద్యార్థులు ఉత్తమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో అన్నవరం, చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని అధికారులు కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,500 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా అధిక సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. ఘనంగా రథసేవ ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం ఈఓ సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, రామారాయ కళా వేదిక మీద సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
చికెన్ షాపులు వెలవెల
ఆలమూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం రేగడంతో మాంసాహారం మార్కెట్ పూర్తిగా కుదేలైంది. మాంసాహారాన్ని ఉడికించి తింటే వైరస్ ప్రభావం ఏమీ ఉండదని పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యశాఖ చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులు ఈ రెండింటికి దూరంగా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వినియోగదారుల్లో కన్పిస్తోంది. బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ఆదివారమైనా వ్యాపారం సజావుగా సాగుతుందని భావించిన చికెన్, మటన్ వ్యాపారులకు నిరాశే మిగిలింది. దీంతో మాంసాహారాన్ని కొనుగోలు చేసే వినియోగదారుల లేక వ్యాపారులు గగ్గోలు పెట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వేల మటన్, చికెన్ దుకాణాల ద్వారా వారంతపు రోజైన ఆదివారం సుమారు వెయ్యి మేకలతో పాటు దాదాపు 50 వేల బ్రాయిలర్, ఫారం కోళ్ల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో మాత్రం అందులో సుమారు 40 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుంది. కాని బర్డ్ ప్లూ వల్ల ఈ ఆదివారం ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కిరాణా షాపులు, హోల్సేల్ దుకాణాల్లో గుడ్లు కొనుగోలు చేసేందుకు సైతం వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. గణనీయంగా పడిపోయిన చికెన్ విక్రయాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ప్లూ వైరస్ కల కలం అధికంగా ఉన్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం లేదు. అయినా జిల్లావ్యాప్తంగా బ్రాయిలర్, ఫారం కోళ్ల ధరలు కొంతమేర తగ్గినా వినియోగదారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ చికెన్ కేజీ ధర రూ.300 నుంచి రూ.180కి పడిపోయినా వ్యాపారులకు ప్రయోజనం కలిగించలేదు. అమ్మకానికి తెచ్చిన కోళ్లు అలాగే ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు కూడా మూతబడటంతో చికెన్ వ్యాపారానికి కోలుకోని దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. మటన్ విక్రయాలపై అదే ప్రభావం బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం చికెన్ విక్రయాలతో పాటు కొంత మేర మటన్ విక్రయాలపై పడింది. మటన్ ధర అధికంగా ఉండటంతో పాటు ఈ ఆదివారం పెళ్లి ముహుర్తాలు ఎక్కువగా ఉండటం కూడా మటన్ విక్రయాలపై ప్రభావం పడిందని తెలుస్త్తోంది. దాదాపుగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మటన్ అమ్మకాలు బారీగా తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మటన్ బారీస్థాయిలో నిల్వ ఉండిపోవడంతో నష్టాలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. రెస్టారెంట్లలో చికెన్ స్థానంలో మటన్ ఐటమ్స్ తయారు చేస్తున్నా ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. 42 ఆర్ఆర్టీ బృందాల ఏర్పాటు కాకినాడ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా పశుసంవర్థకశాఖ 21 మండలాల్లో మండలానికి రెండు బృందాలు చొప్పున 42 ఆర్ఆర్టీ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితో పాటు ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అసిస్టెంట్లు కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. పీపీఈ కిట్స్, మాస్క్లు, స్ప్రేయింగ్ మందులు అందుబాటులో ఉంచారు. బర్డ్ఫ్లూ కలకలంతో దుకాణాల మూసివేత మాంసాహారం కొనుగోలుకు ప్రజలు దూరం వ్యాపారుల ఆదివారం ఆశలు గల్లంతు జాగ్రత్తలు తీసుకుంటే సరి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యథేచ్ఛగా మాంసాహారాన్ని భుజించవచ్చు. ఇంట్లో హైజిన్ పాటించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి వంట చేసుకునే ముందు కచ్చితంగా కిచెన్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్ పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవాలి. మాంసాహారాన్ని 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి తినడం ద్వారా వైరస్ను నశింపజేయవచ్చు. ముడి మాంసం, సగం ఉడికించిన కోడి గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు. మాంసాహారాన్ని ఉడకపెట్టిన తరువాత బయటకు తీసి శుభ్రపరచుకుని వండుకోవాలి.కోళ్లు, మాంసం వివరాలు పాత ధర (కేజీ) కొత్త ధర (కేజీ) రూపాయల్లో.. రూపాయల్లో.. బ్రాయిలర్ (లైవ్) 120 85 ఫారం (లైవ్) 80 50 బ్రాయిలర్ చికెన్ 300 180 ఫారం చికెన్ 200 130 కోడి గుడ్లు 07 4.50 అపోహలు వీడండి జిల్లాలో ఎక్కడా బర్డ్ ప్లూ వైరస్ కేసు నమోదు కానందున మాంసాహారాన్ని భుజించవచ్చునని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ చెబుతున్నారు. బర్డ్ ప్లూ వైరస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్కు మించితే జీవించే అవకాశం లేదని వివరిస్తున్నారు. ఉడికించిన మాంసాహారాన్ని తింటే ఏవిధమైన వ్యాధులు దరి చేరవని, బర్డ్ ప్లూ అసలు సోకదంటూ జిల్లా పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్యశాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరిస్తున్న సంగతిని ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేయమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. శీతాకాలం ముగిసి వేసవికాలంలోకి ప్రవేశించేటప్పుడు సాధారణంగా బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోహలు వీడండి–యదేఛ్ఛంగా మాంసాహారం భుజించండి అంటూ స్వచ్ఛంద సంస్థలు, పౌల్ట్రీ యజమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ధరలు తగ్గినా వ్యాపారం లేదు బర్డ్ ప్లూ వైరస్ నిర్ధారణ కాకపోయినా ప్రచార మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగున్నందువల్ల చికెన్, కోడిగుడ్లు ధరలు తగ్గినా ఆ మేరకు వ్యాపారం జరగలేదు. వినియోగదారులు కూడా మాంసాహారంపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. చికెన్ వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – గాడ శివ, చికెన్ వ్యాపారి, ఆలమూరు మటన్ విక్రయాలు పడిపోయాయి బర్డ్ ప్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందంటూ పుకార్లు సృష్టించడం వల్ల చికెన్ విక్రయాలతో పాటు మటన్ విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. రెస్టారెంట్లలో కూడా చికెన్కు డిమాండ్ తగ్గగా ఆమేరకు మటన్ విక్రయాలు పెరగలేదు. మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. – రొట్టా సతీష్, మటన్ వ్యాపారి, రావులపాలెం -
గోసంరక్షణ ట్రస్ట్కు..
సత్యదేవ గో సంరక్షణ ట్రస్టులో డిపాజిట్లపై రూ.కోటి ఆదాయం వస్తూండగా ఆవుల మేత, ఇతర అవసరాలకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వ్యయాల్లో భారీ కోత బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల వ్యయాల్లో భారీ కోత విధించారు. గత రెండేళ్లలో ఇంజినీరింగ్ విభాగంలో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో గత నవంబర్ నెలకే బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. ఇంకా సుమారు రూ.3 కోట్లు చెల్లింపులు, చేపట్టాల్సిన పనులు మిగిలాయి. దీంతో వీటికి నిధులివ్వాలని సప్లిమెంటరీ బడ్జెట్లో ప్రతిపాదించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎలక్ట్రికల్ విభాగానికి కూడా రూ.కోటి మాత్రమే కేటాయించారు. పేరుకుపోయిన సీజీఎఫ్ బకాయిలు గత ఏడాది కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) చెల్లింపులు రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు, ఈ ఏడాది చెల్లింపులకు కలిపి బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.25 కోట్లు కేటాయించారు. -
కోనేటిరాయా.. కోటి దండాలయ్యా
ఫ భక్తజన సంద్రంలా వాడపల్లి క్షేత్రం ఫ ఒక్కరోజే రూ.38.21 లక్షల ఆదాయం కొత్తపేట: కోనేటిరాయా.. కోటి దండాలయ్యా అంటూ వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని అశేష భక్తజనం కొలిచింది. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవారి క్షేత్రం శనివారం భక్తజన సంద్రంలా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, ఏడువారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఏడు కొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా అనే నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామున అర్చకస్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు చేసి, పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, అర్చక స్వాముల నుంచి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీఅన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారికి దర్శించుకుని పూజలు చేశారు. ఏర్పాట్లను దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదాల విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ సేవల ద్వారా దేవస్థానానికి రూ.38,21,881 ఆదాయం వచ్చిందని సూర్యచక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన వివిధ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా క్రమబద్ధీకరించారు. -
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
● ప్రత్యేక యాప్ ద్వారా నమోదు ● పథకాలకు ఇదే ఆధారం ● నమోదుకు నెలాఖరు వరకూ గడువు కొత్తపేట: రైతులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య (విశిష్ట గుర్తింపు సంఖ్య)ను ఇచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతులకు రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఫార్మర్స్ రిజిస్ట్రీ (ఎఫ్ఆర్) పోర్టల్లో రైతుగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించింది. వ్యవసాయ శాఖ నోడల్ డిపార్ట్మెంట్కు ఈ నమోదు బాధ్యలను అప్పగించారు. ఆ మేరకు గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) రైతులకు సమాచారం అందజేసి రైతు సేవా కేంద్రాల్లో వివరాలు రిజిస్టర్ చేస్తున్నారు. ఆ విధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన నమోదు ప్రక్రియ సాగుతోంది. విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందవు. ప్రధానంగా పంటల బీమా, పీఎం కిసాన్ యోజన, పంట నష్ట పరిహారం, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు కూడా అందవు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలకు కూడా దూరమవ్వాల్సి ఉంటుంది. నమోదు చేసుకోవాలి ● రైతులు రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి వారి పేరు, ఊరు, ఆధార్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్ వివరాలను అందించాలి. ● నమోదు ప్రక్రియ పూర్తయ్యాక వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ● రెతు సేవా కేంద్రాలకు వెళ్లలేకపోతే, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు అందించి ఓటీపీ చెప్పడం ద్వారా రైతుల వివరాలు నమోదు పూర్తి చేసుకోవచ్చు. ఇలా భద్రపరచుకోవాలి యాప్ ద్వారా నమోదు చేసుకున్న తరువాత అందించే గుర్తింపు సంఖ్య మెసేజ్ రూపంలో రైతు ఫోన్కు వస్తుంది. ఆ నంబర్ను అతను ఫోన్లోగానీ భద్రపరచుకోవడం గానీ, పాసు పుస్తకాలపై రాసి ఉంచిగాని గుర్తుంచుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుర్తింపు సంఖ్య మరచిపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు అందించి గుర్తింపు సంఖ్యను తెలుసుకోవచ్చు. నమోదు చేసుకోవాలి భూమి ఉన్న రైతులంతా ఈ నెలాఖరు లోపు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారు. సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులు వివరాలు అందించాలి. భూమి వివరాలు ఆన్లైన్లో నమోదై ఉండాలి. లేకుంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు పేరు నమోదు కాదు. తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయించుకోని రైతులు వెంటనే రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్ చేయించుకుని ఎఫ్ఆర్లో నమోదు కావాలి. – ఎం.వెంకట రామారావు, ఏడీఏ, వ్యవసాయ సబ్ డివిజన్, కొత్తపేట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నమోదు జిల్లా పీఎం కిసాన్ ఎఫ్ఆర్లో రిజిస్ట్రీ నమోదు లబ్ధిదారులు అయిన వారు శాతం డా బీఆర్ఏ కోనసీమ 1,27,062 20,825 9.35 తూర్పుగోదావరి 1,05,053 27,172 12.8 కాకినాడ 1,34,628 40,689 17.59 -
స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
గోకవరం: నిత్యం ప్రయాణిస్తున్న స్కూల్ బస్సే ఆ బాలుడి పాలిట మృత్యుకుహరం అయ్యింది. గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో స్కూల్ బస్సు కింద పడి ఎల్కేజీ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కుంచే రాంబాబు, మహేశ్వరి దంపతులకు లేకలేక పుట్టిన కుమారుడు వెంకట జితేంద్ర (5). అతన్ని గతేడాది కోరుకొండలోని ఓ ఇంగ్లిషు మీడియం స్కూల్లో చేర్పించారు. స్కూల్ బస్సు రోజూ ఉదయం ఉదయం 8.30 గంటలకు వచ్చి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి 5 గంటల లోపు తిరిగి తీసుకువస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్కు వెళ్లిన వెంకట జితేంద్ర సాయంత్రం బస్సు దిగిన తరువాత డ్రైవర్ అజాగ్రత్తగా ఉండటంతో బస్సు కింద పడపోవడంతో తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు తొలుత కోరుకొండకు తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోకవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై ఎస్సై పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పెళ్లైన ఐదేళ్లకు.. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న రాంబాబు, మహేశ్వరి దంపతులకు పెళ్లయిన ఐదేళ్లకు వెంకట జితేంద్ర జన్మించాడు. లేకలేక పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచారు. రోజులాగే ఎంతో ఉత్సాహంగా వెళ్లిన కుమారుడు స్కూల్ బస్సు చక్రాల కింద పడి మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బాలుడి స్కూల్ బ్యాగ్, చెప్పులు రక్తంతో తడిచి ముద్దయి హృదయ విదారకంగా ఉండటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్లీనర్ లేకపోవడంతో ఘటన రోజూ స్కూల్ బస్సు గ్రామంలోని రామాలయం చివరి వీధిలో ఓ కిరాణా షాపు వద్ద బస్సు ఆగుతుంది. ఆ ప్రాంతంలో నలుగురు విద్యార్థులు బస్సు దిగుతుంటారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు క్లీనర్ ఉండాలి. పిల్లలు దిగిన తరువాత వారిని సురక్షిత ప్రాంతంలో దించి వెళ్లాల్సి ఉండగా శనివారం స్కూల్ బస్సులో క్లీనర్ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. విద్యార్థులు స్కూల్ బస్సు దిగిన తరువాత బాలుడు వెంకట జితేంద్ర బస్సు ముందు వెళ్లడంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెదురుపాకలో ఘటన -
ఆరోగ్యం.. మహాభాగ్యం
సాక్షి, అమలాపురం: దైనందన జీవితం.. యాంత్రిక జీవనం.. మారిన ఆహార అలవాట్లు.. వద్దన్నా తన్నుకు వస్తున్న స్థూలకాయం.. చిన్నతనంలోనే రక్తపోటు.. మధుమేహం. ఆరోగ్యంగా ఉన్నా కొట్టుకునే గుండె ఎప్పుడు ఆగిపోతోందో తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ఈ కారణంగా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకూ.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకూ.. పురుషులు.. మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. నడక.. వ్యాయామం.. యోగా వంటివే కాకుండా ఆహార అలవాట్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శెనగలు, పెసలు, సోయా, రాజ్మా, బఠానీ.. వీటిని మొలకెత్తించి ఆహారంగా తీసుకుంటున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరుగుతోంది. వీటిని సలాడ్ల రూపంలో నేరుగా తినడమే కాదు.. వడలు, పునుగులు, అట్లు రూపంలో అల్పాహారంగా, కూరల రూపంలో తయారు చేసుకుని ఆహారంగా భుజిస్తున్నారు. వీటితోపాటు చిరు ధాన్యాల వినియోగం కూడా పెరుగుతోంది. ఆహారంగా, జావల రూపంలో తీసుకుంటున్నారు. మొలకల్లో విటమిన్లు ఏ, సీ, బీ1, బీ6, కే ఉంటున్నాయి. ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, పీచు, ఫోలేట్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. చిరు ధాన్యాల్లో విటమిన్ బీ12, బీ17, బీ6 అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనితోపాటు ప్రతి రోజూ ఉదయం ఆనబ, గుమ్మడి జ్యూస్లు తాగేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మైక్రోగ్రీన్స్గా గోధుమ గడ్డి జ్యూస్కు గుర్తింపు రావడంతో సహజ సిద్ధం ఆహారాన్ని ఇష్టపడేవారు అధికంగా తాగుతున్నారు. విటమిన్ ఏ, బీ, సీ, ఈ అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తం నేరుగా తీసుకున్నట్టేనని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యం.. ఉపాధికి మార్గం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యకరమైన జ్యూస్లు, ఆహారం అందించే దుకాణాలు పెరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయలు, పండ్లు వంటి వాటిని సేకరించడంతోపాటు రంగుల, ఐస్, పంచదార వంటి వాటితో సంబంధం లేకుండా ఈ జ్యూస్లను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఉసిరి, సొరకాయ, క్యారెట్, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీట్రూట్, కాకర, కీర వంటి వాటితోపాటు గోధుమ గడ్డి, కలబంద, మునగ ఆకులతో సైతం జ్యూస్లు తయారు చేస్తున్నారు. ఈ జ్యూస్లలో జీలకర్ర, అల్లం, మిరియాలు, వాము, మెంతులు, సబ్జాలు కలిపి అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని వంటి పట్టణాలు, రావులపాలెం, అనపర్తి, ఏలేశ్వరం, కొత్తపేట, మలికిపురం, రాజానగరం వంటి ఒక మోస్తరు పట్టణ ఛాయలున్న గ్రామాల్లో వీటి సంఖ్య పెరిగింది. ఇటువంటి దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నవారు అధికంగా ఉన్నారు. ఈ జ్యూస్లతోపాటు పండ్లు.. పండ్లతో తయారు చేసిన జ్యూస్లు, అలాగే డ్రై ఫ్రూట్లు, మిల్లెట్లతో తయారు చేసే మాల్ట్లు, ఆహార పదార్థాల వినియోగం సైతం పెరిగాయి. ఇక మొలకలైతే దుకాణాలతోపాటు జిమ్ సెంటర్లు, యోగా సెంటర్లలో నేరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలకు, జిమ్లకు వచ్చేవారు వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కూరగాయలు, పండ్ల రసాలు, మొలకలు, చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో రోడ్ల వెంబడి వెలుస్తున్న దుకాణాలు ఆరోగ్యం కోసం వస్తున్నారు అమలాపురంలో మాకు రెండు హెల్దీ జ్యూస్ హబ్లున్నాయి. వీటిలో కూరగాయలతో సహజ సిద్ధమైన జ్యూస్లు విక్రయిస్తున్నాం. వ్యాయామం చేసేవారితోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రెండేళ్లు నుంచి వీరి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో గోధుమ గడ్డి, మిక్స్డ్ వెజిటబుల్స్ జ్యూస్లు అధికంగా తాగుతున్నారు. – తులా లోకేశ్వర రాంబాబు, అమలాపురం శరీరం తేలికగా ఉంటోంది ఇటీవల కొంత కాలంగా నేను టీ, కాఫీలు మానేసి గోధుమ గడ్డితోపాటు ఆరోగ్యకరమైన జ్యూస్లు తాగుతున్నాను. వ్యాయామం తరువాత తాగడం వల్ల శరీరం చాలా తేలికగా ఉంటోంది. ఇలా చేయడం వల్ల శరీరంలోకి అనారోగ్యరమైన షుగర్, ఇతర టాక్సిన్స్ వెళ్లడం చాలా వరకూ తగ్గుతోంది. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన విటమిన్లు శరీరానికి అందుతాయి. – కుడుపూడి శాంతి భూషణం, సామాజిక కార్యకర్త, అమలాపురం -
బర్డ్ ఫ్లూ కేసుల్లేవ్..
● విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వండి ● కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు అమలాపురం రూరల్: జిల్లాలో ఇంత వరకూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శనివారం అమలాపురం కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూపై ఆయన పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పౌల్ట్రీల్లో ఇంతవరకూ బర్డ్ ఫ్లూ కేసులు కనిపించలేదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో తిరిగి కోడిగుడ్లను విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. కోడిగుడ్లు, మాంసం విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయారెడ్డి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రహదారి భద్రత నిరంతర ప్రక్రియ రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ తప్పిదాలతో 97 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. మోటారు వాహనాల తనిఖీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, కాశీ, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి రాకుండా సుమారు రూ.1.08 కోట్లతో డ్రైనేజీలపై అడ్డుకట్టలు వేసి ఆయిల్ ఇంజిన్ల ద్వారా సాగునీటిని సరఫరా చేయడం, కాలువల గేట్ షట్టర్ల మరమ్మతులు, కాలువ గండ్లు పూడ్చటం వంటివి చేపడుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో జల వనరులు, డ్రైనేజీ విభాగ ఇంజినీర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరులో సాగునీటి ఎద్దడి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. జేసీ టి.నిషాంతి, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ ఎంవీవీ కిషోర్ పాల్గొన్నారు. ● అమలాపురం పరిసర ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి సీవరేజ్ ట్రీట్మెట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తునట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో సమావేశాన్ని నిర్వహించారు. ● జిల్లాలో విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికోసం, మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్ల కోసం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ గోదావరి భవన్లో విదేశీ వ్యవహారాల పట్ల పరస్పర అవగాహన సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. -
వనరులను దోచుకుంటున్న కూటమి
ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి మలికిపురం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్రమాలకు నిలయంగా మారిందని, ఆ పార్టీ నేతలంతా వనరులను దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం మలికిపురంలో రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎనిమిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక ధరలు ఆకాశాన్నంటాయని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం విళయ తాండవం చేస్తుందని, నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. ఉచిత బస్ కానరావడం లేదన్నారు. ఇలా సూపర్సిక్స్ అంటూ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రస్తుత కూటమి పాలనను చూసి విస్తుపోతున్నారన్నారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ సన్నద్ధం అయ్యారన్నారు. ఓటమి పాలైన మరుసటి రోజు నుంచే పార్టీ బలోపేతానికి శ్రమిస్తూ, జిల్లాలో తమ లాంటి నాయకులకు ఉత్సాహమిచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాలకూ తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. అనంతరం పార్టీ నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్, సీనియర్ నాయకులు కేఎస్ఎన్ రాజు, కటకంశెట్టి ఆదిత్య, దొంగ నాగ సత్యనారాయణ, సూరిశెట్టి బాబి, పాటి శివకుమార్, జంపన బుజ్జీరాజు, కేవీ చంటిరాజు, జెడ్పీటీసీ సభ్యులు దొండపాటి అన్నపూర్ణ, మట్టా శైలజ, ఎంపీపీ కుసుమ వనజకుమారి, రాజోలు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు కె.ఎస్తేరు రాణి, తదితరులు పాల్గొన్నారు. -
దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దొంగ నోట్ల మారకం ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.6 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆ వివరాలను రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బిక్కవోలు మండలం అంబడిపేటకు చెందిన వ్యాన్ మెకానిక్ పల్లి రాంబాబును ఈ నెల 1న కోనసీమ జిల్లా బాలాంతరం గ్రామ వాసి చిట్టూరి హరిబాబు కలిశాడు. తన వ్యాన్ను రిపేర్ చేయించాలని కోరాడు. దీంతో హరిబాబు తన స్నేహితుడు మెకానిక్ ఆకుల పవన్తో కలసి వ్యాన్ను గ్యారేజ్కు తీసుకువెళ్లారు. వ్యాన్ చెక్ చేసి రూ.పది వేలు ఖర్చు అవుతుందని తెలపడంతో హరిబాబు అందుకు అంగీకరించి అడ్వాన్స్గా నాలుగు ఐదు వందల నోట్లు ఇచ్చాడు. హరిబాబు వ్యాన్ స్పేర్ పార్ట్లు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వెళ్లి ఆ డబ్బులు ఇవ్వగా రూ.500 నోట్లు నకిలీవని తెలియడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ పి.విద్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ఈనెల 7వ తేదీన దొంగ నోట్లు ఇచ్చిన చిట్టూరి హరిబాబును, అతడి స్నేహితులు కాకినాడ జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్ను, దుగ్గుదూరు గ్రామానికి చెందిన చీకట్ల ఏడుకొండలు, పాత గుంటూరుకు చెందిన ధోనేపూడి మధులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 756 నకిలీ రూ.500 నోట్లు స్వాధీన చేసుకున్నారు. వారిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు పంపించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఈ నెల 14న ప్రధాన నిందితుడు పాత గుంటూరు బాలాజీ నగర్కు చెందిన కర్రి మణికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నకిలీ నోట్లు ప్రింటింగ్కు ఉపయోగిస్తున్న కంప్యూటర్, ప్రింటర్ సామగ్రి, నకిలీ నోట్లు మారకానికి ఉపయోగిస్తున్న కారు, నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి మొత్తం రూ.1.6 కోట్ల నకిలీ నోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగ నోట్లు తయారీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన అనపర్తి సీఐ వీఎల్వీ కె.సుమంత్, బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్, అనపర్తి ఎస్సై వి.శ్రీను, రంగంపేట ఎస్సై టి.కృష్ణసాయి, సిబ్బంది ఏవీ సత్యప్రసాద్, పి.రఘు, కానిస్టేబుళ్లు ఎం.వీరబాబు, కె.తిరుమల యాదవ్, వి.త్రిమూర్తులు, వి.శివ, వి.రవికుమార్, వి.వరప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించారు.ఫ ఐదుగురు నిందితుల అరెస్ట్ ఫ రూ.1.6 కోట్ల నకిలీ నోట్ల స్వాధీనం -
అరవై రోజుల్లో సమస్యల పరిష్కారం
అయినవిల్లి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానానికి వచ్చిన అర్జీలను అరవై రోజుల్లోపు పరిష్కరిస్తామని సీజీఆర్ఎఫ్ ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం చైర్పర్సన్ బి.సత్యనారాయణ అన్నారు. శనివారం అయినవిల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. ఇందులో విశాఖపట్నం పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ 11 జిల్లాలు వస్తాయన్నారు. విశాఖపట్నం పరిధిలో 2004 నుంచి 2025 వరకూ విద్యుత్ వినియోగదారుల నుంచి 8,442 ఫిర్యాదులు రాగా 8,364 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇంకా 78 సమస్యలు మాత్రమే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నాటికి మొత్తం 112 మంది వినియోగదారులు ఫిర్యాదు చేసుకున్నారన్నారు. ఇప్పటికే 34 సమస్యలను పరిష్కరించామన్నారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ నుంచి 107 కేసుల్లో విద్యుత్ వినియోగదారులకు రూ.14,26,650 నష్ట పరిహారం చెల్లించామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం ఆర్థిక సభ్యులు షేక్బాబర్, స్వతంత్ర సభ్యులు ఎన్.మురళీకృష్ణ, ఏపీడీసీఎల్ ఎస్ఈ ఎస్. రాజుబాబు, డీఈటీ వై విజయానంద్, డీఈ కె. రాంబాబు, ఏడీ జి.అన్నవరం, ఏఈ సీహెచ్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆటహాసంగా..
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడా స్ఫూర్తితో హాకీ పోటీల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు, మహిళల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తొలిసారి రాష్ట్రం అతిథ్యం ఇస్తుండడంతో ప్రారంభ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనికి డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఒలింపియన్లు ముకేష్కుమార్, మనోహర్ రియాజ్, జేసీ రాహుల్ మీనా, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు కన్వీనర్ రాజ్కుమార్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను జేసీ రాహుల్ మీనా, సివిల్ సర్వీసెస్ జెండాను ఐఏఎస్ భావన, జిల్లా జెండాను డీఆర్ఓ వెంకట్రావు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల కవాతును కలెక్టర్ తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. పోటీలను కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. పోటీల ప్రారంభ సూచికంగా బెలూన్లు ఎగుర వేశారు. ఏపీకి చెందిన క్రీడాకారిణి భార్గవి క్రీడా ప్రతిజ్ఞను చేయించారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ముందుగా సివిల్ సర్వీసెస్ బోర్డు టోర్నీని ఏపీకి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాకినాడ నగరం చాలా చిన్న నగరమైన సముద్రం, అడవులు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రసిద్ధి అన్నారు. క్రీడాకారులు వాటిని తిలకించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, వాటిని చూసి మంచి జ్ఞాపకాలతో ఈ టోర్నీ నుంచి వెళ్లాలన్నారు. టోర్నీ నిర్వహణకు సహకరించిన అపోలో హాస్పిటల్స్, కాకినాడ సీపోర్ట్సు, జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం, వివిధ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం త్రిపుల్ ఒలింపియన్లను కలెక్టర్ సత్కరించారు. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యం పోటీల ప్రారంభం సందర్భంగా సెట్రాజ్ ఆధ్వర్యంలో చింతూరు గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యం, సిలంబం ఫైన్ ఆర్ట్స్, కళాంజలి ఆర్కెస్ట్రావారి రాక్ బ్యాండ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్, ఎస్పీలు ఈ నృత్యాలను తిలకించి కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, రాష్ట్ర పీఈటీ సంఘ అధ్యక్షుడు జార్జి, జిల్లా హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు రవిచంద్ర పాల్గొన్నారు. తొలి రోజు విజేతలు తొలిరోజు హర్యానా– హిమాచల్ ప్రదేశ్కు జరిగిన మ్యాచ్లో హర్యానా 14–0 స్కోర్తో విజయం సాధించింది. కర్ణాటక–పుదుచ్చేరి మధ్య జరిగిన మ్యాచ్లో పుదుచ్చేరి 10–1 స్కోర్తో విజయకేతనం ఎగురవేసింది. ఫ ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలు ప్రారంభం ఫ వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారుల రాక -
కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులపై స్టే
అమలాపురం రూరల్: అమలాపురం మండలం భట్నవిల్లిలో కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్ భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని న్యాయవాది రమేశ్చంద్ర వర్మ శనివారం తెలిపారు. కోటిపల్లి– నరసాపురం రైల్వే భూసేకరణకు ససంబంధించి 25 ఏళ్ల కిందట సేకరించిన భూమికి తమకు పరిహారం ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఇవ్వాలని భట్నవిల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భట్నవిల్లికి చెందిన పేరూరు వైద్యనాథంతోపాటు 24 మంది రైతులు 40 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఉన్న ధర ఇప్పించాలని, లేకుంటే తమ భూములను తిరిగి ఇచ్చేయాలని రైతులు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో రైల్వే పనులు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిందని వర్మ తెలిపారు. ఈ కేసును మార్చి 13వ తేదీకి వాయిదా వేశారన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీదకు వేంచేయించి, ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితులు పూజలు చేసిన అనంతరం, దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి సేవను ప్రారంభించారు. పండితుల మంత్రోచ్చారణలు, బాజాభజంత్రీల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. పునఃపూజల అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రధానాలయానికి చేర్చారు. నేడు సూర్య నమస్కారాలు రత్నగిరి కళావేదిక మీద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సూర్య నమస్కారాలు నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా రుత్విక్కులు సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. 11 గంటలకు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. అలాగే, ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
గోల్డెన్ అవర్లో వైద్యం అందించాలి
అమలాపురం రూరల్: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపు గోల్డెన్ అవర్లో వైద్యం అందేలా చూడాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సమావేశాన్ని స్థానిక కిమ్స్ కాలేజీలో జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ చాలామంది వైద్య విద్యార్థులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అది సరికాదన్నారు. విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీకి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఓలేటి శ్రీనివాస్ రహదారి భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ, డీటీఓ విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి సురేష్, కాశీ విశ్వేశ్వరరావు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు -
అపార అనుభవశాలి సంజీవయ్య
అమలాపురం రూరల్: అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి పనిచేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సంజీవయ్య ఆశయాలను ఆచరించడమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రత్యేకత ఆయనదన్నారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు వంటి ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారన్నారు. ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల, ఏవో విశ్వేశ్వరరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మురళీకృష్ణ, రమణకుమారి ఎల్డిఎం కేశవ వర్మ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి పి. జ్యోతిలక్ష్మి దేవి, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. ఆధార్ ఈ కేవైసీ అప్డేషన్ తప్పనిసరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు ప్రతి ఒక్కరు ఆధార్ నమోదు బయోమెట్రిక్ ఈ కేవైసీ అప్డేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ఆధార్ నమోదు, అప్డేషన్, సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరూ చైల్డ్ ఆధార్ను ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువపత్రాలు పొందుతూ వాటి ఆధారంగా నమోదు చేయించుకోవాలన్నారు. ఐదు సంవత్సరాలు పైబడి ఏడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కోనసీమ జిల్లాలో 7–17 సంవత్సరాల మధ్య వయస్సు గల బాల బాలికలు లక్ష మంది వరకు ఉన్నారని వీరందరూ తప్పనిసరిగా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలు కామన్ సర్వీస్ కేంద్రాలల్లో ఆధార్ బయోమెట్రిక్, అప్డేట్ చేయించుకోవాలని లేని పక్షంలో పాస్పోర్ట్, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశాలలో ప్రభుత్వ పథకాల రాయితీలు పొందడంలో పలు సమస్యలు ఉత్పన్న మవుతాయని స్పష్టం చేశారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సహాయ మేనేజర్ గిరిధర్ జిల్లాలో జీఎస్ డబ్ల్యూ ఎస్, కామన్ సర్వీస్ సెంటర్, పోస్టల్ అధికారులు లీడింగ్ బ్యాంకుల ప్రతినిధులకు ఆధార్ అప్డేషన్పై సందేహాలను నివృత్తి చేశారు. -
ఆగిన పర్యాటకాభివృద్ధి
రాజోలు దీవికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన పి.గన్నవరం అక్విడెక్టును 1845లో నిర్మించారు. ఇది 2000వ సంవత్సరం వరకు సేవలందించింది. తరువాత కొత్త అక్విడెక్టు నిర్మాణం అందుబాటులోకి రావడంతో దీని సేవలు ఆగిపోయాయి. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రూ.10 లక్షలతో అక్విడెక్టుపై పర్యాటకులు కూర్చునేందుకు ఆర్చ్లు, బెంచ్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల అక్విడెక్టుకు అనుబంధంగా నిర్మించిన వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడున్న కొత్త అక్విడెక్టు కమ్ రోడ్డు మీద భారీ ప్రమాదాలు జరిగితే ప్రత్యామ్నాయంగా పాత వంతెనను వినియోగించాల్సి ఉన్నందున నిర్మాణాలు నిలుపుదల చేశారు. తరువాత పలు సందర్భాలలో పర్యాటక ప్రతిపాదనలు వచ్చినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. -
శిథిలావస్థకు అన్నంపల్లి అక్విడెక్టు
అన్నంపల్లి పాత అక్విడెక్టు శిథిలావస్థకు చేరింది. దీనిని 1929 సంవత్సరంలో నిర్మించారు. నాటి నుంచి ఇది ఐలెండ్కు తాగు, సాగునీరు అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునీకరణ నిధులు కేటాయించడంతో 2015లో కొత్త అక్విడెక్టు వినియోగంలోకి వచ్చిన తరువాత పాత అక్విడెక్టును గాలికి వదిలేశారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలనే డిమాండ్ ఉంది. రంగులు వేసి, రైలింగ్ నిర్మాణంతోపాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, అక్విడెక్టు తొట్టిలో బోటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన ఉంది. -
ఆర్టీసీ డ్రైవర్లకు సత్కారం
అమలాపురం రూరల్: ఆర్డీసీ డ్రైవర్లు ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తతతో డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోనసీమ జిల్లా ప్రజారవాణాధికారి డి. శ్రీనివాసరావు సూచించారు. ఆర్టీసీలో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అమలాపురం డిపో గ్యారేజ్లో శుక్రవారం జరిగిన ముగింపు సభలో జిల్లా ప్రజారవాణాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురు, డిపో స్థాయిలో 12 మంది యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సాయంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అమలాపురం, రావులపాలెం, రాజోలు డిపోల నుండి 62 మంది రక్తదానం చేసారు. వీరబాబు, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం డిపో మేనేజర్లు చల్లా సత్యనారాయణమూర్తి, ఎఎం రమణ, ధనమ్మ, భాస్కర్రావు, ఆర్టీసి అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.47,89,784 సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి భక్తుల నుంచి విరాళాల రూపంలో వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.47,89,784 ఆదాయం చేకూరింది. గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ 17 రోజులకు హుండీల లెక్కించారు. శుక్రవారం అంతర్వేది ఆలయంలో ఎండోమెంట్స్ డీసీ డీఎల్వీ రమేష్బాబు, అమలాపురం ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీలు తెరచి లెక్కించగా స్వామివారికి పై ఆదాయం వచ్చింది. మెయిన్ హుండీల ద్వారా రూ.46,76,268, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.86,241, అన్నదానం హుండీల ద్వారా రూ.27,275 వచ్చినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. 8.500 గ్రాముల బంగారం, 104.370 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్టు చెప్పారు. లక్ష్మీనృసింహుని దేవస్థానంకు అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయ హుండీ ద్వారా రూ.47,587 ఆదాయం వచ్చిందన్నారు. చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాలరాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పీఈటీలకు డీఈవో అభినందన అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్ కం స్పోర్ట్స్ మీట్లో పలు కీడల్లో ప్రతిభ చాటి విజేతలైన పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు జిల్లాకు పేరు తెచ్చారని డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా అన్నారు. ఆ స్పోర్ట్ మీట్లో విజేతలైన పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు స్థానిక నల్ల వంతెన వద్ద గల డీఈవో నివాసంలో డీఈవో బాషాను కలిసి తాము సాధించిన పతకాలు, బహుమతులను ఆయనకు చూపించారు. విజేతలను డీఈవో అభినందించి సత్కరించారు. స్పోర్ట్స్ మీట్లో విజేతలైన ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రవి, మధు, సురేష్, సతీష్, ఐశ్వర్య, నాగదుర్గ, సూర్యకుమారి, నరసింహరావులతోపాటు పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు మూర్తి, ప్రసాద్, రామారావు, ఈశ్వరరావు, గణేష్, ముసలయ్యలు డీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామ్స్ బోర్డు సెక్రటరీ హనుమంతరావు సైతం విజేతలైన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలను అభినందించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్ బాల్ క్రీడల్లో జిల్లాకు సంబంధించి పై ఎనిమిది మంది పీడీలు, పీఈటీలు విజేతలై పతకాలు, షీల్డ్లు సాఽధించారు. -
ఎన్ఎంఎంఎస్కు 11 మంది ఎంపిక
అల్లవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్నకు అల్లవరం మండలం నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎంఈఓ కిరణ్బాబు శుక్రవారం తెలిపారు. కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాల నుంచి బండారు ప్రదీప్, చల్లపల్లి తేజ, యర్రంశెట్టి వాణి మహాలక్ష్మీ, నార్ని మౌనిక ప్రియలక్ష్మి, నాగ ప్రైస్సీ, పితాని శ్రీవల్లి, యాళ్ల చైత్ర, విజ్ఞాన లలితనాగ భాగ్యశ్రీ, ఓలేటి మాధవి కారుణ్య, ఓడలరేవు ఉన్నత పాఠశాల నుంచి దండుప్రోలు స్వాతి, అల్లవరం ఉన్నత పాఠశాల నుంచి పెస్సింగు రాజ రాజేశ్వరీ ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లపాటు రూ.12 వేలు చొప్పున స్కాలర్షిప్ పొందుతారన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, కేఎస్ఆర్ మూర్తి, ఎన్.వెంకటేశ్వరరావు, విద్యార్థులను ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, ఎంఈఓలు కిరణ్బాబు, ఏడుకొండలు అభిందించారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకోండి అమలాపురం రూరల్ కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు బాలబాలికలు పీఎం కేర్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ ఆర్.మహేశ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 2020 మార్చి 11 నుంచి 2023 మే5 మధ్య కాలంలో కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయినవారు మాత్రమే అర్హులన్నారు. ఇంతవరకు నమోదు చేసుకోని వారు వెంటనే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. -
కూటమి అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలి
రాజమహేంద్రవరం సిటీ: శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అనర్హుడిగా ప్రకటించాలని స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్ ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్గాంధీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను తరలించేందుకు కూటమి అభ్యర్థి టికెట్లు ఇస్తున్నారని, దీనిపై సీఈఓకు మెయిల్ పంపానని చెప్పారు. రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించి పేరాబత్తుల రాజశేఖరాన్ని డిస్క్వాలిఫై చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితాలో నంబర్ కేటాయింపుపై కూడా పలు సందేహాలున్నాయన్నారు. అక్షరక్రమంలో ిపీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుకు, స్వతంత్ర అభ్యర్థినైన తనకు ఏ ప్రాతిపదికన నంబర్లు ఇచ్చారో అనుమానాలున్నాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఓటర్లను ఏవిధంగా మభ్యపెడుతున్నారో సుందర్ లైవ్లో వివరించారు. కూటమి అభ్యర్థి ఓటర్ స్లిప్పులలో ఫోన్ నంబర్లు, అడ్రస్, జియో లొకేషన్ కూడా ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ఈ నెల 9న విజ్ఞాపన ఇచ్చానని, 12న సీఈఓకు మెయిల్ పంపానని చెప్పారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడానికి గురువారం వెళ్లానని, ఆయన లేకపోవడంతో డీఆర్ఓకు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
రాయవరం: పెన్షనర్లు ఈ నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం తెలిపారు. రాయవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ ఏటా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెలాఖరులోగా ప్రతి పెన్షనరు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉన్న 80 శాతం మంది పెన్షనర్లు ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్లు అందజేశారన్నారు. అనంతరం ఆయన సబ్ట్రెజరీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సబ్ట్రెజరీ అధికారులున్నారు. నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలురాయవరం: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాలను ఇకపై ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా రీఆర్గనైజేషన్ చేసిన 87 స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జిల్లావ్యాప్తంగా 1,582 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5,430 మంది ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొననున్నారు. సాధారణంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు రెండు రోజుల పాటు నిర్వహించేవారు ఇకపై కేవలం ఒక పూట మాత్రమే కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 11.45 గంటలకు పాఠశాలో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందజేసిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్నం 1గంటకు వారికి కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్లకు చేరుకుని, సమావేశాల్లో పాల్గొననున్నారు. కుంభమేళాకు మూడు ప్రత్యేక బస్సులురాజమహేంద్రవరం సిటీ: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 3 సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి వెళ్లాయని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) కుమారి కె.షర్మిల అశోక తెలిపారు. ఈ యాత్రలో భక్తులు కుంభమేళాతో పాటు భువనేశ్వర్, పూరి, కోణార్క్, గయ, బుద్ధగయ, వారణాసి, అరసవిల్లి క్షేత్రాల దర్శనానంతరం తిరిగి 22న రాజమహేంద్రవరం చేరుకుంటారని వివరించారు. ఒక్కో బస్సులో 36 మంది భక్తులు వెళ్లారన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ ఎస్కే షబ్నం తదితరులు పాల్గొన్నారు.