breaking news
Dr B R Ambedkar Konaseema
-
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు
● ఆర్జేసీ త్రినాథరావు ● వాడపల్లి వెంకన్న క్షేత్రం సందర్శన ● క్యూ లైన్లు, శానిటేషన్ పరిశీలన కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో భక్తులు మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని, అన్న ప్రసాదం స్వీకరించి, నూరు శాతం సంతృప్తి చెందేలా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ నల్లం సూర్యచక్రధరరావు క్షేత్రంలో భక్తులకు అమలు చేస్తున్న సౌకర్యాలు, చేయాల్సిన పనులను ఆర్జేసీకి వివరించారు. అనంతరం ఆర్జేసీ విలేకరులతో మాట్లాడుతూ వాడపల్లి, అన్నవరం, సింహాచలం ఆలయాలలో క్యూ లైన్లు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, అవసరం మేరకు అభివృద్ధికి చర్యలు తసుకుంటున్నట్టు తెలిపారు. అంతకు ముందు త్రినాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈఓతో పాటు వేదపండితులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. రూ.1.45 కోట్ల ఆదాయం కాగా స్వామివారికి హుండీల ద్వారా రూ.1,45,16,599 ఆదాయం వచ్చినట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం గురువారం వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,22,85,766, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.22,30,833తో మొత్తం రూ. 1,45,16,599 ఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 37 గ్రాములు, వెండి 890 గ్రాములు, పలు దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా జిల్లా దేవదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానం ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావు, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్–3 ఈఓ బీ కిరణ్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగేనా!
● శివారుల్లో సాగుపై అనుమానాలు ● జూన్ 1న విడుదల చేసిన నీరు 20వ తేదీ నాటికీ చేరని వైనం ● వర్షాలు కురుస్తున్నా మందకొడిగా నారుమడులు ● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా ● 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో.. సాక్షి, అమలాపురం: ఆశల సాగు ఖరీఫ్ జిల్లాలో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. శివారుల్లో ముంపు భయం.. ఆలస్యంగా వదలిన సాగునీరు.. విడుదల కాని ధాన్యం సొమ్ములు... ప్రభుత్వం అందించని అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం... ఇలా చెప్పుకుంటూ పోతే ఖరీఫ్కు అడుగడుగునా అవాంతరాలే. దీనితో శివారుల్లో ముందస్తు సాగు అటుంచి ఆలస్యంగానైనా సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ముందస్తు సాగు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్ ఆలస్యమవుతోంది. తొలకరి సాగుకు వేగంగా నారుమడులు పడే జూన్ నెలలోనే ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 12,640 ఎకరాలకు సరిపడా అకుమడులు పడ్డాయి. అలాగే మరో 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో విత్తనాలు చల్లారు. మొత్తంగా ఇప్పటి వరకు 13,489 ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైనట్టు అంచనా. అంటే ఇప్పటి వరకు పది శాతం కూడా నారుమడులు పడలేదు. జిల్లాలో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం పడుతుండడంతో రైతులు నారు మడులు, వెదజల్లు దుక్కులకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ వారం రోజులలో కొంతమేర నారుమడులు వేగం అందుకుంటున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అడుగడుగునా ఆటంకాలు జిల్లాలో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. సాగు చేసేందుకు సన్నాహాలు చేసుకుందామనుకున్న రైతులకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముందస్తు సాగు చేద్దామంటే జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేసినా 20 తరువాత కాని చేలకు చేరలేదు. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అలాగే శివారుల్లో ముంపు భయం వీడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పంట నష్టపోతే పరిహారం వస్తుందనే భరోసా లేకుండా పోయింది. ఈ కారణాలతో రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు రాలేదు. ముందస్తు లేకుండా చేశారు ముందస్తు సాగు చేయడం ద్వారా కోనసీమ (మధ్య డెల్టా)లో ఖరీఫ్ పంటను ముంపు నుంచి కాపాడుకునే అవకాశముంది. లేకుంటే అక్టోబరు 15 నుంచి నవంబరు 15 మధ్య ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రైతులు పంట నష్టపోతున్నారు. ముందస్తు సాగు వల్ల పంట ముంపు నుంచి బయట పడుతుందని రైతుల అంచనా. దీనిని గుర్తించి గత ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది. కూటమి ప్రభుత్వం మాత్రం జూన్ 1న ధవళేశ్వరం, బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ల ద్వారా సాగునీరు వదిలినట్టే వదిలి తూర్పు డెల్టా కాలువలపై వేమగిరి వద్ద 15 తేదీ వరకు, మధ్య డెల్టా కాలువపై లొల్ల లాకుల వద్ద 20వ తేదీ వరకు నీరు నిలిపివేశారు. దీనితో శివారు ప్రాంతాలకు నీటి విడుదల ఆలస్యమైంది. ఈ సమయంలో నారు వేస్తే జూలై మొదటి వారంలో వర్షాలకు దెబ్బతింటుందని, ఆలస్యం వేస్తే మంచిదనే ఉద్దేశంతో ఉన్నారు. దీని వల్ల కూడా నారుమడులు ఆలస్యం కానున్నాయి. -
జిల్లాలో సగటు వర్షపాతం 18.2 మిల్లీ మీటర్లు
అమలాపురం రూరల్: బంగాళాతంలో ఏర్పాడిన అల్పపీడనం వల్ల కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం ఉదయం వరకు పడుతూ పలు చోట్ల భారీగా కురిసింది. 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 18 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కొత్తపేట మండలంలో అత్యధికంగా 46.1 మిల్లీ మీటర్లు, అంబాజీపేటలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. అయినవిల్లి 36.2, ముమ్మిడివరం 30.4, కె.గంగవరం 30.2, పి.గన్నవరం 29.4, కపిలేశ్వరపురం 20.2, రామచంద్రపురం 21, ఆత్రేయపురం, మండపేటలలో 14.6, కాట్రేనికోన 14.4, అమలాపురం, ఆలమూరు, అల్లవరం, ఉప్పలగుప్తం 13.2 చొప్పున, రావులపాలెం 12.2, మామిడికుదురు, ఐ.పోలవరంలలో 12.4 చొప్పున, మలికిపురం 10.6, సఖినేటిపల్లి 10.4, రాజోలులో 10.2, రాయవరం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం అమలాపురం రూరల్: ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని, అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తి భవిష్యత్తును కుంగదీసే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అనే నినాదంతో ‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకుం దాం’ అనే నినాదంతో గురువారం కొంకాపల్లి సత్తెమ్మతల్లి గుడి నుంచి పేరూరు జంక్షన్ వరకు విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జేసీ నిశాంతి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ పాకిందన్నారు. ఆర్డీఓ కె.మాధవి విద్యార్థులతో డ్రగ్స్ తీసుకోబోమని ప్రమాణం చేయించారు. డీఎస్పీ టీ.ఎస్ఆర్ కె.ప్రసాద్, డీఈవో షేక్ సలీం బాషా, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, ఐడీసీఎస్ పీడీ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపేట విద్యార్థులను తరలించం
● డీఈఓ సలీం బాషా ● పలు పాఠశాలల తనిఖీ ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానంలోని పెద్దపేట పాఠశాల విద్యార్థులను ఎక్కడికీ తరలించబోమని ఆ పాఠశాలలోనే కొనసాగేలా చర్యలు తీసుకున్నట్టు డీఈఓ సలీం బాషా ఆ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మండలంలోని భీమనపల్లి, గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలను, ఎస్.యానంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో డీఈవో సలీం బాషా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యామిత్ర కిట్లను ఆయన పరిశీలించారు. అలాగే ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఓ పాఠ్యాంశాన్ని బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ను విజయవంతం చేయాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఒకటో తరగతిలో 19,335 మంది విద్యార్థులను చేర్చాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 14.894 మందిని చేర్చినట్టు తెలిపారు. ఈ నెలాఖరు లోగా మిగిలిన వారిని చేర్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎస్.యానం గ్రామంలో పెద్దపేట పాఠశాలలో మోడల్ స్కూల్ పేరుతో తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపబోమని డీఈఓ పేర్కొన్నారు. విద్యార్థులతో తల్లిదండ్రులు నిరసన చేపట్టడంతో ఆ పాఠశాలను డీఈఓ సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్థానిక పాఠశాలలోనే తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆయన వెంట ఎంఈవోలు కె.కిరణ్బాబు, ఎస్.సత్యకృష్ణ తదితరులున్నారు. -
సిరుల సీమలో మందుపాతర
నిక్షేపాల వెతికితీత ప్రారంభం నుంచే ప్రమాదాలు ● 1990లో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్. ● 1994లో అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లో అవుట్ . ● 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్ ● 2011లో రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైప్లైన్ పేలుడు. ● 2012లో రాజోలు మండలంలో కాట్రేనిపాడులంక బావి బ్లో అవుట్ కొద్దిపాటిలో తప్పింది. (రాత్రంతా కష్టపడి అరికట్టారు.) ● 2014లో నగరం గెయిల్ పైప్లైన్ విస్ఫోటం. ● 2014లో గొల్లపాలెం – కరవాకలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్. ● 2015లో కేశవదాసుపాలెం జీసీఎస్లో ఆయిల్ పైప్లైన్ పేలుడు. ● 2016లో అడవిపాలెం వద్ద నగరం మాదిరి గ్యాస్ పైప్లైన్ పేలినా నిప్పు అంటుకోక పోవడంతో ఒక కాలనీకి త్రుటిలో తప్పిన ముప్పు. ● గ్రామాల్లో ఏటా రెండు నెలలకోసారి తరచూ గ్యాస్ లీకేజీలు.2014 నగరంలో గెయిల్ గ్యాస్ ట్రంక్ లైన్ పేలుడు ● బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం ● కేజీ బేసిన్లో బతుకు దుర్భరం ● నిర్లక్ష్యంగా పైప్లైన్లు, ట్రంక్లైన్ల నిర్వహణ ● బావుల కనెక్టింగ్ పాయింట్ల వద్ద లీకేజీలు ● నగరం విస్ఫోటానికి 11 ఏళ్లు మలికిపురం: నగరం ఆయిల్ రిఫైనరీ సమీపంలోని నివాస ప్రాంతాల మధ్య 11 ఏళ్ల కిందట సంభవించిన భారీ విస్ఫోటం ఎంతో మంది జీవితాలను కకావికలం చేసింది. నాటి ఘటన నేటికీ వారి కళ్ల ముందు మెదులుతూ, కాళరాత్రిని తలపిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. నాటి దుర్ఘటన ఆయిల్, గ్యాస్ వ్యాపార సంస్థలకు ఏమాత్రం గుణపాఠం నేర్పలేదని తరచూ సంభవిస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. 2024 జూన్ 27 తెల్లవారుజామున సంభవించిన ఈ దుర్ఘటన 20 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇటువంటి ఘటనలు జరుతాయని ముందే గ్రహించిన కొందరు మేధావులు కేజీ బేసిన్కు 40 ఏళ్ల క్రితం పెట్టిన పేరు ‘మందుపాతర’. భూగర్భంలోని చమురు నిక్షేపాలను బయటకు తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా చమురు సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ ఘటనకు ముందూ వెనుకా కూడా అనేక లీకేజీలు, బ్లో అవుట్ ఘటనలకు కోనసీమ జిల్లా నిలయమవుతోంది. సమాచారం బదలాయింపు లేదు నగరం పేలుడు అనంతరం కేజీ బేసిన్లో పైప్లైన్ల మార్పులు జరిగాయి. కోనసీమలో ఉప్పునీటి ప్రభావం అధికమైంది. ఈ నేపథ్యంలో పైప్లైన్లు దెబ్బ తింటున్నాయనే వాదన ఉంది. కేజీ బేసిన్లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్)కు మొత్తం 900 కిలోమీటర్లు మేర గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. అలాగే కెయిర్న్, రిలయన్స్ సంస్థలకు చెందిన గ్యాస్ పైప్లైన్లూ ఉన్నాయి. గెయిల్ పైప్ లైన్లను కోనసీమతో పాటు ఇక్కడి నుంచి కొవ్వూరు, విజ్జేశ్వరం, వేమగిరి, కాకినాడ, విజయవాడ, కొండపల్లి, హైదరాబాద్ వరకూ ఏర్పాటు చేశారు. నగరంలో గెయిల్ పైప్లైన్ పేలుడు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలతో పైప్లైన్ల నాణ్యతపై పరిశీలన జరిపించారు. అనంతరం 2014లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కేజీ బేసిన్లో గెయిల్ గ్యాస్ పైప్లైన్లన్నీ అప్పటికే సుమారు 25 ఏళ్ల క్రితం వేసినవని, వీటిలో సుమారు 700 కిలోమీటర్ల లైన్లు మార్చాలని ఆయా సంస్థలకు సూచించారు. అప్పట్లో దూర ప్రాంతాలకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ లైన్ల మార్పు జరిగింది. ఈ పనులు కూడా జరిగి 11 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఈ లైన్ల నాణ్యతపై ఓఎన్జీసీ – రెవెన్యూ అధికారుల మధ్య సమాచారం బదలాయింపు లేదు. ప్రమాదం జరిగితే తప్ప వీటిపై దృష్టి పెట్టడం లేదు. పరిశీలన అంతకంటే లేదు. ఆయిల్ పైప్లైన్లు కూడా అంతే.. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు వందకు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్లైన్ల ద్వారా ఆయిల్ కం గ్యాస్ తరలిస్తారు. మరో వంద బావుల నుంచి కేశనపల్లి, అడవిపాలెం, కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల(జీసీఎస్)కు కూడా 4 అంగుళాల పైప్ లైన్లతో గ్యాస్, ఆయిల్ తరలిస్తారు. ఇవి ఓఎన్జీసీ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాల మధ్య ఉన్నాయి. ఈ లైన్లు సుమారు 5 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ఇవి కూడా శిథిలమై తరచూ పేలిపోతున్నాయి. అలాగే, బావుల వద్ద కూడా తరచూ లీకేజీలు వెలుగు చూస్తున్నాయి. బావుల్లోకి వేసిన పైప్లు, వెల్ క్యాప్లు శిథిలమయ్యాయి. పొగమంచు చూసినా భీతిల్లుతున్న ప్రజలు పొగమంచును చూసినా గ్యాస్ అని స్థానికులు భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఆయిల్ బావుల వద్ద, గ్యాస్లైన్లు వెళ్లిన ప్రాంతాల్లోనూ పొగమంచు కనపడినా ప్రజలు భయపడిపోతున్నారు. లీకైన గ్యాస్ పొగమంచు మాదిరి అలముకోవడమే కారణం. ఇది నిప్పు తగిలితే అంటుకుంటుంది. దీంతో, తెల్లవారుజామున పొయ్యి వెలిగిద్దామన్నా కూడా ఆందోళన చెందాల్సిన దుస్థితి అక్కడి ప్రజలది. నాణ్యత లోపం కూడా.. పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఓఎన్జీసీ, గెయిల్ అంటే ఆడిట్ లేని పద్దులు ఉంటాయని, ఇష్టానుసారం దోచుకోవచ్చనే విమర్శ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ సంస్థల కాంట్రాక్టు పనులూ జరుగుతున్నాయి.అడవిపాలెంలో గ్యాస్ లీక్ (ఫైల్) -
పవన్ అన్నా.. కాపాడు అన్నా!
సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ఫోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్ఫోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలకూ అవకాశం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. నిబంధనలు ఇవే.. ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు. జిల్లాలో పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి గత విద్యా సంవత్సరంలో 1,468 ప్రాజెక్టులు నమోదు కాగా, 115 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణమని చెబుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 42 ప్రాథమికోన్నత, 228 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 170 ప్రాథమికోన్నత, 157 ఉన్నత పాఠశాలలున్నాయి. సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు పంపే వీలు బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం హెచ్ఎంలు చొరవ చూపాలి విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చూడాలి. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి జాతీయ స్థాయిలో నిలిచేలా.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి -
సత్యదేవునికి సిరుల వృష్టి
అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి. 602 గ్రాముల బంగారం.. హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు. హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్ 55, సింగపూర్ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్ రియల్స్ ఒకటి, యూఏఈ దీరామ్స్ 40, యూరోలు 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 600 లభించాయి. పోటెత్తిన భక్తులు సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడం, భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదా యం సమకూరినట్టు అధికారులు చెబుతున్నారు. -
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: వర్షాల నేపథ్యంలో గోదావరికి వరదలు సంభవిస్తే, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విపత్తుల సహాయక చర్యలపై ప్రతి శాఖ సమాయత్తం కావాలని, గోదావరి తీరం వెంబడి ఉన్న మండలాలకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. కావాల్సిన అవసరాలపై జూలై మొదటి వారంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్నచోట్ల సైనింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తూ గట్ల పటిష్టతకు ఇసుక సంచులను సిద్ధం చేసుకోవాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. పశువులకు పునరావాసం కల్పించి టోటల్ మిక్సర్ రేషన్ (టీఎంఆర్) పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని ఆ శాఖ అధికారుకు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి.కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సహాయ చర్యలకు సన్నద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రశంసాపత్రాల అందజేత యోగాంధ్రలో భాగంగా ఈ నెల మూడో తేదీన బీచ్, దేవాలయ యోగాసనాల కార్యక్రమంలో అంతర్వేది సముద్ర తీరంలో మూడు వేల మందితో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహార యోగాసనలో జిల్లాకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయోత్సవాన్ని గోదావరి భవన్లో అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా యోగేంద్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ నిషాంతి సారథ్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లాస్థాయి అధికారులను ప్రశంసా పత్రాలు అందించి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు డీఆర్ఓ రాజకుమారి ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు. భూ పరిపాలన అంశాలపై ప్రత్యేక దృష్టి భూ పరిపాలన అంశాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అమరావతి నుంచి బుధవారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, అందరికీ ఇళ్లు, నూతన కోర్టు భవనాలు తదితర వాటిపై సమక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఆన్లైన్, పెండింగ్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అందిన దరఖాస్తులను విచారించి అర్హతల మేరకు క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులతో సమీక్ష -
వాడపల్లికి 96 ఆర్టీసీ బస్సులు
అమలాపురం రూరల్: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో కొలువైన వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రతి శనివారం 96 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి 22 ప్రత్యేక బస్సు సర్వీసులతో పాటు రావులపాలెం నుంచి వాడపల్లికి 8 బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాటితో కలిపి సుమారుగా 96 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ మహేష్ కుమార్, డీడీవో డి.శ్రీనివాసరావు సూచనల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం నుంచి వాడపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.జిల్లాలో 7.1 మిల్లీమీటర్ల వర్షపాతంఅమలాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకూ పడుతూనే ఉంది. చినుకులతో మొదలై, ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సగటు 7.1 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్రేయపురం, రామచంద్రపురం మండలాల్లో 17.1 మిమీ, అత్యల్పంగా మండపేటలో 1.4 మిమీ కురిసింది. మండలాల వారీగా కొత్తపేటలో 11.4, ఆలమూరు 10, అయినవిల్లి 9.8, రావులపాలెం 8.6, మలికిపురం 8.4, సఖినేటిపల్లి 8.4, కపిలేశ్వరపురం 6.4, కె.గంగవరం 6.2, పి.గన్నవరం 5.8, అమలాపురం 4.2, రాజోలు 5.4 ముమ్మిడివరం 5.4, అల్లవరం 4.6, కాట్రేనికోన 4.6, మామిడికుదురు 3.8, ఉప్పలగుప్తం 3.6, ఐ.పోలవరం 4.6, అంబాజీపేట 1.8, రాయవరం 1.2 మిల్లీమీటర్లు చొప్పున నమోదైంది.ఏపీ పీజీ సెట్లో అధ్యాపకుడికి మొదటి ర్యాంకుఅమలాపురం రూరల్: ఏపీ పీజీ సెట్లో 2025 (అసెట్) ఫలితాలలో అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఫిజిక్స్ అధ్యాపకుడు కేవీవీఎస్ మనోహర్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఫిజికల్ సైన్స్ విభాగంలో 91/100 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంఈటీలలో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో 13 యూనివర్సీటీలు కలిపి ఈ సెట్ నిర్వహించాయి. ఆయనతో పాటు ఆ కళాశాల విద్యార్థులైన ఎ.సతీష్ 220, సీహెచ్ ప్రసాద్ 320 ర్యాంకులు సాధించారు. కాగా.. మనోహర్ను కరస్పాండెంట్ కేవీఆర్ నరసింహారావు, చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ ప్రవీణ్, సీనియర్ అధ్యాపకుడు వరప్రసాద్ అభినందించారు.రేపు జాబ్మేళాబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధికల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మెడిప్లస్, జేవీఎస్ టెక్నాలజీ, శ్రీభవానీ కాస్టింగ్, ఇన్నోసోర్స్ సర్వీస్ లిమిటెడ్, పేటీఏం సంస్థలు 615 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి అపై విద్యార్హతల గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదింవచ్చన్నారు.ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలికాకినాడ క్రైం: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, అందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలలపై చోటు చేసుకుంటున్న నేరాలను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుటుంబ కలహాల్లో పరస్పర దాడులు జరగకుండా చూడాలన్నారు. ఆస్తుల చోరీల్లో రికవరీలు పెంచాలన్నారు. డ్రోన్ల సాయంతో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి నిందితులను గుర్తించి నేరాల బాట పట్టకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. -
మట్టి, ఇసుక అక్రమ దందా
పి.గన్నవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గ నేతల అండదండలతో మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా లంక భూముల్లో పెద్ద ఎత్తున మట్టి, ఇసుక తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల మేర దోచుకుంటున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఊడిమూడి, వైవీ పాలెం, పెదకందాలపాలెం, మానేపల్లి ర్యాంపుల్లో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పెదకందాలపాలెంలో 7 లారీలు, 2 జేసీబీల స్వాధీనం పెదకందాలపాలెం ర్యాంపులో పెద్ద ఎత్తున మట్టి, ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా తరలించి విక్రయిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడి చేసి ర్యాంపునకు సమీపంలోని 6 ఖాళీ టిప్పర్లు, ఒక లోడు లారీని, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ వి.వర్మ లోడు లారీని పి.గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. లారీలు వెళ్లకుండా రోడ్డుపై వీఆర్వోను కాపలాగా ఉంచారు. అధికారుల కళ్లుగప్పి డ్రైవర్ల పరారీ లారీల స్వాధీనం అనంతరం కిలోమీటరు దూరంలో జేసీబీల కోసం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్పై వెళ్లారు. అప్పటికే అందిన సమాచారంతో రెండు జేసీబీలను తుప్పల చాటున దాచారు. వాటిని స్వాధీనం చేసుకుని, వెనక్కి వచ్చే సరికి ఇక్కడ ర్యాంపులోని ఆరు ఖాళీ టిప్పర్లతో డ్రైవర్లు పలాయనం చిత్తగించారు. తరలించిన టిప్పర్ల నెంబర్లతో పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకుంటామని ఆర్ఐ చెప్పారు. అక్రమ తవ్వకాలపై కూటమి నేతల ఫిర్యాదు పి.గన్నవరం అక్విడెక్టుకు దిగువన డీఎస్ పాలెం ర్యాంపులో కూటమి నేతల ఆధ్వర్యంలో గతంలో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరిగాయి. కొన్ని నెలలపాటు మూతబడిన ఈ ర్యాంపును సోమవారం మళ్లీ ప్రారంభించారు. ఇదే అదనుగా ఎటువంటి అనుమతులూ లేకుండా ట్రాక్టర్లపై మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మంగళవారం టీడీపీ, జనసేనలకు చెందిన కొందరు నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. డీఎస్పాలెం ర్యాంపు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టి, ఇసుకను తరలించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించిన వారిలో కూటమి నేతలు పడాల వెంకటేశ్వరరావు, నేరేడిమిల్లి రఘు, సీహెచ్.ప్రసన్నకుమార్, కోట రాజేంద్రప్రసాద్ ఉన్నారు. అడ్డూ, అదుపూ లేకుండా తవ్వకాలు రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు -
రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
కలెక్టర్ మహేష్కుమార్ సాక్షి, అమలాపురం: ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ప్రవేశ పెట్టామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.3,706 కోట్లు అదనంగా ప్రతిపాదించినట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సమన్వయంతో గేదెలు, ఆవుల నిర్వహణకు సమృద్ధిగా రుణాలు అందించాలని కోరారు. వారి ఆర్థిక అవసరాలకు స్వయం సహాయక సంఘాల డిపాజిట్ నిధులు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. టిడ్కో రుణాలు పూర్తిస్థాయిలో అందించాలని, సిడ్బీ ద్వారా స్వయం ఉపాధికి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు రుణాల కల్పించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్య రంగానికి రూ.15,472 కోట్లు, మిగిలిన రంగాలకు రూ.2,523 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.17,994 కోట్ల వార్షిక ప్రణాళిక లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.11,934 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.2,871 కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగుళ్ల వేగేశ్వరరావు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రూ.14.60 లక్షల డ్వాక్రా నిధుల దుర్వినియోగంపై ఆరా తీయగా సంబంధిత ఎస్బీఐ అధికారులు సమాధానం ఇస్తూ 16 డ్వాక్రా సంఘాలకు నిధులు మంజూరు సందర్భంలో బీమా సౌకర్యం కల్పించామని, మూడు నెలల్లో వాటిని సంఘాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోనసీమ జిల్లా 2025–26 పొటెన్షియల్ వార్షిక క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవవర్మ, ఆర్బీఐ జోనల్ అధికారి గిరిధర్, యూబీఐ ఆర్ఎం రంగయ్య నాయుడు, జిల్లా అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు. అన్నదాన భవనానికి రూ.లక్ష విరాళం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు కొటికలపూడి నాగ రవీంద్రకుమార్, విజయవాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ 1,11,116 విరాళంగా సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం వారికి దేవస్థానం సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. స్వామివారికి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులకు అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.3,53,341 ఆదాయం వచ్చినట్టు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. -
ఆషాఢం.. అదుర్స్!
అన్నవరం: సాధారణంగా ఆషాఢ మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆదివారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఇదే సమయంలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. తుని సమీపంలోని లోవ దేవస్థానంలో కొలువు తీరిన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తూంటారు. ఉమ్మడి జిల్లాలోని కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి లోవకు వెళ్లే భక్తులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగు ప్రయాణమవుతూంటారు. వీరు మార్గం మధ్యలో అన్నవరంలో ఆగి, సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూంటారు. దీంతో, ఈ ప్రసాదం విక్రయాలు ఈ మాసంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతూంటాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్కు అనుగుణంగా సత్యదేవుని ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ఫ ఆషాఢ మాసంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు లోవ దేవస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారిలో అధిక శాతం మంది తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని కొత్త, పాత నమూనా ఆలయాల వద్ద, తొలి పావంచా వద్ద ప్రసాద విక్రయ స్టాల్స్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ సాధారణ రోజుల్లో 60 వేలు, ఆదివారం నాడు పాత, కొత్త నమూనా ఆలయాల కౌంటర్లలో చెరో 20 వేలు, తొలి పావంచా కౌంటర్ వద్ద 30 వేలు, రత్నగిరిపై ఉన్న కౌంటర్ల వద్ద 30 వేలు, కలిపి మొత్తం లక్ష ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ల వద్ద అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. రూ.1.50 కోట్ల ఆదాయం! మొత్తం మీద ఆషాఢ మాసంలో కొండ దిగువన ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా అన్నవరం దేవస్థానానికి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష ప్రసాదాల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయి. ఒక్కో ప్రసాదం ప్యాకెట్ ఖరీదు రూ.20. దీని ప్రకారం ఆషాఢ మాసం నాలుగు ఆదివారాల్లోనే సుమారు రూ.80 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రసాద విక్రయాల ద్వారా మరో రూ.70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు పూటలా తయారీ రత్నగిరిపై ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రసాదం తయారు చేసి భక్తులకు వేడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఒక్క కార్తికం మినహాయిస్తే మిగిలిన మాసాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే స్వామివారి గోధుమ నూక ప్రసాదం తయారు చేసేవారు. దానిని మర్నాడు ఉదయం వరకూ విక్రయించేవారు. అయితే ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండో షిఫ్ట్లో ప్రసాదాలు తయారు చేసి, కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఫ తలుపులమ్మ లోవకు భక్తుల తాకిడి ఫ జోరందుకోనున్న సత్యదేవుని ప్రసాద విక్రయాలు ఫ అన్నవరంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు -
పర్యాటంకాలెన్నో!
మరమ్మతులకు గురైన బోట్లు ఇక దిండి పర్యాటక కేంద్రంలో 12 ఏళ్ల క్రితం ఒక్కొక్కటీ రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన హౌస్బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటి జెట్టీలు కూడా శిథిలమయ్యాయి. జెట్టితో పాటు బోటు మరమ్మతులకు రూ.30 లక్షల చొప్పున ప్రతిపాదనలు పంపారు. కాగా వీటి జీవిత కాలం 15 ఏళ్లు కావడంతో మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లు వాటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే నిరుపయోగంగా వదిలేస్తే మరొక మూడేళ్లలో వాటికవే పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఫాంటూన్ బోట్ల ఇంజిన్ల కోసం అంచనాలు వేసి పంపారు. ఇక హౌస్బోట్ల విభాగంలో సింగిల్ హౌస్ బోట్లను ప్రవేశపెట్టి దిండి నుంచి నేరుగా గోదావరిలో అంతర్వేది పర్యటనకు ప్రతిపాదించిన ప్రాజెక్టు కూడా అటక్కెక్కింది. మలికిపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వసతుల కల్పన జరగడం లేదు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన దిండి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి కూటమి సర్కారు చేపట్టిన చర్యలు లేకపోగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులలో కూడా భారీగా కోత పెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్ దిండి టూరిజం ప్రాజెక్టుకు జనవరిలో రూ.7 కోట్లు మంజూరు చేశారు. పనులను సైతం ప్రారంభించారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల విడుదలను నిలిపివేసింది. అనంతరం కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు రూ.2 కోట్లు విడుదల చేసింది. దీంతో మూడవ అంతస్తు నిర్మాణానికి అప్పటికే కూలగొట్టిన రెండో అంతస్తును మరమ్మతులతో పాటు గదులను, రెస్టారెంట్ను, బార్ను రీమోడల్ చేసి సరి పెట్టారు. ఇలా దిండి టూరిజం మాత్రమే కాదు.. జిల్లాలో అంతర్వేది, ఓడలరేవు, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో అధునిక వసతుల కల్పనకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు సైతం కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఇదే సమయంలో స్థానిక ప్రైవేటు టూరిజం మరిన్ని వసతులు కల్పించి పర్యాటకులతో కళకళలాడుతూ ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటోంది. ఏకంగా రూ.30 కోట్లతో నూతన భవనాలు నిర్మించింది. ఇక్కడి సరోవర్ పోర్టికో ఇప్పటికే రూ.కోట్లతో వసతులను ఏర్పాటు చేయడంతో దీనిని మహీంద్ర సంస్థ టేకోవర్ చేసింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సైతం దిండి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అలాగే రాజమహేంద్రవరంలో ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ వంటి ప్రాజెక్టును దిండిలో కూడా ప్రతిపాదించినప్పటికీ ఏ కారణం చేతనో అది అటకెక్కింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల నిధులతో రాజమహేంద్రవరంలోనే పుష్కర ఘాట్ అభివృద్ధి పనులతో పాటు హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధికి రూ.97.40 కోట్లతో చేపట్టిన పనులు తప్ప పర్యాటకాభివృద్ధికి ఎటువంటి నిధులూ ఇవ్వలేదు. అమలుకు నోచని పవన్ ప్రకటనలు ఇక జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు గోదావరి పాయలలో పర్యాటకం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నో ఎన్నికల హామీలు గుప్పించేశారు. కానీ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. సరికదా గత ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పర్యాటక కేంద్రాలలో కనీసం నిర్వహణ నిధులు కూడా రాకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. అంతర్వేది నుంచి ద్రాక్షారామ వరకూ టూరిజం హబ్ చేస్తానన్న ఆయన హామీలు ఏడాది దాటినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.దిండిలో చురుగ్గా నిర్మిస్తున్న ప్రైవేటు టూరిజం భవనాలుప్రతిపాదనలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో పర్యాటకాభివృద్ధి, ఆధునిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు చేశాం. అఖండ గోదావరి ప్రాజెక్టులో రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లను అభివృద్ధికి ప్రతిపాదించాం. ఇందులో హేవలాక్ బ్రిడ్జి మాత్రమే ఉంది. మిగిలిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం. – పవన్, ఏపీ టూరిజం ఆర్డీ, రాజమహేంద్రవరం వసతుల కల్పనలో ఉదాసీనత పవన్ కల్యాణ్ హామీలు గాలికి.. టూరిజం హబ్కు చర్యలు శూన్యం అఖండ గోదావరి ప్రాజెక్టులోనూ నిధులు విదల్చని ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లోనూ భారీగా కోత దయనీయంగా దిండి పర్యాటకం రూ.కోట్లతో ప్రైవేటు ప్రాజెక్టులు -
గెయిల్ పైప్లైన్లపై నిరంతర పర్యవేక్షణ
జీఎం ముఖర్జీ మామిడికుదురు: గెయిల్ పైప్లైన్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎన్.ముఖర్జీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్రకుమార్ నేతృత్వంలో బృందం మంగళవారం నగరం గ్రామంలోని గెయిల్ టెర్మినల్ను సందర్శించింది. భద్రతా పరమైన చర్యలను టెర్మినల్ అధికారులు బృందానికి వివరించారు. ఏదైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో వాటిని ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. పైప్లైన్లను నిత్యం తనిఖీ చేసే వ్యవస్థ తమకు అందుబాటులో ఉందన్నారు. పైప్లైన్ల నాణ్యతను బట్టి ప్రతి 20 నుంచి 25 ఏళ్లకు ఒకసారి కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా లీకేజీలు, ప్రమాదాలు జరిగిన వెంటనే అది ఎక్కడ జరిగిందో క్షణాల్లో తమకు తెలిసేలా నగరం టెర్మినల్లోని అధునాతన వ్యవస్థ ద్వారా తమకు సమాచారం అందుతుందన్నారు. ఏదైనా ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు తమకు సమాచారం అందించేలా ఎక్కడికక్కడ 15101 టోల్ ఫ్రీ నంబర్లను ప్రదర్శించినట్టు తెలిపారు. ఏదైనా సంఘటనలు జరిగిన సందర్భంలో తమ నుంచి ఏవిధమైన సహకారం కావాలో చెప్పాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్రసింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పి.సునీల్కుమార్, గెయిల్ జీఎం పి.పోతయ్య, డీజీఎం బి.మహంతి, సీనియర్ మేనేజర్లు ఎస్.సుధీర్కుమార్, ఎస్.రామకృష్ణ, ఆర్ఐ ఇబ్రహీం, వీఆర్వోలు ఉన్నారు. -
ఏసీ బ్లాక్ నకిలీ మద్యం గుట్టు రట్టు
● కొమరిగిరిపట్నం అడ్డాగా దందా ● ఎనిమిది మందిని అరెస్టు చేసిన ఎకై ్సజ్ ఏసీ రేణుక బృందం ● హైదరాబాద్, పాలకొల్లుకు చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు ● 1065 నకిలీ మద్యం సీసాలు, ఇతర సామగ్రి స్వాధీనం అమలాపురం టౌన్: అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలోని ఓ ఇంటిలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టును ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక బృందం బహిర్గతం చేసింది. కొమరిగిరిపట్నం గ్రామ శివారు ఆకుల వారి వీధిలోని ఓ ఇంటిపై ఎకై ్సజ్ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి నకిలీ మద్యం బాటిలింగ్ మినీ యూనిట్ను, నిర్వాహకులను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో పట్టుబడ్డ నకిలీ మద్యం సీసాలు, ఇతర సామగ్రిని ఎకై ్సజ్ అసెస్టింట్ కమిషనర్ రేణుక, సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్, సీఐలు, ఎస్సైలు అమలాపురంలోని ఎకై ్సజ్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. తయారీ ఇలా ఈ నకిలీ మద్యం ముఠా హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతాల నుంచి కేరామిల్ లిక్విడ్, స్పిరిట్ను ముడి సరకుగా దిగుమతి చేసుకుంటోంది. మద్యం రంగు కోసం స్పిరిట్లో కేరామిల్ లిక్విడ్ కలుపుతారు. ఏపీ బేవరీస్ లిమిటెడ్ తయారీ చేసి సరఫరా చేసే డ్యూటీ పెయిడ్ మద్యంలానే నకిలీ మద్యం సీసా తయారు చేసి ఆకర్షణీయమైన లేబుల్తో రూపొందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఏసీ బ్లాక్ పేరుతో ఉన్న లేబుల్ బాటిల్పై అంటించి దానిలో వారు తయారు చేసిన మద్యాన్ని నింపుతున్నట్టు అధికారుల బృందం ప్రత్యక్షంగా గమనించింది. దాడి సమయంలో అక్కడి నుంచి మద్యం తయారీ మెషీన్, అప్పటికే తయారు చేసిన 1065 మద్యం సీసాలు, ఆరు వేల ఖాళీ సీసాలు, కేరామిల్ లిక్విడ్ డబ్బాలు, ఏసీ బ్లాక్ పేరుతో ఉన్న లేబుల్ బండిల్ తదితర సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిల్వ చేసిన గొడౌన్ను, మద్యం సరఫరాకు వినియోగించే ఆటోను వారు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో.. రామానుజ తేజ అనే ఓ ఎకై ్సజ్ అధికారి సేకరించిన సమాచారంతో ఈ దాడి చేశామన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, సీఐ వీరాబాబు తదితరులు కూడా ఈ ఆకస్మిక దాడిలో పాల్గొన్నారని తెలిపారు. పాలకొల్లులో కూడా అక్కడి ఎకై ్సజ్ అధికారుల బృందం దాడి చేసి 130 లీటర్ల స్పిరిట్ను పట్టుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యాన్ని ప్రభుత్వ ఎనాలిసిస్ ల్యాబ్కు పంపి పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ నకిలీ మద్యం రాకెట్లో మరికొందరు నిందితులు ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని రేణుక తెలిపారు. 8 మంది అరెస్టు ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వివరించారు. అమలాపురం మండలం పేరూరుకు చెందిన చింతపల్లి సోమశేఖర, చవ్వాకుల ప్రేమ్కుమార్, ఇదే మండలం చిందాడగరువు గ్రామానికి చెందిన నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లా శ్రీనివాస్, కాజులూరు మండలం దిద్దుకూరుకు చెందిన నురుకుర్తి శ్రీనివాసరావు, అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన బొర్రా సత్య అప్పారావు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన పితాని వెంకట దుర్గ సింహాద్రి, తిరుమనాధం దుర్గారావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. వీరికి హైదరాబాద్, పాలకొల్లు నుంచి స్పిరిట్, కేరామిల్ లిక్విడ్ సరఫరా చేస్తున్న ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఒరిజినల్ మద్యం బాటిల్ రూ.160 ఉంటే వీరు తయారు చేసే నకిలీ మద్యం బాటిల్ను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నట్టు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
డ్రైన్లో ఆవు మూగ వేదన
అతి కష్టంపై తీసిన అగ్నిమాపక సిబ్బంది అమలాపురం టౌన్: స్థానిక విత్తనాల వారి కాల్వ ప్రాంతంలో ఓ ఆవు రోడ్డు పక్క డ్రైన్లో ప్రమాద వశాత్తు పడిపోయి బయటకు వచ్చేందుకు నరక యాతన పడింది. డ్రైన్లో పడి ఇరుక్కుపోయిన ఆవు అవస్థ చూసిన స్థానికులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ కార్యకర్తలు స్పందించి అగ్ని మాపక దళానికి సమాచారం అందించారు. ఆ సిబ్బంది తాళ్లు, చెక్క బల్లలతో ఆవును తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మరో ప్రయత్నంగా డ్రైన్ను కొంచెం పగలగొట్టి ఆవును బయటకు తీశారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి కూడా అక్కడకు చేరుకుని ఆవును ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆవు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పోల్ పడితే పతకమే!
● పోల్వాల్ట్లో రాణిస్తున్న పిఠాపురం క్రీడాకారుడు రవి ● కొద్దిపాటి వసతులతోనే కఠోర శిక్షణ ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు పిఠాపురం: అతడు పోల్ పట్టాడంటే పతకం రావాల్సిందే. ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఉన్న కొద్దిపాటి వసతులతో దృఢ సంకల్పం, పట్టుదలతో శిక్షణ తీసుకుని తొలి ప్రయత్నాలలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలను కొల్లగొడుతున్నాడు. తక్కువ కాలంలో ఏకంగా 15 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలు సాధించిన ఘనత అతడి సొంతం. పిఠాపురం విద్యార్థి పోల్వాల్ట్లో ఉత్తమ క్రీడాకారుడిగా ప్రతిభ చూపుతున్నాడు. డిగ్రీ చదువు పూర్తిచేసి ఉన్నత విద్య కోసం సాగుతూనే పోల్వాల్ట్లో ప్రతిభ చూపుతున్నాడు సాలా రవి. పతకాల వేటలో పోటీలేదు.. తొమ్మిదో తరగతి నుంచి పోల్వాల్ట్లో పట్టు సాధించిన రవి జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున హైదరాబాద్, చైన్నె, కేరళ, కరీంనగర్, బెంగళూరు, పూణే, పంజాబ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్, గుంటూరు, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం పోల్వాల్ట్లో అంతర్జాతీయ పోటీల్లో గెలవాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా కోచ్ ఎలిపే సునీల్ దేశాయ్. తమలో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం వల్లే ఇన్ని పతకాలు సాధించాను. చిన్నప్పుడు తమ పాఠశాలలో సీనియర్లు పోల్వాల్ట్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. కోచ్ సునీల్ దేశాయ్కు ఆ క్రీడపై ఆసక్తిని వివరించాను. దీంతో ఆయన తనను ప్రోత్సహించి క్రీడలో మెళకువలు నేర్పించారు. సరైన సౌకర్యాలు లేకపోయినా మంచి ఫలితాలను సాధించేలా శిక్షణ ఇచ్చారు. – సాలా రవి, పోల్వాల్ట్ క్రీడాకారుడు, పిఠాపురం -
ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పతకాలు
ఆటలు నేర్పడం కాదు. ఏ ఆటలో ఎవరు నిష్ణాతులు కాగలరో గుర్తించి శిక్షణ ఇవ్వాలి. అంతే కాకుండా వారిని ప్రోత్సహించి విద్యార్థిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీస్తే జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడాసక్తిని వెలుగులోకి తేవడం ద్వారా వారిని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతైనా అవసరం. ప్రభుత్వం పోల్వాల్ట్ క్రీడకు మంచి ప్రాధాన్యం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది క్రీడాకారులు తయారై రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తారు. పోల్వాల్ట్లో రవి మంచి ప్రతిభ చూపుతున్నాడు. ప్రతి పోటీలోను తన సత్తా చాటుతూ పతకాలను సాధిస్తున్నాడు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా కృషి చేస్తున్నాడు. – ఎలిపే సునీల్ దేశాయ్, కోచ్, పిఠాపురం -
వచ్చే నెల 9న దేశవ్యాప్త సమ్మె
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు వచ్చేనెల 9న నిర్వహించనున్న ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ ఎల్ఐసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మోరంపూడిలోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఎల్ఐసీ క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగుల నిరసన ప్రదర్శన చేశారు. కోదండరామ్ మాట్లాడుతూ బీమా భారంగా మారిన తరుణంలో జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ బీమా, బ్యాంకులను కాపాడాలని కోరారు. కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లను రద్దు చేసి, ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్–3, 4 ఉద్యోగుల నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని కోదండరామ్ డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు మాఽథ్యూస్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు, సత్యదేవ, పిఎస్ఎన్ రాజు, ఈశ్వరరావు, పట్నాయక్, ఇమ్రాన్, శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్, ఎస్పీలకు ప్రపంచ బుక్ రికార్డు
ప్రపంచ రికార్డ్ అందుకున్న కలెక్టర్, ఎస్పీ అమలాపురం రూరల్: అంతర్వేది బీచ్లో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం, యోగాంధ్ర నిర్వహణలకు జిల్లా అధికారులు పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ను అందుకున్నారు. అంతర్వేది బీచ్లో నిర్వహించిన యోగాంధ్రలో భాగంగా వృక్షాసనం, భారీ మానవహారాలకు వారు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు. -
యోగాంధ్ర పేరిట అధికారుల కాలక్షేపం
● నెల రోజుల పాటు పనులకు దూరం ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం అమలాపురం టౌన్: యోగాంధ్ర పేరిట అధికారులు నెల రోజుల పాటు పనులు చేయకుండా కాలక్షేపం చేశారని, ఆహార భద్రతను గాలికి వదిలేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని హైస్కూల్ సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు లక్షలాది మంది గుండె జబ్బులు, లివర్, కిడ్నీ వంటి వ్యాధులకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. నేటి యువతలో అనేక మంది పాన్ పరాగ్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పంట కాల్వల్లోకి సెప్టీక్లీన్ వ్యర్థాలను గొట్టాల ద్వారా తరలిసూ కలుషితం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నా యోగాంధ్ర పేరుతో అధికారుల హడావుడి తప్ప వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎక్కడా తనిఖీలు లేవని ధ్వజమెత్తారు. యోగాంధ్ర పేరుతో ప్రచారం తప్ప ఎక్కడా కార్యాచరణ లేదని ఆరోపించారు. పాఠశాలల్లో పిల్లలకు వ్యాయామం తప్పనిసరి చేసి రోజూ ఓ గంట సేపు చేయించాలని. ఒక్క రోజు, లేదా కొన్ని రోజుల యోగా శిక్షణలతో ఆరోగ్య సమాజం సిద్ధించదని, అది నిరంతర ప్రక్రియ అని, శిక్షణ అయినప్పుడే దాని వల్ల ప్రయోజనాలు సార్థకం అవుతాయని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. -
గాడాలలో ఎద్దుల బలప్రదర్శన
కోరుకొండ: మండలంలోని గాడాలలో మంగళవారం ఎద్దుల బలప్రదర్శన పోటీ జరిగింది. పోటీల్లో రాజానగరం నియోజకవర్గంలోని 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి ఎద్దుల బండితో చేరుకున్న ఎద్దులకు బహుమతులు అందజేశారు. చక్రద్వారబంధానికి చెందిన శ్రీను ఎద్దులకు ప్రధమ బహుమతి రూ.10 వేలు, ట్రోఫీ, మురముండకు చెందిన సురేష్ గౌడ ఎద్దులకు రూ.8 వేలు, తోకలంక ఎద్దులకు రూ.7 వేలు, సీతానగరానికి చెందిన ఎద్దులకు రూ.6 వేలు, గాడాలకు చెందిన శ్రీను ఎద్దులకు రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. పాల్గొన్న ఎద్దుల యజమానులందరికీ రూ.వెయ్యి చొప్పున అందజేశారు. స్థానికనాయకులు, రైతులు పాల్గొన్నారు. -
48 గంటల్లోగా ధాన్యం సొమ్ము ఇవ్వాలి
సాక్షి, అమలాపురం/పిఠాపురం: ‘రైతులను పట్టించుకోండి. పండించిన పంటకు ఇవ్వాల్సిన సొమ్మును 48 గంటల్లో ఇవ్వడి. రైతు పరిస్థితి అస్సలు బాలేదు. పురుగుల మందు తాగి చావాల్సిన దుస్థితి వచ్చింది. మీరే మమల్ని చంపేస్తున్నారు’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన రైతు వర్రే నాగబాబు రెండు చేతులూ జోడిస్తూ వేడుకున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు వేలాదిగా ఉన్నారు. మే 9 నుంచి ధాన్యం బకాయిల చెల్లింపులు ఒకపైసా కూడా ఇవ్వలేదు. రబీ రైతులకు ఇంకా రూ.248.65కోట్ల వరకూ ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రబీ ధాన్యం అమ్మినా కూటమి ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ధాన్యం సొమ్ము వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము ఖరీఫ్ సాగు చేయలేమని, సాగు సమ్మె చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(పాడా) కార్యాలయం వద్ద కూడా ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు ధర్నా చేశారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిబ్బంది తీసుకోలేదు. సమస్యను వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు
సామర్లకోట: విశాఖపట్నానికి చెందిన దంపతులు సామర్లకోటలో పొగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు సోమవారం బాధితురాలికి అందజేశారు. కలిపిరెడ్డి నారాయణమ్మ, జగన్మోహన్రావు ఆదివారం విశాఖపట్నం నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక స్టేషన్ సెంటర్లో ఒక హోటల్లో అల్పాహారం చేశారు. అనంతరం ఆ దంపతులు రోడ్డుపై పర్సు జాడ విరుచుకున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లిన తరువాత చూసుకొంటే పర్సు కనిపించక పోవడంతో స్థానిక అవుట్ పోస్టులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడు తూలాల బరువైన రూ. మూడు లక్షల విలువ కలిగిన బంగారు గొలుసు పోవడంతో ఎస్సీ ఈ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు అవుట్ పోస్టు పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఒక బిచ్చగాడు రోడ్డుపై పడిపోయిన పర్సు తీసుకొని జేబులో పెట్టుకోవడాన్ని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు బిచ్చగాని కోసం గాలింపు చేసి గుర్తించి అతని వద్ద నుంచి పర్సును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పర్సులో బంగారు గొలుసు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బంగారు గొలుసు అందజేశారు. -
సుదర్శన హోమానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
● పురుషులు పంచె, కండువా.. ● మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్ చున్నీతో.. సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులను తప్పనిసరిగా ధరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీతో పాల్గొనాలన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం దైవ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం గురించి ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు వివరించారు. దేవాలయానికి వెళ్లిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకూ మన దృష్టి దేవుని మీదనే ఉండాలి. అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే ఆచారాన్ని పెట్టారని వివరించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
కాకినాడ సిటీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృది పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డిపీఆర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ కాకినాడలో ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ లింగ సమానత్వమే లక్ష్యంగా అనేక విధానాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలు రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నిధులు, విధులు, భావ వ్యక్తీకీకరణ నైపుణ్యం, ప్రజాస్వామ్య విధుల సులభతరం వంటి అంశాలపై ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి రావులపాలెం: రాష్ట్రంలో రైతులకు 48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బు వారి ఖాతాల్లో వేస్తామని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం 48 రోజులు గడిచినా చెల్లించకుండా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. జిల్లాలో తాము చేసిన నిరసన కార్యక్రమం ఫలితంగా ప్రభుత్వం జిల్లాలో రెండు లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. దానికి గాను రూ.613 కోట్లు ఖర్చు అయిందన్నారు. దీనిలో ఇంకా రూ.248 కోట్లు రైతులకు బాకీ తీర్చాల్సి ఉందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తొలుత రెంటపాళ్ల జగన్ టూర్లో మృతిచెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్య మృతికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జగన్పై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఏ–1గా, హోం మంత్రిపై ఏ–2గాను, డీజీపీ పై ఏ–3 గా కేసులు పెట్టాలన్నారు. జగన్మోహన్రెడ్డికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం కోసం ఆయనకు ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదన్నారు. పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుపై ఎటువంటి కేసులు పెట్టాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా సాయగా రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి ఇచ్చామన్నారు. రైతుకు పెట్టుబడి సొమ్ము వెంటనే అందేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగా దినోత్సవానికి రూ.300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. గతంలో విజయవాడలో వరదలు వస్తే రూ.23 కోట్లు అగ్గిపెట్టెలకు ఖర్చు చేశారని, విపత్తును కూడా ప్రచారానికి, ఆదాయానికి అనుకూలంగా మార్చుకునే చంద్రబాబు లాంటి సీఎం రాష్ట్రానికి ఉండటం దురదృష్టం అన్నారు. లోకేష్ను జాకీతో లేపి రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందన్నారు. మంత్రి పదవి ఇస్తారని జగన్పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పక్కన పెట్టిన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, దేవరపల్లి సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకుడు కప్పల శ్రీధర్, వార్డు సభ్యుడు సఖినేటి వాకుల్ రాజు పాల్గొన్నారు. -
హోరెత్తిన పోరు
యువతను పాతాళంలోకి తొక్కేస్తున్నారు చంద్రబాబు యువతను, విద్యార్థులను పాతాళంలోకి తొక్కేస్తున్నారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తొలి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేసినట్టుగా యువతను, విద్యార్థులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, కోఆర్డినేటర్ రాజోలు నియోజకవర్గం యువగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ఏమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగభృతి అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానం ఏమైంది. – పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ యువతే దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక యువత స్వయంకృషితో చదువుకుని ముందుకు వెళ్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకగా నిలుస్తుంది. 2004 తరువాత దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతీ విద్యార్ధి చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంటును తీసుకొచ్చి విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఆ పథకాలను రెట్టింపు చేసి విద్యార్థులను అన్ని విధాలా ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యస్థను నిర్వీర్యం చేస్తోంది. – మిండగుదిటి శిరీష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ● కదం తొక్కిన విద్యార్థులు, యువత ● అమలాపురం నల్లవంతెన నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ● జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ క్యాడర్ ● మద్దతు తెలిపిన విద్యార్థి, యువజన సంఘాలు ● ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన కలెక్టరేట్ ● మూడుచోట్ల అడ్డుకున్న పోలీసులు ● వారిని నెట్టుకుని మరీ ముందుకు.. ● ప్రభుత్వ మోసంపై ధ్వజమెత్తిన నేతలుసాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్/ ఉప్పలగుప్తం: టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి... ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారా సభల్లో ఊదరగొట్టిన ఉద్యోగల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కదం తొక్కింది. ఏడాది కాలంగా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా వైఎస్సార్ సీపీ సోమవారం నిర్వహించిన యువత పోరుతో జిల్లా కేంద్రం అమలాపురం హోరెత్తింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురం నల్ల వంతెన వద్ద ఉన్న వంటెద్దు వెంకన్నాయుడు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో మోసాలను ఎండగట్టారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల కల్పన ఎప్పుడని నిలదీశారు. ఉన్న ఉద్యోగాలను తొలగించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి అందించాలని నినదించారు. అనంతరం ఈ మేరకు డీఆర్వో ఎస్.రాజకుమారికి పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ నారాయణల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. శాసనమండలి సభ్యుడు బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే పాములు రాజేశ్వరిదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ, విద్యార్థి విభాగం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ జిల్లెల్ల రమేష్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి నేతల నాని, ఆయా విభాగాల జిల్లా అధ్యక్షులు మిండగుదుటి శిరీష్, షేక్ అబ్దుల్ ఖాదర్, దొమ్మేటి సత్యమోహన్, జిన్నూరు వెంకటేశ్వరరావు, జాన గణేష్, తోరం గౌతమ్ రాజా, వంగా గిరిజాకుమారి, చీకట్ల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధులు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, సుధా గణపతి, కుడిపూడి భరత భూషణ్, కాశి బాలముని కుమారి, మందపాటి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పోలీసుల అవాంతరాలు అమలాపురంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన విద్యార్థి.. యువత పోరుకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని నిరసనను భగ్నం చేయాలని చూసింది. కలెక్టరేట్కు శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని రోప్ వేలు, బారికేడ్లు పెట్టి నిలిపివేయాలని చూసింది. మూడుచోట్ల పోలీసు జులుం ప్రదర్శించారు. తొలుత ర్యాలీ ప్రారంభమైన చోట, మరోసారి కలెక్టరేట్కు సమీపంలోను, మూడవసారి కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కార్యకర్తలకు అడ్డంకులు సృష్టించారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలో బారికేడ్లు, రోప్ పార్టీలతో కార్యకర్తలను, నాయకులను నిలువరించారు. ముందుకు వస్తున్న వారిని పోలీసులు వెనక్కు నెట్టివేశారు. ఈ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళలను సైతం పోలీసులు వెనక్కు నెట్టివేశారు. దీనిపై ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను నెట్టుకుని కార్యకర్తలు ముందుకు వచ్చారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేసిన పోలీసులు వాటి ముందు బారికేడ్లు పెట్టి మరోసారి రోప్ పార్టీతో అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నా ఎందుకు ఇంతమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీనితో అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ కొంతమందికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి వారిని కలెక్టరేట్లోకి పంపించారు. యువతను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను, విద్యార్థులను రోడ్డుపై పడేశారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించక రాష్ట్రంలో ఉన్న వేల మంది విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఒత్తిళ్లకు ఫీజులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ మోసపూరిత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.60లక్షల మంది వలంటీర్లు, 18వేల మంది ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను కలిపి 4 లక్షల ఉద్యోగాలను తొలగించి యువతకు తీవ్రమైన అన్యాయం చేసింది. సంవత్సర కాలంలో బకాయిల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును ప్రభుత్వం తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి. – పిల్లి సూర్యప్రకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువత, విద్యార్థులను మోసం చేసింది. విద్యార్థులకు చెల్లించవలసి ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు బారిన పడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్లు అధికారంతో వచ్చిన వెంటనే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ తల్లికి వందనం పథకం కోత పెట్టారు ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో అందరికీ ఇవ్వకుండా కోత పెట్టారు. పేద వర్గాలతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు నిలిపివేసి అన్యాయం చేశారు. – గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ -
కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు
అమలాపురం రూరల్: వేతనాలు పెంచాలని కోరుతూ కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లాడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ వద్ద అందోళన చేశారు. సూమారు గంటపాటు అందోళన చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణవేణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశించారని కానీ వేతనాలు పెంచకపోగా పని భారాన్ని తీవ్రంగా పెంచి రకరకాల యాప్ల పేరుతో ప్రీస్కూల్ని అటకెక్కించారని అన్నారు. పదివేల రూపాయలు వేతనం దాటింది అనే పేరుతో మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు నిలుపుదల చేశారని ప్రభుత్వ ఉద్యోగం అని ఆన్లైన్లో చూపిస్తోందని, సంక్షేమ పథకాలు రావని సచివాలయాల దగ్గర చెప్తున్నారని అన్నారు. అంగన్వాడీ హెల్పర్లు, మినీ వర్కర్లు ఏం పాపం చేశారని సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని అన్నారు. రూ.11,500తో ఎట్లా బతకాలని, ఎంతోమంది ఒంటరి మహిళలు ఈ జీతం మీదే ఆధారపడి బతుకుతుంటే వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి మాట్లాడుతూ రెండు నెలలుగా అంగన్వీడీలకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు 20వ తేదీలోపు బిల్లు పెట్టకపోవడం దారుణమని అన్నారు. సీఐటీయూ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఎన్ బలరాం, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు పి.అమూల్యకే, పి రత్నకుమారి, మహేశ్వరి, సుజాత పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: స్పోర్ట్స్ ఫర్ యూనిటీ నినాదంతో జిల్లాలో ఒలింపిక్ డే ఉత్సవాలతోపాటు రన్లు కూడా సోమవారం ఉదయం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లు ఏకకాలంలో సాగాయి. అమలాపురం పట్టణంలో జరిగిన ఒలింపిక్ డే వేడుకలు ఉత్సవంగా స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జరిగాయి. ఈ క్లబ్ భవనం నుంచే ఒలింపిక్ రన్ మొదలైంది. ఈ వేడుకల్లో అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ శరత్బాబు, పప్పుల శ్రీరామచంద్రమూర్తి పర్యవేక్షణలో రన్ సాగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ ఒలింపిక్స్ గేమ్స్ అంటే ఐక్యతకు చిహ్నమని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా అమలాపురంలో ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తున్న జిల్లా అసోసియేషన్ను అభినందించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ స్ఫూర్తితో జిల్లాకు చెందిన క్రీడాకారులు అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సాత్విక్ సాయిరాజ్ను ఆదర్శంగా తీసుకుని సత్తా చాటాలని ఆకాంక్షించారు. నాలుగు కిలోమీటర్లు సాగిన ఒలింపిక్ రన్ స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ వద్ద ఒలింపిక్ డే ఉత్సవాలు జరిగిన తర్వాత రన్ను అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, డీఎస్పీ ప్రసాద్లు ఒలింపిక్ టార్చ్ పట్టుకుని ప్రారంభించారు. రన్ ముమ్మిడివరం గేటు సెంటర్ మీదుగా గడియారం స్తంభం సెంటరు, ముస్లిం వీధి, గాంధీబజార్, రవణం వీధి, గారపాటి వీధి, గండువీధి మీదుగా తిరిగి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సాగి ఆఫీసర్స్ క్లబ్కు చేరుకుంది. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, వాకర్స్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మునగాల మన్యం రన్లో పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర సాగిన పరుగు ప్రారంభించిన అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, డీఎస్పీ ప్రసాద్ జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో నిర్వహణ -
భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రిపుల్ ఐటీకి జిల్లా నుంచి 130 మంది విద్యార్థుల ఎంపిక రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీకి మొదటి దశలో 130 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 32, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 19, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 28, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి 3.22 శాతం మంది విద్యార్థులు నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారికి ఈ నెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు ఎంపిక చేసిన క్యాంపస్ల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నూజివీడు క్యాంపస్కు ఎంపికై న వారికి ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో ఏలూరు జిల్లాలోని నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీకి ఎంపికై న వారికి ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 2, 3 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో, జూలై 4, 5 తేదీల్లో ఒంగోలు క్యాంపస్కు ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసనాలకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగంఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవ హారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్డీసీ పి కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డీ. శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. అర్జీదారుల సమస్యలకు పరిష్కారాలు అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లోనిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్య క్రమంలో 242 అర్జీలను డీఆర్ఓ రాజకుమారి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సర్వే ఏడీ కె. ప్రభాకర్ డీఎండీఓ రాజేశ్వరరావు స్వీకరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 21 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్ కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వ చ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీచిప్స్ టు సిస్టమ్స్శ్రీ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరయ్యాయి. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
అమ్మ ఓడి..పోయింది
● కన్న కొడుకును చూసి కన్నుమూయాలని చివరి క్షణం వరకు తల్లి ఆవేదన ● 20 ఏళ్ల క్రితం విడిచిపోయిన కొడుకు ● తల్లి చావుబతుకుల్లో ఉందంటే చూసేందుకై నా రాని కాఠిన్యం ● అధికారుల వార్నింగ్తో అంతిమ సంస్కారాలకు హాజరు కాకినాడ క్రైం: చివరి రోజుల్లో.. చిట్టచివరి క్షణాల్లో.. కొడుకు కంటి చూపు, స్పర్శ కోసం పరితపించిన ఓ తల్లి వ్యథ ఇది. కాటికేగే వేళ కన్నబిడ్డను కళ్లారా చూసుకుంటే చాలనుకున్న ఓ వ్యథార్థ మాతృమూర్తి యథార్థ గాథ ఇది. అంతిమ ఘడియల్లో అన్నీ తెలిసి కొడుకు కావాలనే రాలేదన్న గుండె పగిలే చేదు నిజాన్ని తాళలేక ఆ కన్నీటి వ్యథతోనే కన్ను మూసిన ఓ అమ్మ కథ ఇది. అనగనగా ఓ తల్లి... బొమ్మని చేసి, ప్రాణం పోసింది. తన రక్త మాంఽసాలను పంచి ఇచ్చి, ప్రసవ వేళ ప్రాణాన్నే పణంగా పెట్టి ఓ కొడుకుని కన్నది. ఊపిరంతా ఉయ్యాల చేసి లాలపాడింది, జోలపుచ్చింది. మాతృత్వపు మాధుర్యంతో తనివి తీరా తరించిపోయింది. కొడుకుని పెంచి పోషించి ప్రయోజకుడ్ని చేసింది. అమ్మ త్యాగంతో కొడుకు పెద్దోడయ్యాడు. ఎంత పెద్దోడంటే చనిపోతున్నాను చూసెళ్లమంటే తనకు తీరికి లేదనేంత... అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం వదిలిపోయావనీ, నాటి నుంచి కంటికి కానరాలేదనీ, చిట్టచివరిగా ఒక్కసారి కనిపించి వెళ్లపో నాయనా అంటూ తల్లి అచేతన స్థితిలో వీడియో పంపి మరీ వేడుకున్నా ఆ కొడుకు మనసు కరగలేదు. చివరికి అమ్మ ఆక్రందనే ఓడిపోయింది. పుత్రరత్నం తాను ఉన్న హైదరాబాద్ నుంచి తల్లి ఉన్న కాకినాడకి తీరిక చూసుకొని చేరేసరికి ఆయువు పోసిన అమ్మ ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. తుది మలుపులో కొడుకుని కళ్లారా చూసుకోలేకపోయిన ఆ అమాయకపు తల్లి రాజేశ్వరి అయితే, కాఠిన్యం నిండిన ఆ కొడుకు పేరు జోష్యబట్ల రాజశేఖర్. తనువు చాలించే వేళ బిడ్డను చూస్తే చాలనుకుంది. పున్నామ నరకం నుంచి తప్పించడమే ఎక్కువనుకొని చిట్ట చివరి వేళ కట్టె గుట్టకి నిప్పంటించి నిష్క్రమించాడా కొడుకు. బిడ్డ కోసం పరితపించి ప్రాణం విడిచిన ఆ మాతృమూర్తి దీనావస్థ మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిపోయింది. కన్నపేగు మమకారాన్ని చిదిమేసిన ఈ హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు కోసమే యావత్ జీవితం కాకినాడ దేవాలయం వీధి వినుకొండ వారి వీధికి చెందిన జోష్యబట్ల రాజేశ్వరి(70) తన ఒక్కగానొక్క కుమారుడి కోసం తన యావత్ జీవితాన్ని అర్పించింది. ఈమెకి 45 ఏళ్ల కుమారుడు రాజశేఖర్ ఉన్నాడు. బిడ్డను కని భర్త వదిలి పోయినా టైలరింగ్ చేస్తూ కుమారుడిని చదివించింది. పదవ తరగతి అనంతరం విడిచిపోయిన తండ్రి పిలుపుతో రాజశేఖర్ కేరళ వెళ్లాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి వద్దకు వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లి.. కొడుకు బాధను అర్థం చేసుకొని తెలిసిన వారి సాయంతో కాకినాడలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం వేయించింది. అదే సమయంలో, అంటే సుమారు 20 ఏళ్ల క్రితం తల్లిని పిలవకుండానే స్థానిక కల్యాణ మండపంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి తన భార్యను చూపించి, నాటి నుంచి తల్లిని వదిలిపోయాడు. కార్పొరేటర్ చొరవతో.. అనాథాశ్రమంలో రాజేశ్వరి పరిస్థితి దయనీయంగా మారింది. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్వయంగా తమ సేవలు తాము చేసుకునేవారికే అక్కడ స్థానం ఉంటుంది. నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితితో రాజేశ్వరి మంచానికి పరిమితం అయింది. ఆశ్రమ యాజమాన్యం రాజేశ్వరిని చేర్చిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు విషయం చెప్పడంతో ఆమె రాజేశ్వరిని కాకినాడ జీజీహెచ్లో చేర్చి సేవలు చేశారు. నివాసాన్ని కోరుతూ కలెక్టర్ షణ్మోహన్కు లక్ష్మీప్రసన్న ఈ ఏడాది మే 12వ తేదీన లేఖ రాశారు. తక్షణమే స్పందించిన ఆయన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, రాజేశ్వరి బాగోగులు పరిశీలించి తగిన నివాస సదుపాయం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రంగనాథం శైలజ రాజేశ్వరి బాగోగుల బాధ్యతలు చూసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, పెద్దాపురంలో బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమన ఇల్లుశ్రీ వసతి గృహానికి రాజేశ్వరిని తరలించారు. కొడుకా అని కలవరిస్తూ... నాటి నుంచి రాజేశ్వరి తన కుమారుడి పేరును కలవరిస్తూనే ఉంది. వసతి గృహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, బృందం ఆమెకి సపర్యలు చేసేది. రాజేశ్వరి చివరి కోరికను తెలుసుకున్న సత్యనారాయణ విషయాన్ని శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రాజేశ్వరి కుమారుడు రాజశేఖర్ను సంప్రదించి తల్లి దీనావస్థను వివరిస్తే రావడానికి తనకు తీరిక లేదని ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సత్యనారాయణ, ఆయన బృందం రాజశేఖర్తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తాను సంగీత దర్శకత్వం చేస్తుంటానని, చాలా బిజీగా ఉంటానని తనకు మాటి మాటికీ ఫోన్లు చేయవద్దని విసుక్కున్నాడు. అప్పటికే రాజేశ్వరి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తిండి మానేసింది, మందులు తీసుకోవడానికి శరీరం కూడా సహకరించడం లేదు. అటువంటి నిస్సత్తువలో కూడా కొడుకు కోసమే పరితపించేది. కొడుకా కొడుకా అంటూ కలవరించేది. పోలీసుల వార్నింగ్ రాజశేఖర్ తన తల్లి స్థితిని కళ్లకు కట్టేలా వీడియోలు పంపి వివరించినా ఏ మాత్రం చలించలేదు. పైగా చెబుతున్న వారందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు సూచనలతో పోలీసులు రాజశేఖర్కి కాల్స్ చేశారు. వచ్చి తల్లికి కనిపించి వెళ్లకపోతే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్–2019 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మరో మార్గం లేక రాజశేఖర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఈ నెల 10వ తేదీన ఉదయం వచ్చాడు. అయితే కొడుకు రాకకోసం పరితపించి అతడు రావడానికి కొద్ది గంటల ముందే ప్రాణాలు విడిచింది. అత్యంత దయనీయం రాజేశ్వరి పరిస్థితి అత్యంత దయనీయం. కుమారుడు రాజశేఖర్ వ్యవహరించిన విధానం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. టూ టౌన్ పోలీసులు, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న చొరవ, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో చివరి రోజుల్లో కనీసం కూడు, గూడు అందాయి. పీడీ విజయకుమారి ఆధ్వర్యంలో వన్ స్టాప్ బృందం, బాధ్యత ఫౌండేషన్ సత్యనారాయణ బృందం రాజేశ్వరి చివరి క్షణాల వరకు కంటికి రెప్పలా కాచుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ కుమారుడు రాలేదు. – రంగనాథం శైలజ, అడ్మినిస్ట్రేటర్, వన్ స్టాప్ సెంటర్ తల్లి తనకేం ఇవ్వలేకపోయిందనే... తన తల్లి మెషీన్ కుడుతూ సంపాదించినది బంధువులకి పెట్టేస్తుందన్న భ్రమలో రాజశేఖర్ ఉండేవాడని నేను కార్పొరేటర్గా ఉన్న 36వ వార్డుకు చెందిన ప్రజల ద్వారా తెలిసింది. అంత డబ్బే ఆమె సంపాదిస్తే, అనాథలా కన్నుమూసేది కాదన్నది స్థానికుల అభిప్రాయం. కుమారుడిని చూడాలన్న ఆమె ఆఖరి కోరిక తీర్చేందుకు ఎంతో శ్రమించాం. ఎన్నోసార్లు కాల్ చేసి ఒక్కసారి వచ్చిపొమ్మని బతిమాలాం. ఆమె మరణించినా తర్వాత కార్యక్రమాలన్నీ మేమే చూసుకుంటామని చెప్పాం అయినా వినలేదు. – సాలగ్రామ లక్ష్మీప్రసన్న, మాజీ కార్పొరేటర్, 36వ వార్డు, కాకినాడ అంతిమ సంస్కారాలు మీరే చెయ్యండి రాజశేఖర్ వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి మండిపడ్డాడు. ఇంత మాత్రానికే తనను ఎందుకు ఇబ్బంది పెట్టారని విసుక్కున్నాడు. అంతిమ సంస్కారాలు కూడా మీరే చేసేయండని ఎంత కావాలన్నా ఇచ్చేస్తానని బేరాలాడాడు. శైలజ ఆమె బృందం చొరవ తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె చూడాలన్న ఆఖరి కోరిక ఎలాగో తీర్చలేదు, కనీసం తలకొరివి అయినా పెట్టమని అడిగారు. సఖి వన్స్టాప్ సెంటర్, బాధ్యత ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు రాజశేఖర్ మాతృమూర్తి మృతదేహానికి తలకొరివి పెట్టాడు. అంతిమ సంస్కారాలు బలవంతంగా చేయించిన అధికారులు, ఫౌండేషన్ సభ్యులపై విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వదిలిపోయి 20 ఏళ్లు 20 ఏళ్ల క్రితం తల్లిని వదిలిపోయిన రాజశేఖర్ మళ్లీ తల్లిని ఒక్క రోజైనా చూడలేదు. రాజేశ్వరి కొడుకు వస్తాడని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో టైలరింగ్ చేసుకుంటూ తనని తాను పోషించుకునేది. వచ్చిన ఆ కొద్దిపాటి సంపాదన మందుల కోసం వెచ్చించేది. ఐదేళ్ల క్రితం అంటే ఆమె వయసు 65కి చేరాక అనారోగ్యానికి వయోభారం తోడవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరి రోజుల కొద్ది ఆహారం, ఔషధాలు లేక శుష్కించిపోయింది. ఆమె దయనీయ స్థితిని చూసి పొరుగు వారు చలించిపోయారు. వారంతా విషయాన్ని అప్పటి కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ చొరవ తీసుకొని వలసపాకలలో ఉన్న రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో రాజేశ్వరిని చేర్చారు. అక్కడికి వెళ్లాక కూడు,గూడులోటు లేకున్నా కొడుకు కోసం పరితపిస్తున్న మనోవేదన మాత్రం ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. తోటి వృద్ధులతో కొడుకు ఉండీ ఇలా అనాథలా బతుకుతున్నానని చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యేది. అలా అని ఎవరినీ తన కొడుకుని ఒక్క మాట కూడా అననిచ్చేది కాదు. 20 ఏళ్లుగా వదిలేశాడంటే వాడి పరిస్థితి పాపం ఎలా ఉందో అంటూ కొడుకు ఎన్నో కష్టాల్లో ఉన్నాడనే భ్రమలో ఆ మాతృమూర్తి బతుకీడ్చేది. -
రత్నగిరి జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2500 వ్రతాల నిర్వహణ ● ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేలాదిగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం కేటాయించవలసి వచ్చింది. స్వామివారి దర్శనానంతరం అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. వ్రతమండపాలు, ఆలయప్రాకారం మధ్యాహ్నం వరకు భక్తుల తో నిండిపోయాయి. స్వామివారిని 50 వేల మంది దర్శించగా, 2,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదా యం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తు లు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు ఆలయంలో ఉల్లాసంగా గడిపారు. ఘనంగా సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రాకారసేవ ప్రారంభించి రథసేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సూర్యనమస్కారాలు నిర్వహించారు. -
ఏడాదిలో యువెత
ఫ కూటమి ప్రభుత్వంలో నిండా మోసం ఫ విద్యార్థులకు అందని రీయింబర్స్మెంట్ ఫ నిరుద్యోగికి ఉపాధి లేదు.. భృతి అందదు ఫ నేడు వైఎస్సార్ సీపీ విద్యార్థి.. యువత పోరు ఫ అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా సాక్షి, అమలాపురం: చంద్రబాబు అంటే అంతే. నమ్మిన వారిని నిలువునా ముంచేస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే హామీలను మరిచిపోతారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కూడా అంతే.. చేసేది మూరెడు.. ప్రచారం బారెడు అన్నట్టు సాగిపోతోంది. ఏడాదిగా ఇటు విద్యార్థులు, అటు నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఇచ్చిన శ్రీతల్లికి వందనంశ్రీలో అర్హులకు కోత పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెన ఊసేలేదు. పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఇక నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగ, ఉపాధి కల్పించలేదు. పరిశ్రమల ఏర్పాటు.. కార్పొరేషన్ రుణాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ యువతను ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. ఏడాది పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసగించడంతో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం పూరించింది. సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద విద్యార్థి.. యువత పోరుకు సిద్ధమైంది. ఎక్కడి పనులు అక్కడే.. ఫ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి పూర్తి కావాల్సిన మనబడి మన భవిష్యత్తు రెండో దశ పనులు అక్కడివి అక్కడే అన్నట్లు ఉన్నాయి. మనబడి మన భవిష్యత్తు రెండో దశలో పాఠశాలల్లో నిరంతరం నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి సరఫరా, ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్, భవనాల మరమ్మతులు, గ్రీన్చాక్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశ పనుల్లో భాగంగా 772 పాఠశాలలను రూ.257 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలా చోట్ల సిమెంట్, ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయి. ఫ తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది లబ్ధిదారులకు భారీగా కోత పెట్టింది. జిల్లాలో 2.40 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, 1,70869 మందికి మాత్రమే తల్లికి వందనం పడింది. ఇంకా 63,191 మందికి సొమ్ము పడాలి. పలు నిబంధనల పేరుతో ఈ పథకాన్ని దూరం చేసింది. ఫ జిల్లాలో నాడు – నేడు రెండో దశలో 761 పాఠశాలలను అభివృద్ధి చేయాలి. ఇందుకు రూ.249 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, రూ.86 కోట్లు రివాల్వింగ్ ఫండ్, రూ.61 కోట్లు సీపీఎం (సెంట్రల్లీ ప్రొక్యూర్డ్ మెటీరియల్)కు మంజూరయ్యాయి. మొత్తం రూ.147 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రివాల్వింగ్ ఫండ్, సీపీఎం రూపేణా రూ.102 కోట్లు విడుదల కావాలి. 267 అదనపు తరగతి గదులకు 223 పనులు వివిధ దశల్లో ఉండగా, 25 ఏసీఆర్లు ప్రారంభించ లేదు. 19 ఏసీఆర్లు పూర్తయ్యాయి. అధిక సంఖ్యలో పాఠశాలలకు సిమెంట్ రావాల్సి ఉంది. ఫ పాఠశాలల్లో కొత్తగా 546 టాయిలెట్స్ నిర్మిస్తుండగా 278 వివిధ దశల్లో ఉన్నాయి. 267 చోట్ల పూర్తయ్యాయి. అలాగే 403 కిచెన్ షెడ్లు మంజూరు కాగా, 235 వివిధ దశల్లో ఉండగా, 167 పూర్తయ్యాయి. మేజర్, మైనర్ మరమ్మతులకు 1,012 పనులు మంజూరు కాగా 576 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 548 పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు మంజూరు చేయగా, 162 పాఠశాలల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఫ గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన కింద 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్)గా మార్చి 2024–25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. అలాగే వసతి దీవెన పథకం పేరును మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఎంటీఎఫ్)గా మార్చి రూ.1.39 కోట్లు మంజూరు చేశారు. తరువాత నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీనిపై ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఉన్న ఉద్యోగాలే పీకేశారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. రీయింబర్స్మెంట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా అందించలేదు. యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఈ ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలు పీకేశారు. వీటిపై నిరసన తెలిపేందుకు సోమవారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థి, యువత పోరు నిర్వహిస్తున్నాం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేస్తున్న ఈ ఆందోళనలో విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలి. –పిల్లి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు 22ఎఎంపీ05: అప్పులు చేసి ఫీజులు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన సొమ్ము సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పులు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి 2004కు ముందు చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టు వసతి, విద్యా దీవెన క్రమం తప్పకుండా అందించాలి. –మిండగుదిటి శిరీష్ నారాయణస్వామి, వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అన్నింటా దగా.. ఫ నిరుద్యోగ భృతిని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే అప్పట్లో ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ సూపర్ సిక్స్ పథకంలో దీనిని మళ్లీ ఓ హామీగా చేర్చింది. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం రెండోసారి మోసం చేసింది. జిల్లాలో సుమారు 20 వేల మంది నిరుద్యోగ యువత ఉంటోందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదిలో రూ.36 వేలు వేయాల్సి ఉంది. మొత్తం మీద ఏడాదిలో సుమారు రూ.72 కోట్లకు ఎగనామం పెట్టింది. ఫ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసివేసి పలువురిని నిరుద్యోగులుగా మార్చింది. వలంటీర్ వ్యవస్థను మొత్తం ఎత్తేసింది. జిల్లాలో పట్టణ, గ్రామ స్థాయిలో సుమారు 9,900 మందిని తొలగించింది. ఇంటింటా రేషన్ అందించే ఎండీయూ వ్యవస్థను నిలిపివేసింది. జిల్లాలో 370 వాహనాలు నిలిపివేయడంతో 740 మంది ఉపాధికి గండి కొట్టింది. ఫ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తొలి సంతకాల్లో ఒకటి మెగా డీఎస్పీ. తొలి సంతకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టింది. పరీక్షలైతే జరిగాయి. వెంటనే కొలువులు ఇస్తారనే నమ్మకం అభ్యర్థులకు కలగడం లేదు. ఫ జిల్లాలో ఎస్సీ, బీసీ, కాపు, ఇతర సామాజిక వర్గాలకు అడిగిన వారికి అడిగిన అన్ని రుణాలిస్తామన్నారు. దీని ద్వారా లబ్ధి పొందేది ఎక్కువగా యువతే. కూటమి నేతల మాటలు నమ్మి, స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి అన్ని కార్పొరేషన్ల నుంచి 120 యూనిట్లు కేటాయించారు. వీటి కోసం 1,500 నుంచి 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. -
ఉపాధ్యాయుల సర్దుపాట్లు
ఖాళీలను పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇలా.. అడ్డతీగల మండలంలో 19, అయినవిల్లి 10, అల్లవరం 19, అమలాపురం 1, అంబాజీపేట 6, అనపర్తి 1, ఆత్రేయపురం 11, బిక్కవోలు 4, చింతూరు 36, దేవీపట్నం 11, గండేపల్లి 24, గంగవరం 7, గొల్లప్రోలు 1, ఐ.పోలవరం 48, జగ్గంపేట 47, కె.గంగవరం 21, కాజులూరు 7, కపిలేశ్వరపురం 20, కాట్రేనికోన 101, కిర్లంపూడి 38, కొత్తపేట 28, కూనవరం 36, మలికిపురం 8, మామిడికుదురు 10, మండపేట 3, మారేడుమిల్లి 17, ముమ్మిడివరం 23, నెల్లిపాక 52, పి.గన్నవరం 38, పెద్దాపురం 1, ప్రత్తిపాడు 46, రాజవొమ్మంగి 5, రంపచోడవరం 22, రంగంపేట 22, రావులపాలెం 10, రాజోలు 1, రౌతులపూడి 9, సఖినేటిపల్లి 10, శంఖవరం 21, సీతానగరం 6, తాళ్లరేవు 4, తొండంగి 18, ఉప్పలగుప్తం 34, వీఆర్ పురం 42, వై.రామవరం 16, ఏలేశ్వరం మండలంలో 16 ఖాళీలు ఉన్నాయి. ఫ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా ఫ దూర ప్రాంతాలకు వెళ్లేది లేదని నిరసన రాయవరం: ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల (ఎంటీఎస్)తో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం కాకినాడలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించింది. అయితే తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 410 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ 199 మంది, 1998 డీఎస్సీ బ్యాచ్ 211 మంది ఉన్నారు. వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అక్కడ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లోనే ఖాళీలు ఏర్పడాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలకు దూరంగా 100 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని వారు వ్యతిరేకిస్తున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 70 శాతం మంది ఉపాధ్యాయులు రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వారి డిమాండ్లు ఇవీ.. కేవలం రూ.32 వేలతో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేయాలి. ప్రతి మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలి. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాసాలకు 200 కి.మీ దూరంలో ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఏ, డీఏ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు క్రియేట్ చేసి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాఠశాలల్లో వేకెన్సీలను కూడా చూపించాలి. 15 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. గతంలో విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నియర్ బై రెసిడెన్స్ అవకాశం కల్పించాలి. ● ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి జరగాల్సి ఉండగా, వీరి ఆందోళన, చర్చల నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు మొదలైంది. ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. -
అయినవిల్లి... భక్తులతో శోభిల్లి
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో శోభిల్లింది. తొలుత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 43 మంది, లక్ష్మీగణపతి హోమంలో 32 జంటలు, పంచామృతాభిషేకాల్లో ముగ్గురు జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఎనిమిది మందికి తులాభారం, ముగ్గురికి అన్నప్రాసన జరిగాయి. 33 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,51,790 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకటదుర్గ భవాని తెలిపారు. -
భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
అమలాపురం రూరల్: స్కూల్ పిల్లలతో ప్రయాణించే ఆటోలు కచ్చితంగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆటోల్లో స్కూల్ పిల్లలను అధికంగా ఎక్కించినా, లగేజీ పెట్టే స్థానంలో పిల్లలు, ప్రయాణికులను కూర్చోబెట్టినా మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపే సమయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ అంశాలపై త్వరలో పోలీస్, విద్యా శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రండి... ఒలింపిక్ రన్కు..
అమలాపురం టౌన్: అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రండి కలసి పరుగెడదామనే నినాదంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం ఒలింపిక్ రన్లు నిర్వహిస్తోంది. దీనిపై స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన తండ్రి దివంగత, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లను నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ఏడాది తన తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ జిల్లా ఒలింపిక్ రన్ స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటలకు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నుంచి రన్ను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒలింపిక్ టార్చ్ను వెలిగించి ప్రారంభిస్తారన్నారు. ఈ రన్ల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఽధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రన్లో అందజేయనున్న ఒలింపిక్ టీషర్టులను సాయిరాజ్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కట్టా పురుషోత్తం, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో కర్రంటోళ్లు...
అయోమయం.. గందరగోళం లోడ్ వెరిఫికేషన్తో ఆన్లైన్లో ఇలాంటి తాకీదులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది వినియోగదారులకు వస్తూండటంతో విషయం అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. జిల్లాలో గత మార్చి నుంచి ఈ నెల వరకూ దాదాపు 4,250 గృహ సర్వీసులకు అడిషనల్ లోడ్ పేరుతో వీడీఎస్ అమలు చేసినట్లు తెలిసింది. ఈ 4,250 సర్వీసుల నుంచి అదనపు లోడ్ చార్జీల కింద రూ.78 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. విద్యుత్ అధికారులు మాత్రం అడిషనల్ లోడ్కు చార్జీలు చెల్లించడం వల్ల వినియోగదారుకే మేలని చెప్పుకొస్తున్నారు. విద్యుత్ వినియోగం వివరాలను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు లోడ్పై విద్యుత్ కార్యాలయాల నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ డ్రైవ్లతో ఇళ్లకు వెళ్లి అదనపు లోడ్ చార్జీలు చెల్లించకపోతే ఫ్యూజ్ తొలగించాల్సి వస్తుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరి కొంతమంది వినియోగదారులకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే నేరుగా ఇళ్లకు వెళ్లి ఫ్యూజులు తొలగిస్తున్నారు. అమలాపురం టౌన్: నిత్య జీవితంలో విద్యుత్ ఓ భాగమైంది.. ఏ పనికై నా ఇది అత్యవసరమైంది.. అలాంటి విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజల నడ్డివిరిస్తోంది.. ప్రతి నెలా బిల్లులు చూసి షాక్కు గురవుతున్న కొంతమంది వినియోగదారులను అదనపు లోడ్ పేరుతో విద్యుత్ శాఖ బాదేస్తోంది. పలు గృహ సర్వీసులకు వలంటరీ డిస్కొజర్ స్కీమ్ (వీడీఎస్) అంటూ మళ్లీ వడ్డిస్తోంది. లోడ్ వెరిఫికేషన్ పేరుతో ఆన్లైన్ ద్వారా నమోదవుతున్న కేసుల్లో పెరిగిన విద్యుత్ లోడ్ ఆధారంగా కిలో వాట్కు ఇంత అని చార్జీల మోత మోగిస్తుంది. ఇప్పటికే లోడ్ పెరిగితే కొందరు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుని, విద్యుత్ శాఖ విధించే వీడీఎస్ను విధి లేక చెల్లిస్తున్నారు. ఇది కాకుండా స్పెషల్ డ్రైవ్ పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అదనపు లోడ్లపై విద్యుత్ శాఖ దాడులు నిర్వహిస్తుంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇంటి కనెక్షన్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పెరిగిన విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పుడు అదనపు లోడ్ పేరిట స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, కనెక్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో ఓ ఇంటి విద్యుత్ కనెక్షన్ను సిబ్బంది గత గురువారం తొలగించారు. విద్యుత్ వాడకానికి కిలోవాట్ల కేటగిరీల వారీగా అడిషనల్ లోడ్ చార్జీ విధిస్తున్నారు. ఇలా కిలో వాట్కు రూ.1,250 చెల్లించాల్సి వస్తోంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.600 వసూలు చేస్తున్నారు. ఇలా కిలోవాట్ల వారీగా చార్జీల భారం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జరిమానా లాంటిదే. దీనికే వీడీఎస్ అని పేరు పెట్టి ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే లోడ్ వెరిఫికేషన్లో ఏ వినియోగదారుడైనా కిలోవాట్ల గీత దాటితే వీడీఎస్ కింద రూ.1,250 చొప్పున చెల్లించాలని తాకీదు వస్తోంది. ఉదాహరణకు పి.గన్నవరం మండలానికి చెందిన ఓ వినియోగదారుడికి వీడీఎస్ కింద రూ.2,500 చెల్లించాలని తాకీదు ఇచ్చారు. సాయంత్రంలోగా రూ.2,500 చెల్లించకుంటే మర్నాడు సాయంత్రానికి రూ.4,500 చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదనపు లోడ్ పేరుతో బాదుడు వీడీఎస్ ద్వారా రూ.వేలల్లో చార్జీలు కిలోవాట్ల వారీగా విద్యుత్ శాఖ వడ్డింపు ఇబ్బంది పెట్టడం సరికాదు స్పెషల్ డ్రైవ్ పేరుతో విద్యుత్ సిబ్బంది ఒకేసారి ఇంటికి వచ్చి హడావుడి చేస్తున్నారు. దీంతో, ఇంట్లోని వారు అదేదో దాడిలా కంగారు పడుతున్నారు. నా ఇంటికి అదనపు లోడ్ వినియోగించామంటూ సిబ్బంది వచ్చి ఉన్నపళంగా విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఇది సరికాదు. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. కరెంట్ లేక రాత్రంతా ఇబ్బంది పడ్డాం. అడిషనల్ చార్జీల వసూళ్లకు ముందుగా నోటీసులిస్తే బాగుంటుంది. ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. – దూనబోయిన వెంకటేశ్వరరావు, వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం వసూలు చేసే పద్ధతి ఇది కాదు అదనపు లోడ్ చార్జీల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు అనుసరిస్తున్న విధానం సరికాదు. నోటీసులివ్వకుండా కనెక్షన్లు తొలగించడం, స్పెషల్ డ్రైవ్ల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, గడువులోగా చెల్లించకపోతే రూ.వేలల్లో జరిమానాల మాదిరిగా విధించి, ముక్కుపిండి మరీ వసూలు చేయడం వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. తొలుత హెచ్చరికలతో చెప్పాలి. అంతకీ మాట వినకపోతే చివరిగా నోటీసు ఇచ్చి కనెక్షన్ తొలగించాలి. – జీవీఎల్ఎన్ శర్మ, అధ్యక్షుడు, పట్టణ వినియోగదారుల సంఘం, అమలాపురం -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోరుకొండ/సీతానగరం: సీతానగరం మండలం రఘుదేవపురం పరిధిలోనిరొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన పేట్ల సుబ్రహ్మణ్యం (27) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సీతానగరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ కథనం ప్రకారం.. కోటి గ్రామానికి దగ్గరలోని రఘుదేవపురం పరిధిలో సురవరపు వెంకట అప్పారావు రొయ్యల చెరువు వద్ద పేట్ల సుబ్రహ్మణ్యం కొంతకాలంగా కూలీ నిమిత్తం పనిచేస్తున్నాడు. ఆదివారం చెరువు వద్ద బోరుకు విద్యుత్ సరఫరా రాకపోవడంతో అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద జంపర్ కట్టి, ఎడ్జీ ఫ్యూజ్ వేసే సందర్భంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. సహచరులు గమనించి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి నుంచి చెరువు వద్దకు వెళ్లిన సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు రోదిస్తున్నారు. మృతుడి తండ్రి శ్రీను వ్యవసాయ కూలీ. తండ్రికి చేదోడుగా ఉంటున్న సుబ్రహ్మణ్యం మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలి ● తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రాజమహేంద్రవరం రూరల్: ఆరోగ్యాంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్న తిరుమలరావు మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త ఉపశమనాన్ని పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేడు ఎంతోమంది యోగా చేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. యోగా టీచర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలను వేయించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి.. బస్సు కింద పడి
ఫ యువకుడి బలవన్మరణం కాకినాడ క్రైం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత పురుగు మందు తాగి, ఆపై బస్సు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ మహాలక్ష్మి నగర్లోని రణదీప్నగర్కు చెందిన కుప్పాల కోదండ రామచంద్రమూర్తి (30) బీచ్ రోడ్లో ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి వేట్లపాలేనికి చెందిన సిరితో రెండు నెలల కిందట వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రామచంద్రమూర్తి ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మార్గ మధ్యంలో పురుగు మందు కొని తాగాడు. టూ టౌన్ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనాన్ని ఉంచి తర్వాత బ్రిడ్జిపైకి వచ్చాడు. తర్వాత బస్టాండ్ నుంచి కోటిపల్లి వెళ్తున్న బస్సు కిందకు దూకాడు. బస్సు కొంతమేర లాక్కెళ్లిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని స్థానికులు కాకినాడ జీజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. -
సమాజానికి ఉపయోగపడేలా చదవాలి
● యండమూరి వీరేంద్రనాథ్ బోట్క్లబ్ (కాకినాడ): చదువుకోవడం గొప్పకాదని, అది సమాజం, పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. స్థానిక ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో కై ట్ కళాశాల ఆధ్వర్యంలో ఏపీ ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది ఇంజినీరింగ్ చదువుతున్నారని, ఉద్యోగం వచ్చిన మరుసటి రోజు నుంచి తల్లిదండ్రులను మరిచిపోయేలా వారి ప్రవర్తన ఉంటుందన్నారు. దీనివల్ల చదివిన చదువుకు అర్థం ఉండదని, రేపొద్దున్న ఇదే పరిస్థితి మనకూ వస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు సమాజ మిత్రులని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కై ట్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పోతుల విశ్వం అభినందనలు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
పిఠాపురం: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు బాల, బాలికలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీలో ఆదివారం ఎంపిక చేసినట్లు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. మొత్తం 100 మంది రాగా, ఇందులో 12 మంది బాలురు, 12 మంది బాలికలను పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 28, 29 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. తొలుత ఈ ఎంపిక పోటీలను ఉమ్మడి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ వియ్యపు రమణరాజు, సభ్యులు ఎమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, సోము గోవిందరాజు ప్రారంభించారు. న్యాయ నిర్ణేతలుగా సతీష్, పీడీ శేషుకుమారి, కె.నాగలింగేశ్వరరావు, సురేష్, కె.చిన్నబ్బాయి, పవన్ వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొరబాబు అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జాతీయ తైక్వాండో పోటీలకు తూర్పు క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరాఖండ్లో ఈ నెల 23 నుంచి 25 వరకూ జరిగే జాతీయ తైక్వాండో పోటీలకు 18 మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు పయనమయ్యారని తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు ఆదివారం తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో జరిగే పోటీలకు 11 మంది బాలికలు, ఏడుగురు బాలురు హాజరవుతున్నారన్నారు. వీరంతా ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారన్నారు. జాతీయస్థాయి పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులను డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, తైక్వాండో సంఘ కార్యదర్శి అర్జునరావు, కోచ్లు డీఎన్ సత్యనారాయణ, కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు అభినందించి, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
వాడపల్లికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకువద్దాం
● సిబ్బందికి ఈఓ చక్రధరరావు దిశానిర్దేశంకొత్తపేట: కోనసీమ తిరుపతిగా, రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలనే లక్ష్యానికి సిబ్బంది సహకారం అవసరమని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ఆదివారం దేవస్థానం కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. భక్తులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై సమీక్షించారు. ఈ విషయాల్లో సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. భక్తులు పూర్తి సంతృప్తిగా స్వామి దర్శనం చేసుకుని వెళ్లేలా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అందరూ చిత్తశుద్ధితో పనిచేద్దామని ఆయన అన్నారు. ఫ వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం వాస్తవ్యులు భీమా శ్రీధర్, శ్రీవల్లి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు. ఆలయంలో నిత్య పూజల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చన పూజలు జరిగాయి. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ తదితర సేవల దేవస్థానానికి రూ.6,58,733 ఆదాయం వచ్చింది. -
ఇదిగో సహకారం
● సంఘాల ప్రతినిధులకు నేటితో ముగియనున్న శిక్షణ ● జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ రాజానగరం: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు సాగు రుణాలను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్నాయి.. అయితే వివిధ రకాల పంటలకు కాలానుగుణంగా ఏ రకమైన ఎరువులను వాడాలనే పరిజ్ఞానం ఎరువులు పంపిణీ చేసే సిబ్బందికి అంతగా ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి, రైతులకు అందించే ఎరువులపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ప్రతినిధులకు ‘సమగ్ర పోషక యాజమాన్యం’పై రాజానగరం మండలం దివాన్చెరువులోని జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో 14 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది సోమవారంతో ముగియనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 15 వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చెందిన 30 మంది ప్రతినిధులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఏ ఏ అంశాలంటే.. సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్సులో భాగంగా 15 రోజులపాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నేలలు – రకాలు, వాటిని సారవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, సమస్యాత్మక భూముల సవరణ, మట్టి నమూనాల సేకరణ, పరీక్షలు, జీవన ఎరువులు, ఎరువుల వాడకం, స్థూల, సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడం, పంటలో పోషక లోపంతో కలిగే నష్టాలు, వాటిని గుర్తించే విధానం – నివారణ, భూసారం పెంపునకు సమర్థ ఎరువుల వినియోగంపై వివరిస్తున్నారు. అలాగే సూక్ష్మజీవులకు సంబంధించిన జీవన ఎరువులు – విశిష్టత, పంట మార్పిడితో ప్రయోజనాలు, వంటి వివిధ అంశాలపై ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చల్లా వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పీవీ రమేష్లతోపాటు రాజమహేంద్రవరంలోని వ్యవసాయ కళాశాలలోని వివిధ విభాగాల అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి, వివిధ రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. -
అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కలశం పార్కు వద్ద ఓ అనాథ మృతి చెందాడు. దీనిపై స్థానికులు స్పందించి పట్టణ పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి మృతి చెందిన ఆ అనాథ మృతదేహాన్ని శనివారం ఉదయం అక్కడి నుంచి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. స్థానిక శ్మశాన వాటికలో ఆ మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ నాయకుడు దొంగ చిన్నా, జనసేన నాయకురాలు కొప్పుల నాగమానస స్పందించి సమాచారాన్ని పోలీసులు, మున్సిపాలిటీకి అందించారు. వ్యక్తి దుర్మరణంమామిడికుదురు: మాకనపాలెం గ్రామంలోని ఆర్అండ్బీ రహదారిపై శనివారం ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మామిడికుదురు శివారు గాలిదేవరపాలేనికి చెందిన బొడ్డపల్లి సత్యనారాయణ (45) సైకిల్పై ఈదరాడ వైపు వెళ్తుండగా, అదే మార్గంలో వెళ్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో సత్యనారాయణ మృత్యువాడ పడ్డాడు. సత్యనారాయణ వికలాంగుడు, అతను అవివాహితుడు. మృతుడి అన్నయ్య వీరాస్వామి ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
కొత్తపేట: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శనివారంతో పాటు ఏకాదశి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈఓ చక్రధరరావు క్యూలైన్లో భక్తులతో సాధారణ భక్తునిలా కలసిపోయి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. భక్తులతో పాటే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.60,17,180 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మైనింగ్ లీజులు రద్దు చేయాలి తుని: ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్కు ఇచ్చిన లీజులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు జక్కంపూడి రాజు డిమాండ్ చేశారు. శనివారం తునిలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని, శంఖవరం మండలం పెదమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ● భక్తజనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం ● ఒక్క రోజే రూ.60.17 లక్షల ఆదాయం -
మీ వ్యర్థాలు మీ ముందే..
మామిడికుదురు: గోగన్నమఠం గ్రామ ప్రధాన రహదారి పక్కన కోళ్ల వ్యర్థాలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. మగటపల్లి నుంచి గోగన్నమఠం వెళ్లాలంటే ఇక్కడ ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలోని కోళ్ల మాంసం దుకాణం యజమాని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కోళ్ల వ్యర్థాలు వేయవద్దని చెబుతున్నా వినకపోవడంతో శనివారం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అల్లు విజయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై వేసిన కోళ్ల వ్యర్థాలను మూటలు కట్టి పంచాయతీ రిక్షాపై చికెన్ షాపు వద్దకు తీసుకు వెళ్లారు. ఆ వ్యర్థాలన్నీ ఆ షాపు ముందే వేశారు. ఇక ముందు రోడ్డుపై కోళ్ల వ్యర్థాలు వేస్తే ఇదే పరిస్థితి పునరావృత్తం అవుతుందని గట్టిగా హెచ్చరించారు. చివరికి ఆ షాపు యజమాని దిగొచ్చి వ్యర్థాలను జనసంచారం లేని ప్రాంతంలో వేసేందుకు అంగీకరించడంతో సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది.● కోళ్ల వ్యర్థాలు తీసుకెళ్లి ఆ షాపు ముందే వేసి హెచ్చరిక ● అధికారుల వినూత్న నిర్ణయం -
లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి
బిక్కవోలు: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన పందలపాక శివారులో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడ భానుగుడి శ్రీరామ్నగర్ ప్రాంతానికి చెందిన గొల్ల మహంతి బాల వెంకటేష్ (29) పందలపాక సచివాలయం–2లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చారు. అక్కడ గ్రామస్తులతో కలసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిక్కవోలులో ఇంజినీరింగ్ కార్యాలయానికి బయలు దేరారు. తాను పనిచేస్తున్న సచివాలయం నుంచి కనీసం 400 మీటర్ల దూరంలో పందలపాక – ఊలపల్లి రోడ్డు వద్ద బిక్కవోలు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా కుడివైపు తిప్పి అతని బైక్ను కొట్టడంతో వెంకటేష్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆ లారీ వెంటనే అతని తలపై నుంచి వెళ్లిపోయింది. వెంకటేష్ తలకు హెల్మెట్ ఉన్నా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థలానికి భారీఎత్తున గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. ప్రమాద తీరును ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ పరిశీలించారు. మృతిదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించారు. మృతుడి భార్య కావ్యసత్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పందలపాకలో విషాదం ఐదేళ్లుగా సచివాలయ ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతూ, అందరితో సరదా ఉండే ఉద్యోగి ఇలా మృతి చెందడంతో స్థానికులు మదనపడుతున్నారు. తమ్ముడు అనే పిలిచే వ్యక్తి ఇలా అకాలంగా మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ బైక్ నడిపినా హెల్మెట్ వాడేవాడని, అందరినీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేవాడని, అలాంటి వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు, గ్రామస్తులు, మిత్రులు తమ్ముడు ఇక రాడంటూ ఆవేదన చెందుతున్నారు. తల్లిదండ్రులకు ఇతనే ఒక్కగానొక్క కుమారుడు. రెండేళ్ల కిందట దగ్గర బంధువని కావ్యసత్యశ్రీతో వివాహం జరిపించారు. కుటుంబానికి ఆసరా ఉంటాడని అనుకున్న కొడుకు ఇక లేకపోవడంతో తల్లిదండ్రులు, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన భర్త ఇకలేడని తెలిసి భార్య కావ్యసత్యశ్రీ బోరున విలపిస్తున్నారు. -
లక్ష్మీనరసింహస్వామి హుండీల ఆదాయం రూ.44,20,491
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామివారి దేవస్థానంలో శుక్రవారం అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులో స్వామివారికి రూ.44,20,491 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకూ 87 రోజులకు గాను పై ఆదాయం సమకూరింది. జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీల లెక్కింపు చేపట్టారు. మెయిన్ హుండీల ద్వారా రూ.42,44,077, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.19,824, అన్నదానం హుండీల ద్వారా రూ.1,56,590 ఆదాయం లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి ● లేదంటే రాజమహేంద్రవరంలో తిరగలేరు ● మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు ● మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని నరుకుతామంటూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోరు పారేసుకోవడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బుచ్చయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోరుకొండ మండలం కణుపూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన బుచ్చయ్యను మహిళలు తరిమేసిన ఘటనను గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెచ్చరిల్లుతున్న హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో దయనీయమైన స్థితిలోకి జారిపోయిందన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దాడులు, కేసులు, అరెస్టులతో భౌతికంగా వేధిస్తోందని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు కలసి గెలవడం పెద్ద విషయం కాదన్నారు. వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, జగన్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ప్రజలను భయపెట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ పర్యటనలకు తరలి వస్తున్న జనసమూహాన్ని టీడీపీ నాయకులు ఆపలేరన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబు ఆలోచనా విధానాన్నే కూటమి ఎమ్మెల్యేలు, నాయకు లు అనుసరించడం శోచనీయమన్నారు. సీనియర్ ఎ మ్మెల్యేగా చెప్పుకొంటున్న గోరంట్ల బుచ్చ య్య చౌదరి ఇంగితజ్ఞానం మరచి, మాజీ సీఎం జగన్పై అన్న తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజమహేం ద్రవరంలో తిరగలేరని రాజా హెచ్చరించారు. జగన్ను భూస్థాపితం చేయడం ఎవ్వరి తరమూ కాదు కాకినాడ రూరల్: ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూస్థాపితం చేయడం ఎవ్వరి తరమూ కాదని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తాము అభిమానించే నాయకుడిని కలుసుకోవడం కూడా తప్పే అన్నట్లు చిత్రీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిచారు. జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు, తల నరికేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదంటూ గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల ద్వారానే ఎన్టీఆర్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నించారని, అది సాధ్యం కాదని గ్రహించి, నేడు అధికారం కాపాడుకునేందుకు ఆయన విగ్రహాలను పూజిస్తున్నారని అన్నారు. నాయకుడిగా ఎదగకూడదనే దురుద్దేశంతో వంగవీటి మోహన్రంగాను భూస్థాపితం చేశారని ఆరోపించారు. గోరంట్ల, అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించి, తమ నాయకుడు జగన్కు రక్షణ కల్పించాలని నాగమణి విజ్ఞప్తి చేశారు. -
యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు
అమలాపురం రూరల్: విశాఖపట్నంలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమం కోసం ఆర్టీసీ బస్సులను తరలించడంతో కోనసీమలో నాలుగు ఆర్టీసీ డిపోల పరిధిలోని బస్టాండుల్లో బస్సులు లేక శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను దాదాపుగా రద్దు చేశారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడక తప్పలేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమానికి కోనసీమ జిల్లా నుంచి 160 ఆర్టీసి బస్సులు విశాఖకు తరలి వెళ్లాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ఈ బస్సులు వెళ్లాయి. అమలాపురం డిపో నుంచి 58, రావులపాలెం నుంచి 41, రామచంద్రపురం నుంచి 40, రాజోలు నుంచి 20 బస్సులు పంపించినట్లు జిల్లా రవాణా అధికారి రాఘవకుమార్ తెలిపారు. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. 58 బస్సులు యోగాంధ్ర వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజమహేంద్రవరం, కాకినాడ రూట్లలో 15 నిమషాలకు ఒక బస్సు తిరిగేది. బస్సులు తగ్గించడంతో 45 నిమిషాలకు ఒకటి చొప్పున నడపడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ, విశాఖపట్నం రూట్లు, పల్లె వెలుగు బస్సులు కొన్ని రూట్లలో రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయివేట్ వాహనాల్లో వెళ్లారు. పాఠశాలు, కళాశాలలకు సెలవు ఆర్టీసీ బస్సులతో పాటు జిల్లాల్లో జిల్లాలో సమారు 300 ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులు యోగాంధ్రకు వినియోగించడంతో పాఠశాలలు, కళాశాలలకు గురువారం నుంచి మూడురోజులు సెలవులు ప్రకటించారు. యోగా పేరుతో సెలవు ఇవ్వడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పు పడుతున్నారు. -
ఆధ్యాత్మికతకు ధర్మ పరిక్రమణ యాత్ర
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులుఆలమూరు: హిందూ ధర్మ పరిరక్షణ, మత వ్యాప్తి కోసం ధర్మ పరిక్రమణ యాత్రను చేపట్టి గ్రామీణ, తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు తీవ్రంగా కృషి చేస్తోందని ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి విద్వాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ఆలమూరు మండలంలోని జొన్నాడలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీపురంధరదాసు సంకీర్తనల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేద ఉపనిషత్ పురాణాల సారాంశాన్ని రంగరించి సుమారు 4.70 లక్షల శ్రీపురంధరదాసు సంకీర్తనలను రచించామన్నారు. ఈ కీర్తనలన్నీ కన్నడ భాషలో ఉండడం వల్ల అందులో ఉన్న సారాన్ని తెలుగు వారికి అర్థమయ్యే విధంగా తర్జమా చేయించామన్నారు. ఆ కీర్తనలు ఆలపించే విధానాన్ని భజన మండలి సభ్యులకు నేర్పడానికి ఏటా మహిళ భక్త బృంద సభ్యులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లో భాగంగా కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం 4,862 భజన మండళ్లు ఉండగా అందులో 8,694 మంది మహిళా సభ్యులు ఉన్నారన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లోనున్న హరే శ్రీనివాస భక్తభజన మండళ్ల సభ్యులందరూ సంకీర్తన యజ్ఞంతో పాటు కోలాటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. దాస సాహిత్య ప్రాజెక్టు విస్తరణకు, నిర్వహణకు టీటీడీ రూ.2.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. హిందుత్వం వైపు ఆకర్షితులను చేస్తాం గిరిజనులు, దళితులు దాస సాహిత్య ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబర్చి హిందూత్వం వైపు అకర్షించేలా ఈ ధర్మ పరిక్రమణ యాత్ర దోహదపడుతుందన్నారు. మత మార్పిడుల నివారణకు టీటీడీ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. హిందుత్వానికి ఉన్న వైభవాన్ని వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15వ తేదీన ధర్మ పరిక్రమణ యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో హరే శ్రీనివాస భజన మండళ్ల ఏర్పాటులో, నిర్వహణలో ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్వాహకులు ముకుంద స్వామి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. -
ఆస్ట్రోనాట్ జాహ్నవికి సత్కారం
అమలాపురం టౌన్: త్వరలో అంతరిక్షంలోకి వెళ్లబోతున్న ఆస్ట్రోనాట్ దంగేట జాహ్నవి శుక్రవారం అమలాపురం వచ్చింది. గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఆమె పట్టణానికి వచ్చి ఇక్కడి మేధావులు, విద్యావేత్తలతో కొద్దిసేపు మాట్లాడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జహ్నవి దేశం తరఫున తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న మహిళగా చరిత్రకెక్కనుందని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ అన్నారు. జాహ్నవి మాట్లాడుతూ తాను 2029 ఆస్టోనాట్ టైటాన్స్ స్పేస్ ఇనాగ్యురల్ ఆర్బిటాల్ మిషన్కు ఎంపికయ్యాయని చెప్పింది. అనంతరం ట్రస్ట్ తరఫున జాహ్నవిని సత్కరించారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త గారపాటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన గైడెన్స్లో చదివిన జాహ్నవి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత స్పేస్ శాస్త్రవేత్త పెద్దిరెడ్డి సత్యనారాయణ, కుడుపూడి శాంతి భూషణ్ పాల్గొన్నారు. -
భృతివిద్యాకోర్సులు!
●● ఉపాధికి భరోసా.. భవితపై ఆశ ● ఆర్థిక స్తోమత లేనివారిని ఆదుకుంటున్న వైనం ● ఈ నెల 30 వరకూ తొలి దశ ఆడ్మిషన్లకు గడువు కొత్తపేట: పదో తరగతి తరువాత ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ చదవాలని ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఆ కోర్సులలో చేరాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్తోమత, కుటుంబ నేపథ్యం వంటి కారణాలతో సతమతమవుతుంటారు. అటువంటి విద్యార్థుల కోసం 1985లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్లో ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు ప్రవేశపెట్టింది. ఇవి పూర్తిచేసిన విద్యార్థులకు వివిధ జాబ్మేళాలు, అప్రెంటిస్ మేళాల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తొందరగా లభిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జనరల్ సబ్జెక్టులతో పాటు ఈ కోర్సులను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఒకేషనల్ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్ ఇస్తున్నారు. గేమ్స్, ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్కు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు సర్టిఫికెట్తో పాటు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫికెట్ ఇస్తుంది. జూనియర్ కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఇంటర్లో చేరేందుకు మొదటి దశ ప్రవేశాలకు ఈ నెల 30 వరకూ అవకాశం ఉంది. ఇంకా ఔత్సాహికులు ఉన్నా ఆ తరువాత కూడా జాయిన్ చేసుకుంటారు. ఏ కోర్సుతో ఏ ప్రయోజనాలంటే.. ఏ అండ్ టీ (అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్) అక్కౌంట్స్, ఆదాయ పన్ను సంబంధిత అంశాల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవగాహన పెంచుకోవచ్చు. దీనివల్ల సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. విద్యార్థి స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది. సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కోర్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. కంప్యూటర్కు సంబంధించిన అన్ని అవసరాలనూ తీర్చేలా విద్యార్థి తన కా ళ్లపై తాను నిలబడేలా తోడ్పడుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి కూడా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్) విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాథమిక, మాధ్యమిక అవగాహన అందిస్తారు. ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానికంగా గృహ, వాణిజ్య పరమైన నిర్మాణాల్లో వైరింగ్ వర్క్లో రాణిస్తూ జీవితంలో స్థిరపడవచ్చు. ఎం అండ్ ఏఎంటీ (మెకానికల్ అండ్ ఆటోమొబైల్ టెక్నీషియన్) వాహనాలు, యంత్రాల పని విధానంపై అవగాహన కల్పిస్తారు. ఇది చదివిన వారు స్వయం ఉపాధి పొందవచ్చు. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య చదవవచ్చు. వివిధ ఆటోమొబైల్ కంపెనీల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) వివిధ రకాల రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలనూ అందిస్తారు. పెద్దాసుపత్రులు, మెడికల్ ల్యాబొరేటరీలలో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. లేదా సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. ఎంపీహెచ్ఎబ్ల్యూ–ఎఫ్ (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు) ఈ కోర్సు అనంతరం ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా ఉద్యోగాలు పాందవచ్చు. ఇవికాక ఆఫీస్ అసిస్టెంట్ షిప్ (ఓఏ), సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ (సీఈటీ), లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ (ఎల్ఎంఅండ్ డీ), క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ (సీపీఅండ్ఎం), ఫిజియోథెరపీ (పీటీ), కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సీజీఏ) తదితర వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి వృత్తి విద్యా కోర్సుకు 40 సీట్లు ఉంటాయి. విద్యార్థులు ఆసక్తి చూపితే సీట్ల సంఖ్యను 60 వరకూ పెంచే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 38 ప్రైవేటు కాలేజీల్లో 5,500 ఒకేషనల్ సీట్లు ఉన్నాయి. ప్రతి కళాశాలలో పారామెడికల్ కోర్సుకు 30, ఇతర కోర్సులకు 40 చొప్పున సీట్లు కేటాయించారు. జిల్లాలో ఇలా.. కళాశాల కోర్సుల సంఖ్య సీట్లు కొత్తపేట 6 240 రావులపాలెం 2 80 రామచంద్రపురం 4 160 మండపేట 1 40 అమలాపురం 1 40 మలికిపురం (ఎయిడెడ్) 2 120 మొత్తం 680ఆర్థిక భారం లేకుండా.. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ (ఇంగ్లిషు, తెలుగు మీడి యం) హెచ్ఈసీ (తెలుగు మీడియం) జనరల్ కోర్సులతో పాటు ఆరు ఒకేషనల్ కోర్సులు అందు బాటులో ఉన్నాయి. ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. – యాళ్ల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట పేద విద్యార్థులకు వరం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సులు ఒక వరం. రెండేళ్లు కష్టపడి చదివితే ఉపాధి పొందే మార్గాలు అనేకం లభిస్తాయి. పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి, చదువుకోలేని విద్యార్థులు ఈ కోర్సులు అభ్యసించి, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు. – తనికెళ్ల వీఆర్ఎస్కేఎస్ శాస్త్రి, అధ్యాపకుడు, సీఎస్ఈ విభాగం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట -
ఇసుకాయస్వాహా!
సాక్షి, అమలాపురం: గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. వర్షాలు, వరదల సీజన్ మొదలు కావడంతో అధికారిక ఇసుక ర్యాంపులలో తవ్వకాలు నిలిపివేయడం, స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక లభ్యత తక్కువగా ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. వర్షాలు లేకపోవడంతో ఇసుకకు నెలకొన్న డిమాండ్కు తోడు.. ర్యాంపులోకి వెళ్లే దారులకు ఇబ్బందులు లేకపోవడంతో అక్రమార్కులు బరి తెగించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి నదీపాయల్లో ఇసుక దందా జోరందుకుంది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీపాయాల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలో ర్యాంపులు ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఇసుక దందా ఆగలేదు. ఇప్పుడు ర్యాంపులు మూతపడడంతో మరింత చెలరేగిపోతున్నారు. అనువుగా ఉన్నచోట గుర్తించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు పడితే మట్టి తవ్వకాలు జరిగే అవకాశం లేదు. పైగా ర్యాంపులు వేసి ఇసుక, మట్టి తవ్వకాలు చేయలేరు. వర్షాలు లేక వాతావరణం కలిసి రావడం అక్రమార్కులకు వరంగా మారింది. పి.గన్నవరంలో మరింత దోపిడీ పి.గన్నవరం మండలంలో ఈ దోపిడీ మరింత పెరిగింది. కీలక ప్రజాప్రతినిధుల వత్తాసుతో అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక, మట్టి వంటి సహజ వనరుల దోపిడీ నిర్విఘ్నంగా సాగిపోతోంది. మండల పరిధిలోని ఊడిమూడి, మానేపల్లి, కందాలపాలెం ప్రాంతంలో లంక మట్టి, ఇసుక, తువ్వ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది సిండికేటుగా మారి ఇక్కడ అక్రమ దందా చేస్తున్నారు. అపరాధ రుసుము చెల్లించాలని వీరికి అధికారులు నోటీసులు జారీ చేసినా దందా మాత్రం ఆగడం లేదు. మండలంలో పెద కందాలపాలెం, ఎల్.గన్నవరం పరిధిలో యర్రంశెట్టివారిపాలెం లంక, ఊడిమూడిలంక, మానేపల్లిలో ఇసుక, మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బెల్లంపూడిలంకలో ఒక వారం రోజులు తవ్వకాలు చేశారు. స్థానికుల నుంచి ఒత్తిడి రావడంతో నిలిపివేశారు. నదీ గర్భంలో లోతుగా.. అక్రమ దందాకు తోడు నిబంధనలు తోసిరాజని నదీ గర్భంలో లోతున తవ్వకాలు చేయడం గమనార్హం. మీటరు నుంచి రెండు మీటర్ల లోతున తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల సమీప గ్రామాల ఉనికే ప్రమాదభరితంగా మారింది. వై.వి.పాలెం ఏటిగట్టు దిగువన, ఊడిమూడి తదితర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షాలు వస్తే సాధ్యం కాదన్న ఉద్దేశంతో తవ్వకాల్లో జోరు పెంచారు. ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తప్పదన్నట్టుగా అప్పుడప్పుడూ దాడులు చేసి జేసీబీలు, లారీలను సీజ్ చేస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. చీకటి పడితే చాలు అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వారు లెక్క చేయడం లేదు. దోపిడీ మరింత వేగంగా సాగిపోతోంది. అపరాధ రుసుము అంటూ అధికారుల హంగామా పి.గన్నవరంలో సాగుతున్న ఈ అక్రమ ఇసుక దందా సిండికేటుగా మారింది. ఒక మహిళా సర్పంచ్ భర్త, ఒక మండల స్థాయి నేత కుమారుడు, కూటమి పార్టీకి చెందిన నాయకులు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని ఇప్పుడు గుర్తించిన అధికారులు తవ్వకాలు చేస్తున్నవారి వద్ద నుంచి అపరాధ రుసుము రూ.2.31 కోట్లు వసూలు చేస్తామని చెబుతున్నారు. అయితే గనుల శాఖకు చెందిన అధికారులు గతంలోనూ ఇదే విధంగా అపరాధ రుసుము అంటూ హడావుడి చేసినా అక్రమార్కులు చెల్లించిన పాపాన పోలేదు. రాజోలుకు పాకింది గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఇప్పుడు పి.గన్నవరం నియోజకవర్గం దాటి రాజోలు నియోజకవర్గంలోనూ విస్తరించాయి. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం దిండిలో తవ్వకాలు మొదలయ్యాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. బ్యాక్ వాటర్ కారణంగా ఇక్కడ పడవల మీద ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న ఇసుక స్థానికంగా కన్నా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. పి.గన్నవరం మండలం బెల్లంపూడిలంక వద్ద మట్టి తవ్వకాలు (ఫైల్) మళ్లీ జోరందుకున్న దందా అధికారిక ర్యాంపుల్లో నిలిచిన తవ్వకాలు ఇదే అదనుగా అనధికార ర్యాంపులు పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో అక్రమ తవ్వకాలు అదనంగా రాజోలు, అయినవిల్లిలో కూడా.. ఒకవైపు అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ పరిశీలన... మరోవైపు ఆగని తవ్వకాలు -
రెవెన్యూ శాఖ తల్లి లాంటిది
అమలాపురం రూరల్: ప్రభుత్వ శాఖలన్నింటికీ రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని, దీనికి 45 రకాల ప్రభుత్వ శాఖలతో నిత్యం అనుబంధం ఉంటుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ దినోత్సవం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, 238 ఏళ్ల తర్వా త ఏపీలో రెవెన్యూ డే ప్రకటించారన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. విశిష్ట సేవలందించిన 44 మంది ఉద్యోగులకు, కమాండేషన్ ఽధ్రువపత్రాలు మెమెంటోలు అందజేశారు. 18 మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను సత్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి మాట్లాడుతూ రెవెన్యూ కేర్ పేరిట ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎస్డీజీ మమ్మీ, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, తహసీల్దార్లు, వికాస జిల్లా మేనేజర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా 68 కేసుల పరిష్కారం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా ఇప్పటి వరకు 68 కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కార్యాలయ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఉద్యోగ సంబంధిత కేసులు 16 , పాస్పోర్ట్ సంబంధిత కేసులు 3, విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడినవారి కేసులు 7 పరిష్కరించామన్నారు. నోడల్ అధికారి డీఆర్వో రాజకుమారి, కోఆర్డినేటర్ జి. రమేస్ పాల్గొన్నారు. -
గడువు దాటితే ముప్పు
● వంట గ్యాస్ సిలిండర్కు కాలపరిమితి ● గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి అంబాజీపేట: గ్యాస్ సిలిండర్తో పంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో... సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సిలిండర్కు కాల పరిమితి ఉంటుందని, దానిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడవు తేదీ ముగిసిన సిలిండర్ను వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతీ సిలిండర్పై గడువు తేదీ, కోడ్ విధానంలో మెటల్ ప్లేటుపై ముద్రిస్తాయి. సిలిండర్ను మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించాలి. ఇలా గుర్తించాలి.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఏ–25, బీ–25 అని ఉంటే ఆ సిలిండర్ 2025 మార్చి–జూన్కి గడువు ముగుస్తుందని అర్థం. 25 అంటే 2025 సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ‘ఏ’ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు ‘బి’ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ‘సీ’ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ‘డీ’ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాల్సి ఉంటుంది. సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేటుపై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని. గడువు తేదీ నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్పై ఉంటే దానిని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. సిలిండర్కు 10 ఏళ్ల గడువు.. సిలిండర్ తయారైనప్పటి నుంచి 10 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. వినియోగదారుల హక్కులు.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. -
‘దీవెన’ బకాయిలు విడుదల చేయండి
అమలాపురం రూరల్: ప్రైవేటు కళాశాల విద్యార్థులకు బకాయి పడిన వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జేసీ నిశాంతిలకు వారు వినతి పత్రాలు అందజేశారు. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి సంబంధించి మూడేసి టెర్మ్ల ఫీజులను ఇంతవరకు కళాశాలలకు జమ చేయలేదన్నారు. దీని వల్ల విద్యా సంస్థల మనుగడ కష్టంగా మారిందని వారు అవేదన వ్యక్తం చేశారు. కళాశాలల గుర్తింపు రెన్యువల్ విధానాన్ని ఐదేళ్లకు ఓసారి పెట్టాలని, సీట్ల భర్తీ విషయంలో మేనేజ్ మెంట్ కోటా తొలగించి కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదికవి నన్నయ్య యూనివర్సిటీ కళాశాల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కరాటం వీఆర్ఎన్ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఆకుల బాపన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మున్సిపల్ కమిషనర్పై బదిలీ వేటు కొవ్వూరు: స్థానిక మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న టి నాగేంద్ర కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గతంలో కమిషనర్పై ఓ మహిళ విషయంలో పలు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్కు బాధితులు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. -
కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు
పి.గన్నవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తాము తిరగబడితే తట్టుకోలేరని పీఏసీ సభ్యురాలు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ నూతన కార్యాలయ ముఖ ద్వారాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కార్యాలయ గదిని విజయలక్ష్మి, సమావేశ మందిరాన్ని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు బుధవారం ప్రారంభించారు. పార్టీ పతాకాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నవరపు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై నిత్యం వేధింపులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. 300 యూనిట్ల విద్యుత్ పేరుతో తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారని విజయలక్ష్మి, జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం: తోట ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తామని అన్నారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్పై అభిమానం తగ్గలేదన్నారు. నాయకులను జైలులో పెట్టగలరేమోగానీ ప్రజల గొంతు నొక్కలేరని అన్నారు. కోవిడ్లో రాష్ట ప్రజలకు జగన్ అందించిన సేవలను దేశమంతా ప్రశంసిందని తోట గుర్తు చేశారు. జగన్కు లభిస్తున్న ప్రజాభిమానికి భయపడిన కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనలకు అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. జగన్ను అధికారంలోకి తీసుకురావాలి: ఎమ్మెల్సీలు బొమ్మి, కుడుపూడి వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. రెడ్బుక్ రాజ్యాగంతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేస్తే.. కూటమి ప్రభుత్వానికి కోర్టులు అక్షింతలు వేశాయన్నారు. దేశంలో కులగణన జరగాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. బీసీ కులగణనపై మండల స్థాయిలో వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కుడుపూడి వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యాలయానికి షెడ్డు నిర్మించి ఇచ్చిన పార్టీ నాయకుడు యన్నాబత్తుల అనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఆయనను సత్కరించారు. రామచంద్రపురం, అమలాపురం కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకుడు పి.కె.రావు, మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, కుడుపూడి విద్యాసాగర్, విత్తనాల ఇంద్రశేఖర్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు కశిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, గూడపాటి రమాదేవి, మట్టా శైలజ, రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీకాంత్, మందపాటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు జగ్డిరెడ్డి హెచ్చరిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభం -
సబ్ ప్లాన్ నిధులు ఏంచేస్తున్నారు
మలికిపురం: కూటమి ప్రభుత్వం దళితులను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ను శాలువాతో సన్మానించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే 30 శాతం సబ్ప్లాన్ నిధులను దళితుల ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితుల ఓట్లు తమకు అక్కర్లేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రూ.26 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. అంతేకాక దళితులు, దళిత నాయకులుతో పాటు రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పలు నేరాలకు పాల్పడిన వ్యక్తులకు కూటమి ప్రభుత్వం నజరానాలు ఇస్తోందని. విజయనగరంలో రాముని విగ్రహం తల విరగ్గొట్టిన వ్యక్తికి ప్రభుత్వం సాయం చేయడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏడాది వ్యవధిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని గొల్లపల్లి పేర్కొన్నారు. పార్టీ నాయకులు పాటి శివకుమార్, కుసుమ చంద్రశేఖర్, తాడి సహదేవ్, నేత నాని, గుర్రం వెంకట నాగరాజు, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధిగా ‘తెన్నేటి’ రాజోలు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధిగా రాజోలుకు చెందిన తెన్నేటి కిశోర్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కిశోర్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎంతో బలంగా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయకత్వంలో రాబోయే కాలంలో పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు. హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తనను రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి సూర్యారావు -
23న ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ రన్లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ల ప్రతినిధులు, ఎంఎస్డీవోలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటా రని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు తెలిపారు. పట్టణంలోని దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ నుంచి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రన్ను ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు పర్యవేక్షణలో సంఘం ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ల సహకారంతో ఈ రన్ సాగనుంది. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్లకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. సమయం దగ్గర పడటంతో కళాశాలల యాజమాన్యాలు మరింత స్పీడ్ పెంచాయి. తమ కళాశాలల్లో చేరండంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నారు. కొంచెం పేరున్న కళాశాలల్లో చాలా వరకూ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచ్లలో సీట్లు లేవని తెలుస్తోంది. సీట్లు పొందడానికి సిఫారసులు సైతం చేసుకునే పనిలో విద్యార్థులు ఉన్నారు. మొత్తం మీద ఇంజినీరింగ్ ప్రవేశాలకు అప్పుడే విద్యార్థులు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 950 సీట్లతో పాటు 26 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 14,500 సీట్లు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఎంసెట్–2025 ఫలితాల్లో కాకినాడ జిల్లాలో 6,343, కోనసీమ జిల్లాలో 2,866, తూర్పుగోదావరి జిల్లాలో 6,011 మంది ఉత్తీర్ణత సాధించారు. దీన్ని బట్టి కౌన్సెలింగ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి అడ్మిషన్ లభిస్తుంది. సీట్లు దొరకవనే ప్రచారం ఎంసెట్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చనే ప్రచారం అప్పుడే జరుగుతోంది. సీటు విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని, ముందస్తుగా కొంత అడ్వాన్స్ ముట్టజెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి. మంచి కళాశాలలో సీట్లు దొరకవనే ప్రచారంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్ చేస్తుండడంతో చాలా వరకూ సీఎస్ఈ, దానికి అనుబంధంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్లకు డిమాండ్ ఏర్పడింది. కాకినాడ జిల్లాలో బాగా పేరొందిన ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సీటుకు డొనేషన్ రూ.10 లక్షల వరకూ ఇవ్వడానికి వెనకాడటం లేదంటే ఎంత డిమాండ్ ఉందో అర్థమౌతుంది. ఓ మోస్తరు కళాశాల అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తామని, సీటు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమై కోరుకున్న కళాశాలలో సీటు రాకపోతే.. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదని, ముందుగా యాజమాన్యాలతో మాట్లాడి ర్యాంకు వస్తే ఆ కోటాలో సీటు ఖరారు చేసుకోవచ్చని, లేకపోతే దాన్ని మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్నారై కోటాకు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి యాజమాన్యాలు ప్రస్తుతం సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. కన్వీనర్ కోటాకే ప్రభుత్వ సహాయం కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. బీటెక్లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ కోర్సు ఎంచుకుని కన్వీనర్ కోటాలో చేరవచ్చు. జేఎన్టీయూకే పరిధిలో 160 కళాశాలల్లో దాదాపు 25 నుంచి 30వేల సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కౌన్సెలింగ్లో పాల్గొనాలి. – డాక్టర్ వీవీ సుబ్బారావు, ఏపీ ఎంసెట్ కన్వీనర్ బీటెక్ సీట్లకు బేరసారాలు కౌన్సెలింగ్కు ముందే భర్తీకి చర్యలు కంప్యూటర్ సైన్స్కు విపరీతమైన డిమాండ్ కన్వీనర్ కోటా మేలంటున్న విద్యానిపుణులు -
కూనవరమే శాపం!
సాక్షి, అమలాపురం: కోనసీమ తీర ప్రాంతంలోని వరి ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సాగుకు మరో అవాంతరం ఏర్పడింది. ఏటా ముంపునకు భయపడి ఇక్కడి రైతులు సాగు వదిలేస్తున్న విషయం తెలిసిందే. కాని ఈసారి మరింత మంది సాగుకు దూరమయ్యే పరిస్థితిని సాగు, మురుగునీటి పారుదల శాఖ అధికారులు కల్పిస్తున్నారు. కాలువపై మరమ్మతులు, నిర్మాణాల పేరుతో నీరు ఆలస్యంగా వదలడం ద్వారా సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు సాగుకు అటంకాలు సృష్టిచారు. సముద్ర నీరు డ్రైన్లలోకి పారేలా చేసి మురుగు నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు తొలకరి సాగు అంటేనే భయపడేలా చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో కూనవరం, వాసాలతిప్ప, శంకరగుప్తం డ్రెయిన్ల నుంచి సముద్ర మొగ ద్వారా ముంపునీరు దిగాల్సి ఉంది. ఇదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. భారీ వర్షాల సమయంలో ఇవి మూసుకుపోవడం... తెరిస్తే ఉప్పునీరు పోటెత్తి చేలను, తోటలను ముంచెత్తడం పరిపాటిగా మారింది. కూనవరం మొగ సైతం ఇదే విధంగా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ముమ్మిడివరం, అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ మొగ ద్వారా సముద్రంలోకి దిగాలి. ఇప్పుడు వరి ఆయకట్టు తగ్గినా ఇంకా 25 వేల ఎకరాల సాగవుతోంది. మొగ తరచూ మూసుకు పోతున్న విషయం తెలిసిందే. దానికి ఇరువైపులా ఉన్న ఉప్పలగుప్తం, చిర్రయానాం, అల్లిపర్రల ద్వారా ముంపునీరు దిగేందుకు అక్రమ ఆక్వా చెరువులు సాగు అడ్డంకిగా మారింది. వందల ఎకరాలు ఏటా ముంపుబారిన పడి రైతులు నష్టపోతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో ఏటా ఖరీఫ్లో మూడు వేల ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాల్లో వరిసాగు వదిలేస్తున్నారు. ఇసుక తవ్వకాలతో తెరుచుకున్న మొగ కూనవరం మొగ ద్వారా ముంపునీరు సముద్రంలోకి దిగేందుకంటూ మురుగునీటి పారుదల శాఖ అధికారులు ఇటీవల డ్రెడ్జింగ్ నిర్వహించారు. మొగ వద్ద 600 మీటర్లు వదిలి మురుగునీటి కాలువలో సుమారు 2.50 కిలో మీటర్ల మేర డ్రెడ్జింగ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే అర కిలోమీటరు మేర కన్నా ఎక్కువగా ఉన్న మొగ ఇప్పుడు తెరుచుకోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది అధికార పార్టీ మద్దతుదారులు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయడం వల్ల మొగ తెరుచుకుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల మురుగునీటి కాలువలలో డ్రెడ్జింగ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, దీని వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా వర్షాలు లేని సమయంలో వేసవిలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ డ్రెడ్జింగ్ కోసం గత ఏడాది ఆగస్టులో డ్రెడ్జర్ను రప్పించారు. తవ్వకాలకు అనుమతి రాకపోవడంతో నెలల తరబడి ఇక్కడే ఉంచారు. అప్పట్లో తవ్వకాలు చేసినా గత ఏడాది ఖరీఫ్ పంట మునిగి పోకుండా ఉండేది. అప్పుడు చేయకపోవడం వల్ల వర్షాలకు చేలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. పైగా ముంపునీరు వీడకపోవడం వల్ల రబీ నారుమడులు వేసే అవకాశం లేకపోవడం.. సాగు ఆలస్యం కావడం.. ఆ ప్రభావం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి తగ్గడానికి కారణమైంది. ఇప్పుడు అవసరం లేని సమయంలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఎగదున్నుకు వస్తున్న సముద్ర నీరు కూనవరం కాలువ ద్వారా వేగంగా ఇతర డ్రెయిన్లలోకి వెళ్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మొగ నుంచి ఎగదన్నుతున్న సముద్రపు నీటి పోటు డ్రెయిన్లలోకి ఉప్పునీరు పంట కాలువలు, చానళ్లకూ చేరిక ఇదే కొనసాగితే ఖరీఫ్కు ముప్పు ఏటా మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాలు సాగుకు దూరం డ్రెడ్జింగ్ వల్ల నష్టమేనంటున్న రైతులు సీన్ రివర్స్ కూనవరం మొగ ద్వారా గత రెండు రోజులుగా సముద్ర నీరు మురుగునీటి కాలువ ద్వారా ఎగదన్నుతోంది. అధికారులు చేసిన డ్రెడ్జింగ్ లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. ప్రస్తుతం మురుగునీటి కాలువలోకి వస్తున్న నీటికి అడ్డుకట్ట వేయకుంటే ఇది పంట కాలువలు, పంట కాలువలకు అనుబంధంగా ఉండే ఛానళ్లు, పంట బోదెలలోకి కూడా వచ్చే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఇదే జరిగితే ఇక్కడ మొత్తం ఆయకట్టును సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. వేసవిలో అమలాపురం–చల్లపల్లి ప్రధాన పంట కాలువ ద్వారా చింతలపూడి లాకు (సమనస లాకు)ల వరకు ఉప్పునీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడు కూడా ఇదే జరిగితే కూనవరం డ్రెయిన్ పరిధిలో మొత్తం సాగు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది కాలువల మరమ్మతులు, వంతెనల నిర్మాణాల పేరుతో కాలువలకు గట్లు వేయడం వల్ల చేలకు ఇంకా సాగునీరు చేరలేదు. సాగు కాలం ఆలస్యమవుతున్నందున చాలా మంది రైతులు సాగు విరమణ ఆలోచనలలో ఉన్నారు. ఇప్పుడు మురుగునీరు దిగకపోవడానికి తోడు ఉప్పునీరు చొచ్చుకు వస్తుండడం చూసి సాగు చేసే ఆలోచనలో ఉన్న కొద్దిమంది రైతులూ భయపడుతున్నారు. వరి, కొబ్బరి రైతులకు అపార నష్టం ఇప్పటివరకు ముంపు సమస్యతో తొలకరి సాగు చేయడానికి మాత్రమే ఇబ్బంది పడే వాళ్లం. కూనవరం మేజర్ డ్రైన్ మొగను అధికారుల ప్రమేయం లేకుండా తెరవడంతో సముద్రం నుంచి ఉప్పునీరు డ్రైన్లలోకి చేరుతుంది. దీనితో కూనవరం మేజర్ డ్రైవింగ్ గుండా నీరు ప్రవహించి పిల్ల కాలువలు పంట కాలువల్లో సైతం ఉప్పునీరు చేరి పంట పొలాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో దాళ్వా సాగుకు సైతం ఉపయోగపడకుండా భూములు ఉప్పుగా మారి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపించి రైతుల సాగుకు సహకరించాలి. – మంచం బాలకృష్ణ, రైతు గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం -
పైసలిస్తేనే పోస్టింగ్!
రీ వెరిఫికేషన్ పూర్తి కాకినాడ క్రైం: సచివాలయం ఏఎన్ఎంల నుంచి ఎంపీహెచ్ఏఎఫ్లుగా పదోన్నతులు పొందిన అభ్యర్థుల కౌన్సిలింగ్ రీవెరిఫికేషన్ బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన 390 మందికి కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహంనాయక్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. తాజా ప్రక్రియలో ఇద్దరు అనర్హులను, గత ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బృందాన్ని మోసగించి పదోన్నతులు పొందిన ఇద్దరు సచివాలయ ఏఎన్ఎంలను గుర్తించారు. ఓ ఏఎన్ఎం వివాహితురాలు అయినప్పటికీ అవివాహిత హోదాలో బదిలీ ప్రయోజనం పొందింది. మరో ఏఎన్ఎం ప్రొహిబిషన్ డిక్లేర్ కాకపోయినా బదిలీలకు హాజరై తనకు అనుకూలమైన స్థానాన్ని పొందింది. వీరద్దరిని డీఎంహెచ్ఓ బుధవారం నాటి రీవెరిఫికేషన్లో గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా 388 మందికి నియామక పత్రాలు అందజేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతుల కౌన్సెలింగ్లో అవినీతి జాతర సాగుతోంది. కొందరి అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కాసులిస్తేనే పదోన్నతులు, కోరుకున్న కుర్చీలు దక్కుతున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. పదోన్నతుల బాగోతంలో లక్షలు చేతులు మారాయి. సాధారణంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు తలా ఇంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇటువంటివన్నీ ఉద్యోగులు సంతృప్తి కోసం సంతోషంగా ఇస్తుంటారు. ఏ శాఖలో అయినా ఇదేమీ కొత్త కూడా కాదు. ఎటొచ్చీ పదోన్నతులకు ఒక రేటు, కోరుకున్న సీటు కోసం మరొక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడటమే ఈ సారి సంబంఽధిత శాఖలో హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతులు కాకినాడ డీఎంహెచ్ఓ నోడల్ అధికారి వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 830 సబ్ సెంటర్లలో సుమారు 400 సబ్ సెంటర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం గత ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో భార్య, భర్తలు, వితంతువులు, పెళ్లికాని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 60 మందికి పోస్టింగులు ఇచ్చారు. 340 సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలుగా పదోన్నతి కోసం క్యూ కట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జరిపిన కౌన్సెలింగ్కు ముందుగానే ఆ శాఖలోని కొందరు చేతివాటం చూపించారు. ఇందుకోసం ఒక రేటు కూడా నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. పదోన్నతి పొందిన వారికి సీటు కేటాయించే సందర్భంలో సొమ్ములు గుంజారు. రూ.4000 నుంచి రూ.5000 వంతున వసూలు చేశారు. ఇలా రూ.20 లక్షలు వరకు ముడుపులు వసూలుచేశారు. ఇందులో వైద్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒకరికి 50 శాతం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే దిగువ స్థాయి వారు 20 శాతం, క్షేత్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే వారికి 30 శాతం వంతున వాటాలు వేసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి కాకినాడలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఎపిడిమిక్ విభాగంలో మరొకరు, ఏఎన్ఎం సంఘంలో ముగ్గురు కలిసి ఈ మొత్తం అవినీతి బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టి సొమ్ము చేసుకున్నారు. పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్లో పెట్టి సొమ్ములు ఇచ్చిన వారికి కోరుకున్న పోస్టింగ్లు కట్టబేట్టేశారు. ఇలా పోస్టింగ్లు అందుకున్న వారి నుంచి రూ.30 వేలు వంతున వసూలు చేసి మూటగట్టేసుకున్నారు. ఇలా మరో తొమ్మిది లక్షలు ముడుపులు మెక్కి పోస్టింగ్లు ఇచ్చేశారనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఇలా సొమ్ములు తీసుకున్న వ్యవహారంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యుల వ్యహారాలు పర్యవేక్షించే ఒకరు, పరిపాలనా విభాగంలో మరొకరు సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ లంచావతారాలతో విసుగెత్తిపోయిన ఐదుగురు ఏఎన్ఎంలు వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ రీ కౌన్సెలింగ్ జరపాలని ఆదేశాలు చేశారు. దీంతో బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేలకు వేలు సొమ్ములు ముట్టచెప్పి పోస్టింగులు పొందిన వారి పరిస్థితి రీ కౌన్సెలింగ్తో కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. సొమ్ములు ఇచ్చి కోరుకున్న పోస్టింగులు పొందిన వారి స్థానాలు తాజా కౌన్సెలింగ్లో మారిపోతున్నాయి. దీంతో గత ఆదివారం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని సదరు సూత్రధారులపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. సొమ్ములు తిరిగి ఎలా ఇవ్వగలుగుతామని, ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని బుజ్జగిస్తున్నారు. రీ కౌన్సెలింగ్ పూర్తయ్యి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్ పోస్టుకో రేటు నిర్ణయం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పలువురు ఏఎన్ఎంలు ఆయన ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ సొమ్ము తిరిగి ఇవ్వాలని మెక్కిన వారిపై ఒత్తిడి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయడ్డారు. వారిని స్థానికులు చికిత్స కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెళ్తున్న కారు దుద్దుకూరు వద్ద అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో జావీద్, ఆయాష్ గాయపడగా స్థానికులు హైవే అంబులెన్స్లో వారిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. -
యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు
రాజానగరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మెగా యోగ’ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీ ఉన్న ‘నన్నయ’లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదే స్థాయిలో 16,123 మంది హాజరు కావడంతో, దీనిని ఒక రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సి.కె. రాయుడు, తాతా వెంకట వరప్రసాద్లు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలు, క్యాంపస్ల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్సలోకి ఎక్కడంతో పాటు యూనివర్సిటీ చరిత్రలో ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు మేథో సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో అవసరమన్నారు. యోగాసనాలతో అబ్బురపరిచారు యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్పెట్లపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వేసిన యోగాసనాలు ఆబ్బురపరిచాయి. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రతినిధుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల నుంచి 16,123 మంది హాజరు -
సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి
కోటికేశవరంలో విషాదం కోరుకొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం, సీతపల్లివాగులో స్నానానికి దిగి కోరుకొండ మండలం కోటికేశవరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులు 15 మంది బుధవారం వాగులోకి స్నానాలకు దిగారు. వారిలో పీతల రాకేష్ (25), గుమ్మడి హర్ష (25) వాగు ప్రవాహ వేగానికి కాలు జారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వాగులోని రాళ్లకు వారు బలంగా ఢీకొని మృతి చెందారు. వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ ముడే సింధూ దివ్య, ఆమె భర్త ముడే కామేష్ ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలకు పంచనామా తదితర కార్యకలాపాలు నిర్వహించారు. ఇసుక తవ్వుతున్న ఏడు పడవల సీజ్ తనిఖీల్లో జిల్లా మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తాళ్లపూడి: స్థానిక డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఏడు పడవలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, టాస్క్ఫోర్స్ ఎస్సై ఆంజనేయులు తదితరులు సాధారణ తనిఖీల్లో భాగంగా బోట్స్మన్ సొసైటీ సభ్యులు గోదావరిలో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఏడు పడవలను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందని వారు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పడవలను సీజ్ చేశామని తెలిపారు. కాగా ఇసుక తవ్వకాలు చేపట్టిన పడవలు ఎవరివన్న విషయమై సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. -
వేతనాల ఆలస్యం రివాజే!
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 18వ తేదీ వచ్చినా ఈ నెల జీతాల బిల్లు సిద్ధం చేసిన దాఖలాలు లేకపోవడంతో దేవస్థానంలోని 349 మంది కార్మికులు మూడో నెలలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిల్లు తయారై ఆడిట్కు వెళ్లి పాసై వస్తే అప్పుడు చెక్కుపై ఈఓ సంతకం చేయడం, దానిని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు బదలాయించడం, ఆయన సదరు కార్మికుల అకౌంట్లలో జమచేయడం ఈ ప్రక్రియంతా కనీసం వారం రోజుల ప్రహసనం. అంటే 25వ తేదీ దాటితే తప్ప కార్మికులకు మే నెల జీతాలు పడని పరిస్థితి. గత రెండు నెలలూ ఆలస్యమే.. ఆలయంలో కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం రివాజైపోయింది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 30న, ఏప్రిల్ నెల జీతాలు మే 28న చెల్లించారు. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి, మే 26న ప్రచురితమైన ‘వీరి కష్టం తుడిచేవారేరీ’ కథనాలకు స్పందించి అధికారులు ఆ తేదీలకై నా వారి అకౌంట్లలో జమ చేయగలిగారు. ఇందులో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.లక్ష కోత పెట్టి రూ.58 లక్షలు విడుదల చేశారు. అయితే మొత్తం నిధులు వస్తేకానీ చెల్లించనని కాంట్రాక్టర్ చెప్పడంతో జూన్ ఒకటో తేదీకి కానీ జమ చేయలేదు. కాంట్రాక్టర్ వల్లే ఆలస్యం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ సకాలంలో పీఎఫ్ జమ చేయకపోవడం, బిల్లు అందచేయకపోవడం వల్లే జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందని అధికారులు పదే పదే చెప్తున్నారు. ఏజెన్సీకి స్థోమత లేకపోయినా.. హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లకు పైగా దేవస్థానంలో పారిశుధ్య విధులు నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెల పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థను కాంట్రాక్టుకు ఎంపిక చేసే వరకు విధులు కొనసాగించాలని అధికారులు కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కాంట్రాక్టు కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆ కాంట్రాక్టు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్ధకు 349 మందికి జీతాలు ఇచ్చే స్థోమత లేకపోయినా అధికారులు నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టుగా హడావిడిగా విధులు కట్టబెట్టారు. దీంతో ఆ సంస్థపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేని పరిస్థితిని అధికారులే కల్పించుకున్నారు. కానీ సకాలంలో జీతాలు అందక పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రత్నగిరిపై కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు వరుసగా మూడో నెలా ఆలస్యం సగం నెల దాటినా సిద్ధం కాని బిల్లు -
మరిడమ్మ జాతరకు పటిష్ట భద్రత
కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీహరిరాజు కరప: ఈనెల 25వ తేదీ నుంచి 40 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు అసౌక్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తునకు కరప ఎస్ఐ టి.సునీతతో చర్చించేందుకు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురంలో అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్యూలైన్లు, వివిధ శాఖల సమన్వయంపై ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తు బాలిక అదృశ్యం కేసుపై ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు డీఎస్పీని కలసి తమగోడు వినిపించారు. బాలికను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్న యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. కిడ్నాప్ కేసుతో పాటు, పోక్సో కేసు పెట్టాల్సి ఉంటుందని, ఎక్కడున్నా వెంటనే సమాచారం చెప్పాలని యువకుడి తండ్రికి డీఎస్పీ సూచించారు. ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. బాలిక అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాలిక వివరాల ముఖ్యమైన నగరాల్లోని పోలీసులకు పంపినట్టు ఆయన తెలిపారు. అనంతరం కరపలోని పురాతన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. అర్చకులు విలపర్తి శ్రీనివాస్, విలపర్తి సత్యకృష్ణ, పెద్దింటి గోపాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చారు. -
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఇద్దరు ఖైదీలు విడుదలయ్యారు. ఆ వివరాలను సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఖైదీలు విడుదల కాగా వారిలో రాజమహేంద్రవరం సెంట్రల్ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. వారిలో కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన కోనేటి సత్తిబాబు, గజ్జవరపు మురళీకృష్ణ ఉన్నారు. వీరు హత్య కేసులో జైలుకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 17 నాటికి అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇద్దరు ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం ఇచ్చి విడుదల చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్స్టేషన్లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చేనుకు చేప మందు
ప్రయోజనాలు ఇవే.. ● ఫిష్ అమినో యాసిడ్లో నత్రజని శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. ● స్వల్ప కాలిక పంటలైన కూరగాయలు, వరి, పప్పు దినుసులకు మొదటి 40 రోజులు చాలా కీలకమైనవి. వాటి పెరుగుదల పైన మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే యూరియా, డీఏపీ ఎరువుల కంటే ఎక్కువ బలాన్ని పంటకు ఇస్తుంది. ● 40 రోజుల తర్వాత పది రోజులకు ఒకసారి ఇతర ద్రవాలతో కలిపి దీనిని వాడుకోవచ్చు. దీనిని వాడడం వల్ల మొక్క ఆకులు బాగా పచ్చబడటం, కొమ్మలు బాగా రావటం, కాయ సైజు బాగా పెరగడం జరుగుతుంది. ● నత్రజనితో పాటు ఇతర పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె ఎక్కువ మొత్తంలో వస్తుంది. పిఠాపురం: సాధారణంగా ఉబ్బసానికి చేప మందు వేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేపలతో చేలకు మందు తయారు చేస్తున్నారు. దాన్నే ఫిష్ అమినో యాసిడ్ మీనామృతం అని పిలుస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలోని గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది అధిక మొత్తంలో మీనామృతం తయారీ చేపట్టారు. రోజుకు 300 లీటర్ల మీనామృతం తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. మీనామృతం తయారీఽ విధానాన్ని ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. మీనామృతం మీనామృతం తయారీకి చేపలు, బెల్లం, బొగ్గు, దేశీయ ఆవు మూత్రం అవసరమవుతుంది. ముందుగా చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేప లోపలి భాగాలను కూడా వినియోగించుకోవచ్చు. వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. ముందుగా కత్తిరించిన చేపలు ఎన్ని కేజీలున్నాయో తూకం వేసి సిద్ధం చేసుకోవాలి. అంతే మొత్తంలో బెల్లాన్ని దగ్గర పెట్టుకోవాలి. బెల్లాన్ని పొడిగా దంచుకోవాలి. 200 లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ములు తీసుకోవాలి. వాటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మీనామృతం కలపడానికి ఒక పెద్ద గిన్నె లేదా టబ్ అవసరం. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తయారీ విధానం పెద్ద గిన్నె లేదా టబ్లో 10 కేజీల చేపలు, 10 కేజీల బెల్లం, 100 గ్రాముల బొగ్గు పొడి, ఒక లీటర్ ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎన్ని కేజీల చేపలు ఉంటే అన్నిసార్లు కలుపుకొని డ్రమ్ములో వేసుకోవాలి. వీటిని కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి. తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే చేపలు ఎన్ని ఉన్నాయో అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా డ్రమ్ములు సిద్ధం చేసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి డ్రమ్ములో కలిపిన చేపలు వేసినప్పుడు 60 శాతం మాత్రమే నింపాలి. లేకపోతే రెండో రోజు పొంగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ము 60 శాతం నింపిన తరువాత దానిని కప్పేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ సంచితో మూతిని గట్టిగా కట్టాలి. దీన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో ఐదు నిమిషాల పాటు కర్రతో కలుపుతూ ఉండాలి. అనంతరం కర్రను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి, దానితో ద్రవాన్ని కలిపినప్పుడు పురుగులు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ద్రవాన్ని కలిపిన అనంతరం డ్రమ్ముకు కవర్ కట్టి వేయాలి. ఇలా 20 నుంచి 25 రోజులలో ద్రావణం తయారవుతుంది. సుమారు 20 రోజుల తర్వాత ద్రావణం నుంచి తాటి పండు వాసన వస్తుంది. అలా వాసన వస్తే ద్రావణం ఉపయోగించడానికి వీలుగా తయారైనట్లు గుర్తించాలి. ఉపయోగించే విధానం మొక్కలు నారుదశలో ఉన్నప్పుడు వంద లీటర్ల నీటికి 250 గ్రాముల ద్రావణం సరిపోతుంది. చిన్న మొక్కలైతే 500 గ్రాములు, పెద్దవైతే ఒక కేజీ వరకూ వాడుకోవచ్చు. స్ప్రే చేసినప్పుడు ఫలితం తొందరగా కనిపిస్తుంది. ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకూ ఉపయోగించుకోవాలి. ఈ ఫిష్ అమినో యాసిడ్ నీటిలో కలిపే ముందు ఒక కేజీ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో బాగా కలుపుకొని, ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో చేపలతో మీనామృతం తయారీ దుర్గాడలో ఖరీఫ్కు సిద్ధమవుతున్న ద్రావణం -
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చాగల్లు: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు – పంగిడి రహదారిలోని ఎస్.ముప్పవరం శివారులో ఇసుక ట్రాక్టర్ ఆగి ఉంది. దాన్ని పోలవరం నుంచి నిడదవోలు వెళుతున్న నిడదవోలు డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అలాగే బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ అయ్యి సమీపంలో ఇంటి గేటును ఢీకొని ట్రక్కు బొల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన జి.వీర వెంకట సత్యనారాయణతో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో వారిని మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు చేరవేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వేస్ట్ ఆయిల్ ప్యూరిఫై యూనిట్లో తనిఖీలు
కాకినాడ రూరల్: సర్పవరం ఆటోనగర్లో వేస్ట్ ఆయిల్ను ప్యూరిఫై చేసి సెకండ్ గ్రేడ్ ఆయిల్, గ్రేజ్ తయారు చేసే ఎస్ఏఎఫ్ పెట్రోలియం యూనిట్పై విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, విజిలెన్స్ సీఐలు, కాకినాడ సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ సప్లయి అధికారి ప్రసన్న లక్ష్మీదేవి, అర్బన్ టీపీ అనిల్ కుమార్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చైన్నె నుంచి ట్యాంకర్లో తీసుకువచ్చిన టర్పెన్టైన్ను గుర్తించారు. జీఎస్టీ బిల్లులు ఉన్నప్పటికి టర్పెన్టైన్లో పెట్రోలియం కంటెంట్ ఉండడంతో వాహనంతో సహా 25 వేల లీటర్ల సరుకు ఉన్నట్టు గుర్తించారు. టర్పెన్టైన్ ఉన్న వాహనంతో పాటు మరో ఖాళీ వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాలు, సరకు విలువ సుమారు రూ.75 లక్షలు అధికారులు తెలిపారు. -
‘నన్నయ’ రిజిస్ట్రార్గా సుధాకర్ పదవీ విరమణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టార్గా ఆచార్య జి.సుధాకర్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 నుంచి రిజిస్ట్రార్గా సుధాకర్ విశిష్ట సేవలందించారన్నారు. ‘నన్నయ’ యూనివర్సిటీ అభివృద్ధిలో ఒక రిజిస్ట్రార్గా భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని ఆచార్య సుధాకర్ పేర్కొన్నారు. కాగా.. సుధాకర్ ఇక నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో హ్యుమన్ జెనిటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలావుండగా ‘నన్నయ’ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా అకడమిక్ డీన్ ఆచార్య కేవీ స్వామిని నియమిస్తూ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయశాఖ ఆస్తులను పరిరక్షించాలి బోట్క్లబ్ (కాకినాడ): ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురైతే కోర్టులో కేసులు దాఖలు చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలోని ఆలయ, సత్రాలకు సంబంధించిన ఈవోలతో మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవదాయశాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా ఆలయ ఈఓ, సత్రాల ఈవోలపైనే ఉందన్నారు. నగరం పరిధిలో ఉన్న ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములు, ఖాళీ స్థలాలు అన్నీ ఆన్లైన్లో ఆయా సత్రాలు, ఆలయాల పేరున ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. భూములు ఏమైనా ఆక్రమణలో ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
కోనసీమ కళ .. పూరీలో భళా..
కొత్తపేట: కోనసీమకు చెందిన గరగనాట్యం, వీరనాట్యం కళాబృందాల ప్రదర్శనలకు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్ (జానపద జాతర)లో విశేష గుర్తింపు లభించింది. ఆ ఫెస్టివల్లో భాగంగా వెస్ట్ జోన్ కల్చరల్ ఉదయ్పూర్, సౌత్ జోన్ కల్చరల్ తంజావూరు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జానపద జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గరగ నాట్యం, వీరనాట్యం ప్రదర్శనలకు అవకాశం అభించింది. సోమవారం నిర్వహించిన ఆయా ప్రదర్శనల్లో ప్రసాద్తో పాటు 20 మంది ఆయా కళాబృందాలు తమ ప్రతిభను ప్రదర్శించి, నిర్వహకులను, ప్రముఖులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారులను ముఖ్యంగా టీమ్ లీడర్ ఏసు వెంకట ప్రసాద్.. ఒడిశా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపత్ర, తదితర ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ బృందాలను గుర్తించి దేశ, విదేశాల్లో అవకాశాలు కల్పి స్తున్న రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ సీఈఓ మల్లికార్జునరావుకు కళాబృందాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తొమ్మిది మందికి రిమాండ్
ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి తొమ్మిది మంది నిందితులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండు విధించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యర్ర కాలనీ సమీపంలో ఈ నెల 15వ తేదీ రాత్రి పెనికేరుకు చెందిన కె.రోహిత్, చింతలూరుకు చెందిన పి.తేజ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ సందర్భంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై 15 మంది నిందితులను గుర్తించి సోమవారం కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఐ.ప్రవీణ్ కుమార్ 15 రోజుల రిమాండు విధించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వెళ్లింది 31 మంది... వచ్చింది 50 మంది నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సెలింగ్ పూర్తి కాకినాడ క్రైం: సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీజీహెచ్లోని కమ్యూనిటీ హాల్లో వెబ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షించారు. జీజీహెచ్లో తొలి నుంచి 24 ఖాళీ స్టాఫ్ నర్సుల పోస్టులు ఉండగా, ఉన్న వారి నుంచి 31 మంది బదిలీ అయ్యారు. దీంతో మొత్తం 55 ఖాళీలు ఏర్పడ్డాయి. మంగళవారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది స్టాఫ్ నర్సులు కొత్తగా కాకినాడ జీజీహెచ్కు బదిలీ అయ్యారు. దీంతో సింహభాగం భర్తీ అయి, మరో ఐదు ఖాళీలు మిగిలాయి. అలాగే, జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్సులు 9 మంది బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. స్టాఫ్ నర్సులకు పదోన్నతులు వచ్చే వరకు ఈ స్థానాలు భర్తీ అయ్యే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేషన్ సీనియారిటీని అనుసరించి బదిలీ అయిన వీరంతా రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లారు. అలాగే నర్సింగ్ ట్యూటర్లలో ఓ పోస్టు రిటెన్షన్ అయి దరఖాస్తుదారు అదే స్థానంలో కొనసాగనున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీలో భర్తీ అయ్యింది. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం – రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి కొడకల వెంకట రమణ (30) అనే వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన కొడకల వెంకటరమణ అనపర్తి మండలం పి.రామచంద్రాపురం కోళ్లఫారంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో సోమ వారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నానికి రైలులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు కావడంతో 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం
అమలాపురం టౌన్: అమలాపురం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన తల్లీ పిల్లలను (కుమార్తె, కుమారుడు) విశాఖపట్నం మద్దెలపాలెంలో పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేకే కన్నబిడ్డలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న తల్లీపిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తక్షణమే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లో అదృశ్యమైన ఆ కుటుంబాన్ని వెతికి పట్టుకున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల నరేష్ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హారతి తన బిడ్డలతో తొలుత మామిడికుదురు మండలం లూటుకుర్రులోని తన పుట్టింటికి స్కూటీపై వెళ్లడం, అక్కడ నుంచి అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్కు వచ్చి సైకిల్ స్టాండ్లో స్కూటీని పెట్టి అదృశ్యమైనట్లు పోలీసులు ఆ రోజు రాత్రే గుర్తించారు. విశాఖపట్నం బస్సు ఎక్కి వెళ్లిన ఆమె తన బిడ్దలతో మద్దెలపాలెంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నట్లు అమలాపురం పోలీసుల విచారణలో తేలింది. వారిని విశాఖ నుంచి అమలాపురం తీసుకుని వచ్చి బంధువులకు అప్పగించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై కేఎం జోషి, కానిస్టేబుల్ రాయు డు శ్రీను, ఐటీ కోర్ విభాగం కానిస్టేబుల్ జాఫర్ సాంకేతికత ఆధారంగా తల్లీపిల్లలను గుర్తించారు. తల్లి వద్దకు క్షేమంగా చేరిన బాలిక కాకినాడ రూరల్: చీడిగ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక చల్లా సత్య పావని అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆ బాలికను మంగళవారం ఇంద్రపాలెం పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న సత్యపావని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు రాత్రి అదృశ్యం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సై వీరబాబు ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలించారు. ఆ బాలిక ముందుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి సామర్లకోట వచ్చి, చివరకు రామచంద్రపురంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఇంద్రపాలెం తీసుకువచ్చి విచారించగా తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు పావని చెప్పింది. దీంతో బాలిక, ఆమె తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, అనంతరం అప్పగించారు. కాగా.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తల్లీపిల్లల ఆచూకీ లభ్యం భర్త వేధింపులు భరించలేకే పారిపోయినట్టు వెల్లడి -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాలుమూరి సాగర్, కానూరు అగ్రహారానికి చెందిన కర్సినపు ప్రవీణ్ కుమార్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం, కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తగరపు వెంకట్, వర్దణపు మణి తదితరులు మూడు కిలోల గంజాయిని రవాణా చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరందరూ పెరవలిలోని హిందూ శ్మశానవాటిక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. అనుమానంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి దొరికింది. దానితో పాటు రెండు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తణుకు కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. గంజాయి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు కోరుకొండ: గంజాయి కేసులో ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను కోరుకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు కేజీల గంజాయిని కోరుకొండ మండలం అయ్యన్నగళ్లు వద్ద పంచుకుంటుండగా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆ సమయంలో ఐదుగురు దొరికారని, ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ పరారయ్యాడన్నారు. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన నరేష్ కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలిపారు. కాగా.. నరేష్ను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్సై కూన నాగరాజు, కానిస్టేబుల్ ఉదయ భాస్కర్, ప్రసాద్ అభినందించారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు పాల్గొన్నారు. -
ఖాతారు చేయని సర్కారు!
సాక్షి, అమలాపురం: ఖరీఫ్ ముంచుకొస్తోంది. ఒకవైపు వాతావరణం చల్లబడింది. ప్రభుత్వం డెల్టా కాలువలకు ఆలస్యంగానైనా నీరు విడుదల చేసింది. మరో వారం, పది రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ నారుమళ్లు మొదలు కానున్నాయి. పెట్టుబడులకు రైతు చేతిలో చిల్లి గవ్వలేకుండా పోయింది. రబీ ధాన్యం సొమ్ము కోసం ఆయకట్టు రైతులు రోజుల తరబడి ఎదురు తెన్నులు చూస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులను నీరుగారుస్తోంది. ‘‘రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తాము. ఇది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉంచినట్టుగా ధాన్యం సొమ్ముకు రోజుల తరబడి బకాయిలు ఉంచము’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ పలు సందర్భాలలో సెలవిచ్చారు. రబీ ధాన్యం కొన్న మొదట్లో అలాగే చెల్లించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కొనుగోలు పెరిగిన తరువాత కూటమి ప్రభుత్వం ముసుగు తొలగించింది. రోజుల తరబడి సొమ్ము చెల్లించకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. జిల్లాలో 1,64,854 ఎకరాల్లో రబీ సాగు జరగగా, 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆయా కేంద్రాలకు టార్గెట్లను కుదించింది. రైతుల వద్ద సగం ధాన్యం ఉన్నా సరే ఆయా కేంద్రాలలో టార్గెట్లు అయిపోయాయని కొనుగోలు నిలుపుదల చేశారు. దీనితో మిల్లర్లను, దళారులను ఆశ్రయించాల్సి రావడం, ఇదే అదనుగా కనీస మద్దతు ధర సాధారణ రకం బస్తా (75 కేజీలు) రూ.1,720 ఉండగా వారు రూ.1,400, రూ.1,500 చేసి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మండపేట, రాజోలు, అమలాపురం వంటి ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యంతో రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో ధాన్యం సేకరణ లక్ష్యం మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదు. కొనుగోలు లేదు... చెల్లింపు లేదు జిల్లాలో ఇప్పటి వరకు 2,69,375.360 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనిలో 499.840 మెట్రిక్ టన్నులు గ్రేడ్– ఏ రకం కాగా, 2,68,875.520 మెట్రిక్ టన్నులు సాధారణ రకం. మొత్తం ధాన్యం విలువ రూ.613.08 కోట్లు కాగా, ఇప్పటి వరకు రైతులకు రూ.364.43 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.248.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో రూ.246.94 కోట్లు బిల్లులు ఆమోదించి చెల్లింపుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. సాంకేతిక కారణాల వల్ల రూ.1.20 కోట్ల చెల్లింపులను బ్యాంకులు వెనక్కు పంపాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మే నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత మే నెలలో ఇదే సమయానికి రైతులకు ఉన్న ధాన్యం బకాయిలు రూ.167 కోట్లు ఉండగా సోమవారం నాటికి ఇది రూ.248.65 కోట్లకు పెరిగింది. ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో ధాన్యం సొమ్ము చెల్లించపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే రబీ కోతలకు పెద్ద ఎత్తున అప్పులు చేశామని వారు చెబుతున్నారు. ‘‘ధాన్యం షావుకార్లు, మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు చేస్తే మంచి ధర వస్తుందని భావించాము. అప్పులు చేసి నూర్పిడులు పూర్తి చేశాము. కాని 45 రోజులుగా సొమ్ము వేయడం లేదు. వచ్చే కొద్దిపాటి లాభం చేసిన అప్పులకు, చెల్లించే వడ్డీకి సరిపోతోంది’ అని రైతులు వాపోతున్నారు. గతంలో ఇన్ని రోజుల పాటు ధాన్యం సొమ్ము బకాయిలు ఉంచిన దాఖలాలు లేవని వారు చెబుతున్నారు. బ్యాంకుల అప్పులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పద్దులను ఓవర్ డ్యూలో పెడుతున్నారని, ముందు ముందు బ్యాంకు అప్పులు కూడా పుట్టవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సొమ్ము బకాయిలపై కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జూన్ మూడవ వారం వచ్చినా సొమ్ము ఇవ్వరా? జిల్లాలో ధాన్యం సొమ్ము చెల్లింపును మే 8వ తేదీ నుంచి నిలిపివేశారు. దీనివల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ పెట్టుబడులకు సైతం అప్పులు చేయాల్సి వస్తోంది. నూర్పిడులకు చేసిన అప్పులకు వడ్డీలే కట్టాలా? ఖరీఫ్ కోసం మరోసారి అప్పులు చేయాలా? అనే మీమాంస రైతులలో నెలకొంది. ప్రభుత్వం తక్షణం ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. – యాళ్ల బ్రహ్మానందం, అధ్యక్షుడు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి కె.గంగవరంలో ధాన్యం కొనుగోలు ధాన్యం అమ్మకాలు చేసి నెలన్నరకు పైగా.. నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు జిల్లాలో 2.69 మెట్రిక్ టన్నుల కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.613.08 కోట్లు రైతులకు చెల్లించింది రూ.364.43 కోట్లు ఇంకా చెల్లించాల్సింది రూ.248.65 కోట్లు ఖరీఫ్ పెట్టుబడులకు సొమ్ము లేదు రబీ అప్పులకు పెరుగుతున్న వడ్డీ ఓవర్ డ్యూలోకి పోతున్న బ్యాంకు ఖాతాలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన కోనసీమ రైతు పరిరక్షణ సమితి -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● రత్నగిరిపై సత్రాలకు ఎట్టకేలకు మరమ్మతులు ● రూ.1.20 కోట్లతో పనులు ● రెండు నెలల్లో పూర్తి అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ సత్రాల మరమ్మతులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి. రూ.1.20 కోట్లతో న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాల్లో ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఈఓ వీర్ల సుబ్బారావు పరిశీలించారు. ఆయా సత్రాల్లో చేపడుతున్న పనుల గురించి ఆయనకు ఈఈ వి.రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, టెండర్ షరతుల ప్రకారం ఈ మూడు సత్రాల్లో మరమ్మతులు పూర్తి చేయడానికి మూడు నెలల గడువుందని చెప్పారు. అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఈఓ ఆదేశించారన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూఢమి, దానికి తోడు ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు. అందువలన ఈ సమయంలో భక్తులు పెద్దగా రారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆలోగా సత్రాల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సగం గదుల్లో సమస్యలు దేవస్థానంలో హరిహర సదన్, శివసదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ, ప్రకాష్ సదన్, శ్రీ సీతారామ సత్రం, కొండ దిగువన సత్య నికేతన్ సత్రాలున్నాయి. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ గదులు 620 ఉన్నాయి. వీటిలో సుమారు 120 గదులు పాడై, అద్దెకిచ్చేందుకు ఏమాత్రం వీలుగా లేవు. మరో 150 గదుల్లో ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సరిగా లేవు. ప్రకాష్ సదన్ వంటి సత్రాల్లో బస చేసిన భక్తులు ఆ గదుల్లో ఉండలేక రాత్రికి రాత్రే ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి మరమ్మత్తులు చేయించాలని చాలా కాలం నుంచి భక్తులు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్రాల గదులకు మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించి, అంచనాలు రూపొందించారు. తొలుత రూ.40 లక్షలతో హరిహర సదన్ సత్రంలో గదులకు మరమ్మత్తులు పూర్తి చేసి, రంగులు వేయించారు. తరువాత న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాలకు మరమ్మత్తులు చేయించేయించాలని నిర్ణయించి, రూ.40 లక్షల చొప్పున అంచనాలు రూపొందించి, టెండర్లు ఖరారు చేశారు. ● ఓల్డ్ సెంటినరీ సత్రం: దీనిని నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఇందులో 48 గదులున్నాయి. పెళ్లి బృందాల వారు ఇక్కడ గదులు రిజర్వ్ చేసుకుని, సత్రం ఆవరణలో వివాహాలు చేసుకుంటారు. ఈ సత్రం గదులకు పెయింట్లు వేసి చాలా కాలమైంది. డోర్లు, కిటికీలు, వాటర్ పైప్లైన్లు, బాత్రూముల్లో ఫిట్టింగ్స్ పగిలిపోయాయి. నీరు లీకవుతూండటంతో డ్రైనేజీ పైప్లైన్లకు నాచు పట్టింది. కొన్నిచోట్ల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ● న్యూ సెంటినరీ సత్రం: సుమారు 28 ఏళ్ల కిందట నిర్మించిన ఈ సత్రంలో కూడా 48 గదులున్నాయి. వివాహాది శుభకార్యాలకు భక్తులు గదులు రిజర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఓల్డ్ సెంటినరీ సత్రం మాదిరిగానే సమస్యలున్నాయి. ● ప్రకాష్ సదన్ సత్రం: వీఐపీ సత్రంగా పేరొందిన ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. 86 గదులున్నాయి. గదికి రూ.వెయ్యి చొప్పున రోజుకు రూ.86 వేల మేర అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉండటం, దగ్గర్లోనే క్యాంటీన్, పార్కింగ్ సదుపాయాలుండటంతో ఈ సత్రంలో బస చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులోని పలు గదుల్లో కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. -
ఇంటర్ తరువాత కోర్సుల ఎంపికే కీలకం
● మూడు, నాలుగేళ్లు కష్టపడితే ఆనందమయ జీవితం ● సంప్రదాయ డిగ్రీ కోర్సులతోనూ ఉపాధి రాయవరం: ఇంటర్ తర్వాత ఏ కోర్సు చదవాలి! ఏ రంగంలో స్థిరపడాలనే సందేహాలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తుంటాయి. తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోకుండా విద్యార్థులు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో 9,246 మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన మరో ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందారు. వీరిలో 70 శాతం మేరకు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనా. ఇంటర్ తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు ఇవీ.. వైద్య విద్య ఇంటర్లో బైపీసీ చదివేవారు వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశముంది. నీట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్ సీటు లభిస్తుంది. వైద్య విద్య పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యులుగా స్థిరపడవచ్చు. సీఏతో సీఏ (చార్టర్ అకౌంటింగ్) మంచి ఉపాధినిచ్చే కోర్సు. ఇంటర్ తరువాత సీపీటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించి, ఐపీసీఏలో చేరవచ్చు. ఇది నాలుగున్నర సంవత్సరాల కోర్సు. కామర్స్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ను బీకామ్ ఆనర్స్ అని కూడా పిలుస్తారు. ఇంంటర్లో కామర్స్ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో బీకామ్ ప్రవేశానికి సీయుఈటీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, బీమా రంగాల్లో కెరీర్ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు బీకామ్ అకౌంటింగ్, టాక్సేషన్ తీసుకోవాలి. బీకామ్ కోర్సు పాఠ్యాంశాల్లో ఇండియన్ టాక్స్ సిస్టమ్, ఫైనాన్సియల్ అకౌంటింగ్, వాల్యూయాడెడ్ టాక్స్, సెంట్రల్ టాక్స్ ప్రొసీజర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్ ఉంటాయి. బీబీఏ, బీసీఏ, సీఏ, సీఎస్ తదితర వృత్తిపరమైన కోర్సులను చదవడానికి వీలుంది. డిగ్రీతో బోలెడు అవకాశాలు సీయూ సెట్ రాసి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం గల విశ్వవిద్యాలయాల్లో హ్యూమన్ సైన్సు కోర్సులు చదవచ్చు. మన రాష్ట్రంలో బీఏతో పాటు బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంది. బీఎస్సీ కంప్యూటర్ కోర్సుకు కూడా డిమాండ్ ఉంది. డిగ్రీ చదివే విద్యార్థులకు నైపుణ్యాల పెంపుపై వివిధ యూనివర్శిటీలు దృష్టి సారించాయి. ఇప్పుడిప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలలో డిగ్రీ చదివే విద్యార్థులు కూడా అవకాశాలు పొందుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునేవారు డీఈడీ పూర్తి చేసి అవకాశాలు పొందవచ్చు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐదేళ్ల కోర్సులకు చెందిన ప్రవేశ పరీక్షలు రాసి ఇంటర్ తరువాత న్యాయ విద్యను అభ్యసించవచ్చు. ఫార్మసీకి ప్రాధాన్యముంది ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫార్మసీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఏపీ ఈఏపీసెట్తో బి–ఫార్మసీ ప్రవేశాలు జరుగుతాయి. ఇది పూర్తి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, హాస్సిటల్ ఫార్మాసిస్టులుగా ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయం, ఉద్యానం ఏపీ ఈఏపీసెట్తోనే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ చదివే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల ఈ కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సింగ్తో స్వయం ఉపాధి ఇంటర్ బైపీసీ విద్యార్థులకు నర్సింగ్ చక్కని అవకాశం. ఈ కోర్సుతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్ తరువాత నాలుగేళ్ల కోర్సును ఎంపిక చేసుకుంటే మహిళలకు మంచి అవకాశాలు ఉంటాయి. రెండేళ్ల ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్తో ఉజ్వల భవిత పెయింటింగ్, శిల్పకళ, ప్రింట్ మేకింగ్, విజువల్ కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, ఆర్ట్ హిస్టరీ వంటి విభాగాల్లో శిక్షణ పొందడానికి ఫైన్ ఆర్ట్స్ కోర్సులు ఉపకరిస్తాయి. ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన అనంతరం విద్యార్థులు గ్యాలరీలు, మ్యూజియం, మీడియా సంస్థలు, విద్యారంగం తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. డిగ్రీ కోర్సులతో ఉపాధి ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సులతో ఉపాధి పొందడానికి వీలుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎంప్లాయిబిలిటీ కోర్సులు ప్రవేశ పెట్టారు. వీటికి డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటుగా, ఆక్వా కల్చర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను కలిపి డిగ్రీ చేసుకునే వెసులుబాటు ఉంది. – డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం ఇంజినీరింగ్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఏపీ ఈఏపీసెట్లో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధాన్యం అధికం. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఏఐ, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. ఐఐటీ, ఎన్ఐటీలో చేరి ఇంజినీరింగ్ చేస్తే డిగ్రీ పూర్తయ్యేలోగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వూల్లో ఆఫర్లు వస్తున్నాయి. -
తాళ్లరేవు సీహెచ్సీ సూపరింటెండెంట్ స్నేహలత సస్పెన్షన్
తాళ్లరేవు: స్థానిక సీహెచ్సీ సూపరింటెండెంట్ ఆర్.స్నేహలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తాడేపల్లి విజిలెన్స్ విభాగం డీఎస్హెచ్ నుంచి ఉత్తర్వులు ఆస్పత్రికి అందాయి. ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి రెండో కాన్పుగా జన్మించిన పసికందు మృతి చెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ స్నేహలత, స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని, వారిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో మాట్లాడి, విచారణ నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా అదేరోజు బాధ్యులైన నర్సులను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్ స్నేహలతను సోమవారం సస్పెండ్ చేశారు. ప్రసవానికి ముందు కేసును సరిగ్గా అనుసరించకపోవడం, రోగికి జ్వరం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, అటెండర్ల కాల్కు వెంటనే స్పందించకపోవడం, కేసు షీట్ను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!
ఖరీఫ్ ఆలస్యమైతే సాగుకు దూరం గత నెల చివరి వారంలో నైరుతి రాకముందే తొలకరి వర్షాలు జిల్లాలో కురిసాయి. నాలుగు రోజుల పాటు వర్షాలు పడడంతో ఖరీఫ్కు వరుణుడు శుభారంభం పలికినట్టు రైతులు ఆశించారు. తిరిగి నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరందితే రైతులు నారుమడులు వేసుకునేందుకు దుక్కులు ప్రారంభించేవారు. కాని కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులకు నారుమడులు పోసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది మరింత ఆలస్యమైతే రైతులు సాగు విరమించుకునే ప్రమాదం కూడా ఉంది. ముందస్తు సాగు చేయకపోతే మునిగిపోతాం డెల్టా శివారుల్లో... మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ముందస్తు సాగు చేయకుంటే చేలు ముంపు బారిన పడతాయి. ఈ కారణంగానే మా ఆయకట్టు రైతులు తొలి పంటకు దూరమవుతున్నారు. అటువంటిది ఇప్పటి వరకు కాలువలకు నీరు ఇవ్వకుంటే సాగు ముందుకు ఎలా సాగుతుంది. అధికారులు అర్థం చేసుకోవాలి. – బొక్కా శ్రీనివాస్, రైతు, అల్లవరం ● అసలు గడువు కన్నా ఆలస్యంగా నీటి విడుదల ● మధ్య డెల్టాలో శివారులకు చేరని వైనం ● ఇప్పటికీ ప్రధాన కాలువకు 700 క్యూసెక్కులే ● ఇంకా పంట కాలువల మీద ‘సాగుతూ...’నే ఉన్న పనులు ● పంట కాలువలు క్లోజ్ చేసింది ఏప్రిల్ 27న ● పనులకు అనుమతి వచ్చింది మే నెలాఖరున ● ఖరీఫ్కు పలువురు రైతులు దూరమయ్యే ప్రమాదం సాక్షి, అమలాపురం: మధ్య డెల్టా (కోనసీమ సీమ)లో ఖరీఫ్ సాగుకు ప్రధాన అవరోధం ముంపు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య ఈశాన్య రుతుపవనాలు... బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల వల్ల ఖరీఫ్ పంట ముంపుబారిన పడడం సర్వసాధారణంగా మారింది. ఈ కారణంగా ఇక్కడ ముందస్తు సాగు చేయడం ద్వారా భారీ వర్షాలు.. తుపాన్ల బారి నుంచి పంటను రక్షించుకునే అవకాశముంది. దీనిని గుర్తించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది. కూటమి ప్రభుత్వం మాత్రం జూన్ 15 దాటినా మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకుండా ఆయకట్టు రైతులకు ఖరీఫ్ను దూరం చేస్తోంది. జిల్లాలో 2,52,742 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉండగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు. దీనిలో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోందని అంచనా. ఇందులో మధ్యడెల్టా పరిధి (పాత కోనసీమ ప్రాంతం)లో సుమారు 1.10 లక్షల ఎకరాలు ఉంటుంది. దీనిలో ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో శివారు ఆయకట్టు అధికం. ఇక్కడ ఏడు మండలాల్లో 60 వేల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉందని అంచనా. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారడంతో కొద్ది పాటి వర్షానికే వరి చేలు రోజుల తరబడి నీట మునగడం, పంట నష్టపోవడం పరిపాటి. ఈ కారణంగానే రైతులు ఏటా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు దూరమవుతున్నారు. ఏటా తొలకరి సాగు వదిలేసే రైతుల సంఖ్య.. ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు పంపిణీ చేయాలనే నిర్ణయం వెనుక ముంపు ఒక కారణం. మూడేళ్ల కాలంలో గోదావరి డెల్టాలో ముందస్తు సాగుకు అనుకూలంగా జూన్ 1వ తేదీన పంట కాలువలకు నీరు విడుదల చేసేవారు. గత ఏడాది సాధారణ ఎన్నికల హడావుడిలో అధికారులు ఉన్నా జూన్ 1న నీరు వదిలారు. ఇప్పుడు కూడా మధ్య డెల్టాకు ఒకటవ తేదీన సాగునీరు వదిలారు. అయితే తొలి పది రోజులు మధ్యడెల్టాకు కేవలం 100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 12వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు నీరు పెంచారు. ఆదివారం 700, సోమవారం 1,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మధ్య డెల్టా పరిధిలో ముక్తేశ్వరం కాలువకు అయినవిల్లి మండలం చింతనలంక లాకుల దిగువకు నీరు వదలడం లేదు. అమలాపురం నడిపూడి లాకుల వద్ద నుంచి బెండాకెనాల్కు నీరు వదలడం లేదు. అమలాపురం నుంచి చల్లపల్లి కాలువకు నీరు వదిలినా అది కూడా అరకొరగానే. మొత్తమ్మీద మధ్య డెల్టా ప్రతి శివారు ప్రాంతంలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మే నెల చివరిలో క్లోజర్కు అనుమతులు గోదావరి డెల్టాలో ఈ ఏడాది క్లోజర్ సమయంలో చేపట్టిన పనుల విలువ రూ.5.50 కోట్లు మించి లేదు. ఇందులో డ్రైనేజీ విభాగంగా రూ.2.50 కోట్లతో ఆత్రేయపురం మండలంలో సైఫన్ నిర్మాణాలు చేపట్టగా, మిగిలిన నిధులతో ఇరిగేషన్ రెగ్యులర్ విభాగం అరకొర పనులు చేపట్టింది. వీటిలో పంట కాలువల్లో పూడిక తీత, చిన్నచిన్న మరమ్మతులు ఉన్నాయి. డెల్టా ప్రధాన పంట కాలువలను ఏప్రిల్ 15తో మూసివేస్తామన్న అధికారులు రైతుల కోరిక మేరకు 20వ తేదీ వరకు పెంచారు. తరువాత చేపల సాగు చేసే రైతులు కాసులు చెల్లించడంతో గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ ఏప్రిల్ 27వ తేదీ వరకు నీరు విడుదల చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలువలు మూసివేశారు. కాలువలపై చేపట్టిన అరకొర పనులకు అప్పటికే అనుమతులు ఇచ్చి ఉంటే కాలువలు ఎండిపోయిన తరువాత కనీసం మే 15 నుంచి అయినా పనులు మొదలు పెట్టేవారు. కానీ ఈ పనులకు మే నెలాఖరున అనుమతులు మంజూరు చేయడం విశేషం. ఈ కారణంగా జూన్ ఒకటి తరువాత పనులు మొదలు పెట్టారు. పది కల్లా పూర్తి చేస్తామని చెప్పి చేయకపోవడంతో కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయలేదు. దీనివల్లే ఇంకా పూర్తిస్థాయిలో పంట కాలువల ద్వారా నీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఇది మధ్యడెల్టా శివారుల్లో సాగు ఆలస్యం అవడానికి కారణమైంది. -
బ్రాందీషాపు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా
మామిడికుదురు: పెదపట్నం గ్రామంలోని ఏటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా బ్రాందీ షాపు ఏర్పాటుకు నిరసనగా సోమవారం స్థానికులు ధర్నా చేశారు. బ్రాందీ షాపు ఎదురుగా నిల్చుని నిరసన తెలిపారు. ఆలయం సమీపంలో నివాస గృహాల వద్ద బ్రాందీషాపు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. గతంలో ఇదే విధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు. అప్పట్లో ఈ షాపును వేరే చోట ఏర్పాటు చేశారని చెప్పారు. మళ్లీ ఇక్కడ బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వల్ల తాము నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. బ్రాందీ షాపు ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేశారు. నిరసనలో గెద్దాడ సందీప్, కుక్కల వేణు, గెద్దాడ సావిత్రి, చెల్లింగి సత్యనారాయణ, కుక్కల సక్కుబాయి, ముత్యాల సుబ్రహ్మణ్యం, కుక్కల నాగలక్ష్మి, అరిగెల కృష్ణవేణి, చెల్లింగి వరలక్ష్మి పాల్గొన్నారు. -
పెద్దాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెద్దాపురం: పట్టణ శివారు కట్టమూరు పుంత ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన జానకి సత్య శ్రీనివాస్ (వెంకన్నబాబు) (32)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... మృతుడు ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో మెడపై బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పగిలిన బీర్ బాటిళ్లు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమా.? మద్యం మత్తులో ఎవరైనా హత్య చేశారా? మరే ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్పై గతంలో హత్య, హత్యాయత్నంతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచాఉరం. పెద్దాపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ మౌనిక తెలిపారు. -
అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అర్జీలకు నూరు శాతం పరిష్కారం అమలాపురం రూరల్: అర్జీలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, ఎస్డీసీ కృష్ణమూర్తి, డీఎల్డీవో రాజేశ్వరరావు 255 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రజాసమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 15 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ అర్జీల స్వీకరించారు. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన పితాని వెంకటేశ్వరరావు తన దగ్గర బంధువుల నుంచి ఆస్తులపరంగా మోసానికి గురయ్యాయని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ తగాదాపై ఏఎస్పీ బాధితులతో చర్చించారు. అమలాపురంలో విలువైన స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న తన బంధువుల నుంచి తన స్థలాన్ని ఇప్పించాలని వెంకటేశ్వరరావు తన ఫిర్యాదులో కోరారు. భూ తగాదాలతోపాటు కుటుంబ వివాదాలకు చెందిన ఫిర్యాదులపై కూడా అర్జీదారులతో మాట్లాడారు. ఎస్సై గంగాభవాని కూడా పాల్గొన్నారు. -
‘సార్... ఇలా చేశారు’
నర్సింగ్ బదిలీలలో మాయాజాలంపై ఆర్డీ కలెక్టర్కు వివరణ కాకినాడ క్రైం: నర్సింగ్ బదిలీలలో నర్సింగ్ అసోసియేషన్ అగ్రనాయకత్వ మాయాజాలంపై కలెక్టర్ షణ్మోహన్ సీరియస్ అయ్యారు. బదిలీల ప్రయోజనాలను పొందేందుకు అసోసియేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న వారి పేర్లకి బదులు ఇతరులవి చేర్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీ డాక్టర్ పద్మశశిధర్ని ఆరా తీశారు. ఈ ఉదంతంపై పూర్తి వివరాలివ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివాదానికి సంబంధించి ఆది నుంచీ చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని ఆర్డీ వివరణాత్మకంగా కలెక్టర్కు అందించారు. ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై కలెక్టర్ అప్రమత్తమయ్యారు. తమకందుతున్న వివిధ యూనియన్ల లెటర్లలోని ఆఫీస్ బేరర్ల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ధారించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా కలెక్టర్ సూచనల మేరకు బాధ్యులపై చర్యలు చేపడతామని డాక్టర్ పద్మశశిధర్ అన్నారు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల ఘర్షణ ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో ఇరు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం స్థానిక పెద్ద కాలువ రోడ్డులోని ఎర్రకాలనీ వద్ద పలివెల తేజ, కొమ్ము రోహిత్ వర్గాల మధ్య ఆదివారం రాత్రి పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హత్యా ప్రయత్నం జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలోని రేకుల షెడ్డులో మేడిశెట్టి వెంకటరమణ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎస్ఐ వాసంశెట్టి రవిచంద్ర కుమార్ సోమవారం తెలిపారు. ఊలపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకటరమణ పందలపాక కోదండ రామ రైస్మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంట్లో రూ.100 అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను పనిచేసే రైస్మిల్లు ఎదురుగా ఉన్న షెడ్డులోకి వెళ్లి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రుమాలుతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఆయన కుమారుడు అజిత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించి, పంచానామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మార్కెట్లోకి సుజుకి కొత్త స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని కంటిపూడి సుజుకి షోరూంలో సోమవారం కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు సుజుకి న్యూ యాక్సెస్ 125 సీసీటీఎఫ్టీ ఎడిషన్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ వీలర్ విక్రయ రంగంలో సుజుకి ఆక్సిస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని. కొత్తగా లాంచ్ చేసిన టీఎఫ్టీ వాహనానికి సరికొత్త హంగులు, అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. కలర్ డిజిటల్ మీటర్, వెదర్ అలర్ట్, నావిగేషన్, మెసేజ్ అలర్ట్, వాట్సాప్ కాల్, మైలేజ్ రేంజ్, డెమో నైట్ మోడ్ లాస్ట్ పార్కింగ్ అలర్ట్, స్పీడ్ ఎక్సీడింగ్ అలెర్ట్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్ అని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, జి.ఎం రాజారావు, కస్టమర్లు, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం
వాడపల్లిలో యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ మహేష్కుమార్, ఎమ్మెల్యే బండారు తదితరులు కొత్తపేట: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆర్. మహేష్కుమార్ పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో డివిజన్ స్థాయి యోగాభ్యసనాల కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 45 నిమిషాల సరళ యోగా సనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. మహిళలకు, చిన్నారులకు యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ద్వారా శారీరక శక్తి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. అనంతరం ఆయుష్ వైద్యులు, ఓం శాంతి యోగా గురువులు వందలాది మందితో యోగాసనాలు వేయించారు. డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీఓ పీ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు. -
గోదావరిలో స్నానానికి దిగిన యువకుడి మృతి
● రెండో రోజు ఒడ్డున మృతదేహం లభ్యం ● కలసి వెళ్లిన మిగిలిన ఆరుగురు మిత్రులు సురక్షితం కరప/ఐ పోలవరం: ఆదివారం సరదాగా గడపడానికి వెళ్లిన ఏడుగురు స్నేహితులు గోదావరిలోకి స్నానానికి దిగగా, ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండో రోజు సోమవారం గోదావరి ఒడ్డున మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కరప గ్రామానికి చెందిన నరాల సాయికృష్ణ(19) మరో ఆరుగురు స్నేహితులతో కల్సి ఆదివారం సరదాగా గడపడానికి మోటార్ సైకిళ్లపై యానాం వెళ్లి, అక్కడి నుంచి ఎదుర్లంక వంతెన దాటివెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఒకరికొకరు సాయపడి ఒడ్డుకు చేరడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీరిలో సాయికృష్ణ గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడి, ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగురిని ఐ.పోలవరం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గల్లంతైన సాయికృష్ణ మృతదేహం రెండో రోజు సోమవారం ముమ్మిడివరం సమీపంలో గోదావరిలో మునిగిపోయిన ప్రాంతంలోనే పైకి తేలింది. రెండురోజులుగా తాత నరాల కృష్ణ(వెంటూరు కృష్ణ), తండ్రి నరాల బుజ్జి, బంధువులతో కల్సి కన్నీరు,మున్నీరుగా విలపిస్తూ గోదావరి ఒడ్డునే ఉండిపోయారు. ఎలాగైనా బతికిబయట పడతాడని ఎదురుచూశారు. తీరా శవమై తేలడంతో తాత, తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి వెళ్లి తన కూతురికి ఎలా చెప్పాలంటూ తాత కృష్ణ, తండ్రి బుజ్జి గుండెలు అవిసేలా విలపిస్తూ, కూలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కరప మండల యూత్ అధ్యక్షుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెంకే సత్తిబాబు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఘటనా స్థలానికెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పారు. గోదావరిలో గల్లంతైన సాయికృష్ణ స్వగ్రామం కరప గోదావరిలో గల్లంతైన యువకుడు నరాల సాయికృష్ణ స్వగ్రామం కరప. అతని తండ్రి బుజ్జి చిన్న హోటల్ నిర్వహిస్తాడు. తాత నరాల కృష్ణ భార్య కరప హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తుంటారు. తల్లి గృహిణి. వీరికి ఒక కుమారుడు సాయికృష్ణ ఇంటర్మీడియెట్ చదివాడు. కుమార్తె కరప హైస్కూలులో చదువుతోంది. కరప, శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులతో కల్సి యానాం మీదుగా వంతెన దాటి వెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఐ.పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో సోమవారం సాయంత్రం సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది. కరపలో విషాద ఛాయలు సాయికృష్ణ మృతితో కరపలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరినీ నవ్విస్తూ, కలుపుగోలుతనంగా ఉండే సాయికృష్ణ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లికి మరణవార్త తెలియనివ్వలేదు. -
కన్నుల పండువగా సాహితి అరంగేట్రం
గన్ఫౌండ్రీ: ప్రముఖ నాట్య శిక్షణాలయం జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నృత్య గురువు జ్యోతిరెడ్డి శిష్యురాలు సాహితీ పద్మప్రియ కూచిపూడి నాట్య రంగ ప్రవేశం సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పుష్పాంజలి, జతిస్వరం, అలరింపు, వర్ణం, థిల్లాన వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్ ఆనంద్ రాజేశ్వర్ బైవార్ మాట్లాడుతూ.. నేటి తరానికి శాసీ్త్ర య సంగీత కళలపై మక్కువ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ శాసీ్త్రయ కళలపై మక్కువ పెంచుకున్న సాహితి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇన్కమ్ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్వీ రెడ్డి, ఇన్కమ్ట్యాక్స్ (ఇన్వెస్టిగేషన్) ప్రైమరీ డైరెక్టర్ రాజ్గోపాల్ శర్మ తల్లిదండ్రులు మానస, ఐఆర్ఎస్ ఏపీ బాబు పాల్గొన్నారు. కొట్లాటకు నిలయాలుగా బ్రాందీషాపులు కోరుకొండ: మండలంలోని బ్రాందీషాపులు కొట్లాటలు, ఘర్షణలకు నిలయాలుగా తయారయ్యాయి. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కోరుకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జంభూపట్నం బ్రాందీషాపు వద్ద ఇద్దరు యువకులు గాయపడ్డారు. పశ్చిమగానుగూడెం గ్రామానికి చెందిన కాటుమళ్ల రాజశేఖర్ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బీరు సీసాలతో కొట్టారు. గాధరాడకు చెందిన చంద్రమళ్ల మహేష్ తలపై గుర్తుతెలియని వ్యక్తులు బీరుసీసాలతో మోదారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సైనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 0000648886-000001-Casual Advertis 10.00x8.00 Casual Advertisers -
ధాన్యం బకాయి సొమ్ము చెల్లించాలని వినతి
అమలాపురం రూరల్: గత మే నెలలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మంగెన నరసింహరావు, ఎరుబండి లక్ష్మయ్య, అప్పారి చిన వెంకట రమణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ 45 రోజులుగా ధాన్యం సొమ్ము రాలేదని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సూమారు రూ.250 కోట్లకుఽపైగా ధాన్యం బకాయిలు ఇవ్వాలని వారు తెలిపారు. ‘తల్లికి వందనం’కు కరెంటు షాక్ఈఆర్ఓ కార్యాలయానికి క్యూ కట్టిన జనం అమలాపురం రూరల్: తల్లికి వందనం పథకానికి విద్యుత్ షాక్ తగిలింది. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు అమలాపురం ఈదరపల్లిలో ఉన్న ఈఆర్ఓ కార్యాలయానికి సోమవారం క్యూ కట్టారు. తమ పేరున విద్యుత్ మీటర్లు లేవని, అయినా తల్లికి వందనం పథకాన్ని నిలిపివేశారని కొందరు వినియోగదారులు వాపోయారు. తండ్రి, తల్లి పేరున ఉన్న విద్యుత్ మీటర్లను తమ ఆధార్తో లింక్ చేయడం వల్ల విద్యుత్ వాడకం ఉన్న కారణంగా ప్రభుత్వ పథకాలు రావడం లేదని తెలిపారు. ఆధార్ లింక్ తొలగించాలని కోరారు. ఏడాది విద్యుత్ వాడకం స్టేట్మెంట్ ఇవ్వాలని కొందరు విద్యుత్ వినియోగదారులు ఈఆర్ఓలను కోరారు. వినియోగదారుల నుంచి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తులు తీసుకుని, రెండో రోజులు తర్వాత స్టేట్మెంట్లు ఇస్తామని అధికారులు చెప్పారు. -
సంప్రదాయానికి పెద్ద పీట.. కొబ్బరికాయలకు పసిడి వన్నెలద్దీ..!
సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు.కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. అంబాజీపేట పెద్ద వీధిలో కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, కొబ్బరి కాయలు, చెరకు గెడలు, ధాన్యం కుచ్చులతో ముస్తాబు చేసిన పెళ్లి ఇంటి వద్ద స్వాగత ద్వారం ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు.ఇతర ప్రాంతాలకు సైతం..కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.అరటి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసే వేదికలు అభిరుచి మారుతోందిపెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్లో డెకరేషన్లు చేస్తున్నాం.– బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారం¿ోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాకొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదిక -
రికార్డుల కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. కురిడీ కొబ్బరి ధర కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగి ఆల్టైమ్ రికార్డు నమోదు చేయగా.. పచ్చి కొబ్బరి కాయ సైతం ఆల్టైమ్ హైరికార్డులు సృష్టిస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.17,500 నుంచి రూ.18.500 పలుకుతోంది. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం ఇదే మొదటిసారి. మరోవైపు కురిడీ కొబ్బరి సైతం కురిడీ రూ.27 వేలకు చేరింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగవుతోంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వకాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు తగ్గలేదు. తరువాత ఈ ధర పెరుగుతూ వస్తోంది. గత నెలలో వీటి ధర రూ.16 వేలకు చేరింది. ఇదే గరిష్ట ధర అనుకున్నారు. అయితే.. రైతులు, వ్యాపారుల అంచనా దాటి కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరగడం గమనార్హం. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం మార్కెట్లో ఇదే మొదటిసారి. ఉత్తరాదిలోని గుజరాత్, హరియాణ,, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. కురిడీకి రికార్డు స్థాయి ధర కురిడీ కొబ్బరి సైతం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పాత కాయలలో (8 నెలలకు పైబడి నిల్వ ఉన్న) గండేరా రకం (పెద్ద రకం) వెయ్యి కురిడీ కొబ్బరి కాయల ధర రూ.27 వేలకు చేరడం రికార్డు. గతంలో దీని సగటు ధర రూ.14 వేలు మించేది కాదు. ఇక గటగట (చిన్నకాయ) ధర రూ.25 వేలుగా ఉంది. కొత్త కాయల్లో గండేరా రూ.26 వేలు, గటగట రూ.24 వేల వరకు పెరగడం విశేషం. నిల్వలు లేకపోవడమే కారణం » ఏడాది కాలంగా రైతుల వద్ద, వ్యాపారుల వద్ద కొబ్బరి నిల్వ ఉండటం లేదు. గతంలో దింపు తీసిన కొబ్బరి రెండు, మూడు నెలలపాటు రైతుల వద్దనే ఉండేది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో వారం వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి కొబ్బరి, కురిడీ కొబ్బరికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. » ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాదికి కొబ్బరి కాయ ఎగుమతులు పెరిగిన కారణంగా మార్చి నెల నుంచి గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు నుంచి జాతీయ మార్కెట్కు ఎగుమతి అయ్యే కొబ్బరిలో మూడోవంతు కూడా అందుబాటులో లేకుండా పోయింది. స్థానిక కొబ్బరి డిమాండ్ పెరగడానికి ఇది కారణమైంది. » మార్చి నుంచి మే నెలాఖరు వరకూ ఎకరాకు సగటున 1,200 కాయల వరకూ దిగుబడి వస్తోంది. తరువాత అది తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సగటు దిగుబడి 700 కాయల వరకూ ఉంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమైంది. » ఇంత ధర ఉన్నా రైతులు వెంటనే అమ్మడం లేదు. ధర మరింత పెరిగే అవకాశముందనే అంచనాతో ఆచితూచి విక్రయిస్తున్నారు. -
చిన్నారికి ఎంత కష్టం.. వైద్యానికి రూ. 16 కోట్లు అవసరం!
కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్
● 21 నుంచి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన ● 25 నుంచి ఆప్షన్ల ఎంపిక ● జూలై 3న సీట్ల కేటాయింపు రాయవరం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లావ్యాప్తంగా 3,830 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,162 మంది బాలురు, 1,668 మంది బాలికలు ఉన్నారు. వీరు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు నిర్వహించే కౌన్సెలింగ్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీని కోసం అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని శ్రీ వైవీఎస్ అండ్ బీఆర్బీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు విద్యార్థులు వెళ్లి ఆప్షన్స్ ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. షెడ్యూల్ మేరకు తమ ర్యాంకును బట్టి విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి. అనంతరం వారికిచ్చిన తేదీ ప్రకారం ఆన్లైన్లో అడ్మిషన్ పొందాలి. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెస్ ఫీజు చెల్లించాలి. ఆ రశీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ లేని వారు ఏడేళ్ల రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాన్ లోకల్ విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారు అర్హత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్ సమయంలో సబ్మిట్ చేయాలి. వీరికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జిల్లాలో 6 కళాశాలలు రామచంద్రపురంలో ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవే టు యాజమాన్యంలో మరో ఐదు పాలిటెక్నిక్ కళాశాల లు జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్, ఎలక్ట్రా నిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులున్నాయి. పలు కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 33, మెకానికల్ 33 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 1,500 వరకూ సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద 10 శాతం అదనంగా సీట్లు పెంచి ప్రతి బ్రాంచిలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ సైతం ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, షెడ్యూల్ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. – కేపీవీఎస్ఎన్ ప్రసాద్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ద్రాక్షారామ జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల వివరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రామచంద్రపురం: డీఎంఈ–33, డీసీఈ–33. శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల: డీసీఈ–30, డీఎంఈ–30, డీఈఈ–60, డీఈసీఈ–60, డీసీఎంఈ–120, డీఏఐఎం–60. బీవీసీ, ఇంజినీరింగ్ కళాశాల: డీసీఎంఈ–180, డీఈసీఈ–60, మెకానికల్–30, ఈఈఈ–30. వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, సీసీఎన్–60, డీఈసీఈ–60, ఈఈఈ–60, మెకానికల్–60. శ్రీ వైవీఎస్ అండ్ శ్రీ బీఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాల, ముక్తేశ్వరం: డీఈఈఐఈ–30, డీసీఎంఈ–54, డీఈసీఈ–60, డీఈఈఈ–108, డీఎంఈ–108. కై ట్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, డీఈసీఈ–60, సివిల్–30, డీఈఈఈ–30, మెకానికల్–30, ప్యాకింగ్ టెక్నాలజీ–30.సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ ఇలా.. తేదీ సమయం ర్యాంకు జూన్ 21 ఉదయం 9.00 1–7,499 మధ్యాహ్నం ఒంటిగంట 7,501–15,000 22 ఉదయం 9.00 15,001–23,500 మధ్యాహ్నం ఒంటిగంట 23,501–32,000 23 ఉదయం 9.00 32,001–40,000 మధ్యాహ్నం ఒంటిగంట 40,001–50,000 24 ఉదయం 9.00 50,001–59,000 మధ్యాహ్నం ఒంటిగంట 59,001–68,000 25 ఉదయం 9.00 68,001–77,000 మధ్యాహ్నం ఒంటిగంట 77,001–86,000 26 ఉదయం 9.00 86,001–95,000 మధ్యాహ్నం ఒంటిగంట 95,001–1,04,000 27 ఉదయం 9.00 1,04,001–1,12,000 మధ్యాహ్నం ఒంటిగంట 1,12,001–1,20,000 28 ఉదయం 9.00 1,20,001–1,27,000 మధ్యాహ్నం ఒంటిగంట 27,001–చివరి ర్యాంకు వరకూ ఆప్షన్ల ఎంపిక తేదీలు తేదీలు ర్యాంకులు జూన్ 25, 26 1–50,000 27, 28 50,0001–90,000 29, 30 90,0001–చివరి ర్యాంకు వరకూ అడ్మిషన్ల సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. జూలై 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం. జూలై 3న సీట్ల కేటాయింపు. -
శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా...
ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం ఫ ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటే శా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజ నం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ ఐ ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ను నియంత్రించా రు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
తల్లికి వంచన
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025● తల్లికి వందనానికి ని‘బంధనాలు’ ● జిల్లాలో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులు ● పథకం వర్తించిన వారు 1,70,869 మంది ● 69,131 మందికి కోత ● గత ఏడాది బకాయిల ఊసెత్తని సర్కార్ సాక్షి, అమలాపురం: తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి.. నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రానివారు కంగారు పడవద్దని, ఇంకా సమయం ఉందని, అవకాశం ఇస్తామని అధికారులు చెబుతున్నా.. నిబంధనలు చూస్తూంటే చాలా మందికి తల్లికి వందనం అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కింద వీరిలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.250 కోట్లు జమ చేశారు. రకరకాల సాకులతో మిగిలిన 69,131 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనలతో చాలా మంది అనర్హులుగా మారారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుకుంటున్న ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు, కూటమి నేతలు ఊదరగొట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద జిల్లాలోని తల్లులకు నాలుగేళ్లలో రూ.850.63 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం పేరును తల్లికి వందనంగా మార్చింది. అదే సమయంలో ఈ పథకం అమలులో అనేక ఆంక్షలు పెట్టారు. దీంతో పలువురు ఈ పథకానికి దూరమయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇవీ నిబంధనలు ● తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. ● తల్లి, తండ్రి, పిల్లల ఆధార్ నంబర్లు చెల్లుబాటై ఉండాలి. ● నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి. ● మూడెకరాల లోపు మాగాణి, 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు. ● మున్సిపల్ పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండరాదు. ● కుటుంబ సభ్యులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ● నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించరాదు. ● ఆదాయ పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అనర్హులు. ● ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అనర్హులు. ● వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే ఈ పథకం వర్తింపజేస్తారు. వీరికి తరువాత.. అంగన్వాడీ నుంచి కొత్తగా ఒకటో తరగతికి వెళ్లే పిల్లలు, పదో తరగతి పూర్తి చేసుకుని, కొత్తగా ఇంటర్లో చేరే విద్యార్థుల పేర్లు ప్రస్తుతం అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 వరకూ వీరి నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30న వెలువడే తుది జాబితాలో వీరి పేర్లు వస్తాయి. వీరికి వచ్చే నెల 5 తర్వాత తల్లికి వందనం డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదని, వీరు విద్యా దీవెన పథకం కిందకి వస్తారని చెబుతున్నారు. నాడు తప్పు.. నేడు ఒప్పా? గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి నిధుల నుంచి తొలుత రూ.1,000, తదుపరి ఏడాది నుంచి రూ.2 వేల చొప్పున పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక ఖాతా ప్రారంభించి, దానికి ఈ నిధులు డిపాజిట్ చేయించారు. ఆ సొమ్ముతో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన కెమికల్స్, ఇతర సామగ్రి కొనుగోలు చేసేవారు. ఆయాలను నియమించి, వారికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం అందించారు. దీనిపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. వాటిని మరచిపోయారో ఏమో కానీ.. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా చెప్పగా.. తీరా అమలులోకి వచ్చేసరికి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.2 వేలకు పాఠశాల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. దీంతో, నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తప్పని చెప్పారని, ఇప్పుడు అదే విధానం ఎలా ఒప్పు అయిందని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనలు సరళతరం చేయాలి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలి. ఇన్ని నిబంధనలు విధిస్తే అధిక సంఖ్యలో అనర్హులవుతారు. పదో తరగతి పూర్తి చేసిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలి. నెలకు 300 యూనిట్ల విద్యుత్ వాడకం నిబంధన తొలగించాలి. – బి.సిద్దు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ -
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. సర్వ దర్శనాలు చేసుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టికెట్లు, వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ.1,65,420 వచ్చింది. అన్నప్రసాద పథకానికి భక్తులు రూ.39,691 విరాళాలు సమర్పించారు. ‘కూటమి’ ఏడాది వైఫల్యాలపై నేడు పుస్తకావిష్కరణ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ముద్రించిన పుస్తకాన్ని పార్టీ నేతలు అమలాపురంలో ఆదివారం ఆవిష్కరించనున్నారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్తో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారు. ఆదివారం ఉదయం జిల్లా స్థాయిలోనూ, సోమవారం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోను, మంగళవారం మండల కేంద్రాల్లోను ఈ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని జగ్గిరెడ్డి తెలిపారు. -
మాకు మంచి స్నేహితుడు
నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్ముడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్న సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు. –తండ్రి సత్యనారాయణతో సప్పా నాగేశ్వరరావు, కొంకుదురు ఎంతో ప్రేమగా చూస్తారు.. సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను. –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు -
ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం
కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్బీఐ చీఫ్ అసోసియేట్ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.98 స్కోర్తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 91వ ర్యాంక్ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కింది. అనంతరం సివిల్స్లో ఐఏఎస్ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది. -
నీట్లో సత్తా చాటిన ఆదిత్య
బాలాజీచెరువు (కాకినాడ): నీట్–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్రెడ్డి తెలిపారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ‘ఆదిత్య’ను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతి, డైరెక్టర్ సుగుణ, ప్రిన్సిపాల్స్ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు. -
నాన్నా... నీ మనసే వెన్న
ఫాదర్స్ డే రోజునే ఉద్యోగంలోకి.. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్ పేపర్లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్ ఎంసెట్లో 289వ ర్యాంకు, గేట్లో 240వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో సామ్సంగ్ రీసెర్చ్ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్లో గూగుల్ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్ జేఈ మెయిన్స్లో 1924వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్ ప్లేసమెంట్లో గూగుల్కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్ ఫాదర్స్ డే రోజునే గూగుల్లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు. ఫ నడిపించే దైవం ఆయనే ఫ కుటుంబానికి వెలుగునిచ్చే సారథి ఫ నేడు ఫాదర్స్ డే కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది. -
మొదటి గురువులా..
ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి. –తండ్రి సత్యనారాయణతో గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక ఆయనే కొండంత ధైర్యం ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం. –తండ్రి బండారు రాముతో సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్, కొప్పవరం -
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్ తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు. ఆరు గంటలపాటు ఆందోళన కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలా ఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబా బు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరు లు ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. -
84 శాతం మందికి ఉద్యోగాలు
అమలాపురం రూరల్: భట్లపాలెంలో బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అచీవర్స్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా 2025 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం విద్యార్థుల్లో 84 శాతం మంది ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారని కళాశాల ప్లేస్మెంట్ అధికారి అడబాల కుమార్ తెలిపారు. విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆ విద్యార్థులకు చైర్మన్ బోనం కృష్ణ సతీష్, బోనం విజయలక్ష్మి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రిటికల్ రివర్ సంస్థ సీనియర్ డైరెక్టర్, గ్లోబల్ హెడ్ జేపీ సోలమన్ దేవవరం విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీజీ రామారావు, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్ టీవీ జనార్దన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు, శ్రీచలం తదితరులు పాల్గొన్నారు. -
22న ద్విశత కవి సమ్మేళనం
సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్కుమార్ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్గా పని చేసే అశోక్కుమార్ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్కుమార్ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నీట్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో డి.కార్తీక్ రామ్కిరీటికి ఏపీ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్ కశ్యప్ 12వ ర్యాంకు, డి.కార్తీక్రామ్ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్రెడ్డి 880వ ర్యాంకు, ఎల్.అభిషేక్ 888 ర్యాంకు, టి.రామచంద్రన్ 1,145వ ర్యాంకు, ఎల్.వర్షిత్ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరిలు అభినందించారు. -
శ్రీకామాక్షీ దేవి చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీగా వాణి
అమలాపురం టౌన్: స్థానిక శ్రీ కామాక్షీ పీఠ మహా సంస్థానం, శ్రీ కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ, పీఠాధిపతి కామేశ మహర్షి శివైక్యం చెందడంతో కొత్త ట్రస్టీ ఎంపిక పీఠంలో గురువారం జరిగింది. ఇప్పటి వరకూ మేనేజింగ్ ట్రస్టీ, సభ్యునిగా కామేశ మహర్షే విధులు నిర్వర్తించే వారు. ఆయన స్థానంలో పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమ మందిరం అమ్మ, కామేశ మహర్షికి వరుసకు సోదరి అయిన వక్కలంక వాణి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, సభ్యునిగా పీఠం ఉత్తరాధికారి విఘనస రాఖీ ప్రేమ్ ఎన్నికయ్యారు. గతంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుగా పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, న్యాయవాది వీరా నాగేశ్వరరావు, మట్టపర్తి నాగేశ్వరరావు ఉండేవారు. ఇప్పుడు కూడా వారు మరోసారి ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదుగురితో కూడిన చారిటబుల్ ట్రస్ట్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. పీఠాధిపతి శివైక్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పీఠానికి ఎన్నటికీ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. వాణి, రాఖీ ప్రేమ్ పేర్లను అప్పటికే ఉన్న ముగ్గురు ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పీఠాధిపతి కామేశ మహర్షి దివ్యాశీస్సులతో పీఠం కార్యకలాపాలు, చారిటబుల్ ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగించేలా నూతన మేనేజింగ్ ట్రస్ట్ తీర్మానించింది. ప్రేమ మందిరంలో పెరిగే అనాథ బాల బాలికల సంరక్షణ బాధ్యత ఎప్పటిలాగే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రస్ట్ న్యాయ సలహాదారు, సభ్యుడు వీరా నాగేశ్వరరావు మాట్లాడుతూ పీఠాన్ని, ట్రస్ట్ను అధ్యాత్మికంగా, సేవాపరంగా నిర్వహించేందుకు ఎప్పటిలానే భక్తులు, దాతలు సహకరించాలని కోరారు. -
మాటలు ఘనం.. చేతల్లో విఫలం
గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యా సంవత్సరం చివరి దశకు చేరినప్పటికీ కూడా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందని దుస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు. 2019 ఎన్నికల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింత ఆకర్షించే దిశగా జగనన్న విద్యా కానుక పేరిట వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభించిన రోజునే కిట్లు అందజేసేవారు. గతంలో ఇచ్చిన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లకు అదనంగా నోట్ బుక్స్, బెల్టు, బ్యాగ్, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు డిక్షనరీలు జత చేశారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అంతకు ముందు మాదిరిగా పాఠశాలలు తెరచిన రోజునే విద్యా కానుక కిట్లు అందజేసేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే ప్రతి విద్యార్థి చేతిలో ఈ కిట్లు పెడతామని గొప్పగా చెప్పింది. తీరా చూస్తే ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. విద్యార్థి మిత్ర కిట్లు తీసుకుందామని ఆశతో వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఆక్స్ఫర్డ్, లిఫ్కో డిక్షనరీలు మాత్రమే అందజేశారు. బ్యాగ్స్ ఇవ్వకపోవడంతో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు తీసుకుని వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. -
గోదారి.. కళాఝరి
కొమ్మి జానపద నృత్యం చేస్తున్న కళాకారులు ● ప్రారంభమైన అంతర్జాతీయ కళా సమ్మేళనం ● అలరించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కళలకు కాణాచి అయిన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాఝరి రసరమ్యంగా ప్రవహించింది. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళా కేంద్రంలో 43వ కళా సమ్మేళనం–2025 గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ కళా వైభవాన్ని చాటేలా పలువురు చిన్నారులు తొలి రోజు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాల్లో భాగంగా తొమ్మిది మంది సంగీత కళాకారులు వీణానాదంతో అన్నమయ్య కీర్తనలను వీనుల విందుగా వినిపించారు. అలాగే, తమిళనాడుకు చెందిన జానపద కొమ్మి నృత్యాలు, దుర్గ సూక్తం భరతనాట్యం అందరినీ ఆనంద గోదారిలో ఓలలాడించాయి. కళా సమ్మేళనంలో పాల్గొన్న కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జీబీ నారాయణ ఇటీవలి కుంభమేళాలో సైతం తన ప్రదర్శనలతో పలువురి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నారాయణ కుమార్తె లక్ష్మీ గీతిక చిన్న వయస్సులోనే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారని, ఆమె మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శనివారం హాజరు కానున్నారని తెలిపారు. నృత్యాలతో అలరించిన చిన్నారులను మంత్రి అభినందించారు. -
విద్యార్థులకు కిట్కట
● ప్రచారార్భాటానబడిసాక్షి, అమలాపురం: బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో తొలి రోజే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్ఆర్కేవీఎం) కిట్లు అందజేశారంటూ విద్యా శాఖా మంత్రి లోకేష్ను భజన బృందం సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. కానీ, అనేక ప్రభుత్వ బడుల్లో అనేక మంది విద్యార్థులు బూట్లు రాలేదని, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దిన నాడు – నేడు పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేయగా.. తల్లికి వందనం సొమ్మును ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టింది. ఇప్పుడు దానిలో కూడా కోత పెడుతోంది. ఇక విద్యార్థులకు అందజేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లలో ప్రస్తుతానికి యూనిఫాం, బూట్ల పంపిణీకి కోత పెట్టింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 90,981 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 90,981 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి సమగ్ర శిక్షా ద్వారా మూడు జతల యూనిఫాం, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, స్కూల్ బ్యాగ్, ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువ చేసే కిట్లను ప్రభుత్వం అందించాల్సి ఉంది. జిల్లాలోని 90,981 మంది విద్యార్థుల కోసం 4,05,312 పాఠ్య పుస్తకాలు, 77,697 వర్క్బుక్స్, 7,936 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, 6,112 పిక్టోరియల్ డిక్షనరీలు, 60,390 బెల్టులు, 90,981 బ్యాగ్స్ను ఆయా మండల కేంద్రాలకు చేర్చారు. కానీ, తొలి రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, డిక్షనరీలు మాత్రమే ప్రధానోపాధ్యాయులు అందజేశారు. ఇప్పటి వరకూ యూనిఫాం, షూస్, సాక్సులు జిల్లాకు చేరుకోలేదు. వీటితో పాటు స్కూల్ బ్యాగ్స్ కూడా కలిపి అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీటన్నింటి పంపిణీని నిలిపివేశారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు ప్రారంభమైన పాఠశాలలు పూర్తి స్థాయిలో చేరని విద్యార్థి మిత్ర కిట్లు నేటికీ జిల్లాకు చేరని యూనిఫాం, షూస్, సాక్సులు తల్లికి వందనం వాయిదా ఏడాది కాలంగా ఊరిస్తున్న తల్లికి వందనం జీఓను ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం విడుదల చేసింది. ఈ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమయ్యేది మాత్రం వచ్చే నెల 5న అని చావు కబురు చల్లగా చెప్పింది. ప్రభుత్వ వ్యవహారం చూస్తూంటే టీజర్ విడుదలైన నెలా రెండు నెలలకు సినిమా విడుదలైనట్టుందని సైటెర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక లబ్ధిదారుల విషయంలో కూడా భారీగా కోత పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఇస్తామన్న రూ.15 వేలలో రూ.2 వేలకు కోత పెట్టనున్నారు. ఈ మొత్తాన్ని పాఠశాల మెయింటెనెన్స్కు ఇవ్వనున్నారు. ఇది తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేస్తోంది. -
కూటమిలో తుని తగవు
వాటాల కోసం ‘పంచాయితీ’ పాయకరావుపేట మండలం నుంచి మట్టిని తుని మండలం కవలపాడులోని ఇటుక బట్టీలకు తరలిస్తూ పాయకరావుపేట కూటమి నాయకులు రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ దందాలో తమకు వాటా లేక అన్యాయమైపోతున్నామని తుని మండలం ఎస్.అన్నవరంలోని టీడీపీ జనసేన నేతలు భావించారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నుంచి జరుగుతున్న మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అక్రమార్జనలో తమకూ వాటా ఇవ్వాలని కొన్ని రోజులుగా తుని టీడీపీ పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది. పాయకరావుపేటలో బీజీపీకి చెందిన ఒక కీలక నేత, బంగారయ్యపేటకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత, తుని మండలం ఎన్.సూరవరం గ్రామ టీడీపీ నేతలు మట్టిలో అక్రమార్జన కోసం కుస్తీ పడుతున్నారు. అయినప్పటికీ పాయకరావుపేట నేతలు దారికి రావడం లేదు. దీంతో, తుని టీడీపీ, జనసేన నేతలు గురువారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. కవలపాడు మట్టి లోడుతో వచ్చిన మూడు లారీలను, మూడు ట్రాక్టర్లను, ఒక జేసీబీని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో, ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. మట్టి తవ్వకాల్లో వాటాల కోసం ఇంత నిస్సిగ్గుగా రోడ్డెక్కుతున్న కూటమి నేతలను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, కాకినాడ: అక్రమ సంపాదనలో పంపకాలు తెగక కూటమి నేతలు రోడ్డెక్కుతున్నారు. గద్దెనెక్కిన ఏడాది కాలంగా మట్టి, ఇసుక, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీకు సగం, నాకు సగం అంటూ వాటాలు వేసుకుంటూ, వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వాటాలు, పంపకాలు తెగక వివాదాలతో రోడ్డెక్కుతున్నారు. పిఠాపురంలో బొండు ఇసుక దందా కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య రగిలిన దుమారం చల్లారక ముందే.. తాజాగా తునిలో మట్టి అక్రమ తవ్వకాల చిచ్చు రేగింది. మాజీ మంత్రి, హోం మంత్రి వర్గాల పోరు టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఒకవైపు.. హోం మంత్రి వంగలపూడి అనిత వర్గీయులు మరోవైపు మట్టిలో కాసుల కోసం కొట్టుకుంటున్నారు. మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తుని సరిహద్దునే ఉంది. అక్కడి వనిత అనుచరులైన టీడీపీ నేతల మట్టి తరలింపును తుని వైపు యనమల అనుచరులతో పాటు జనసేన నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో మట్టి తవ్వుకుంటూంటే అందులో వాటాలెందుకివ్వాలని పాయకరావుపేట టీడీపీ నేతలు.. మట్టి తమ ప్రాంతానికి తరలిస్తున్నందు తమకు పంపకాలు జరగాల్సిందేనని తుని వైపు కూటమి నేతలు సిగపట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వివాదం ముదురుపాకాన పడింది. ఈ నేపథ్యంలో పాయకరావుపేట వైపు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లు, జేసీబీని తుని వైపు వైరి వర్గం పట్టుకుని, తుని రూరల్ పోలీసులకు అప్పగించింది. దీనిపై ఇరువర్గాలూ గురువారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొల్లగొడుతున్నారిలా.. పాయకరావుపేట మండలంతో పాటు తుని మండలం ఎస్.అన్నవరం శివారు కవలపాడులో కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చారిటీస్కు చెందిన భూములున్నాయి. ఈ భూముల్లో కొంత మంది ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుకల తయారీకి ప్రధాన ముడి సరకు చెరువు గర్భాల్లోని మట్టి. కవలపాడులో చాలా ఏళ్లుగా ఇటుకల బట్టీలు నడుస్తున్నా ఎప్పుడూ ఇటువంటి వివాదాలు లేవని అంటున్నారు. ఇటుక బట్టీలకు అవసరమైన చెరువు మట్టిని టిప్పర్కు రూ.10 వేలు, ట్రాక్టర్కు రూ.1,200కు అమ్మి కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారు. ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రిప్పుల మట్టి రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాత్రి వేళల్లో ఇష్టారాజ్యంగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతి లేనప్పటికీ అధికారం చేతిలో ఉందనే బరితెగింపుతో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. అదేమని అడిగి నాథుడే లేకుండా పోయాడు. మట్టి అక్రమాల్లో కూటమి పెద్దలున్నారనే ఉద్దేశంతో తమకెందుకనే ధోరణిలో ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కుదిరిన సంధి! వాటాల కోసం రోడ్డెక్కిన నేతల మధ్య కూటమి పెద్దలు సంధి కుదిర్చారని అంటున్నారు. పర్సంటేజీలపై ఒప్పందాలు కుదిర్చి, వివాదాన్ని సర్దుబాటు చేశారని చెబుతున్నారు. పోలీసులకు అప్పగించిన వాహనాలను గంటల వ్యవధిలోనే వదిలేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అక్రమాలను బయటపెట్టి, వాహనాలను పట్టించిన కూటమి నేతలే.. వాటాలు కుదిరేసరికి వెనక్కు తగ్గడం చూసి జనం విస్తుపోతున్నారు. పంపకాల చిచ్చు ప్రస్తుతానికి చల్లారినా.. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
యోగా పోటీలలో ప్రతిభ చాటాలి
అమలాపురం రూరల్: యోగాంధ్ర మాస ఉత్సవాలలో భాగంగా పోటీలలో పాల్గొని ప్రతిభ చాటి జిల్లా పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం గోదావరి భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో.. సోలో విభాగంలో 10–18 మధ్య వయసు వారు 8 మంది పాల్గొన్నారు. 19– 35 మధ్య వయసువారు ముగ్గురు, 35 సంవత్సరాలు పైబడిన వారు నలుగురు పాల్గొన్నారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 14 వరకు పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. విజేతలకు ఈ నెల 21వ తేదీ విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ కనకదుర్గ, జి.దుర్గాప్రసాద్. సీహెచ్ ఉషారాణి, డి.శాంతకుమారి, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 12వ తేదీన కలెక్టరేట్లో పోటీలు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి ఆయుష్ వైద్యాధికారి విజయకుమారి తెలిపారు. -
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ‘సాక్షి’పై దాడులు
అల్లవరం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని, అందుకే చంద్రబాబు, లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంలపై కూటమి నేతలు పెట్రోల్ బాటిల్తో దాడులు చేసి తగులబెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వానికిపత్రికా స్వేచ్ఛపై చిత్తశుద్ధి ఉంటే దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరవైందని, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తప్పుడు రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులకు పూర్తి స్వేచ్చ రాజ్యంగంలో కల్పించబడిందని, ఈ కూటమి ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందన్నారు. ఇప్పటికైనా తప్పుడు విధానాలను మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తే కోర్టు, ఎస్పీ, డీఎస్పీలకు మోమోలు జారీ చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందని కోర్టు వేసిన అక్షింతలు ద్వారా తెలుస్తుందన్నాని ఇజ్రాయిల్ అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విధానం మార్పుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.జర్నలిస్ట్లపై అక్రమ కేసులు దారుణంఅమలాపురం టౌన్: రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్లు, వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం దారుణమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ కేసులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కక్ష సాధింపు చర్యల్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు, కేసులు అనే కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పారు. భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజాన్ని నేటి కూటమి ప్రభుత్వం ఖతం చేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. ప్రభుత్వం కూటమి పార్టీల నేతలకే రక్షణగా నిలుస్తోందని విమర్శించారు. తుపాకీ గొట్టంతో రాజ్య హింస ద్వారా నియంత పాలన రుచి చూపిస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఆరోపించారు.జిల్లాలో నాలుగు రోజులు విద్యుత్కు అంతరాయంఅమలాపురం రూరల్: జిల్లాలో గురువారం నుంచి 16 తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎస్ఈ రాజబాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దశలవారీగా కోతలు విధిస్తామని పేర్కొన్నారు. అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం పరిధిలో ఉన్న ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం రూరల్, అల్లవరం, అయినవల్లి, అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట, రావులపాలెం మండలాలకు, రామచంద్రపురం టౌన్–2, ద్రాక్షారామ, రాయవరం, కపిలేశ్వరపురం కె.గంగవరం మండలాల పరిధిలో స్వల్పంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు.సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనంఅమలాపురం రూరల్: జిల్లాలో 1,534 ప్రభుత్వ పాఠశాలలు, 62 సంక్షేమ హాస్టళ్లలో గురువారం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగిస్తామని జేసీ టీ.నిషాంతి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. -
మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు
విద్యా సుగంధాలు జిల్లాలోని మనబడి నాడు–నేడు పథకం ఫేజ్–1లో 436 పాఠశాలలను రూ.104.96 కోట్లతో అభివృద్ధి చేశారు. ఫేజ్–2లో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.257 కోట్లు మంజూరు చేశారు. ఎస్ఎంఎఫ్ (స్కూల్ మెయింటినెన్స్ ఫండ్) కేటాయించి పాఠశాలలో చిన్నచిన్న పనులకు రూ.27.76 కోట్లు కేటాయించారు. 142 పాఠశాలకు 945 ఇంటరేక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ)లు అందించారు. ఒక్కొక్క దాని ఖరీదూ రూ.1.25 లక్షలు. దీని ద్వారా డిజిటల్ బోధనతోపాటు పాఠాలను డౌన్లోడు చేసుకుని కూడా చెప్పే అవకాశం అధికంగా ఉంది. ● జిల్లాలో గడిచిన ఐదేళ్లలో రహదారులు, భవనాల నిర్మాణాలకు రూ.299.40 కోట్లు మంజూరయ్యాయి. రూ.166.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 33 రోడ్లకు రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండవ దశలో రోడ్ల రిపేర్లకు రూ.26.37 కోట్లు ఖర్చు చేశారు. ● కత్తిపూడి –ఒంగోలు మధ్య ఉన్న జాతీయ రహదారి 216 విస్తరణ పనులు వేగంగా సాగడానికి భూసేకరణ చురుగ్గా చేయడమే కారణం. 374 కిమీలు నిడివి ఉన్న ఈ రహదారిని రూ.నాలుగు వేల కోట్లతో విస్తరించింది. దశాబ్దాల కాలంగా రాజోలు దీవివాసులు ఎదురుచూస్తున్న వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ రూ.580.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. రామరాజులంక వద్ద వశిష్ఠపై 380 మీటర్ల మేర వంతెన నిర్మాణం చేయనున్నారు. ● పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక వాసుల కష్టాల తీర్చేందుకు రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ● ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులను ఆనుకుని వృద్ధగౌతమీ, గౌతమీ నదీపాయల మధ్య ఉన్న పశువుల లంక మొండి వద్ద రూ.49 కోట్లతో వంతెనను పూర్తి చేయించిన జగన్మోహన్రెడ్డి సీఎం హోదాలో ప్రారంభించారు. -
సత్యదేవుని సన్నిధికి సులువుగా!
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సత్యదేవుని దర్శనానికి మరో మార్గానికి పనులు చురుగ్గా సాగుతున్నా యి. మొదటి ఘాట్రోడ్డు వద్ద గల టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.90 లక్షల వ్యయంతో సుమారు 450 మెట్లతో ఆకర్షణీయంగా ఈ మార్గం రూపుదిద్దుకుంటోంది. రాజస్థాన్ కార్మికుల మెళకువలతో రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన మెషీన్తో అందమైన పరిమాణాల్లో కట్ చేసిన రాళ్లను మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. తొలిపావంచా నుంచి స్వామివారి ఆలయానికి ఉన్న ప్రస్తుతం మెట్లను సుమారు 50 ఏళ్ల క్రితం రాతితో నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మిస్త్న్ను రెండో మెట్లమార్గానికి గ్రానైట్, మార్బుల్ రాళ్లను యంత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. 2010లోనే ప్రతిపాదన 2010 సంవత్సరంలో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో సందర్శకుల బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడి నుంచి తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మెట్లపై స్వామివారి దర్శనానికి వెళ్లాల్సివచ్చేది. ఇది దూరాభారం కావడంతో కళాశాల మైదానానికి దగ్గరలో మరో మెట్లదారి నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంతలో ఆయన 2012లో బదిలీకావడంతో ఆ ప్రతిపాదన మూలపడింది. మళ్లీ 2023లో ఆయన ఈఓగా రావడంతో ఈ మెట్ల మార్గం పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. మూడు మలుపులు, 450 మెట్లు ఈ మార్గాన్ని 450 మెట్లతో మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి మెట్లు ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల రోడ్డు వద్ద ముగియనున్నాయి. అక్కడ నుంచి 200 మీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. గత ఏప్రిల్లో ప్రారంభించిన పనుల్లో భాగంగా వంద మెట్లు పూర్తి చేశారు. ఇంకా 350 మెట్లు నిర్మించాల్సి ఉంది. ఈ మెట్లకు అవసరమైన రాయిని ప్రత్తిపాడులోని క్వారీ నుంచి తీసుకువచ్చి మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల విశ్రాంతికి ఏర్పాట్లు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అలసట చెందితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు, తాగునీటి సదుపాయానికి పక్కనే కొంత స్థలాన్ని చదును చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల్లో పూర్తి ఈ మెట్ల నిర్మాణాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నట్టు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్కుమార్ తెలిపారు. పనుల పరిశీలన దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ ఈ మెట్ల మార్గం పనులను ఇటీవల పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా రెండో మెట్లదారి నిర్మాణం రూ.90 లక్షలతో 450 మెట్లు ఏర్పాటు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి -
గోదారి తీరాన సంగీత, నృత్యోత్సవం
● నేటి నుంచి అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్–2025 ● నాలుగు రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు ● 13 రాష్ట్రాల నుంచి కళాకారుల రాక ● మలేషియా నుంచి రానున్న ప్రత్యేక బృందం ● 13వ తేదీన 134 మందితో నృత్య నీరాజనం సీటీఆర్ఐ: నృత్య నీరాజనంతో గోదారితీరం పులకించనుంది. వంద మందికి పైగా నృత్య కళాకారులు ఒకే వేదికపై నాలుగు రోజులపాటు నగర ప్రజలను పరవశింపజేయనున్నారు. 42 ఏళ్లుగా కళా సమ్మేళన్ పేరితో సంగీత, నృత్యోత్సవాలు నిర్వహిస్తున్న శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 43వ కళా సమ్మేళన్ అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్–2025 గురువారం వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మేళన్లో 13 రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటుగా మలేషియా నుంచి ఒక ప్రత్యేక బృందం రానుంది. సుమారు 550 మంది కళాకారులు మూడు రోజుల పాటు సంగీతం, నృత్య, జానపద కళారూపాలతో పోటీ పడనున్నారు. శుక్రవారం 134 మంది తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు నిర్విరామంగా ఒకే ఆహార్యంతో నృత్యం చేయనున్నారు. వీరితో పాటు 9 మంది సంగీత విద్యాంసులు కూడా పాల్గొనున్నారు. ఈ నృత్యోత్సవాన్ని పలు రికార్డులకు నమోదు చేయనున్నారు. గత ఏడాది అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవం అనేక రికార్డులను సొంతం చేసుకుంది. 12 గంటల 23 నిమిషాల 01 సెకండ్ పాటు 125 మంది కళాకారులు ఒకే ఆహార్యంతో ప్రదర్శించిన హనుమాన్ చాలీసా నృత్యరూపకానికి 12 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్, వండర్ బుక్, తెలుగు బుక్, గోల్డెన్బుక్ వంటి 12 వరల్డ్ రికార్డులను ఆ కార్యక్రమం సొంతం చేసుకోవడం విశేషం. 14వ తేదీ 13న బృందాలు పోటీ పడనున్నాయి. ఒక్కొక్క బృందంలో 25 నుంచి 30 మంది వరకు కళాకారులు పాల్గొననున్నారు. 15వ తేదీ సోలో పోటీలు, సర్టిఫికెట్ల ప్రదానం చేయనున్నారు. శాసీ్త్రయ నృత్యానికి ఆదరణ కరవు పాశ్చాత్య సంగీతం, నృత్యం వైపు నేటి తరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. తల్లితండ్రులు కూడా త్వరగా తమ పిల్లలకు పేరు వస్తుందనే ఆశతో పాశ్చాత్య నృత్యం వైపు తమ పిల్లలను పంపుతున్నారు. టీవీ షోలలో అసభ్యకరమైన విన్యాసాలతో, పొట్టి డ్రెస్లతో చేసేది నాట్యమని భ్రమిస్తున్నారు. మన ప్రాచీన కళైన సంప్రదాయ నృత్యం వైపు ప్రపంచం చూస్తోంది. మనం మాత్రం ఆధునిక పొకడలతో తలతోక లేని డ్యాన్స్ వైపు పరుగెడుతున్నాం. – డాక్టర్ జీబీ నారాయణ, శ్రీరాధాకృష్ణ కళాకేత్ర వ్యవస్థాఫకుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం
రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
తడబడితూ..
సాక్షి, అమలాపురం: వేసవి సెలవులు పూర్తయ్యాయి. మళ్లీ బడికి వేళయింది. ఓ వైపు ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులను రారా రమ్మని స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు సర్కారు బడులు ఇంకా సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి 2025–26 విద్యా సంవత్సరం బడి గంటలు మోగనున్నాయి. విద్యార్థుల ఉరుకులు పరుగులు..కేరింతలు మొదలవనున్నాయి. నేటి నుంచి సందడి ప్రతి ఉదయం విద్యార్థులు ఓ పక్క, వారి తల్లిదండ్రులు మరోపక్క ఉరుకులు, పరుగులు పెట్టనున్నారు. అటెన్షన్ ప్లీజ్..ౖసైలెన్స్ ప్లీజ్ అంటూ టీచర్ల పని ప్రారంభం కానుంది. ఇక విద్యార్థులకు స్వాగతం పలికేందుకు అటు సర్కారు..ఇటు కార్పొరేట్ పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకర్షించేందుకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అయితే ఎంత మేర అడ్మిషన్లు వస్తాయన్నది వేచి చూడాలి. ప్రహసనంగా బదిలీలు పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి పూర్తి కాలేదు. బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యకం చేశాయి. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో బదిలీలు కొనసాగిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం, తిరిగి వెబ్ కౌన్సెలింగ్ చేపడతామని చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేయగా, ప్రభుత్వం దిగి వచ్చి తిరిగి మాన్యువల్ కౌన్సిలింగ్కు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ కారణంగా బదిలీల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే గురువారంకూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పూర్తి స్థాయిలో చేరుకోని విద్యామిత్ర కిట్లు పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన కిట్ను అందజేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థి చేతికి కిట్ అందివ్వగా నేడు ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో 91,078 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాకు షూస్, సాక్సులు, యూనిఫామ్ చేరుకోలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం రోజు పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు మాత్రమే అందజేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి కాని మనబడి–మన భవిష్యత్తు పనులు పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి పూర్తి కావాల్సిన మనబడి – మన భవిష్యత్తు రెండవ దశ పనులు పూర్తి కాలేదు. మనబడి – మన భవిష్యత్తు రెండవ దశలో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి సరఫరా, భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. రెండవ దశ పనుల్లో భాగంగా 772 పాఠశాలలను రూ.257 కోట్లతో అభివద్ధి చేయాల్సి ఉండగా, చాలాచోట్ల సిమెంట్, ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయి. తల్లికి వందనం ఏదీ? గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏటా రూ.15వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం పథకం పేరును తల్లికి వందనంగా మార్పు చేసింది. ఏడాది గడిచినా తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేయలేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజున తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినా రెండేళ్ల సొమ్ము ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం పునఃప్రారంభానికి ముస్తాబైన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు పూర్తి స్థాయిలో చేరని స్టూడెంట్ కిట్స్ జిల్లాలో 1,576 ప్రభుత్వ, 451 ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభానికి ఏర్పాట్లు చేశాం వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో విద్యార్థుల అడ్మిషన్స్ పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం -
గ్రామాలలో సమగ్రాభివృద్ధి
● జిల్లాలో గ్రామ సచివాలయాలు 198, రైతు భరోసా కేంద్రాలు 68, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు 35 భవనాలను నిర్మించారు. ● జిల్లాలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నాడు–నేడులో రూ.9.21 కోట్లతో మంజూరయ్యాయి. ● గడపగడపకూ మన ప్రభుత్వంలో భాగంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 515 సచివాలయాలలో ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను 1,102 పనులకు రూ.72.88 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ● గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ‘జల జీవన్ మిషన్‘ ద్వారా జిల్లాలోని ఒక వెయ్యి 834 ఆవాస ప్రాంతాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం చేపట్టారు. జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో నిర్మించిన కుళాయిల ఏర్పాటుకు రూ.45.75 కోట్లు కేటాయించారు. గోదావరి నుంచి నేరుగా నీటిని అందించేందుకు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఇందుకు రూ.1,650 కోట్లు మంజూరు చేశారు. ● ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు‘లో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 24,644 గృహాలను ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – వైఎస్సార్ పట్టణ పథకం‘ ద్వారా రూ.443.59 కోట్లతో నిర్మించారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన– వైఎస్సార్ గ్రామీణ‘ పథకం ద్వారా 9,810 గృహాలను రూ.176.58 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. కలెక్టరేట్ -
పీతల సరఫరాలో ఘరానా మోసం
కాట్రేనికోన: పచ్చ పీత పిల్లలకు సొమ్ము చెల్లిస్తే మండ పీత పిల్లలను అంటగట్టి రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన పల్లం గ్రామంలో చోటు చేసుకుంది. మండలం పల్లం గ్రామానికి చెందిన 26 మంది రైతులు 50 ఎకరాలు పీతల చెరువులు లీజుకు చేస్తున్నారు. పచ్చ పీత పిల్లల కోసం స్థానికం హేచరీ అందుబాటులో లేక పోవడంతో మద్రాసుకు చెందిన హేచరీ నుంచి పీత పిల్లలను పల్లం గ్రామానికి చెందిన పాలెపు శ్రీను, సంగాని సత్యంకు సొమ్ము చెల్లించారు. 26 మంది రైతులు ఒక పీత పిల్లకు రూ.23 చొప్పున 60 వేల పిల్లలకు రూ.14 లక్షలను దళారులు పాలెపు శ్రీను, సంగాని సత్యంలకు చెల్లించారు. అయితే పచ్చ పీత పిల్లలకు బదులు నకిలీ పీతలను (మండ పీతల) సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ చెరువులో పీత పిల్లలను వదలడం, సీడ్ దశలో ఉండడం వల్ల అసలో నకిలీయో తెలియదని వారు పేర్కొన్నారు. చెరువులో పీతలు వేసి 20 రోజులు పైబడిందని, పచ్చ పీతలకు బదులు మండ పీతలని తేలడంతో మోసపోయినట్టు గుర్తించామని, మండ పీత పిల్లలను సరఫరా చేసిన హేచరీ యాజమాన్యం పైన, దళారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పచ్చ పీతలకు బదులు మండ పీతలు పంపిన హేచరీ యాజమాన్యం రూ.14 లక్షలు నష్టపోయిన రైతులు -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో పట్టపగలు జరిగిన చోరీపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక జాతీయ రహదారిపై నరేంద్రగిరి ఎదురుగా ఉన్న భవనంలో పట్టపగలే చోరీ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ప్రాధమికంగా 2.1 కేజీల వెండి, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురైనట్టు భావించారు. అయితే ఇంటి యజమాని కంటిపూడి శివానంద భాస్కరరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీని ఆదారంగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్ చాంప్స్ ‘తూర్పు’
67 పతకాలు కై వసం నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టు పాల్గొని ప్రతిభ కనపరచిందని తైక్వాండో సంఘ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి 80 మంది ఈ పోటీలలో పాల్గొనగా 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు సాధించి జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకున్నారన్నారు. కడప జిల్లా ద్వితీయ స్థానాన్ని, అనంతపురం జిల్లా తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయని తెలిపారు. ఈ పోటీలో జాతీయస్థాయి రిఫరీలు భార్గవి, సాయి, రోహిత్ జిల్లా నుంచి పాల్గొనగా తైక్వాండో కోచ్లు సత్యనారాయణ, మణికంఠ, త్రిమూర్తులను అర్జునరావు అభినందించారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
బిక్కవోలు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడదేర్చింది ఆ ఇల్లాలు. సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిక్కవోలు గ్రామంలోని కెంగం శ్రీను (43) లారీ క్లీనర్గా పనిచేస్తున్నారు. స్థానిక జగనన్న లే అవుట్ ప్లాట్ నంబర్ 59లో భార్య దేవితో కలసి కాపురం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా పెద్దవాడు సురేంద్ర సత్యకుమార్ నర్సాపురం మండలం సీతారామపురంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు యశ్వంత్కుమార్ పోలవరం మండలం గుటాల గ్రామంలో తాపీ పని చేస్తుంటాడు. దేవి బిక్కవోలులో అంబటి పేట ప్రాంతానికి చెందిన జంపా దుర్గారావుతో వివాహేతర సంబంధం నెరపుతుండడంతో ఆ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి వివాహేతర సంబంధాన్ని చూస్తూ ఉండలేక చిన్న కుమారుడు గుటాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మళ్లీ శ్రీను, దేవి ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో శ్రీను మృతి చెందాడు. బుధవారం ఉదయం శ్రీను తల్లి సరస్వతి ఇంటికి రాగా విగతజీవుడై పడి ఉన్న శ్రీనును చూసి కన్నీరుమున్నీరైంది. అనంతరం దేవి తన ప్రియుడు దుర్గారావుతో కలసి శ్రీనును చంపినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ శ్రీవిద్య, సీఐ సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను భార్య దేవి, దుర్గారావు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వారు తెలిపారు. శ్రీను మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించినట్టు సీఐ తెలిపారు. భర్తను హత్య చేసిన భార్య ప్రియుడితో కలసి పరారీ -
గల్లంతైన మృతదేహం లభ్యం
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం బీచ్కు స్నానాలకు వెళ్లి సముద్రంలో మంగళవారం గల్లంతైన ఇద్దరిలో రెండో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన యాళ్ల హరికిశోర్ మృత దేహం మంగళవారమే లభ్యమైనప్పటికీ మరో యువకుడు ఇసుకపట్ల జస్వంత్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం వాపాలతిప్ప సమద్రతీర ప్రాంతంలో లభ్యమైనట్టు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు. ఆ మృత దేహాన్ని తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఎస్ఐ రాజేష్ పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందించారు. యువకుడి ఆత్మహత్య యానాం: పిన్ని ఇంటికి వచ్చి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం యానాం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం, జయంతి కాలనీకి చెందిన గండ్రాపు వెంకటకృష్ణచైతన్య (24) యానాంలో వికాస్కాలనీలో నివాసం ఉంటున్న తన పిన్ని ఇంటికి ఇటీవల వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతున్న కృష్ణచైతన్యను చూసిన బంధువులు హుటాహుటిన కిందకు దింపి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణచైతన్య బీటెక్ చదువుకున్నాడని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పెంకే గణేష్ తెలిపారు. -
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండవారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతోంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.గత ఏడాది.. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అక్షరంపై కక్ష కట్టి..
‘సత్యమేవ జయతే’ హితోక్తిని మకుటంలో ధరించి.. ఆ మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి.. ప్రభుత్వ విధానాల్లోని దుర్నీతిని ఎండగడుతూ.. నిరంతరం జనపక్షం వహిస్తూ.. ప్రజలకు నిత్యసత్యాలను అందిస్తున్న ‘సాక్షి’ అక్షరంపై పాలకులు కక్ష కట్టారు. సాకు కోసం వేచి చూసి.. మూకదాడికి ‘కూటమి’ కట్టారు. అణగారిన ప్రజల మనస్సాక్షిగా నిలుస్తున్న పత్రిక కార్యాలయంపై తెగబడ్డారు. పత్రిక నేమ్బోర్డును బలవంతంగా పెకలించి, ధ్వంసం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ మూకల బరితెగింపు చూసి అటుగా వెళ్తున్న సామాన్య ప్రజలు నివ్వెరపోయారు. చక్కటి పాలన అందించాలని అందలం ఎక్కిస్తే.. ఇలా అరాచకానికి పాల్పడటమేమిటంటూ నిర్ఘాంతపోయారు. రాజానగరం: ‘సాక్షి’ టీవీలో ఇటీవల జరిగిన ఒక చర్చాగోష్టిలో అమరావతి మహిళలను కించపరిచేలా ఓ వ్యక్తి వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆ పార్టీతో కూటమిగా ఉన్న బీజేపీ, జనసేన శ్రేణులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని, సాక్షి కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు పాల్పడి, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయం వద్ద కూడా కూటమి నేతలు ఆదివారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం అవి మరింత పరాకాష్టకు చేరాయి. ఆందోళనకారుల దుర్మార్గ చర్యలను నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులు కూడా గాయపడ్డారంటే వారి చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగిందంటే.. రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(బీజేపీ)తో పాటు అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన రెండు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు సాక్షి ముద్రణా కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి, ఆందోళనకు దిగారు. ఉదయం 10.30 గంటల సమయంలో రాజానగరం ఎమ్మెల్యే తన అనుయాయులతో కలసి ఆందోళన చేపట్టారు. సాక్షి మీడియాకు, వైఎస్సార్ సీపీకి, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి తన వర్గీయులతో అక్కడకు చేరుకున్న అనపర్తి ఎమ్మెల్యే ఆ ఆందోళనను కొనసాగిస్తూ విధ్వంసం దిశగా నడిపించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు సాక్షి దిన పత్రికలను వేసి దహనం చేశారు. పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు ఆగలేదు. దౌర్జన్యం ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి ప్రోత్సాహంతో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి మరింత రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులను ఉసిగొల్ప్పారు. దీంతో, అన్నవరం దేవస్థానం మాజీ డైరెక్టర్ సత్తి దేవానందరెడ్డి (బాబు), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పుట్ట గంగాధర్ చౌదరి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి, ప్రధాన కార్యదర్శి సువాసిని, బిక్కవోలు యూత్ కమిటీ అధ్యక్షుడు పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరితో పాటు కొంతమంది మహిళా కార్యకర్తలు కార్యాలయం ప్రహరీకి అమర్చి ఉన్న సాక్షి నేమ్ బోర్డును బలవంతంగా పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులను ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సైలు నాగార్జున, నారాయణమ్మతో పాటు కొంతమంది పోలీసుల చేతులకు కూడా గాయాలయ్యాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు అమానుషంఫ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఫ జిల్లా ఎస్పీకి జర్నలిస్టుల విజ్ఞప్తి ఫ నిజాలు చెబుతున్న ‘సాక్షి’పై అక్కసు ఫ దాడికి ‘కూటమి’ కట్టారు ఫ రాజానగరంలోని పత్రికా కార్యాలయం వద్ద ఆందోళన ఫ మూకుమ్మడి దాడి ఫ అనపర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యాన చెలరేగిపోయిన మూకలు ఫ సాక్షి నేమ్ బోర్డు పీకేసి.. పత్రికల దహనం ఫ అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై అరాచక దాడులు చేస్తున్న టీడీపీ కుట్రపూరిత చర్యలపై జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. రాజమహేంద్రవరం సాక్షి జర్నలిస్టులు, సాక్షి యూనిట్, ఇతర పాత్రికేయులు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ను కలిసి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. సాక్షి టీవీలో అమరావతి రాజధాని అంశంపై జరిగిన చర్చకు సంబంధించి టీడీపీ, ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు సాక్షి కార్యాలయాలపై రాళ్ల దాడులు చేపట్టి, బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఆదేశాలతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధిష్టానం కుట్రపూరితంగా తన శ్రేణులను రెచ్చగొట్టి సాక్షిపై దాడులకు ఉసిగొల్పుతోందని అన్నారు. గుంపులుగా చేరి దాడులు చేసిన వారిపై 143, 147, 427, 341, 506, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే సాక్షి కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీని కలిసిన వారిలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, సాక్షి టీవీ రిపోర్టర్ హరీష్, ఎన్టీవీ శ్రీను, సాక్షి జర్నలిస్టులు శేఖర్రెడ్డి, విశ్వనాథం, పీఎస్ గంగాధర్, టీవీ కెమెరామెన్ మురళి, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, ఎస్ఆర్ సురేష్కుమార్, యాడ్స్ ప్రతినిధి పి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
సముద్రంలో మునిగి యువకుడి మృతి
గల్లంతైన మరొకరి కోసం గాలింపు ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఉన్న బీచ్లో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతుకాగా అందులో ఒకరు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన యాళ్ళ హరికిషోర్(19), అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఇసుకపట్ల జస్వంత్(19), మరో ముగ్గురు నేదునూరుకు చెందిన యువకులు ఎస్.యానం బీచ్కు వచ్చి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. వీరు ఐదుగురు స్నేహితులు. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల్లో హరి కిషోర్, జస్వంత్ సముద్రంలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా హరికిషోర్ మృతదేహం లభ్యమయిందని, జస్వంత్ కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ సీహెచ్.రాజేష్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం... అంబాజీపేట: మృతిచెందిన యాళ్ల హరికిషోర్ ఓ ప్రైవేటు కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దిక్కెవరని బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరి స్వగ్రామం పి.గన్నవరం కాగా మృతుడి తండ్రి కుమార్ ఎస్.యానం ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. తల్లి నాగమణి, అతని సోదరి మాచవరం కుసుమవారిపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అందరితో సరదగా ఉండే హరికిషోర్ ఇక లేడని తెలియడంతో కుసుమవారిపేటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హరికిషోర్ అందరితో కలిసి ఉండేవాడని అతని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. -
బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
అల్లవరం: మండలంలోని కోడూరుపాడు పంచాయతీ పరిధిలోని గుడ్డివానిచింత వద్ద బీవీసీ అక్షర్, బండిగుప్తాపు పాండురంగ సంయుక్తంగా నిర్మించిన ఇంటర్నేషనల్ స్కూల్ని సోమవారం బీవీసీ అధినేత బోనం కనకయ్య, ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బీవీసీ అక్షర్ స్కూల్ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కంపూడి కిరణ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, గొవ్వాల రాజేష్, దొమ్మేటి రాము, సందర్శించి బీవీసీ అక్షర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. బీవీసీ చైర్మన్ బోనం సతీష్, మెట్ల రమణబాబు, దాసం రాంబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతలు విజయలక్ష్మి, జగ్గిరెడ్డి ● సేవ్ వుమెన్...సేవ్ ఆంధ్ర నినాదంతో పార్టీ మహిళల నిరసన ● అమలాపురంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ ● కిలోమీటరు మేర నినాదాలతో సాగిన నిరసన ర్యాలీ అమలాపురం టౌన్: చంద్రబాబు పాలనలో మహిళలు, బాలికలకు భద్రత కరవైందని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ వుమెన్...సేవ్ ఆంధ్ర నినాదంతో జిల్లా పార్టీకి చెందిన మహిళా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అమలాపురంలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో విజయలక్ష్మి, జగ్గిరెడ్డి మాట్లాడారు. తొలుత స్థానిక సూర్యనగర్లోని పార్టీ నేత దివంగత కుడుపూడి చిట్టబ్బాయి ఇంటి వద్ద నుంచి పార్టీ మహిళలతో ర్యాలీ ప్రారంభించారు. హైస్కూలు సెంటరు, గొల్లగూడెం, శ్రీరామపురం మీదుగా మద్దాలవారిపేటకు దాదాపు కిలోమీటరు మీర నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు, బాలికలకు రక్షణ ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం రాజీనామా చేయాలని ర్యాలీలో నినాదాలు చేశారు. పాదయాత్ర మద్దాలవారిపేట చేరుకున్నాక ఆ పేటలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన జిల్లా మహిళలు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు వద్దని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు భద్రత, రక్షణ కల్పించాలని అంబేడ్కర్ విగ్రహాన్ని వేడుకున్నారు. అనంతరం విజయలక్ష్మి, జగ్గిరెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది కాలంలో మహిళలు, బాలికలపై 188 హత్యలు, అత్యాచారాలు జరిగాయని విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. 15 కేసుల్లో మహిళలు, బాలికలు అత్యాచారాలతో పాటు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోవడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతోందన్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనను డైవర్ట్ చేసేందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్న సాక్షి చానల్, పత్రికపై అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం, మండపేట మున్సిపల్ చైర్పర్సన్లు రెడ్డి సత్య నాగేంద్రమణి, పతివాడ నూక దుర్గావాణి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర దృశ్య కళల అకాడమి మాజీ చైర్పర్సన్ కుడుపూడి సత్య శైలజ, జిల్లా పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు కాశి ముని కుమారి, అమలాపురం, అల్లవరం, అయినవిల్లి ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, మట్టపర్తి నాగ విజయలక్ష్మి, అల్లవరం జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, నియోజకవర్గంలోని పట్టణం, మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, బద్రి బాబ్జి, కొనుకు బాపూజీ, గుత్తుల చిరంజీవి, పార్టీ అనుబంధ కమిటీల జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, జాన గణేష్, చీకట్ల కిషోర్, తోరం గౌతమ్ రాజా, సూదా గణపతి, మున్సిపల్ కౌన్సిలర్లు నాగవరపు వెంకటేశ్వరరావు, దొమ్మేటి రాము, కొల్లాటి దుర్గాబాయి, యన్నాబత్తుల పద్మ, రాజీ గోపి, కట్టోజు సన్నయ్యదాసు, బండారు గోవిందు, పార్టీ నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, మెండు సురేష్బాబు, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురవుతున్న నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. -
మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం
అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మహిళల రక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందని, ఏడాది కాలంలో ఆడబిడ్డలపై 188 దారుణాలు చోటు చేసుకున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చర్యలు తీసుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాలనపై కన్నా రెడ్బుక్ రాజ్యంగంపై శ్రద్ధ చూపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి జైల్లో పెడుతూ రెడ్ బుక్ని ఫాలోఅవుతున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురంలో తన్మయి హత్యకు గురి కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించడానికి తీరిక లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే కూటమి నాయకులు, హోంమంత్రి అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న ఆరాచకాలను ఆపి, బాధితులకు అండగా నిలబడాలని, వారి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ నాయకత్వంలో పోరాటాలను ఉధృతం చేస్తామని మాజీ ఎంపీ అనురాధ హెచ్చరించారు.పత్రికా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదంసాక్షి కార్యాలయాలపై దాడులకు ఏపీ యూడబ్ల్యూజే జిల్లా శాఖ అధ్యక్షుడు బాబీ ఖండనఅమలాపురం టౌన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా శాఖ అధ్యక్షుడు మండేల బాబి ఖండించారు. ఈ మేరకు బాబి అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రికా ప్రతులను దగ్ధం చేయడం వంటి చర్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. టీవీలో డిబేట్పై పలుచోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం మంచి పద్ధతి కాదని బాబి అభిప్రాయపడ్డారు. -
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించిన 168 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఈ అవార్డులు అందజేశారు. పదో తరగతిలో 139 మంది, ఇంటర్లో 29 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు బహుమతి, ప్రశంసా మెడల్ బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపామని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించి, సత్ఫలితాలు రాబట్టామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడికి కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, ఫలితాలను మెరుగుపరిచే బాధ్యత అప్పగించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించి, భవిష్యత్తు ప్రణాళికలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి, జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా, ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖాధికారి వి.సోమశేఖరరావు, సర్వ శిక్ష ఏపీసీ జి.మమ్మీ తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీగా త్రినాథరావు
అన్నవరం: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావును దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (రాజమహేంద్రవరం)గా బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థానానికి ఈఓని నియమించేవరకు ఆ దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా కూడా కొనసాగాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్జేసీగా పనిచేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓ వి. సత్యనారాయణమూర్తికి ఇన్చార్జి బాధ్యతలు తొలగించారు. త్రినాథరావు గతంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా, రెండుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా, 2020–22 మధ్య రెగ్యులర్ ఈఓగా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఓగా 2024లో బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన సెలవు పై విదేశాలకు వెళ్లగా ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీ సుబ్బారావును సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఆరుగుగు భక్తులు మృతి చెందిన ఘటనలో ఇన్చార్జి ఈఓ సుబ్బారావుతో సహా ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త్రినాథరావు సెలవు అనంతరం మే 26న సింహాచలం దేవస్థానం ఈఓగా జాయిన్ అయ్యారు. -
స్వామి పుష్కరిణిలో డెవిల్ ఫిష్!
● యథేచ్ఛగా చేపల వేట ● అసలు అవి ఎలా వచ్చాయి? ● ఇద్దరి మృతితో ఎట్టకేలకు నీటికి మోక్షం గండేపల్లి: తాళ్లూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి గజేంద్ర మోక్ష పుష్కరిణిలో కొందరు ఆకతాయిలు సోమవారం చేపలను వల సహాయంతో పట్టుకుని తీసుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో పెరిగిన చేపలను పట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆలయాలలో ఉండే కోనేరులలో పెరిగిన చేపలను విష్టుమూర్తి మత్స్యావతారంగా భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో చేపలను పట్టుకోవడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు. అసలు పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? గజేంద్ర మోక్ష పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? ప్రకృతి సహజసిద్ధమా! ఎవరైనా చేప పిల్లలను కోనేరులో వేశారా అన్నది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో కొందరు కోనేరులో చేప పిల్లలను పెంపకానికి వేయడంతో అడ్డుకున్నామని అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో వేసిన చేపల పెట్టిన గుడ్లే ప్రస్తుతం కోనేరులో చేపలు పెరగడానికి కారణం కావచ్చు అంటున్నారు. ఘోరం జరిగే వరకూ మనసు కరగదా ఘోరాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయే వరకూ స్పందించారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణికి మెట్ల మార్గం నాచుకట్టి కనీసం భద్రత లేకపోవడంతో ఇటీవల బొర్రంపాలెంకు చెందిన తండ్రీ కొడుకు స్నానాకికి దిగి మృతిచెందారు. దీంతో రెవెన్యూ, దేవదాయశాఖ, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టేందుకు తగు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు. పుష్కరిణిలో నీటికి మోక్షం ఎట్టకేలకు పుష్కరిణిలో నీటికి మోక్షం కలిగింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇది సాధ్యమైంది. కొన్ని సంవత్సరాలుగా పుష్కరిణిలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి తట్టు తేలి పుష్కరిణి (కోనేరు) ప్రమాదకరంగా మారింది. పదవులు లేకపోయినా కొందరు పెత్తనం చెలాయించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆటకం కలుగుతోందని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు. పుష్కరిణిలో డెవిల్ ఫిష్ పుష్కరిణిలో సాధారణ చేపలతో పాటు డెవిల్ ఫిష్లు పెరిగాయి. పుష్కరిణిలో నీరు తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు దిగిన వారి వలకు ఈ డేవిల్ ఫిష్లు చిక్కాయి. అటుగా వెళ్లే వారందూ వాటిని చూసేందుకు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. ఈ డేవిల్ ఫిష్, ఇతర జాతులకు చెందిన చేపలు పుష్కరిణి అడుగుబాగం బురదలో తేలియాడుతున్నాయి. -
మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుతూ టీచర్ల నిరశన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు మాన్యవల్ విధానంలో కౌన్సెలింగ్పై స్పష్టత లేకపోవడంతో సోమవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద ఽనిరాహార దీక్ష చేపట్టారు. ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సెలింగ్కు ఉపాధ్యాయ ఐక్యసంఘాలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. మాన్యువల్ కౌన్సెలింగ్కే కట్టుబడి ఉండటంతో వెబ్ ఆప్షన్లకు లింక్ విడుదల చేసినప్పటికీ ఆప్షన్లు ఇవ్వడం లేదు. దశలవారీ పోరాటంలో భాగంగా ఐక్యవేదిక పిలుపు మేరకు నిరహార దీక్ష చేపట్టారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. పీడీఎఫ్ ఎంఎల్సీ బొర్రా గోపిమూర్తి హాజరై సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. జీవో నంబర్ 22లో అనేక లోపాలున్నాయని, దాన్ని మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏపీఈఏపీ –25 ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీసెట్–2024 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో పి.ఆదిత్య అభిషేక్ 13వ ర్యాంక్, జి.లోషిణి 72, .శుభశ్రీవల్లిఅత్రేయ 91, జి.శ్రీరామశశాంక్ 95, వై.వేదిక 96 ర్యాంక్ సాధించారన్నారు. వీటితో పాటు 121, 136, 156, 169, 170, 172, 177, 198 ర్యాంకులు సాధించారన్నారు. అగ్రికల్చరల్ ఫార్మశీ విభాగంలో సాయిభవ్యహర్షిణి 31వర్యాంక్, దేవి సౌమ్య శ్రీ 112, పి.శ్రీధర్ 119, సి.వెంకట శివసాయి అచ్యుత 152 ర్యాంకు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 500లోపు 38, వెయ్యిలోపు 62మంది ర్యాంకులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్య దర్శి కృష్ణదీపక్రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ఐఐటీ ప్రిన్సిపాల్ మొయి నా, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, రాఘవరెడ్డి, గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
కరవాక తీరానికి వింత జీవులు
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రగతిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ, వాద్వాని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రైన్ది ట్రైనర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ అండ్ వెంచర్ క్రియేషన్ అంశంపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సోమవారం జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్వయం ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలు వికసిత్ భారత్ 2047–సర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయడానికి దోహదపడతాయన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ శిక్షణకు తమ కళాశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందని, వాద్వాని ఫౌండేషన్ డైరెక్టర్, పార్టనర్ షిప్ దయాకరమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. జేఎన్టీయూకే అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలకృష్ణ, డైరెక్టర్ మేనేజ్మెంట్ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ అకడమిక్స్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి.నరేష్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ కె.ఆనంద్ పాల్గొన్నారు. -
రామచంద్రపురంలో మాన్సాస్కు ఎసరు
కె.గంగవరం మండలం కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుకతో పాటు బొండు మట్టిపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఇసుక తవ్వుకుపోతున్నారు. రోజుకు 100 లారీల వరకూ ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతోందని అంచనా. ఇక్కడ తవ్వకాలకు గత నెల 22వ తేదీ వరకూ మైనింగ్ శాఖ అనుమతులున్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాానీ, వాస్తవానికి ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆయన ముఖ్య అనుచరులు ఈ దందా నిర్వహిస్తున్నారు. -
ఎండ వేడికి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో ఎండ వేడికి సోమవారం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రానన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ బయటకు రావడంతో అంటుకొని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న గడ్డి మొక్కలు మంటలకు కాలిపోయాయి. పురుషోత్తపల్లి విద్యుత్ ఏఈ బి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఓ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30,000 ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో నిడదవోల పట్టణంలోని బసివిరెడ్డిపేట, నిడదవోలు మండలంలోని సమిస్రగూడెం, అట్లపాడు, తాళ్లపాలెం, శెట్టి పేట గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.