breaking news
Dr B R Ambedkar Konaseema
-
కోనసీమలో భారీగా గ్యాస్ లీక్..!
మలికిపురం: మరోసారి కోనసీమ జిల్లా వాసుల్ని ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఇరుసుముండలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైంది. గ్యాస్ తీవ్రతతో మంటలు వంద అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి విధులు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తుండడంతో ఇరుసుముండ గ్రామాన్ని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ధాటికి వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. గ్యాస్లీకేజీపై సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు సైతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లో అవుట్కు దారి తీస్తుందేమోనని భయం గుప్పెట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాశర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. ఈ గ్యాస్ లీక్ తొందరగా అదుపులోకి వస్తే ఫర్లేదు కానీ ఒకవేళ తీవ్రతరమైతే మరొకసారి తామ తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకునేరు..
జిల్లాలో కోడి పందేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐ.పోలవరం, అల్లవరం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన మండలాల్లో కూడా పందేలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు పందేల బరుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. పోలీసులు అధికారికంగా అనుమతులు ఇవ్వకున్నా పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేసేలా చూడాలని, బరులకు అనధికార అనుమతులు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను చదును చేసి పందేల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. కోడి పందేలతోపాటు ఈ ఏడాది గుండాటలు కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశముంది. పందేల బరుల వద్దే గుండాటల కూడా నిర్వహించనున్నారు. ఈ తంతుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్ధకమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా: ‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకుంటారు. అసలు కాదండోయ్.. ఇది అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే కోడి పందేలకు చేసిన రీల్స్.. సంక్రాంతి సమీపిస్తుండడంతో జూదరులను ఆకర్షించేందుకు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామనే పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ, పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ ముందు రోజు వరకూ పందేల నిర్వహణ, బరులు సిద్ధం చేయడాన్ని రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వం మారిన తరువాత వారం పది రోజుల ముందు నుంచే కోడి పందేలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇది సరిపోదన్నట్టు ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీశారు. కోడి పందేల బరులతో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో పందేల రీల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇలా పందేల కోసం బహిరంగంగానే ప్రచారం మొదలు పెట్టారు. కోడి పందేల బరులు, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు, ఎల్సీడీలు, కార్ పార్కింగ్లు.. ఇలా సర్వం రీల్స్లో చూపిస్తూ జూదరులను ఆకర్షిస్తున్నారు. జిల్లాలో కోడి పందేలు అనగానే గుర్తొచ్చేది ఐ.పోలవరం మండలం మురమళ్ల. ఇక్కడ పండగ మూడు రోజులూ రూ.కోట్లలో చేతులు మారుతుంటాయి. టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే పందేలలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు హాజరవుతుంటారు. వీరితోపాటు అదనపు ఆకర్షణగా తెలుగు సినిమా నటులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే హైటెక్ బరులు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్సీడీ టీవీలు, గ్యాలరీ వంటివి అధునాతంగా ఉంటాయి. వీవీఐపీలకు ఆతిథ్యం అదనం. దీనికే ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కలి్పస్తున్నారు. ఇది రీల్స్లో అగ్రగామిగా నిలిచింది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పందేలకు ఏర్పాట్లు చేస్తుండడంతో జూదరులు మరింత మంది పందేలకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ రీల్స్లో గత ఏడాది పందేలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సినీ నటులు కూడా కనిపిస్తున్నారు. దీనితో పాటు జిల్లాలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పులంక, అల్లవరం మండలం గోడి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగే వాటికి కూడా ప్రచారం మొదలైంది. కోడి పందేల నిర్వహణ చట్టరీత్యా నేరమైనా చంద్రబాబు ప్రభుత్వంలో దీనికి కూడా ఒక బ్రాండింగ్ కల్పించి ప్రచారం చేయడాన్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
జగ్గిరెడ్డిని ఎదుర్కోలేక చవకబారు విమర్శలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు అధ్యక్షులు జున్నూరి రామారావు అల్లవరం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని ఎదుర్కోలేకే కూటమి నేతలు చవకబారు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రావులపాలెంలోని ఎంకేఆర్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని జగ్గిరెడ్డి అవమానించారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని రామారావు తెలిపారు. మహనీ యుని విగ్రహాన్ని రాత్రి వేళల్లో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని, ఈ సెంటర్లో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశం తప్ప మరే దురుద్దేశం లేదన్నారు. ఎంకేఆర్ సెంటర్లో ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించరాదని పంచాయతీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఆ తీర్మానాన్ని కాదని రాత్రికి రాత్రే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్ట కలిగిన మహానీయునికి మీరేచ్చే గౌర వం ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు జరుగుతున్నా కాపు నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఓ కాపు సోదరుడిని కారుతో తొక్కించి హత్య చేసిన ఘటనపై, ఐ.పోలవరం మండలం బాణాపురంలో ఓ కాపు బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని అన్నారు. కాపుల ఆరాధ్య దైవంగా భావించే రంగాను చంపినప్పుడు, దేవాలయం లాంటి శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు అధికమయ్యాయని అన్నారు. -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు పయనం
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్కు అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతి విద్యార్థిని కె.కావ్య సుందరి హరిప్రియ ఎంపికై ందని తైక్వాండో సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో బాపట్ల జిల్లా పేకేరులో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ అండర్– 14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దాంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ పంజాబ్లోని లుడియానలో జరిగే 69వ జాతీయ స్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్లో 20 కిలోల విభాగంలో హరిప్రియ పాల్గొనుందన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం బయలు దేరిందన్నారు. జాతీయ పోటీలకు వెళ్తున్న హరిప్రియకు, కోచ్ పితాని లక్ష్మీభార్గవిలకు హెచ్ఎం కడలి సాయిరామ్, పీడీలు కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయుడు బీఎస్ఎన్ మూర్తి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ అమలాపురం టౌన్: కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) జిల్లా అధ్యక్షుడిగా అమలాపురానికి చెందిన కొత్తూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి నియామక ఉత్తర్వులను శ్రీనివాస్ అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అమలాపురానికి చెందిన సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజుకు శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు. గతంలో శ్రీనివాస్ డీసీసీలోనే కాకుండా పీసీసీలో కూడా పలు పదవులు నిర్వహించారు. వంతెన నుంచి పడి వృద్ధుడి మృతి నల్లజర్ల: పోతవరం ఎర్ర కాలువ వంతెన పైనుంచి కాలుజారి ఓ గుర్తు తెలియని వృద్ధుడు పడిపోయాడు. స్థానికులు అతనిని 108 అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి వయసు 60 నుంచి 65 మధ్య ఉంటుందని, తెల్లని పొడుగు చేతుల చొక్కా, నీలం, నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిస్తే నల్లజర్ల సీఐ రాంబాబు సెల్ నంబర్లు 94407 96614, 95054 40640కు సమాచారం అందించాలని కోరారు. మ్యాజిక్ ఫ్యామిలీకి గాంధీ సేవా పురస్కారం కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ జాతీయ స్థాయి గాంధీ సేవా పురస్కారం అందుకుంది. మెగా మ్యాజిక్ ఫ్యామిలీ, అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చింతా శ్యామ్కుమార్ కుటుంబం పేదలకు సేవ చేస్తుంది. అలాగే వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. పై సేవా సంస్థల ద్వారా శ్యామ్కుమార్, అన్నపూర్ణ దంపతులు, ఫిజియోథెరపిస్ట్లు మోహిత్, సీత దంపతులు చేస్తున్న సేవలను ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కేంద్రంగా పనిచేస్తున్న జీవన్ జాగృతి సేవా సంస్థ గుర్తించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గాంధీజీ సేవా పురస్కారానికి శ్యామ్ కుటుంబాన్ని ఎంపిక చేసింది. ఆ మేరకు అవార్డు కింద సర్టిఫికెట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా శ్యామ్, అన్నపూర్ణ దంపతులు, డాక్టర్లు మోహిత్, సీతలు మాట్లాడుతూ ఈ అవార్డు తమలో మరింత బాధ్యతను పెంచిందని, సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ నెల 1న ఉత్తరప్రదేశ్ అహ్మదాబాద్లో ఈ అవార్డును అందుకోవాల్సి ఉందని, అనివార్య కారణాలతో హాజరు కాకపోవడంతో కొరియర్ ద్వారా దీన్ని నిర్వాహకులు పంపించారని తెలిపారు. -
కుట్ర పూరితంగానే ప్రభుత్వానికి సరెండర్
కలెక్టర్పై డీఆర్డీఏ పీడీ ఆరోపణ అమలాపురం రూరల్: తనను కలెక్టర్ అకారణంగా, కుట్ర పూరితంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారని డీఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ ఆరోపించారు. సెర్ఫ్ సీఈఓ అనుమతితో సెలవుపై వెళితే తనకు షోకాజ్ నోటీసు లేకుండా కలెక్టర్ సరెండర్ ఉత్తర్వులు ఇచ్చారని పీడీ వాపోయారు. ఆదివారం అమలాపురం ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఆ సరెండర్ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ సంఘాలతో కలసి ఉద్యమం చేస్తారని అన్నారు. తాను కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నా రావడం లేదనే కారణం చూపుతూ, డీఆర్వో మాధవి సంతకంతో ప్రభుత్వానికి సరెండర్ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని అన్నారు. తాను గిరిజన కులానికి చెందిన వ్యక్తిని కావడంతోనే అన్యాయం చేశారన్నారు. జిల్లాలో పది నెలల కాలంలో మహిళా సంఘాల, బ్యాంకు లింకేజీ సీ్త్రనిధి నిధులు దుర్వినియోగంపై 18 మంది వీఓలను తొలగించి రూ. 64.69 లక్షలను తాను రికవరీ చేశానని చెప్పారు. తనకు కలెక్టర్ అంటే ఎంతో గౌరవమని అన్నారు. ఈ ఆరోపణలపై డీఆర్వో మాధవిని ‘సాక్షి’ వివరణ కోరగా పీడీ సమావేశాలకు హాజరు కాకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా సెలవు పెట్టి వెళ్లి ఏపీడీకి ఇన్చార్చి అప్పగించారని అన్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా తిరిగి పీడీగా చార్జి తీసుకున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వానికి కలెక్టర్ ఆదేశాలతో సరెండ్ చేసినట్లు వివరించారు. -
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
రావులపాలెం: రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన శాంతిభద్రతల సంఘటనలో ప్రస్తుతం పోలీస్ పహారా కొనసాగుతుందని, ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఆదివారం సాయంత్రం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, దీనికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే వైజాగ్ చెందిన ఒక వ్యక్తిపై సోషల్ మీడియాలో పెట్టిన చలో రావులపాలెం పోస్ట్ కారణంగా కేసు నమోదు చేశామన్నారు. సంక్రాంతి నేపథ్యంలో గుండాటలే, కోడి పందేలు నిర్వహిస్తే కేసులు పెడతామన్నారు. సమావేశంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐ ఎం.శేఖర్బాబు పాల్గొన్నారు. -
భీమేశ్వరాలయంలో మరో అపచారం
ఫ కారకులపై చర్యలు తీసుకోండి ఫ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ముక్కోటి ఏకాదశి నాడు ధ్వంసం చేస్తే ఈ అప్రతిష్ట నుంచి బయట పడాలన్న తొందరపాటులో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మరో ఘోర అపచారానికి పాల్పడ్డారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇటువంటి అపచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ మంగవారం తెల్లవారు జామున 1.30 ప్రాంతంలో ఒక దుండగుడు సుత్తితో ప్రాచీన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ధ్వంసం చేశాడు (పోలీసుల కథనం ప్రకారం). ఉదయం 6.30 గంటలకు స్థానిక అయ్యప్ప స్వాములు శివలింగం ధ్వంసం అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం కూటమి నాయకులతో కలసి మధ్యాహ్నం వరకూ ఆలయం వద్దనే ఉండి ఈ అప్రతిష్ట అటు ప్రభుత్వానికి, ఇటు స్థానిక నాయకత్వానికి చెడ్డపేరు రానివ్వకూడదనే తొందరపాటులో శూన్య మాసమని, మూఢం చూడకుండా సరైన పండితులతో చర్చించకుండా కంగారుగా శివలింగం ప్రతిష్ఠ చేశారన్నారు. సూర్యస్తమయం కాకుండా శివలింగం ప్రతిష్ఠ చేయాలనే కృత్రిమ తొందరపాటును కల్పించి హడావుడి చేసి ప్రతిష్ఠ చేసేశారన్నారు. అయితే వారు చెప్పిన దాని ప్రకారమే చూసినా ఆ రోజు సూర్యాస్తమయం భీమేశ్వరాలయ పంచాంగం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఉండగా, 5.39 గంటల వరకు స్వామివారి పానుపట్టం ఖాళీగానే ఉన్న ఫోటో, అదేవిధంగా 5.40 గంటలకు శివలింగాన్ని పానుపట్టంపై అమర్చిన ఫోటోలు బయట పడటంతో వారు ఎంతటి అపచారానికి పాల్పడ్డారనేది తేటతెల్లం అయ్యిందన్నారు. మంత్రి సుభాష్ అనుచరులు 5.15 గంటలకే శివలింగ ప్రతిష్ఠ పూర్తి చేశామని, ప్రజలను పక్కదోవ పట్టించాల ని చూశారన్నారు. శివలింగ ప్రతిష్ఠ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందనేది విస్తృతంగా ప్రచారం అవుతోందన్నారు. దీంతో హిందువులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ము డిపడిన అంశం కావడంతో మొత్తం సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విగ్రహానికి కాదు.. పెట్టే ప్రాంతానికి వ్యతిరేకం
ఫ కావాలనే బురద జల్లుతున్నారు ఫ గూగుల్ మ్యాప్ ద్వారా వివరించిన చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం: శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, ప్రమాదాలు జరిగే ప్రాంతంలో పెట్టడంతోనే వ్యతిరేకించామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రావులపాలెంలో విగ్రహ ఏర్పాటు ఘటనలో కులాల మధ్య చిచ్చుపెట్టాలని కూటమి నాయకులు చూస్తున్నారని, అలాగే ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని అన్నారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతంలో విగ్రహం పెట్టారని, అయితే దానిని శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపం వద్ద పెడితే తాను అడ్డుకున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. దీనిని ఖండిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి గూగుల్ మ్యాప్ ద్వారా ముందుకు వచ్చామన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ సీపీ క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. మహనీయులు శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అవమానించామని కూటమి అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కుట్ర లేకపోతే, అర్ధరాత్రి అంతటి మహనీయుని విగ్రహం ఎంకేఆర్ జంక్షన్లో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందన్నారు. అందరితో చర్చించి అనుకూలమైన, రోడ్డు ప్రమాదాలు జరగని స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే దానికి తన తరఫున పూర్తి సహకారం అందిస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వివిధ వర్గాల నుంచి సర్ ఆర్ధర్ కాటన్, అల్లూరి సీతారామరాజు, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్, హనుమాన్ విగ్రహాలు పెట్టాలని అభ్యర్థన వచ్చినా అక్కడ తరచూ ప్రమాదాలు జరగడంతో తిరస్కరించామన్నారు. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నామన్నారు. పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా విగ్రహం పెట్టడంలో కూటమి నాయకుల ఆంతర్యం ఏంటన్నారు. ఆ రోడ్లో నాలుగు కల్యాణ మండపాలు, స్కూళ్లు, ఆసుపత్రులు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని విగ్రహం పెట్టకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే, అక్రమంగా అర్ధరాత్రి పూట దిమ్మకట్టి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సరికాదన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తని చోట విగ్రహం ఏర్పాటు చేస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాయుల వారి విగ్రహాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో పెట్టి, దానిని శ్రీకృష్ణదేవరాయల కాపు కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేస్తుంటే తాను అడ్డుకున్నానని కావాలనే కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. దీని గూగుల్ మ్యాప్ ద్వారా జగ్గిరెడ్డి వివరించారు. కాపు కల్యాణ మండపం వద్ద రోడ్డు పక్కన ప్రదేశంలో నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అయినా అక్కడ నుంచి మూడు రోడ్లు దాటి దూరంగా ఉన్న ప్రమాదాల జోన్లోని సమస్యాత్మక ప్రాంతంలో కూటమి నేతలు విగ్రహాన్ని పెట్టించారని అన్నారు. ఇప్పటికైనా శ్రీకృష్ణదేవరాయలుపై కూటమి నాయకులకు గౌరవం ఉంటే, సమస్య లేని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలో విగ్రహం పెట్టడానికి ముందుకు రావాలన్నారు. దానికి తన సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో అమ్ముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, కాపు సంఘం నాయకుడు చల్లా ప్రభాకరరావు, సర్చంచ్ తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రీల్స్ చూపిస్తా మామ..
ఆంక్షలున్నా బేఖాతర్.. జిల్లాలో కోడి పందేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐ.పోలవరం, అల్లవరం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన మండలాల్లో కూడా పందేలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు పందేల బరుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. పోలీసులు అధికారికంగా అనుమతులు ఇవ్వకున్నా పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేసేలా చూడాలని, బరులకు అనధికార అనుమతులు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను చదును చేసి పందేల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. కోడి పందేలతోపాటు ఈ ఏడాది గుండాటలు కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశముంది. పందేల బరుల వద్దే గుండాటలను కూడా నిర్వహించనున్నారు. ఈ తంతుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్ధకమైంది. ఫ కోడి పందేలపై అధికార పార్టీ నేతల ప్రచారం ఫ ‘అలా మురమళ్ల’ పేరుతో వీడియోలు ఫ సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు ఫ పోలీసుల హెచ్చరికలు బేఖాతర్ ఐ.పోలవరం: ‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకుంటారు. అసలు కాదండోయ్.. ఇది అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే కోడి పందేలకు చేసిన రీల్స్.. సంక్రాంతి సమీపిస్తుండడంతో జూదరులను ఆకర్షించేందుకు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామనే పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ, పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ ముందు రోజు వరకూ పందేల నిర్వహణ, బరులు సిద్ధం చేయడాన్ని రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వం మారిన తరువాత వారం పది రోజుల ముందు నుంచే కోడి పందేలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇది సరిపోదన్నట్టు ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీశారు. కోడి పందేల బరులతో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో పందేల రీల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇలా పందేల కోసం బహిరంగంగానే ప్రచారం మొదలు పెట్టారు. కోడి పందేల బరులు, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు, ఎల్సీడీలు, కార్ పార్కింగ్లు.. ఇలా సర్వం రీల్స్లో చూపిస్తూ జూదరులను ఆకర్షిస్తున్నారు. -
ప్రైమరీ.. కిరికిరి
ఫ ఫౌండేషన్ స్కూళ్లపై వేటుకు సిద్ధం? ఫ ఐదుగురు కంటే తక్కువ ఉంటే మూసివేతే ఫ జిల్లాలో 169 చోట్ల మూతపడే అవకాశం ఫ సరికాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైమరీ స్కూళ్ల వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెచ్చిన సంస్కరణలే అందుకు కారణమైంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ సాకుతో ఐదుగురు, అంతకంటే తక్కువగా విద్యార్థులున్న స్కూళ్లను క్రమంగా ఎత్తివేసే ధోరణిలో ప్రభుత్వం ఉంది. ఈ వివరాలను విద్యాశాఖ సేకరించడం చూస్తుంటే ప్రాథమిక విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రమాదంలో పడే సూచన కనిపిస్తోంది. అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని పైకి అధికారులు చెబుతున్నా, ఇప్పటికే వివరాలు సేకరించి మూసివేత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. లెక్క తేల్చి.. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన స్కూళ్లను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. తొలిదశలో ఐదుగురి కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలల (ఫౌండేషన్, బేసిక్)ను గుర్తించే పనిలో పడింది. జిల్లాలో ఐదుగురి కంటే తక్కువ మంది ఉన్న పాఠశాలలు దాదాపు 169 వరకూ ఉంటాయని లెక్క తేలినట్టు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నివేదిక రూపొందించి విద్యా శాఖకు పంపించారు. ఇక సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడమే తరువాయి. సంక్రాంతి తర్వాత విలీనం జరుగుతోందనే ప్రచారం విద్యాశాఖలో ఉంది. ఇదిలా ఉంటే మూసివేసే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను, అదే పాఠశాలలో పనిచేస్తున్న మిడ్ డే మీల్ వర్కర్లు, శానిటరీ ఆయాలను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది. మూసివేసే దిశగా మరికొన్ని.. ఫ ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి కాట్రేనికోన మండలం మొక్కలతిప్పలో ఇద్దరు, కుండలేశ్వరంలో ఐదుగురు, పి.లక్ష్మివాడలో నలుగురు, గిడ్డివారిపేటలో ఐదుగురు, నాగిచెరువులో ఇద్దరు చొప్పున విద్యార్థులు ఉన్నారు. కొప్పిగుంట ఎంపీపీఎస్లో అసలు విద్యార్థులే లేరు. ఐ.పోలవరం మండలం ఐ.కొత్తపల్లి, చాకిరేవు చెరువు, రామరాజుమెరక, జి.వేమవరం నంబర్–2లో ఐదుగురు చొప్పున, భవానీపేట, మురమళ్ల, కరవాకులంకల్లో నలుగురు చొప్పున, కేశనకుర్రు పెదపేట, టి.కొత్తపల్లిలో ఒకరు చొప్పున ఉన్నారు. ఫ కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో ఒకరు, గోపాలపురంలో ఇద్దరు, దేవరపల్లి కొత్తపాలెంలో నలుగురు, పొడగట్లపల్లిలో ముగ్గురు, రాళ్లపండి, జుత్తుగపాడులో ఐదుగురు చొప్పున చదువుతున్నారు. ఫ పి.గన్నవరం నియోజకవర్గం పరిధి అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు, కడలివారిపాలెం, గంగలకుర్రు అంబేడ్కర్ నగర్, వాకలగరువు బుల్లె కాలనీ స్కూళ్లలో ఐదుగురు విద్యార్థులు చొప్పున ఉన్నారు. పాఠశాలల విభజన ఇలా.. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పాఠశాలలను సంస్కరణల పేరుతో విభజించింది. ఒకటి, రెండు తరగతులు ఉన్న పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లుగా, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా చేసింది. బేసిక్ ప్రైమరీ స్కూళ్లు గ్రామానికి రెండు, మూడు ఉండొచ్చు. ఇందులో ఒక స్కూల్ను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చింది. ఇందులో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గ్రామానికి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలగా, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ప్రాథమికోన్నత పాఠశాలగా, ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలుగా, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్ ఫ్లస్గా విభజించింది. దీనివల్ల అమలాపురం నియోజకవర్గం పరిధిలోని అల్లవరం మండలం తుమ్మలపల్లి ఫౌండేషన్ స్కూల్లో కేవలం నలుగురు విద్యార్థులు చదువుతున్నారు. కామనగరువు అప్పనపేట, బండారులంక కాపాటి వీధి స్కూళ్లలో ముగ్గురు, పేరూరుపేట, పేరమ్మ అగ్రహారం, మున్సిపల్ పాఠశాల (చిన్న పిల్లల పార్కు వద్ద) నలుగురు, ఎంపీఎల్ సీతాపతిరావుపేటలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఐదుగురు లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు మూతపడనున్నాయనే వార్త మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఇప్పటికే మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా పలుచోట్ల సింగిల్ నంబర్ స్కూళ్లుగా మారాయి. ఇప్పుడు ఆ సింగిల్ నంబర్ స్కూళ్లను కూడా మూసివేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర చేయడంపై ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలహీనపర్చే చర్యలను అడ్డుకుంటాం. ఐదుగురు లోపు విద్యార్థులున్న పాఠశాలలను వేరే పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. ఇది ప్రాథమిక పాఠశాలల్లో ఎన్రోల్మెంట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. –జీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ పరిస్థితి దిగజారుతోంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఈ వ్యవస్థ బలహీనమవుతోంది. విద్యార్థుల చేరికలు ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో ఐదుగు రు లోపు విద్యార్థులున్న పాఠశాలలను వేరే పాఠశాల ల్లో విలీనం చేయడంతో పరిస్థితి దిగజారుతోంది. –కె.కల్యాణ్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ హామీని విస్మరించడమే.. విద్యా సంస్కరణల్లో భాగంగా ఐదుగురు లోపు ఉన్న పాఠశాలలను అక్కడే ఉంచుతామని, మూసివేయమని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని విస్మరించి మూసివేసేందుకు చర్యలు తీసుకుంటే హామీని విస్మరించడమే అవుతుంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి. –పి.నరేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రాథమిక విద్యకు తూట్లు ఐదుగురు లోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయడమంటే ప్రాథమిక విద్యకు తూ ట్లు పొడవడమే. ఇది సహేతుక మైన నిర్ణయం కాదు. దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశముంది. దీనిని వెనక్కి తీసుకోవాలి. –ధీపాటి సురేష్బాబు, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ -
రహదారి భద్రత పాటించాలి
అమలాపురం టౌన్: వాహనచోదకులు రహదారి భద్రతను విధిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు చాలావరకూ తగ్గుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణాధికారి (డీటీఓ) దేవిశెట్టి శ్రీనివాసరావుతో కలసి ఎస్పీ రాహుల్ మీనా 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, డీటీఓలు రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై చర్చించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ తనిఖీల్లో పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్పీ మీనాను డీటీఓ శ్రీనివాస్ కోరారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకూ జిల్లాలో రహదారి భద్రతా వారోత్సవాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రెండు శాఖల సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సురేష్కుమార్ కూడా పాల్గొన్నారు. స్టాలిన్కు అంతర్జాతీయ అవార్డు మలికిపురం: పూణేకు చెందిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో లక్కవరం గ్రామానికి చెందిన రెండో తరగతి విద్యార్థి బొంతు స్టాలిన్ బంగారు పతకం సాధించాడు. ఈ పతకాన్ని లక్కవరం సెవెంత్ డే సెక్టార్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ శనివారం అందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నరసింహరాజు మాట్లాడుతూ స్టాలిన్ గతంలో తమ స్కూల్కు ఎన్నో అవార్డులు, మెమెంటోలు తీసుకొచ్చాడని, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్టాలిన్ను సంఘ సభ్యులు సువర్ణరాజు అభినందించారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలుకొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం కిక్కిరిసింది. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,60,160, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.1,79,800, అన్నప్రసా దం విరాళాలు రూపంలో రూ.51,207 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్బాబు తెలిపారు. ఉపాధి పథకంలో రూ.215 కోట్ల చెల్లింపులు అంబాజీపేట: ఉపాధి హామీ పథకంలో జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకూ రూ.215 కోట్ల చెల్లింపులు చేసినట్లు డ్వామా పీడీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. శనివారం అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికకు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 1.60 లక్షల మంది ఉపాధి కూలీలకు రూ.137 కోట్లు, మెటీరియల్కు రూ.72 కోట్లు చెల్లించామన్నారు. వంద రోజుల పని దినాలను 2,123 కూలీలకు కల్పించామన్నారు. ఎంపీడీఓ బి.మమత, ఏపీఓలు అడపా వెంకట శ్రీకృష్ణ, పేరాబత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఫ కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం ఫ మార్మోగిన గోవింద నామం కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గో విందా.. అంటూ వాడపల్లి క్షేత్రంలో స్వామివారిని భక్తజనం కొలిచింది. ఆ శ్రీనివాసుడిని చూసిన ప్రతి మది పులకించింది.. ధనుర్మాసం సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వాడపల్లి బాట పట్టారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పా లతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహి త ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. ఈఓ చక్రధరరావు భక్తజనంలో కలసిపోయి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి సునీత కుటుంబ సమేతంగా రాగా ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం చేయించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.50,42,711 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారిణిల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
దాడి ఘటనపై హత్యాయత్నం కేసు
గంటిలో పోలీస్ పికెట్ ఏర్పాటు కొత్తపేట: మండల పరిధిలోని గంటి గ్రా మంలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులపై చాకుతో దాడి చేసిన ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. పాత గొడవల నేపథ్యంలో కర్రి మణికంఠ అనే యువకుడిని కడుపులో పొడవగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీని కి సంబంధించి ఎస్సై సురేంద్ర శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 31న రాత్రి గంటి వైన్ షాప్ వద్ద కర్రి దుర్గామణికంఠ, దేవుడు మహేష్ అనే యువకులతో అదే గ్రామం పెదపేటకు చెందిన కన్నా, విశాల్, నాని గొడవ పడ్డారు. ఈ నెల 2న రాత్రి దుర్గామణికంఠ రావులపాలెం నుంచి ఇంటికి వెళుతుండగా గంటి గ్రామం దుర్గమ్మ గుడి సెంటర్ వద్ద విశాల్, కన్నా, నాని ఆపి మరలా గొడవ పడ్డారు. దానితో మణికంఠ తన పెద నాన్న కుమారుడు కర్రి సత్యసాయి నాగదుర్గారావుకు ఫోన్ చేయగా అతను అక్కడకు చేరుకున్నాడు. ఇంతలో కన్నా తనతో పాటు తెచ్చుకున్న చాకుతో మణికంఠను ఎడమ వైపు కడుపులో పొడిచాడు. దానితో దుర్గారావు అడ్డువెళ్లగా అతని ఎడమ కాలుపై పొడిచాడు. విశాల్, నాని కూడా ఇరువురిని కొ ట్టారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మణికంఠకు ప్రాథమిక చికిత్స అనంతరం రావులపాలెంలోని ఒక ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. దుర్గారావు ఫిర్యా దు మేరకు కన్నా, విశాల్, నానిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ఇరువర్గాల మద్య గొడవల నేపథ్యంలో గంటిలో పికెట్ ఏర్పాటు చేశామన్నారు. కాగా శనివారం డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వై.రాంబాబు, రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఇరువర్గాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మలికిపురం: రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను ప్రభుత్వం దూరం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. రాజోలు నియోజకవర్గ స్థాయి సీపీఐ శత దినోత్సవాన్ని శుక్రవారం మలికిపురంలో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న స్థాపించిన సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వాడవాడలా సీపీఐ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో 62 మంది కమ్యూనిస్ట్ సభ్యులు ఉన్నప్పుడు కూలీల వలసల నియంత్రణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించిందని అన్నారు. నేటి పాలకులు ఈ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సత్తిబాబు, చెల్లుబోయిన తాతారావు, గెడ్డం ప్రభాకర్రావు, దేవ సురేష్బాబు, దొండపాటి చిట్టిరాజు, పుల్లెల ఆనంద్, మేడిచర్ల సత్యనారాయణ, వై.వెంకట్, పిచ్చిక గంగాధర్రావు, దీపాటి గంగాచలం, ఆకన నాగేశ్వరరావు, బత్తుల రవిప్రసాద్, డి.భానోజీ, వానపల్లి చిట్టిబాబు, భూపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు పది సూత్రాలు
జిల్లాలో అమలు చేయాలని ఐజీ ఆదేశం అమలాపురం టౌన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను సూచించిన పది సూత్రాల విధానాన్ని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధిగా అమలు చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా అధ్యక్షతన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో శనివారం జిల్లాలో శాంతి భద్రతల సమావేశం నిర్వహించారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ సున్నితమైన అంశాల గుర్తింపు, నివేదన, విజవల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ, గత సంఘటనలు, నేరాలపై విశ్లేషణ, సాంకేతిక వినియోగం, చట్టపరమైన చర్యలు, జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ఏఆర్ డీఎస్పీ, సంబంధిత పోలీస్ సబ్ డివిజనల్ అధికారులతో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణ వంటి సూత్రాలు, అంశాలపై ఐజీ సమీక్షించారు. జిల్లాలో అల్లర్లు సృష్టించే వారిపై, శాంతి భద్రతలకు విఘాగం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. సంక్రాంతి పండగల సందర్భంగా పాత నేరగాళ్ల కదలికలపై నిఘాను విస్తృతం చేయాలని ఆదేశించారు. వారి నేర తీవ్రతలను బట్టి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి పీస్ కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ఐజీ స్పష్టం చేశారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ ఆకుల మురళీకృష్ణ, సైబర్ క్రైమ్ సీఐ బి.తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దివ్య క్షేత్రం.. ఘన చరితం
ఆలయ ప్రత్యేకత ఇదిసాధారణ విష్ణాలయాల మాదిరిగా కాకుండా ఈ రాజగోపాల స్వామివారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో 108 దివ్య వైష్ణవ ప్రదేశాలున్నాయని వేద పండితులు చెబుతుంటారు. అందులో మన రాష్ట్రంలోని తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంతో పాటు దేశంలో ద్వారక కల్యాణరాముడు అనేక క్షేత్రాల్లో విష్ణుమూర్తి వివిధ రూపాల్లో కొలువై ఉన్నాడు. ఆయా ఆలయాల్లో స్వామివారి ప్రతిమలను కొత్తకోటలోని రాజగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ సమయంలో నెలకొల్పారు. ఆలయంలోని రాజగోపాల స్వామివారు 109వ క్షేత్రంగా ప్రతిష్ఠించబడ్డారు. గోదావరికి ఆనుకుని ఉండటం, విజయనగరం రాజుల హయాంలో ప్రస్తుతం ఉన్నచోట ఆలయాన్ని నిర్మించడంతో కొత్తకోట గ్రామం వెలసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్తకోట రాజగోపాలస్వామిగా ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఆలయంలోని రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాల స్వామివారి సన్నిధిలో 108 దివ్యక్షేత్ర ప్రతిమల గురించి ఆలయ గోడలపై ఆయా దివ్యక్షేత్రాలు దేశంలో ఎక్కడ ఉన్నాయో వివరించారు. ఫ 108 స్వామివార్ల ప్రతిమలతో ప్రసిద్ధి ఫ చరిత్రకెక్కిన కొత్తకోట రాజగోపాలస్వామి ఆలయం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు రామచంద్రపురం: ఒడిశాలోని పూరి జగన్నాథుడు.. అహోబిలంలోని నరసింహస్వామి.. గోకులంలోని నవమోహనకృష్ణుడు.. మహాబలిపురంలోని తిరుశయనత్తుతైవర్.. తిరు అయోధ్యలోని శ్రీరామచంద్రమూర్తి.. ఇలా 108 దివ్య క్షేత్రాల్లో కొలువైన విష్ణుమూర్తి రూపాలను ఒకేచోట కొలువు తీర్చితే భక్తులకు మహదానందమే. అందుకే రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం కొత్తకోటలో కొలువైన రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది. విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్ర తెలుసుకుందాం రండి గోదావరి తీరాన్ని, ప్రస్తుతం ఉన్న కోట రాజవైరిని ఆనుకుని 1,420లో శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుద్దూర్ కోటను నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం గోదావరిలో కలసిపోయింది. బొబ్బిలిపై యుద్ధం అనంతరం విజయనగరం మహారాజు ఆనందరాజు ఈస్టిండియా కంపెనీతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం తీర ప్రాంతాన్ని కంపెనీకి, ఎస్టేట్లను విజయనగరం రాజులకు ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా ఎస్టేట్లను ఆక్రమించే ప్రయత్నం అప్పట్లో ఈస్టిండియా కంపెనీ చేసింది. ఇందులో భాగంగా పెద్దాపురంలో జరిగిన యుద్ధంలో రామచంద్రపురం రాజు రామచంద్రరాజు బహుద్దూర్ కుమారులు నీలాద్రిరాజు, జగన్నాథరాజు మరణించారు. యుద్ధంలో తన సోదరులు వీరమణం పొందడంతో కోటిపల్లి ఎస్టేట్కు రాజా కాకర్లపూడి నరసరాజు రాజయ్యారు. అయితే తన తోబుట్టువులు చనిపోవటంతో నరసరాజు వైరాగ్యంతో దైవభక్తిలోకి వెళ్లిపోయారు. ఓ గురువు సాయంతో మంత్రోపదేశం పొందారు. ఈ నేపథ్యంలో గోదావరికి అతి సమీపంలోని రాజకోటకు దగ్గరలో (ప్రస్తుతం కొత్తకోట గ్రామం) రాజగోపాలస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. అనంతరం దేశంలోని వైష్ణవాలయాలను సందర్శించి, అక్కడి నుంచి 108 దేవతామూర్తుల ప్రతిమలను తీసుకొచ్చి ప్రతిష్ఠించిన నరసరాజు ఆలయం వద్దే తనువు చాలించారని ప్రతీతి. సంతానం కలుగుతుందని.. సంతాన రాజగోపాలస్వామిగా పేరొందిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా ధనుర్మాసంలో స్వామివారి దివ్య ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలనాడు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి ఎటువంటి లోటు రాకుండా ఉండేందుకు సుమారు వందెకరాల భూమిని విరాళంగా రాసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. రామచంద్రపురం శ్రీరాజా కాకర్లపూడి వంశీయులు ఏటా ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ధనుర్మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే దేశంలోని వైష్ణవాలయాలను దర్శించుకున్నట్లేనని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం జరిపిస్తారు. -
మహనీయుని పేరుతో రాజకీయాలు వద్దు
రావులపాలెంలో విగ్రహ వివాదంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం: శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహా చరిత్ర కలిగిన మహనీయుల పేరుతో రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం గ్రామంలో ఇటీవల శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదంపై శనివారం వైఎస్సార్ సీపీ క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల నాయకుల విగ్రహాల ఏర్పాటుకు తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రమాదాలు జరిగే చోట్ల విగ్రహాలు పెట్టకూడదని, అందరికీ ఆమోదయోగ్యమయ్యే చోట విగ్రహాలు పెట్టినా కోనసీమ వ్యాప్తంగా సహకరించే కుటుంబం తనదని అన్నారు. కాపులతో తన కుటుంబానికి తన తండ్రి కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని, వంగవీటి మోహనరంగా లాంటి నాయకుడు తన ఇంట్లో బస చేశారని గుర్తు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అవమానించామని కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ఆ ప్రచారంలో నిజం లేదని, ఒకవేళ నిరూపిస్తే ఎంతటి శిక్షకై నా తాను సిద్ధమన్నారు. అర్ధరాత్రి ఎంకేఆర్ జంక్షన్లో విగ్రహం ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని, అందరితో చర్చించి అనుకూలమైన స్థలంలో ప్రతిష్ఠిస్తే దానికి తమ పూర్తి సహకారం అందిస్తామని జగ్గిరెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వివిధ విగ్రహాలు పెట్టాలని అభ్యర్థన వచ్చినా, అక్కడ తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతం కాబట్టి తిరస్కరించామన్నారు. ఇప్పుడూ అదే మాటపై ఉన్నామని, అది పూర్తిగా యాక్సిడెంట్ జోన్ అని అన్నారు. అదే రోడ్లో నాలుగు కల్యాణ మండపాలు, పాఠశాలలు, ఆస్పత్రులు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఎటువంటి విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే అక్రమంగా అర్ధరాత్రి పూట దిమ్మకట్టి శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అక్కడ ఉంచడం వెనుక కులాల చిచ్చు పెట్టాలనే భావనతో కూటమి నాయకులు ఉన్నారన్నది స్పష్టం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతో తమపై బురద జల్లే కార్యక్రమాన్ని కావాలని కొంత మంది ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని, దీనిని కాపులు, మరే ఇతర సామాజిక వర్గీయులు నమ్మరన్నారు. సమావేశంలో అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ నేత, కాపు సంఘ నాయకుడు చల్లా ప్రభాకరరావు, ఆలమూరు, కొత్తపేట మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, ముత్యాల వీరభద్రరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వార్డు సభ్యుడు సఖినేటి వాకుల రాజు, నాయకులు నాండ్ర నాగమోహనరెడ్డి, చల్లా నానాజీ, చల్లా భూషణం తదితరులు పాల్గొన్నారు. -
అప్పనపల్లి... భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. తొలి హారతితో స్వామివారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా.. అంటూ స్వామివారి దివ్య స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశితులయ్యారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,97,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రెండు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.66,397 విరాళాలుగా అందించారన్నారు. అప్పనపల్లి బాలాజీ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు -
అంతర్వేది రథ శకలాల నిమజ్జనం వాయిదా
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శనివారం నిర్వహించ తలపెట్టిన రథ శకలాల నిమజ్జనం వాయిదా పడింది. హిందూ ధార్మిక సంఘాలు, అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి కోరిక మేరకు నిమజ్జనం వాయిదా వేసినట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాక్షికంగా కాలిన రథ శకలాలు నిమజ్జనం చేయకుండా వదిలేయడం ఈ ప్రాంతానికి అరిష్టమని, వెంటనే పోలీసుల నుంచి అనుమతి ఇప్పించాలని బీజేపీ నేత అయ్యాజీ వేమా గతంలో కోరారన్నారు. ఆ మేరకు పోలీసు అధికారులతో పలుమార్లు సంప్రదించగా దేవదాయ కమిషనర్ ఒక కమిటీని నియమించి, నిమజ్జనానికి ఉత్తర్వులిచ్చారన్నారు. అయితే అప్పటి నుంచి హిందూ ధార్మిక సంఘాలు, అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. సీబీఐ విచారణ తేలాలని, రఽథం దగ్ధం దోషులను కోర్టులో నిలబెట్టే వరకూ రథ శకలాలను నిమజ్జనం చేస్తే ఒప్పుకోమని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వద్ద ఆందోళనలు చేసి వినతిపత్రాలు అందజేశారు. ఏం జరిగిందంటే..! అంతర్వేది ఆలయం వద్ద పాత రథం 2020 సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఘటనపై అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పారు. కొత్త రథం నిర్మాణానికి మొదటి విడతగా రూ.95 లక్షలు మంజూరు చేశారు. అనంతరం ఈ మొత్తాన్ని రూ.1.10 కోట్లకు పెంచారు. 2020 సెప్టెంబర్ 27న కొత్త రథం నిర్మాణాన్ని అప్పటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్రెడ్డి కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 19న సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రథాన్ని లాగి ప్రారంభించారు. -
ఎవరేమనుకుంటే మాకేంటి..
ఫ ప్రభుత్వ భవనంపై టీడీపీ ఫ్లెక్సీ ఫ వివాదాస్పదంగా మారిన వైనం రామచంద్రపురం రూరల్: ప్రభుత్వ భవనం.. దానిపై టీడీపీకి చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ.. ఇవేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరు.. ఇదంతా రామచంద్రపురం రూరల్ మండలం వెల్లలో చోటు చేసుకుంది. ఆ గ్రామ సంతపేటలో డ్వాక్రా మహిళలకు చెందిన భవనాన్ని గతంలో నిర్మించారు. ఇదే భవనంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు సమావేశాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఇది ప్రభుత్వానికి చెందిన భవనం. దీనిపై ఎటువంటి ప్రైవేట్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయకూడదు. అలా ఏర్పాటు చేస్తే పంచాయతీ చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ టీడీపీకి చెందిన ఒక నేత దర్జాగా మంత్రి సుభాష్ ఉన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఈ ప్రభుత్వ భవనంపై ఏర్పాటు చేశారు. దీంతో వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఒక నేత ఇప్పటికే పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవటం గమనార్హం. దీనిపై పంచాయతీ కార్యదర్శి వి.సూర్య సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా ఇప్పటికే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి తీసివేయాలని చెప్పామని వివరణ ఇచ్చారు. -
తండ్రి రుణం తీర్చుకునేందుకు..
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో పేకేటి సత్యనారాయణ (కాంతారావు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఉన్న ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె అనూష తండ్రి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం తలకొరివి పెట్టారు. కాంతారావు స్థానికంగా ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతికి కార్యాలయ సిబ్బంది సంతాపం ప్రకటించి దహన సంస్కారాలకు రూ. 10 వేలు అందించారు. తండ్రి మృతదేహానికి కూతురు తలకొరివిపెట్టడం చూసి స్థానికులు, బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవీఐ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిపో మేనేజర్ భాస్కరరావు మాట్లాడుతూ డ్రైవర్లకు మంచి శిక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనే అంశంపై వివరించారు. బస్సు కండిషన్ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, అసిస్టెంట్ మెకానిక్ ఫోర్మెన్ జి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల సంక్షేమానికి విరాళం
అమలాపురం టౌన్: సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక, మాజీ సైనికుల సంక్షేమానికి జిల్లా మాజీ సైనికుల సంఘం రూ.63 వేలను విరాళంగా సమకూర్చింది. ఈ మొత్తాన్ని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావుకు అందజేసినట్టు మాజీ సార్జెంట్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సైనిక అధికారి కార్యాలయంలో శుక్రవారం రూ.63 వేలకు సంబంధించిన చెక్కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు రాంబాబు, డీఎన్ మూర్తి, గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వెలుగు చుక్కలు
విద్యాబోధన మామూలు విద్యార్థులకూ అంధులైన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే సేవలు అందించగలరు. వీరి కోసం పాఠ్య పుస్తకాలను ప్రత్యేక బ్రెయిలీ లిపిలోకి ముద్రిస్తారు. వాటిని స్పర్శిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● అన్ని రంగాల్లో ముందంజ ● రేపు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం రాయవరం: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తూ మరి కొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసనల ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటున్నారు. అంచలంచెలుగా.. సాధారణంగా చదువు కోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేని కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీని కోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కల లిపి కేవలం చేతి వేళ్లతో ఆరు చుక్కలను స్పర్శించి అక్షర జ్ఞానాన్ని పొందడానికి అనువుగా లూయిస్ బ్రెయిలీ ఈ లిపిని రూపొందించారు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబరు ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తు పెట్టుకుని, మనో నేత్రంతో చదువుతూ విద్యను అభ్యసిస్తున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకొంటున్నారు. పట్టుదలతో.. పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో తండ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా, ఒక పనిముట్టు ఆయన కుడి కంటికి తగలడంతో చూపును కోల్పోయారు. అయినా పట్టుదలతో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా మారాడు. తనలా బాధపడుతున్న వారి కోసం బ్రెయిలీ ఒక లిపిని కనిపెట్టారు. కేవలం పదిహేనేళ్ల వయసులో ఫ్రెంచ్ వర్ణమాల ఆధారంగా బ్రెయిలీ కోడ్ను అభివృద్ధి చేశారు. ఆత్మ విశ్వాసంతో.. పుట్టుకతోనే అంధత్వంతో జన్మించాను. తల్లిదండ్రులైన మంగమ్మ, వెంకన్నలు నన్ను కంటి పాపలా కాపాడారు. మండపేట అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం టీచర్ శిక్షణ పొంది ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. బ్రెయిలీ లిపితో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. – వేల్పూరి వీరబాబు, ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయుడు, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం కళ్లు లేవని బాధపడలేదు కళ్లు లేవని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. పుట్టుకతోనే నా రెండు కళ్లకూ చూపు లేదు. లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే పట్టుదలతో చదివాను. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – పి.దొరబాబు, ఉపాధ్యాయుడు, ఎస్పీఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, రాజకోట, రామచంద్రపురం, -
● రయ్ రొయ్య మంటూ..
రయ్ రొయ్యమంటూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి అరుదైన భారీ సైజు ల్యాబ్స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఒక్కో ల్యాబ్స్టర్ రొయ్య సుమారు 750 గ్రాములు బరువు తూగుతూ, రూ.800కు తక్కువ గాకుండా అమ్ముడుపోతోంది. సాధారణంగా ఈ రకమైన ల్యాబ్స్టర్ రొయ్యలు కన్యాకుమారి, మండపం, కేరళ వంటి కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని, అంతర్వేది సముద్ర తీరంలో ఈ రకం భారీ సైజులో రొయ్యలు దొరకడం అరుదని వారు చెబుతున్నారు. - సఖినేటిపల్లి -
శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదేం?
● దేవదాయశాఖ మంత్రి విచారణ జరపాలి ● మాజీ ఎంపీ భరత్ రామ్ రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధ శివాలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైతే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళంలోని శ్రీరామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుతం శివలింగం ధ్వంసమైతే కాతేరు నుంచి మరో శివలింగాన్ని తీసుకుని వచ్చి మూఢంలో నిబంధనలు పాటించకుండా ప్రతిష్ఠించడం సరికాదన్నారు. దీనిపై హిందువులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి, సమగ్ర విచారణ చేసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, వైస్ ఎంపీపీ శాకా బాబీ, ఉప సర్పంచ్ వల్లు శివ, నాయకులు కర్రి రవీంద్ర, రెడ్డింశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం ● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి దేవరపల్లి: పేరం చెరువు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ చెరువులో శుక్రవారం చేప పిల్లలను వేయడానికి రజకులు ఏర్పాట్లు చేయగా, దళితులు అడ్డుకున్నారు. దీంతో రజకులు చనిపోయిన ఆ చేప పిల్లలను పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు రాశిగా పోసి ఆందోళన చేశారు. రజక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి – బుచ్చియపాలెం రోడ్డులో సుమారు 3.96 ఎకరాల విస్తీర్ణంలో పేరం చెరువు ఉంది. దీన్ని దాదాపు 20 ఏళ్ల క్రితం రజకులకు ప్రభుత్వం కేటాయించింది. చెరువులో రజక వృత్తితో పాటు చేపలు పెంచుకుని ఫలసాయం పొందడానికి డివిజినల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే చెరువులో చేపల పెంపకం విషయంలో రజకులు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. చెరువులో దుస్తులు ఉతకటానికి మాత్రమే హక్కు ఉందని, చేపలు పెంచడానికి వీలు లేదని చెరువు సమీపంలోని దళితులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కాగా.. రజక సంఘం అధ్యక్షులు కొంజర్ల పాలిరాజు, గౌరవాధ్యక్షులు కడెల్లి సుబ్బయ్య, కార్యదర్శి నేతునూరి సుబ్బారావు మాట్లాడుతూ చెరువును శుభ్రం చేసుకుని చేపపిల్లలను వేయడానికి వెళ్లగా, కొందరు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ చెరువులో చేపలు పెంచుకోవడానికి, బట్టలు ఉతకడానికి పూర్తి హక్కులు తమకు ఉన్నాయని తెలిపారు. సుమారు 1.50 లక్షల విలువైన 1.5 టన్నుల చేపపిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.రవి కిషోర్ను ‘సాక్షి’ వివరణ కోరగా చెరువులో రజక వృత్తి చేసుకోవడానికి, చేపలు పెంచుకుని ఫలసాయం అనుభవించడానికి రజకులను హక్కు ఉందని చెప్పారు. ఈ సమస్యను రెండు సామాజక వర్గాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. -
ఓడలరేవు తీరానికి రక్షణ వలయం
● ఆరు కిలోమీటర్ల పొడవునా గ్రోయన్ల నిర్మాణం ● ఓఎన్జీసీ నిధులతో కొనసాగుతున్న పనులు అల్లవరం: ఓడలరేవు తీరానికి రక్షణ వలయం ఏర్పడుతోంది. ఆరు కిలోమీటర్ల పొడవున 300 మీటర్ల నిడివితో గ్రోయన్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి ఓఎన్జీసీ రూ.139 కోట్ల నిధులు మంజూరు చేయగా, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా రెండు దశాబ్ధాలుగా ఓడలరేవు తీరంలో వందల ఎకరాల విస్తీర్ణంలో తీరం కోతకు గురైంది. భారీ తుపాన్లు, సునామీల ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చి, మానవ జీవనానికి ప్రతిబంధకంగా మారింది. తీరానికి రక్షణ వ్యవస్థగా ఉన్న తాటిచెట్లు, సరుగుడు తోటలను భారీ కెరటాలు సముద్రంలో తీసుకుపోయాయి. దీంతో బలమైన వేరు వ్యవస్థ కోల్పోయి తీరం తరుగుతూపోతోంది. దీంతో సముద్రం ముందుకు రావడంతో ఓడలరేవులో చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ పెద్ద ప్రమాదంలో పడింది. ప్రతిపాదనలకు కార్యరూపం ఓడలరేవు తీరానికి రక్షణ గోడ నిర్మించి గ్రామంతో పాటుగా ఓఎన్జీసీ టెర్మినల్ను కాపాడుకునేందుకు పదేళ్ల క్రితం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు చేయగా నేటికి కార్యరూపం దాల్చింది. ఓడలరేవు నదీ సంగమం నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవునా గ్రోయన్స్ నిర్మాణం చేసేందుకు ఓఎన్జీసీ రూ.139 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత నెల ఒకటో తేదీ నుంచి తీరంలో ఈ పనులను శాంతి ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ చేపట్టింది. ప్రతి మూడు వందల మీట్లర్ల నిడివితో 150, 100, 50 మీటర్ల పొడవునా తీరం నుంచి సముద్రంలోకి సుమారు 100 అడుగుల వెడల్పున ఓఎన్జీసీ పశ్చిమ ప్రహరీని ఆనుకుని గ్రోయన్ల నిర్మాణం చేస్తున్నారు. రు. ప్రస్తుతం రెండు గ్రోయన్లకు సంబంధించి బ్లాక్ స్టోన్ను సముద్రంలో వేస్తున్నారు. వీటికి మరింత రక్షణగా నాలుగు ముఖాలు కలిగిన సుమారు టన్ను బరువు ఉండే టెట్రాపాడ్లు ఏర్పాటు చేయనున్నారని పని ప్రదేశంలో ఓ అధికారి తెలిపారు. టెట్రాపాడ్ల వల్ల కెరటాలు విచ్ఛిన్నమై తీరం కోతకు గురి కాకుండా ఉంటుంది. అయితే ఈ పని పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. -
యువకుడిపై కత్తితో దాడి
● మరొకరికి గాయాలు ● పాత గొడవలతో గంటిలో ఘటన కొత్తపేట: పాత గొడవల నేపథథ్యంలో ఒక వర్గానికి చెందిన యువకుడిపై మరో వర్గానికి చెందిన యువకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన కర్రి మణికంఠ మోటార్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళుతూ గంటి సెంటర్లో తన స్నేహితుడు కర్రి సత్యసాయి నాగదుర్గారావుతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన విశాల్ తన స్నేహితులతో వచ్చి ఘర్షణ పడి, కత్తితో దాడి చేశాడు. ఘర్షణలో మణికంఠను కత్తితో పొట్టపై పొడవగా పేగులు బయటకు వచ్చి తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గారావుకు మోకాలిపై గాయమైంది. వారిద్దరినీ కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మణికంఠకు ప్రాథమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్ర చికిత్స చేస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు పాత గొడవలే కారణమని, దానిలో భాగంగా ఈ నెల 31 రాత్రి కూడా ఘర్షణ పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసు అధికారులు ఈ దాడిపై ఆరా తీశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయాల్సి ఉంది. -
యూరియా ఇవ్వలేఖ
సాక్షి, అమలాపురం: తిరుపతి శ్రీవారి దర్శనానికి, చిన్న ఉద్యోగాలకు మాత్రమే ఇప్పటి వరకు సిఫారసు లేఖలు పట్టుకుని వెళ్లేవారిని చూసి ఉంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యూరియా బస్తాలు కావాలంటే అటు వ్యవసాయశాఖ అధికారితో పాటు స్థానిక టీడీపీ, జనసేన పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు సిఫారసులు ఉండాల్సిందే. ప్రస్తుతం రెండు బస్తాల యూరియాకు కూడా రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. యూరియా కావాలంటే వారికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ నాయకుడి సిఫారసు లేఖ, రెండోది గంటల పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ముందు పడిగాపులు పడడం. జిల్లాలో.. జిల్లాలోని గోదావరి డెల్టా పరిధిలో ఇంకా సగం చేలల్లో కూడా రబీ నాట్లు పడలేదు. సుమారు 1.73 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరుగుతోందని అంచనా కాగా, ఇప్పటి వరకు కేవలం 34 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. సుమారు 70 వేల ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉంది. అయినా కూడా యూరియా దొరకడం రైతులకు గగనమైపోయింది. రబీ ఆకుమడిలో కేవలం ఆరు నుంచి ఏడు కేజీల యూరియా వేస్తారు. తరువాత నాట్లు వేసిన సమయంలో ఒకసారి, పదిహేను రోజులకు, 30 నుంచి 40 రోజులకు ఒకసారి చొప్పున యూరియా వేస్తుంటారు. యూరియా కొరత జిల్లాలో పెద్ద ఎత్తున యూరియా వాడే అవకాశం లేదు. అయినా రైతులను కొరత పట్టి పీడిస్తోంది. జిల్లాలో మొత్తం రబీ కాలంలో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఎప్పుడూ సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నులకు తక్కువ కాకుండా యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సాగు జిల్లాలో అనుకున్న స్థాయిలో జరగలేదు. 1.80 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు గాను 1.53 లక్షల ఎకరాల్లో మాత్రమే జరిగింది. దీని వల్ల మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ కొరత తక్కువ. అయినప్పటికీ కొందరు ప్రైవేటు ఏజెంట్లు రూ.260.50 యూరియా బస్తాను రూ.400కు అమ్మకాలు చేశారు. అధికార పార్టీ సిఫారసులుంటేనే.. ఫ రబీలో సాగు ఆరంభంలోనే యూరియా కోసం రైతులు గంటల పాటు పడిగాపులు పడుతున్నారు. అధికారితో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, చోటా మోటా నాయకుల సిఫారసులు ఉంటేనే పీఏసీఎస్లో యూరియా అందిస్తున్నారు. ఫ పీఏసీఎస్, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద యూరియా అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే రేషన్ విధించారు. వ్యవసాయ శాఖ అధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. దీనితో పాటు ఎకరాకు రెండు బస్తాల ఇస్తామనడం వల్ల పెద్ద కమతాలున్న రైతులకు ఇబ్బందిగా మారింది. ఫ యూరియా కొరత లేదని ఒక వైపు వ్యవసాయ శాఖ అధికారులు మరో వైపు జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో గడిచిన నాలుగైదు రోజులుగా ఉద్యాన రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడం నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఫ జిల్లాలో కొబ్బరి, కోకో తోటలలో ఇప్పుడు దుక్కులు చేసి రైతులు యూరియా ఇతర ఎరువులను వినియోగిస్తుంటారు. అలాగే గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు గోదావరికి వరద ఉండడం లంక భూముల్లో కూరగాయ పంటలు, పువ్వుల సాగు మొదలు కాలేదు. ఇప్పుడు ఆ తోటల్లో కూడా యూరియా వినియోగించాల్సి ఉంది. ఈ సమయంలో యూరియా దొరకకపోతే ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. ఫ కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యూరియా పంపిణీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వానపల్లి, కొత్తపేట ఏపీసీఎస్లలో యూరియా వచ్చినప్పుడు రైతులు గంటల పాటు ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఫ అల్లవరం మండలంలో గుళికల రూపంలో ఉన్న యూరియా బస్తాలు కావాలంటే నానో యూరియా తప్పనిసరిగా కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. మూడు బస్తాలు అంతకు పైబడి యూరియా కొనుగోలు చేయాలంటే కనీసం లీటరు నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సిఫారసు లేఖలున్న వారికే పంపిణీ అవస్థలు పడుతున్న రైతులు చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం తొలుత వ్యవసాయ శాఖ అధికారుల ధ్రువీకరణ ఆపై అధికార పార్టీ నేతలు చెప్పిన మేరకు అందజేత -
శిఖండి తృతీయ ప్రకృతి కాదు
సమన్వయ సరస్వతి సామవేదంఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చాలామంది భావిస్తున్నట్టు శిఖండి ఆడా మగా కాని తృతీయ ప్రకృతి కాదు. ముందు సీ్త్రగా పుట్టి తరువాత పురుషత్వం పొందినవాడు శిఖండి అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంలో ఉద్యోగపర్వాన్ని ముగించి, భీష్మపర్వంలోకి ప్రవేశించారు. తాను సీ్త్రతో కాని, సీ్త్రనామధేయం కలవారితో కాని, ముందు సీ్త్రగా జన్మించి పురుషునిగా మారినవారితో కానీ యుద్ధం చేయనని తన నియమాలను దుర్యోధనునికి వివరిస్తాడు. కురుపాండవులు కొన్ని యుద్ధ నియమాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు సాయం సమయంలో యుద్ధం ముగిసాక ఇరుపక్షాల మధ్య పరస్పర ప్రీతి ఉండాలి, మాటలతో యుద్ధం చేసేవారిని మాటలతోనే ఎదుర్కోవాలి, అలాగే రథంలో ఉన్నవారు రథంలో ఉన్నవారితో, ఏనుగు మీద ఉన్నవారు అటువంటి వారితో, అశ్వం మీద ఉన్నవాడు అటువంటి వానితో, పదాతి పదాతితోనే యుద్ధం చేయాలని నియమాలను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో యుద్ధమనేది ఒక విద్యగా పరిగణింపబడింది. అందులో నీతిశాస్త్రం కూడా ఉన్నదని సామవేదం అన్నారు. వ్యాసుడు ధృతరాష్ట్రునితో నీవు యుద్ధం చూడాలనుకుంటున్నావా అని అడిగితే, క్షత్రియనాశనాన్ని చూడలేను, వినే యోగం ప్రసాదించమని అడిగాడు. వ్యాసుడు యుద్ధ విశేషాలు వివరించడానికి సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. జయాపజయాలు నిర్ణయించేది సంఖ్యా బలం కాదని–సత్యము, ధర్మము, క్రూరత్వము లేకపోవడం, ప్రయత్నము వంటి లక్షణాలని సామవేదం అన్నారు. ధృతరాష్ట్రుడు సంజయునితో మామకాః, పాండవాః.. మా వాళ్ళు, పాండవులు కురుక్షేత్రంలో ఏమి చేశారో చెప్పమని అడగడంలో అతని భేద దృష్టి కనపడుతున్నదని, పాండవులు ఎప్పుడూ ధృతరాష్ట్రుని తండ్రిగానే భావించారని సామవేదం వివరించారు. మోహానికి లోనైన అర్జునునికి కృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం’ అని ఆయన అర్జునునికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. స్వామి వివేకానంద మాటల్లో గీతలోని శ్లోకాలను మరచిపోయినా, ఈ ఒక్క శ్లోకాన్ని యువత గుర్తు చేసుకుంటే చాలని అన్నాడని సామవేదం వివరించారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, మనం భారతం వింటున్నామనే మాట అబద్ధమని, చూస్తున్నామనడం సరి అయినదని అన్నారు. -
గాంధీ పేరు తొలగింపు దారుణం
అమలాపురం టౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించి, వీబీసీ రాంజీ అని పెట్టడం దారుణమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మెంబర్ గిడుగు రుద్రరాజు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. రుద్రరాజు మాట్లాడుతూ గాంధీజీ పేరును తొలగించడం వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ పేరుతో జాతీయ ఉపాధి హమీ పథకానికి దేశ వ్యాప్తంగా శ్రీకారం చుట్టిందని తెలిపారు. గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఇటీవల ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఏఐసీసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పార్టీ నేతలతో ధర్నా, బహిరంగ సభ జరుగుతాయన్నారు. సమావేశంలో ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఏఐసీసీ మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి సాయం అమలాపురం రూరల్: రావులపాలేనికి చెందిన వానపల్లి ప్రసాద్ ఇజ్రాయిల్లోని అష్దూద్ ప్రాంతంలో గల సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ గతేడాది మృతి చెందాడు. అక్కడి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ సభ్యులు సమకూర్చిన రూ.2,85,000ను వానపల్లి ప్రసాద్ కుటుంబానికి శుక్రవారం జేసీ నిషాంతి అందించారు. కాగా.. ప్రసాద్ ప్రమాదవశాత్తూ సెప్టెంబర్లో మృతి చెందాడు. కలెక్టర్ మహేష్ కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు అతడి మృతదేహాన్ని రావులపాలేనికి రప్పించారు. లైఫ్ సర్టిఫికెట్లకు దరఖాస్తుల స్వీకరణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ ధ్రువపత్రాలను (లైఫ్ సర్టిఫికెట్లు) జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నట్టు జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎ.గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్లను జీవన్ ప్రమాణ్ పోర్టల్లో కానీ, పెన్షనర్ల వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా కానీ, ఏదైనా ఖజానా కార్యాలయంలో సమర్పించవచ్చునన్నారు. పెన్షనర్ల ఆధార్, మొబైల్ నంబర్ (ఓటీపీ కోసం), పీపీఓ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిచూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలఖారులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని, లేకుంటే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందని గుర్తించాలని కోరారు. జిల్లా పరిధిలో కాకినాడ డివిజనల్ ఖజానా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట ఉప ఖజానా కార్యాలయాలలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పుష్కరాల నాటికి అన్ని సదుపాయాల ఏర్పాటు రాజమహేంద్రవరం సిటీ: వచ్చే 2027 పుష్కరాల నాటికి అన్ని మౌలిక వసతులు కల్పించి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం పుష్కరాల నిర్వహణపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్, సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు, టాయిలెట్లు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. కేవలం పుష్కరాలకే కాకుండా శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఉపయోగపడేలా పనులు చేపట్టాలన్నారు. ప్రతి అభివృద్ధి పనినీ ఆన్లైన్ చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. పోర్టల్లో అప్లోడ్ చేయడంతో ముఖ్యమంత్రి స్థాయిలో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, సీపీ (రుడా) జీవీఎస్ఎన్.మూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఈఈలు మదర్సా అలీ, మాధవి, ఏడీహెచ్ అనిత, ఏఈలు పాల్గొన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేస్తున్న జేసీ నిషాంతి -
డ్రాగన్ పడవ పోటీలకు పటిష్ట భద్రత
● కలెక్టర్ మహేష్కుమార్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కొత్తపేట: ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి డ్రాగన్ పడవలు, ఈత పోటీలను పటిష్ట రక్షణ భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈత, రంగోలి, పతంగుల పోటీలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పులిదిండి గ్రామంలో కయాకింగ్ డ్రాగన్ బోటింగ్ను కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లాంఛనంగా ప్రారంభించారు. కాలువలో పడవ పోటీల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ట్రయల్ రన్లో భాగంగా కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కియా కింగ్ డ్రాగన్ పడవను నడుపుతుండగా పడవ అదుపు తప్పి ఎడమ వైపుకు ఒరిగిపోవడంతో ఆయన కాలువలోకి పడిపోయారు. ఆ సమయంలో లైఫ్ జాకెట్ వేసుకుని ఉండటం, పడవలోను, ఆ పడవను అనుసరిస్తున్న బోటులో గజఈతగాళ్లు అప్రమత్తమై వెంటనే కాలువలో దూకి కలెక్టర్ను రక్షించి, ప్రక్క బోటులోకి ఎక్కించారు. అనంతరం పోటీల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సందర్శకుల తాకిడికి అనుగుణంగా జెట్టీలు, లైఫ్ జాకెట్లతో రక్షణ పరమైన జాగ్రత్తలు పాటిస్తూ క్రియాశీలకంగా వహించాలన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గత ఏడాది కన్నా రెట్టింపు ఉత్సాహంతో పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గోదావరి తీరంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, తహసీల్దార్ ఆర్డీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాల పంపిణీ ఆత్రేయపురం సచివాలయం వద్ద శుక్రవారం రైతులకు కొత్త పట్టాదాసు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాదాపు 921 పుస్తకాలను నిర్ణీత రుసుముతో రైతులకు పంపిణీ చేశారు. -
మంచి నారుమడి.. అధిక దిగుబడి
● ఆరోగ్యవంతమైన నారుమడిపై దృష్టి పెట్టాలి ● రబీ రైతులకు ఏరువాక కో ఆర్డినేటర్ నంద కిషోర్ సూచనలు ఐ.పోలవరం: రబీ రైతులు ఆరోగ్యవంతమైన నారుమడిపై దృష్టి పెట్టాలని, అప్పుడే అధిక దిగుబడి సాధించే అవకాశముందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నంద కిషోర్ అన్నారు. ప్రస్తుతం డెల్టాలో రైతులు రబీ సాగుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో నారుమడులు మొదలయ్యాయి. మరో వారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నారుముడులు వేయనున్నారు. ఈ సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నంద కిషోర్ తెలిపారు. అవి ఆయన మాటల్లోనే... చురకుగా నారుమడులు జిల్లాలో ప్రస్తుతం కొందదదరు రైతులు నారుమడులు పోసుకునే దశలో ఉన్నారు. ఆలమూరు, కొత్తపేట, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో చాలా మంది ఇప్పటికే వీటిని వేశారు. రబీ పంట కాలంలో ఆరోగ్యవంతమైన నారును పెంచటానికి పలు యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంది. తడులు అందించడంతో పాటు సకాలంలో ఎరువులు, ముందుల పిచికారీ చేయాలి. ఈ కింద సూచించిన, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపటాలి. ఎరువుల యాజమాన్యం ఐదు సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని అంటే సుమారు 5 కిలోల యూరియా ఇవ్వాలి. విత్తనం చల్లే ముందు 2.5 కిలోలు, విత్తనం చల్లిన 10 నుంచి 15 రోజులకు మరొక 2.5 కిలోలు వేయాలి. ఒక కిలో భాస్వరం అంటే 6 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, ఒక కిలో పొటాన్ అంటే 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. ఫ జిల్లాలో రబీ పంట కాలంలో జింక్ థాతు లోపం ఎక్కువగా వస్తుంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ కోసం జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి చొప్పున కలిపి వరి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. సస్యరక్షణ నారుమడిలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణకు విత్తన 10 రోజులకు కార్బొప్యురాన్ 3 జీ గుళికలు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల చొప్పున అందించాలి. ఆ సమయంలో నారుమడిలో పలుచగా నీరు ఉంచి చల్లాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2. మీ.లీ.. లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, తిరిగి 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బొప్యురాన్ 3 జి గుళికలు ఇసుకలో కలిపి నారుమడిలో పలుచగా నీరు ఉంచి చల్లాలి. కలుపు నివారణ నారుమడిలో గడ్డి జాతి కలుపు నివారణకు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ 10 శాతం డబ్ల్యూపి.80 గ్రాములు, లేదా ప్రేటిలాక్లోర్లో సెఫ్నర్ 400 మీ.లీ కలిపి ఒక ఎకరానికి చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలిపి విత్తిన 3 నుంచి రోజుల లోపు చల్లాలి. నారుమడిలో గడ్డి జాతి, వెడల్పాకు కలుపు నివారణకు బిస్ పైరీబాక్ సోడియం 10 శాతం ఎస్ఎల్ 100 మీ.లీ.. ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15 నుంచి 20 రోజులకు చల్లాలి. ఇలా చేయడం ద్వారా రైతులు ఆరోగ్యవంతమైన నారుమడిని, రబీలో మంచి దిగుబడిని సాధించవచ్చు. -
ఎలా చేస్కోవాలి పండగ?
● చెక్కి గోధుమపిండి కొందరికే ● జిల్లాలో అమలాపురం పట్టణానికే పరిమితం ● 11,634 కార్డుదారులకు మాత్రమే ● జిల్లాలో 5.60 లక్షల రేషన్ కార్డులు ● చంద్రబాబు ప్రభుత్వ వచ్చిన తర్వాత నిలిచిన కందిపప్పు పంపిణీ ● ఆగిపోయిన ఇంటింటికీ రేషన్ సరకుల సరఫరా సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వంలో పావలా పనికి.. ముప్పావలా ప్రచారం అనే నానుడికి ఇదొక నిదర్శనం. పండగ సమయంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమ పిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వ పక్షం రోజులుగా ఊదరగొడుతోంది. దీనిపై అధికారుల సమీక్షలు సాగిస్తుండగా, సొంత మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇంతా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ అని ఇప్పుడు చల్లగా చెబుతోంది. ప్రచారానికే పరిమితం సంక్రాంతి పండగనాడు పేదలకు చెక్కి గోధుమ పిండి ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుపై కేజీ చొప్పున గోధుమ పిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కేజీ రూ.20 చొప్పున ఇస్తామని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీనిపై పక్షం రోజులుగా ప్రచారం హోరెత్తిస్తోంది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చే సరికి జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్తామని చెప్పడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో కేవలం 11,634 కార్డు దారులకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి కూడా శుక్రవారం పట్టణ పరిధిలో ఉన్న 19 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. అయితే అమలాపురం పట్టణంలో గురువారం నుంచి పంపిణీ మొదలయ్యింది. మండిపడుతున్న వినియోగదారులు చెక్కి గోధుమపిండి కేవలం అమలాపురం పట్టణవాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రేషన్ కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి సుమారు 5.60 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారులలో కేవలం 2 శాతం మందికి మాత్రమే గోధుమ పిండి అందుతుందని అంచనా. జిల్లాలో మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతోపాటు 23 మండలాల్లో ఈ గోధుమ పిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ అమలాపురం పట్టణవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్ను ఇంటింటికీ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)ల ద్వారా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు కూడా రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 250 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డు ఎక్కి ఆందోళన చేసినా బాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కందిపప్పును నిలిపివేశారు. కేవలం గత ఏడాది జనవరి కందిపప్పు రూ.67 చొప్పున అందించారు. ఇప్పుడు ఇది నిలిపివేయగా బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని అమలాపురం పట్టణ పరిధిలో కేజీ రూ.20 చేసి అందించాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. కేరళ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర వస్తువులను అందిస్తోంది. గోధుమ పిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. మేలైన బియ్యంతోపాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – కారెం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: నూతన ఆంగ్ల సంవత్సరం ఆరంభం సందర్భంగా గురువారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని, స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి అన్నదాన సత్రంలో 8,781 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్క రోజు రూ.5,01,248 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. మద్యం షాపుల వేళలు పెంచడంపై ఆగ్రహం అమలాపురం టౌన్: నూతన సంవత్సర వేడుకల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల వేళలను పెంచడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక గొల్లగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశం నూతన సంవత్సరం పేరు చెప్పి మద్యం షాపుల వేళలను పెంచడంపై మండిపడింది. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వమే ఒక మద్యం వ్యాపారిలా ఆలోచించడం సిగ్గు చేటని ప్రజా సంఘాల ప్రతినిధులు విమర్శిఽంచారు. నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని తాము వినతి పత్రాలు ఇస్తే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకూ షాపులు తెరచి ఉంచాలని జీవో ఇవ్వడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఇక్కడే ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై ఉన్న చిత్తశుద్ధి అవగతమవుతోందన్నారు. కూలీలు, పేదలు, కార్మికుల కుటుంబాలను ఇప్పటికే ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవ కృప, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కె.శంకర్ సమావేశంలో ప్రసంగించారు. ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థాయి పరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు. -
నూతన ఏడాదిలో అందరికీ మేలు జరగాలి
కొత్తపేట/రావులపాలెం: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని, కొత్త కాంతులు విరబూయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. గురువారం రావులపాలెం మండలం గోపాలపురంలో జగ్గిరెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కొత్తపేట నియోజకవర్గంతో పాటు జిల్లావాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గోపాలపురం తరలివచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి, పూల బొకేలు ఇచ్చి, శాలువాలతో సత్కరించి, కేక్లు కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగించగా, నేటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం పాలకుల సంక్షేమ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది నుంచైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి రైతు సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజలకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని పాలకులకు హితవు పలికారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ద్రౌపది ఆరోవానిగా నిన్ను వరిస్తుంది’ అని కర్ణుడితో కృష్ణుడు అనలేదని, ఆ సమయంలో పరమాత్మ మాటలకు అనుచితార్థాలు తీయరాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందు సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగపర్వంలోని ప్రధాన సన్నివేశాలను గురువారం ఆయన వివరించారు. ‘‘రాయబారం ముగిశాక కర్ణుడిని కృష్ణుడు ఏకాంతంలో కలసి అతడి జన్మ రహస్యం చెప్పి, పాండవ పక్షానికి రావాలని ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఉపయోగించిన ‘షష్ఠే కాలే’ అనే పదానికి సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. పంచమ కాలం అన్న పదం రామాయణంలో, చతుర్థ కాలం అనే పదం యజుర్వేదంలో కనపడుతాయి. షష్ఠే కాలే అనే పదానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ‘పట్టాభిషేక సమయం’ అని అర్థం. ‘ఆ సమయంలో పాండవులతో పాటు ఆయనను సేవిస్తుంది’ అనే మాటకు విపరీతార్థాలు తీయరాదు’’ అని వివరించారు. ‘‘స్వయంవర సమయంలో తాను కర్ణుని వరించనని ద్రౌపది స్పష్టం చేసింది. నిండు సభలో ద్రౌపది వలువలు ఊడదీయమని దుశ్శాసనుడిని శాసించింది కూడా కర్ణుడేననే విషయం మనం విస్మరించరాదు. అటువంటి వాడిని ద్రౌపది ఎలా వరిస్తుంది?’’ అని సామవేదం ప్రశ్నించారు. భారత యుద్ధంలో మరణించిన రాక్షస శక్తులు నేడు మళ్లీ జన్మించి, మన మధ్యనే సంచరిస్తూ, కొన్ని పిట్ట కథలను అనేక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘‘రాయబారం ముగిశాక, కుంతిని కృష్ణ పరమాత్మ కలసినప్పుడు ప్రతిక్రియ చేయడమే రాజధర్మమని తన మాటగా ధర్మరాజుకు చెప్పాలని ఆమె అడుగుతుంది. ద్యూతంలో పరాజయం, సంపదలు కోల్పోవడం కన్నా, మహాసాధ్వి ద్రౌపదిని అవమానించిన తీరు తనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోందని, అలా చేసిన వారిపై దండనీతి ప్రయోగించాలని ఆమె ధర్మరాజుకు సందేశం పంపుతుంది. కుంతి వీరపత్ని, వీరమాత. యుద్ధమే ఆ సమయంలో తగిన ధర్మమని, క్షత్రియుడు బిచ్చమెత్తుకుని జీవించరాదని తన సందేశంలో పేర్కొంటుంది. కర్ణుడు పాండవ పక్షానికి రాడని కృష్ణుడికి తెలుసు. అయినప్పటికీ తాను నిష్కపటంగా సంధికి ప్రయత్నిస్తానని ముందే ఆయన ప్రకటించాడు. కర్ణుడు ఈవలి పక్షానికి వస్తే, యుద్ధమే ఉండదు’’ అని సామవేదం అన్నారు. -
రావులపాలెంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
రావులపాలెం: స్థానిక ఎంకేఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం నేపథ్యంలో రావులపాలెంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఏవిధమైన అనుమతులు లేకుండా అధికార టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం నెలకొల్పగా స్థానికుల అభ్యంతరం మేరకు వారి తరఫున మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి బుధవారం రాత్రి ప్రశ్నించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు తరలిరావడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు గుడ్డతో చుట్టేశారు. విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేసి డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు టౌన్, రూరల్ సీఐలు ఎం శేఖర్బాబు, సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. గురువారం కూడా సర్కిల్ పరిధిలోని సిబ్బంది ఈ సెంటర్లో పహరా కాశారు. జగ్గిరెడ్డి, మరి కొంతమందిపై కేసు నమోదు స్థానిక ఎంకేఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం. శేఖర్బాబు గురువారం తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా జగ్గిరెడ్డి విగ్రహం వద్ద జన సమూహంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జగ్గిరెడ్డితో పాటు మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: నూతన సంవత్సరం ఆరంభ వేళ కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకుని ఈ కొత్త ఏడాది తలపెట్టిన అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఏడాది పొడవునా శుభప్రదంగా సాగాలని కోరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణలో స్వామి వారికి అష్టోత్తర పూజ, నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే స్వామి వారికి రూ.8,32,482 ఆదాయం వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ర్యాలి శ్రీజగన్మోహినీ కేశవ, గోపాలస్వామి, ఉమా కమండలేశ్వర స్వామి, ఆలయాలను భక్తులు దర్శించారు.ఆలయాలకు నూతన సంవత్సరం తాకిడి -
కలెక్టర్కు పలువురి శుభాకాంక్షలు
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ను ఎస్పీ రాహుల్ మీనా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ కొత్త సంవత్సరం ఆరోగ్యం, ఆనందం, విజయాలతో నిండాలని కోరుకుంటున్నానన్నారు. నూతన సంవత్సరం అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభ్యున్నతిని తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆకాంక్షించారు. గురువారం ఆమె చాంబర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 3న అంతర్వేది రథ శకలాల నిమజ్జనం సఖినేటిపల్లి: అంతర్వేది రథ శకలాలను ఈ నెల 3వ తేదీన సాగర సంగమం వద్ద నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పోలీసు శాఖ అనుమతితో ఎండోమెంట్స్ పర్యవేక్షణలో అర్చకుల, ఆగమ పండితుల సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ రోజు ఉదయం వైదిక కార్యక్రమాలతో పూజల అనంతరం రథ శకలాలను ముక్కలుగా చేస్తామన్నారు. వాటిని ట్రాక్టర్ల ద్వారా సాగర సంగమం ప్రాంతానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం కర్పూరంతో భస్మీపటలం చేస్తామన్నారు. భస్మం చల్లారిన తరువాత బోటు ద్వారా నదీ మధ్యలోకి తీసుకు వెళ్లి నిమజ్జనం చేస్తామన్నారు. -
భీమేశ్వరాలయ ముఖద్వారానికి కోడి పందేల ఫ్లెక్సీ
సాక్షి, టాస్క్ఫోర్స్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ముఖ ద్వారానికి కోడి పందేలకు సిద్ధం అన్నట్టుగా ఉన్న రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఇప్పటికే భీమేశ్వరస్వామి ఆలయంలోని పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీకి చెందిన నాయకుడి సోదరుడు ముద్దాయిగా తేలడం, ఇప్పుడు అదే తోటపేట గ్రామానికి చెందిన నాయకుడు బుచ్చిరాజు కాకినాడ రోడ్డులోని ప్రధాన రహదారిపై ఉన్న భీమేశ్వరస్వామి ఆలయ ముఖద్వారానికి కోడి పందేలకు సిద్ధం అన్నట్లు ఉన్నఫ్లెక్సీని పెట్టడంతో ఇటు భక్తులు, అటు సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు తక్షణం ఈ ఫ్లెక్సీని ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.మండిపడుతున్న భక్తులు -
కోనసీమ కలెక్టర్ మహేష్కు తప్పిన ప్రమాదం
సాక్షి, కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల నేపథ్యంలో నిర్వహించిన ట్రయల్ రన్లో ఆయన పాల్గొనగా.. ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారు. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన సురక్షితంగా ఒడ్డును చేరారు. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పడవ పోటీలు సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్లో కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ నడిపారు. అయితే కాస్త దూరం వెళ్లాక అది అదుపు తప్పి ఒక్కసారిగా ఆయన, వెనకాల ఉన్న వ్యక్తి నీళ్లలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఇద్దరూ నీట మునగలేదు. వెంటనే గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది స్పందించి ఆయన్ని బయటకు తీశారు. -
నూతన సంవత్సర సంబరాల్లో విషాదం
అనంతపురం సెంట్రల్, సఖినేటిపల్లి, పుట్టపర్తి అర్బన్: నూతన సంవత్సర సంబరాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలో పలుచోట్ల అపశ్రుతులు చోటు చేసుకోవడంతో కొందరు ప్రాణాలు విడిచారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ నుంచి నిమ్మకాయల శ్రీధర్(35), నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ, బొండాడ సూర్యకిరణ్ అంతర్వేదికి బుధవారం రాత్రి చేరుకున్నారు. బీచ్కు సమీపంలో రూమ్ తీసుకున్నారు.అర్ధరాత్రి దాటాక రూంలో సూర్యకిరణ్ ఉండిపోగా, శ్రీధర్, గోపీకృష్ణ కారులో బయలుదేరి బీచ్ వెంబడి డ్రైవ్ చేస్తూ సాగరసంగమం వైపుకు వెళ్లారు. లైట్హౌస్ సమీపానికి వెళ్లే సరికి అక్కడున్న ఒడుపును వారు గుర్తించలేకపోయారు. అదే సమయంలో కారు అదుపు తప్పడంతో సంగమం వద్ద వేగంగా నీళ్లలోకి దూసుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన గోపీకృష్ణ కారులోంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్ సీటులో ఉన్న శ్రీధర్ కారుతో సహా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. సెల్ఫీ తీసుకుంటూ.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో సెల్ఫీ తీసుకుంటూ మిద్దెపై నుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాడాల తరుణ్కుమార్ రెడ్డి(17) మిత్రుడితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల అనంతరం మిద్దెపైకి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా తరుణ్కుమార్ రెడ్డి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తరుణ్కుమార్ రెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బీరు సీసాలతో దాడులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురంలో మద్యం మత్తులో యువకులు చెలరేగి బీరు సీసాలతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని ముత్యాలమ్మ గుడి వద్ద నివాసముంటున్న దినేష్, కళ్యాణ్.. అక్కడికి సమీపంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో వీరిపై గుర్తు తెలియని యువకులు మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు సంయుక్తంగా కేసును విచారిస్తున్నారు. -
సీమంతా సందడి
మనిషి ఆశాజీవి. అల్ప సంతోషి. నాటి కన్నా నేడు.. నేటి కన్నా రేపు ఎంతో బాగుంటుందని కలలు కంటూనే ఉంటాడు. వంద కష్టాలు.. వెయ్యి నష్టాలు వచ్చినా ఓ చిన్న సుఖం.. మరో చిన్న లాభం వచ్చిందంటే వాటన్నింటినీ మరచి ఎగిరి గంతులేస్తుంటాడు. ఏటికేళ్లు గతించిపోతున్నాయి. వాటికి తగ్గట్టే ఆశలు.. కోరికలు తామర తంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటి సాధనకే జీవితాలు సరిపోతున్నాయి. 2025 వస్తోంది.. శుభాలు తెస్తుందని ఆశించిన కొందరికి సత్ఫలితాలు.. ఇంకొందరికి మిశ్రమ ఫలితాలు.. మరికొందరికి నష్టాలు మిగిల్చి ఉండవచ్చు. 2026లో మరిన్ని శుభాలు కలగాలని కొందరు.. బాగుంటే చాలని ఇంకొందరు.. కష్ట నష్టాల నుంచి బయటపడాలని ఇంకొందరు కాంక్షిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. సర్వే జనా సుఖినోభవంతని ఆకాంక్షిస్తూ ప్రజలు వేడుకల్లో మునిగి తేలుతున్నారు. సాక్షి, అమలాపురం: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ.. తీపి గుర్తులను మననం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో మంచి జరగాలనే ఆంక్షాలను వ్యక్తం చేస్తూ జిల్లా వాసులు కొత్త ఏడాది 2026కు ఘన స్వాగతం పలుకుతున్నారు. పాత ఏడాది ముగింపు వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఉత్సాహం ఉరకలేసింది. వయసుతో సంబంధం లేకుండా అంతా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ జిల్లా అంతటా హోరెత్తించారు. డీజేలు.. ఆటపాటలతో కొత్త సంవత్సరానికి యువత స్వాగతం పలికింది. 2025కి బై బై.. 2026కు వెల్కమ్ అంటూ నినాదాలు హోరెత్తించారు. బుధవారం సాయంత్రం నుంచే సందడి మొదలు కాగా.. అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలతో పాటు రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మలికిపురం, తాటిపాక, అంబాజీపేట, మురమళ్ల, ద్రాక్షారామం వంటి మేజర్ పంచాయతీలలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. సంగీతాల హోరు.. నోరూరించే విందు భోజనాలకు పలు హోటళ్లు, రెస్టారెంట్లు వేదికలయ్యాయి. రెస్టారెంట్లలోనే కాకుండా పట్టణాలు, పల్లె అనే తేడా లేకుండా సందు సందునా తాత్కాలిక బిర్యానీ సెంటర్లు వెలిశాయి. వాటి వద్ద కూడా విక్రయాలు విరివిగా సాగాయి. పలు అపార్ట్మెంట్లలో పిల్లలు, పెద్దలు, యువత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అమలాపురం పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో డీజేలతో హోరెత్తించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పూల దుకాణాలు కళకళాడాయి. బొకేలు, బెంగళూరు గులాబీలు, ఆర్కెడ్లతో తయారు చేసిన పూలతో తయారు చేసిన పుష్పగుచ్ఛాలకు, అలంకరణ మొక్కలకు డిమాండ్ ఏర్పడింది. స్వీట్ షాపులు, బేకరీలు జనంతో కిటకిటలాడాయి. సందట్లో సడేమియాలా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులా పారింది. ఉదయం నుంచి మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు ముమ్మిడివరంలో మాత్రమే క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ.పది పెంచి విక్రయించగా, న్యూ ఇయర్ వేడుకల పేరు చెప్పి జిల్లాలో పలుచోట్ల మద్యం ధరలు పెంచి విక్రయించడం గమనార్హం. సాధారణ రోజుల్లో రాత్రి పది గంటలకు దుకాణాలు మూసి వేయాల్సి ఉండగా, అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో విక్రయాలు భారీగా సాగాయి. బెల్టు షాపుల వద్ద కూడా మామూలు రోజులలో విక్రయాల ధరల కన్నా అదనపు ధరలతో మద్యం విక్రయించడంలో వినియోగదారుల జేబులు గుల్లయ్యాయి.అమలాపురంలో ఖాళీగా ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్అమలాపురంలో పూల దుకాణం వద్ద బొకేలు కొనుగోలు చేస్తున్న ప్రజలు జిల్లాలో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోష్ భారీగా బోకేలు.. కేకులు.. బిర్యానీ విక్రయాలు రోడ్లపై కుర్రకారు జోరు.. అపార్ట్మెంట్లలో పిల్లా పెద్దా హంగామా -
మహిళపై కత్తితో దాడి
సామర్లకోట: కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్లో సమోసాలు విక్రయించే కాయ రాజుతో స్టేషన్లో పువ్వులు విక్రయించే లక్ష్మి ఏడాదిగా సహజీవనం చేస్తోంది. స్థానిక సత్యనారాయణపురంలో ఒక అద్దె ఇంటిలో రాజు నివసిస్తున్నాడు. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి ప్రతి మూడు రోజులకు రాజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని ఇద్దరు ఇంటిలోకి వెళ్లిన తరువాత కేకలు వినిపించాయి. అంతలోనే రాజు రక్తం వస్తున్న కత్తితో రైలు పట్టాలపై నుంచి పరుగుతీసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. రాజు ఉంటున్న ఇల్లు కౌన్సిలర్ సేసెని సురేష్కు చెందినది కావడంతో స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, కౌన్సిలర్ ఇంటిలోకి వెళ్లి చూసే సరికి లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిని ఆటోలో సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండు కాళ్లు నరికి వేయడంతో పాటు మెడపై కత్తి వేటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త వృద్ధుడు కావడంతో రాజుతో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
21 కిలోల గంజాయి స్వాధీనం
ధవళేశ్వరం: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10.80 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధవళేశ్వరం టిడ్కో ఇళ్లలో నివసిస్తున్న విడదవోలు సూర్యగాంధీ, రాజమహేంద్రవరం జెఎన్ రోడ్డులో నివసిస్తున్న గొలగాని బంగారు తిమ్మరాజు విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకువచ్చిన 21 కిలోల గంజాయిని బుధవారం ఉదయం ధవళేశ్వరం చెరుకూరి లే అవుట్ వద్ద విక్రయానికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ టి.గణేష్ సిబ్బందితో వెళ్లగా వారిని చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విడదవోలు సూర్యగాంధీపై మండపేట పోలీస్స్టేషన్లో, గొలగాని బంగారు తిమ్మరాజుపై రాజమహేంద్రవరం త్రీటౌన్లో రౌడీ షీట్లు ఉన్నాయన్నారు. గంజాయి స్వాధీనం చేసుకున్న డిఎస్పీ భవ్య కిషోర్, సీఐ టి.గణేష్, ఎస్సై బి.హరిబాబు, హెడ్కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, ప్రసాద్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించారు. -
కోడి కత్తుల తయారీదారు అరెస్టు
దేవరపల్లి: గోపాలపురం మండలం హుకుంపేటలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 40 కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బీఎన్ నాయక్ బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడి కత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు ఎస్సై మనోహార్, ట్రైనీ ఎస్సై శివగణేష్కు అందిన సమాచారం మేరకు హుకుంపేటలో కోడికత్తులు తయారు చేస్తున్న బొల్లం హరికృష్ణను అదుపలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని నుంచి 40 కోడి కత్తులు, కత్తులను సానపట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో కోడిపందేల్లో అరెస్టయిన వారిని, కోడిపందాలు, పేకాటలు నిర్వహించి కేసులు నమోదైన వారందని బైండోవర్ చేసినట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో 350 మంది, దేవరపల్లి పోలీస్ స్టేషన్లో 350 మంది పాత నేరస్తులు ఉన్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజులుగా పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 70 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. -
వన విహారికో విడిది..
● పర్యాటకుల కోసం ప్రత్యేక హట్లు ● ఆధునిక వసతులతో నిర్మాణం ● సర్వాంగ సుందరంగా వసతి గృహాలు తాళ్లరేవు: తూర్పున ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన కోరంగి అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక హట్లను (వసతి గృహాలు) అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందరబన్ అడవుల తరువాత రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యాన్ని వేలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు అటు కాకినాడ కానీ, ఇటు యానాం, అమలాపురం కానీ వెళ్లవలసి వచ్చేది. అయితే కోరంగిలోనే పర్యాటకులు సేద తీరడంతో పాటు అక్కడ బస చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో అటవీ శాఖ వసతి గృహాలను ప్రారంభించింది. కోరంగి పంచాయతీలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న మూడు హట్లతో పాటు మరొక అటవీ శాఖ భవనాన్ని సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రూములోనూ డబుల్ కాట్ బెడ్, ఏసీ, టీవీ, ఇన్వర్టర్ సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రాంగణంలో ఉన్న బయో డైవర్సటీ భవనాన్ని సందర్శిస్తే కోరంగి మడ అభయారణ్యం విశేషాలను తెలుసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ హట్లు ఒక వరంగా చెప్పవచ్చు. అందుబాటు ధరలలోనే అద్దెలు.. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ హట్లలో ఒక రోజు బస చేసేందకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ కాంప్లెక్స్లో ఉన్న అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే ఈ రూములను కేటాయిస్తారు. పిల్లా, పాపలు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఒకప్పటి ఫారెస్ట్ బంగ్లాను వీఐపీ రూముగా సాధారణ పర్యాటకులకు సైతం అద్దెకు ఇవ్వనున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ.3,000 చార్జి చేస్తారు. కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఒకరోజు ప్రకృతి ఒడిలో సేదతీరడం మరపురాని అనుభూతినిస్తుందని చెపుతున్నారు. కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ హట్లలో ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు కోరంగిలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన పర్యాటక హట్లు ఆన్లైన్లో సైతం బుకింగ్ కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అటవీశాఖ కల్పించింది. నేరుగా వచ్చిన పర్యాటకులకు తమ సిబ్బంది ద్వారా గదులను కేటాయిస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలు కల్పించాం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడ బస చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఇతర వివరాల కోసం 89859 52875 నెంబరులో సంప్రదించగలరు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కోరంగి అభయారణ్యం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆకాంక్ష కొత్తపేట: ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్తపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలో రైతులు, ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, శాంతి, సమానత్వంతో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. 2025 వ సంవత్సరం గడచి 2026 సంవత్సరంలో అడుగిడుతున్న వేళ ఆయన జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలని పేర్కొన్నారు. యువత ఉజ్వల భవిష్యత్, కొత్త అవకాశాలు, నూతన లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతమవుతుందని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పార్టీ అభివృద్ధికి బాధ్యతతో, మరింత కష్టపడి పని చేయాలని కోరారు. -
విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత
రావులపాలెం: స్థానిక ఎంకేఆర్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళితే టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గ నాయకులు స్థానిక ఎంకేఆర్ కల్యాణ మండపం సెంటర్లో మంగళవారం రాత్రి ఇటుకలతో దిమ్మ నిర్మించి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెటేందుకు యత్నించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి 100 ద్వారా ఫోన్ చేసి వివరించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తదుపరి నిర్మాణ పనులు నిలిపివేసి పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బుధవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల ఫొటో పెట్టి దండ వేశారు. సాయంత్రం స్థానికులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి వివరించగా ఆయన వచ్చి ఏ విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానించాక ఆ ప్రాంతంలో విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన రాగా స్థానికులు మారుతీ నగర్గా నామకరణంచేసి ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలని కోరారన్నారు. ఆ మేరకు ఆంజనేయస్వామి బొమ్మను, అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వాటిని కూడా పెట్టాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ గందరగోళంలో కొందరు శ్రీకృష్ణ దేవరాయలు బొమ్మను దిమ్మపై పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు జగ్గిరెడ్డిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రావులపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని జగ్గిరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈలోగా డీఎస్పీ సుంకర మురళీమోహన్ అక్కడకు చేరుకుని జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో చర్చించి ఆ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ చిత్రపటాన్ని, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నీ పెట్టారంటే ఇదంతా మీ మద్దతుతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హైకోర్టు ఉత్తర్వులు, పంచాయతీ తీర్మానం ఖాతరు చేయకుండా అర్థరాత్రి విగ్రహం పెట్టడం తగదని, వెంటనే ఆ విగ్రహాలను స్టేషన్కు తరలించి, బేషరతుగా ఆ దిమ్మను తొలగించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు విగ్రహానికి ముసుగు వేశామని, సంక్రాంతి పండగ వరకు అలానే ఉంచుతామని, ఆ తరువాత కోర్టు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సర్దిచెప్పారు. చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో మాజీ ఎంపీ చింతా అనూరాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకటసతీష్, పాముల రాజేశ్వరి, కోర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి జున్నూరి బాబి, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, అధికార యంత్రాంతం తరపున తహసీల్దార్ ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ సీహెచ్ సుబ్రహ్మణ్యం, సీఐ శేఖర్బాబు తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులే దగ్గరుండి విగ్రహం పెట్టించారని ధ్వజం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన పార్టీ శ్రేణులు -
ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవోగా శారద
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్బోర్డు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా (ఆర్ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమె సాక్షితో మాట్లాడుతూ తాను గతంలో మాదిరే పనిచేస్తానని, కొద్ది నెలల్లో రాబోతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ర్యాంకులు సాఽధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. -
అలుపెరగని బోధకునికి అభినందన
ఒక్క సెలవూ పెట్టని ఉపాధ్యాయినికి డీఈఓ సత్కారం అయినవిల్లి: మండలంలోని ముక్తేశ్వరం మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు అభినందించారు. పాఠశాల పర్యవేక్షణకు బుధవారం వచ్చిన డీఈఓ సదరు ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావు ఐదేళ్లుగా ఒక సెలవు తీసుకోకపోవడాన్ని తెలుసుకుని అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతలతో పనిచేసే ఉపాధ్యాయుల్లో నాగేశ్వరరావు ఒకరన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో గౌరవం ఉందన్నారు. అనంతరం నాగేశ్వరరావును దుశ్శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహూకరించారు. ఆయన వెంట డీసీసీబీ కార్యదర్శి బి హనుమంతరావు, ఎంఈఓ మెల్లం శ్రీనివాసరావు, పెచ్చెట్టి శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా వాసులు, అధికారులకు 2026 నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో మనందరికీ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమం, సమగ్ర ప్రగతిలో ముఖ్య మైలురాయిగా నిలిచాయన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి, ప్రగతి పథంలో ముందుకు సాగాలని ప్రతి పౌరుడు సుఖశాంతులతో, ఆరోగ్యంతో, సమృద్ధితో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సేవలో అంకితభావంతో, సమన్వయంతో, పారదర్శకతతో నిండిన పరిపాలనను కొనసాగిద్దామని అధికారులను కోరారు. రూ.3.97 కోట్ల మార్కెట్ సెస్ వసూళ్లు అంబాజీపేట: మూడు నెలల సమయం ఉండగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్ల 97 లక్షల 68 వేల మార్కెట్ సెస్ వసూలు చేసినట్లు అంబాజీపేట మార్కెట్ కమిటీ కార్యదర్శి ఐ.రమేష్, చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోస్తా ఆంధ్రాలోనే అన్ని మార్కెట్ కమిటీల కంటే ముందుగా లక్ష్యాన్ని పూర్తి చేసి స్థానిక మార్కెట్ యార్డు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు మార్కెట్ సెస్ వసూళ్ల లక్ష్యం రూ.382 లక్షలుగా వార్షిక బడ్జెట్లో నిర్దేశించారన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ సెస్ వసూలు మూడు నెలలు ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. 2023–24, 2024–25 సంవత్సరంలో కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్దేశించిన మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని సాధించందన్నారు. లక్ష్య సాధనలో సహకరించిన వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. వాడపల్లివాసునికి రూ.1.2 లక్షల విరాళం కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద పథకానికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన మద్దేరి సురేష్ కుటుంబం రూ.1.2 లక్షలు విరాళం ఇచ్చారు. దాతకు ఈఓ స్వామి వారి చిత్రపటాన్ని అందచేశారు. 41 గ్రామాలలో రీసర్వే అమలాపురం రూరల్: జిల్లాలో నాలుగో దశ రీ సర్వే ప్రక్రియ 41 గ్రామాలలో నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్తపేట డివిజన్లో 13 గ్రామాలు, అమలాపురం డివిజన్లో 28 గ్రామాలలో ఈ ప్రక్రియను ప్రారంభించి లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. ఈ ప్రక్రియలో భూ యాజమానులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆ దిశగా గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. సమాచారాన్ని చేర వేసి వారి సమక్షంలోనే రీ సర్వే పూర్తి చేసి కచ్చితమైన సరిహద్దులను సూచిస్తూ భూ రికార్డులను స్వీకరించి డిజిటల్ రికార్డులను రూపొందిస్తూ భావితరాలకు వివాద రహిత భూములను అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ రీసర్వే ద్వారా భూ వివరాల్ని ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో భూముల హద్దులు, విస్తీర్ణం, పాత పత్రాలు డిజిటల్ రికార్డులతో సరిపోల్చి కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఏ విధమైన అనుమానాలు ఉన్నా సర్వే బృందానికి చెప్పి పరిష్కరించుకోవాలన్నారు. -
కోకో పార్కులతో స్థూల జాతీయోత్పత్తి పెంపు
అమలాపురం రూరల్: వ్యవసాయ ఆధారిత కోనసీమ జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెంపుదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్కులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపించే దిశగా ప్రతిపాదనలకు కార్యరూపం ఇస్తున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. కోనసీమ ప్రాంత వాసుల స్థూల జాతీయోత్పత్తి పెంపుదలకు ఉప్పలగుప్తం, మామిడికుదురు మండలాలలో కోకో పార్కు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు నిర్మాణానికి చర్యలు సాగుతున్నాయని, ఇప్పటికే ప్రభుత్వం ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. జిల్లాలో కొబ్బరి, అరటి పరిశ్రమలు, విద్యుత్ పొదుపు, రోడ్లు అభివృద్ధి, విద్యా కార్యక్రమాల ద్వారా సాధించిన ఆర్థిక, సామాజిక పురోగతిని విశదీకరించారు. 2026వ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాలలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు 216 జాతీయ రహదారి అభివృద్ధికి గెద్దాడ వద్ద భూసేకరణను అధిగమించి రహదారి నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 46 కోట్లతో ఆర్ అండ్బీ రహదారుల మరమ్మతులు చేపట్టి 70 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.1650 కోట్లతో కోనసీమకు రక్షిత నీటి సరఫరా పనులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. అంతర్వేది పల్లిపాలెం హార్బర్ కొత్త ఏజెన్సీకి వస్తోందని జూన్ 15 నుంచి మత్స్య సంపద ఎగుమతులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సీసీ బీటీ రోడ్లు, కాలువగట్ల బలోపేతానికి లూజు భూముల్లో జియో టెక్స్టైల్స్ మ్యాట్లను వినియోగించి మన్నికను మరో ఐదేళ్ల పాటు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బంది పడుతున్న 51 మందిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. కలెక్టర్ మహేష్ కుమార్ -
పగలు రెక్కీ... రాత్రి నక్కి...
● ఒక్కడే... 13 దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన దొంగ కాకినాడ క్రైం: ఒక్కడే దొంగ, 13 దొంగతనాలు అవలీలగా చేసేశాడు. అన్ని చోట్ల కేసులు నమోదవడమే కానీ, ఎక్కడా పట్టుబడలేదు. తాజా చోరీలో మాత్రం కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ బృందానికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సంబంధిత వివరాలను కాకినాడ ఏఎస్పీ, ఎస్డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరపలోని నీలయ్యతోట ప్రాంతంలో ఓ భారీ చోరీ జరిగింది. ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ బృందం కేవలం ఒక్క రోజులోనే కేసు ఛేదించి నిందితుడ్ని పట్టుకొని నగలు, నగదు రికవరీ చేసింది. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాల్లో ఆరితేరిన తేజ పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో నక్కి ఇళ్లు కొల్లగొట్టేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. ముందు అక్కడే ఉన్న కిటికీలు, షూలో తాళం చెవులు వెతుకుతాడు. దొరకకపోతే దొడ్డి దారిలో వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తెరుస్తాడు. లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేస్తాడు. ఇదే తీరులో 13 దొంగతనాలు చేశాడు. కాకినాడ అర్బన్, గ్రామీణ మండలాల్లోని దాదాపు అన్ని స్టేషన్లలోనూ అతడిపై కేసులు ఉన్నాయి. నిందితుడిని సాంకేతికత సాయంతో ఒక్క రోజులోనే పర్లోవపేటలో పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ చైతన్యకృష్ణ బృందానికి ఎస్ఐ టి.సునీత, క్రైం బృందం సహకరించాయని ఏఎస్పీ అన్నారు. -
ప్రలోభాలతో పరమాత్ముని వశం చేసుకోలేము
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పాండవుల పక్షాన ద్యూతగా వస్తున్న కృష్ణపరమాత్మకు రత్నాలు, వాహనాలు, ఇతర సంపదలు ఏమడినా ఇవ్వాలని ధృతరాష్ట్రుడు విదురుని ఆదేశిస్తాడు. దానికి సమాధానంగా విదురుడు ప్రలోభాలతో పరమాత్మను వశం చేసుకోలేమని ధృతరాష్ట్రునికి వివరించినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన కృష్ణరాయబారం ఇతివృత్తాన్ని వివరించారు. నీవు ఇచ్చే పూర్ణకలశంతోనో, పాదోదకంతోనే, కుశల ప్రశ్నలతోనో తప్పించి కృష్ణుడు ఇతర సంపదలవైపు కన్నెత్తి కూడా చూడడని విదురుడు చెబుతాడు. దుర్యోధనుడు కృష్ణునితో నీ కోసం ఏర్పాటు చేసిన అన్నపానీయాలను, శయ్యను అంగీకరించమని కోరతాడు. కృష్ణుడు దుర్యోధనుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ పాండవులను ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే, వారిని ఆదరిస్తే నన్ను సత్కరించినట్టేనని చెబుతాడు. భగవంతునికీ, భాగవతులకీ తేడా లేదని ఆయన మాటల నుంచి మనం గ్రహించాలని సామవేదం అన్నారు. బాల్యం నుంచి వారి పట్ల దుర్భావంతో ఉన్న నీవు పెట్టే అన్నం కలుషితమైనదని చెప్పి, విదురిని ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు మూఢుడు, వాడి పట్ల నీవు చెప్పే మంచి మాటలు వ్యర్థం అవుతాయని విదురుడు కృష్ణునితో చెబుతాడు. ఇరుపక్షాల వారికీ నేను కావలసినవాడిని, జ్ఞాతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడితే సరిద్దిడానికి ప్రయత్నించకపోతే, లోకం నన్ను నిందిస్తుంది. నేను నిష్కపటంగా సంధి కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు కృష్ణుడు. విదురుడు ప్రీతితో పెట్టిన అన్నాన్ని స్వీకరిస్తాడు. అనంతరం కృష్ణుడు కుంతిని కలసి పాండవుల క్షేమవార్తను తెలియచేస్తాడు. క్షత్రియకాంత ఏ ప్రయోజనాన్ని ఆశించి సంతానాన్ని కంటుందో, ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని ధర్మరాజుకు చెప్పమని కుంతి కృష్ణుని కోరుతుంది. అనేక మంది మహర్షులు, రాజర్షులు, దేవర్షులు కృష్ణుని సందేశం వినడానికి సభకు వస్తారు. ముందుగా వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోకుండా మనం ఆసీనులం కారాదని కృష్ణుడు సూచిస్తాడని సామవేదం అన్నారు. -
పోలీసుల అదుపులో పాత నేరస్తుడు
కాకినాడ క్రైం: స్థానిక గంజాం వారి వీధిలో ఉన్న అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో రూ.19 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. క్రైం సీఐ కృష్ణ, కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. సంబంధిత వివరాలను ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన పాత నేరస్తుడు కాకర్ల లోవరాజుపై 19 కేసులు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఉండడంతో పట్టుబడతానన్న భయంతో తన బంధువైన నగరానికి చెందిన 14 ఏళ్ల బాలుడిని చేరదీసి దొంగతనాలు చేయడం, గంజాయి విక్రయించడం నేర్పాడు. ఈ నేపథ్యంలో చేసిన దొంగతనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలు, సాంకేతికత ఉపయోగించి బుధవారం బుడంపేటలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.19 లక్షల నగదుతో పాటు రూ.55 వేల విలువైన 22 కిలోల గంజాయిని పట్టుకున్నామని అన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనాయణ, సీఐలు కృష్ణ, నాగదుర్గారావు, ఎస్ఐలు వినయ్ ప్రతాప్, స్వామినాయుడు ఎస్పి బిందుమాధవ్ అభినందించారు. అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో చోరీ అతడి పనే 14 ఏళ్ల బాలుడితో కలిపి చోరీలు రూ.19 లక్షల నగదు.. 55 కిలోల గంజాయి స్వాధీనం -
వైఎస్సార్సీపీ నేత జగ్గిరెడ్డి అక్రమ అరెస్ట్
రావులపాలెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. పోలీసుల సహకారంతో కూటమినేతలు రెచ్చిపోయారు. రావులపాలెంలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు కూటమి నేతలు. అనుమతులు లేని ప్రాంతంలో విగ్రహం పెట్టడంపై జగ్గిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ప్రదేశంలో ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గతంలో తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గిరెడ్డిని రావులపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?
సాక్షి, ద్రాక్షారామం: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అనంతరం, మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘ద్రాక్షారామాం ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడం దారుణం. ఎటువంటి సంప్రోక్షణ చెప్పకుండా హడావిడిగా మరో లింగాన్ని ఎందుకు ప్రతిష్టించారు. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే?. ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్గా ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించారు.మరోవైపు.. దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ..‘ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?. ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునః ప్రతిష్టించటం అపచారం కాదా?. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారు?. ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు?. చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి సోదరుడు అధికార టీడీపీ కార్యకర్త అని తెలిసింది. నిందితుడు కూడా టీడీపీ కార్యకర్త అని సమాచారం. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్కల కొట్లాట వంటిదని కృష్ణుడికి ధర్మరాజు విన్నవించుకుంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సిందిగా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మరాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పోయి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని మేం అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ధర్మజుడి మాటల్లో ఆయన శరణాగతి కనపడుతోందని అన్నారు. ఇక కర్ణ దుర్యోధనులది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని వ్యాఖ్యానించారు. ‘‘అర్జునుడిని ఎదుర్కోవడానికి తగిన వాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే తలంపుతో దుర్యోధనుడి అండ చేరాడు కర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆదర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్య నిర్వహణకు వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నారు. సంజయునికి ధృతరాష్ట్రుడు కృష్ణ తత్త్వాన్ని వివరిస్తాడన్నారు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలో ఉన్న జీవుడు ఒకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్న జీవుడు మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం షాపులను మూయించాలి
అమలాపురం రూరల్: నూతన సంవత్సర వేడుకల పేరుతో జరుగుతున్న విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు, మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి డిసెంబర్ 30, 31 జనవరి 1వ తేదీలలో మద్యం షాపులను పూర్తిస్థాయిలో మూసివేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవ కృప, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారేం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏటా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మందుబాబు మద్యం తాగి అర్ధరాత్రి వేళల్లో చేసే రచ్చతో మహిళలు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. -
కోటి ఆశలతో..
అమలాపురంగడియార స్తంభం సెంటర్ సాక్షి, అమలాపురం: నూతన సంవత్సరం అనగానే కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో గడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వ్యవసాయం బాగుండాలని రైతు, ఉద్యోగ అవకాశాలు పెరగాలని నిరుద్యోగి, మెరుగైన జీతభత్యాలు రావాలని ఉద్యోగి, తమకు వ్యక్తిగత భద్రత, ఆర్థిక భరోసా కావాలని మహిళలు, ఉన్నత చదువులకు చేయూత దక్కాలని విద్యార్థి.. ఇలా సమాజంలో అన్ని రంగాల వారూ ఆశలు పెట్టకుంటారు. గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరచి, రాబోయే కొత్త సంవత్సరంలో తమ జీవితాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తారు. మరి కొద్ది గంటలలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజలు తమ జీవితాలు నవీన పథంలో పయణించాలని కోరుకుంటున్నారు. అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ప్రభుత్వం నాటి సంక్షేమ ఫలాలు అందాలని బడుగు, బలహీన, మధ్య తరగతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పేద, మధ్య తరగతి, రైతు వ్యతిరేక విధానాలతో సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. తమ ఆశలు.. ఆకాంక్షలను ‘సాక్షి’కి వివరించారు. కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి అన్ని రంగాలూ వృద్ధి చెందాలి చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి సంక్షేమ ఫలాలు అందాలి జిల్లా ప్రజల ఆకాంక్ష -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
అమలాపురం టౌన్: యూఎఫ్బీయూ పిలుపు మేరకు కోనసీమలోని అన్ని బ్యాంక్ల ఉద్యోగులు అమలాపురంలోని యూనియన్ బ్యాంక్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం సాయంత్రం ధర్నా చేశారు. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే అన్ని ప్రధాన బీమా సంస్థలతోపాటు ఆర్బీఐ, ఎల్ఐసీ, ఎస్ఈబీఐ తదితర సంస్థలు 5 రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయని బ్యాంక్ ఉద్యోగులు గుర్తు చేశారు. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ల ఉద్యోగులు తీవ్రమైన సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, అధిక లక్ష్యాలతో మానసిక, శారీరక ఒత్తిడితో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోనసీమ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణ, సెక్రటరీ బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ వై.గణేష్, సబ్ స్టాఫ్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, అమలాపురం ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు, కోనసీమ జిల్లా ఎల్డీఎం కేశవ వర్మతోపాటు కోనసీమలోని పలు బ్యాంక్ల యూనియన్ల ప్రతినిధులు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. ఆకట్టుకున్న ఆటో కార్ట్ వాహనంఐ.పోలవరం: నైపుణ్య వృత్తి విద్యపై అమలాపురంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐ.పోలవరం జెడ్పీహెచ్ఎస్ ఒకేషనల్ జట్టు తయారు చేసిన కాలుష్య రహిత ఆటో కార్ట్ (ఈకో ఫ్రెండ్లీ గో కార్ట్) వాహనం ఆకట్టుకుంది. దాన్ని రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు నడిపారు. తయారు చేసిన విద్యార్థులు భరత్, గణేష్, రాఘవ సతీష్, ఎస్.మహేష్బాబుతో పాటు ఒకేషనల్ టీచర్ కె.సతీష్, టీమ్ను అభినందించారు. జిల్లా ఒకేషనల్ టీంలో జిల్లా బాలిక అభివృద్ధి అధికారి ఎంఏకేడీ భీమారావు, ఐ.పోలవరం జెడ్పీహెచ్ఎస్ ఒకేషనల్ ట్రైనర్లు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వృత్తి విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి పథకం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలతో ఆర్థిక వృద్ధి అమలాపురం రూరల్: జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కొబ్బరి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇంక్యుబేషన్ సెంటర్ డెవలప్చేసే విధానం, కొబ్బరి నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి డొక్క నుంచి ఫైబర్ యార్న్ కోకో ఫిట్, జియో టెక్స్టైల్స్ మాక్స్ తయారీ అంశాలపై చర్చించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్థానికంగా రైతులు కేవలం కొబ్బరి కాయలను విక్రయించి మిగిలిన కోయర్ విలువ ఆధారిత ఉత్పత్తులపై ఏ విధమైన ఆసక్తి చూపక నష్టపోతున్నారన్నారు. ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎన్ఆర్ఎల్ఎం, నాబార్డు సంస్థల ద్వారా కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఉప్పలగుప్తంలో ఏడు ఎకరాల స్థలాన్ని ఈ పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం జరిగిందన్నారు. పశు దాణా పథకం సత్ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పశుదాణా పథకం వల్ల కలిగిన లబ్ధి తదితర అంశాలపై సమీక్షించారు. -
పెరిగిన హత్యలు.. ఆగని చోరీలు
● రోడ్డు ప్రమాదాలూ అధికమే ● 2025లో ఎక్కువైన నేరాలు ● వార్షిక నేర సమీక్ష నివేదికను వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది (2025) జిల్లాలో హత్య కేసులు పెరిగాయి. అలాగే చోరీ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. జిల్లా మొత్తం మీద అన్ని రకాల కేసులకు సంబంధించి పెరుగుదల ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగాయి. 2025 సంవత్సరం వార్షిక నేర సమీక్ష నివేదికలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ విషయాలను వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజుతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక నేర సమీక్ష నివేదికలోని వివిధ నేరాల గణాంకాలను వివరించారు. ● 2025లో 112 కాల్ ద్వారా 9,096 ఫిర్యాదులు అందగా, వాటిలో 9,012 పరిష్కరించారు. ● ఈ ఏడాది సీఈఐఆర్ ద్వారా సుమారు రూ.1.10 కోట్ల విలువైన 550 సెల్ఫోన్లు రికవరీ చేశారు. ● ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 2,224 ఫిర్యాదులు రాగా వాటిలో 2,120 పరిష్కారమయ్యాయి. ● జిల్లాలో 42 సైబర్ నేరాలపై కేసులు నమోదయ్యాయి. 1930 సైబర్ పెట్రోల్ ద్వారా 975 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు నష్టపోయిన రూ.1.03 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా హోల్డ్ చేశారు. ● మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసుల వివరాలు, చోరీలు, ఆస్తుల రికవరీ, నిందితుల అరెస్ట్ వంటి వాటిని ఎస్పీ వివరించారు. కోడి పందేలు, పేకాట శిబిరాలు, గంజాయి, అక్రమ మద్యం, సారా కేసుల వివరాలు తెలిపారు. సంవత్సరం హత్యలు దొంగతనాలు రోడ్డు నమోదైన ప్రమాదాలు కేసులు 2024 9 416 572 6,747 2025 13 439 612 8393 -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
కడియం: వృద్ధురాలిని బెదిరించి నగదు, బంగారు చెవిదుద్దులు దోచుకున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు కడియం ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే..కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్కు చెందిన దువ్వారపు శాంతమ్మ అనే వృద్ధురాలు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళం నుంచి వచ్చి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో దిగింది. స్టేషన్ బయట ఆమెకు చైతన్య నగర్ వరకూ లిఫ్ట్ ఇస్తానంటూ దాసరి వీర వెంకట దుర్గాప్రసాద్ తన మోటారు సైకిల్ ఎక్కించుకున్నాడు. రాజవోలు నుంచి కడియం ఆవలోకి వచ్చే రోడ్డు సమీపంలో శాంతమ్మకు కత్తితో బెదిరించి బంగారం చెవిదుద్దులు, రూ.5 వేలు లాక్కున్నాడు. ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అదుపు తప్పి.. బోల్తా పడి..మామిడికుదురు: జాతీయ రహదారిపై పాశర్లపూడి వద్ద మంగళవారం వేకువ జామున ఓ కారు పంట బోదెలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం, కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురం వైపు నుంచి తాటిపాక వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఎడమ వైపున ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ కారులోని నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని రాజోలుకు చెందిన 108లో అమలాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొన్న వేగానికి కొబ్బరి చెట్టు నుంచి బొండాలు రాలిపడ్డాయి. -
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
● వైభవంగా ముక్కోటి ఏకాదశి ● ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం ● ఆలయాలకు పోటెత్తిన భక్తులు కొత్తపేట: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివార్లకు భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం భూలోక వైకుంఠంలా మారింది. ఆలయంతో పాటు ప్రాంగణం, వైకుంఠ ద్వారం, అంతరాలయాలను పుష్పాలతో విశేషంగా అలంకరించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు మంగళవారం తెల్లవారుజామున తిరుమల తరహాలో ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ఉత్సవ మూర్తులను, శేషపాన్పుపై ఉన్న స్వామివారిని, అనంతరం ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాల్లో భాగంగా గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రూ. 17.72 లక్షల ఆదాయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఒక్కరోజే రూ.17,71,782 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. గత ఏడాది ముక్కోటికి రూ.5,79,678 వచ్చిందన్నారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు: అప్పనపల్లిలోని బాల బాలాజీ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. అంతర్వేదిలో.. సఖినేటిపల్లి: అంతర్వేదిలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యాన అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. -
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉద్యోగాలూ కల్పించలేదు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. క్వాంటం కంప్యూటర్స్, గూగుల్ డేటా సెంటర్లు కేవలం వైజాగ్ వరకే పరిమితమవుతున్నాయి. కోనసీమ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాలి. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ దిశగా కొత్త సంవత్సరంలోనైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం. – సత్తి నాగ పల్లారెడ్డి, బీకాం కంప్యూటర్స్, రావులపాలెం పాత పెన్షన్ విధానం కావాలి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో సీపీఎస్, జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టెట్ పరీక్షల నుంచి 2010కు ముందున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వ కొత్త సంవత్సరంలో ఇస్తుందని ఆశిస్తున్నాను. – కటకటాల చంద్రశేఖర్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుడిమళ్లంక, మలికిపురం మండలం పంటకు లాభసాటి ధర ఇవ్వాలి రైతులు పండించే పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. పండించిన పంటకు లాభసాటి ధర ఇవ్వాలి. వరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సాధారణ రకం బస్తా (75 కేజీలకు)కు కనీసం రూ.రెండు వేలు నిర్ణయించాలి. జగన్ ప్రభుత్వంలో అమలు చేసినట్టుగా ఉచిత పంటల బీమా విధానాన్ని తీసుకు రావాలి. పంట నష్టపోయిన రైతులకు మూడు నెలల్లో పెట్టుబడి రాయితీ ఇవ్వాలి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, కొత్తూరు, రామచంద్రపురం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు మరో రెండు నెలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటాను. మెడికల్ రంగంపై ఆసక్తితో బైపీసీ చదువుతున్నాను. మెడికల్ సీట్ పొందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. అప్పుడే అందరికీ మేలు కలుగుతుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చదవడం ఖర్చుతో కూడుకున్నది. నూతన సంవత్సరంలో విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు చేస్తారని ఆశిస్తున్నాను. – ఎ.అంజలీదేవి, అంగర, కపిలేశ్వరపురం మండలం మహిళలకు లబ్ధి కలగాలి కొత్త సంవత్సరంలో మహిళలకు వ్యక్తిగత, ఆర్థిక భద్రత రావాలి. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని కొత్త ఏడాదిలోనైనా అమలు చేయాలి. మహిళకు ఇతర పథకాల లబ్ధి కూడా కలగాలి. వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. – చెల్లి రమాదేవి, కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం వ్యాపార రంగం తేరుకోవాలి జిల్లాలో వ్యాపార రంగం తీవ్ర ఒడిదొడుకులకు గురైంది. బంగారం, వెండి ధరల్లో అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభానికి అనుగుణంగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. చూసిన వారికి ఈ రెండింటి ధరలు పెరిగాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా కొందరు వ్యాపారులు మార్కెట్ హెచ్చుతగ్గులపై సరైన అవగాహన లేక నష్టపోయారు. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులు ఆచితూచి లావాదేవీలు చేయాలి. కొత్త సంవత్సరంలో ప్రతి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. – అనిల్ జైన్, రాష్ట్ర బంగారు వర్తక సంఘం కోశాధికారి, అమలాపురం -
ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణమంటూ ధృత రాష్ట్రునితో సంజయుడు చెబుతాడని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని సోమవారం ఆయన కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవుల మధ్య జరిగిన అనేక చర్చోపచర్చలను ఆయన వివరించారు. ‘‘పాండవుల వద్దకు ధృతరాష్ట్రుని తరఫున సందేశాన్ని తీసుకువెళ్లిన సంజయుడు.. తిరిగి వచ్చి, ధర్మరాజు సహనానికి, సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. ధర్మరాజు మెత్తటి వాడే కానీ, చేతకాని వాడు కాడు. మనశ్శాంతి కోసం విదురుడిని ఆహ్వానించిన ధృతరాష్ట్రుడు.. జరుగుతున్న పరిణామాల వలన తాను నిద్రకు దూరమయ్యానని అంటాడు. ‘బలవంతుడు దండెత్తి వస్తే తగిన సాధనాలు లేని దుర్బలుడు, సంపద కోల్పోయిన వాడు, కాముకుడు, దొంగ– ఈ నలుగురికీ నిద్ర పట్టదు. నీలో ఈ దోషాలు లేవు కదా?’ అని విదురుడు అడుగుతాడు’’ అని వివరించారు. విదురనీతి, సనత్సుజాతీయం భారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవని, విదురనీతిని విద్యార్థి దశ నుంచే బోధించాలని సామవేదం అన్నారు. సామాన్య ప్రజలు, సీ్త్రలు సైతం ధర్మరాజు విజయాన్ని కాంక్షిస్తున్నారని ధృతరాష్ట్రునితో సంజయుడు అంటాడని చెప్పారు. కర్ణుడికి బ్రహ్మాస్త్రం పని చేయదని పరశురాముడు శపించడంలో కుల ప్రస్తావన లేదని, మోసంతో విద్యను నేర్చుకోవాలని కర్ణుడు భావించడమే ఆ శాపానికి కారణమని వివరించారు. ‘‘ఇటు ద్రోణ, కర్ణులు, అటు అర్జునుడనే ముగ్గురిలో ఏ ఒక్కరు మరణించినా శాంతి ఉంటుంది. అర్జునుడు, గాండీవం, కృష్ణుడు అనే మూడు శక్తులున్న చోటే జయం ఉంటుంది. నా కొడుకు నా మాట వినడు. నేనేం చేయాలి’’ అంటూ ధృతరాష్ట్రుడు విలపిస్తాడు. స్మరించగానే ధృతరాష్ట్రుని వద్దకు వ్యాసుడు వచ్చి, కృష్ణ మహిమను వివరిస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వలోకేశ్వరుడని నీకు తెలిసినట్టు నాకెందుకు తెలియదని వ్యాసుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నీవు అవిద్యలో ఉన్నవాడివి కనుక తెలుసుకోలేకపోతున్నావని వ్యాసుడు చెబుతాడు’’ అని చెప్పారు. ధృతరాష్ట్రుని మించిన శ్రోత లేడని, ఆసక్తికరంగా వింటాడని, లోపలకు ఎన్ని విషయాలు వెళ్తున్నాయో మనకు తెలీదని సామవేదం అన్నారు. పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి అవిద్యయే కారణమని చెప్పారు. -
‘ముక్కోటి’కి ముస్తాబు
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు ● ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు తూర్పు రాజగోపురం, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధానాలయం ఉత్తర ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 4 గంటలకు పండితులు స్వామి, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పిస్తారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. దీనికోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ భక్తులు దిగువ నుంచి ఆలయ ప్రాకారంలోకి క్యూలో ప్రవేశించాక.. దక్షిణ ద్వారం నుంచి లోపలకు వెళ్లి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు వచ్చేవారు. ముక్కోటి సందర్భంగా దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం వద్దనే ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్లను దర్శించి, అక్కడి నుంచి తూర్పు ద్వారం వైపు వెళ్లి, గర్భాలయంలో సత్యదేవుడు, అమ్మవారిని దర్శించుకుని, దక్షిణ ద్వారం వద్ద ఉన్న క్యూ లైనులో వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి వెండి గరుడ వాహనంపై అన్నవరం గ్రామంలో ఊరేగించనున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులతో ఆలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓ పెండ్యాల భాస్కర్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ మార్కెట్కు ఎరువులు
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం అమలాపురం టౌన్: జిల్లాలో ఎమ్మార్పీ ధరలకు ఎరువులు దక్కడం లేదని, సరకు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. కాట్రేనికోన మండలానికి చెందిన ఓ మహిళా రైతు ఎమ్మెల్సీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసింది. తాను పదెకరాలకు పైనే దేవస్థానం భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని, తనకు అతి కష్టంగా రెండే రెండు బస్తాల ఎరువులు దక్కాయని ఆమె ఎమ్మెల్సీ వద్ద వాపోయింది. అనంతరం ఆ మహిళా రైతు అమలాపురంలోని కలెక్టరేట్కు వెళ్లి గ్రీవెన్స్లో అన్నదాతలకు ఎరువులు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురంలో సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాతలు నేడు బ్లాక్ మార్కెట్లో దాదాపు రూ. 200కి పైగానే అదనపు ధరలను చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా ప్రభుత్వం మాత్రం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుందని, ఇలాగైతే పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగుకు ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిరసన చేపడతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు. -
అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి
అమలాపురం రూరల్: ప్రజలు అందించిన ప్రతి అర్జీని పారదర్శకంగా పరిష్కరించాలని జేసీ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో కొత్త మాధవి, డ్వామా పథక సంచాలకులు ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీలతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలకు సంబంధించి మొత్తం 280 అర్జీలు వచ్చాయి. జేసీ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే సంకల్పాన్ని సాధించే దిశగా ఎంఎస్ఎంఈల ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీలను గడువు లోగా పరిష్కరించాలన్నారు. వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలుచోట్ల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. ఆ పత్రాలను ఎస్పీ పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. అర్జీదారుల సమక్షంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల సీఐలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు. జోనల్ స్థాయి స్పెల్బీ పోటీలకు ఎంపిక అల్లవరం: అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి స్పెల్బీ పోటీల్లో దేవగుప్తం ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థి కోలా లీలాశివకార్తిక్ ప్రథమ స్థానంలో నిలిచి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం వేణుగోపాల్ సోమవారం తెలిపారు. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఎన్సీఈఆర్టీ వారి ఆధ్వర్యంలో స్పెల్బీ పోటీలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి లీలా శివకార్తిక్కు ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థికి ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం.బాలశంకర్, సాయి సుబ్బలక్ష్మిని హెచ్ఎం, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. -
సాగనంపాలనే..
కపిలేశ్వరపురం: ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడా నికి గత అనుభవాలు మార్గదర్శకం అవుతాయి. జరిగి నవి ఘటనలుగా కాకుండా గుణపాఠాలుగా పరిగణించిన రోజున ప్రతి ఘటనా మనసును మీటే ప్రేరకమే అవుతోంది. 2025లో ఎన్నో మజిలీలు.. మరెన్నో విజయాలు, ఓటములు, దుర్ఘటనలు, ప్రకృతి విలాపాల ను ప్రతి ఒక్కరూ చవిచూశారు. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక తదితర ప్రజా సంఘాలు సైతం తమదైన శైలిలో పోరాడాయి. నిరసన.. జోరున ● జనవరి 2: తమను విధుల్లో కొనసాగించి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ కూట మి నేతలు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వలంటీర్లు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ● జనవరి 13: విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ● మార్చి 12: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యువత పోరు విజయవంతమైంది. ● ఏప్రిల్ 12: ‘సాక్షి’ దినపత్రికపై, ఎడిటర్పైనా వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పత్రికా విలేకరులు ఆందోళన చేశారు. ● ఏప్రిల్ 28: తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో ఆరోగ్య కేంద్రాల్లోని 400 మంది సీహెచ్ఓలు సమ్మె చేశారు. ● మే 7: రబీ ధాన్యంలో ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనాలంటూ అమలాపురంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ● జూన్ 23: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ● జూలై 2: ఇందుపల్లిలో జిల్లా స్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ● జూన్ 4: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన తెలిపారు. ● సెప్టెంబర్ 12, 13: జిల్లాలో సీ్త్రశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో కార్మికులు ఆటోలు బంద్ చేశారు. ● సెప్టెంబర్ 19: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కామనగరువులో గత ప్రభుత్వం ప్రారంభించిన పభుత్వ వైద్య కళాశాల భవనం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ● డిసెంబర్ 10: ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి, 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీలతో తరలించారు. అందరిలో మేటి.. కీర్తి చాటి ● జనవరి 26: ఢిల్లీలోని 76వ గణతంత్ర వేడుకలో ముక్కామలకు చెందిన నాగబాబు కళాకారుల బృందం ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది. కొత్తపేట కళాకారుల గరగ, వీరనాట్యం ప్రదర్శనకు గుర్తింపు దక్కింది. ● మార్చి 9: నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోరీ చేనేత సహకార సంఘం తయారు చేసిన వస్త్రాలను ప్రశంసించారు. ● జూన్ 15: వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం మహిళ చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచారు. ● ఆగస్టు 2: లండన్లో ఆరేళ్లలోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కొత్తపేటకు చెందిన తణుకు పూర్ణిమకు బ్రిటిష్ అత్యున్నత కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ (సీబీఈ) పురస్కారాన్ని బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనీ చేతుల మీదుగా అందజేశారు. ● ఆగస్టు 15: శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ నిర్వాహకులు రావులపాలేనికి చెందిన గొలుగూరి సతీష్రెడ్డి, పడాల సోమిరెడ్డి తదితరులను విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ నజీర్ అభినందించారు. తుదిశ్వాస విడిచి.. ● జూన్ 5: అమలాపురంలో కామాక్షి పీఠం స్థాపకుడు, అనాధాశ్రమం నిర్వాహకుడు కామేశ మహర్షి (87) తుదిశ్వాస విడిచారు. ● నవంబర్ 11: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు వెంకట సత్యసూర్య అచ్యుత రామరాజు (60) గుండెపోటుతో మృతి చెందారు. ● డిసెంబర్ 13: అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి (85) ఢిల్లీలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఏడాదిలో అనేక ఉద్యమాలు సమస్యలపై కదం తొక్కిన ప్రజలు చంద్రబాబు పాలనలో కానరాని కేంద్ర సాయం కలవరపెట్టిన ప్రముఖుల మరణాలు అనేక అనుభవాలను మూటకట్టిన 2025 -
థర్టీ ఫస్ట్ ధమాకా
● క్వార్టర్పై రూ.10 అదనం ● సామాజిక మధ్యమాల్లో హల్చల్● ముమ్మిడివరం నియోజకవర్గంలో దోపిడీ ● కీలక నేత వత్తాసు ● సిండికేట్లో 30 షాపులు వారివే సాక్షి, అమలాపురం: ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’... పాత సంవత్సరానికి ముగింపు రోజు. అంతేకాదు మందు బాబులకు పండగ రోజు. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారులు రెండు చేతులా సంపాదించే రోజు. సాధారణ రోజుల కన్నా సంవత్సరాంతం రెండు, మూడు రెట్లు సాగే వ్యాపారం కోసం మద్యం వ్యాపారులు చేసుకునే ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. సందట్లో సడేమియాగా జిల్లాలో మద్యం వ్యాపారులు దోపిడీకి సిద్ధమయ్యారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్కు అదనంగా సొమ్ము వసూలుకు తెగబడ్డారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటికే మొదలైన ఈ దోపిడీ జిల్లా అంతా విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో మద్యాన్ని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ దందా సాగుతోంది. క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దందాపై ఒక మద్యం ప్రియుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది హల్చల్ చేస్తోంది. మద్యం విక్రయాలు జరిపే ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘అదనపు ధర ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రత్యేకమని’ చెప్పడం గమనార్హం. సాధారణంగా బెల్టు షాపుల్లో మద్యం దుకాణాల కన్నా రూ.20 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ధరలు పెంచడంతో వీరు కూడా అదనంగా రూ.30 నుంచి రూ.40 పెంచి విక్రయిస్తున్నారు. ఆ నేత సోదరుడి హవా.. నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ కీలక నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది. వీరి ఆధ్వర్యంలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో సుమారు 30 మద్యం దుకాణాల వరకూ ఉన్నాయని అంచనా. దీనిని అడ్డు పెట్టుకుని మద్యం ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల కనుసన్నల్లోనే బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం కాస్తా మాఫియాగా మారిపోయింది. గతంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన విషయం గమనార్హం. మిగతా చోట్లా.. అదే బాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వ్యాపారంలో భారీ లబ్ధి ఆశిస్తున్న జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు కూడా ముమ్మిడివరం బాట పట్టే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గాల వారీగా సిండికేట్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అంబాజీపేటలో ఒక సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది. గత దసరా పండగ సమయంలో ఇక్కడ జరిగే భేతాళస్వామి ఉత్సవాలకు మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు క్వార్టర్కు రూ.50 చొప్పున పెంచి మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డోర్ డెలివరీ వ్యాపారం జోరందుకుంది. -
సాయం లేక.. సాగలేక..!
● అన్నదాతకు కలిసిరాని కాలం ● వరి సాగు తిరోగమనం ● రబీ ధాన్యం సొమ్ము జమలో జాప్యం ● ఖరీఫ్ను ముంచెత్తిన ప్రకృతి ● కొబ్బరి.. నింగి నుంచి నేలకు ● ఆదుకోని అరటి ● వనామీపై ట్రంపోత్పాతం ● చేయూత లేని బాబు సర్కార్ సాక్షి, అమలాపురం: క్యాలెండర్లలో తేదీలే కాదు.. సంవత్సరాలు మారుతున్నా కర్షకుడు కష్టాల నుంచి గట్టు ఎక్కలేకపోతున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు ఈ ఏడాది మన్నే మిగిలింది. ప్రకృతి ప్రకోపానికి, చంద్రబాబు సర్కార్ ఉదాసీన వైఖరికి అన్నదాత మరోసారి చిత్తయ్యాడు. ప్రకృతి శాపం కన్నా బాబు నిర్లక్ష్యంతో పుడమి పుత్రుడు నిలువునా మునిగిపోయాడు. 2025 సంవత్సరం వరి.. కొబ్బరి.. అరటి.. కూరగాయ పంటల నుంచి చివరకు వనామీ సాగు కూడా నష్టాలను మిగిల్చింది. వరి.. రెండు పంటలకు దెబ్బ ● జిల్లాలో ప్రధానమైన వరి ఈ ఏడాది కలసిరాలేదు. ఏడాది ఆరంభంలో రబీ పంట దిగుబడి బాగా వచ్చినా కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. కొన్న ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు జమ కాకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నీరు వదిలినా మధ్య డెల్టాలో లొల్ల, తూర్పు డెల్టాలో చొప్పెల్ల లాకుల వద్ద నిలిపివేసింది. తరువాత వదిలినా దిగువున లాకుల వద్ద నిలిపివేయడంతో ఖరీఫ్ ఆలస్యమైంది. ● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ప్రభుత్వం సకాలంలో నీరందించకపోవడం వల్ల కేవలం 1.53 లక్షల ఎకరాల్లో మాత్రమే ఖరీఫ్ సాగవుతోంది. ● సాగు మధ్యలో రైతులకు యూరియా కొరత ఏర్పడింది. యూరియా బస్తా రూ.266.50 కాగా రైతులు అదనంగా చెల్లించి రూ.400 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. చివరకు ఖరీఫ్లో 30 నుంచి 35 బస్తాలు రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల సగటున 25 బస్తాల కన్నా తక్కువ వచ్చింది. ఎగసి‘పడిన’ కొబ్బరి కొబ్బరి ధర ఈ ఏడాది ఎగసిపడింది. మే నెల నుంచి సెప్టెంబరు నెల వరకు రికార్డు స్థాయి ధర వచ్చింది. పచ్చికొబ్బరి ధర రూ.28 వేల వరకు ఉండేది. అక్టోబరు నెలలో రూ.23 వేలకు పడిపోగా, నవంబరు 15 తరువాత రూ.13 వేలకు పడిపోయింది.రైతులకు ధాన్యం సొమ్ము ఇవ్వాలని ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు (ఫైల్) ధాన్యం సొమ్ము విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ట్రాక్టర్లను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్)వనామీని ముంచిన ట్రంప్ ● జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశాజనకంగా ఉన్న వనామీ సాగు ఆ తర్వాత తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మార్చిలో స్థానిక ఎగుమతిదారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించేశారు. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడంతో రొయ్యల ధరలు కౌంట్కు కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించడంతో ఆక్వా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే సమయంలో విద్యుత్ ఓల్టేజీ వల్ల నష్టపోతున్నామని ఆక్వా రైతులు రోడ్డున పడి ఆందోళన చేయాల్సి వచ్చింది. చేయిచ్చిన చంద్రబాబు సర్కార్ ● చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు అందిస్తామని చెప్పిన తొలి ఏడాదే ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇచ్చినా కొంతమంది రైతులకు కోత పెట్టింది. ● రబీ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినప్పటికీ మూడో నెలలో కాని సొమ్ము అందలేదు. రూ.248.65 కోట్లు అందించకపోవడంతో రైతులు అప్పులు పాలయ్యారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా విధానాన్ని ఎత్తివేసింది. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా కేవలం 44,201 ఎకరాలు మాత్రమే బీమా పరిధిలో ఉన్నాయి. మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని పాందలేకపోయారు. బీమా పరిధిలో లేని వారిలో 80 శాతం కొలుదారులు కావడం గమనార్హం. ● కోనసీమలో అత్యంత కీలకమైన పది మేజర్ డ్రైన్లలో తూడు, గురప్రు డెక్క తొలగింపునకు అరకొరగా ఇచ్చిన నిధులు కూడా వినియోగించనందున మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు చేలు ముంపులో ఉన్నాయి. ● చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఎంపిక చేసిన ప్రాజెక్టు కమిటీ ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. రూ.రెండు కోట్లు నిధులు ఇచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. -
ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 76 మంది వికాస్ కార్మికుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు వెల్లడించారు. మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న వారిని తొలగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం ఏదైనా సంస్థలో 100 మందికి పైగా సిబ్బందిని తొలగించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలని ఆయన అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. మున్సిపాలిటీలో ఏటా 15 శాతం నుంచి 30 శాతం వరకూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని, కానీ ఆ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆయన అన్నారు. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక నిత్యం వేలాది మంది వివిధ పనులపై వస్తున్నారని, ఈ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన కార్మికులు చాలా మంది అవసరమవుతారని ఆయన అన్నార. పట్టణానికి వచ్చే ప్రజలకు కనీసం మూత్ర విసర్జన శాలలను ఎక్కువగా నిర్మించే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ కుడుపూడి ఆందోళన వ్యక్తం చేశారు. రాకపోకలకు రేవులు సిద్ధం అయినవిల్లి: ఇటీవలి వరదల సమయంలో ముక్తేశ్వరం–కోటిపల్లి రేవు మూతపడింది. ఈ లోపులో రేవు పాట కూడా ముగిసింది. దీంతో రేవు నిర్వాహకులు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వరదలకు కొట్టుకుపోయిన ముక్తేశరం రేవు వైపు, కోటిపల్లిరేవుల తాత్కాలిక రహదారిని వారం రోజుల పాటు శ్రమించి మళ్లీ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రయాణాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొబ్బరి ధరలు తగ్గితే నాఫెడ్ కేంద్రాలు సిద్ధం చేయాలిఅంబాజీపేట: కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఏపీ నాఫెడ్ బ్రాంచ్ మేనేజర్ టీఎన్ శర్మ అన్నారు. అంబాజీపేటలో జరిగిన ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు వీడ్కోలు సభలో ఆదివారం పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం కొబ్బరికి బహిరంగ మార్కెట్లో ధరలు బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో కొబ్బరి దిగుబడులు గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయని ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడుతుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాల్ కోప్రాకు రూ.12,500, మిల్లింగ్ కోప్రాకు రూ.12,027 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ ధరలు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయన్నారు. బహిరంగ మార్కెట్లో కొబ్బరి ధరలు ఇంతకన్నా తగ్గిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకుని సంసిద్ధంగా ఉండాలన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ అమలాపురం టౌన్: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు రౌడీ షీటర్లను ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక శక్తులకు, రౌడీయిజం, గుండాయిజాలకు తావు లేకుండా చేస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్ల ద్వారా రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లు పదే పదే నేరాలకు పాల్పడితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
గృహ రుణాలలో చేతివాటం!
● లబ్ధిదారుల నుంచి సొమ్ముల వసూలు ● కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదుపై అధికారుల విచారణ ● ఉన్నతాధికారుల అండదండలతోనే అవినీతి అంటున్న బాధితులు అల్లవరం: స్థానిక గృహ నిర్మాణ శాఖలో పనిచేసి అమలాపురం హౌసింగ్ కార్యాలయానికి బదిలీపై వెళ్లిన ఓ అధికారి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి హోదాలో పనిచేసిన ఆ అధికారి ఆ హోదా దక్కిందే తడవుగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సదరు అధికారికి కేటాయించిన గ్రామాల్లో లబ్ధిదారులు వద్దకు వెళ్లి మీకు గృహ రుణం మంజూరు చేస్తామని రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అల్లవరానికి చెందిన బొలిశెట్టి నాగమణికి రుణం మంజూరు చేసి ఆమె వద్ద సొమ్ములు వసూలు చేసినట్టు ఆమె కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో హౌసింగ్ పీడీ నరసింహారావు, స్థానిక సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమక్షంలో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించారు. కాగా ఇదొక్కటే కాకుండా ఆయన పర్యవేక్షిస్తున్న ఎనిమిది గ్రామాల్లోనూ ఇలా చాలామంది బాధితులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లవరానికి చెందిన మరో మహిళ, రెబ్బనపల్లికి చెందిన ఇంకొక వ్యక్తి నుంచి కూడా సొమ్ములు తీసుకున్నట్టు తెలిసింది. గోడిలో బొంతు సత్యనారాయణకు గృహ రుణం మంజూరు చేసి వారి ఆధార్ కార్డు తప్పుగా బొంతు సూర్యనారాయణకు సీడింగ్ చేశారు. దీంతో సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన రూ.లక్ష నగదు సూర్యనారాయణ అకౌంట్కు జమ అయింది. అయితే సూర్యనారాయణ వద్దకు వెళ్లి సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన హౌసింగ్ డబ్బులు మీ అకౌంట్ పడ్డాయని ఆయకు చెప్పి సొమ్ములు కుడా కాజేశాడని సమాచారం. ఇలా ఒకటి కాదు రెండు అనేక మంది నుంచి గృహ రుణాల పేరిట డబ్బులు వసూలు చేసినట్టు వెలుగు చూసింది. కాగా.. సదరు అవినీతి ఆరోపణలపై విచారణ జరిగి నెల రోజులు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో అతడు మళ్లీ పైరవీలు మొదలుపెట్టినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. తాను ఎవరి నుంచి అయితే డబ్బులు వసూలు చేశాడో వారి వద్దకు వెళ్లి వారికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్టుగా లెటర్లు తీసుకుంటున్నాడు. ఈ లెటర్లు హౌసింగ్ ఉన్నతాధికారులకు సమర్పించి తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల అండదండలు ఉండడం వల్లే అతడు ఈ అవినీతికి పాల్పడుతున్నాడని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.ఫిర్యాదులు నిజమే అల్లవరం గృహ నిర్మాణశాఖలో విధులు నిర్వహించిన ఉద్యోగిపై ఫిర్యాదులు రావడం నిజమే. తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి తుది నివేదికను జిల్లా కలెక్టర్కు పంపాము. ఐదు నెలల కిత్రం అతడిని కార్యాలయానికి పిలిచి ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్చరించాం. – నరసింహారావు, పీడీ, గృహ నిర్మాణ శాఖ, అమలాపురం. -
క్రీడలతో జాతీయ గుర్తింపు
రావులపాలెం: క్రీడల్లో రాణించడంతో క్రీడాకారులు జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో దండు సాయి ఆకాష్ వర్మ జ్ఞాపకార్థం రెండు రోజులుగా నిర్వహిస్తున్న పదో రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ మెన్, ఉమెన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్లతో కలసి జగ్గిరెడ్డి ట్రోఫీలు అందజేశారు. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవసాత్తు అకాల మరణానికి గురైన దండు సాయి ఆకాష్ వర్మ తల్లిదండ్రులు దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, సుజాత దంపతులు ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం విజేలకు శుభాకాంక్షలు తెలిపారు. 13 జిల్లాల నుంచి 26 జట్లు పోటీ.. పదమూడు జిల్లాల నుంచి మెన్, వుమెన్ కేటగిరీల్లో వచ్చిన 26 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలవగా రన్నర్గా విశాఖపట్నం, తృతీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి. అలాగే మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా విశాఖపట్నం, తృతీయ స్థానం తూర్పుగోదావరి, నాలుగో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచినట్టు నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచ్లు బొక్కా కరుణాకరం, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు ముత్యాల వీరభద్రరావు, ముదునూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీను, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెదిరేశ్వరంలో ముగిసిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పురుషుల విభాగంలో తూర్పుగోదావరి.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా విజేతలు -
రైతన్నపై వాతావ‘రణం’
జూన్ నెల నుంచి అక్టోబరు నెల వరకు లోటు వర్షం నమోదైంది. జూన్ నెలలో 4.9, జూలైలో 53.4, ఆగస్టులో 11.4, సెప్టెంబరులో 40.2, అక్టోబరు 15 తరువాత వరకు 50.7 మిల్లీ మీటర్ల లోటు వర్షం నమోదైంది. ● బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, మోంథా తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఖరీఫ్ ఆరంభంలో కురవాల్సిన వర్షం.. కోతల సమయంలో కురిసి రైతులను నిలువునా ముంచేసింది. వరి 77 వేల ఎకరాలలో, అరటి 3,379, కూరగాయలు 450.71, బొప్పాయి 43.48, పువ్వులు 39.53, పసుపు 19.76, తమలపాకు 7.90 ఎకరాల్లో పంట దెబ్బతింది. -
ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు
కలెక్టర్ మహేష్కుమార్ అంబాజీపేట: మొసలపల్లి జగ్గన్నతోటలో ఏకాదశ ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రభల తీర్థం జరిగే జగ్గన్నతోటలో శనివారం ఆయన పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగ్గన్నతోట ప్రభల తీర్థం అత్యంత పురాతన, పవిత్ర తీర్థ స్థలంగా పేరొందిందన్నారు. కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మండల, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభలు తరలివెళ్లే మార్గాలను పరిశీలించారు. అప్పర్ కౌశిక దాటే ప్రభల వివరాలపై కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్, అంబాజీపేట తహసీల్దార్ బి.చినబాబు, ఎంపీడీఓ బి.మమతలను అడిగి మ్యాప్ ద్వారా ఆరా తీశారు. శాంతికి ప్రతీక క్రిస్మస్ అమలాపురం రూరల్: ప్రేమ, శాంతి, సేవా భావాలకు ప్రతీకగా క్రిస్మస్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్ హైటీ కార్యక్రమాన్ని క్రైస్తవ మత పెద్దలతో నిర్వహించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్వో కె.మాధవి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీల్, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఊడిమూడిలంక వంతెన 65 శాతం పూర్తి పి.గన్నవరం: నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై ఊడిమూడిలంక వద్ద రూ.71.43 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు 65 శాతం పూర్తయ్యాయని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇంత వరకూ జరిగిన పనుల ప్రగతిని పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్స్ విభాగం డీఈఈ అన్యం రాంబాబు వివరించారు. 2026 వరదల సీజన్ నాటికి లంక గ్రామాల ప్రజలు వంతెనపై నడిచి వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అని కలెక్టర్ ప్రశ్నించారు. అప్పటికి అన్ని ఫిల్లర్లు, గడ్డర్ల నిర్మాణాలు మాత్రమే పూర్తవుతాయన్నారు. 2027 మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాంబాబు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మెహన్రెడ్డి వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విదితమే. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే లైన్ను త్వరితగతిన పూర్తి చేయించండి
అమలాపురం టౌన్: కోనసీమ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికి కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధుల బృందం తీసుకు వెళ్లింది. కేఆర్ఎస్ఎస్ ప్రతినిధి అయిన ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కూడిన స్టీరింగ్ కమిటీ బృందం ఎంపీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసింది. కేవలం 57 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే లైనుకు పూర్తి స్థాయిలో స్థల సేకరణ జరగలేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కేఆర్ఎస్ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణం తదితరులు అన్నారు. లైన్ అలైన్మెంట్ విషయంలోనే ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయన్నారు. 23 ఏళ్ల కిందట అమలాపురం సర్క్యులర్ బజార్ షాపుల్లో నెలకొల్పిన రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ కౌంటర్ను రెండేళ్ల కిందట మూసి వేశారని గుర్తు చేశారు. దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ కోనసీమలోని మూడు నదీపాయలపై ఇప్పటికే రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రాజెక్ట్కు న్యాయపరమైన చిక్కులు దాదాపు తొలగాయని, జాయింట్ సర్వే పూర్తి కావొచ్చిందని వివరించారు. కమిటీ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, ఆర్వీ నాయుడు, వంకాయల రాజా, ఎరగర్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్న ప్రతి మదీ మురిసింది. ప్రాతః కాలంలో స్వామివారి తొలి హారతి అంగరంగ వైభవంగా జరిగింది. బాల బాలాజీ స్వామివారికి మంగళాశాసనం నిర్వహించారు. గోదాదేవికి తిరుప్పావై సేవాకాలం ఘనంగా జరిపించారు. భక్తులు స్వామి వారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,29,082 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.89,083 విరాళాలుగా సమర్పించారన్నారు. స్వామివారిని 4,700 మంది దర్శించుకోగా, 2,800 మంది అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
గోవింద.. హరి గోవింద
కొత్తపేట: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది.. ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది.. ఆ ఏడు వారాల క్షేత్రం భక్తులతో నిండింది.. ధనుర్మాసం సందర్భంగా కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపించింది. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ప్రదక్షిణలు చేయగా, కోరిన కోర్కెలు తీరిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చక స్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఈ ఒక్కరోజే స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు, అన్న ప్రసాద విరాళం ద్వారా రూ.53,40,208 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కాకినాడకు చెందిన నాట్యవేద కూచిపూడి నృత్య బృందం వారి ప్రదర్శన ఆకట్టుకుంది. ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక శోభ ఫ భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం -
2025..అంతా చేదు
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● చిన్నారులపై వరుస అఘాయిత్యాలు ● నిందితుల్లో ఇద్దరు టీడీపీ, జనసేన నాయకులు ● పెరిగిన రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్లు ● ఈ ఏడాదంతా జిల్లాలో కన్నీటి ఘటనలే అమలాపురం టౌన్: రక్తమోడిన రహదారులు.. నేరాలు.. ఘోరాలు.. బాలికలపై అత్యాచారాలు.. హత్యలు.. ఇలా ఈ ఏడాది అంతా కన్నీరే మిగిల్చింది. జిల్లాలో 2025 సంవత్సరం చేదు అనుభవాలను మూటగట్టింది.. ముఖ్యంగా బాలికలపై వరుస అఘాయిత్యాలు అంతటా కలకలం రేపింది. ఈ అత్యాచారాలకు సంబంధించి రెండు కేసుల్లో ఇద్దరు నిందితులు టీడీపీ, జనసేన నాయకులు కావడం మరింత ఆందోళనకు గురిచేసింది. పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లో నదీ పాయల్లో 11 మంది మృత్యువాత పడడం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అలాగే సైబర్ నేరాల్లో రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఆందోళనే మిగిలింది.. పలు హత్య కేసులు సంచలనమయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఘటనలే జరిగాయి. చితికిపోయిన బాల్యం ● అక్టోబర్ 25న ఐ.పోలవరం మండలం బాణాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై జనసేన పార్టీ నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (బాబి) అత్యాచారం చేసినట్లు నేరారోపణ ఎదుర్కొన్నారు. ఈ కేసు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ● ఈ నెల 3న ముమ్మిడివరం మండలం ఠాణేలంక గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై టీడీపీ నాయకుడు మోర్త గిరిబాబు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ● 7న ముమ్మిడివరం గ్రామంలో పదో తరగతి చదివిన ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ● 13న ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఓ బాలికపై అతని తండ్రి కామవాంఛ తీర్చుకుంటూ కొన్ని నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ నాలుగు సంఘటనలు (బాలికలపై అత్యాచారాలు) అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరగడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగించాయి. నదీ పాయలు.. మృత్యుకుహరాలు ● ఆగస్ట్ 26న ముమ్మిడివరం మండలం కమిని వద్ద నదీ స్నానాలకు వెళ్లిన ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఆ యువకులంతా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వారే కావడం, వారి చదువుకుని ప్రయోజకులు అవుతారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. ● మే 27న పి.గన్నవరం మండలం నాగుల్లంక, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా నదీ పాయలోకి స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలోని నదీ పాయలోకి స్నానానికి వెళ్లి ఈతరాక ప్రాణాలు వదిలారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆయా కుటుంబాలకు ఏకై క కుమారులు కావడం ఆ కుటుంబాలను మరింత కుంగదీసింది. సైబర్ నేరం చేసి.. సొమ్ము కాజేసి ● ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓ విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సైబర్ నేరం బారిన పడి రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. ● మండపేట పట్టణంలో ఓ హోటల్లో ఫుడ్ బుకింగ్ సమయంలో ఓటీపీలు చెప్పడంతో రూ. 80 వేల డబ్బును నేరగాళ్లు దోచుకున్నారు. ● ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువు గ్రామంలో మహిళలకు సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాన్ని ఆశ చూపి ఆమె వద్ద నుంచి రూ.8.50 లక్షలు కాజేశారు. ● అమలాపురంలో క్రిడెట్ స్కోర్ పెంపు పేరుతో ఓ వ్యక్తి రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. దక్షిణా ఆఫ్రికా ప్రయాణ లగేజీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆ సొమ్ము కాజేశారు. వేగం.. బలిగొన్న ప్రాణం ● సెప్టెంబర్ 23న తాళ్లరేవు మండలం పెదవలసల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్పై వేగంగా వెళ్తున్న వీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ● ఈ నెల 17న అమలాపురం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అతివేగం కారణంగా బైక్పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ఇలా జిల్లాలో అనేక ప్రమాదాలు జరిగాయి. సంచలనమైన హత్య కేసు అక్టోబర్ 28న అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనే డ్రైవర్ హత్య కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అమలాపురానికి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్, మరో నలుగురు కలసి శ్రీనును హత్య చేసి పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి నదీపాయల వద్ద మృతదేహాన్ని పాడేశారు. భర్త ఆచూకీ కోసం శ్రీను భార్య, కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారు. ఎస్పీకి ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది. గంజాయి.. ఆగలేదోయ్ ● జిల్లాలో పలు గంజాయి కేసులు ఈ ఏడాదిలో నమోదయ్యాయి. నవంబర్ 9న రాజోలులో గంజాయి విక్రయ కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా ఈ ఆరుగురు ఇన్స్ర్ట్రాగామ్ ద్వారా తమ స్మార్ట్ ఫోన్లలో గ్రూప్ను క్రియేట్ చేసి గంజాయిని విక్రస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారాలకు యువకులు అనేక మంది బలయ్యారు. ● ఈ నెల 23న కె.గంగవరం మండలం కోటిపల్లి శివారు ఏటిగట్టుపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచింగ్లు.. దోపిడీలు ● రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో నవంబర్ నెలలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. ● అమలాపురంలో ఈ ఏడాదిలో చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. దీంతో ఇంట్లో మహిళలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోయారు. ● అమలాపురంలో గత నెలలో జరిగిన చోరీలో అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు. ● సెప్టెంబర్ 11న కపిలేశ్వరపురంలో ఓ ఇంట్లో జరిగిన చోరీలో కేసులో రూ.3.8 లక్షల సొత్తును దోచుకున్నారు. ● అక్టోబర్ 1న అయినవిల్లి మండలం విలస గ్రామంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భార్యభర్తలు ప్రాణాలు విడిచారు. ● అదృశ్యం కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అమలాపురం పట్టణంలో ఈ ఏడాది నాలుగు కే సులు నమోదయ్యాయి. కంచిపల్లి శ్రీనుది ముందు అదృశ్యం కేసు నమోదు చేయగా, అతను హత్యకు గురికావడంతో అది హత్య కేసుగా మార్చారు.జీవితాల్లో ‘పేలుడు’ రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో అక్టోబర్ 7న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా తయారీ కేంద్రం యాజమానితో సహా కేంద్రంలోని పనిచేసే తొమ్మిడి మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఏ రోజుకా రోజు కూలి సొమ్ముతో జీవించే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పట్లో ఈ ప్రమాదం జిల్లాలో సంచలనమైంది. బాణసంచా తయారీ కేంద్రాల్లో సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి అంత మంది మృతికి కారణమైంది. అధికారులు, ప్రభుత్వ వైఫల్యం కనిపించింది. ఇదే ఈ ఏడాది జిల్లా పెద్ద ఘటనగా చెప్పవచ్చు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
కోడి పందేలకు అనుమతి లేదు
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: సంక్రాంతి పండగల పేరుతో కోడి పందేలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. వీటిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. శనివారం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జిల్లా నేర సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ మీనా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులపై పోలీస్ స్టేషన్ల వారీగా ఎస్పీ సమీక్షించారు. సంక్రాంతి పండగకు ఇచ్చే సెలవులకు జిల్లాలోని పలు కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోలీస్ గస్తీని పెంచాలని సూచించారు. ప్రజలు కూడా పండగ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్, జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, డీసీఆర్బీ సీఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
ర్యాలి క్షేత్రాన్ని సందర్శించిన సరస్వతీ స్వామీజీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ, గోపాలస్వామివారి ఆలయాన్ని పెనుగొండ వాసవీ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతీ (బాల) స్వామీజీ శనివారం సందర్శించారు. స్వామీజీకి దేవస్థానం ఈఓ భాగవతులు వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శనికి ప్రీతికరమైన శనివారం పురస్కరించుకుని దేవస్థానం దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,47,105, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.80,800, అన్న ప్రసాద విరాళాల రూపంలో రూ.23,222 ఆదాయం వచ్చినట్టు ఈఓ వివరించారు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అమలాపురం టౌన్: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటి త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికై న అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులను డీఈఓ పి.నాగేశ్వరరావు అభినందించారు. ఫుట్ ప్రెస్ పవర్ జనరేటర్ పేరుతో ప్రాజెక్ట్ తయారు చేసిన విద్యార్థులు ఎన్.సత్య ప్రవీణ్, పి.సిద్ధార్థ్లను, గైడ్ టీచర్ పీవీఎల్ఎన్ శ్రీరామ్ను ఆ పాఠశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్ట్ పనిచేసే విధానాన్ని డీఈఓ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలోనూ ఈ ప్రాజెక్ట్ విజేతగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల హెచ్ఎం కె.ఘన సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎంఎస్డీ భవాని, బీఎన్ వెంకటేశ్వరరావు, కేఆర్ఎన్ ప్రసాద్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శృంగార వల్లభుని ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న కళాకారులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల కళాకారులు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుతూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే కళాకారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. ఈ కళాకారులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురమళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల కళాకారులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని కళాకారులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు ఆనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భాగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. అలా ఎలా ఇచ్చారో..! దేవస్థానంలో ప్రతి వ్యాపారానికీ వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్లో విక్రయాలకు అనుమతులిచ్చిన వాటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఆదేశించారు.ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
పండగ సంబేరాలు లేక..
అమలాపురం శ్రీదేవి మార్కెట్లో వ్యాపారం లేక వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు కర్ఫ్యూ పెట్టినట్టుగా అమలాపురం గోల్డ్ మార్కెట్ వీధి తిరోగమనంలో వ్యాపారాలు వస్త్ర, బంగారు దుకాణాలు వెలవెల ఇప్పటికే క్రిస్మస్ అమ్మకాలు పూర్తి వచ్చే పండగలకూ కనిపించని జోష్ కుదేలైన వివిధ రంగాలు జనం వద్ద తగ్గిన కొనుగోలు శక్తి సాక్షి, అమలాపురం: క్రిస్మస్ వేడుకలు పూర్తయ్యాయి.. నూతన ఆంగ్ల సంవత్సర సంబరాలు మొదలు కానున్నాయి.. తరువాత సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా జిల్లాకు పండగల జోష్ వచ్చినా వస్త్ర, బంగారు వ్యాపారాలు తిరోగమనంలో ఉన్నాయి. జనం, మరీ ముఖ్యంగా అన్నదాతల వద్ద సొమ్ము లేకపోవడం.. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు డల్గా ఉండడం.. బంగారం ధరలు కొండెక్కడంతో కొనుగోళ్లు లేక వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు వాణిజ్య, వ్యాపార కేంద్రాలైన రావులపాలెం, బండారులంక, తాటిపాక, మలికిపురం, రామచంద్రపురం, మండపేట, ద్వారపూడి, ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పండగ సందడి మొదలు కావాల్సి ఉంది. వస్త్ర, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఇతర ఫర్నీచర్ అమ్మకాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా ఉండాల్సి ఉంది. క్రిస్మస్ పండగ సంబరాలు జరుగుతున్నాయి. తరువాత ఆంగ్ల సంవత్సరం, ఆపై పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. గతంలో ఈ సమయానికే రిటైల్, హోల్సేల్ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అమలాపురంలో వస్త్ర, బంగారు, ఇతర వస్తువుల కొనుగోలు లేక దుకాణాలు కళావిహీనంగా ఉన్నాయి. ఆయా మార్కెట్లలో మధ్యాహ్న సమయంలో కొనుగోలుదారులు కనిపించడం లేదు. వస్త్రాలను బయట వేలాడదీసి వ్యాపారులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పేరొందిన బండారులంకలో సైతం వస్త్ర వ్యాపారం వెలవెలబోతోంది. సాయంత్రం వేళ ఇద్దరు, ముగ్గురు కొనుగోలుదారులు మాత్రమే వస్తున్నారు. ‘సంక్రాంతి కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు కాకున్నా.. ఏటా ఈ సమయానికి కొనుగోలుదారులు ఎక్కువగానే వచ్చేవారు. గతంలో ఈ సమయంలో జరిగే వ్యాపారంలో ఇప్పుడు పావు వంతు కూడా జరగడం లేదు’ అని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఐదేళ్ల కాలంలో అమలాపురంలో మెగా వస్త్ర, బంగారు ఆభరణాల మాల్స్ పెద్దఎత్తున వచ్చాయి. అక్కడ కూడా ఇంచుమించు ఇలానే ఉంది. జిల్లాలో మండపేట, రామచంద్రపురం, తాటిపాక, మలికిపురం, రావుపాలెం వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు పడకేశాయి. పండగ సమయంలో కొత్త మోటార్ సైకిళ్లు, కార్లు కొనేవారు ఇప్పటికే బుకింగ్లు మొదలు పెట్టేవారు. సంక్రాంతి సమయానికి డెలివరీ కావాలని అడ్వాన్సులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో బుకింగ్స్ లేవని వాహన అమ్మకాల డీలర్లు చెబుతున్నారు. మండపేట మండలం ద్వారపూడి మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ మార్కెట్ ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే హోల్సేల్ వస్త్ర వ్యాపారం జరిగేది. ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఉంది. గత ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు పలు ప్రాంతాల్లో మాల్స్ రావడం ఇక్కడ సగం వ్యాపారం తగ్గిపోయింది. జరిగే కొద్దిపాటి వ్యాపారం కూడా ఈ ఏడాది లేకుండా పోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విపణిలో బంగారం ధర కొండెక్కడం కూడా కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. ప్రస్తుత మార్కెట్లో బంగారం 24 క్యారెట్లు గ్రాము ధర రూ.14 వేల వరకూ ఉంది. పది గ్రాములు రూ.1.40 లక్షలు కాగా, కాసు ధర రూ.1.12 లక్షలు. దీంతో సామాన్యులు, పేదలు ఆభరణాల కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిల్లిగవ్వ లేక.. జనం వద్ద సొమ్ము లేకపోవడం కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. మరీ ముఖ్యంగా అన్నదాత అప్పుల్లో ఉన్నాడు. వరి గిట్టుబాటు కావడం లేదు. ఖరీఫ్ సాగులో రుతుపవనాలు, మోంథా తుపానుతో కురిసిన వర్షాలకు జిల్లాలో 77 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఎకరాకు 30 బస్తాల నుంచి 35 బస్తాల వరకూ రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల 20 బస్తాల నుంచి 25 బస్తాలకు పడిపోయింది. దీనితో పెట్టుబడులు రావడం గగనమైంది. ప్రస్తుతం రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొబ్బరి కాయ ధర ఇటీవల రూ.22 నుంచి రూ.15కు తగ్గింది. అరటి తుపానుకు నేలచూపు చూడగా, ధరలు రెండు, మూడు రెట్లు తగ్గిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. జిల్లాలో ఆక్వా సాగు సైతం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ధరలు కొంత వరకూ ఉన్నా ఇటీవల మారిన వాతావరణంతో తెగుళ్ల బారిన పడి పంట దెబ్బతింటోంది. పైగా ఇప్పుడు కేవలం మూడో వంతు మాత్రమే సాగులో ఉంది. రియల్ ఎస్టేట్ రంగం గత ఏడాదిగా దాదాపు స్తంభించింది. ఒక్క అమలాపురం పట్టణంలోనే నిర్మాణం పూర్తయిన అపార్ట్మెంట్లలో సగం ప్లాట్లు అమ్ముడు పోక ఖాళీగా ఉంటున్నాయి. లేఅవుట్లో స్థలాలు కొనేవారు లేకుండా పోయారు. ఈ ప్రభావంతో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు రియాల్టర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఇలా కీలక రంగాలన్నీ సంక్షోభంలో ఉండడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి ఒక్కరిపైనా పడింది. జనం వద్ద డబ్బు లేకపోవడంతో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఇదే వస్త్ర, బంగారు, ఆటోమొబైల్ రంగాలపై పడి జిల్లాలో పండగ సందడి లేకపోయింది. సాధారణ అమ్మకాలూ లేవు గతంలో కంటే వస్త్ర మార్కెట్లో అమ్మకాలు బాగా తగ్గాయి. ద్వారపూడిలో సుమారు 200 హోల్సేల్, 50 రిటైల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సాధారణ స్థాయి అమ్మకాలు కూడా లేని పరిస్థితి. రాజమహేంద్రవరం, కాకినాడ తదితర పట్టణాల్లోని షాపింగ్ మాల్స్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. మధ్య తరగతి ప్రజలు సైతం అటువైపే వెళుతుండటంతో ద్వారపూడి మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి. జనం వద్ద కూడా సొమ్ములు లేవు. – చిక్కాల శ్రీనివాస్, అధ్యక్షుడు, మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ మార్కెట్, ద్వారపూడి, మండపేట మండలం -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ కృషికి ఫలితంమోహన్సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
గంజాయి అక్రమ రవాణాను నిరోధించాలి
అమలాపురం రూరల్: గంజాయి అక్రమ రవాణాను అన్ని దశల్లోనూ నిరోధించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నార్కెట్ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రహస్య సమాచారం ఆధారంగా హైవేలు, ఫ్రూట్ మార్కెట్లు, చెక్ పోస్ట్లు, పార్సిల్, కోరియర్ ఆఫీస్లు, ప్రత్యేక డ్రైవ్ల ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలతో అనర్థాలు వివరించి యువతను సన్మార్గంలో నడిపించడం ద్వారా ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్నారు. కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచుతూ, యాంటీ–డ్రగ్ క్లబ్లు, క్యాంపెయిన్లు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గ్రామ శివార్లు, పాన్, కిళ్లీ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీసీహెచ్ఎస్ కార్తీక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అయినవిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులతో రబీ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.60,613 చొప్పున పరిహారంగా ఏపీ ట్రాన్స్కో అందిస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఏపీ ట్రాన్స్కో, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 22 కిలోమీటర్ల మేర విద్యుత్ టవర్ల ఏర్పాటు సమయంలో పనుల నిర్వహణకు ఆయా ప్రాంత రైతులు రబీలో పంట నష్టపోతున్నారన్నారు. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అయినవిల్లి మండలాల పరిధిలో 64 విద్యుత్ టవర్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ టవర్లు వెంబడి సుమారు 563 ఎకరాల్లో రబీ సాగును నిలుపుదల చేసినందుకు రైతులకు పరిహారంగా రూ.3.41 కోట్లను ఏపీ ట్రాన్స్కో కేటాయించిందన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రభల ఉత్సవాలకు ఆటంకం కలగకుండా టవర్ల ఎత్తు పెంచాలని అన్నారు. ఏపీ ట్రాన్స్కో పర్యవేక్షక ఇంజినీర్ మనోహర్, ఈఈలు పుల్లారావు, వెంకట్రావు, డీఈ చంద్రశేఖర్ ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు లైన్ల రహదారికి కార్యాచరణ ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో కాలువ గట్టు నుంచి గుడి వరకూ సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కార్యాచరణ చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆర్అండ్బీ, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి భూ సేకరణపై సమీక్షించారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుండడంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పరిహారాలను దేవస్థాన అధికారులు చెల్లించడానికి ముందుకు వచ్చారన్నారు. భూసేకరణకు గాను సుమారు రూ. 6 కోట్లు అవుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సుమారు రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఫ జిల్లాలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీలో రైతులకు, మహిళా సంఘాలకు, యువ పారిశ్రామిక వేత్తలకు దిక్సూచిగా ఇంక్యుబేషన్ సెంటర్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. దీనిపై కలెక్టరేట్లో కొబ్బరి, పారిశ్రామికవేత్తలు, జిల్లా పరిశ్రమల కేంద్రం ఎమ్ఎస్ఎంఈ ప్రతినిధులు, ఉద్యాన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మామిడికుదురు, ఉప్పలగుప్తంలలో కొబ్బరి పరిశ్రమలు స్థాపన అంశాలపై సమీక్షించారు. జిల్లాలో రైతులకు అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన మార్క్ఫెడ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెళకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎగ్నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి ● సీపీఐ నేత మధు ● ఘనంగా ఆ పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. -
దివ్యాంగులను అన్నింటా ప్రోత్సహించాలి
అమలాపురం టౌన్: పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులను అన్నింటా ప్రోత్సహించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్ఏపీడీ) కె.రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ (సీడబ్ల్యూఎస్ఎన్) కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు శుక్రవారం జరిగిన జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమాన్ని రవీంద్రనాథ్రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. సహిత విద్య ద్వారా దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సహిత విద్య స్టేట్ కన్సల్టెంట్ వై.నరసింహ మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు విభిన్న ప్రతిభావంతులను బేస్ క్యాంప్ ద్వారా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా జిల్లా ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ జిల్లాలో 22 భవిత కేంద్రాల ద్వారా 486 మంది దివ్యాంగులకు విద్యనందిస్తున్నామని తెలిపారు. ఆరు నుంచి 18 ఏళ్ల వయసున్న 3,108 మంది సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు ఉన్నారన్నారు. సహిత విద్య జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జోనల్ పరిధిలో విద్యార్థులకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. సహిత విద్య జిల్లా ఓ ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పోటీల్లో జోనల్ పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 150 మంది దివ్యాంగులు పాల్గొన్నారన్నారు. స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుపుదాం
అంబాజీపేట: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యత ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది ‘పది’ పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. జిల్లా నుంచి 19,640 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిని షైనింగ్ స్టార్స్ మార్చాలన్నారు. పాఠశాలకు రాని పదో తరగతి విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అంతకు ముందు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. కొత్తపేట డివిజన్ డీవైఈఓ కాండ్రేగుల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆలయ ప్రహరీకి రూ.50 వేల విరాళం కొత్తపేట: వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ తల్లి ఆలయ ప్రహరీ నిర్మాణానికి బిళ్లకుర్రు శివారు యెలిశెట్టివారిపాలేనికి చెందిన సూరవరపు వెంకట్రావు, రామలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50 వేల విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణకు అందజేశారు. అలాగే సామర్లకోటకు చెందిన దివంగత కారుమూరి రాజేశ్వరరావు, సత్యవేణి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమార్గుప్తా రూ.20,116, అమెరికాకు చెందిన శంభు రవికృష్ణ, భాస్కర వెంకటలక్ష్మి దంపతులు రూ.20 వేలు, వానపల్లికి చెందిన నేమాని పురుషోత్తమ ప్రసాద్, సుందరిలక్ష్మి దంపతులు రూ.10 వేలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాతల పేరున ఆసాదులు ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు. -
కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
పాల్ ల్యాబ్స్ వినియోగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం
ముమ్మిడివరం: సీఎంశ్రీ పాఠశాలల్లో పర్సనల్ అడాఫ్టివ్ లెర్నింగ్ (పాల్) ల్యాబ్స్ను విద్యార్థులు ఉపయోగించడంలో జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం లభించిందని సమగ్ర శిక్ష ఏఎంఓ, పాల్ ల్యాబ్స్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ పి.రాంబాబు తెలిపారు. అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాల్ ల్యాబ్ను ఇన్చార్జి హెచ్ఎం ఎం.శ్రీనివాసరావుతో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది పీఎంశ్రీ పాఠశాలల్లో నూతనంగా పాల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటిని వినియోగించడంలో జిల్లా 96.22 శాతంతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పాల్ ల్యాబ్ 111.67 శాతం ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గతంలో మంజూరైన పాల్ ల్యాబ్స్లో కాలపరిమితి ముగిసి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు -
భీష్మ సమానుడు వాజ్పేయ్
అమలాపురం రూరల్: జిల్లా బీజేపీ కార్యాలయంలో దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని వాజ్ పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజకీయాలలో వాజ్పేయి భీష్ముడిలాంటి వారన్నారు. రాజనీతజ్ఞడిగా, అజాతశత్రువు అనే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన పోక్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రహదారుల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు భారతదేశ గమనాన్ని మార్చేశాయన్నారు. పట్టణ అధ్యక్షుడు అయ్యల బాషా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురిమెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చిలకమర్తి కస్తూరి తదితరులు ఆయనకు నివాళులర్పించారు. -
వక్ఫ్ భూముల జోలికి రావద్దు
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూముల జోలికి కూటమి ప్రభుత్వం రావద్దని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్పష్టం చేశారు. ముస్లిం పేదలకు అంజుమన్– ఎ ఇస్లామియా సంస్థ పూర్వీకంలో ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గుంటూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన 71.57 ఎకరాలను ఐటీ పార్కుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీకి చెందిన కొందరి ముస్లిం నాయకులతో కలసి ఖాదర్ గురువారం అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరులో ఐటీ పార్కు అంటే అదో ప్రైవేటు సంస్థ, ప్రైవేటు వ్యక్తులు, వారికి ప్రభుత్వం 71.57 ఎకరాలను ఇచ్చేడంపై వారు నిరసన తెలిపారు. గుంటూరులో భూములను ప్రైవేటు సంస్థకు కేటాయించడం వెనుక ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డు సీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాదర్తో పాటు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీవై షరీఫ్, అమలాపురం అధ్యక్షుడు ఖాజాబాబు, పి.గన్నవరం అధ్యక్షుడు అన్వర్ తహె హుస్సేన్, పార్టీ జిల్లా కార్యదర్శి అలీబాబు, ముస్లిం నాయకులు కర్రార్ హుస్సేన్, ఎండీ అలీషా, యూసఫ్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. కౌలు రైతు మృతి ఉప్పలగుప్తం: ఏటా ఖరీఫ్ పంట నష్టపోతూండటం.. రబీకి పెట్టుబడి దొరకపోవడంతో ఆవేదన చెందిన ఓ కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ములపర్తి నరసింహమూర్తి (55) కిత్తనచెరువు గ్రామంలో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ ముంపుతో నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్ పంట తుపాను వర్షాలకు దెబ్బ తింది. కనీసం మాసూలు ఖర్చులు కూడా రాలేదు. ఇదే సమయంలో రబీకి పెట్టుబడి దొరకక నరసింహమూర్తి నెల రోజులుగా దిగులుతో ఉన్నారు. పొలం వద్ద నారుమడిలో నీరు తోడి గురువారం సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 29న నిధి ఆప్ కే నికట్ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయంలో పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్ కే నికట్ జిల్లా ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్లోను ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. -
విరాటపర్వ పారాయణతో శుభ ఫలితాలు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రామాయణంలో సుందరకాండ, భాగవతంలో దశమ స్కంధం మాదిరిగానే భారతంలో విరాటపర్వానికి ఓ ప్రత్యేకత ఉందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వేదవ్యాస భారత ప్రవచన ధారలో భాగంగా ఆయన గురువారం విరాటపర్వ విశేషాలను వివరించారు. విరాటపర్వ పారాయణ వలన కరువు కాటకాలు నశిస్తాయని, శుభఫలితాలు చేకూరుతాయని చెప్పారు. భారతాధ్యయనం విరాటపర్వంతో ప్రారంభించాలని వ్యాసుడు ఎక్కడా చెప్పలేదన్నారు. మత్స్యరాజు కొలువులో ప్రవేశించే ముందు.. పాండవులు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో.. ద్రౌపది గురించి ధర్మరాజు అన్న మాటలను నేటి తరం స్మరించుకోవాలని అన్నారు. ‘‘ద్రౌపది మనకు ప్రియమైన భార్య. తల్లిని కొడుకు ఎలా రక్షించాలో ఈమెను మనం అలా రక్షించుకోవాలి. అక్కలా గౌరవించాలి. ఈమె మనకు ప్రాణాల కన్నా ప్రియమైనది’’ అని సోదరులతో ధర్మరాజు అంటాడని వివరించారు. వాల్మీకి వ్యాసాదులు రామాయణ భారతాల్లో భార్యాభర్తల అనుబంధాన్ని ఎంతో పవిత్రంగా వివరించారన్నారు. భార్యకు పాతివ్రత్యధర్మాన్ని చెప్పినట్టుగానే.. భర్తకు కూడా భార్య పట్ల అంతటి బాధ్యత ఉందని చెప్పారు. ‘‘కీచకుని ఆగడాలను ప్రతిఘటించడానికి ద్రౌపది ముందుగా సూర్యారాధన చేసింది. అజ్ఞాతవాసం ప్రారంభించడానికి ముందు దుర్గాదేవిని ధర్మరాజు స్తుతించి, ఆమె అనుగ్రహం పొందుతాడు. వేదమంత్రాలకున్న శక్తి భారత పారాయణకుంది. విరాటుని కొలువులో ప్రవేశించే ముందు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ఉపదేశించిన ధర్మాలను మనం విస్మరించరాదు. రాజు కన్నా ఉన్నతాసనం ఆశించరాదు. రాజు భార్యలతో చెలిమి తగదు. రాజు శత్రువులతో మాట్లాడరాదని పాండవులతో ధౌమ్యుడు చెబుతాడు. ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పుకోవడంలో అసత్యం లేదు. కంకుడు అనే పదానికి యమధర్మరాజు అనే అర్థం ఉంది. ఆయన యమధర్మరాజు కుమారుడు’’ అని సామవేదం వివరించారు. -
సత్యదేవుని సన్నిధిలో మహాపచారం
● పూజలో వాడిన పూలతో ఫినాయిల్ తయారీ! ● అన్నవరం దేవస్థానంలో విక్రయాలు ● ఆవేదన చెందుతున్న భక్తులుఅన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు. ‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ.. సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్ లీటర్ బాటిల్ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్ బాటిల్పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్ను టాయిలెట్స్ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ అపచారాలు అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు. అటువంటివి విక్రయించనీయం దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్లైట్పై అక్షయ పాత్ర.. హ్యాండిల్కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
జాతీయ స్థాయి సైన్స్ఫేర్కు వన్నెచింతలపూడి ప్రాజెక్ట్
అమలాపురం రూరల్: రాష్ట్రస్థాయి 53వ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శల్లో వన్నెచింతలపూడి పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగిన వన్నెచింతలపూడి హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన ఈజీ మిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిపై జాతీయ స్థాయి ప్రదర్శనలో చోటు సంపాదించింది. ఈ ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థి రోహిత్ విజయభాస్కర్కు గైడ్ టీచర్గా ప్రధానోపాధ్యాయుడు గుబ్బల నాగ సత్యనారాయణ వ్యవహరించారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. మూడేళ్లుగా కోనసీమకు జాతీయస్థాయిలో స్థానం సాధిస్తున్న హెచ్ఎం సత్యనారాయణను అధికారులు గురువారం అభినందించారు. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్స్ర్ట్రాగామ్లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్షాప్కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్షాప్లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు అందజేశారు. -
సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతిపై లోతైన విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసుల్ని కోరుతున్నారు. జాతీయ స్థాయి జు – జుట్సు పోటీల్లో రవి శంకరికి రజతం అమలాపురం టౌన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హాల్ద్వానీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన జాతీయ స్థాయి జు – జుట్సు చాంపియన్ షిప్ –2025 పోటీల్లో అమలాపురానికి చెందిన అడపా రవి శంకరి రజిత పతకాన్ని సాధించింది. అండర్–16 విభాగంలో రవి శంకరి 48 కేజీల ఫైటింగ్ కేటగిరిలో విజేతగా నిలిచి పతకాన్ని కై వసం చేసుకుందని కోచ్లు పడాలి అంజి, చిక్కం సురేష్ తెలిపారు. విజేతను అమలాపురం పవర్ కిక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమి ప్రతినిధులు అభినందించారు. -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి
ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై ఆగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. -
అభిరామ్కు రాష్ట్ర స్థాయి పురస్కారం
రామచంద్రపురం రూరల్: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసిన మండలంలోని ద్రాక్షారామకు చెందిన దేవులపల్లి శ్రీకృష్ణ అభిరామ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ కమిటీలో అభిరామ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అభిరామ్ సేవలను అభినందిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ తదితరులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అభిరామ్ను పలువురు అభినందించారు. -
కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ అమ్మవారికి సమర్పించిన చీరను ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ ● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
హిందువులు మౌనం వీడాలి
● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్ ● కౌన్సిల్ పూర్వ చైర్మన్ పరవస్తు ● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయ నాయకుల వద్ద నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేదన్నారు. ఇప్పటికై నా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని తెలియజేశారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బతిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలను నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ గోదావరి జిల్లా సహకార్య వాహ్ గెడ్డం రాంబాబు, మండపేట ఖండ ప్రముఖ్ చక్రవర్తి, వీహెచ్పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు తదితరులు పాల్గొన్నారు. -
విలీనమా..విముఖమా..
● పలు గ్రామాల గ్రామసభలకు రంగం సిద్ధం ● పెరగనున్న మున్సిపాలిటీల విస్తీర్ణాలు ● జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ● అభివృద్ధి చెందిన పలు పంచాయతీలలో విముఖత ● కొన్నిచోట్ల అనుకూలంగా తీర్మానాలు సాక్షి అమలాపురం: జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో వాటిని ఆనుకుని ఉన్న పంచాయతీల విలీన ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. అమలాపురం మున్సిపాలిటీలో మూడు గ్రామాల విలీన ప్రక్రియ మొదలు కావడంతో మిగిలిన మున్సిపాలిటీల్లో పంచాయతీ విలీన అంశం తెరమీదకు వస్తోంది. కాగా ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు పంచాయతీలు విలీన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాయి. తాము చేసుకున్న అభివృద్ధి ఫలాలు మున్సిపాలిటీలకు మళ్లిపోతాయని, మళ్లీ అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను తీర్చిదిద్దుకోవాల్సి వస్తుందని అక్కడి పాలకులు భావిస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ గ్రేడ్–1గా గుర్తింపు పొందింది. దీని పరిధిలో ఉన్న పలు వార్డులు అమలాపురం మండలంలోని కామనగరువు, ఈదరపల్లి, పేరూరు పంచాయతీల్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. పదేళ్ల క్రితం మున్సిపాలిటీ చుట్టూ ఉన్న సుమారు 13 గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నా తరువాత వెనక్కు పోయింది. తాజాగా ఈదరపల్లి గ్రామం పూర్తిగా (సర్వే నెంబరు 1 నుంచి సర్వే నెంబరు 82 వరకు), కామనగరువు, పేరూరు పంచాయతీల్లో కొంత భాగం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే పేరూరు బిట్–1లో సర్వే నెంబరు 672 నుంచి 712 వరకు (41 సర్వే నెంబర్లు), కామనగరువులో ఇప్పుడున్న మున్సిపాలిటీ వార్డులతోపాటు జాతీయ రహదారి 216 వరకు సేకరించాలని నిర్ణయించారు. ఈ సర్వే నెంబర్ల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రాంతం అంతా అమలాపురం మున్సిపాలిటీలో విలీనం కానుంది. ఈ మేరకు ఆయా పంచాయతీలు గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలను చేయాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పంచాయతీ గ్రామ సభలు ఆమోదం తెలిపిన సర్వే నెంబర్ల ఆధారంగా ఈ విభజన జరుగనుంది. అనంతరం మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ జరుగుతుంది. అయితే గ్రామ సభల తీర్మానాలు, ప్రజల ఆమోదం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. తమ గ్రామాలను తప్పనిసరిగా విలీనం చేయడాన్ని అంగీకరించి తీరాలనే నిబంధన ఏమీ లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమలాపురం పార్లమెంట్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా అమలాపురాన్ని గుర్తించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మత్స్యశాఖ, జిల్లా పంచాయతీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఇరిగేషన్, డ్రైనేజీ, ఆర్టీవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని కార్యాలయాలను ముమ్మిడివరం మండలం ఎయిమ్స్ కాలేజీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం అయిన తరువాత అమలాపురానికి ప్రాధాన్యం పెరగడంతో సదుపాయల కల్పన కోసం మున్సిపాలిటీని విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రతిపాదన ఆగింది. తిరిగి ఇప్పుడు విలీన ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అమలాపురం మున్సిపాలిటీ జనాభా సుమారు 53 వేలు. ఇప్పుడనుకున్నట్టుగా విలీనం జరిగితే జనాభా 70 వేల వరకు పెరుగుతుందని అంచనా. జిల్లాలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదన గతం నుంచి ఉంది. ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీలో పంచాయతీల విలీనం కదలిక రావడంతో మిగిలిన మున్సిపాలిటీలలో కూడా సమీప పంచాయతీల విలీన అంశం తెరమీదకు వస్తోంది. రామచంద్రపురం మున్సిపాలిటీలో రామచంద్రపురం మండలానికి చెందిన ఉట్రుమిల్లి, తాళ్లపొలం, యనమదల, అగ్రహారం, నర్సాపురపుపేట, రాయవరం మండలం పసలపూడి గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం 48 వేల మంది వరకు జనాభా ఉండగా, విలీనం జరిగితే మరో 30 వేల మంది పెరుగుతారు. 2019 ఎన్నికలకు ముందు మండపేట మున్సిపాలిటీలో మండపేట మండలం మారేడుబాక, తాపేశ్వరం, ఇప్పనపాడు, ఏడిద, అర్తమూరు ఐదు గ్రామాలు, కపిలేశ్వరపురం మండలం నుంచి నేలటూరు గ్రామం మొత్తం ఆరు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. మండపేట మున్సిపాలిటీ జనాభా 2011 లెక్కలు ప్రకారం 53,588, మిగిలిన ఆరు గ్రామాలు విలీనమైతే మరో 20 వేల మంది జనాభా పెరుగుతుందని అంచనా. అమలాపురం పట్టణంరామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం -
రక్షకుని రాకకు..
సాక్షి, అమలాపురం: కరుణామయుడు అరుదెంచే శుభ తరుణం ఆసన్నమైంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురంతో పాటు వివిధ గ్రామాల్లో చర్చిలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్రీస్తుస్తుతి గీతాలతో పండగ వాతావరణం నెలకొంది. శాంటాక్లాజ్లు, క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల స్టార్లు.. క్రిస్మస్ వేడుకలకు కొత్త అందం తీసుకువచ్చాయి. సర్వం సిద్ధం లోక రక్షకుని రాక కోసం ఊరువాడా సిద్ధమవుతోంది. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. కరుణామయుని పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోటా చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో ముస్తాబు చేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలియజేస్తూ పశువుల పాకల సెటింగులు వేశారు. చర్చిల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆరాధన కూడికలు జరుగుతాయి. క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేకంగా స్టార్, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా.. ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను డిసెంబర్ నెలంతా ప్రత్యేకంగా జరుపుకొంటారనే విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి సుమారు 400కు పైగా చర్చలున్నాయని అంచనా. వీటిలో జిల్లా కేంద్రమైన అమలాపురంలో మన్నా జూబ్లీ చర్చి, లూథరన్, ఆర్సీఎం చర్చిలు పెద్దవి. వీటిలో క్రిస్మస్ సందర్భంగా వేల మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ● మండపేట పట్టణంలో అతి పురాతనమైన రోమన్ కేథలిక్ చర్చి, న్యూలైఫ్ బాప్టిస్ట్, రామచంద్రపురం పట్టణంలోని ఏసు ప్రేమాలయం, రోమన్ కేథలిక్ చర్చిలు, ముమ్మిడివరం ఆర్సీఎం, ఐ.పోలవరం మండలం కొమరిగిరి చర్చి, రాజోలు లూథరన్, పి.గన్నవరం మండలం కందాలపాలెం చర్చిలతో పాటు కొత్తపేట లూథరన్, మన్నా, పలివెల ఆర్సీఎం, వాడపాలెం ప్రవచన దేవుని సంఘం, ఎరుషలేం చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ● పుదుచ్చేరి యానాంలో ఫ్రెంచివారు నిర్మించిన ఆర్ సీఎం చర్చితో పాటు యానాంలో గౌతమీ నదీపాయలో జీసెస్ విగ్రహాలు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇక్కడ విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు దైవారాధనకు వచ్చే క్రీస్తువులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ● చర్చిలతో పాటు క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద కూడా ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఇళ్ల వద్ద క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు స్టార్లు తగిలించారు. కుటుంబ సభ్యులు, క్రైస్తవ భక్తులకు పంచేందుకు ప్రత్యేక కేక్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన పట్టణాలలో క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి అమ్మకాలతో ఆయా దుకాణాలు సందడిగా మారాయి. ముస్తాబైన క్రైస్తవ మందిరాలు నేడు క్రిస్మస్ వేడుకలు విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న చర్చిలు ఇళ్ల ముందు కనువిందు చేస్తున్న స్టార్లు ఊపందుకున్న కేక్లు, క్రిస్మస్ ట్రీల విక్రయాలు -
గోదావరి జిల్లాల్లోకి ఆయిల్ అక్రమ రవాణా
● యానాం నుంచి తరలిస్తున్న మాఫియా ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి, పెట్రోల్ బంకుల యజమానులు అమలాపురం టౌన్: ఉభయ గోదావరి జిల్లాల్లోకి యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమ రవాణా జరుగుతోందని, దీని అరికట్టాలంటూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో పాటు జిల్లా పెట్రోలు బంకుల యాజమానులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి సమస్యను వివరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కుడుపూడి, జిల్లా బంకు యాజమానులు స్థానిక మీడియాతో మాట్లాడారు. యానానికి వచ్చే పెట్రోలు, డీజిల్ ధర.. ఆంధ్రా ధర కంటే దాదాపు రూ.13 నుంచి రూ.17 వరకూ తక్కువగా ఉంటుందన్నారు. దీనివ ల్ల అక్కడి నుంచి ఆయిల్కు అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ యానానికి దిగుమతి అయిన పెట్రోలు, డీజిల్ నిత్యం ఉభయ గోదావరి జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోట్లతో టాక్సుల రూపంలో ఆదాయం తగ్గుతోందన్నారు. ఈ అక్రమ రాకెట్ను ఓ మాఫియా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ అక్రమ ఆయిల్ మాఫియా విషయాన్ని తాను శాసన మండలిలో చర్చకు తీసుకుని వస్తానని, కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు జిల్లా బంక్ల యజమానులతో కలసి త్వరలోనే అక్కడ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. యానాం ఆయిల్స్ అక్రమ రవాణాతో బంక్ల నిర్వహణ, వ్యాపారాలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా పెట్రోల్ బంక్ల యాజమానుల బృందం ప్రతినిధులు బీవీ తిరుమలరావు, జవ్వాది తాతబాబు, కె.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అమలాపురం ఎంపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎంపీ గంటి హరీష్ మాధుర్కు వినతి పత్రం అందజేశారు. -
వైఎస్ జగన్ వాలీబాల్ టోర్నీ విజేతగా వైజాగ్
అమలాపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎ.వేమవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన వైఎస్ జగన్ వాలీబాల్ చాంపియన్ షిప్ విజేతగా వైజాగ్ జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పోటీ పడగా, రన్నర్గా మాగం టీమ్ నిలిచింది. విజేతలకు వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచే రమణారావు మొదటి బహుమతిగా రూ.25 వేల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. రన్నర్కు మాజీ ఎంపీ, పార్టీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ రూ.15 వేల చెక్కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు కుడిపూడి భరత్ భూషణం, రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తొరం గౌతమ్, నాయకులు నక్కా చంద్రశేఖర్, చీకట్ల కిషోర్, చెట్ల రామారావు, చిత్రపు జయరాజు పాల్గొన్నారు. విజేతకు ట్రోఫీ అందజేస్తున్న మాజీ ఎంపీ అనురాధ, వైఎస్సార్ సీపీ నాయకుడు రమణారావు -
స్టేట్ సైన్స్ ఎగ్జిబిషన్లో కోనసీమ సత్తా
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశాయి. వాటిలో ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని, దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శిని అనే రెండు అంశాలుగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అమలాపురం మండలం సమనస జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘మెషిన్ ఫర్ అగ్రికల్చరల్’, రావులపాలెం మండలం ఊబలంక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ● వ్యక్తిగత విభాగం నుంచి రామచంద్రపురంలోని లాల్ బహుదూర్శాస్త్రి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రూపొందించిన ‘సస్టైనబుల్ అగ్రికల్చర్’ ప్రాజెక్టు, గ్రూపు విభాగం నుంచి అమలాపురం పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘ఫుట్ ప్రెజర్ పవర్ జనరేషన్’ ప్రాజెక్టు, రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ ప్రాజెక్టు సదరన్ ఇండియా సైన్స్ ఫేర్కు ఎంపికయ్యాయి. రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు రెండు విభాగాల్లో ఎంపిక కావడం గమనార్హం. ● సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 జనవరి 18న హైదరాబాద్లో జరగనుండగా, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జరిగే ప్రదేశం, తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జిల్లా నుంచి ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై కలెక్టర్ మహేష్కుమార్ రావిరాల, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ఆ విద్యార్థులను, గైడ్ టీచర్లను అభినందించారు. -
కొబ్బరికి మద్దతు ధర లభించేలా సంప్రదింపులు
అమలాపురం రూరల్: కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా కొబ్బరి బోర్డుతో సంప్రదింపులు జరుపుతామని వర్తకులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో అంబాజీపేట కొబ్బరి మార్కెట్ వర్తకులతో సమావేశం నిర్వహించి, కొబ్బరి ధరల హెచ్చుతగ్గులపై సమీక్షించారు. ● శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సఖినేటిపల్లి మండలం చింతలమోరి నుంచి మామిడికుదురు మండలం కరవాక వరకు సుమారు 22.9 కిలోమీటర్లు పొడవునా డ్రైనేజీ వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని సర్వే, రెవెన్యూ, జలవనరుల డ్రైనేజీ విభాగపు ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ● జిల్లాకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ1.650 కోట్లతో ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని కలెక్టర్ అన్నారు. బొబ్బర్లంక నుంచి పైప్లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని జిల్లా చిట్ట చివరి స్థాయి వరకు సరఫరా చేసేందుకు పైప్లైన్ ఏర్పాటుపై సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెగా ఇంజినీరింగ్ రూపొందించిన పైప్లైన్ ఏర్పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముందుగా తిలకించారు. అలాగే జిల్లాలో రబీ సీజన్కు సరిపడా యూరియా, రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. -
ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయం
అమలాపురం టౌన్: ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని జిల్లా ఆర్మ్డ్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీస్తు బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ కరుణ, దయ, త్యాగం, ప్రేమ వంటి లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, రఘువీర్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఆర్మ్డ్ ఆర్ఐలు కోటేశ్వరరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. భార్య దేవుడిచ్చిన మిత్రము సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గృహస్థునకు భార్య దేవుడిచ్చిన మిత్రము అని ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానం చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన 28వ రోజు ప్రవచనం కొనసాగించారు. అష్టకష్టాలలో భార్యా వియోగం ఒకటి, పురుషుని జీవితం భార్య మీద ఆధారపడి ఉన్నదని ఆయన వివరించారు. భారతీయ సారస్వతంలో భార్యకు ఉన్నతస్థానం ఉన్నదని ఆయన వివరించారు. యక్షప్రశ్నలు ఒక ఉపనిషత్తుగా స్వీకరించాలని, కర్ణుని గురించి విశ్లేషణ చేస్తూ, దానవీరశూర కర్ణ అనడం అతిశయోక్తి అని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. -
లంక భూములకు గోదావరి కోత
కొత్తపేట: జిల్లాలో గోదావరి ప్రవాహానికి కోతకు గురవుతున్న లంక భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్రేయపురం మండలం రాజవరం సమీప లంక ప్రాంతంలోని విలువైన భూములు నదీ కోతకు గురవుతున్న విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై స్పందించిన జగ్గిరెడ్డి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఏడాది గోదావరి వరదలు, నదీ ప్రవాహానికి పంట భూములు కోతకు గురైపోతున్నాయని రైతులు వివరించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాణిజ్య పంటలు పండే ఎంతో విలువైన భూమి కోతకు గురై గోదావరిలో కలిసిపోతోందన్నారు. వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా వానపల్లి, కపిలేశ్వరపురం మండలాల పరిధిలోని లంక భూములు కూడా కోత బారిన పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, లంక భూముల నదీ కోతను అరికట్టి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) కింద ప్రతిపాదించి, వెంటనే ప్రత్యేక బృందంతో పరిశీలన జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. నదిలో కలిసిపోతున్న విలువైన భూములు చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి కోతకు గురైన ప్రాంతాల పరిశీలన -
క్రిస్మస్ వెలుగులు
అమలాపురంలో మున్నా సిల్వర్ జూబ్లీ చర్చి భూమిపై మానవులను పాపాల నుంచి రక్షించేందుకే ఏసుక్రీస్తు జన్మించారు. అశాంతితో ఉన్న సమాజాన్ని శాంతి, ప్రేమ, దయ తదితర మార్గాల్లో నడిపించారు. ప్రతి ఒక్కరూ పొరుగువారిని ప్రేమించాలని, క్షమాగుణం అలవర్చుకోవాలని బోధించారు. అనేక శ్రమలను భరించి శిలువపై మరణించారు. అనంతరం సజీవునిగా లేచి లోకానికి సత్యమార్గం చూపించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వివిధ చర్చిల్లో ఆయన జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ వేసిన సెట్టింగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ పండగ సందడి మొదలైంది. చర్చిలు, క్రైస్తవుల ఇళ్లు రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి.రామచంద్రపురంలోని దివ్య కారుణ్య దేవాలయంలో క్రీస్తు జననాన్ని తెలిపే సెట్టింగ్ -
శివరాత్రికి జాతీయ వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహాశివరాత్రి సందర్భంగా గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐదు రోజుల పాటు అరిగెల శ్రీరంగయ్య (ఏఎస్ఆర్) జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గొల్లవిల్లి చినరాజప్ప కల్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన నిర్వాహక కమిటీ సభ్యులతో ఏఎస్సార్ టోర్నమెంట్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య సలహాదారుడు అరిగెల వెంకట ముసలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, సొసైటీ అధ్యక్షులు మంచెం బాలకృష్ణ, చిక్కం ఉమేష్, టోర్నమెంటు నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి
గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు తూడు, గుర్రపు డెక్కతో పూడుకుపోయి ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే రబీ సాగు సాఫీగా సాగుతోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం మంగళవారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ను కోరింది. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆయనను కలిసింది. జిల్లాలో అధ్వానంగా ఉన్న కాలువల వివరాలు, ఫొటోలతో కూడిన వినతిపత్రం అందజేసింది. అనంతరం జిన్నూరి బాబీ విలేకరులతో మాట్లాడుతూ కాలువలు, డ్రైన్లు అధ్వానంగా ఉండడంతో గత ఖరీఫ్ దెబ్బతిందన్నారు. త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలువల వ్యవస్థ దెబ్బతినడం వల్ల రెండో పంటకు నీరందే అవకాశం లేదన్నారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొర్లపాటి వెంకటేశ్వరరావు (కోటబాబు), చిక్కం బాలయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల జోహార్, ఉప్పలగుప్తం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం సూరిబాబు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి యాళ్ల చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: వీఆర్వోల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి, జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. అమలాపురంలోని కచేరి చావిడిలో మంగళవారం జరిగిన జిల్లా వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు సాధనాల ఎల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్కు వీఆర్వోలకు సంబంధించిన అనేక సమస్యలను వివరించామన్నారు. గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1గా పదోన్నతులు కల్పించాలని, వన్ టైమ్ సెటిల్మెంట్ పద్ధతిలో పదోన్నతులకు అర్హులైన వీఆర్వోలను ఖాళీల్లో భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి మల్లేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రరాజు సత్యనారాయణరాజు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈవీవీ సత్యనారాయణ, కేవీవీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి చోడే శివకుమార్ తదితరలు ప్రసంగించారు. -
11 నుంచి కోనసీమ సంక్రాంతి సంబరాలు
● కలెక్టర్ మహేష్కుమార్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అమలాపురం రూరల్: కోనసీమ సంక్రాంతి సంబరాలు, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలను జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవో పర్యాటక జలవనరుల, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోనసీమ సంక్రాంతి సంబరాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. జనవరి 11వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఆత్రేయపురం కాలువ లాకులు వద్ద స్విమ్మింగ్ పోటీలు ప్రారంభిస్తారని, అదే రోజు ఉదయం 9 నుంచి ముగ్గుల పోటీలు ఆత్రేయపురం ప్రధాన రహదారిపై జరుగుతాయన్నారు. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆత్రేయపురం కెనాల్ వద్ద గాలిపటాల పోటీలు ప్రారంభిస్తారన్నారు. కోనసీమ సంక్రాంతి సంబరాలు గోదావరి ట్రోఫీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జనవరి 12, 13 తేదీల్లో ఆత్రేయపురం కాలువ లొల్ల లాకులు డౌన్ స్ట్రీమ్ వద్ద ఉచ్చిలి దేవాలయం నుంచి బ్రిడ్జి వరకూ జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 28 టీములు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.లక్ష బహుమతిగా అందిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జనవరి 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఆత్రేయపురం హైస్కూల్ గ్రౌండ్లో సినీ ఆర్కెస్ట్రా, 12వ తేదీ రాత్రి 7 గంటల నుంచి బాండ్ సేహరి మ్యూజికల్ కార్య క్రమం ఉంటుందన్నారు. = జిల్లాలో కొబ్బరి క్వాయర్ విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అవ కాశాలు నిండుగా ఉన్నాయని, ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. రాష్ట్ర ఎంఎస్ఎం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడికుదురు, ఉప్పలగుప్తం, రావులపాలెం, అమలాపురం, రాయవరం, ద్రాక్షారామాల్లో సంకల్పించిన కొబ్బరి క్వాయరు ఆధారిత పరిశ్రమల ప్రతిపాదనలపై సమీక్షించారు. -
రబీ సాగేదెలా!
● జిల్లాలో అధ్వానంగా డెల్టా కాలువలు ● పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు ● షార్ట్ టైమ్ క్లోజర్ పనులు చేయించని అధికారులు ● రూ.2.70 కోట్ల వీడ్ రిమూవల్ నిధులు నీటిపాలు ● చేయకుండానే బిల్లు చేసుకునే పనిలో నీటి సంఘాలు! సాక్షి, అమలాపురం: ప్రకృతి వైపరీత్యాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్ పంటను కోల్పోయిన రైతులు రబీ సాగుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పంట కాలువలు, మురుగునీటి కాలువల దుస్థితిని చూస్తుంటే జిల్లాలో రబీ సాగు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెలు, మైనర్ మురుగునీటి కాలువల్లో తూడు, గుర్రపు డెక్క నిండిపోయాయి. దీనితో శివారు, మెరక ప్రాంతాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు సరికదా.. కీలక సమయంలో డ్రైన్ల నుంచి నీరు తోడుకునే అవకాశం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రబీ సాగుకు జలవనరుల శాఖ అధికారులు డిసెంబర్ ఒకటో తేదీన నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తుపాను, వర్షాల వల్ల ఖరీఫ్ కోతలు ఆలస్యం కావడంతో రబీ పనులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అలాగే మొదలు పెట్టిన చోట సాగునీరు అందడం లేదు. నీరు వదులుతున్నా.. గోదావరి మూడు డెల్టాల పరిధిలో పంట కాలువలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు ఐదు వేలు, మధ్య డెల్టాకు రెండు వేలు, పశ్చిమ డెల్టాకు ఏడు వేల చొప్పున మొత్తం 14 వేల క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. అయినా శివారు, మెరక ప్రాంతాలకు నీరు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదంటే అందుకు పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడమే కారణం. ముఖ్యంగా తొలి పంట సాగు చేయని మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో రబీ ముందస్తు సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లోనే శివారుకు నీరందడం లేదు. దారుణం జిల్లాలో మురుగునీటి కాలువల వ్యవస్థ మరింత దారుణంగా ఉంది. మేజర్, మైనర్, మీడియం డ్రైన్లతో పాటు రెవెన్యూ డ్రైన్లలో కూడా తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయాయి. దీంతో ముంపు నీరు దిగే అవకాశం లేకపోవడంతో ఖరీఫ్లో 40 వేల ఎకరాల్లో సాగు జరగని విషయం తెలిసిందే. ఇక రబీలో నీటి ఎద్దడి సమయంలో వీటి మీద క్రాస్బండ్లు వేసి నీరు నిల్వ చేస్తూంటారు. రైతులు వీటి నుంచే మోటార్లతో సాగునీరు సేకరిస్తారు. అయితే డ్రైన్లు పూడుకుపోవడంతో కీలక సమయంలో నీటిని తోడుకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. ముంచేసిన నీటి సంఘాలు రైతులకు మేలు చేసేందుకు ఏర్పడిన నీటి సంఘాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో చేయపోవడంతో పంటలు నీట మునిగి దెబ్బతినే పరిస్థితులను తెచ్చాయి. ఈ ఏడాది మేజర్, మీడియం డ్రైన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు గతంలోనే కేటాయించింది. కూనవరం, లోయర్ కౌశిక, అప్పర కౌశిక, సాకుర్రు, వృద్ధ గౌతమీ, అమలాపురం, దసరా బుల్లోడుకోడు, వాసాలతిప్ప వంటి డ్రైనేజీల్లో పనులకు ప్రభుత్వం నిర్వహణ నిధులు కేటాయించింది. ఈ పనులను గత ఖరీఫ్కు ముందు వర్షాలు రాక ముందే చేపట్టాల్సి ఉంది. కానీ నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టిన ప్రాజెక్టు కమిటీ తూడు, గురప్రు డెక్క తొలగించిన పాపాన పోలేదు. ఈ ఏడాది నైరుతిలో లోటు వర్షం కలిసి వచ్చింది. అయినా అరకొరగా పనులు చేసి వదిలేసి, బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. వీరి దోపిడీ వల్ల గత ఖరీఫ్లో భారీ వర్షాలు, మోంథా తుపాను సమయంలో జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. పది మేజర్ డ్రైన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చినా.. సకాలంలో తూడు, గురప్రుడెక్క తొలగించక పోవడంతో చేల నుంచి ముంపునీరు వీడడం లేదు. దీనివల్ల పంట పెద్ద ఎత్తున కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. గత నవంబర్ నాలుగో తేదీన ‘సాక్షి’ పత్రిక ‘‘తుడిచిపెట్టిన నిర్లక్ష్యం’’ అనే శీర్షికన ఈ సమస్యను వెలుగులోకి తెచ్చింది. అయినా అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు. సరికదా బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను తామే చేసినట్టుగా రికార్డు చేయించుకుని బిల్లులు నొక్కేసే పనిలో పడినట్టు సమాచారం. -
పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం
అల్లవరం: సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ఎస్పీ రాహూల్ మీనా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ప్రకటనలో అభినందించారు. అలాగే మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన, సీ్త్రలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలను నియంత్రించడానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. నెల రోజులుగా పలు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే సైబర్ నేరాల తీవ్రం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. ఈ తరహా నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో హెచ్చుమీరుతున్నాయన్నారు. ఉద్యోగం, షేర్లు, బాండ్లు, క్రెడిట్ స్కోర్ తదితర విషయాల్లో సోషల్ మీడియా వేదికగా యాప్లను డౌన్లోడ్ చేయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు సమాచారం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అమలాపురం టౌన్: జిల్లాలోని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ప్రభుత్వ బీమా పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు పీఆర్టీయూ జిల్లా యూనియన్ ప్రతినిధులు మంగళవారం వినతి పత్రాలు అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి మెంగం అమృతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాళం శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ మట్టా శ్రీనివాస్ తదితరులు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. పీఎఫ్ చెల్లింపులకు సంబంధించిన సమస్యలను సరిదిద్దాలని, ప్రభుత్వ బీమా పట్టాలు చేరని వారికి, త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలను కూడా తొందరగా పరిష్కరించాలని కోరారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాయంలోని ఏవో సూర్యప్రకాష్, ఏపీజీఎల్ఐ కార్యాలయ సూపరింటెండెంట్ సుధీర్కు వినతి పత్రాలు అందజేశారు. అమరావతికివాజ్పేయి కాంస్య విగ్రహం కొత్తపేట: అమరావతిలో నెలకొల్పే దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని మంగళవారం కొత్తపేట నుంచి తరలించారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ 14 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని టన్నున్నర కాంస్యంతో తయారు చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 30న ఉత్తర ద్వార దర్శనం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ దర్శన అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చెప్పారు. -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో విత్తనం కందను చేలో పరచిన దృశ్యం అన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా వ్రతాల నిర్వహణకు వెళ్లిన స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజు కు మెమో ఇచ్చారు. సోమవారం సస్పెండ్ అయిన వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆర్డీవో, డీఎస్పీ ఆఫీసులు కొనసాగించాలని వినతి
అమలాపురం రూరల్: రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రామచంద్రపురం రెవెన్యూ సబ్ డివిజన్ను తరలించడం కూడదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు పలువురు నాయకులు వినతిపత్రాలు అందించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉందని దీనివల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్లు పొరుగు నియోజకవర్గాలకు తరలిస్తారు. వీటిని కొనసాగించాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోర్టినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెమ్మిరెడ్డి మురళి, అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, అఖిల పక్ష నాయకుడు సలాది సతీష్నాయుడుకలెక్టర్ను కలిసి వినిత పత్రం అందిచారు. ఈ ఆఫీస్ను మూసివేస్తే రైతులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, కూలీలు, సాధారణ ప్రజలకు కష్టాలు ఏర్పడతారయని అందువల్ల, వాటిని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు.


