breaking news
Dr B R Ambedkar Konaseema
-
ఫైనల్స్ దశలో జాతీయ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం కాకినాడ డీఎస్ఏలో సెమీఫైనల్స్ పూర్తి చేసుకుని ఫైనల్స్కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్లో రెండు మ్యాచ్లు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్లను హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్రెడ్డి ప్రారంభించారు. మొదటి సెమీఫైనల్స్లో హర్యానా, ఛత్తీస్గఢ్ పోటీపడగా హర్యానా 3–0 స్కోర్తో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ మధ్య జరుగగా జార్ఖండ్ 3–0 స్కోర్తో గెలుపొంది ఫైనల్స్కు చేరింది. మూడోస్థానానికి మంగళవారం ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. ఫైనల్స్ హర్యానా, జార్ఖండ్ జట్ల మధ్య నిర్వహించనున్నారు. క్రీడాకారులకు సోమవారం విశ్రాంతిరోజు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్, హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్దన్, కోశాధికారి పి.థామస్, భవానీశంకర్, వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు. -
ఉత్కంఠగా అండర్–17 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్ –17 చెస్ పోటీలు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యా సంస్థల్లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు దాదాపు 60 మంది క్రీడాకారులు వచ్చి తమ ప్రతిభకు పదను పెట్టారు. పోటీల్లో బాలురు నుంచి ముగ్గురిని, బాలికల నుంచి ముగ్గురిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి కవురు జగదీష్ చెప్పారు. బాలుర విభాగంంలో గిరిమణి శేఖర్ (ప్రథమ), బండారు నానిబాబు (ద్వితీయ), తాడి సాయి వెంకటేష్ (తృతీయ), బాలికల విభాగంలో పనిశెట్ట ధరణి (ప్రథమ), బొడ్డు సాన్వి (ద్వితీయ), పసుపులేటి రేష్మ (తృతీయ) గెలిచారని తెలిపారు. వీరు ఈ నెల 16,17 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా తరఫున ఆడతారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిది విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్నాయుడు షీల్డ్లు అందజేశారు. -
హోరాహోరీగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
నేడు ముగింపు, బహుమతుల ప్రదానం తుని రూరల్: అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శ్రీప్రకాష్ విద్యా సంస్థలలో ఇవి నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండవ రోజూ సీబీఎస్ఈ క్లస్టర్ –7 అంతర్రాష్ట్ర బాలురు, బాలికల అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 180 జట్లకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–19 బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సిస్టర్స్ నివేదిత స్కూల్ (హైదరాబాద్), ద్వితీయ స్థానాన్ని వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి), తృతీయస్థానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ (ఏలూరు) కై వసం చేసుకున్నట్టు సీబీఎస్ఈ పరిశీలకుడు సీహెచ్ఎంఎల్.శ్రీనివాసు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో జట్లు తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ వైపు దూసుకువెళుతున్నాయన్నారు. వీటి ఫలితాలు సోమవారం వస్తాయని, విజేతలకు అదేరోజు బహుమతుల ప్రదానం జరుగుందన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్ర, తెలంగాణాల నుంచి విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి
కొత్తపేట: కొబ్బరి కాయల దింపు కోసం చెట్టు ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారింకి వీరవెంకట సత్యనారాయణ (పండు) (42) కొబ్బరి దింపు కార్మికుడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో కొబ్బరి దింపు కోసం చెట్టు ఎక్కి కింద పడి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాము తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు దింపు కార్మికుడు పండు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అందరితో కలసిమెలసి ఉంటూ, సహచర దింపు కార్మికులకు అండగా ఉండే పండు మృతి చెందాడని తెలిసి పలువురు గ్రామస్తులు, దింపు కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం కొబ్బరి దింపులు తీసుకుంటూ జీవనం సాగించే అతని మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. అమ్మమ్మ చెంతకు చేరిన బాలిక సామర్లకోట: వరుసగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్లు ఆదివారం ప్రయాణికులతో నిండి పోయాయి. ఈ తరుణంలో ఆదివారం జోన్నాదుల వెంకటసాయమ్మ తన మనువరాలు జ్యోత్స్నతో కలిసి చీరాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్కు వచ్చింది. టిక్కెట్టు తీసుకొవడానికి కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో జనంతో కలిసి జ్యోత్స్న ఒకటవ నెంబరు ప్లాటుఫారంపైకి వచ్చింది. అక్కడ అమ్మమ్మ కనిపించక పోవడంతో ఏడుస్తూ ఉండటాన్ని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ అనంత లక్ష్మీ గమనించారు. రైల్వే స్టేషన్లోని మైక్ ద్వారా ప్రకటించారు. అప్పటికే టిక్కెటు తీసుకున్న వెంకటసాయమ్మ మనవరాలి కొసం కౌంటర్ వద్ద వెతుకుతూ ఉంది. ఈ తరుణంలో మైక్ ద్వారా సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకుని స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లింది. అచ్చట స్టేషన్ మేనేజరు ఎం రమేష్ కౌన్సెలింగ్ చేసి బాలికను ఆర్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో వెంకటసాయమ్మకు అప్పగించారు. -
పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్
ప్రధాన తేదీలు దరఖాస్తు చేసేందుకు గడువు: ఆగస్టు 17 దరఖాస్తుల స్క్రీనింగ్: సెప్టెంబర్ 15 జ్యూరీ ఎంపిక గడువు: సెప్టెంబర్ 30 ఫలితాల ప్రకటన: అక్టోబర్ 15 ఎంపికై న ప్రాజెక్టుల ప్రారంభం: అక్టోబర్ 16 ప్రాజెక్టు ముగింపు తేదీ: అక్టోబర్ 16, 2026. రిపోర్టు సబ్మిషన్: అక్టోబర్ 20, 2026. ● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ● శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యం రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్ఫైర్ మనాక్, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)– ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. అర్హతలు – నిబంధనలు ● ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా గణితం బోధించే పీజీటీ/టీజీటీ ఉపాధ్యాయుడు, ఏదైనా ఒక ఉన్నత విద్యా సంస్థ, పరిశోధన సంస్థ నిపుణుడితో కలిసి పరిశోధన ప్రాజెక్టును సమర్పించాలి. ● ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిశీలిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. పూర్తి సమాచారాన్ని ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ● విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు గైడ్ టీచర్గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యాసంస్థల సైన్స్ సబ్జెక్ట్ నిపుణుల నుంచి సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు పొందవచ్చు. మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వాములు అయ్యే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఎంపికవ్వాలంటే సమస్యను ప్రతిబింబించడంతో పాటుగా, మంచి పరిష్కారాన్ని చూపించాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంపికై న వారికి రూ.50వేల నగదు విద్యార్థులు స్థానికంగా ఉన్న ఒక సమస్యను గుర్తించి, దానిని అధ్యయనం చేయాలి. సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి. శాసీ్త్రయ పరిశోధన చేసి, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపిస్తూ రిపోర్టును సమర్పించాలి. ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్సీఈఆర్టీ ఎంపిక చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేస్తోంది. మంజూరైన నిధులను పరిశోధనకు, ప్రాజెక్టు రూపకల్పనకు వినియోగించుకోవచ్చు. పరిశోధన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిధుల నుంచి విద్యార్థులకు రూ.10 వేలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థ సబ్జెక్టు ఎక్స్పర్ట్కి రూ.20 వేల వంతున అందజేస్తారు. -
స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..
రాజమహేంద్రవరం రూరల్: స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మూరు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఊట వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కరాలరేవులో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మురళీకృష్ణ మునిగిపోయాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో కుమారి టాకీస్ సమీపంలో దోభీఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. టుటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఉన్నత చదువులు చదువుతాడని... మురళీకృష్ణ తండ్రి శ్రీను ఎస్వీజీ మార్కెట్లో జట్టుకూలీగా పనిచేస్తుంటాడు. తనలాగా తన కొడుకు ఉండకూడదని మురళీకృష్ణను స్థానికంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్చేసి చదివిస్తున్నాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళతావనుకుంటే మా అందరిని వదిలేసి వెళ్లిపోయావేంటి వంశీ అంటూ శ్రీను దంపతులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. -
కొత్త బీటీ రోడ్డుకు తూట్లు
ఆక్రమ మట్టి రవాణాతో చిందరవందరగా మారిన బీటీ రోడ్డుఅక్రమ మట్టి రవాణాతో చిందరవందరగా మారిన బీటీ రోడ్డుసాక్షి, అమలాపురం: మట్టి మాఫియా దౌర్జన్య వైఖరికి అధికారుల నిర్లక్ష్యం తోడై కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డు తూట్లు పడిపోయింది. మండల కేంద్రమైన ఉప్పలగుప్తం పేరాయిచెరువు దళితవాడలో ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డు మీదుగా కొంతమంది అక్రమంగా మట్టిని తరలిస్తూ నెలలు గడవకుండానే తూట్లు పొడుస్తున్నారు. ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా మారి సాన్థికులు ఇబ్బందులకు గురికావడంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్లో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికలు రాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇటీవల బీటీ రోడ్డు పనులను పూర్తి చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర స్థాయి నేతకు అనుచరుడని అని చెప్పకుంటూ గ్రామంలో ఇష్టారాజ్యంగా వారంరోజులుగా ఈ రోడ్డు మీదుగా యథేచ్ఛగా మట్టి రవాణా సాగిస్తున్నాడని స్థానికులు అరోపిస్తున్నారు. మట్టి రవాణా చేయడంతో తారు రోడ్డంతా మట్టి రోడ్డుగా మారుతోందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి కురిసిన వానకు ఆ మట్టి రోడ్డుపై ప్రయాణించేవారు జారి పడి ప్రమాదాలకు గురయ్యారు. ట్రాక్టర్కు నాగలి బ్లేడు తగిలించి ఆ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ప్రజాధనంతో వేసిన రోడ్డుకు నెలలు గడవకుండానే తూట్లు పొడుస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. -
తలుపులమ్మ తల్లికి మకర తోరణం
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి మండపేటకు చెందిన శిల్పి వాసా శ్రీనివాస్ ఆదివారం రూ.1.25 లక్షల విలువైన మకరం తోరణం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం దాత కోరిక మేరకు దీనిని అమ్మవారికి అలంకరించామని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఈ మకర తోరణాన్ని 8 కిలోల రాగి, ఇతర లోహాలతో తయారు చేశారన్నారు. దాతలను వేద పండితులు ఆశీర్వదించి, అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. లోవలో భక్తుల సందడి తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదం, పూజా టికెట్లు, వసతి గదులు తదితర రూపాల్లో దేవస్థానానికి రూ.5,00,279 ఆదాయం లభించిందని వివరించారు. -
విఘ్నేశ్వరుని సన్నిఽధికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ వంటి విశేష పూజలు జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 17 జంటలు పాలొన్నాయి. స్వామివారికి ఆరుగురు భక్తులు ఉండాళ్ల పూజ జరిపారు. స్వామి సన్నిధిలో 12 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆరుగురు చిన్నారులకు తులాభారం, తొమ్మిది మందికి అన్నప్రాశన నిర్వహించారు. 33 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,180 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,56,461 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల వద్ద నుంచి వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కారం చేస్తారన్నారు. పీజీఆర్ఎస్ మూడు రెవెన్యూ డివిజన్లు ,మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో జరుగుతుందన్నారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చునన్నారు.సంకీర్తన భవనం ప్రారంభం అమలాపురం రూరల్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో అమలాపురం మండలం జనుపల్లిలో నూతన నిర్మించిన సంకీర్తన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ భవన ప్రారంభోత్సవానికి ఇస్కాన్ రాజమహేంద్రవరం మందిర చైర్మన్ శ్రీసత్య గోపీనాథ్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన భక్తులకు ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కోనసీమలో తొలిసారిగా ఇస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నితాయి, గౌర చంద్రులకు మహాపుష్పా భిషేకం, 54 రకాల వంటలతో మహానైవేద్యం సమర్పించారు. శనివారం నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు వేడుకలు కొనసాగుతాయని ఇస్కాన్ అమలాపురం మేనేజర్ శివానంద నిమయి దాస్ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. మండేలా బాబి, వాకపల్లి స్వామినాయిడు, ఇస్కాన్ సండే స్కూల్ టీచర్ సత్యకళ, నిమయి దాస్ భక్త బృందం, రావులచెరువు రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మూడు హత్యలకు నిరసనగా శాంతి ర్యాలీ
● నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ ● సీబీఎం సెంటర్లో మానవహారం సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ఒక వివాహిత, ఇద్దరు బాలికలను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, మానవహక్కుల సంఘ నాయకుల మద్దతుతో స్థానిక సీబీఎం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి మాధురి (30) కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన(6)లను హత్య చేసిన విషయం విదితమే. 3వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన మాధురి భర్త ధనుప్రసాద్ హత్య జరిగిన విషయాన్ని గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాలలో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడు స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ను ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించిన విషయం విదితమే. ఇటువంటి మానవమృగాలకు బుద్ధి వచ్చే విధంగా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీబీఎం సెంటర్లో పిల్లలు, పెద్దలు, మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించారు. దళిత సంఘ నాయకులు పిట్టా జానికిరామారావు, లింగం శివప్రసాద్, జిల్లా మానవహక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ సురేష్ తరఫున ఏ న్యాయవాది వాదించకుండా చూడాలన్నారు. మానసికంగా కృంగి పొయిన ములపర్తి మాధురి భర్త ధనుప్రసాద్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాఽఽధురి తల్లి ఫిర్యాదును కాకుండా భర్త ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కోర్టు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సుమారు 30 నిమిషాల పాటు సీబీఎం సెంటర్లో మానవ హారం నిర్వహించడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి పోలీసు స్టేషన్ మీదుగా సంతమార్కెట్, పాత తహసీల్దార్ కార్యాలయం, బ్రౌన్పేట సెంటర్ నుంచి తిరిగి సీబీఎం సెంటర్ వరకు శాంతి ర్యాలీ చేరింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దళిత సంఘ నాయకులు జుత్తుక అప్పారావు, పాలిక చంటి బాబు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. -
నులిమేద్దాం
విజయవంతం చేయాలి జిల్లా అవసరాలకు తగినంత ఆల్బెండజోల్ నిల్వలు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని రూపొందించిన కార్యక్రమాన్ని విద్యా, వైద్య సిబ్బంది విజయవంతం చేయాలి. ఇప్పటికే టాబ్లెట్స్ జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీలకు సరఫరా అయ్యాయి. – డాక్టర్ సుమలత, జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. ●● రేపు డీ వార్మింగ్ డే ● విద్య, వైద్య, ఆరోగ్య శాఖల సంయుక్త కార్యాచరణ ● జిల్లాకు చేరుకున్న 3.50 లక్షల ఆల్బెండజోల్ మాత్రలు రాయవరం: రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యా ర్థులకు డీవార్మింగ్ డే (నులిపురుగుల నివారణ మందు వేయడం) నిర్వహిస్తున్నారు. ఏడాది వయసు ఉన్న చిన్నారుల నుంచి 19ఏళ్ల లోపు వారందరికీ నులి పురుగుల నివారణకు మందులు వేయనున్నారు. మూడేళ్ల నుంచి 19ఏళ్ల లోపు ఉన్న ఒక్కో విద్యార్థి 400 మిల్లీ గ్రాముల పరిమాణం గల ఆల్బెండజోల్ మాత్రలు చప్పరించాలి. ఒకటి నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 200 మిల్లీ గ్రాముల ట్యాబ్లెట్ను చప్పరించే విధంగా చూడాలి. లేదంటే పొడుం చేసి తాగించాలి. ఏడాది నుంచి రెండేళ్ల లోపు వారికి టాబ్లెట్లో సగభాగం మాత్రమే ఇవ్వాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే విద్యార్థులతో మాత్రలు మింగించాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులు, పీహెచ్సీ సిబ్బంది చేపట్టనున్నారు. ముందుగా ఉపాధ్యాయులు మాత్రలు చప్పరించి, విద్యార్థులతో కూడా చప్పరించే విధంగా చేయాలి. విద్యార్థులకు ఇచ్చే మాత్రలు నేరుగా మింగడం కాని, చప్పరించడం కాని చేసేలా చూడాల్సి ఉంటుంది. మాత్రలు వేసుకున్న వెంటనే వాంతులు, వికారం వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదని, తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని పీహెచ్సీ సిబ్బంది సూచిస్తున్నారు. డీవార్మింగ్ మాత్రలు విద్యార్థులతో చప్పరించడం వల్ల పోషకాహార లోపం వలన కలిగే రక్తహీనతను నివారించడానికి వీలవుతుంది. తద్వారా జీవనపరమైన, భౌతికమైన అభివృద్ధి, పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. పోస్టర్ ఆవిష్కరణ డీ వార్మింగ్ డే సమర్థంగా అమలు చేసేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దుర్గారావుదొర కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్ రావిరాల చేతుల మీదుగా పోస్టర్ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ నెల 20 వరకు మాపే అప్ ప్రోగ్రామ్ ఈ నెల 12న డీవార్మింగ్ డేను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 3,50,709 ఆల్బెండ్జోల్ మాత్రలు 56 పీహెచ్సీలకు పంపిణీ చేశారు. జిల్లాలో ఉన్న 1,726 అంగన్వాడీ కేంద్రాల్లోని 78,339 మంది ఆరేళ్ల లోపు చిన్నారులకు 1,330 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 29,770 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. 252 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 59,907 మంది విద్యార్థులకు, 480 ప్రైవేట్ పాఠశాలల్లోని 1,06,007 మంది విద్యార్థులకు డీ వార్మింగ్ టాబ్లెట్స్ అందించనున్నారు. ఐదు ప్రభుత్వ, 35 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోని మొదటి సంవత్సరం చదువుతున్న 4,109 మంది, 15 ఐటీఐ కళాశాలల్లోని 2,156 మంది, నాలుగు ఇంజినీరింగ్ కళాశాలల్లోని 1,829 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20 వరకు మాపే అప్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. డీ వార్మింగ్ మాత్రలు వేసే సమయంలో.. ● భోజనానికి ఒక గంట ముందు ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు, తల్లితండ్రులకు నులిపురుగులు వ్యాప్తి, నివారణ, ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యవిద్యపై అవగాహన కల్పించాలి. ● చేతులు శుభ్రపర్చుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించాలి. ● పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా చూడాలి. -
అన్నప్రసాద భవనానికి విరాళాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన బెల్లంకొండ కృష్ణమూర్తి, గొడవర్తి వరలక్ష్మి, కుటుంబ సభ్యులు రూ.1,01,116, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన దేవిశెట్టి నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.25,116 అందజేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు స్వామివారి చిత్రపటాలను దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు. అడవి బిడ్డల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అమలాపురం టౌన్: అడవి బిడ్డల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అడవి ఆడబిడ్డల ప్రసవ సమయ మరణాలను నిరోధించాలని సూచించారు. అమలాపురంలో ఎమ్మెల్సీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సందర్భంగానైనా ప్రసవ మరణాలు లేకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గ దర్శకాల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతీ గూడెం, తాండాల్లో సంచార వైద్యులను నియమించి ప్రసవ మరణాలు, పిల్లల అకాల మరణాలు పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఆదివాసీలపై జరుగుతున్న అమానుష దాడులను ఆపాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో 3 లక్షల వ్యవసాయ పట్టాలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఏమీ చేయకపోగా అడవి బిడ్డల సంక్షేమం గురించి మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతీదేవికి బంగారు మామిడి పిందెల హారం మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి సన్నిధిలో కొలువైన పద్మావతీదేవికి అదే గ్రామానికి చెందిన తటవర్తి లక్ష్మీనారాయణ, అతని కుటుంబ సభ్యులు బంగారు మామిడిపిందెల హారం సమర్పించారు. హారం విలువ సుమారు రూ.65 వేలు ఉంటుంది. ఆ హారాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ సత్యమూర్తికి అందజేశారు. హారానికి అర్చకులు సంప్రోక్షణ చేసి పూజలు జరిపించి అమ్మవారికి అలంకరించారు. కొత్తపేటకు చెందిన మల్లవరపు వెంకటసత్యనారాయణ, సత్యవతి దంపతులు రూ.10 వేలు, నిడదవోలుకు చెందిన కాపా రామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు రూ.10 వేలు, విశాఖపట్నానికి చెందిన డాక్టర్ బడే నాగ సురేష్, కాంతిప్రియ దంపతులు రూ.10,116 స్వామివారికి విరాళంగా అందించారు. ఈ విరాళాలను ఆలయ ఉద్యోగులకు అందించారు. దాతలకు అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు ఈఓ వి.సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఉచిత బస్సు పేరిట మహిళలకు మోసం ఉప్పలగుప్తం: చంద్రబాబు మహిళలను ఉచిత బస్సు పేరుతో మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి ఆరోపించారు. ఆదివారం ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఉచిత బస్సుతో మహిళలు రాష్ట్రమంతా చుట్టేయచ్చు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్డీనరీ బస్సులు వేసి మమ అనిపించుకుంటారా అని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వ లగ్జరీ బస్సుల్లో తిరగాలని ఉండదా అని ప్రశ్నించారు. మోసపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని మహిళలను మోసం చేస్తే దానికి తగిన గుణపాఠం రాబోయే ఎన్నికల్లో చూపిస్తారన్నారు. -
పేద డొక్కపై ధరవు
● నిత్యవసరాల ధరలు ౖపైపెకి.. ● పేదల ఇంట్లో ఉడకని పప్పులు ● సలసలా కాగుతున్న వంటనూనెలు ● కందిపప్పు పంపిణీకి సర్కారు మంగళం ● రైతుబజార్లలో కనిపించని కౌంటర్లు ● సామాన్యుడి బతుకు దుర్భరంఆలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో నిత్యావసరాల ధరలు రోజుకు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ధరలు పెరిగినంతగా ఆదాయం పెరగకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎండీయూ వ్యవస్థను కాదని ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు చేరువ కావడం లేదు. బహిరంగ మార్కెట్పై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఏడాది వ్యవధిలో నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం పెరిగిపోయాయి. దీంతో పేదల ఇంట మాంసాహారం తినడం అటుంచితే పప్పులు కూడా ఉడకలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని విపరీతంగా పెంచడంతో వంటనూనె సలసలా కాగుతోంది. సన్నబియ్యం ధరలకు లెక్కలొచ్చాయి. విద్యుత్ బిల్లులను చూస్తేనే షాక్ కొట్టే విధంగా ఉంటున్నాయి. దళారుల ప్రభావంతో కూరగాయలు పండించిన ఉద్యాన రైతుకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఇప్పటికే రేషన్ ద్వారా రాయితీతో పంపిణీ చేసే కందిపప్పు మూణ్ణాళ్ల ముచ్చటగా నిలిచిపోయింది. వంటనూనెల ఊసే లేకుండా పోయింది. ధరల నియంత్రణ చేస్తామంటూ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కనిపించకుండా పోయాయి. దీంతో ధరలు పేదలకు భారమవుతున్నాయి. ప్రభుత్వానికి గ్లోబెల్ ప్రచారం, కక్ష సాధింపు, ఓట్ల రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ధరల నియంత్రణపై లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కందిపప్పును రాయితీపై అందించలేరా? సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు రేషన్ డిపోల ద్వారా కందిపప్పును రాయితీపై అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 5.48 లక్షల రేషన్ కార్డులు ఉండగా 926 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రేషన్ బియ్యం, పంచదారను మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 14 నెలల్లో మూడు నెలల మాత్రమే కందిపప్పు సరఫరా జరిగింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కేజీ రూ.67 మాత్రమే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో కందిపప్పును రూ.67కే అందించారు. రైతుబజార్లతో సన్న బియ్యం ధర కేజీ రూ.60 లోపు ఉండే విధంగా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి వర్గం సమీక్షలు నిర్వహించి పేదలపై అదనపు భారం పడకుండా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కందిపప్పు, బియ్యం, వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు వాపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కిలోల్లో (గత ఏడాదితో పోల్చితే) నిత్యావసరాలు జూన్ 2024 ఆగస్టు 2025 (రూ.లలో) (రూ.లలో) బియ్యం సూపర్ ఫైన్ 57 69బియ్యం గ్రేడ్–2 35 46కందిపప్పు 110 130మినపప్పు 80 115పెసరపప్పు 90 130పచ్చి శనగపప్పు 65 90గోధుమ పిండి 40 60ఉప్మా నూక 36 50పంచదార 38 48బెల్లం 32 60చింతపండు 80 120వేరుశనగ గుళ్లు 110 160పామాయిల్ (లీటర్) 89 140సన్ఫ్లవర్ (లీటర్) 102 150వేరుశనగ నూనె (లీటర్) 130 180 -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అన్నదమ్ముల మధ్య విభేదాలతో మనస్తాపం నిడదవోలు: పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామానికి చెందిన తానేటి శ్రీనివాస్ (42) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి విభేదాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఈనెల 8న పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే కుటుంబ సభ్యులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్కు భార్య భాగ్యలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెమీస్ దశలో సీబీఎస్సీ బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ సురేష్నగర్లో శ్రీప్రకాష్ స్కూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీబీఎస్సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు రెండో రోజు ఆదివారం క్వార్టర్స్ దశ పూర్తి చేసుకుని సెమీస్ దశకు చేరుకున్నాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులు ప్రత్యర్ధులతో తలపడ్డారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు పరిశీలకునిగా గణేష్, జాతీయస్థాయి రిఫరీలుగా శ్రీనివాస్, భద్రంల పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ శ్రీదేవి, డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆదివారం మ్యాచ్లను ప్రారంభించారు. సెమీస్కు చేరిన జట్ల వివరాలు అండర్–14 బాలుర విభాగంలో.. సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), ఇండస్ యూనివర్సల్ స్కూల్ (హైదరాబాద్), సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్(ఏలూరు), మౌంట్లిటిరా జి.స్కూల్ (మణికొండ) అండర్–17 బాలుర విభాగంలో .. గాడియమ్ స్కూల్ (హైదరాబాద్), పల్లవి మోడల్ స్కూల్ (సికింద్రాబాద్), ఎస్టిజోసెఫ్ ఇంగ్లిష్ స్కూల్(కర్నూల్), డీపీఎస్ (ఆనందపురం, వైజాగ్) అండర్–19 బాలుర విభాగంలో.. నీలకంత విద్య పీట్ (తెలంగాణ), సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(హైదరాబాద్), హ్యాపీ వాలీ స్కూల్ (విజయవాడ) -
రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..
● శుభకార్యానికి వెళ్లివస్తూ ఒకరు.. చెల్లెలికి రాఖీ కట్టి వస్తూ మరొకరు.. ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన ● కుమారుడి మృతి వార్త విని గుండెపోటుతో తండ్రి మృతి గోపాలపురం: మండలం వెంకటాయపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడడం.. వారిలో ఒకరి మరణ వార్త విని అతడి తండ్రి గుండెపోటుకు గురై చనిపోవడంతో ఇటు గోపాలపురం మండలం వాదాలకుంట, తాళ్లపూడి మండల పెద్దేవం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన మరపట్ల సువర్ణరాజు (56) తాళ్లపూడి మండలం చిడిపిలో బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గుండేపల్లి మణిశంకర్ (30) దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న చెల్లి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకు తిరిగి వస్తున్నాడు. వారిద్దరు గోపాలపురం మండలం వెంకటాయపాలెం మలుపు వద్ద పరస్పరం ఢీకొనడంతో మణిశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న సువర్ణరాజును గోపాలపురం సీహెచ్సీకి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సువర్ణరాజు వెళ్లిన శుభకార్యానికి భార్య, కుమారుడు, కుమార్తె మిగిలిన బంధువులు వెళ్లారు. తిరిగి సువర్ణరాజు ఒక్కడే మోటార్ సైకిల్ వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెనుక వస్తున్న భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు సువర్ణరాజును ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. -
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
● 3 రోజుల పాటు నిర్వహణ ● తలపడుతున్న 180 జట్లు తుని రూరల్: శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. శనివారం ప్రారంభమైన ఈ పోటీల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో 180 జట్లకు చెందిన రెండు వేల మంది బాలురు, బాలికలు పాల్గొంటున్నట్టు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. మొదటి రోజు జరిగిన మ్యాచ్లలో 24 జట్లు పాల్గొనగా 12 జట్లు విజేతలుగా నిలిచాయని ఆయన తెలిపారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి సీహెచ్ఎల్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదట రోజు విజేత జట్లు: అండర్–19 బాలికల విభాగంలో హైదరాబాద్కు చెందిన సిస్టర్స్ నివేదిత స్కూల్, ఏలూరుకు చెందిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, తిరుపతికి చెందిన వరిటాస్ సైనిక్ స్కూల్ జట్లు విజేతగా నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో నాచారానికి చెందిన సుప్రభాత హైస్కూల్, బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేత్ విద్యాలయం, హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యాభవన్ జట్లు గెలుపొందాయి. అండర్–19 బాలుర విభాగంలో తిరుపతికి చెందిన ఎకార్డ్ స్కూల్, అండర్–17 బాలురు విభాగంలో బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేతన్ విద్యాలయం, సిద్ధార్థ బోడుప్పల్కు చెందిన పబ్లిక్ స్కూల్ జట్లు గెలిపొందాయి. అండర్–14 విభాగంలో నర్సింగపాలేనికి చెందిన హీల్ స్కూల్, విజయవాడకు చెందిన శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్ూట్యన్ బటర్ఫ్లై స్కూల్ జట్లు గెలుపొందినట్టు నిర్వాహకులు తెలిపారు. -
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీవీఆర్ఎస్హెచ్కే వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్.రాజు, గౌరవ అధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా రేపాక వెంకటరాము, ఉపాధ్యక్షుడిగా కె.కిశోర్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీఎన్ త్రినాథ్, ఉపాధ్యక్షుడిగా తనికెళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా కె.సునీత, రాష్ట్ర ప్రతినిధిగా డొక్కా రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబి, ఆలీ, రంగారావు, పి.వేంకటేశ్వరరావు, పి.రామకృష్ణ, చార్లెస్, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసు గుట్టు రట్టు
● సెల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ● ఐదుగురి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం పిఠాపురం: గత నెల 28న గొల్లప్రోలు మండలం చెందుర్తి రహదారిలో జరిగిన దారి దోపిడీ కేసును గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు. సీఐ శ్రీనివాస్ శనివారం గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నల్లమందు వీధికి చెందిన సమీర్ ప్రజాపత్ అక్కడి భవానీ సిల్వర్స్లో గుమస్తాగా పనిచేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు బంగారం, వెండి వస్తువులను రవాణా చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయన గత నెల 28న పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని నగల దుకాణాల నుంచి బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్పై చెందుర్తి వెళ్తుండగా రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెందుర్తి రోడ్డులో కల్వర్ట్ దగ్గర నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై వచ్చి బ్లేడుతో బెదిరించి 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, రూ.60 వేల నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేసిన పోలీసులు ఘటనాస్థలంలో సిగ్నల్స్ ఆధారంగా పెద్దాపురానికి చెందిన బంగారు నగల వర్తకుడు రౌతు గోవిందుపై నిఘా పెట్టారు. శనివారం పిఠాపురం మండలం జల్లూరు గ్రామ శివారులో అతనితో పాటు గనిరెడ్డి సాయి ప్రసాద్, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ మణికంఠ దోపిడీ చేసిన సొత్తును పంచుకుంటున్న సమయంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి దోచుకున్న సొత్తుతో పాటు వారు వినియోగించిన రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కాగా గోవిందు పెద్దాపురంలో బంగారు వెండి వ్యాపారం చేస్తుంటాడు. బాధితుడైన సమీర్ అతడితో కూడా లావాదేవీలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సమీర్ వద్ద అధికమొత్తంలో బంగారం, వెండి ఉంటాయని, వాటిని కొట్టేయాలన్న దుర్బుద్ధితో అతడిపై తన మనుషులతో రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. దోపిడీ చేసిన వెండి, బంగారాన్ని కరిగించి దిమ్మలుగా మార్చి ఆనవాళ్లు లేకుండా చేశారని సీఐ తెలిపారు. -
కూలిపనికి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి..
లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం సీతంపేట రంగా విగ్రహం సెంటర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) రోజూ మాదిరిగానే శనివారం తెల్లవారుజామున 6.30 సమయంలో కడియపులంకలో పూల కుండీల లోడింగ్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. విజ్జేశ్వరం–సీతంపేట సమీపంలోని రంగా విగ్రహం సెంటర్ వద్దకు వారు వచ్చే సరికి కొవ్వూరు వైపు వస్తున్న లారీ వెనుక నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో వారు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు చెరో రూ.10 వేలు అందించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
● లక్షణంగా అలంకరణ
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని.. రంగురంగుల గాజులనే దండలుగా రూపొందించి.. అమ్మవారికి అలంకరించి భక్తులు మురిసిపోయారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా లక్ష గాజులతో తాళ్లపూడిలోని నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి శనివారం ఈ అలంకరణ చేశారు. కుంకు మార్చనలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ, గాజుల పూజ ద్వారా కార్య, సౌభాగ్య సిద్ధి కలుగుతాయని అర్చకుడు కాళ్లకూరి సాయి సూర్య సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. – తాళ్లపూడి -
ఘనంగా శ్రావణ పౌర్ణమి పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శనివారం శ్రావణ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ, జంధ్యాల పౌర్ణమిని పురస్కరించుకుని పీఠంలోని విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామాలతో అర్చన చేశా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు పీఠంలో అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. పీఠానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం పీఠంలోని భక్తులకు విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. -
శృతి తప్పిన రుతురాగం
48 మండలాల్లో వర్షాభావం ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు జిల్లాలో ఇప్పటి వరకు లోటు వర్షమే కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో సగటు కన్నా 22.65 మిల్లీ మీటర్లు, కాకినాడ జిల్లాలో 22.19 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లాలో 32.75 మిల్లీమీటర్ల వర్షం పాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది కోనసీమలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అడపాదడపా వర్షాలు పడుతున్నా భారీ వర్షానికి జిల్లా వాసులు ముఖం వాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తం మూడు జిల్లాలో 62 మండలాలు ఉండగా, ఏకంగా 48 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలో 19 మండలాలు ఉండగా, 13 మండలాల్లో లోటు వర్షం పడింది. కాకినాడ జిల్లా 21 మండలాలకు 14 మండలాల్లో లోటు వర్షం కురవగా, కోనసీమ జిల్లాలో 22 మండలాలకు ఏకంగా 21 మండలాల్లో వర్షాభావం నెలకొంది. కోనసీమ జిల్లాలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. రెండు మూడేళ్లుగా ఒక్క ఆగస్టు మినహా జూన్ నుంచి అక్టోబరు నెల వరకు సగటు కన్నా అధిక వర్షం నమోదు కావడం గమనార్హం. ● ఉమ్మడి తూర్పుపై నైరుతి శీతకన్ను ● 48 మండలాల్లో లోటు వర్షం నమోదు ● ఖరీఫ్కు అడుగడునా అవాంతరం ● 5.97 లక్షల ఎకరాల ఆయకట్టులో 4.56 లక్షల ఎకరాలలోనే సాగు ● గోదారి నీటి రాక సైతం అరకొర ● గత ఏడాది ఈ సమయానికి 1,895 టీఎంసీల ఇన్ఫ్లో ● ఈ ఏడాది వచ్చింది 937.420 టీఎంసీలే సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు రాకుండానే.. మే నెలలో మండు వేసవిలో వర్షాలు కురిశాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు, ప్రజలు ఆశించారు. కానీ వానచుక్క జాడ లేదు. గోదావరికి జూలై నెలలో అరుదుగా వరద వస్తోంది. ఇలా వచ్చిన ఏడాది ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు రావడం పరిపాటి. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా జూలైలో గోదావరికి రెండుసార్లు వరద పోటు తగిలినా పెద్దగా ఇన్ ఫ్లో లేకుండా పోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ఉరవడి తగ్గిపోయింది. ఇక రైతుల ఆశల పంట ఖరీఫ్ మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. గోదావరి డెల్టాలోనే నీరందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఉమ్మడి తూర్పులో వర్షం జాడ లేకుండా పోయింది. జూన్, జూలై నెలలతో పాటు ఆగస్టు నెలలో ఇప్పటి వరకు లోటు వర్షం నమోదైంది. వారంలో ఒక రోజు ఒక మోస్తరు వర్షం కురిస్తే మిగిలిన ఆరు రోజులు వేసవిని తలపిస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల దాటికి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకొరగానే గోదావరి నీరు.. ఈ ఏడాది గోదావరి ఇన్ ఫ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సగం కూడా ఇన్ ఫ్లో లేదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ నాటికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 1,895.571 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి డెల్టాలో మూడు ప్రధాన కాలువలకు 47.465 టీఎంసీలు నీరు విడుదల చేయగా సముద్రంలోకి 1,848.106 టీఎంసీల మిగులు జలాలను వదిలారు. ఇదే రోజు మూడు డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, సముద్రంలోకి 7,33.886 క్యూసెక్కుల నీరును విడిచి పెట్టారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 937.420 టీఎంసీల ఇన్ ఫ్లో నమోదైంది. దీనిలో 61.33 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేయగా 876.087 టీఎంసీలు సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం పంట కాలువలకు 14,700 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 1,18,480 క్యూసెక్కుల మిగులు జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గత ఏడాది జులై నెలలో భారీ వరద చోటు చేసుకోగా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనూ గోదావరికి పెద్ద వరదలు వచ్చాయి. ఇన్ ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది రబీకి ఢోకా లేకుండా పోయింది. కానీ ఈ ఏడాది జూలై నెలలో రెండుసార్లు గోదావరి స్వల్ప వరద మాత్రమే వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రబీకి నీటి ఎద్దడి తప్పదని రైతులలో ఆందోళన నెలకొంది. మానవ విధ్వంసం వల్లే వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరు లు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయువ్యంగా రావాల్సిన మే ఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీని వల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడడం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షా లు రావాలంటే సముద్ర ఉష్ణోగ్రతలలో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతు పవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడడం లేదు. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు, అమలాపురం నింగికీ నేలకీ ఉమ్మడి అతిథులు మేఘమాలలు. భూమ్యాకాశాల పలకరింపులు బాగున్నపుడు ఉబ్బి తబ్బిబ్బై ఎంతో ఆర్థ్రతతో చక్కని చిరునవ్వలు చిందిస్తూ చిటపటమంటూ చినుకులను చిమ్మేస్తాయి. అచ్చు మన ఇంటికి వచ్చిన అతిథులకు మనం ఇచ్చే ఆతిథ్యం నచ్చినపుడు ఎంతో సంతోషంతో సుఖీభవ అని ఆశీర్వదించి సెలవుతీసుకున్నట్టు. అదే ఏ మనస్పర్థలో వచ్చి ఆ ఇంటి వారు ఎడమొహం పెడమొహంగా ఉంటే ఏ అతిథైనా ఎప్పుడు వెళ్లిపోదామా అని ఎదురుచూస్తుంటాడు. ఇదే వాతావరణం భూమ్యాకాశాలు, మేఘమాలల మధ్య సాగుతోంది. రుతు గమనాలు మారిపోవడం.. భూగతులు క్రమం తప్పడం.. ఇందుకు పుడమి పుత్రులు చాలా వరకు కారణం కావడం.. వగైరా వగైరా. బిడ్డలకు క్రమశిక్షణ నేర్పాలనుకుంటున్నాయో ఏమో.. సకాలంలో మేఘాలు వర్షించక.. వర్షించిన కాలం పంటలకు అకాలమై నిలదొక్కుకోలేక.. అసలు ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఆకాశంవైపు చూస్తున్నాడు అన్నదాత. నీ తప్పిదానికి నాది బాధ్యత కాదన్నట్టు మేఘాలు ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా సాగులో అస్థిరత ఏర్పడుతోంది. మందకొడిగా ఖరీఫ్ కోనసీమతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ నత్తనడకన సాగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలలో మొత్తం 5,97,847 ఎకరాలలో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,56,067 ఎకరాలలో మాత్రమే నాట్లు పడడం గమనార్హం. అంటే మొత్తం సాగులో 76 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. కోనసీమ జిల్లాలో 1,63,999 ఎకరాలకు 1,23,117 ఎకరాల్లో (70 శాతం) నాట్లు పడగా, తూర్పుగోదావరి జిల్లాలో 1,99,867 ఎకరాలకు 1,74,638 ఎకరాలలో (87 శాతం), కాకినాడ జిల్లాలో 2,33,981 ఎకరాలకు 1,58,312 ఎకరాలు (67 శాతం) మాత్రమే నాట్లు వేశారు. కాకినాడ జిల్లాలో ఏలేరు, పంపా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)తోపాటు పలు ప్రాంతాల్లో ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది. -
వాడవాడల నుంచి వాడపల్లికి..
● వేలాదిగా భక్తజనం రాక ● స్వామివారి ఆదాయం రూ.50.35 లక్షలు కొత్తపేట: కోనసీమ తిరుమల.. ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తజనంతో కిటకిటలాడింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు, వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశాక కోరిన కోర్కెలు తీరిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకస్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకూ వివిధ మార్గాల ద్వారా దేవస్థానానికి రూ. 50,35,081 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్ రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి ఆలయం ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లికి బస్సు సర్వీసులను నడిపింది. -
బాలబాలాజీకి రూ.3.4 లక్షల వెండి వస్తువుల సమర్పణ
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి పాండురంగరాజు, రాణి దంపతులు రూ.3.4 లక్షల విలువైన మూడు కిలోల వెండి వస్తువులను శనివారం సమర్పించారు. దేవాలయంలో నిత్య కై ంకర్యాల కోసం వెండి బిందె, వెండి పళ్లెం, రెండు వెండి దీపం కుందులను వారు అందజేశారు. వాటికి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం అర్చకులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ అభినందించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలి క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ రాజోలు: రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కడలి గ్రామంలో మిరాకిల్ చర్చిలో కోనసీమ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ శ్రావణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాన్వెస్లీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కోనసీమ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఎలా బలోపేతం చేశారో అలాగే వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీన కడలి గ్రామంలో జరిగే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సెల్ అధ్యక్షురాలు ఈద సంధ్య కోరారు. బిషప్ శరత్భూషణ్ వందన సమర్పణ, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని మందపల్లిలో ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని భక్తులు శనైశ్చరా శరణు.. శరణు అంటూ వేనోళ్ల కొలిచారు. శనివారం స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,28,585 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.17,808 రాగా మొత్తం 1,46,393 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. శనైశ్చరుని దర్శించుకున్న సీఐడీ డీఐజీ ఏపీ సీఐడీ డీఐజీ రవిశంకర్ అయ్యర్, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ అడిషనల్ ఎస్పీ మధుసూధనరావు మందపల్లి క్షేత్రాన్ని సందర్శించి శనైశ్చరస్వామి వారికి ప్రత్యేక పూజలు, తైలాభిషేం, శాంతి హోమం జరిపించారు. శృంగార వల్లభుని సన్నిధిలో భక్తుల రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామివారికి రూ.3,10,502 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని సీఆర్డీఏ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు దంపతులు దర్శించుకున్నారు. -
ఒక్క రూమ్ ప్లీజ్
● రత్నగిరిపై జోరుగా పెళ్లి సందడి ● 70 శాతం సత్రాల గదులన్నీ వివాహ బృందాలకు రిజర్వ్ ● మిగిలిన రూము కోసం వీఐపీల సిఫారసులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు అన్నవరం: వివాహ సందడితో రత్నగిరి రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై ఆదివారం, ఈ నెల 17న పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై దాదాపు 600 వసతి గదులుండగా వీటిలో 70 శాతం ఈ ముహూర్తాలకు రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించిన చార్టులు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సత్రం గదుల కోసం కూడా వీఐపీల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క రూమ్ ప్లీజ్ అంటూ పెళ్లి బృందాలు, భక్తులు వెంట పడుతూండటంతో దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో వారికి వసతి గదులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకూ వసతి గదుల కేటాయింపునకు ముగ్గురు సూపరింటెండెంట్లతో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వారు వీఐపీల సిఫారసులు, రిజర్వేషన్, ఖాళీలు, ఇతర వివరాలు పరిశీలించి గదులు కేటాయిస్తారు. శ్రావణం.. పెళ్లిళ్ల సంరంభం : శుభప్రదమైన శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి రోజూ కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులు సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ శ్రావణంలో సత్యదేవుని సన్నిధిలో ఇప్పటికే 200కు పైగా వివాహాలు జరిగాయి. గత నెల 25వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కాగా 26 నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కో ముహూర్తంలో 40 నుంచి 50 వివాహాలు జరిగాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై 100 వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకూ రత్నగిరిపై అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ప్రధానంగా 10, 11, 13, 14, 15, 17 తేదీల్లో రత్నగిరిపై సత్రం గదుల్లో దాదాపు 70 శాతం, వివాహ మండపాలన్నింటినీ పెళ్లి బృందాలు గత నెలలోనే రిజర్వ్ చేసుకున్నాయి. ఆ ముహూర్తాల్లో ఆలస్యంగా వివాహాలు నిర్ణయించుకున్న పెళ్లి బృందాల వారు గదులు, వివాహ మండపాలు లభ్యం కాక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ వివాహాలన్నీ ఏ వివాదాలూ లేకుండా సజావుగా జరిగితే అదే పదివేలనుకునే పరిస్థితి దేవస్థానంలో నెలకొంది. సత్యదేవుని దర్శించిన 50 వేల మంది శ్రావణ పౌర్ణమి పర్వదినం, రెండో శనివారం సెలవు కావడంతో రత్నగిరికి భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. సుమారు 50 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. భక్తులు, నవదంపతులతో వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. రూ.2 వేల వ్రత మండపాలు చాలకపోవడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఘనంగా ప్రాకార సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై ఊరేగిస్తారు. రూ.2,500 టికెట్టుతో ఈ రథ సేవలో భక్తులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. -
వేలం... కూటమి గాలం
ఫ నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా ఫ కూటమి నేతల ఒత్తిళ్లతో ఖరారు కాని వైనం ఫ నచ్చిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం తొండంగి: వేలం నిర్వహించకుండా కూటమి గాలం వేసింది.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమకు నచ్చిన వారికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంది.. సత్రం భూముల కౌలు వేలాన్ని మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ రైతులను తిప్పించుకుంటోంది.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న నాళంవారి సత్రం దాతల ఆశయాలకు కూటమి పార్టీ నేతల ఒత్తిడితో దేవదాయ, ధర్మదాయశాఖ యంత్రాంగం తూట్లు పొడుస్తుంది. రాజమహేంద్రవరం నాళంవారి సత్రంలో శుక్రవారం నిర్వహించిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలాన్ని అధికారులు మళ్లీ వాయిదా వేయడంతో కౌలు వేలం కోసం వెళ్లిన రైతులంతా నిరాశగా వెనుదిరిగారు. ఒకపక్క ఖరీఫ్ సాగు కాలం ప్రారంభమైనా భూములకు కౌలు వేలం పూర్తి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాళంవారి సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమి శృంగవృక్షంలో ఉంది. ఈ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహించగా వచ్చిన ఆదాయంతో సత్రం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాగా ఈ ఏడాది కౌలు కాలం ముగియడంతో ఏప్రిల్లో దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు, సత్రం అధికారులు కలసి శృంగవృక్షం పంచాయతీ కార్యాలయంలో కౌలు వేలం ప్రక్రియ నిర్వహించారు. పాత బకాయిల వసూళ్ల సాకుతో కౌలు వేలాన్ని వాయిదా వేశారు. మళ్లీ జూలై 23న రాజమహేంద్రవరం నాళం వారి సత్రం కార్యాలయంలో కౌలు వేలం నిర్వహించారు. 268.64 ఎకరాలకు సంబంధించి 13 బిట్లుగా కౌలు వేలం నిర్వహించగా, మొదటి బిట్టు 27.19 ఎకరాలకు శృంగవృక్షంకు చెందిన రైతు యనమల నాగేశ్వరరావు రూ.3.68 లక్షలకు హెచ్చుపాటగా కౌలు ఖరారు చేసుకున్నారు. అదేవిధంగా రెండో బిట్టుగా 25.85 ఎకరాలకు మరో రైతు అమృత లోవబాబు రూ.5.01 లక్షలకు హెచ్చుపాటగా వేలం ఖరారు చేసుకున్నారు. కాగా మిగిలిన బిట్లు వేలం నిర్వహించగా, వేలానికి వచ్చిన రైతులు వేలం స్థలం నుంచి వెళ్లిపోయారంటూ అధికారులు మిగిలిన 11 బిట్లుకు కౌలు వేలాన్ని వాయిదా వేశారు. తిరిగి శుక్రవారం వేలం నిర్వహిస్తున్నట్టు శృంగవృక్షంలో రైతులకు తెలియడంతో వేలంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం నాళంవారి సత్రానికి కొద్దిమంది రైతులు వెళ్లారు. అక్కడకు వెళ్లిన రైతులకు కౌలు వేలం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో నిరాశగా వెనుతిరిగారు. తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతలు అధికారులకు ఫోన్లు చేయడంతోనే కౌలు వేలాన్ని వాయిదా వేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల తొండంగిలో పిఠాపురం శ్రీసంస్థాన సత్రం భూముల కౌలు వేలం ప్రక్రియను కూడా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో పోలీసుల బెదిరింపులతో తమకు నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టేందుకే కూటమి నేతల ఒత్తిళ్లతో సత్రం ఆదాయానికి గండికొడుతూ అధికారులు పలుమార్లు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంట కాలం ప్రారంభం కావడంతో కౌలు వేలం ఖరారు కాకపోవడంపై మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా శృంగవృక్షంలోనే సత్రం అధికారులు కౌలు వేలాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
విద్యుత్ తీగలపై పడి యువకుడి మృతి
యానాం: స్థానిక గౌతమీ గోదావరి రాజీవ్ రివర్ బీచ్ వద్ద ఉన్న కూనపురెడ్డి కాంప్లెక్స్లో లాడ్జిపై భాగం నుంచి గురువారం అర్ధరాత్రి విద్యుత్ తీగలపై పడిన యువకుడు మృతి చెందినట్లు ఎస్సై పునీత్రాజ్ తెలిపారు. మృతి చెందిన యువకుడు ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామ నివాసి చింతా గురుమూర్తి (22)గా గుర్తించామన్నారు. మృతుడు ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడని వివరించారు. అర్ధరాత్రి వేళ విద్యుత్ తీగలపై యువకుడు పడి ఉన్నాడని సమాచారం అందడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అక్కడకు వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. యానాం పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బందికి ఆయన సమాచారం అందించారు. వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. ముగ్గురు యువకులు గురువారం రాత్రి లాడ్జిలో దిగి మద్యం తాగారన్నారు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. యానాం జీజీహెచ్కు మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పునీత్రాజ్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
మారేడుబాకలో గంజాయి కలకలం
కపిలేశ్వరపురం (మండపేట): మారేడుబాకలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. మండపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న మారేడుబాకలోని ఖాళీ స్థలంలో యువకులు గంజాయి తాగుతున్నారన్నారంటూ గురువారం పట్టణ పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఎన్.రాము తన సిబ్బందితో కలసి దాడి చేశారు. మారేడుబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను, అనపర్తి మండలానికి చెందిన ఒక యువకుడిని, మండపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 300 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచగా రిమాండ్ విధించినట్టు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. బాలికను రాజమహేంద్రవరం డీపీఓ జువైనల్ హోమ్లో హాజరు పరిచామన్నారు. -
రత్నగిరిపై సీఎన్జీ కారు దగ్ధం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హరిహరసదన్ సత్రం వద్ద నిలిపి ఉంచిన సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) కారు దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుంచి గురువారం అర్ధరాత్రి ఆ కారులో వచ్చిన భక్తులు కారును హరిహరసదన్ సత్రం ఎదురుగా నిలిపి ఉంచి ఆ సత్రంలో బస చేశారు. అయితే వారు నిలిపిన అర గంటలోనే కారు నుంచి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. అగ్నినిరోధక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ నిమిషాల వ్యవధిలో కారు కాలిపోయింది. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ కారు పక్కన నిలిపి ఉంచిన ఇతర కార్ల యజమానులను అప్రమత్తం చేసి ఆ కారుకు దూరంగా పెట్టించారు. ఓ కారు యజమాని అందుబాటులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది కారు అద్దాలు బద్దలు కొట్టి ఆ కారు హేండ్ బ్రేక్ తీసి దానిని దూరంగా నెట్టారు. అయితే దగ్ధమవుతున్న కారు వేడికి ఆ కారు కూడా కొంతమేర పాడైంది. కాగా, ఖమ్మం నుంచి సుమారు ఏడు గంటల పాటు కారును ఎక్కడా ఆపకుండా నడుపుతూ రావడంతో కారు వేడెక్కి నిలిపిన వెంటనే మంటలు చెలరేగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భీమేశ్వరాలయ ప్రధాన అర్చకుడి మృతి
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ కళ్లేపల్లి ఫణికుమార్ (83) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు ఒక కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుందరి ఉన్నారు. ఆయన మృతికి సంతాపంగా భీమేశ్వరాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేశారు. ఆయన మృతికి ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ అర్చకులు కళ్లేపల్లి విశ్వప్రకాశ్, జుత్తుక శ్రీకాంత్, పురోహితులు దొంతుర్తి శ్రీరామచంద్రమూర్తి, మేడవరపు శ్రీనివాస చింతామణి, ఆర్యవైశ్య సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి చెరుకు బాబూరావు, దేవాలయ వైదిక బృందం, ఆలయ సిబ్బంది తమ సంతాపాన్ని తెలియజేశారు. మెట్లపై నుంచి జారిపడి తాపీమేస్త్రి మృతి అల్లవరం: మండలంలోని బెండమూర్లంక గ్రామంలో యాళ్ల వెంకట రామ్మోహనరావుకు చెందిన నూతన గృహ నిర్మాణ పనులు చేస్తుండగా తాపీమేస్త్రి ముత్యాల వీరన్నబాబు (47) ప్రమాదవశాత్తు శుక్రవారం జారిపడి మృతి చెందాడు. అల్లవరం ఎస్సై బి.సంపత్కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం ఇంటి పనులు చేస్తుండగా మెట్లపై నుంచి జారిపడి తాపీమేస్త్రి వీరన్నబాబు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతనితో పనిచేస్తున్న సహచర కూలీలు వీరన్నబాబును హూటాహూటిన అమలాపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు ముత్యాల సాయి పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. -
శాస్త్రచికిత్సలు..
ఫ ప్రసవాలకూ ముహూర్తాలు ఫ ఎప్పుడు పుట్టాలో నిర్ణయిస్తున్న కుటుంబ సభ్యులు ఫ 16 నెలల కాలంలో 74 శాతం సిజేరియన్లు ఫ ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యారోగ్యశాఖ రాయవరం: పంతులు గారూ.. మా పాపకు 9వ నెల వచ్చిందండి. శస్త్రచికిత్స చేయించడానికి మంచి ముహూర్తం పెడతారా.. అంటూ తల్లిదండ్రులు పురోహితులను అడుగుతున్నారు. సాధారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకూ ముహూర్తాలు చూపించడం సహజం. ఇప్పుడు ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టించుకునే రోజులు దాపురించాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో చిన్న సమస్య వచ్చినా తట్టుకునే గుణం తగ్గిపోయింది. అందుకే పిల్లలకు జన్మనివ్వడంలోనూ కొందరు నొప్పిని భరించలేకపోతున్నారు. మరికొందరు జాతకాల పిచ్చితో మంచి ముహూర్తం పెట్టించుకుని మరీ కాన్పులకు సిద్ధపడుతున్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఫలితంగా తల్లులు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఒత్తిడికి గురిచేస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ మంది ముహూర్తపు కాన్పులే చేయించుకుంటున్నారు. రోజు, తేదీ, సమయం వంటివి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. వైద్యులు సాధారణ కాన్పుల కోసం ప్రయత్నిస్తున్నామంటే... ఏమైనా అయితే మీదే బాధ్యతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వైద్యులు వారి ఒత్తిడికి తలొగ్గుతున్నారు. అవగాహన లోపం.. పిల్లలకు శాపం సిజేరియన్ల కారణంగా పిల్లలు ముర్రుపాలకు దూరమవుతున్నారు.. తల్లికి మత్తు సూది ఇస్తారు కాబట్టి పాలు పట్టకూడదన్న అపోహతో దూరం చేస్తున్నారు. పుట్టిన వెంటనే అనారోగ్య సమస్యల కారణంగా శిశువును ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చినప్పుడు మొదటిసారి పాలు అందడం లేదు. సాధారణం అయితే పుట్టిన గంటలోపు, సిజేరియన్ అయితే రెండు గంటల్లోపు ముర్రుపాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు జీర్ణాశయాంతర వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. నవజాత శిశువు మరణాలను తగ్గిస్తుంది. కేవలం 34 శాతం మంది శిశువులు మాత్రమే మొదటి గంటలో ముర్రుపాలు తాగుతున్నారు. ఏ రోజో నిర్ణయించుకుని.. ఈ రోజుల్లో ఎక్కువ మంది ముహూర్తపు ప్రసవాలకే ప్రాధాన్యమిస్తున్నారు. రోజు, సమయం, స్థలంతో పాటు అనస్థీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులే నిర్ణయిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు, లేదంటే ఎవరిదైనా పుట్టిన రోజు, పెళ్లి రోజు, లేకుంటే పురోహితుడు నిర్ణయించిన సమయం కచ్చితంగా పాటిస్తున్నారు. దీనివల్ల సీసెక్షన్లు పెరిగాయి. దీనిని సిజేరియన్ డెలివరీ ఆఫ్ మెటర్నల్ రిక్వెస్ట్ (సీడీఎంఆర్) అంటారు. ప్రసవాలు చేయడానికి సంబంధించిన నిబంధనల్లో ఇది లేకున్నా ప్రస్తుతం సాధారణమైంది. దీంతో పాటు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు ఓపిక తగ్గిపోతుంది. గర్భిణికి నొప్పులు రాగానే సర్జరీ చేయాలని చెబుతున్నారు. సాధారణ కాన్పు కావాలంటే ఓపిక అవసరం. సాధారణ ప్రసవానికి సుమారు 24 గంటలు పడుతుంది. గర్భసంచి ముఖద్వారం 0–10 సెంటీమీటర్లు తెరుచుకుంటేనే బిడ్డ బయటకొస్తుంది. ఈ లోపు కుటుంబ సభ్యులు ఓపిక పట్టలేకపోతున్నారు. తద్వారా సర్జరీ చెయ్యాల్సిన అవసరం తలెత్తుతోంది. పీనట్ బాల్, రౌండ్ బాల్, కివీ వాక్యూమ్ పంప్ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి సాధారణ కాన్పులు చేసేందుకు వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు పాటించాలి సాధారణ ప్రసవాలకు అధిక సంఖ్యలో గర్భిణులు అంగీకరించడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. దీనికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో వేచిచూసే ధోరణి లేకపోవడం ప్రధాన కారణం. సిజేరియన్ కోసం డాక్టర్లపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకు వస్తున్నారు. –డాక్టర్ ఎస్.ప్రవీణ్, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, రామచంద్రపురం మొదటి నుంచీ అవగాహన అవసరం సాధారణ ప్రసవాలు పెరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ినేటి కాలంలో పురిటి నొప్పులు భరించేందుకు గర్భిణులు సిద్ధంగా ఉండడం లేదు. గర్భం దాల్చినప్పటి నుంచే తల్లిదండ్రులు ఏ పనులు చెయ్యనివ్వడం లేదు. తొమ్మిదో నెల వరకూ చిన్న చిన్న ఇంటి పనులు చేసుకోవడం మంచిది. పురిటి నొప్పులు భరించగలిగేలా మొదటి నుంచీ అవగాహన కల్పిస్తే మంచిది. –పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్, సీహెచ్సీ, మండపేట ఒత్తిడి అధికమైతే.. సాధారణ ప్రసవాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చేలా చూస్తున్నాం. చిన్న వయసులో గర్భం దాల్చిన వారు నొప్పులు తట్టుకోలేక సిజేరియన్కే మొగ్గు చూపుతున్నారు. సాధ్యమైనంత వరకూ సాధారణ ప్రసవాలు చేయడానికి చూస్తున్నాం. గర్భిణి, వారి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమైతే ఏరియా ఆస్పత్రికి పంపిస్తుంటాం. –సీహెచ్ రమ్మశ్రీ, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరం కారణాలు ఎన్నో.. సిజేరియన్లు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. రక్తహీనత, నెగిటివ్ రక్త గ్రూపు ఉండటం, ఇతర సమస్యలతో బాధపడుతున్న గర్భిణులను పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అప్పుడు కచ్చితంగా సిజేరియన్ చేయడం తప్ప మరో మార్గం ఉండడం లేదు. అదే సందర్భంలో మొదటిసారి కాన్పు కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారిలో తక్కువ స్థాయిలో సిజేరియన్లు చేస్తున్నారు. సిజేరియన్లదే సింహభాగం 16 నెలల కాలంలో సిజేరియన్లదే సింహభాగం. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకూ కోనసీమ జిల్లాలో 22,094 డెలివరీలు జరగ్గా, ఇందులో 16,409 (74 శాతం) సిజేరియన్లేనని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 5,685 మందికి (26 శాతం) మాత్రమే సాధారణ కాన్పులు జరిగాయి. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రాజోలు: ఇంట్లో వారు ఊరు వెళ్లారని తెలుసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ములికిపల్లిలోని ఓ ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలోని రూ.ఐదు లక్షలు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. రాజోలు సీఐ నరేష్కుమార్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 7న ఇంటి యజమాని కట్టా వెంకటలక్ష్మి తమ బంధువుల ఇల్లు ఏలూరుకు వెళ్లారు. 8వ తేదీ ఉదయం పని మనిషి ఇంటి వాకిలి శుభ్రం చేసేందుకు రాగా, ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వెంటనే ఆ సమాచారాన్ని వెంకటలక్ష్మికి ఫోన్లో తెలిపింది. ఏలూరు నుంచి వెంకటలక్ష్మి వచ్చి చూసేసరికి ఇంట్లోని బీరువాను పగలకొట్టి, అందులో ఉన్న రూ.ఐదు లక్షలు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజోలు సీఐ నరేష్కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. -
పులివెందుల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయం
అల్లవరం: పులివెందులలో ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్ సీసీ శ్రేణులపై దాడులకు తెగబడుతుందన్నారు. పార్టీ సానుభూతిపరుల ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేస్తూ అరాచకాలు చేస్తుందని అనురాధ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పోలీసులను అధికార దుర్వినియోగానికి వాడుకుంటూ, ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసి పోలింగ్ కేంద్రాలను ఉన్న పళంగా మార్చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగల్లో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. పులివెందుల ప్రజలు మేల్కొని కూటమి అభ్యర్థిని జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడించాలని ఆమె కోరారు. -
గొప్పలు కాదు.. సాధించిన పనులు చెప్పండి
అమలాపురం టౌన్: గొప్పలు చెప్పడం కాకుండా గడిచిన 14 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్రం నుంచి ఇప్పటి వరకూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్ని నిధులు తెచ్చారో, ఏం పనులు చేశారో వెల్లడించాలని జనసేన పార్టీ నేతలను వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ప్రశ్నించారు. అమలాపురంలో కిషోర్ శుక్రవారం మాట్లాడుతూ ముఖ్యంగా పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ ప్రశ్నకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టడం, తదితర అభివృద్ధి పనులకు కొనసాగింపుగా కేంద్రం నుంచి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రిని ఒప్పించి ఏ మేరకు నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్కల్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఇప్పటికై నా పొగడ్తలు ఆపి వాస్తవాలు మాట్లాడాలని జనసేన నేతలకు కిషోర్ సూచించారు. రెవెన్యూ శాఖలో ఏడుగురికి డిప్యుటేషన్లుఅమలాపురం రూరల్: పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్ల క్యాడర్లో పనిచేస్తున్న వారికి డిప్యుటేషన్లు వేశారు. కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశాల మేరకు ఏడుగురికి డిప్యుటేషన్లు నియమిస్తూ ఇన్చార్జి డీఆర్ఓ, ఆర్డీవో కొత్త మాధవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముమ్మిడివరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న జయకుమారిని అమలాపురం ఆర్డీఓ కార్యాలయ డీటీగా, కాట్రేనికోన డిప్యూటీ తహసీల్దార్ ఐ.జగదీష్ను ముమ్మిడివరం డీసీఎస్ఓకు వేశారు. పోలవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న వి.రవికిరణ్ను కాట్రేనికోనకు వేశారు. ముమ్మిడివరంలో (రీ–సర్వే) విభాగం డిప్యూటీ తహసీల్దార్ జి.లలితను ఉప్పలగుప్తంకు, ఉప్పలగుప్తం డిప్యూటీ తహసీల్దార్ జీవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యంను అయినవిల్లికి, ముమ్మిడివరం సీనియర్ అసిస్టెంట్ ఎం.దుర్గాశ్రీనివాస్ను రాజోలు డీటీగా వేశారు. వారాహిగా వనదుర్గమ్మఅన్నవరం: రత్నగిరిపై వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారు వారాహిమాత అలంకరణలో కనువిందు చేశారు. రెండు చేతుల్లో శంఖు చక్రాలు, మరో చేతిలో శూలం ధరించి మరో చేయి అభయహస్తంగా చూపుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహజపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణలు నిర్వహించారు. -
సాగుకు పంటగెక్కడ!
జిల్లాలో 2025–26లో మండలాల వారీగా ఖరీఫ్ సాగు కనీస మద్దతు ధర లేక.. వరి ధాన్యానికి కేంద్రం ఇస్తున్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గోదావరి డెల్టాలో గిట్టుబాటు కావడం లేదు. ధాన్యానికి కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,369గా ఉంది. రూ.మూడు వేలు ఉంటే పెట్టుబడులు వస్తే గొప్ప. మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం దెబ్బతింది. తొలకరి సాగు అంటే జూదంగా మారిపోయింది. రెండో పంటకు నీరు అందడం గగనమైంది. సాగు సమ్మె తరువాత రైతులు డెల్టాలో తొలకరి సాగు చేయడం పెద్దఎత్తున మానేస్తున్నారు. – కొవ్వూరి త్రినాథ్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామచంద్రపురం సాగు చేస్తే నష్టపోతున్నాం నేను సుమారు పదెకరాల్లో వరి పండించేవాడిని. పదేళ్ల కిందటి వరకూ సార్వా, దాళ్వా పంటలతో పాటు అపరాలు వేసేవాడిని. ఇప్పుడు సాగు చేసే పరిస్థితి లేక సేద్యానికి స్వస్తి పలికాను. రాజోలు దీవిలో మురుగునీటి కాలువకు ఇరువైపులా ఆక్వా చెరువులు తవ్వేశారు. పంట కాలువలో సాగునీరు పారడం లేదు. మురుగునీటి కాలువల ద్వారా ముంపునీరు దిగే అవకాశం లేకుండా పోయింది. సాగు చేస్తే నష్టపోతున్నాం. – వీరా గోపాలకృష్ణ, ఉయ్యూరువారిమెరక, సఖినేటిపల్లి మండలం సాక్షి, అమలాపురం: రైతు పండించిన పంట ఊరిలోకి రాగానే పండగ మొదలయ్యేది.. సార్వా చేతికి వచ్చిన తర్వాత వరసగా దసరా.. దీపావళి వస్తోంది. దాళ్వా ధాన్యం ఇళ్లకు చేరిన తర్వాత సంక్రాంతి పండగలతో ప్రతి గ్రామం కళకళలాడుతోంది. అటువంటిది ఇప్పుడు రైతు సాగుకు పూనుకోవడమే పండగ అయ్యింది. ఏడాదికి రెండు పంటలు వరి, మూడో పంట అపరాలతో సస్యశ్యామలంగా ఉండే డెల్టా భూముల్లో, ఇప్పుడు ఒక పంటే గగనం అవుతోంది. ప్రధాన పంట వరి పండినా గిట్టుబాటు కాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం వంటి కారణాలతో రైతులు ఆ సాగుకు దూరమవుతున్నారు. జిల్లాలో 2010లో వరి ఆయకట్టు 2,84,742 ఎకరాలు కాగా, ఇప్పుడు ఖరీఫ్లో సాగు లక్ష్యం కేవలం 1,63,399 ఎకరాలు మాత్రమే. అంటే సుమారు 1,21,343 ఎకరాల్లో వరి సాగు లేకుండా పోయింది. 2011లో జిల్లాలో జరిగిన సాగు సమ్మె తరువాత వరి సాగు గణనీయంగా తగ్గిపోతోంది. వరి చేలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, ఉద్యాన పంటలుగా, ఆక్వా సాగుగా మారిపోతున్నాయి. మరికొన్ని చోట్ల రైతులు సాగు చేయకుండా వదిలేస్తున్నారు. మూడొంతులు.. ముక్కచెక్కలు 2010 సమయంలో అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) పరిధిలో అల్లవరం మండలం పూర్తిగా, ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, గోపవరం, చల్లపల్లి, కిత్తనచెరువు, సరిపల్లి, అమలాపురం మండలం వన్నెచింతలపూడి, సమనస గ్రామాలున్నాయి. కాట్రేనికోన డీసీ పరిధిలో కాట్రేనికోన మండలంతో పాటు ఉప్పలగుప్తం మండలంలో మిగిలిన గ్రామాలున్నాయి. ఈ రెండు డీసీల పరిధిలో మొత్తం ఆయకట్టు 53,341 ఎకరాలు ఉంది. ఇప్పుడు వరి సాగు కేవలం 17,795 ఎకరాల్లో మాత్రమే జరుగుతోంది. వరి గిట్టుబాటు కాక రైతులు ఆక్వా సాగు వైపు వెళ్లిపోవడంతో మూడొంతుల సాగు కుదించుకుపోయింది. మాయమై.. దూరమై.. మురమళ్ల, అయినవిల్లి పాత డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో 37,899 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఇప్పుడున్న వరి ఆయకట్టు 21,150 మాత్రమే. ఇక్కడ పొలాలు ఆక్వా చెరువులుగా మారడంతోపాటు అయినవిల్లి, అంబాజీపేట వంటి ప్రాంతాల్లో భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, కొబ్బరి తోటలుగా మారిపోయాయి. ఫలితంగా వరి సాగు దూరమైంది. కొంచెం.. కొంచెంగా తగ్గుతూ.. తూర్పు డెల్టాలోని మండపేట, రామచంద్రపురం, సిరిపురం, ఎర్ర పోతవరం, ఆలమూరు, కోటిపల్లి డీసీల పరిధిలో మొత్తం 1,03,164 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఇప్పుడు 91,584 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే సుమారు 11,580 ఎకరాల ఆయకట్టు తగినట్టు అంచనా. మధ్య డెల్టాతో పోల్చుకుంటే వరి మానేసిన రైతులు ఇక్కడ తక్కువనే చెప్పాలి. ముంపు తీవ్రత తక్కువగా ఉండటం, అధిక దిగుబడులు రావడం వల్ల రైతులు ఇంకా వరి వైపే ఉన్నారు. అయితే కె.గంగవరం, రామచంద్రపురం రూరల్ వంటి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆక్వా పెరుగుతుండడం గమనార్హం. ముందుకు కొనసాగులేక.. రాజోలు, పి.గన్నవరం డీసీల పరిధిలో 2010లో ఆయకట్టు మొత్తం 49,190 ఎకరాలు. కానీ ఇప్పుడు ఆయకట్టు ఎంతో తెలుసా? కేవలం 13,535 ఎకరాలు మాత్రమే. ఇందులో ఒక్క పి.గన్నవరం మండలంలోనే 6,284 ఎకరాలు కావడం విశేషం. అంటే మిగిలిన నాలుగు మండలాల్లో ఆయకట్టు 7,251 ఎకరాలే. ఇందులో మలికిపురం మండలంలో 793 ఎకరాలు, సఖినేటిపల్లి మండలంలో కేవలం 335 ఎకరాలు మాత్రమే. ఈ మండలంలో తొలకరి పంట సాగు చేసే రైతును అబ్బురంగా చూసే పరిస్థితి నెలకొంది. 2010లో మధ్య డెల్టా ఆయకట్టుడీసీ పరిధి వరి ఆయకట్టు (ఎకరాలు) అల్లవరం 23,567 అవిడి 18,291 గోపాలపురం 11,141 కాట్రేనికోన 29,774 మురమళ్ల 22,216 అమలాపురం 17,390 అయినవిల్లి 15,683 పి.గన్నవరం 24,309 రాజోలు 23,129 మొత్తం ఆయకట్టు 1,81,578 తూర్పు డెల్టా (కోనసీమ జిల్లా పరిధిలో) మండపేట 18,018 రామచంద్రపురం 19,679 సిరిపురం 20,284 యర్ర పోతవరం 18,753 ఆలమూరు 14,698 కోటిపల్లి 11,732 మొత్తం ఆయకట్టు 1,03,164 ఆత్రేయపురం 5,048 మండపేట 16,679 రాయవరం 14,667 రామచంద్రపురం 18,526 ఆలమూరు 9,947 రావులపాలెం 5,068 కొత్తపేట 7,833 కపిలేశ్వరపురం 16,052 కె.గంగవరం 15,713 ఐ.పోలవరం 5,811 ముమ్మిడివరం 5,293 అయినవిల్లి 8,291 పి.గన్నవరం 6,284 అంబాజీపేట 3,147 మామిడికుదురు 2,575 రాజోలు 3,548 మలికిపురం 793 సఖినేటిపల్లి 335 అల్లవరం 2,877 అమలాపురం 4,872 ఉప్పలగుప్తం 4,795 కాట్రేనికోన 5,251 ఫ తగ్గిపోతున్న వ్యవసాయం ఫ జిల్లాలో 2.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఫ ఖరీఫ్లో 1.63 లక్షల ఎకరాల్లోనే సాగు ఫ గిట్టుబాటు కాక ముందుకు రాని రైతులు ఫ ముంచేస్తున్న ఆక్వా, మురుగునీటి కాలువలు -
ముడుపు కట్టు.. ముక్క పట్టు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎవరికీ డబ్బులు ఊరకనే రావు అంటుంటారు ఒక నగల వ్యాపారి. కూటమి నేతలకు మాత్రం వద్దంటే డబ్బు వచ్చి పడిపోతోంది ఊరకనే. అందుకు ఎన్నో మార్గాలు. అందులో ఒకటి పేకాట శిబిరాలు. కూటమి నేతల కనుసన్నల్లో ఎన్నో శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులకు మామూళ్లు ముట్టజెబుతూ పేకాట శిబిరాలను అడ్డూ అదుపూ లేకుండా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరో నెల నుంచే పేకాట శిబిరాలతో పేట్రేగిపోతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు కదనరంగంలోకి దిగినప్పటికీ అధికార పార్టీ పెద్దల అండదండలు, నిర్వాహకుల ముడుపుల ముందు అవి దిగదిడుపు అవుతున్నాయి. పేకాట శిబిరాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. పేకాట మోజులో పడి మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. పేకాట డెన్ నిర్వహించాలంటే ముందుగా నియోజకవర్గ ముఖ్యనేతతో బేరం కుదుర్చుకోవాలి. పోలీసులతో నెలవారీ మామూళ్ల లెక్కల్లో మాట్లాడుకోవాలి. ఈ ప్రక్రియ అంతటినీ నియోజకవర్గాల నేతల ముఖ్య అనుచరులు చక్కబెడుతున్నారు. నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా పేకాటను మూడు ఆసులు, ఆరు ఢంకాలుగా నిర్వహిస్తున్నారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్, రాజానగరం, కమలనాథులు ప్రాతినిథ్యం వహిస్తున్న అనపర్తి, టీడీపీ ఏలుబడిలో ఉన్న రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, అమలాపురం తదితర నియోజకవర్గాలతో పాటు పాండిచ్చేరి కేంద్రపాలిత యానాంలో కూడా విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తుని మొదలు కాకినాడ రూరల్ వరకు డజన్ల కొద్దీ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తునిలో రెండు స్థావరాల్లో పేకాట నడుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం సమీపాన ప్రైవేటు రిసార్ట్స్, తుని సాయినగర్లలో వారంలో మూడురోజులు పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో తమ్ముళ్ల కనుసన్నల్లో నడుస్తున్న పేకాట స్థావరాలకు విశాఖజిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం నుంచి జూదప్రియులు క్యూకడుతున్నారు. సాయినగర్లోని ఒక టీడీపీ నాయకుడి ఇంటినే డెన్గా మార్చేసిన విషయం తెలిసినా పోలీసులు అటువైపు తొంగి చూడలేని పరిస్థితి. తమ్ముళ్లకు, పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడంతో పేకాట స్థావరాలకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది. కాకినాడ రూరల్లో రమణయ్యపేట, ఇంద్రపాలెం, రాయుడుపాలెం తదితర ఐదారు ప్రాంతాల్లో పేకాటక్లబ్లు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నేతకు నమ్మినబంట్లైన ఇద్దరు ముఖ్య అనుచరులు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని సమాచారం. ఈ పేకాటడెన్లలో వారం వారం రూ.50 లక్షలు నుంచి రూ.70 లక్షలు లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని కలిపి నెలకు జనసేన ముఖ్యనేతకు రూ.లక్ష ఇచ్చేలా కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి వారంలోనే సరిపెట్టేస్తున్నారు. స్టేషన్కు రూ.50 వేలు ముట్టచెబుతుండబట్టే పోలీసులు అటువైపు కన్నెత్తిచూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గ సరిహద్దు అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. కమలనాథులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని రామవరం కేంద్రంగా పెద్ద పేకాట శిబిరం నడుస్తోంది. రామవరంతో పాటు కుతుకులూరు, పొలమూరు, దుప్పలపూడి, పీరా రామచంద్రపురం, పెడపర్తిలో పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. వీటిలో రామవరం ప్రధాన స్థావరంగా నడుస్తోంది. నియోజకవర్గ ముఖ్యనేత మధ్యవర్తిత్వంతో రామవరం పేకాట డెన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోకులం షెడ్డునే పేకాట శిబిరంగా మార్చేశారు. షెడ్డు నిర్మాణానికి రామవరం గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వగా అధికారులు భయపడి ఎంబుక్ రికార్డు చేయకుండా వదిలేశారు. రామవరం పేకాట శిబిరం అనపర్తి, ద్వారపూడి, రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం, మండపేట, రావులపాలెం, ద్రాక్షారామ తదితర ప్రాంతాల నుంచి వచ్చే జూదగాళ్లతో కిటకిటలాడుతోంది. బ్యాచ్, బ్యాచ్లుగా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా పేకాటాడుతున్నా పోలీసులు కిమ్మనడం లేదు. రామవరం డెన్లో నిత్యం రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల జూదం జరుగుతోందని అంచనా. ముఖ్యనేత ఇంటికి 500 మీటర్ల దూరంలోనే పేకాట శిబిరం నడుస్తుండటంతో పోలీసులు కూడా చూసీచూడనట్టు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడిలో శిబిరం నిర్వాహకుడి ముఖ్యనేత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ప్రధాన అనుచరుడేనని తేలింది. రామవరం శిబిరంలో ముక్కతిప్పిన రోజు లక్షన్నర ముఖ్యనేతకు ముట్టచెబుతున్నారని సమాచారం. టీడీపీ యువనేత వాటా యువనేతకు వెళ్లిపోతోందంటున్నారు. మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో పేకాట స్థావరాలకు కొదవులేకుండా ఉంది. ముచ్చిమిల్లి రోడ్డు, శ్రీ సిటీ, శీలంవారి సావరం, రూరల్లోని చోడవరం, అన్నయ్యపేట, కూళ్ల, మసకపల్లి, పామర్రు తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వీటిలో కూళ్ల, మసకపల్లి, పామర్రు శిబిరాలు అధికార పార్టీ పెద్దల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యనేత అండదండలతోనే పేకాట స్థావరాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, శ్రీరామపురం, మల్లంపూడి, శ్రీరంగపట్నం, మధురపూడి, గాడాల, రఘుదేవపురం, వంగలపూడి, మిర్తిపాడులలో పేకాట శిబిరాలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడి ముఖ్యనేతకు నెలనెలా లక్ష నుంచి లక్షన్నర ముడుపులు మూటగడుతున్నారని ఆనోటా ఈ నోటా వినిపిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పేకాట స్థావరాలు అడ్డూ అదుపులేకుండా నడుస్తున్నా పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నారు తప్ప జూదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఒక లైఫ్, రెండు జోకర్లుగా సాగుతున్న పేకాట శిబిరాలు కాసులు పోగేసుకోవడంలో కూటమి నేతల బిజీబిజీ ముఖ్య నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా తమ్ముళ్ల దందా -
ప్రయాణం.. ప్రయాసం
మలికిపురం: రెండు జిల్లాల మధ్య గోదావరి నదిపై గల దిండి– చించినాడ వంతెనపై రాకపోకలు నిషేఽధించిన ప్రభుత్వం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయింది. సుమారు 3 నెలల పాటు రాకపోకలు నిషేధం అంటూ పదిరోజుల క్రితం ప్రకటించిన అధికారులు విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు. వంతెన మరమ్మతులకు నిధులు కేటాయింపుపై కూడా దృష్టి పెట్టలేదు. సుమారు 20 ఏళ్లుగా ఇక్కడ వంతెనపై రాకపోకలకు అలవాటు పడిన ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని రాజోలు దీవి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో గల విద్యాసంస్థలకు అనేక బస్సులు తిరుగుతున్నాయి. ఈ దీవి నుంచి సుమారు 3 వేలకు పైగా విద్యార్థులు బస్లలో విద్యాసంస్థలకు వెళ్తారు. సుమారు 100కు పైగా బస్లు ఉన్నాయి. అయితే వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో ఆయా విద్యా సంస్థలు బస్లను దిండి వైపే నిలిపి వేస్తున్నాయి. సుమారు 2 కిలోమీటర్ల పొడవు గల వంతెనపై విద్యార్థులు నడుచుకుంటూ చించినాడ వైపు వెళ్తున్నారు. సాయంత్రం కూడా చించినాడ వరకే బస్లు నడుపుతున్నారు. అటువైపు నుంచి విద్యార్థులు నడుస్తునూ ఇవతలి వైపునకు వస్తున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం నడక విద్యార్థులకు భారంగా మారింది. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పట్టించుకోని విద్యాసంస్థలు తేలిక పాటి వాహనాలకు అనుమతి ఉండడంతో ఆయా విద్యాసంస్థలు ఆటోలను ఏర్పాటు చేయవచ్చు. కానీ అలా చేయడంలేదు. ఫీజులు దండీగా వసూలు చేసే ఆయా విద్యాసంస్థలు ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్లు అటువైపు, ఇటువైపు కూడా నిలిపి వేసి ప్రయాణికులకు వంతెనపై నడకే దిక్కు అంటున్నారు. ప్రయివేటు బస్లు కూడా చించినాడ వరకే పరిమితం కావడంతో మలికిపురం, రాజోలు, అమలాపురం నుంచి వచ్చే బస్లు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులను రాజోలు దీవి నుంచి మోటార్ సైకిళ్లపై చించినాడ తీసుకెళ్లవలసి వస్తోంది. ఇక ఉపాధి కోసం అటు నుంచి వచ్చి వెళ్లే కార్మికులు ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వంతెనకు ఇరువైపులా భారీ వాహనాలు, బస్లు నిలిపి ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఽఅధికంగా ఉంది. ఈ కష్టాలు ఎన్నాళ్లు ఉంటాయో అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిండి– చించినాడ వంతెనపై రాకపోకలు నిషేధం ప్రత్యామ్నాయం చూపని అధికారులు విద్యార్థులకు నడక యాతన ట్రక్కుల పైనే కార్మికుల ప్రయాణం ఇంకా మొదలు కాని మరమ్మతులు అంచనాలు కూడా రూపొందించని వైనం విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం దిండి వంతెనపై బస్ల రాకపోకల నిషేధించడం వల్ల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యా సంస్థల బస్లు వంతెన అటు వైపు, ఇటు వైపు నిలిపివేసి వంతెనపై విద్యార్థులను నడిపిస్తున్నారు. ఆటోలు పెట్టి ఇబ్బందులను తొలగించాలి, అధికారులు జోక్యం చేసుకోవాలి. – బూశి జాన్ మోషే, విశ్వేశ్వరాయపురం. -
మట్టి, చెట్లు మాయం
గోపాలపురం: గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొల్లేరు చెరువులో ఉన్న మట్టిని టీడీపీ నాయకులు తరలించడంతో పాటు గట్టుపై ఉన్న అత్యంత విలువైన చెట్లను నరికివేశారు. నీటి సంఘం ముసుగులో తాత్కాలిక తీర్మానం చేసి ఇరిగేషన్ అధికారులకు కనీసం సమాచారం లేకుండా రూ.లక్షా 50వేలకు అమ్ముకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో చెరువులో ఉన్న లక్షలాది రూపాయల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇదంతా టీడీపీ నాయకులు కనుసన్నలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గోపాలపురం మండలంలోని గంగోలు, భీమోలు, నందిగూడెం, జగన్నాథపురం, కరిచర్లగూడెం గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని ఆయా గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గ ముఖ్యనాయకుడికి 70 శాతం వాటాగానూ, మిగిలిన 30శాతం వాటా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు పంచుకొనే విదంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చెరువు మట్టిని తరలించి అమ్ముకున్న సొమ్ము మొత్తం 100 శాతం నియోజకవర్గ ముఖ్య నాయకుడికి అందజేయాలని ఆ తర్వాత మాత్రమే నాయకులకు 30శాతం అందజేస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే మొత్తం 100శాతం అప్పగించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సుముఖంగా లేకపోవడంతో ఇప్పటికే 30 శాతం వాటా సొమ్మును ఆయా గ్రామాల నాయకులు వాడుకున్నారు. ఎన్నికల సమయంలో మా గ్రామంలో ప్రతి కార్యక్రమానికి తమ సొంత సొమ్ము ఖర్చు చేశామని, కనీసం 30శాతం వాటా కూడా ఇవ్వకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మా భాగస్వామ్యం ఉన్నా కనీసం చెరువు అక్రమ మట్టి తవ్వకాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ తెలియజేయడం లేదని ఒక పక్క జనసేన, బీజేపీ నాయకులు మధన పడుతున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ, డీఈ కె.రవీంద్ర, రాహుల్ భాస్కర్లను వివరణ కోరగా చెరువుల్లోని మట్టిని రైతులు తమ పంట పొలాలకు తీసుకెళ్లడానికి అనుమతులు ఇచ్చామని కానీ ఆ మట్టిని ఇటుక బట్టీలకు తరలించినట్లు మాకు సమాచారం రావడంతో నిలుపుదల చేశామన్నారు. బొల్లేరు చెరువు గట్టుపై విలువైన వేప, ఇతర జాతుల చెట్లు నకరడం మా దృష్టికి వచ్చిందని దానిపై జిల్లా ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోపాలపురం బొల్లేరు చెరువులో నీటి సంఘం నిర్వాకం అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్న అధికారులు -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడికి ఖండన
సఖినేటిపల్లి: పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ నెడ్ క్యాప్ డైరెక్టర్ పాటి శివకుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సఖినేటిపల్లిలో ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి, తీవ్రంగా గాయపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బలహీనవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపై దాడిగా పేర్కొంటూ, యావత్ బీసీ కులాలపై జరిగిన దాడిలా భావిస్తున్నట్టు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అన్న ప్రసాద భవనానికి రూ.1.5 లక్షల విరాళం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా కాకినాడకు చెందిన వేల్పూరు మురళీసురేష్ – భువనేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు గురువారం స్వామివారిని దర్శించుకుని, వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.1,50,116 అందజేశారు. రావులపాలేనికి చెందిన మల్లిడి నాగవెంకటఫణికుమార్రెడ్డి – శ్రీలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.27,000 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్తానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. నదీపాయలో పడి మత్స్యకారుడి మృతి అల్లవరం: మండలంలోని ఎన్.రామేశ్వరంలో నదీ పాయలో చేపల వేట సాగిస్తూ కొప్పాడి మహేష్ (36) ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అల్లవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన మహేష్ తన భార్య పుట్టింట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం భార్యతో చెప్పి చేపల వేటకు వెళ్లాడు. ఎన్.రామేశ్వరం బ్రిడ్జికి సమీపంలో నది పాయలో చేపల వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంపత్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని నదీపాయలో ఉన్న మహేష్ మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చి పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంగ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ గురువారం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాంకేతికతతో గిరిజన సంస్కృతి పరిరక్షణ రాజానగరం: మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతీ సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ, ‘స్థానిక ప్రజల కృత్రిమ మేధస్సు – హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తును రూపొందించడం’అనే థీమ్తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని అన్నారు. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో తన 35 ఏళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపై అవగాహన కలిగి ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజనులు వాడుక భాషలో సాహిత్య సేద్యం చేస్తున్నారన్నారు. రాయిలో కూడా దేవుడిని చూడగలిగే నిర్మలమైన మనస్సున్న వారు గిరిపుత్రులని ప్రసన్నశ్రీ అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, సదస్సు కన్వీనర్ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు వరలక్ష్మీ కళ
● బంగారు రూపుల కొనుగోలు చేసిన మహిళలు ● పూలు, పండ్ల దుకాణాల వద్ద రద్దీ అమలాపురం టౌన్: జిల్లాలో వరలక్ష్మీ వ్రతాలను శుక్రవారం ఇంటింటా నిర్వహించేందుకు గృహిణులు గురువారం సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వ్రతాలకు అవసరమైన పూజా సామగ్రిని సమకూర్చుకున్నారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం పట్టణాలతోపాటు ముమ్మిడివరం నగర పంచాయతీ, 22 మండల కేంద్రాల్లో మార్కెట్లు గురువారం లక్ష్మీ కళతో, వినియోగదారుల రద్దీతో కనిపించాయి. మహిళల సౌభ్యాగానికి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో బంగారు దుకాణాలు మహిళా వినియోగదారులతో కిటకిటలాడాయి. మార్కెట్లు వరలక్ష్మీ వ్రత సామగ్రి దుకాణాలతో హడావుడిగా కనిపించాయి. బంగారు రూపు పెట్టుకుని మహిళలు వరలక్ష్మీ వ్రతమాచరిండచం సంప్రదాయం. బంగారు రూపుల కొనుగోలుకు మహిళలు గోల్డ్ మార్కెట్ల బాట పట్టారు. దీంతో బంగారు దుకాణాల్లో గురువారం మహిళా వినియోగదారులే అధికంగా కనిపించారు. పెరిగిన బంగారం ధరలు గత ఏడాదితో పోల్చితే బంగారం ధరలు ఈ ఏడాది మరింతగా పెరిగిన ప్రభావం జిల్లాలోని గోల్డ్ మార్కెట్లపై పడింది. గత ఏడాది ఒక గ్రాము బంగారు రూపు రూ.7 వేలు ఉంటే ఈ ఏడాది అదే గ్రాము రూపు రూ.10 వేలు వరకూ ధర పలికింది. తులం బంగారం రూ.లక్షకు పైగా ధర చేరడంతో గత ఏడాదితో పోల్చుకుంటే బంగారు రూపుల వ్యాపారం అంతంత మాత్రంగానే జరిగిందని అమలాపురం బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. అమలాపురం గోల్డ్ మార్కెట్లో ఉన్న దాదాపు 300 బంగారం దుకాణాల్లో బంగారు రూపుల అమ్మకాలు సాగాయి. పూలు, పండ్లు దుకాణాల్లో అమ్మకాల జోరు వరలక్ష్మీ వ్రతాల కోసం మహిళలు పలు రకాల పూలు, పండ్లు కొనుగోలు చేశారు. బత్తాయి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష పండ్లను కొనుగోలు చేశారు. అమలాపురం మార్కెట్లో అయితే రెగ్యులర్ పండ్ల దుకాణాలతో పాటు శ్రావణ శుక్రవారం కోసం రోడ్ల చెంత అనేక తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. పండ్ల కొనుగోలుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ వెచ్చించారు. పూల కోసమైతే రూ.200 నుంచి రూ.500 వరకూ కేటాయించారు. స్వీటు దుకాణాల్లోనూ రద్దీ కనిపించింది. -
షాపులపైకి దూసుకు వెళ్లిన లారీ
పి.గన్నవరం: ఆర్పీ రోడ్డులో గురువారం తెల్లవారు జామున కోళ్ల లోడుతో వేగంగా వస్తున్న లారీ స్థానిక మూడు రోడ్ల సెంటర్లో షాపులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో టీ స్టాల్ నిర్వాహకుడు మృతి చెందగా, నాలుగు షాపులు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అక్కడ టీ అమ్మకాలు ప్రారంభమైతే ప్రాణ నష్టం ఎక్కువ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వాసంశెట్టి త్రిమూర్తులు (57) కొన్నేళ్లుగా స్థానిక సెంటర్లో వంతెన కింద టీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆక్రమణలు తొలగింపులో భాగంగా అతని టీ స్టాల్ను తొలగించారు. పది రోజుల క్రితం వంతెనకు ఎదురుగా ఉన్న షాపులో టీ స్టాల్ను మళ్లీ ప్రారంభించాడు. గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో టీ స్టాల్ను తెరచేందుకు బరకాలు తొలగిస్తుండగా ఏలూరు నుంచి రాజోలుకు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి షాపులపైకి దూసుకు వచ్చింది. అక్కడే ఉన్న త్రిమూర్తులును లారీ వేగంగా ఢీకొట్టడంతో 20 మీటర్ల దూరంలో రోడ్డుపై ఎగిరిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానిక సీహెచ్కీ తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని 108 అంబులెన్స్లో అమలాపురంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా దారిలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. త్రిమూర్తులు మృతితో భార్య, కుమారులు, బంధువులు భోరున విలపించారు. అతడి మృతికి సంతాపంగా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉదయం పి.గన్నవరంలో షాపులు మూసివేసి బంద్ పాటించారు. త్రిమూర్తులు మృతదేహానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. టీ స్టాల్ నిర్వాహకుడి మృతి నాలుగు షాపులు ధ్వంసం టీ స్టాల్ ప్రారంభమైతే పెద్ద ప్రమాదం జరిగేది స్థానిక మూడు రోడ్ల సెంటర్లో త్రిమూర్తులు టీ స్టాల్ను తెల్లవారు జామున తీస్తారు. ఉదయం వరకూ టీస్టాల్ వద్ద ఎక్కువ మంది నిల్చోని ఉంటారు. షాపు ప్రారంభించిన తర్వాత ఈ లారీ దూసుకు వచ్చుంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. లారీ దూసుకు రావడంతో ఒక కూల్ డ్రింక్ షాపు, టీస్టాల్, వస్త్ర దుకాణం, కాఫీ హొటల్ ధ్వంసం అయ్యాయి. -
నోటిఫై చేస్తేనే లాభసాటి
సాక్షి, అమలాపురం: కొబ్బరి, ఆయిల్పామ్ తోటలలో అంతర పంటగా... అదనపు ఆదాయాన్ని ఇచ్చేదిగా.. అధికంగా ఆకురాల్చే గుణంతో తోటల్లో టన్నుల కొద్దీ సేంద్రియ కర్బనాన్ని అందిస్తూ కోకో సాగు రైతులకు కాసుల వర్షం కురిపించాల్సి ఉంది. కాని అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కోకో గింజలకు ధర దక్కక పోవడం, పంటల బీమా ధీమా లేకపోవడం, పంట నష్టపోతే పెట్టుబడి రాయితీ అందక రైతులు నష్టపోయే పంటగా కోకోకు ముద్రపడి పోయింది. ఉద్యాన పంటలలో లాభసాటి పంటగా ఉండాల్సిన కోకో పంటను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో ఇది నష్టాల పంటగా మారిపోతోంది. కోనసీమ గింజలకు అంతర్జాతీయ డిమాండ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోకో పంట ప్రధాన ఉద్యాన పంటలలో ఒకటిగా మారింది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా రైతులు కోకోను సాగు చేస్తున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో కోకోను సాగు చేస్తున్నారని అంచనా. ప్రపంచంలో నాణ్యమైన గింజలను ఉత్పత్తి చేసే గనా దేశం కన్నా మేలైన గింజలను గోదావరి జిల్లాల రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో తయారయ్యే గింజకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎకరాకు దిగుబడి ఏడాదికి రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు ఉంటుంది. కొబ్బరికి ఇటు ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు కోకో మీద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తోంది. పెట్టుబడులు పోను ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. రెండేళ్ల క్రితం ధర కేజీ రూ.900 వరకు చేరింది ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. అంతకుముందు రూ.160 నుంచి రూ.240 వరకు ఉండేది. ఇటీవల కాలంలో గింజల ధర రూ.400కు తగ్గకపోవడం రైతులకు ఊరట ఇచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర స్థానిక రైతులకు ఎలా ఇస్తారని కొనుగోలుదారులు చెబుతున్నా ఇప్పుడున్న డిమాండ్కు అనుగుణంగా కేజీ గింజలకు గాను కనీసం రూ.500 నుంచి రూ.550 ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నోటిఫై చేయకపోవడం వల్లే కోకో సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన శాఖ పలు రాయితీలు ఇస్తోంది. ఏరియా ఎక్స్పెన్షన్, ఎరువులు అందజేయడం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో గింజలు ఎండబెట్టేందుకు, నాణ్యమైన గింజల ఉత్పత్తికి డ్రెయిర్ల ఏర్పాటు కూడా చేసేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే ఈ పంటను ఉద్యాన పంటగా నోటిఫై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా రైతులు కోరుతున్నా ఫలితం లేకుండా ఉంది. దీనిని ఉద్యాన పంటగా నోటిఫై చేయకపోవడం వల్ల రైతులు పలు విధాలుగా నష్టపోతున్నారు. ప్రైవేట్ కంపెనీ గుత్తాధిపత్యం ఉద్యాన పంటగా నోటిఫై చేసి కేంద్రానికి సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం పలు రకాల పంటలకు ఇస్తున్నట్టుగానే కోకో గింజలకు సైతం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తుంది. ఏటా ఉత్పత్తి వ్యయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఉద్యాన పంటలైన కొబ్బరి, ఆయిల్పామ్కు ఎంఎస్పీ ఉంది. కనీస మద్దతు ధర లేనందున ప్రైవేట్ కంపెనీలు కోకో గింజల ధరలు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయి. గోదావరి జిల్లాలో గింజలను కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో ధరల విషయంలో వారిది గుత్తాధిపత్యంగా మారింది. వర్తించని బీమా కోకో పంటకు బీమా వర్తించడం లేదు. కొబ్బరి, ఆయిల్ పామ్, అరటి, ఇతర ఉద్యాన పంటలకు బీమా ఉంది. కాని కోకోకు బీమా వర్తించడం లేదు. ఈ పంట ఎక్కువగా కోస్తా తీరంలోనే ఉంది. తుపాన్లు, లంక గ్రామాల్లో గోదావరి వరదల వల్ల పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం అందే అవకాశం లేదు. దీనివల్ల రైతులకు సాగు భరోసా లేకుండా పోతోంది. బీమా సౌకర్యం కల్పించాలంటే తప్పనిసరిగా ఈ పంటను ఉద్యాన పంటగా నోటిఫై చేయాల్సిందే. పెట్టుబడి రాయితీ లేదు పంట నష్టపోయిన సమయంలో రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీ (ఇన్ఫుట్ సబ్సిడీ) రావడం లేదు. మిగిలిన పంటలకు ఇన్ఫుట్ సబ్సిడీ ఉన్న విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు వరి, వరదల వల్ల అరటి, కొబ్బరి, కంద, కూరగాయ పంటలు, పవ్వులు, పండ్ల తోటలకు వస్తున్నట్టు కోకో పంటకు పెట్టుబడి రాయితీ రావడం లేదు. ఉద్యాన పంటగా నోటిఫై చేయకుండా కోకో సాగు విస్తీర్ణం కోసం అరకొర రాయితీలు ఇస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్నారు. రైతులకు పలు రకాల ప్రయోజనాలు అందే ఈ పంట సాగు విస్తీర్ణం గోదావరి జిల్లాలో పెద్దగా పెరగడం లేదు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. మరో 20 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ జరుగుతోంది. సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేందుకు అవకాశమున్నా కనీసం పది వేల ఎకరాల్లో కూడా సాగు జరగకపోవడానికి దీనిని నోటిఫై చేయకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు. అప్పుడే మరిన్ని ప్రయోజనాలు కోకో పంటను ఉద్యాన పంటగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి. అప్పుడు రైతులకు పూర్తిస్థాయిలో రాయితీలు అందుతాయి. కనీస మద్దతు ధరకు, పంటల బీమాకు ఒక భరోసా దక్కుతుంది. ఈ పంట మరింత లాభసాటిగా మారితే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. – ముత్యాల జమ్మి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ఎల్త్ మెనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) సభ్యుడు, అంబాజీపేట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా ‘కోకో‘కు అదనపు ఆదాయం ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో సాగు ఒక కంపెనీ కొనుగోలు వల్ల రైతులకు దక్కని గిట్టుబాటు ధర ఉద్యాన పంటగా నోటిఫై చెయ్యని రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోతే రైతుకు దక్కని బీమా.. నష్ట పరిహారం కనీస మద్దతు ధర ప్రకటించలేని పరిస్థితి -
ఆలయాల పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్
– నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఐ.పోలవరం: జిల్లాలో ప్రధాన ఆలయాల పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో పాలక మండళ్ల నియామకాలుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నెం.859 జారీ చేసింది. జిల్లాలో రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం పరిధిలోకి వచ్చి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం పాలకవర్గానికి దరఖాస్తులను ఆహ్వానించింది. జీవో ఆర్టీ నెం.861 కూడా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా పరిధిలో రు.కోటి నుంచి రూ.5 కోట్ల ఆదాయం పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కొత్త పాలకవర్గాల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది అమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ, మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి, మందపల్లి మందేశ్వరస్వామి ఆలయ పాలకవర్గ నియామకాలు చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. ప్రతి ఆలయ పాలక మండలి సభ్యులలో ఒకటి బ్రాహ్మణ, ఒకటి నాయీ బ్రహ్మణ వర్గాలకు కేటాయించారు. ఆలయం ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉంటే ఆ దేవాలయానికి మొత్తం ఏడుగురు సభ్యులను నియమించనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండాల్సి ఉంది. ఓసీ కేటగిరిలో ముగ్గురు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారు, ముగ్గురు బీసీలకు కేటాయించారు. రూ.రెండు లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 9 మంది పాలకవర్గ సభ్యులను నియమించనున్నారు. వీరిలో నలుగురు మహిళలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ, నలుగురు బీసీలు సభ్యులుగా ఉంటారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 11 మంది సభ్యులను నియమించనున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు ఐదు ఓసీ, ఇద్దరు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారు, నలుగురు బీసీలకు ఇచ్చారు. రూ.కోటి నుంచి రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం ఉన్న దేవాలయాలకు సైతం ఇదే విధానాన్ని అవలంబించనున్నారు. రూ.ఐదు కోట్ల నుంచి నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలకు 13 మంది సభ్యులను నియమించనున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఓసీలకు 6 కేటాయించగా, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రెండు, బీసీలకు 5 చొప్పున సభ్యులను కేటాయించారు. రూ.20 కోట్ల ఆదాయం దాటిన ఆలయాలకు 17 మంది సభ్యులను నియమించనున్నారు. ఎనిమిది మంది మహిళలు కాగా, ఎనిమిది మంది ఓసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 9 సభ్యులుగా నియమించనున్నట్టు పేర్కొన్నారు. మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం -
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి
దేవరపల్లి: విశాఖపట్నం నుంచి కరీంనగర్ జిప్సమ్ లోడుతో వెళుతున్న లారీ దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఎదురుగా వస్తున్న గూడ్స్ వాహనాన్ని ఢీ కొని అదుపుతప్పి రోడ్డు పక్కన గల చెరువులోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప డొంకరోడ్డు, ఇందిరానగర్కు చెందిన లారీ డ్రైవర్ తాటిపర్తి శివనాగరాజు(29) లారీ క్యాబిన్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. డ్రైవర్ కుడి చెయ్యి తెగిపడింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం నుంచి కరీంనగర్కు జిప్సమ్(మట్టి) లోడుతో వెళుతున్న లారీ గురువారం తల్లాడ–దేవరపల్లి హైవేలో గోపాలపురం–దేవరపల్లి మధ్య గల గొల్లగూడెం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరొక గూడ్స్ వాహనాన్ని వెనుకు పక్కన ఢీ కొంది. లారీ అతివేగంగా రావడంతో అదుపుతప్పి సమీపంలోని చెరువు గట్టున గల హెచ్టీ విద్యుత్ లైన్ స్తంభాన్ని ఢీ కొని బోల్తాపడింది. ఆ సమయంలో ఎదురుగా రోడ్డుపై ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు మృతి చెందినట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
విద్యార్థి సంఘాల అణచివేతకే ఆ జీవో
అమలాపురం టౌన్: పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకల పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశించకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆ సంఘాల అణిచివేతకు చేసిన కుట్రని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఽశాఖ అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి అన్నారు. అమలాపురంలోని పార్టీ జిల్లా శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెళ్లేది రాజకీయాలకు కాదని, అక్కడి సమస్యల పరిష్కారానికేనని ఆయన గుర్తు చేశారు. విద్యా రంగంలో సమస్యలపై పోరాటాలు చేసే విద్యార్థి సంఘాలపై ఈ నిషేధం పెట్టడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణేనని పేర్కొన్నారు. ఈ జీవో విద్యాభివృద్ధికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూర్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు పితాని బేబీరావు, కొనుకు వెంకటేశ్వరరావు, సాధనాల రామకృష్ణ, యండమూరి శ్రీనివాస్, గానుగుల సత్యనారాయణ పాల్గొన్నారు. నాటు, లైసెన్సు లేని తుపాకులు ఉంటే నేరం రాజమహేంద్రవరం రూరల్: నాటు, లైసెన్స్ లేని తుపాకులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎవరి వద్దనైనా నాటు, లైసెన్సు లేని తుపాకులు, ఇతర మారణాయుధాలు ఉన్నట్టు గుర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎవరి వద్దనైనా ఆయుధాలుంటే వెంటనే వాటిని దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో అందజేయాలని అన్నారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని, అక్రమ మారణాయుధాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి అమానుషం
● బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి ● ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ డిమాండ్ ● అమలాపురంలో జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అమలాపురం టౌన్: బడుగు, బలహీన వర్గాల నేతలపై కూటమి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం దాడులు చేయిస్తూ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గీయులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్లు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల రూరల్ మండలంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాలు దాడి చేసి గాయపరిచిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో అమలాపురం మున్సిపల్ పిల్లల పార్కు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్పై జరిగిన దాడిని పార్టీ జిల్లా బీసీ నేతలు తీవ్రంగా ఖండించారు. రమేష్ యాదవ్తోపాటు ఇటీవల ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ కార్యక్రమాలకు హాజరవుతున్న పార్టీకి చెందిన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావులపై కూటమి ప్రభుత్వ నాయకులు దాడులు చేయడం దారుణమని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారును ధ్వంసం చేయడమే కాకుండా ఆయనపై హత్యాయత్నం చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవగతమవుతోందన్నారు. ఈ ముగ్గురి నేతలపై దాడులకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల నేతలపై కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడుతూ విధ్వంసాలు సృష్టించడం చూస్తుంటే ఈ దాడులు ఆయా సామాజిక వర్గాలపై ప్రభుత్వం కక్ష కట్టి చేస్తున్నట్టు ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరజాకుమారి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దొమ్మేటి సత్య మోహన్, పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నయ్యదాసు, పార్టీ నాయకులు కుడుపూడి భరత్ భూషణ్, భరణికాన బాబు, కుడుపూడి త్రినాథ్, విత్తనాల మూర్తి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ పిల్లల పార్కు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, హైకోర్టు మాజీ న్యాయమూర్తి బీఏ స్వామి విగ్రహాలకు ఎమ్మెల్సీలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
పిఠాపురంలో లారీ చోరీ
పిఠాపురం: ఆయిల్ లోడు లారీ మాయమైన సంఘటన పిఠాపురంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆ లారీ తుని సమీపంలో దొరికినప్పటికీ లారీలో ఉండాల్సిన సుమారు రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ యజమాని కథనం ప్రకారం.. పిఠాపురం కుంతీమాధవస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న డి.అప్పారావు రాజులుకు చెందిన లారీ మంగళవారం ఉదయం కాకినాడలోని ఒక ఆయిల్ కంపెనీలో ఆయిల్ ప్యాకెట్ల లోడుకు వెళ్లింది. సాయంత్రానికి లోడు వేసుకుని అన్లోడ్కు బయలు దేరాల్సి ఉండగా, లారీ డ్రైవర్కు అత్యవసర పని ఉండడంతో లారీ యజమాని మరో తాత్కాలిక డ్రైవర్ను మాట్లాడుతున్నారు. ఆ తాత్కాలిక డ్రైవర్ తాను బుధవారం తెల్లవారుజామున బయలు దేరుతానని చెప్పడంతో లారీని తెచ్చి పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం వద్ద ఉన్న లారీ యజమాని ఇంటి దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నచోట పార్కింగ్ చేశారు. తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి తీసుకునే విధంగా లారీ తాళాలను లారీలోనే పెట్టి ఆ విషయాన్ని డ్రైవర్కు చెప్పి యజమాని తన ఇంట్లో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి చూడగా, లారీ కనిపించకపోవడంతో యజమానితో పాటు చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా లారీ గొల్లప్రోలు వైపునకు వెళ్లినట్టు గుర్తించారు. గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా, మాయమైన లారీ టోల్గేట్ వద్ద ఆగి టోల్ ఫీజు చెల్లించి వెళ్లినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో లోడుతో ఉన్న లారీని శంఖవరం దగ్గర మరో వ్యక్తికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బృందాలుగా లారీ కోసం తుని, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వెతకగా తుని సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన లారీ నిలిపి ఉండడం గమనించారు. అయితే లారీలో ఉండాల్సిన ఆయిల్ ప్యాకెట్టు మాత్రం ఖాళీ అవడాన్ని పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న ఆయిల్ లోడును మరో లారీలోకి ఎక్కించుకుని ఈ లారీని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. బాధిత లారీ యజమాని ఫిర్యాదు మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మణికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయం తుని వద్ద లారీని వదిలి వెళ్లిన అగంతకులు -
పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి
అమలాపురం టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రామ్మోహనరావు జయంతి సందర్భంగా స్థానిక కాటన్ పార్కు వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోనసీమలోని ఆదుర్రు గ్రామంలో జన్మంచిన జక్కంపూడి విద్యార్థి నాయకుడిగా రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, పార్టీ లీగల్ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు సరెళ్ల రామకృష్ణ, కల్వకొలను ఉమ తదితరులు జక్కంపూడికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ నివాళి స్థానిక కాటన్ పార్కు రోడ్డులోని మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి ప్రజా పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–క్రాప్ జాబితాలో కోకోను చేర్చాలి
అంబాజీపేట: కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తున్న కోకోను ప్రభుత్వం ఈ– క్రాప్ జాబితాలో చేర్చాలని ఏపీ కోకో రైతుల సంఘ అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబాజీపేటలో కోనసీమ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఏపీ కోకో రైతుల సంఘ సమావేశం జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతుల సంక్షేమానికి కోకో బోర్డు ఏర్పాటు చేసి, అన్ని రకాల రాయితీలు కల్పించాలన్నారు. కోకో గింజలు కొనుగోలు చేయడంలో కార్పొరేట్ కంపెనీలు కాదు... కోఆపరేటివ్ కంపెనీలు కావాలని సమావేశంలో కోకో రైతులు నినాదించారు. కోకో రైతులను అటు ప్రభుత్వం, ఇటు జాతీయ కంపెనీలు మోసం చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. 2024లో కిలో కోకో గింజలను రూ. వెయ్యి వరకూ కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ. 450కు మాత్రమే కొంటున్నారన్నారు. ఈ ఏడాది మే నెల వరకూ 3,076 మంది రైతుల నుంచి 2,358 మెట్రిక్ టన్నుల గింజలను మాత్రమే కొనుగోలు చేశారన్నారు. 2025లో ప్రభుత్వం మరో 75 వేల ఎకరాల్లో కోకో పంటను సాగు చేయడం లక్ష్యమని ప్రకటించిందని అన్నారు. 2024 వరకూ కోకో గింజలు కొనుగోలు చేసిన కంపెనీలు ఏ విధమైన ప్రమాణాలు పాటించలేదని, ఈ ఏడాది ఆంక్షలు పెడుతూ కోకో గింజలను రైతులు ఆశించినంతగా కొనుగోలు చేయట్లేదని అన్నారు. ‘మాండలిజ్’ కంపెనీ రైతులను నిబంధనల పేరుతో నిలువు దోపిడీ చేస్తోందని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం కాగా, ఇక్కడ రైతులకు అంతర్జాతీయ ధర చెల్లించకుండా కేవలం రూ. 450 మాత్రమే చెల్లించి, ఇతర దేశాల నుంచి రూ. 1,074లు చెల్లించి దిగుమతి చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండలానికి ఒక కోకో గింజల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఏపీ కోకో రైతు సంఘ సహాయ కార్యదర్శి వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద ప్రసాద్, జిల్లా కార్యదర్శి అడబాల రాజమోహన్, కోకో రైతులు ముత్యాల జమీల్, గణపతి వీర రాఘవులు, చేకూరి సూర్యనారాయణ రాజు, అడ్డాల గోపాలకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 8, 10 తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) ఈ నెల 8వ తేదీ శుక్రవారం బయలు దేరుతుందన్నారు. కాకినాడ టౌన్ – చర్లపల్లి (07032) ఈ నెల 10వ తేదీ ఆదివారం బయలు దేరుతుందని తెలిపారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక ఆటోనగర్ సమీపంలో అనధికారికంగా తరలిస్తున్న 15,190 కిలోల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు లారీలో రవాణా చేస్తున్న వీటి విలువ రూ. 6,98,740గా ఎంఎస్ఓ బాపిరాజు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన లారీ డ్రైవర్ తంగిరాల ఏడుకొండలును అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని రాజానగరం పోలీసులు తెలిపారు. అతని వద్ద లభించిన ఫోన్ ఆధారంగా ఈ రవాణాకు సూత్రధారి మొహ్మద్ ఆలియాగా తెలుస్తుందన్నారు. 6ఏ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
‘రాష్ట్రీయ బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ పేరుతో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాల బాలికలకు అవార్డులను అందజేస్తోంది. బాలల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను ఇస్తోంది. ఈ మేరకు విభిన్న రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సామాజిక సేవ, అత్యంత ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక విద్య, పర్యావరణ పరిరక్షణ, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు తదితర రంగాల్లో రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ విజయాలు సాధించి ఉండాలి. భారత సంతతికి చెంది, దేశంలో నివసిస్తున్న బాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలిలా.. అవార్డ్. జీవీవీ. ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ప్రతినిధులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. అర్హత పొందిన దరఖాస్తుదారుల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన బాలలను ఎంపిక చేసి తుది జాబితాను కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 31వ తేదికి అభ్యర్థుల వయసు ఐదు నుంచి 18 ఏళ్లు ఉండాలి. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రయోజనాలు ఇలా.. ఎంపికై న వారికి 2026 జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జ్ఞాపిక, ధ్రువపత్రం, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికై న వారిని ప్రధానమంత్రి అభినందిస్తారు. గణతంత్ర దినోత్సవ ర్యాలీలో భాగస్వాములను చేస్తారు. భవిష్యత్తులో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అవార్డు పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ నెల 15 తుది గడువు అసాధారణ ప్రతిభ కనబర్చిన చిన్నారులకు అవకాశం -
వైద్యం.. పూజ్యం
అన్నవరం: నిత్యం మంత్రోచ్ఛారణలతో మార్మోగిన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల మూగబోయింది. ఇక్కడి విద్యార్థులు అనారోగ్యం బారిన పడడం, దేవస్థానం వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మధ్య పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, రూ.175 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న అన్నవరం దేవస్థానం అధికారులు సరైన వైద్యం అందించలేక విద్యార్థులను ఇంటికి పంపిచేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం వైద్యశాలలో నెల రోజులుగా వైద్యుడు లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం సమస్యకు కారణమైంది. గతమెంతో ఘనం అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలను వ్రత మండపాల వద్ద చిన్న భవనంలో సుమారు ఐదేళ్లు నిర్వహించారు. ఆ తరువాత సత్యగిరిపై పదెకరాల విశాల ప్రాంగణంలో రూ. 4 కోట్లతో పాఠశాల నిర్మించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022 ఆగస్టు 13న శ్రీసత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల కొత్త భవనాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఐదేళ్లు చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలను ఆయన అందజేశారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు దేవస్థానంలో పరిచారకులు, అర్చకులు, వ్రత పురోహితులుగా నియమిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు అస్తవ్యస్తం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ స్మార్త పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అనుభవం లేని అధికారులకు నిర్లక్ష్యం కూడా తోడైంది. గతేడాది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే రత్నగిరిపై ప్రత్యేక క్యాంప్ నిర్వహించి వైద్యం అందించారు. అటువంటి ప్రయత్నం ఈసారి చేయలేదు. విద్యార్థులకు అనారోగ్యం సాకుతో సత్యగిరిపై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. ఎనిమిది మంది విద్యార్థులు గత గురువారం తీవ్ర అస్వస్థతతో తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందడం, వారిని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్తో సహా పలువురు ప్రముఖులు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో ముగ్గురిని జ్వరం కారణంగా తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం కుదుటపడడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. గత శనివారం మరో నలుగురికి తీవ్ర జ్వరం రావడంతో దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాంతో పాటు మరి కొంతమంది విద్యార్థులకు జ్వరంగా ఉండడంతో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆగమ పాఠశాలకు సెలవు ఇచ్చి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించేశారు. అస్తవ్యస్తంగా స్మార్త ఆగమ పాఠశాల నిర్వహణ విద్యార్థులకు కనీస వైద్యం కరవు వైద్యుడు లేక వచ్చిన దుస్థితి తల్లిదండ్రుల ఆందోళనతో సెలవు ఇచ్చాం సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో సెలవు ఇచ్చాం. దేవస్థానం వైద్యశాలలో వైద్యుడిని నియమించేందుకు డీఎంహెచ్ఓకు లేఖ రాశాం. వారు వైద్యుడిని నియమిస్తే నిబంధనలను అనుసరించి జీతభత్యాలు చెల్లిస్తాం. అంతవరకూ తాత్కాలికంగా వైద్యుడిని ఆసుపత్రిలో కనీసం ఉదయమైనా పనిచేసేలా నియమించాలని కలెక్టర్ను కోరతాం. –వి.సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం వైద్యాధికారి లేక.. దేవస్థానం ఆసుపత్రిలో వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్కు రౌతులపూడి పీహెచ్సీలో వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో నెల రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే ఆయనను ఈఓ రిలీవ్ చేశారు. కొత్త వైద్యుడిని డీఎంహెచ్ఓ నియమించాల్సి ఉంది. ఆ వైద్యునికి జీతభత్యాలు దేవస్థానం చెల్లిస్తుంది. కొత్త వైద్యుడి నియామకం అయ్యేవరకూ తాత్కాలికంగా దగ్గరలోని పీహెచ్సీ నుంచి డాక్టర్ వచ్చి విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోక ఇటు ఆగమ పాఠశాల విద్యార్థులే కాకుండా, దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీ సూపర్వైజర్, ఇతర సిబ్బంది వారికి తెలిసిన వైద్యం చేస్తున్నారు. తక్షణం దేవస్థానం వైద్యశాలలో వైద్యాధికారిని నియమించాలి. కనీసం వారానికి ఒకసారి డీఎంహెచ్ఓ లేదా ఇతర పీహెచ్సీ వైద్యులు ఆగమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ వేధింపులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్, డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ వర్ధినిలక్ష్మికి గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు, ప్రగడ మంగాదేవిల కుమారుడు ప్రగడ నాగ దుర్గారావుకు 2022లో వివాహం చేశారన్నారు. వివాహ సమయంలో కట్నంగా రెండెకరాల పొలం, రూ.30 లక్షలు, 30 కాసుల బంగారం, రూ.5 లక్షల ఆడపడుచు కట్నంగా ఇచ్చినట్లు వివరించారు. 18 నెలలు కాపురం సక్రమంగా జరిగిందని, తర్వాత ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ భార్య ప్రగడ వర్ధినిలక్ష్మిని భర్త నాగ దుర్గారావుతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ ఇంటి నుంచి బయటకు గెంటేశారని వివరించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. అయితే తన కుమార్తెకు తండ్రిని చూపించాలనే ఉద్దేశంతో ప్రగడ నాగ దుర్గాప్రసాద్ ఇంటికి కుమార్తెతో వెళ్లగా భర్త అత్తమామలు మరి కొంతమంది కలసి వర్ధిని లక్ష్మిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి నాగ దుర్గాప్రసాద్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఉంటూ బెట్టింగ్ గేమ్లు ఆడుతూ నష్టపోయి తనకు మరింత అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేసేవాడని ఆరోపించారు. బాధిత మహిళ వర్ధిని లక్ష్మికి న్యాయం చేసి ఆమె కాపురం నిలబెట్టాలని ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. పసిపాపతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని వర్ధిని లక్ష్మి తల్లిదండ్రులు వేడుకున్నారు. న్యాయం జరగకపోతే హూమన్ రైట్స్, మహిళా సంఘాలతో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయండి హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ లక్ష్మి డిమాండ్ -
కువైట్లో పొన్నమండ వాసి మృతి
● రెండు నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం ● జూన్ 1న ఆ దేశంలో ఏసీ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం రాజోలు/ అమలాపురం రూరల్: కువైట్లో రెండు నెలల క్రి తం జరిగిన ఏసీ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో తొమ్మిది మంది అగ్నికి ఆహుతయ్యారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. తొమ్మిది మంది మృతుల్లో రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కడలి దుర్గాసంతోష్ ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉండడంతో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ చొరవతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో దుర్గాసంతోష్ కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్ఏ నివేదికలను కువైట్లోని ఇండియన్ ఎంబసీకి పంపించారు. ఆ నివేదిక ద్వారా దుర్గాసంతోష్ మృతదేహాన్ని గుర్తించి కార్గో విమానం ద్వారా హైదరాబాద్, అక్కడి నుంచి ఏపీఎన్ఆర్టీ ద్వారా స్వగ్రామం పొన్నమండ తీసుకు వచ్చారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంస్థ చొరవతో కుమారుడి మృతదేహం స్వగ్రామానికి వచ్చిందని మృతుడి తండ్రి సూర్యనారాయణ, చిన్నాన్న ఆదినారాయణ తెలిపారు. కోనసీమ వాసి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు జిల్లా ఎస్పీ కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంస్థ వికాస పీడీ కె.లచ్చారావు, మేనేజర్ జి.రమేష్, మహిళా కానిస్టేబుల్ బి.సఫియా, హెడ్ కానిస్టేబుల్ కె.సత్తిబాబులను కలెక్టర్ మహేష్ కుమార్ అభినందించారు. -
వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ కార్యదర్శిగా పుల్లేశ్వరరావుఅమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గానికి చెందిన టి.పుల్లేశ్వరరావును పార్టీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. పుల్లేశ్వరరావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు అభినందించారు.ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలుకొత్తపేట: కోనసీమ తిరుపతి, వాడపల్లి క్షేత్రంలో మూడో రోజైన బుధవారంతో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం నానుడితో స్వామికి వివిధ పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, అర్చక, వేదపండితుల బృందం మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, ఉత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడోరోజు స్వామివారిని, పవిత్రోత్సవ కార్యక్రమాల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. అనంతరం రాత్రి వరకూ సంకల్పం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మహా శాంతిహోమం, ప్రయచ్చిత హోమాలు, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహాదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాల వితరణతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. -
నేస్తం మానేశారు
సాక్షి, అమలాపురం: చేనేత పరిశ్రమకు చంద్ర గ్రహణం పట్టింది.. ఒకవైపు ముడి సరుకు ధరలు పెరగడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడం.. ఇంకోవైపు చేనేత సంఘాలకు బకాయిలు విడుదల కాకపోవడం.. ఇలా చెప్పుకొంటూ పోతే కారణాలు ఏమైనా నేతన్నకు రోజు గడవడం కష్టంగా మారింది. చేతిలో అద్భుత నైపుణ్యం ఉన్నప్పటికీ జేబులో పైసలు లేని పరిస్థితి వచ్చింది. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల ఆకలి బాధలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జిల్లాలో చేనేత రంగం ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది. ఇప్పటికీ పలు గ్రామాలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాయి. ఊరి పేరుతో ఇక్కడ తయారైన వస్త్రాలు రాష్ట్రంలో తిరుగులేని ఖ్యాతి పొందాయి. కపిలేశ్వరపురం మండలం అంగర, మండపేట మండలం ఏడిద, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, అమలాపురం మండలం బండారులంక, సఖినేటిపల్లి మండలం మోరి, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు వంటి గ్రామాలు చేనేత రంగంపై సొంత బ్రాండ్ సృష్టించుకున్నాయి. జిల్లాలో 3,500కు పైగా చేనేత మగ్గాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతం నేత కార్మికులకు రోజువారీ పని ఉండడం లేదు. స్థానికంగా తయారు చేస్తున్న చీరలకు మార్కెట్లో డిమాండ్ తగ్గింది. దీంతో పేరొందిన చోట నుంచి వస్తున్న చీరల ఆర్డర్లపైనే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. దీనికితోడు నూలు, ఇతర ముడి సరకుపై రావాల్సిన రాయితీ నెలలు గడుస్తున్నా అందడం లేదు. 30 శాతం రిబేట్ అమ్మకాలపై సంఘాలకు రాయితీలు రావడం లేదు. అలాగే పావలా వడ్డీ రాయితీ ఎగిరిపోయింది. దీని స్థానంలో రూపాయి వడ్డీ వచ్చి చేరింది. ఇలా నేత కార్మికులు, వారికి అండగా ఉన్న చేనేత సహకార సంఘాలపై మోయలేని భారం పడింది. దీనికితోడు గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. ఇవన్నీ నేత కార్మికులను అప్పుల ఊబిలో నెట్టివేసింది. గత ప్రభుత్వంలో పెద్దపీట 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్దపీట వేసింది. ముడి సరకు కొనేందుకు, మగ్గాల మరమ్మతుల నిమిత్తం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. జిల్లాలో గత ఐదేళ్లలో ఏడాదికి సగటున 3,560 మంది చొప్పున రూ.43.33 కోట్ల మేర లబ్ధి చేకూరింది. నేతన్న నేస్తం వల్ల ముడి సరకు, ఇతర అవసరాల కోసం బయట అప్పులు చేయాల్సి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. అప్పుల ఊబిలో నేతన్నలు రోజు వారీ పనులు లేక ఇబ్బంది గత ప్రభుత్వంలో 3,560 మందికి ‘నేతన్న నేస్తం’ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేత నేడు జాతీయ చేనేత దినోత్సవం నేతన్నలు కోరుతున్నవి ఇవే.. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. లేదా పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి. సంఘాలకు ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న చేనేత సంఘాల బకాయిలను రద్దు చేయాలి. పావలా వడ్డీ పథకం అమలు చేయడంతోపాటు పెండింగ్ బకాయిల విడుదల చేయాలి. నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం ఉన్నవారికి ఏడాదికి రూ.24 వేలు అందజేయాలి. చేనేత కార్మికుల సంక్షేమం నిమిత్తం ప్రస్తుతం అమలులో ఉన్న త్రిప్టు ఫండ్ పథకం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితమంటున్న ప్రభుత్వం కొర్రెలు వేస్తోంది. మగ్గం ఉన్నవారి పేరుపైనే విద్యుత్ సర్వీసు ఉండాలని చెబుతోంది. అద్దెకు ఉన్నవారికి ఇది వర్తించదు. కాబట్టి మగ్గం ఉన్నవారందరికీ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి. సంక్షోభానికి కారణలెన్నో.. జిల్లా వ్యాప్తంగా 23 చేనేత సహకార సంఘాలు ఉండగా, గడిచిన 14 ఏళ్ల నుంచి ఎన్నికల నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ కారణంగా సంఘాలపై అధికారులు పెత్తనం పెరగడం, సంఘాలకు రావాల్సిన బకాయిల వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆప్కో, అలాగే ప్రభుత్వం నుంచి రూ.కోట్ల బకాయిలు పెరిగిపోవడంతో సంఘాలకు, కార్మికులకు ఆర్థిక భారంగా మారింది. 2018 జీఓ ప్రకారం చేనేత కార్మికులకు కొనుగోలు చేసే నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంది. 30 శాతం డిస్కౌంట్ అమ్మకాలపై ఒక్క అంగర సహకార సంఘానికి రూ.75 లక్షలు, హసన్బాద్ సంఘానికి రూ.35 లక్షల వరకూ రావాల్సి ఉంది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరు జీఓలను తెచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. నాడు క్రమం తప్పకుండా సాయం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా నేతన్న నేస్తం ద్వారా ప్రతి మగ్గానికి రూ.24 వేలు అందించారు. దీనివల్ల నేతన్నలకు ఆకలి బాధలు తప్పాయి. అప్పులు చేయాల్సిన అవసరం లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం ఊసే లేదు. ఈ పథకాన్ని తక్షణం అమలు చేయాలి. –జానా గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, బండారులంక, అమలాపురం మండలం రుణమాఫీ చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులు ఉపయోగించే నూలుపై ఉన్న జీఎస్టీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. చేనేత సొసైటీల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, 200 యూనిట్లకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. సంఘాలు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. వీటిని వెంటనే అమలు చేయాలి. –అందె సూర్యనారాయణమూర్తి, చేనేత కార్మికుడు, పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
నిందితుడి అరెస్ట్ అన్నవరం: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. -
కాలువలో చెత్త పోసేందుకు వెళ్లి..
గల్లంతైన బాలిక మృతి కొత్తపేట: ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి ఓ బాలిక గల్లంతైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం ఖండ్రగ పులిసిగంటివారిపేటకు చెందిన యార్లగడ్డ లోకేశ్వరి (15) పదో తరగతి చదువుతుంది. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి, ఇంటి వాకిలి తుడిచి ఆ చెత్తను పారబోయడానికి సమీపంలోని బొబ్బర్లంక – అమలాపురం ప్రధాన పంట కాలువ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతైంది. అప్పటి నుంచి స్థానికులు గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం తహసీల్దార్ వై.రాంబాబు, ఎస్సై జి.సురేంద్ర పరిస్థితిని సమీక్షించి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. దానితో రెండు రోజుల అనంతరం ఆదే పంచాయతీ పరిధి నక్కావారిపేట సమీపంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. పిల్లలు లేకపోవడంతో.. పులుసుగంటి వెంకటరమణ, అనంతలక్ష్మి దంపతులకు పిల్లలు లేక బంధువుల అమ్మాయి లోకేశ్వరిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వెంకటరమణ వ్యవసాయ కూలీ కాగా తల్లి అనంతలక్ష్మి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. ఇక్కడ తండ్రి, కుమార్తె ఉంటున్నారు. తల్లి త్వరలో తిరిగి రావాల్సిండగా ఈలోపు కుమార్తె లోకేశ్వరి కాలువలో పడి మృతి చెందడంతో కువైట్ నుంచి ఆమె హుటాహుటిన వచ్చింది. జరిగిన దుర్ఘటనతో ఆమెతో పాటు వెంకటరమణ రోదిస్తున్నారు. -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
రాయవరం: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకూ సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తించడంతో పాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికితీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1, 3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్కు బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఏలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్లో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఈ నెల 11 నుంచి 14 వరకూ నిర్వహణ అభ్యసనం మదింపునకు ప్రక్రియ జిల్లాలో 1.95 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో విద్యార్థులు ఇలా.. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1–5 తరగతుల వరకు 30,616 మంది, 6–10 తరగతుల వరకు 58,651 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేటు యాజమాన్యంలో 464 పాఠశాలలకు సంబంధించి 1,05,965 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 1,95,690 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ యాజమాన్యంలో 89,625 మంది, ప్రైవేట్ యాజమాన్యంలో 1,05,965 మంది విద్యార్థులున్నారు. అవసరమైన ఏర్పాట్లు చేశాం ప్రశ్న పత్రాలను, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సరఫరా చేశాం. పరీక్ష పేపర్లకు ఎంఈఓలు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని మార్గదర్శకాలు ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలకు జారీ చేశాం. –బీర హనుమంతరావు, డీసీఈబీ కార్యదర్శి, అమలాపురం పేపర్ లీకై తే కఠిన చర్యలు మూడేళ్లుగా క్లాస్ రూమ్ బేస్ట్ అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విధానంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష పేపర్లు లీకై తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం -
హోరాహోరీగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 15వ జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఈ మ్యాచ్లను హాకీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి హర్షవర్దన్రెడ్డి, కోశాధికారి థామస్ పీటర్, టోర్నీ కో–ఆర్డినేటర్ రవిరాజు పర్యవేక్షించారు. పోటీలను మేజర్ స్పాన్సర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు బి.కిరణ్కుమార్, పి.త్రినాథ్, ఎం.రవికుమార్ ప్రారంభించారు. అస్సాం, మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్లో మణిపూర్ 3–1 స్కోర్తో, కేరళ, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరాఖండ్ 7–0 స్కోర్తో విజయం సాధించగా, హిమాచల్ప్రదేశ్, బిహార్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోర్తో డ్రాగా అయ్యింది. తమిళనాడు, అరుణాచల్ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో తమిళనాడు 5–0 స్కోర్తో, మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 4–0 స్కోర్తో విజయం సాధించాయి. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో 1–1 స్కోర్తో ఇరు జట్లు సమానం కావడంతో నిర్వాహకులు డ్రాగా ప్రకటించారు. జార్ఘండ్, ఛత్తీస్గఢ్ మధ్య జరిగిన మ్యాచ్లో జార్ఘండ్ 7–1తో విజయం సాధించింది. -
సమయపాలన ముఖ్యం
అంగన్వాడీ కార్యకర్తలకు బకాయిలు అంగన్వాడీ కార్యకర్తలకు మార్చి నుంచి ఈవెంట్స్ బిల్లులు బకాయి పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక టీఏ, డీఏలు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఇటీవల గౌరవ వేతనాలు మాత్రం జమ చేసింది. మరోవైపు యాప్ యాతనలు పడలేమంటూ అంగన్వాడీ కార్యకర్తలు రెండు రోజులుగా మొబైల్ ఫోన్లను ప్రభుత్వాధికారులకు వెనక్కి ఇచ్చేస్తున్నారు. క్లాప్ మిత్రలు, పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ భారత్ మిషన్ అమలులో భాగంగా తడి, పొడి చెత్త సేకరించేందుకు 250 కుటుంబాలకు ఒకరు చొప్పున క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) మిత్రలను తీసుకున్నారు. గత ఏడాది నుంచి తమ జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్ఐలకు నగదు మినహాయించినప్పటికీ సుమారు రూ.50 లక్షలు జమ చేయలేదని క్లాప్ వాహన డ్రైవర్ల సంఘం ఆరోపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల్లో ఉన్న సంపద సృష్టి కేంద్రాల్లో క్లాప్మిత్రలు రూ.6 వేల జీతానికి పని చేస్తున్నారు. తర్వాతి కాలంలో మిషన్ నుంచి నిధులు నిలిచిపోవడంతో వీరి జీతాల భారం పంచాయతీలపై పడింది. పంచాయతీల ఆర్థిక పరిస్థితులు బాగోలేక వీరి జీతాలు బకాయిలు పేరుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్స్ (పారిశుధ్య కార్మికుల)కు 3 నెలలకు పైగా గౌరవ వేతనాలు బకాయిలున్నాయి. కపిలేశ్వరపురం: ప్రభుత్వమంటే సామాన్య ప్రజలకు, వారికి సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులు, సేవకులకూ భరోసా ఇచ్చేదిగా ఉండాలి. గెలవాలన్న తపనతో నోటికొచ్చిన హామీలిచ్చేసి, గెలిచాక ఆర్థిక సంక్షోభమంటూ లెక్కలేసుకోవడం ప్రజాస్వామ్యయుతమైన పాలన కానేకాదు. 2024 జూన్ 12న అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలన సామాన్యులు, చిరుద్యోగులను తీవ్ర యాతనకు గురి చేస్తోంది. వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటూ వాటిని ఎగవేస్తోంది. వేతనాలు ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగులు కాదంటూ కోతలు పెడుతోంది. ఇచ్చేది స్వల్ప వేతనమే అయినా దానిని కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో వివిధ శాఖల్లో పని చేస్తున్న చిరుద్యోగులు నానా అగచాట్లూ పడుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో నేరుగా ప్రజలకు ఫోన్ చేసి సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడుగుతున్న ప్రభుత్వం.. సిబ్బందికి భారీగా బకాయిలపై మాత్రం నోరు మెదపడం లేదు. అత్యవసర సేవకులకు అవస్థలు అత్యవసర సేవలందించే 108, 104, 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లను గతంలో అరబిందో సంస్థ నిర్వహించేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ మార్పు క్రమంలో రెండు నెలల పాటు వేతనం, ఇంక్రిమెంట్లు ఆలస్యంగా అందజేశారు. వీరి వేతనాన్ని రూ.4 వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆచరణకు వచ్చేసరికి 108 సిబ్బందికి రూ.500, 104 సిబ్బందికి రూ.1,500 తగ్గించి వేతనాలిస్తున్నారు. వాహనం బ్రేక్డౌన్ అయ్యినప్పుడు ఉద్యోగికి వేతనం తగ్గిస్తూనే సేవలు మాత్రం కొనసాగించినట్టు చూపుతున్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు బకాయి పెట్టారు. ‘డొక్క’లెండుతున్నాయ్ మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం.. ఆ పథకం నిర్వాహకులను మాత్రం అనేక అవస్థలకు గురి చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,258 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 229 ఉన్నత పాఠశాలల్లో 62,464 మంది, కాకినాడ జిల్లాలో 1,285 ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అప్పులు చేసి అన్నం పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి మెనూ చార్జి కింద రూ.20 ఇవ్వాలని, వంట గ్యాస్ సిలిండర్, కూరగాయలను ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి. వారికి ఇచ్చే రూ.3 వేల వేతనాన్ని కూడా రెండు నెలలకోసారి అందజేస్తున్నారు. మెనూ చార్జి బిల్లులను మార్చి నుంచి బకాయి పెట్టింది. పథకం నిర్వహణను ప్రైవేటు వారికి అప్పజెప్పిన ప్రాంతాల్లో కార్మికులకు రూ.3 వేలు కాకుండా రూ.1,500 మాత్రమే ఇస్తున్నారు. రౌతులపూడి, తుని, శంఖవరం, కోటనందూరు, తొండంగి, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. స్కూల్ ఆయాలకు ఆరు నెలలుగా.. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఆయాకు నెలకు కేవలం రూ.6 వేల గౌరవ వేతనమిస్తున్నారు. అది కూడా జనవరి నుంచి ఆరు నెలల పాటు బకాయి పెట్టారు. పాఠశాలకు ఒక్కరు చొప్పున కాకుండా పాఠశాల విస్తీర్ణం ప్రామాణికంగా ఆయాలను తీసుకోవాలని సంఘం కోరుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎరియర్స్, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్ల రూపాల్లో రూ.కోట్లలో బకాయిలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇటీవల బదిలీ అయిన 1,500 మంది ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. స్కూల్ అసిస్టెంట్ సమాన క్యాడర్ బదిలీలు జూన్ 9తో, ఎస్జీటీ బదిలీలు జూన్ 14తో ముగిసినప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో వేతనాలు చెల్లించడం లేదు. డీఎస్సీ–98 మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు ఆందోళనలు చేసిన అనంతరం జూన్ నెల వేతనాన్ని ఇటీవల అందుకున్నారు. ఇంకా.. సీఎంఆర్ ద్వారా రైతులు అమ్మిన రబీ ధాన్యానికి సైతం ప్రభుత్వం ఇంకా డబ్బు చెల్లించలేదు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ జూలై 7న అమలాపురం కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. పవన్ కల్యాణ్ పల్లె పండగ పేరుతో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.170 కోట్ల పనులు చేయించగా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని వారు నిరసన తెలిపారు. బాంబింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు మామిడికుదురు: పాశర్లపూడి–పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులో ఓఎన్జీసీ క్షేత్రంలో డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న సైటులో మంగళవారం బాంబింగ్ నిర్వహించారు. బాంబుల శబ్ధానికి తమ ఇళ్లు బీటలు తీశాయంటూ స్థానిక శ్రీరామ్పేటవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గ్రామ సర్పంచ్ కొనుకు ప్రేమజ్యోతి, మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు దృష్టికి తీసుకు వెళ్లారు. మాజీ సర్పంచ్ అక్కడకు చేరుకుని ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. ముందస్తుగా ఏవిధమైన సమాచారం లేకుండా బాంబింగ్ ఎందుకు చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో ఓఎన్జీసీ అధికారులు బాంబింగ్ను నిలుపుదల చేశారు. ఈ–2003 నంబర్ రిగ్తో ఇక్కడ డ్రిల్లింగ్ నిర్వహించారు. డ్రిల్లింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో గత నెల 9వ తేదీన భారీ శబ్ధంతో గ్యాస్ కిక్ ఇచ్చింది. దీంతో అయోమయానికి గురైన ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. స్థానికుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాంబింగ్ నిర్వహించడంతో స్థానికులు భయపడ్డారు. ఎమ్మార్వో సునీల్కుమార్ను వివరణ కోరగా తమకు ఏ విధమైన సమాచారం లేదన్నారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. అమలాపురం రూరల్: జలవనరుల శాఖ ఇంజినీర్లు ముఖ ఆధారిత హాజరు నమోదుతో పాటు సమయపాలన పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు జలవనరులు, డ్రైనేజీ విభాగపు ఇంజినీర్ల పనితీరుపై ఈఈ, డీఈ ఈ, సహా ఇంజినీర్లతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో జలవనులశాఖ పనులలో ఆశించిన పురోగతి లేదని ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడైన నేపథ్యంలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. డీఆర్ఓ కె.మాధవి ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల, ఎస్ఈ వెంకట స్వామి, డీఈలు వెంకటేశ్వరరావు డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిషోర్ పాల్గొన్నారు. అంతర్వేది ఆలయ భూముల రీ సర్వే పూర్తి చేయాలి అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన భూముల రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, దేవదాయ, ధర్మాదాయ అధికారులను జేసీ నిషాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో దేవస్థాన భూముల సర్వేపై సమీక్షిస్తూ 895 ఎకరాలలో 139 ఎకరాలు దేవస్థానం అధీనంలోనే ఉందని, ఇప్పటివరకు 211 ఎకరాలలో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. నోటీసులు ఇచ్చి 15 రోజులలో ఆక్రమణదారులను ఖాళీ చేయించాలన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భూములకు అద్దెలు, లీజుల ధరలు నిర్ణయించాలన్నారు. నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు అయినవిల్లి లో వేంచేసియున్న వరసిద్ధి వినాయక స్వామి ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చతుర్థి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలని జేసీ నిషాంతి దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. సెప్టెంబర్ 4 వరకు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించాలన్నారు. వేతనాల చెల్లింపు భారం అనుకోవడం సరికాదు మానవ సమాజంలో సంపదను సృష్టించేది మానసిక, శారీరక శ్రమ చేసే శ్రామికులే. వారికి వేతనాలు రూపంలో ఖర్చు చేసేది భారంగా ప్రభుత్వం భావించకూడదు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే స్థాయిలో వేతనాలను పెంచి , క్రమం తప్పకుండా చెల్లించాలి. – చెక్కల రాజ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, కాకినాడ జిల్లా ఉమ్మడి జిల్లాలో చిరుద్యోగులకు వేతన వెతలు వేతన, బిల్లుల బకాయిలతో అవస్థలు అత్యవసర సిబ్బందికీ సమస్యలే ఉద్యోగ ఉపాధ్యాయులూ బాధితులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఫోన్లను తిరిగి ఇచ్చేస్తున్న అంగన్వాడీలు -
మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా గీత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇళ్ల స్థలాలకు జర్నలిస్టుల వినతి అమలాపురం రూరల్: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీయుడబ్ల్యూజే శాఖ అధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మండేల నాగప్రసాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలపై ఆందోళన చేశారు. బిహార్ తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్లో చనిపోయిన పాత్రికేయులకు ఆర్ధిక సాయం అందించాలని, జర్నలిస్టులు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కోర్లపాటి ప్రదీప్, ఉమ్మడి తూర్పుగోదావరి మాజీ కార్యదర్శి సుంకరప్రసాద్, ప్రెస్క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్య నారాయణ, మాజీ అధ్యక్షుడు రంబాల నాగ సత్య నారాయణ, అమలాపురం నియోజకవర్గ ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు అరిగెల రుద్ర శ్రీనివాస్రావు, నాయకులు నిమ్మకాయల సతీష్బాబు, పరసా సుబ్బారావు, పొట్టుపోతు నాగు, వట్టి కూటి గోవింద్, ఆకుల రవితేజ, దొమ్మేటి వెంకట్, కాకిలేటి సూరిబాబు పాల్గొన్నారు. నేడు రాష్ట్ర కోకో రైతుల సదస్సు అంబాజీపేట: ఏపీ రాష్ట్ర కోకో రైతు సదస్సును బుధవారం మధ్యాహ్నం అంబాజీపేట కోప్రా మర్చంట్ హాల్లో నిర్వహించనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోకో రైతు సంఘ నాయకులు తెలిపారు. ఈ సదస్సులో కోకో రైతులు ధరల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఎఫ్పీఓలు ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తారన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన అమలాపురం టౌన్: జిల్లాలో చాలా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అఽథారిటీ (అముడా) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ఆ లే అవుట్ల యాజమానులకు సూచించారు. ఇందుకు అనధికార లే అవుట్ల క్రమబద్ధీరణ స్కీమ్ను (ఎల్ఆర్ఎస్) జిల్లాలోని రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక అముడా కార్యాలయంలో జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇంజినీర్లతో అనధికార లేవుట్లపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ స్వామినాయుడు మాట్లాడారు. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు తుది గడువు వచ్చే అక్టోబర్ 24వ తేదీ అన్నారు. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు కూడా ఎస్ఆర్ఎస్ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అముడా ప్లానింగ్ ఆఫీసర్ ఎ.సత్యమూర్తి ఎస్ఆర్ఎస్ స్కీమ్పై, దానికి విధించిన తుది గడువు. దరఖాస్తులు చేసుకునే విధి విధానాలపై సర్వేయర్లు, ఇంజినీర్లకు అవగాహన కల్పించారు. అముడా అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి పి.ఉమా మహేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిట్టిబాబు ఎల్ఆర్ఎస్ నియమ నిబంధనలు వివరించారు. -
పుష్కరాలకు అంచనాలు
అమలాపురం రూరల్: 2027లో రానున్న పుష్కరాలకు జిల్లాలో ఉన్న స్నాన ఘట్టాల మరమ్మతులు, నూతన స్నాన ఘట్టాల ఏర్పాటు, కల్పించాల్సిన మౌలిక వసతులపై నియోజకవర్గాల వారీగా అంచనాలను రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జలవనరుల శాఖ స్నాన ఘట్టాలు, స్నాన ఘట్టాల వద్దకు వెళ్లే అప్రోచ్ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాత్కాలిక పిండ ప్రధాన షెడ్లు, పుష్కరనగర్ ఏర్పాట్లు, మహిళలు దుస్తులు మార్చుకునే షెడ్లు, దైవ దర్శనాలకు, స్నాన ఘట్టాలకు వెళ్లే మార్గాలలో సైనింగ్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నదీ తీర ప్రాంతంలో, ప్రముఖ దేవాలయాలలో దర్శన ఏర్పా ట్లు, డార్మెట్రీలు, లైటింగ్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలన్నారు.11 శాఖలు నిర్దేశిత పారామీటర్ల వారీగా ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ కె.మాధవి, పీ.శ్రీకర్, డీ.అఖిల,జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ 15వ తేదీన జరిగే 79వ భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్టు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్లో ఓ బైక్, మహబూబాబాద్లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఆయన నిలువెత్తు బంగారం
● విద్యార్థుల ఆకలి తీరుస్తున్న బంగారు చినశోభనాద్రి సత్రం ● రెండు పూటలా విద్యార్థులకు భోజన సదుపాయం ● నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం ● ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం ● వందేళ్లు దాటిన దాతృత్వపు చరిత్ర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అలనాడు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సత్రం నేడు నిరుపేద విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. కాకినాడ పెద్ద మార్కెట్ వద్దనున్న బంగారు చినశోభనాద్రి సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చి ఉంటున్న నిరుపేదల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రుచికరమైన భోజనం ఈ సత్రంలో అందిస్తున్నారు. గతంలో ఈ సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన వారికి ఉచితంగా వసతి కల్పించేవారు. వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. గతంలో వివిధ హోటళ్ల పాస్లను విద్యార్థులకు అందించేవారు. హోటళ్ల భోజనం సక్రమంగా ఉండకపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు 2017 సత్రం ఆవరణలో అన్నదాన భవనం నిర్మించారు. ఇక్కడ సిబ్బందిని నియమించి భోజన వసతి కల్పిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ, వారి మెరిట్, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సమాజ సేవలు ప్రస్తుతం విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు, సత్రం ఆవరణలో ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి శనివారం 120 నుంచి 150 మంది రోగులు ఇక్కడ వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి భోజనం సత్రంలో మంగళవారం నుంచి విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సత్రం ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 90కి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ఏ కళాశాలలో చదువుతున్నారో ధ్రువీకరణ సత్రం, నిరుపేద కుటుంబాలు వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేసి, సత్రం కార్యాలయంలో దరఖాస్తు అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి భోజన వసతి కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కళాశాలలు మూసివేసే వరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అర్హులైన విద్యార్థులందరికీ భోజన వసతి దాత ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నాం. మంగళవారం నుంచి భోజన సదుపాయం ప్రారంభం కానుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. – చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, ఈవో, బంగారు చిన శోభనాద్రి సత్రం 101 ఏళ్ల చరిత్ర ఈ సత్రానికి 101 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సత్రాన్ని 1924లో బంగారు చినశోభనాద్రి నెలకొల్పారు. ఈ సత్రం కోసం ఆయన 65 ఎకరాల వ్యవసాయ భూమి, 2,800 చదరపు గజాల స్థలాన్ని ఈ సత్రానికి దానం చేశారు. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన రోగులకు, వ్యాపారులకు ఇక్కడ ఎటు వంటి సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శోభనాద్రి ఇక్కడ సత్రం ఏర్పాటు చేసి, వారికి ఆసరాగా నిలిచారు. వ్యవసాయ భూములు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వహణకు వినియోగిస్తున్నారు.ఇతర జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యం కాకినాడలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువగా ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారికి సత్రంలో భోజనం అందిస్తున్నారు. -
మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బంగారపు పూత ఉన్న కవచాన్ని సమర్పించారు. ముందుగా ఆలయంలో నంది మండపం వద్ద వేణు సతీమణి వరలక్ష్మి, కుమారుడు నరేన్, కోడలు స్రవంతి, మనుమలు సునిధి, విరాజ్తో కలసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బంగారపు చీరను సమర్పించగా, అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని, శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివరావు గురూజీ, రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్లు యల్లమిల్లి సతీష్కుమారి, అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు, కట్టా గోవిందు, అంబటి తుకారం, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. -
మర్యాదలకు మారుపేరు కోనసీమ
కొత్తపేట: అతిథి మర్యాదలకు మారుపేరు కోనసీమ ప్రాంతమని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు నాగూర్బాబు (మనో) అన్నారు. మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మందపల్లి క్షేత్రాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన హరహర మహాదేవా శంభో.. కై లాసవాసా.. మందపల్లి మందేశ్వరా.. శనేశ్వరా.. అంటూ గానం ఆలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు కురిసి చాలా రోజులైందని అంటుండగా, సరిగ్గా పూజలు జరుగుతున్నప్పుడు వరుణుడి ఆశీర్వాదంతో వర్షం కురవడం, శనైశ్చరుని మహిమ అని, తన జీవితంలో అద్భుత సంఘటన అన్నారు. శనిదోషం ఉన్నవారు మాత్రమే శనైశ్చరుని దర్శించుకోవాలనేది వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమా సెన్సార్కు వెళుతుందని, రాత్రి డబ్బింగ్ చెప్పి ఫ్లైట్లో వచ్చానన్నారు. ఇక్కడి నుంచే డైలాగ్ చెప్పి వాట్సాప్లో పంపించానని తెలిపారు. ఈ కోనసీమ ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరన్నారు. తొలుత మనో, వారి కుటుంబ సభ్యులకు ఈఓ దారపురెడ్డి సురేష్బాబు, మాజీ చైర్మన్ చింతం విజయకృష్ణమోహన్ స్వాగత మర్యాదలు చేశారు. ● ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో ● మందపల్లి శనైశ్చరాలయంలో ప్రత్యేక పూజలు -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు విద్యార్థుల ఎంపిక
పి.గన్నవరం: రామచంద్రపురంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి కలిగితి సందీప్ బాలుర అండర్–16 లాంగ్ జంప్లో ప్రథమ, 60 మీటర్ల రన్నింగ్లో ద్వితీయ స్థానాలు సాధించాడు. దీంతో అతడిని ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు హెచ్ఎం కె.ఉమాదేవి తెలిపారు. ఆమెతో పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు సందీప్ను అభినందించారు. కేశనపల్లి, బట్టేలంక విద్యార్థులు మలికిపురం: రామచంద్రపురంలో ఎస్కేపీజీఎన్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ స్కూళ్లకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. కేశనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మీటర్ల రన్నింగ్లో ఎస్.సత్యసాయికృష్ణ, ప్రథమ, పి.అభిలాష్ తృతీయ, లాంగ్ జంప్లో ఎస్.సత్యసాయి కృష్ణ ద్వితీయ, పి.అభిలాష్ తృతీయ స్థానంలో నిలిచారు. సత్యసాయికృష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అలాగే బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.మోహన్, ఎ.గీతిక, జి.భార్గవి, పి.జ్యోతి, కె.ప్రసన్న, కె.శ్రీరామ్ వివిధ క్రీడాంశాల్లో ఎంపికయ్యారు. అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు స్థాని జెడ్పీ హైస్కూల్కు చెందిన కె.లక్ష్మీ ప్రసన్న, డి.దోనేశ్వర్ వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
పెరవలి: కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ పల్లా దానయ్య(42) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, కేబుల్ వైర్ లాగటానికి విద్యుత్ స్తంభం ఎక్కిన అతడు విద్యుదాఘాతానికి గురై, స్తంభం పైనే చనిపోయాడు. స్తంభం ఎక్కినప్పుడు వైర్లు తగలడంతో అలాగే ఉండిపోయాడు. విద్యుత్ సరఫరా నిలిపివేశాక మృతదేహం కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దానయ్యకు భార్య ధనలక్ష్మి, కుమారులు రామసతీష్, గోపి సంతోష్ ఉన్నారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎసై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. -
కువైట్లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి
కోనసీమ మహిళ వేడుకోలు కొత్తపేట: కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్తే, అక్కడ నిర్బంధించారని, పాలకులు దయతలచి స్వదేశానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన గుమ్మడి ధనలక్ష్మి ఈ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియో, ఆమె అక్క కుమారుడు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు చిక్కాలవారిపేటకు చెందిన చిక్కాల రాజేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనలక్ష్మి పుట్టిల్లు బిళ్లకుర్రు శివారు చిక్కాలవారిపేట కాగా, అత్తవారిల్లు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. సుమారు 16 ఏళ్ల క్రితం గుమ్మడి రాంబాబుతో వివాహమైంది. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఇద్దరు కుమారులు బీటెక్, ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇలాఉండగా విదేశంలో కొన్నేళ్లు ఉపాధికి వెళితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధనలక్ష్మి ఆశించింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం కువైట్లోని ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. రెండేళ్ల అనంతరం స్వదేశంలో భర్త, పిల్లలను చూసివస్తానని అడిగితే, అక్కడి వారు జాప్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం తాను వెళ్లిపోతానని పట్టుబడితే ధనలక్ష్మిని ఇంట్లో నిర్బంధించారు. తిండి కూడా పెట్టలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరింది. కాగా ఆమె వాచ్ దొంగిలించి పారిపోయిందని షేక్ కేసు పెట్టడంతో, ప్రస్తుతం అక్కడే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఉద్దేశించి తన దుస్థితిని వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. ఆమె భర్త రాంబాబు, కుమారులు, బంధువులు అమలాపురం ఎంపీ గంటి హరీష్మాథుర్, కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ను కలిశారు. కువైట్లో మగ్గిపోతున్న ధనలక్ష్మిని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు రాజేష్ తెలిపారు. -
విషాదంలో సీతారామ కాలనీ
● పోలీసుల అదుపులో నిందితుడు? ● సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు సామర్లకోట: తల్లి, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పట్టణంలోని సీతారామ కాలనీలో సామవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కూలీ పనులు చేసుకునే వారితో, పిల్లలు, పెద్దల అరుపులు, కేకలతో సీతారామ కాలనీ నిత్యం సందడిగా ఉంటుంది. ఇదే కాలనీలో నివసిస్తున్న ములపర్తి ధనుప్రసాద్ భార్య మాధురి(30), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీలోన(6)ను హత్యకు గురైన విషయం విదితమే. తొలుత ధనుప్రసాద్పై అనుమానంతో పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. తన భార్య వద్ద ఉండాల్సిన బంగారు ఉంగరాలు, సెల్ఫోన్లు కనిపించలేదని అతడు పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ధనుప్రసాద్ ఏడీబీ రోడ్డు పనుల కాంట్రాక్టర్ వద్ద ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. కాగా ధనుప్రసాద్ సమాచారం మేరకు మాధురి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ అనే వ్యక్తి మాధురిని, పిల్లలను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మరో వ్యక్తితో కూడా మాధురి వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు తెలుసుకున్న ప్రియుడు సురేష్.. ఆమెతో శనివారం రాత్రి ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్ర లేచి వచ్చారు. ఘర్షణ సమయంలో మాధురి అందుబాటులో ఉన్న కర్రతో సురేష్ను కొట్టినట్టు తెలిసింది. అదే కర్రను అందిపుచ్చుకుని అతడు మాధురితో పాటు, పిల్లల తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. సురేష్ సొంత లారీపై డ్రైవర్గా పని చేస్తూ, తన సంపాదనతో ప్రియురాలికి కోరినవన్నీ కొనిపెడుతుండగా, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది వద్దని చెప్పినా వినకపోవడంతోనే సురేష్ ఈ హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యాబిడ్డలు హత్యకు గురి కావడంతో ధనుప్రసాద్ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. అతడిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సీతారామ కాలనీ విషాదంలో మునిగిపోయింది. -
మామూళ్ల కోసం వేధింపులు
● మద్యం షాపులు మూసివేసి వ్యాపారుల నిరసన ● ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ధర్నా అమలాపురం టౌన్: ప్రతి నెలా మూమూళ్లు ఇస్తున్నా.. అదనంగా పెంచాలని ఎకై ్సజ్ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ అమలాపురం పట్టణ, రూరల్ మండలంలోని 13 లైసెన్స్ మద్యం షాపులను వ్యాపారులు సోమవారం మూసివేసి ఆందోళనకు దిగారు. షాపులకు తాళాలు వేసి, ఆ తాళాలను స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐకి అందించి నిరసన తెలిపారు. ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని ఎకై ్సజ్ అధికారుల ముందే వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. మూమూళ్లు పెంచాలని, లేని పక్షంలో షాపులపై కేసులు నమోదు చేస్తామని వేధిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ కార్యాలయంలో తొలుత సీఐ వీటీవీవీ సత్యనారాయణతో మద్యం వ్యాపారులు మాట్లాడారు. సీఐకి షాపుల తాళాలు ఇస్తూ, వ్యాపారాలు చేయలేమంటూ తెగేసి చెప్పారు. తర్వాత ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్తో భేటీ అయ్యారు. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణను విలేకర్లు వివరణ కోరగా, వ్యాపారులకేదో సమస్య వచ్చిందని, అందుకే నిరసన తెలుపుతున్నారని, విషయం వారినే అడగాలన్నారు. మద్యం వ్యాపారులు కార్యాలయం ముందే ఆందోళనకు దిగడంతో అధికారులు కంగుతిన్నారు. వ్యాపారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి, ఎట్టకేలకు ఆందోళనను విరమింపజేశారు. సోమ వారం సాయంత్రం నుంచి వ్యాపారులు షాపులను తెరవడంతో వివాదానికి తాత్కాలికంగా తెర పడింది. ఓ ప్రజాప్రతినిధి మద్యం షాపుల నుంచి మూ మూళ్ల కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. మూమూళ్లు తారా స్థాయికి చేరడంతో మద్యం వ్యాపారులు నిరసన బాట పట్టారంటున్నారు. -
వద్దురొయ్య అంటే..!
● నిలకడ లేని ధరతో ప్రతికూల ప్రభావం ● అమెరికా టారిఫ్తో మరో రూ.30 పడిపోయిన వైనం ● అయినా.. సీడ్ వేసేందుకు చెరువులను సిద్ధం చేస్తున్న రైతులుమలికిపురం: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది ఆక్వా రైతు పరిస్థితి. నిలకడ లేని ధర, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న టారిఫ్లు ఆక్వా రైతులను కుదుటపడనీయడం లేదు. ప్రధానంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలను సాగు చేసే రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రొయ్య ధర కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రైతుల వద్ద సరకు లేదు. గత నెలలో కురిసిన వర్షాలకు వాతావరణ సమతుల్యత లోపించడంతో, తెగుళ్ల సమస్యతో రొయ్యలను ఇష్టానుసారం అమ్మేశారు. ఆగస్టు వరకూ వంద కౌంట్ రొయ్యలు తీసిన రైతు లేడు. వర్షాలు, ఎండల వల్ల సమతుల్యత దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అధిక కూలింగ్ లేకుంటే, అధిక వేడి ఏర్పడింది. వేడిని తట్టుకునేలా రొయ్యలకు వాడేందుకు ప్రొ బయోటిక్స్ ఉన్నాయి కానీ, అధిక చల్లదనాన్ని నివారించేందుకు ప్రొ బయోటిక్స్ లేవని రైతులు అంటున్నారు. మారిన వాతావరణంతో రొయ్యల చెరువులు విబ్రియో వంటి వైరస్ బారిన పడ్డాయి. జిల్లాలో పది రోజులుగా పిల్ల వేసిన 20 రోజులకే చెరువులు వైరస్ బారిన పడుతున్నాయి. పూర్తి స్థాయి కౌంట్కు రాకుండా కూడా రొయ్య వైరస్ బారిన పడుతోంది. దీంతో కొన్నిచోట్ల చెరువులను ముందుగానే పట్టి రైతులు అయిన కాడికి అమ్ముకుంటున్నారు. లేదంటే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని భీతిల్లుతున్నారు. పట్టుబడి పడుతున్న చెరువుల్లో 100 నుంచి 150 కౌంట్ కూడా ఉండడం గమనార్హం. వేలాది ఎకరాల్లో నష్టం ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టపోయిన రైతులు ఉన్నారు. రైతులు అందించిన వివరాల ప్రకారం, ఉమ్మడి జిల్లాలో గడచిన పది రోజుల్లో రొయ్య సీడ్ వేసిన నెల రోజులకే చెరువులను ఖాళీ చేశారు. మరలా సీడ్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గత జూలై నెలలో 100 కౌంట్ రొయ్య ధర రూ.270 ఉంది. రెండు రోజుల క్రితం అమెరికా విధించిన సుంకంతో అది రూ.30 తగ్గి రూ.240కి పడిపోయింది. ఆశ చావని ఆక్వా రైతులు మరలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 40 వేల ఎకరాల్లో సాగు ఉమ్మడి జిల్లాలో మొత్తం 72 వేల ఎకరాల్లో చెరువులు ఉండగా, సుమారు 40 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సీడ్ వేసిన అనంతరం రెండు నెలలు అన్నీ అనుకూలిస్తే 100 కౌంట్కు వస్తుంది. అలా జరిగి, రూ.240 ధర నిలకడగా ఉంటే రైతుకు పెట్టుబడి వస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో 40 కౌంట్ కూడా తీసే రైతులు లేరు. అప్పటి దాకా ఉండాలన్నా, ధర ఎలా ఉంటుందో తెలియదు. పెట్టుబడి మాత్రం పెరుగుతుంది. ఓవైపు లీజులు మాత్రం చెల్లించాలి. పెద్ద రైతులకు కరెంట్ ఖర్చు తప్పదు. కూలి ఖర్చుల భారం పెరుగుతుంది. నిలకడ లేని ధరతో ఇబ్బందులు తెగుళ్లు, నిలకడ లేని ధరతో ఇబ్బందులు పడుతున్నాం. గత నెల కౌంట్కు రాక రొయ్యను అర్ధంతరంగా పట్టేయాల్సి వచ్చింది. నష్టాలు అధికంగా చవిచూశాం. ప్రస్తుత వర్షాకాలం కూడా వాతావరణ సమతుల్యత ఏర్పడి, చెరువులు కౌంట్కు వచ్చే దాకా నమ్మకం ఉండదు. – రుద్రరాజు చిన్నరాజా, ఆక్వా రైతు, గుడిమూల సమతుల్యత లోపంతోనే ఇబ్బంది వాతావరణ సమతుల్యతతో రొయ్యలకు ఇబ్బందులు వస్తాయి. వర్షాలు, ముసురు, ఎండలు ఒకేసారి రావడం వల్ల రొయ్య ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చెరువుల్లో ఆక్సిజన్ తగ్గి, రొయ్యలకు తెగుళ్లు సోకుతాయి. ఎండలను తట్టుకునేందుకు ప్రొ బయోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక శీతలానికి మందులు లేవు. – సిద్ధార్థ వర్ధన్, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి, రాజోలు -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాల బట్వాడా
అమలాపురం టౌన్: వివిధ డిమాండ్లతో నిరసనకు దిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న జూన్, జూలై నెలల జీతాలు పడ్డాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలపై ఇటీవల సాక్షిలో ప్రచురిమైన కథనానికి అధికారులు స్పందించి, తొలుత పెండింగ్లో ఉన్న వారి జీతాలను సోమవారం బట్వాడా చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ కేశవకుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ, మిగిలిన సమస్యలపై కూడా విద్యా శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 122 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలలూ వేతనం ఇవ్వాలని, తమను 100 కిలోమీటర్లు పైబడి బదిలీలు చేయడం, కొందరిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో హెచ్ఎంలుగా బదిలీ చేసి, యాప్ల భారం మోపడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. 18 నుంచి ‘సామవేదం’ ప్రవచనాలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): సరస్వతీ గానసభ ఆధ్వర్యా న ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. ‘సనాతన ధర్మం – శాశ్వత న్యా యం’ అనే అంశంపై స్థానిక సూర్య కళా మందిరంలో ఆయ న ప్రవచనం చేస్తారని నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రవచనాలు ప్రారంభమవుతాయన్నారు. -
బడి పంతుళ్లకు పస్తుల పాఠం
ఫ్యాప్టో ఆధ్వర్యంలో.. వేతనాలు, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్క రించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు శనివారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాయి. అనేక వినతిపత్రాలిచ్చినా పరిస్థితిలో మార్పు లేదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం పొజిషన్ ఐడీలకు చర్యలు తీసుకుని, రెండు నెలల వేతనాలను జూలై 6న సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ చేసేలా జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంతవరకు అమలవుతుంది, పొజిషన్ ఐడీలు సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ గడువు ముగిసే లోపు కేటాయిస్తారా అన్నది వేచిచూడాలి. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ / ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. ● పొజీషన్ ఐడీ రాక.. రెండు నెలలుగా మంజూరు కాని వేతనాలు ● బదిలీ అయిన ఉపాధ్యాయులకు నేటికీ కేటాయించని ఐడీలు ● జీతాల కోసం ఎదురు చూస్తున్న టీచర్లు ● ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఒత్తిడిలో 1,500 మందిరాయవరం: జీతాలు రాగానే వేతన జీవులు ప్రతి నెలా ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, పాలు, కిరాణా తదితర ఖర్చులు చెల్లించాల్సి ఉండడం సర్వసాధారణం. ఏదైనా కారణంతో ఓ నెల ఆదాయం రాకుంటే ఎంత కష్టంగా ఉంటుందో వేతన జీవులకే ఎరుక. అటువంటిది రెండు నెలలుగా వేతనాలు రాకుంటే వారి పరిస్థితి ఏమిటో అవగతమవుతుంది. గత వేసవిలో బదిలీలు పొందిన పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనతో అనేక మంది ఉపాధ్యాయుల నెలసరి ఆదాయానికి బ్రేక్ పడింది. గత నెల వేతనాలు రాకపోగా, ఈ నైలెనా వస్తాయన్న ఆశ అడియాశే అయింది. సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాల్లో వ్యక్తమవుతోంది. పొజిషన్ ఐడీలు కేటాయించి, తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేసిన విషయం పాఠకులకు విదితమే. 1,500 మందికి పైగా.. ఈ ఏడాది మే 21న ప్రారంభించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జూన్ 15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పొందిన వారిలో పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. వాటిని సకాలంలో కేటాయించకపోవడంతో జూన్, జూలై వేతనాలను వారు నేటికీ పొందలేకపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి పైగా ఉపాధ్యాయులు ఇలా జీతభత్యాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. పొజిషన్ ఐడీ అంటే.. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు బది లీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సంబంధిత ఉపాధ్యాయుడి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. బదిలీ కాక పూ ర్వం వరకు వారు రెగ్యులర్గా జీతభత్యాలు పొందుతున్నప్పటికీ, ప్రస్తుతం బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అప్పుడే సంబంధిత ఉద్యోగి/ఉపాధ్యాయుడి వివరాలు సీఎఫ్ఎంఎస్లో డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే డీడీఓలో బిల్లు సమర్పించడానికి వీలవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు నూతనంగా ఏర్పడడంతో, ఇక్కడ కొత్తగా కేటాయించిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించాలి. అప్పుడు ఆ స్థానాల్లో బదిలీపై వచ్చిన వారి జీతభత్యాలకు అవకాశం ఉంటుంది. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలై, ఆగస్టులో తీసుకోవాల్సిన జూన్, జూలై నెలల వేతనాలు వారికి మంజూరు కాలేదు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. గత నెల 25వ తేదీలోపు పొజిషన్ ఐడీలు రానందున రెండు నెలల వేతనాలను వీరు పొందలేకపోయారు. ప్రభుత్వ కక్షపూరిత ధోరణి ఆన్లైన్ సమాచారం కావాల్సినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాలపై సెకండ్ల వ్యవధిలో సమాచారం సేకరిస్తుంది. ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి రెండు నెలలు సాగదీశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణి వీడి వెంటనే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించి, వేతనాలను తక్షణమే చెల్లించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండు నెలలుగా ఇబ్బందులు నెల వేతనం రాకుంటేనే వేతన జీవులు ఇబ్బందులు పడే పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఈ ఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితు ల్లో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీని అధికంగా వినియోగిస్తూ, క్షణాల్లో డేటా సేకరిస్తున్న ప్రభుత్వం.. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. సప్లిమెంటరీ బిల్లు లు ఈ నెల 15లోపు చేసుకునేలా చర్యలు చేపట్టాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రణాళిక లోపం కనిపిస్తోంది బదిలీలు, పదోన్నతుల సమయంలోనే పొజిషన్ ఐడీలు కేటాయించే చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వ ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా వేతనాలు రాక, బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వైద్య ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ధీపాటి సురేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బతక లేక బడిపంతులనేది ఒకప్పటి నానుడి. ఆ రోజులను మళ్లీ కళ్లెదుట కదలాడేలా.. ఆ దుర్భర పరిస్థితులను నిజం చేసేలా వ్యవహరిస్తోంది కూటమి సర్కారు. సమాజాన్ని గాడిలో పెట్టే పాఠాలు బోధించాల్సిన బడి పంతులు ప్రస్తుతం కాలే కడుపుతో అలమటిస్తున్నాడు. పదోన్నతులు వచ్చాయని ఆనందపడాలో.. నెల జీతం చేతికందడం లేదని బాధ పడాలో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకటో తేదీ వస్తే.. కుటుంబ పోషణ, ఖర్చులు, అప్పులంటూ నెత్తిన గంపెడు కష్టాలు మోస్తూ కాలం వెళ్లదీస్తున్న వీరు.. ఆకస్మికంగా సంపాదన నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చిన్న సాంకేతిక లోపాన్ని కూడా భూతద్దంతో చూపుతూ.. కూటమి సర్కారు వీరిని కష్టాల కడలిలో నెట్టివేసింది. -
అన్నదాత సుఖీభవలో రైతులకు మోసం
● రూ.40 వేల స్థానే రూ.5 వేలతో సరిపుచ్చిన కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజం ● కలెక్టరేట్ వద్ద పార్టీ శ్రేణుల నిరసన అమలాపురం రూరల్: రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని 2024 జూన్ నుంచి అమలు చేసి రూ.20 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రెండేళ్లకు ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. పార్టీ రైతు నాయకులతో కలిసి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు పీజీఆర్ఎస్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి ఈ పథకాన్ని కోత పెట్టారని, పీఎం కిసాన్ యోజనతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇవ్వాలని కోరారు. బఫర్ స్టాక్ నిర్వహణ లోపం కారణంగా యూరియా ధరను వ్యాపారులు పెంచేస్తున్నారని, యూరియా బస్తాకు బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 అదనంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, గతేడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు బీమా సొమ్ము అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా తొలగించారని, గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు తమ పంటను రోడ్డుపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి అమలు చేస్తే, ఆ పథకాన్నీ ఎత్తివేసి రైతులను కష్టాలపాలు చేశారన్నారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది అన్నదాత సుఖీభవ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాశ్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నూరి రామారావు(బాబి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, ఐటీ విభాగం అధ్యక్షుడు తొరం గౌతం, నాతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 29 అర్జీలు
అమలాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు 29 అర్జీలు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో పోలీస్ అధికారులు అశ్రద్ధ వహించవద్దని ఎస్పీ సూచించారు. అర్జీల్లో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఎస్పీ కృష్ణారావు వారితో చర్చించి, సమస్య పరిష్కార చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్ వద్ద వర్కింగ్ జర్నలిస్టుల నిరసన అమలాపురం రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. జర్నలిస్ట్ డిమాండ్స్ డేను పురస్కరించుకుని సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సంఘ రాష్ట్ర కోశాధికారి, జిల్లా కన్వీనర్ మట్టపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు, ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీహార్ తరహాలో ఇక్కడి జర్నలిస్టులకు రూ.15 వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు సంఘ ప్రతినిధులు పళ్ల సూర్యప్రకాశరావు, కడలి రాజు, హరి, బాబు తదితరులు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, కడలి సూరిబాబు, పి.వెంకటేశ్వరరావు, రెడ్డిబాబు, ఆకుల సురేష్, భీమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభం మూడు రోజుల పాటు విశేష పూజలు కొత్తపేట: కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడపల్లి క్షేత్రంలో నిత్య, పక్ష, మాస, వార్షిక ఉత్సవాల్లో భాగంగా శ్రావణ శుద్ధ దశమి నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసం, దశమి తిథిని పురస్కరించుకుని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అ ర్చకులు, వేద పండితులు మూలవిరాట్ స్వామివారిని, ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. సంప్రదాయబద్ధంగా దీక్షాధారణ చేసి, శాస్త్రోక్తంగా పవిత్రోత్సవ వేడుకలను ప్రారంభించా రు. ఉదయం విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, రుత్విక్వరుణ, ఆకల్మషహోమం, నీరాజన మంత్రపుష్పాలు జరిపారు. సాయంత్రం మృతసంగ్రహణ, అంకురార్పణ, నవమూర్తి ఆవాహన, పంచగవ్యప్రోక్షణ, పంచ శయ్యాధివాసం, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9న పీఠంలో శ్రావణ పౌర్ణమి రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, సామూహిక కుంకుమ పూజలు చేస్తారన్నారు. పీఠంలోని భవానిశంకర అష్టమ లింగేశ్వరస్వామికి ఏకవార రుద్రాభిషేకం, శ్రీదేవి భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామికి తులసిదళ అర్చనలు, నవగ్రహ, నక్షత్ర హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
రైతులు ఐక్యంగా సాగితే విజయం
అంబాజీపేట: రైతులు ఐక్యంగా సాగితే ఎందులోనైనా విజయం సాధించవచ్చని ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు ముత్యాల జమ్మిలు, కోకో ఫెడ్ చైర్మన్ అరిగెల బలరామమూర్తి అన్నారు. స్థానిక సీ్త్రల ఆస్పత్రి సమీపంలోని కొర్లపాటి కోటబాబు వ్యవసాయ క్షేత్రంలో అంబాజీపేట రైతు సంఘం నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జమీలు, బలరామమూర్తి మాట్లాడుతూ కొంతకాలంగా వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండగా, కొన్ని మోటార్లకు బిల్లులు కట్టించుకునేవారన్నారు. దీనిపై రైతులు విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించినా ప్రయోజనం కలగలేదన్నారు. ఈ మేరకు రైతులు అందరితో కలసి ప్రత్యేక కోర్టులో కేసు వేయించామన్నారు. 16 మంది రైతులకు సుమారు రూ.3.20 లక్షల ప్రయోజనం కలిగేలా కోర్టు తీర్పు వచ్చిందన్నారు. రైతుల పక్షాన పోరాడి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ముత్యాల జమీలు, అరిగెల బలరామూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొర్లపాటి కోటబాబు, మట్టపర్తి పరమేశ్వరరావు, మట్టపర్తి కొండ, దొమ్మేటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల శ్రీను, నిట్టాల విజయసాయి పాల్గొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని, అలాగే కొత్త ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు తమ సమస్యలను తెలపవచ్చన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌలు రాయవరం: అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడు గ్యాస్ స్టౌల స్థానంలో ఇండక్షన్ స్టౌలు అందజేసేందుకు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,726 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ఆరు నెలల లోపు చిన్నారుల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 16 వేల వరకూ ఉన్నారు. చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్యతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. చిన్నారులకు ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు వంటలకు ఉపయోగించే గ్యాస్ ఆధారిత పొయ్యిల స్థానంలో విద్యుత్తు సాయంతో నడిచే ఇండక్షన్ స్టౌలు అందజేసే దిశగా చర్యలు చేపట్టారు. సిలిండర్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్ ఉండటంతో సిబ్బంది సకాలంలో గ్యాస్ సరఫరా చేయడం లేదు. ఫలితంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 277 ఇండక్షన్ స్టౌలు సరఫరా చేశారు. చిన్నారులకు సులభంగా ఆహారం తయారు చేసేందుకు వీలుగా విద్యుత్ సాయంతో పనిచేసే స్టౌలతో పాటు నాలుగు రకాల కుక్కర్లు, ఇతర పరికరాలను అందజేస్తున్నారు. మూడు ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు వీటిని ఇచ్చారు. త్వరలోనే మిగిలిన వాటికి అందజేయనున్నారు. ఇప్పటి వరకూ ఏజెన్సీల నుంచి గానీ, ప్రైవేట్ వ్యక్తులు గానీ కేంద్రాలకు సిలిండర్లను సరఫరా చేసేవారు. వారికి ప్రభుత్వం నేరుగా నగదు జమచేసేది. ఇప్పుడు ఇండక్షన్ స్టౌలతో బిల్లుల ఇబ్బంది తప్పనుంది. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరింది. -
అన్ని దారులూ వాడపల్లికే..
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం ● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాల కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నేటి నుంచి పవిత్రోత్సవాలు వాడపల్లి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు. -
వద్దని సాగునంపేలా..
●●● వ్యవసాయం వదులుకునేలా కూటమి ప్రభుత్వ విధానాలు●●● భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● జిల్లాలో రైతులపై రూ.20.08 కోట్ల అదనపు భారం ఆలమూరు: రైతే రాజన్నారు.. దేశానికే వెన్నెముక అన్నారు.. కానీ ఏమున్నది లాభం. ప్రస్తుతం రైతు పరిస్థితి అత్యంత దారుణం.. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతూ.. కరవు కోరల్లో చిక్కుకుంటూ.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూ.. కల్తీ పురుగు మందులు, నకిలీ విత్తనాల బారిన పడుతూ.. పంట నష్టాలను చవిచూస్తున్న పుడమి పుత్రులకు ఆకలే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగు దండగ అన్నట్టు మార్చేసింది. పంటల సాగు వైపు రైతన్నలు చూడకుండా చేస్తోంది.. అన్నదాత సుఖీభవ పథకాన్ని తొలి ఏడాది అమలు చేయకుండా కష్టపెట్టింది. పంటల బీమా భారం సైతం రైతులపై వేసింది. ఇదిలా ఉంటే వరి సాగులో ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడం ఇబ్బందికరంగా పరిణమించింది. రాష్ట్రంలో ఎరువుల ధరలు పెరుగుతున్నంత వేగంగా ధాన్యానికి మద్దతు ధర పెరగకపోవడంతో వ్యవసాయం చేయడానికి చాలామంది వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.300 వరకూ పెరిగింది. జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, పెరిగిన ఎరువుల రూపంలో 1.35 లక్షల మంది రైతులపై రూ.20.08 కోట్ల మేర అదనపు భారం పడనుంది. సరిపడా రాక.. సమస్య తీరక నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాషియం (కె) మిశ్రమంతో కూడిన కాంప్లెక్స్ ఎరువులు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తాయి. అలాంటి కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయడం ఏటా రైతులకు భారం అవుతోంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలోని వరి సాగుకు 43,493 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 24,405 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతుంది. ప్రస్తుతం జిల్లాలోని 166 సొసైటీలతో పాటు కొన్ని ఎరువు, పురుగు మందుల దుకాణాల ద్వారా ఎరువుల విక్రయం జరుగుతోంది. వ్యాపారులు, అధికారులు, డీలర్లు కొన్నిచోట్ల కుమ్మకై ్క ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా ఎకరాకు మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 90 కిలోల (రెండు బస్తాలు) యూరియా, 25 కిలోల వరకూ జింక్, పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలో వెదజల్లు విధానంతో పాటు వరి నాట్లు వేస్తున్నాయి. ఇందులో ఈ ఏడాది 80 శాతం మేర స్వర్ణ (ఎంటీయూ 7029) రకం సాగు చేస్తుండగా, మిగిలిన చోట ఎంటీయూ 1318తో పాటు కొన్ని ఇతర రకాలను పండించడానికి రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీని అందించే యూరియా నిల్వలు జిల్లాకు సరిపడా సరఫరా కాలేదని తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్లో ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్పందించని వ్యవసాయ శాఖ ఎరువుల నిల్వలు, పంపిణీ విధానంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఏవిధమైన స్పందన లేకుండా పోయింది. కనీసం నిల్వల వివరాలు కూడా చెప్పకపోవడం విమర్శలకు తావిస్తుంది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల కాంప్లెక్స్ ఎరువులను రోజుకోఽ ధరకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎరువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ముడిసరకుల ధరలు పెరుగుతున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెబుతున్నారు. పినపళ్లలో వరి పొలంలో ఎరువులు చల్లుతున్న రైతుపినపళ్లలో వరి పొలంలో ఎరువులు జల్లుతున్న రైతువరి పొలంలో ఎరువులను చల్లేందుకు మిశ్రమం సిద్ధం చేస్తున్న రైతుఎరువుల పెరుగుదల ఇలా.. 50 కిలోల బస్తా (రూపాయల్లో) రకం 2019 2021 2024 2025 10–26–26 1,175 1,375 1,550 1,850 20–20–0–13 950 1,175 1,200 1,400 14–35–14 1,250 1,450 1,700 1,900 19–19–19 950 1,175 1,350 1,850 పొటాష్ 1,225 1,350 1,535 1,800 డీఏపీ 1,350 1,350 1,350 1,400 28–28–0 1,275 1,400 1,550 1,850 -
హెచ్ఎంల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
అమలాపురం టౌన్: ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘానికి అనుబంధంగా జిల్లా సంఘం ఏర్పాటైంది. జిల్లా సంఘ గౌరవాధ్యక్షుడిగా జేఎన్ఎస్ గోపాలకృష్ణ, అధ్యక్షుడిగా మోకా ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా నిమ్మకాయల గణేశ్వరరావు, కోశాధికారిగా రాయుడు ఉదయ భాస్కరరావు ఎన్నికయ్యారు. వీరితోపాటు రాష్ట్ర కౌన్సిలర్లుగా బీవీవీ సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాసు, యు.మాచిరాజు, ఇతర జిల్లా కౌన్సిలర్లుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.పల్లయ్యశాస్త్రి, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పీఎన్వీ ప్రసాదరావు, మహిళా ప్రతినిధిగా చిట్టినీడి నిరంజని, మున్సిపల్ పాఠశాలల ప్రతినిధిగా కె.ఘన సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జి.నాగ సత్యనారాయణ, ఎం.వెంకటరాజు, పి.శ్రీరామచంద్రమూర్తి, బి.చిరంజీవిరావు, టీవీ రాఘవరెడ్డి, ఎం.రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘం కోశాధికారి సీవీవీ సత్యనారాయణ వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించారు. రత్నగిరి కిటకిటఅన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది. -
ఇదేం ప్రవేషాలు
● డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం ● ఇప్పటికీ విడుదల కాని ప్రభుత్వ నోటిఫికేషన్ ● ఆందోళన చెందుతున్న విద్యార్థులు రాయవరం: విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది.. సరైన ప్రణాళిక లేకుండా సాగుతున్న వైనం విద్యార్థులను ఇబ్బంది పాల్జేస్తోంది.. దీనికి ఉదాహరణే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ కళాశాలల్లో చేరికలకు ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విద్యా వ్యవస్థను అయోమయంలో పడేస్తోంది. ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు దాటినా నేటికీ డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12,825 మందికిగాను 9,246 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారున్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 53 కళాశాలలు జిల్లాలోని మొత్తం 53 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 30 శాతం సీట్లు మిగిలిపోయాయి. వీడని సందిగ్ధత డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధతతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కూడా ఆందోళనలో ఉన్నారు.తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవడంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునః ప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి. – బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి డిగ్రీ అడ్మిషన్లపై నేటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణం. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతేడాది ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే, ఈ ఏడాది మరింత జాప్యం చేశారు. డిగ్రీ అడ్మిషన్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రంలో ప్రవేశాలు చేపట్టకపోవడం సరికాదు. – మిందిగుదిటి శిరీష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, అమలాపురం -
శరణు గణేశా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 20 జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురికి తులాభారం, తొమ్మిది మంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 49 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 2,200 మంది స్వీకరించారు. ఈ ఒక్క రోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.2,25,767 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. -
16 నుంచి విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్ఓ వి.వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వార్షికోత్సవ వివరాలు వెల్లడించారు. పీఠాధిపతి గాడ్ 1972 ఆగస్టు 18న మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. పీఠంలో నిరంతరాయంగా విజయదుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల 16న పీఠంలో సర్వతోభద్రతా మండప ఆవాహన జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సీతారామ కల్యాణం ఈ నెల 16న ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని బాపిరాజు, బాబీ తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భద్రాచలం వేద పండితులతో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.15 గంటలకు శ్రీ సాయి సత్సంగ నిలయం, పీఠం మహిళా భక్తులతో శక్తిమాల సహిత మణిద్వీప వర్ణన శ్లోకాల పారాయణ, నవదుర్గల సువాసినీ పూజ నిర్వహిస్తారు. 17న జొన్నవాడ వద్ద ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి ప్రధానార్చకులతో మహానవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు అన్నవరం దేవస్థానం పండితులతో అనంత లక్ష్మీ సత్యవతీదేవి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహిస్తారన్నారు. 18వ తేదీ ఉదయం టీటీడీ వారితో విజయదుర్గా పీఠం వద్ద నెలకొల్పిన విజయ వెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శ్రీ వైఖానస ఆగమ పండితులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చన, హారతులు, చతుర్వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. వార్షికోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పీఠం భక్తజన కమిటీ సభ్యులు గాదె భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో పూర్ణిమ దీప్తులు
డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ: దేశం కాని దేశం, అందులోనూ అత్యున్నత పురస్కారం పొందడమంటే మామూలు విషయం కాదు.. ఎంతో సేవ చేసి, అందరితో శభాష్ అనిపించుకోవాలి.. అచ్చం అలానే సేవల్లో గుర్తింపు తెచ్చుకుని లండన్లో బ్రిటన్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారం తీసుకుని కోనసీమ జిల్లా ఆడపడుచు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. బ్రిటన్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ (సీబీఈ)ను కొత్తపేట ఆడపడుచు అయ్యగారి అన్నపూర్ణ (పూర్ణిమ తణుకు) దక్కించుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఐదేళ్ల లోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్కు పూరి్ణమ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉన్నారు. విభిన్న రంగాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి బ్రిటిష్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నత సీబీఈ లభిస్తుంది. అటువంటి పురస్కారం ఇటీవల పూర్ణిమకు దక్కింది. కొత్తపేట నుంచే బాట కొత్తపేటలో ప్రస్తుతం పొట్టిశ్రీరాములు వీధిని ఒకప్పుడు సత్యవోలు రామమూర్తి వీధి అని పిలిచేవారు. ఆ సత్యవోలు రామమూర్తి మనుమరాలు, కొత్తపేట మాజీ సర్పంచ్ సత్యవోలు రామకృష్ణ మేనకోడలు అయ్యగారి అన్నపూర్ణ (పూరి్ణమ). ఆమె తండ్రి విశ్వేశ్వరయ్య అమలాపురంలో టైప్ ఇనిస్టిట్యూట్ నడిపేవారు. తల్లి రత్నాంబ గృహిణిగా ఉండేవారు. అన్నపూర్ణ కొత్తపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకున్నారు. 1960 దశకంలో కొత్తపేట పంచాయతీ సమితి నంబరు– 1 ప్రాథమిక పాఠశాల (వీరయ్యగారి బడి)లో ప్రాథమిక విద్య, 1963–68 వరకూ చింతం అమ్మాణమ్మ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పీయూసీ, డిగ్రీ అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజ్లో, పీజీ ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన అయ్యగారి అన్నపూర్ణ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ప్రతిభా పురస్కారాలను కైవసం చేసుకున్నారు. రిటైర్డ్ హెచ్ఎం, కొత్తపేట ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి కేశవరావు కుమార్తె స్వరాజ్యకుమారి వద్ద శాస్త్రీయ నృత్యం, గైడ్ స్టూడెంట్గా శిక్షణ పొందారు. లండన్లో సర్జన్ అయిన తణుకు వెంకట సూర్యనారాయణతో వివాహానంతరం ‘పూరి్ణమ తణుకు’గా కొత్త జీవితాన్ని ఆరంభించారు. విశేష కృషికి గుర్తింపుగా.. పూరి్ణమ తణుకు మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అందించే విద్యలో చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. ఇంత వరకూ బ్రిటన్లో స్థిరపడి పౌరసత్వం పొందిన తెలుగు వారెవరికీ దక్కని గౌరవమిది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి కృషిని భిన్నస్థాయిల్లో అత్యంత నిశితంగా పరిశీలించి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గత నెల 22న బ్రిటిష్ రాజవంశీకులుండే విండ్సార్ కేజిల్లో ఎంతో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్–2, ప్రిన్స్ ఫిలిప్ల కుమార్తె, ప్రస్తుత బ్రిటన్రాజు చార్లెస్ ఏకైక సోదరి అయిన ప్రిన్సెస్ ఆనీ ఈ పురస్కారాన్ని పూరి్ణమకు అందజేశారు. హేమాహేమీల çపక్కన.. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బ్రిటన్ ఆధునిక నాటక రచయిత, దర్శకుడు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్ వంటి హేమాహేమీలు గతంలో ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో కొందరు. ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ ‘షెనెల్’కు సీఈఓగా ఉంటున్న లీనా నాయర్ కూడా సీబీఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా పూరి్ణమ అందుకుని ఆ ప్రముఖుల సరసన నిలిచారు. ఈ పురస్కారాన్ని పొందటంలో తన కుటుంబం ఎంతో తోడ్పడిందని, అలాగే మిత్రులు, తన బృంద సభ్యుల కృషి కూడా ఉందని పూర్ణిమ తెలిపారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట ఆడపడుచు, అక్కడ పూర్వ విద్యార్థిని అయిన పూరి్ణమకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం పొందడం పట్ల ఈ గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
స్మార్ట్ షాక్
సాక్షి, అమలాపురం: తమపై విద్యుత్ భారం పడుతుందని వినియోగదారులు.. తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని అని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్ వెనక్కు తగ్గడం లేదు. ఎంత మంది వేడుకున్నా, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేశారు. దీనితో ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలకు ప్రజా సంఘాలకు సిద్ధమవుతున్నాయి. 49,325 సర్వీసులకు ఏర్పాటు కోనసీమ జిల్లాలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వినియోగదారులు గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ క్యాటగిరీలలో 6.32 లక్షల విద్యుత్ సర్విసులున్నాయి. తొలి విడతలో క్యాటగిరీ–2 పరిధిలో ఉన్న షాపులు, పరిశ్రమలు, సినిమా హాళ్లు, ఎక్కువ విద్యుత్తు వినియోగించే వ్యాపార సంస్థలకు సర్విసులకు స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 63,686 సర్విసులు క్యాటగిరి– 2 పరిధిలో ఉండగా, ఇంత వరకు 49,325 విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు వేయడం పూర్తి చేశారు.ఈ మీటర్ల ఏర్పాటుపై వ్యాపార సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు వెనకడుగు వేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మీటర్లు వేయవద్దని అడ్డుకుంటున్నా లెక్క చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5,43,481 సర్విసులు క్యాటగిరీ –1లో ఉన్నాయి. వీటికి స్మార్ట్ మీటర్లు వేసేది లేదని అధికారులు చెబుతున్నా వినియోగదారులలో నమ్మకం కలగడం లేదు. ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ఉండడం వల్ల కేటగిరీ–1లో ఉన్న గృహాలకు కూడా రెండో దశలో స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు ఇవే స్మార్ట్ మీటర్ల బిగింపు భారం వినియోగదారులపై ఉండదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ భారం ఏదో ఒక రూపంలో తమపై వేస్తారని వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్ ఖర్చు సింగిల్ ఫేజ్కు రూ.9 వేలు, త్రీఫేజ్కు రూ.17 వేల చొప్పున మొత్తం 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచే వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందన సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. ⇒ ఏదైనా కారణాల వల్ల స్మార్ట్ మీటర్ పాడైపోతే సొమ్ములు చెల్లించి కొత్త మీటర్ మార్చుకోవాలి. ⇒ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత గంట గంటకూ రీడింగ్ తీస్తారు. పగలు కంటే రాత్రి వాడే కరెంటుకు అధిక బిల్లులు వేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని వినియోగదారుల అనుమానం. ⇒ విద్యుత్ బిల్లులలో తప్పులకు సమాధానం చెప్పే నాథుడే ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందనే అనుమానాలున్నాయి. 5న సబ్ స్టేషన్ల ముట్టడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైపు విద్యుత్ చార్జీల బాదుడు, మరో వైపు స్మార్ట్ మీటర్ల భారంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. దీనిపై ఈ నెల 5వ తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావేదిక ఆధ్వర్యంలో అమలాపురం సీఐటీయూ కార్యాలయంలో ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విసయం తెలిసిందే. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గా ప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కారి్మక సంఘం, కౌలు రైతు సంఘం తదితర ప్రజా సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఉపాధికి ఎసరు స్మార్ట్ మీటర్ల వల్ల తాము ఉపాధి కోల్పోతామనే ఆందోళనలో మీటర్ రీడర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది వరకు ఉండగా కోనసీమ జిల్లాలో సుమారు 180 మంది వరకు ఉన్నారని అంచనా. వీరికి నెలకు సగటున రూ.పది వేల వరకు వస్తోంది. స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. వీరందరూ పొట్టకూటి కోసం పోరుబాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఇది వినియోగదారులకు మోయలేని భారంగా మారనుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిరసనగా ఈనెల 5న చేపట్టే ఆందోళనకు అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలి.– కొప్పుల సత్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు అపోహలొద్దు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై అపోహలు వద్దు. వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవస్థలో పారదర్శక పెరుగుతుంది. స్మార్ట్ మీటర్ కన్సూ్యమర్ యాప్ ద్వారా 247కు కనెక్ట్ అయి ఉంటాయని, ఫలితంగా వినియోగదారులు తమ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. – బి రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ, కోనసీమ -
ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన
అమలాపురం టౌన్: ఇంటర్ విద్యలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఓరియెంటేషన్ ప్రోగామ్లు శనివారం నుంచి మొదలయ్యాయని డీఐఈఓ వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇందులో భాగంగా అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన గణితం ఓరియెంటేషన్ ప్రోగామ్లో ఆయన మాట్లాడారు. రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు కె.గణేశ్వరరావు జిల్లాలోని గణిత అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. అలాగే వచ్చే డిసెంబర్ వరకూ వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కూడా వృత్యంతర శిక్షణ తరగతులు ప్రతి నెలలోనూ జరుగుతాయన్నారు. దీనివల్ల అధ్యాపకులు సిలబస్లో వస్తున్న మార్పులు, ప్రశ్నపత్రాల మోడల్స్పై విద్యార్థులకు వివరించే విధానం మొదలైందని వివరించారు. దీనివల్ల అంశాల వారీగా చర్చించి నాణ్యమైన బోధన పద్ధతులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని డీఐఈఓ చెప్పారు. పీఎంశ్రీ పాఠశాలలకు పంద్రాగస్టు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రాయవరం: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మూడు విడతల్లో 28 పాఠశాలలను పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాలల్లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేశారు. దీనికి సంబంధించి సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫేజ్–1, 2 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధులు కేటాయించారు. ఇలా జిల్లాలో 26 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.6.50 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో విద్యార్థుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమాలు జరపాలి. రత్నగిరి కిటకిట సత్యదేవుని దర్శనానికి 30 వేల మంది అన్నవరం: రత్నగిరి శనివారం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనా నికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పూజల అనంతరం ప్రాకార సేవ నిర్వహించి స్వామి, అమ్మవార్లను తిరిగి ఆలయానికి చేర్చారు. కాగా, రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగించనున్నారు. వేలం ఖరారు రత్నగిరికి వచ్చే భక్తుల సెల్ఫోన్లు, కెమేరాలు భద్రపరచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంపాట నెలకు రూ.8.11 లక్షలు చొప్పున ఏడాదికి రూ.97.32 లక్షలకు రికార్డు స్థాయిలో ఖరారైంది. సెల్ఫోన్ భద్రపర్చడానికి ఇప్పటి వరకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉండగా దానిని రూ.పదికి పెంచడంతో వేలంపాట భారీగా పెరిగింది. రూ.ఐదు వసూలుకు రెండేళ్ల క్రితం వేలం పాట నిర్వహించగా నెలకు రూ.3.31 లక్షలకు ఖరారైంది. కాగా ఆ వసూలు రూ.పది పెంచగా వేలం రెట్టింపు అంటే రూ.6.62 లక్షలు కావాలి. కానీ అంతకంటే ఎక్కువ మరో రూ.1.49 లక్షలు పెరిగింది. ఇలా ఏడాదికి ఖరారైన వేలం రూ.97.32 లక్షలపై 18 శాతం జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. అంటే దాదాపు రూ.17.46 లక్ష లు జీఎస్టీ చెల్లించాలి. అంటే ఏడాదికి సుమారు రూ.1.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. -
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో ఇటీవల బదిలీ అయిన 60 వేల మంది ఉపాధ్యాయులకు రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత జూన్ నెలలో సాధారణ బదిలీల్లో భాగంగా దాదాపు 67 వేల మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం జరిగిందన్నారు. కొందరు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంలుగా, మరికొందరు ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా పంపించిందని గుర్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్ సమాన క్యాడర్ బదిలీలు జూన్ 9తో, ఎస్జీటీల బదిలీలు జూన్ 14తో ముగిశాయన్నారు. మరుసటి రోజు అందరూ బదిలీల ప్రకారం కొత్త పాఠశాలలకు వెళ్లి బాధ్యతలు చేపట్టారని వివరించారు. కొందరు ఉన్న క్యాడర్లలోనే స్థానికంగా మారడంతో వారికి వేతనాలు అందాయన్నారు. కానీ పోస్టుతో సహా స్థానచలనం కలిగిన దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు జీతాలు జమ కాలేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం రెండు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. -
ప్రవర్తన నియమావళిపై పట్టు సాధించాలి
సామర్లకోట: ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి (సీపీఏ)పై ఎంపీడీఓలు పట్టు సాధించాలని కొత్తపేట ఎంపీడీఓ పీఎస్ నరేష్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆరో రోజు శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఇతర ఽఅధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కు అయినట్లు రుజువైతే శిక్ష ఉంటుందన్నారు. కింది స్థాయి సిబ్బంది తప్పులు చేసిన సమయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారిని సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు. -
మిత్రోత్సాహం..
ఫ సోషల్ మీడియా వేదికగా బలపడుతున్న స్నేహం ఫ మనసుకు ఓదార్పునిస్తున్న బంధం ఫ నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రాయవరం: స్నేహం.. సృష్టిలో మధురమైంది.. జీవితంలో మరువలేనిది.. ఆత్మీయతను పంచేది.. ఆహ్లాదాన్ని అందించేది.. అక్షరాలకతీతమైన పుస్తకం లాంటిది.. భారమైన హృదయానికి ఓదార్పునిస్తుంది.. కష్టాల్లో ఆసరా అవుతోంది. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతమని అంటుంటారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు మిత్రులంతా సిద్ధమవుతున్నారు. సెల్ఫోన్ వినియోగం మనుషుల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సరికొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. సోషల్ మీడియా సమాచార వ్యాప్తిలో ప్రధాన భాగస్వామిగా నిలుస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు, తదుపరి ఫోన్లో మాట్లాడుకునే స్థాయి నుంచి సోషల్ మీడియా సాయంతో దేశ, విదేశాల్లో ఉంటున్న వారు సైతం వీడియో కాల్స్ ద్వారా సంభాషణలు సాగిస్తున్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులతో సామాజిక సంబంధాల్లో ఊహించని మార్పు వచ్చింది. 90 శాతం మంది మొబైల్ ఫోన్లలో మై ఫ్యామిలీ, టెనన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పేర్లతో తప్పనిసరిగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఈ గ్రూపుల ద్వారా చిన్ననాటి స్నేహితుల నుంచి ఆఫీసులో కొలీగ్స్ వరకూ అందరూ నిత్యం టచ్లో ఉంటున్నారు. స్నేహితుల దైనందిన జీవితంలో జరిగే మంచి చెడులను ఎప్పటికప్పుడు పంచుకోవడమే కాదు, శుభాకాంక్షలూ చెప్పుకొంటున్నారు. రెండు దశాబ్దాల నుంచి.. రాయవరంలో 2002లో తొలిసారి 1981–82 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలిశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాయవరంలో కలిసినట్లు చె బుతుంటారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచా రం కావడంతో ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు నాంది పలికినట్లైంది. అప్పుడు ప్రారంభమైన పూర్వ విద్యార్థుల కలయిక దినదినప్రవర్ధమానమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఏటా సంక్రాంతి సమయాల్లో లేదా, వేసవి సెలవుల్లో, వివిధ సందర్భాల్లో కలుసుకుంటున్నారు. ప్రతి సమాచారం వాట్సాప్లోనే.. పూర్వ విద్యార్థులు పలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో నిత్యం స్నేహితుల యోగక్షేమాలతో పాటు, గ్రామంలో జరుగుతున్న కార్యకలాపాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. స్నేహితుల కష్టసుఖాలను తెలుసుకుంటూ అవసరమైన మేరకు మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కదా స్నేహమంటే.. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1989–94 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 2016 జనవరిలో కలిశారు. తమ బ్యాచ్కు చెందిన నలుగురు స్నేహితుల ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అంతా కలసి ఆర్థిక సాయం అందించారు. నలుగురు విద్యార్థులకు రూ.5.25 లక్షలు అందజేశారు. అలాగే 2016 నుంచి ఏటా రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న పూర్వ విద్యార్థులంతా కలుసుకుని, పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకూ రూ.6.50 లక్షలు విద్యార్థులకు అందజేశారు. స్నేహమంటే కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం కాదని, మిత్రులకు, సమాజానికి మంచి చేయాలని నిరూపిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు. జాగ్రత్తలూ అవసరమే.. సోషల్ మీడియా ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్, ఇన్స్ర్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. అపరిచితులు పరిచయాలను పెంచుకుంటున్నారు. పరిచయాన్ని స్నేహంగా మలచుకుంటున్నారు. ఆపై స్నేహాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడడం వంటి ఘటనలు చూస్తున్నాం. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ పట్ల యువత, ముఖ్యంగా బాలికలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ మొదటికే మోసం తెస్తుండడంతో అపరిచితులతో ఆచితూచి స్నేహం చేయాల్సిన అవసరం కూడా ప్రస్తుత కాలంలో ఉంది. ఇదిలాఉంటే మార్కెట్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ల అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం
రూ.16 లక్షల ఆస్తి నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక శ్యామలా సెంటర్ వద్ద చెప్పుల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం రోడ్డు నుంచి కోటిపల్లి బస్టాండ్కు మలుపు తిరిగే ప్రాంతంలో ఆనుకుని ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన షేక్ మొహియుద్దీన్, ఆర్ఎస్ దత్తు ఈ చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.40 గంటలకు ఆ దుకాణంలోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేశారు. ప్రమాదానికి దగ్గరలోనే అగ్నిమాపక కార్యాలయం ఉండడంతో వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నగరంలోని ఆర్యాపురం, ఇన్నీసుపేట అగ్నిమాపక యంత్రాలతో పాటు కొవ్వూరు నుంచి మరో వాహనాన్ని రప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణానికి ఆనుకుని ఉన్న బాలాజీ అక్వేరియం, పెట్స్ దుకాణం అగ్ని ప్రమాదానికి గురైంది. సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి సీహెచ్ మార్టిన్రూథర్ కింగ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంటలను చాకచక్యంగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. -
అయస్కాంతాన్ని మింగేసిన బాలిక
తొలగించిన వైద్యులు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని బురదకోట గ్రామ పంచాయతీ బాపన్నధార గిరిజన గ్రామానికి చెందిన మాడెం రమ్య ఓ తినుబండారం ప్యాకెట్లో ఉన్న అయస్కాంతం ముక్కను మింగేసింది. ఆ బాలికను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి దానిని వైద్యులు తొలగించారు. మాడెం రమ్య బురదకోటలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. రింగ్ ప్యాకెట్లు తినే అలవాటు ఉన్న బాలిక ఆ ప్యాకెట్లోని తిను బండారాలతో పాటు అయస్కాంతం ముక్కను కూడా మింగేసింది. ఆమెను ప్రత్తిపాడు, ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించగా ఫలితం లేకపోవడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అయస్కాంతం ముక్కను తొలగించారు. ఈ అంశంపై సంబంధిత రింగ్ కంపెనీపై న్యాయ పోరాటం చేస్తామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. -
దళిత సర్పంచ్ను అవమానించారంటూ ఫిర్యాదు
అమలాపురం రూరల్: పేరూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆ గ్రామ సర్పంచ్ దాసరి అరుణాడేవిడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళా సర్పంచ్ కావడంతోనే స్థానిక నాయకులు తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్కు విరుద్ధంగా సర్పంచ్ లేకుండా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పింఛన్లు పంపిణీ చేయడం దారుణమని ఆమె శనివారం డీఎల్పీఓ బొజ్జిరాజుకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ కుడుపూడి సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి సుబ్బిరామ్, వాసంశెట్టి శ్రీనివాసరావు, దొంగ ఆంజనేయులు, వార్డు సభ్యుడు అప్పారి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దాసరి నాగేశ్వరరావు తదితరులు డీఎల్పీఓకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ కార్యక్రమంలో సర్పంచ్ లేకుండా ప్రోటోకాల్కు విరుద్ధంగా ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేయడం సరికాదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ జగ్గంపేట: కాట్రావులపల్లిలో పోలీసుల తనిఖీల్లో గంజాయితో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో శనివారం కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాట్రావులపల్లికి చెందిన కె.లోవరాజు అనే రాజేష్ ఎలియాస్ పటేల్ (37)ను అనుమానంతో అరెస్టు చేశారు. అతని వద్ద 4.38 కిలోల గంజాయి లభ్యమైంది. లోవరాజును పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. -
అగ్గి... సర్వం బుగ్గి
ఫ చినశంకర్లపూడిలో అగ్ని ప్రమాదం ఫ ఆరు తాటాకిళ్లు భష్మీపటలం ప్రత్తిపాడు: ఊరంతా నిశ్శబ్దం.. అందరూ నిద్రలోకి జారుకున్నారు.. ఇంతలో ఒళ్లంతా వేడి సెగలు.. తుల్లిపడిన ఆ కుటుంబాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాయి.. తేరుకునేలోపే ఆరు తాటాకిళ్లు కాలిపోయాయి. సర్వం బుగ్లి అయ్యింది. ఆ పేద కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఆరు కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. విద్యుత్ షార్ట్షర్క్యూట్ కారణంగా ముంచుకొచ్చిన ముప్పు ఇళ్లను బూడిద చేసింది. చినశంకర్లపూడి హరిజన కాలనీలో బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ కుటుంబాలు తాటాకిళ్లలో జీవిస్తున్నారు. వీరంతా వ్యవసాయ కూలీలే. ఒక్కసారిగా అగ్నికీలలు ఊరంతా గాఢ నిద్రలో ఉండగా శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో బుర్రి మరిడమ్మ తాటాకింటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. తేరుకునే లోగా మంటలు ఒక్కొక్క ఇంటికి వ్యాపించాయి. ఇళ్లలోని వారంతా బయటకు పరుగులు తీశారు. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి చొప్పున మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ ఇళ్లకు మంటలు వ్యాపించాయి. బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, పిరాటి అచ్చారావు ఇళ్లలో వేడిమికి గ్యాస్ సిలెండర్లు పేలిపోవడంతో మంటలు క్షణాల్లోనే ఆరు తాటాకిళ్లను భష్మీపటలం చేశాయి. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ కె.రాముడు, లీడింగ్ ఫైర్మెన్ కేఎస్ఎన్ మూర్తి తమ సిబ్బందితో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ రాముడు తెలిపారు. బాధితులంతా నిరుపేదలే.. ఒంటరి మహిళ బుర్రి మరిడమ్మ ఒక ఇంట్లో ఉంటుండగా, చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు, భార్యతో కలసి మానూరి రాజబాబు ఒక ఇంట్లో, భార్య నాగమణితో కలసి ముతకల నాగేశ్వరరావు, భార్యతో కలసి పిరాటి అచ్చారావు, భార్య కుమారుడితో కలసి పిరాటి అప్పారావు, ఒంటరిగా పులగపూరి సత్యనారాయణలు మరో ఇంట్లో జీవిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో సమస్తం కాలి బూడిద కావడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సందర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, వంట సామగ్రి పంపిణీ చేశారు. -
బోధనేతర పనులు అప్పగించొద్దు
ఎమ్మెల్సీ గోపిరాజు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ సాయి శ్రీనివాస్అమలాపురం టౌన్: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పలు బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీ–4 కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను నిర్బంధించవద్దని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ బొర్రా గోపిరాజు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధన కోసం అమలాపురం నల్లవంతెన కూడలిలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. ఉదయం ధర్నా చేసిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్కు ప్రదర్శనగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ కె.విశ్వేశ్వరరావుకు అందించారు. 19 డిమాండ్లపై ధర్నాలో వక్తలు చర్చించారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కేవలం బోధన బాధ్యతలు చేపడితే విద్యా ప్రమాణాలతో పాటు మెరుగైన ఉత్తీర్ణత సాధించవచ్చని వక్తలు అన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ ప్రకటించాలన్నారు. ఽఈ ధర్నాకు సీపీఐ, సీపీఎం, పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఫ్యాప్టో ఆర్థిక కార్యదర్శి కె.రామచంద్రం, డిప్యూటీ సెక్రటరీ సరిదే సత్య పల్లంరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పి.వెంకటేశ్వరరావు, ఎస్ఎన్ మునేశ్వరరావు, జీవీవీ సత్యనారాయణ, అబ్దుల్ రహీమ్, ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
● మార్మోగిన వాడపల్లి క్షేత్రం ● ఒక్క రోజే రూ.60.47 లక్షల ఆదాయం కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శ్రావణమాసం శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా నామస్మరణతో ముందుకు సాగారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనల అనంతరం రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఎండ బారిన పడకుండా.. ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడకుండా ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను పర్యవేక్షించి భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. స్నాన ఘట్టం, తలనీలాల విభాగానికి వెళ్లే భక్తుల కోసం టెంట్లు, మ్యాట్లు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులను వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ ఒక్కరోజు సాయంత్రం 5 గంటల వరకూ విశిష్ట, ప్రత్యేక దర్శనాలు, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి రూ.60,46,652 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. -
అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారి పాత గుడితో పాటు కొత్త గుడి కిటకిటలాడింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,78,173 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారి నిత్య అన్నదానానికి రూ.77,978 విరాళాలుగా వచ్చాయన్నారు. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకోగా, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. హైదరాబాద్కు చెందిన వేగిరౌతు లక్ష్మీపవన్, నాగతులసి దంపతులు రూ.10,116, తాటిపాకకు చెందిన మొల్లేటి శ్రీనివాసరావు, శ్రీవరహలక్ష్మి దంపతులు రూ.10,116 అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందించారు. వారికి అర్చకులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు● విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా ● రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు సెక్షన్ల తనిఖీ రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గోదావరి నదికి 2027వ సంవత్సరంలో జరగనున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను సంబంధిత అధికారులతో కలసి తనిఖీలు చేశారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాతో రాజహేంద్రవరం స్టేషన్లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పుష్కర యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు ఆయా స్టేషన్లలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్లో అదనపు లిఫ్ట్లు, ఎస్క్యులేటర్లు, టికెట్ బుకింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాల ఆధునికీకరణ, సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు, సిట్టింగ్ ప్రదేశాలు, షెల్టర్లు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో కృషిచేయాలని వివరించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూల్లో క్షుద్రపూజలు?.. వారి పనేనా?
కాకినాడ జిల్లా(సామర్లకోట): స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు.విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెచ్ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు.ఈ మేరకు పాఠశాల హెచ్ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్ఎం తెలిపారు. -
సైబర్ మోసాలపై అవగాహన
అమలాపురం టౌన్: సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో బ్యాంక్ల ఖాతాదారులు ఆ మోసాల బారిన పడకుండా వారిలో చైతన్యాన్ని నింపి అవగాహన కల్పించాలని ఎస్పీ బి.కృష్ణారావు వివిధ బ్యాంక్ల అధికారులకు సూచించారు. స్థానిక ఎస్సీ కార్యాలయంలో సైబర్ మోసాల నియంత్రణపై శుక్రవారం జరిగిన వాణిజ్య బ్యాంకుల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ ఖాతాలపై ఎప్పటికప్పుడు పరిశీలన ఉండాలన్నారు. కేవైసీ సిస్టమ్స్ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఖాతాదారుల ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుంటే అలాంటి ఖాతాలను గమనించి మొదటి దశలోనే ఖాతాదారులను అప్రమత్తం చేయాలన్నారు. సైబర్ అఫెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను ఎస్పీ చర్చించి బ్యాంక్ల అధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు భారీ ఎత్తున డబ్బును లూటీ చేస్తున్నారని వివరించారు. దీనిపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ బ్యాంక్లో సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు, అకౌంట్ ఫ్రీజ్ విషయంలో ‘1930’ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. పలు బ్యాంక్ల మేనేజర్లతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.బ్యాంక్ అధికారులకు ఎస్పీ కృష్ణారావు సూచన -
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
ముమ్మిడివరం: అన్న క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరంలో గల అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్బాబు, ఏఈ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు. ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్పై అవగాహన కల్పించాలికాకినాడ లీగల్: ఆస్తి రిజిస్ట్రేషన్తో పాటు వెంటనే ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ చేసే ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. ఆటోమ్యుటేషన్ విధానం అమలును తొలి రోజైన శుక్రవారం కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ జరుగుతున్న తీరు, సమస్యలపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ వసూలు రికార్డులను పరిశీలించారు. రోజువారీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మిని వివరాలడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సేవలపై కక్షిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఆటోమ్యుటేషన్ ప్రక్రియపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, బ్రోచర్లు ముద్రించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మనీషా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్వీ రామారావు, ఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజే ఇబ్బందులు ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ ద్వారా కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ విధానంలో సమస్యలు రావడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆటోమ్యుటేషన్ ద్వారా తొలి రోజు చెరొక డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. -
రాజధానికి లక్ష ఎకరాలు అవసరమా?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర రాజధానిని లక్ష ఎకరాల్లో నిర్మిస్తామంటున్నారని, అంత భూమి అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్లలో వెయ్యి ఎకరాలతో రాజధాని నిర్మించారన్నారు. రైతుల భూములు లక్ష ఎకరాలు ఎందుకు సేకరించాలని, వారి పొట్ట ఎందుకు కొట్టాలని నిలదీశారు. 50 అంతస్తుల భవనాలు నిర్మించాలని చంద్రబాబు అంటున్నారని, కృష్ణా తీరంలో అన్ని అంతస్తులతో భవనాల నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టు కడతామంటున్నారని, వర్షం కురిస్తే ఆ ప్రాంతం ముంపునకు గురవుతోందని, అప్పుడు నీటిలో నడిపే విమానాలు తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రాజధాని పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఎంపీ మిథున్రెడ్డి చాలా చిన్న వయస్సు నుంచే తనకు తెలుసన్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా తనకు తెలుసని, మిథున్రెడ్డి అరెస్టు చాలా బాధాకరమని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్రెడ్డి చిన్న బిడ్డ అని, రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు పాలన గురించి ఎంతో ఊహించానని, కానీ, ఆయన పాలన వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటి వరకూ అప్పులు చేయడానికే మాత్రమే చంద్రబాబు చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చచొక్కా కనిపిస్తే సెల్యూట్ కొడుతున్నారని, మిగిలిన వారిని శత్రువులుగా చూస్తున్నారు ఇది సరికాదని మోహన్ అన్నారు. ఫ చంద్రబాబు పాలన ఈవిధంగా ఉంటుందని ఊహించలేదు ఫ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ -
దాత సాయంతో స్కూల్కు డైనింగ్ హాల్
మామిడికుదురు: స్థానిక జెడ్పీహెచ్ స్కూల్ ప్రాంగణంలో పాశర్లపూడి గ్రామానికి చెందిన భూపతి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం అతని కుటుంబ సభ్యులు రూ.35 లక్షలతో అధునాతన డైనింగ్ హాల్ నిర్మించారు. స్కూల్ పూర్వ విద్యార్థి అయిన నాగేశ్వరరావు ఈ ప్రాంతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. అతని పేరిట స్కూల్ ప్రాంగణంలో శాశ్వత కట్టడం నిర్మించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి డైనింగ్ హాల్ను నిర్మించారు. డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు 40 స్టీలు బెంచీలు, 20 టేబుల్స్ కొని ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్కూల్ల్ 460 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. స్కూల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తీనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్ హాల్ నిర్మించారు. శనివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని హెచ్ఎం బి.చిరంజీవిరావు తెలిపారు. -
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా యూనియన్ ఎన్నిక
అమలాపురం టౌన్: జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు స్థానిక యూటీఎఫ్ హోమ్లో శుక్రవారం సమావేశమై జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ సీహెచ్ లోవలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా కె.కృష్ణవేణి, అధ్యక్షురాలిగా ఎస్.బేబీ సరోజిని, ప్రధాన కార్యదర్శిగా టి.నాగవరలక్ష్మి, కోశాధికారిగా ఎస్.వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దుర్గ, కరుణ, సంయుక్త కార్యదర్శిగా లోవలక్ష్మి ఎన్నికయ్యారు. మొత్తం 23 మందితో యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. మధ్యాన్న భోజన పథకానికి బడ్జెట్ పెంచి కార్మికులు వేతనాలు పెంచాలని సమావేశం డిమాండ్ చేసింది. కార్మికునికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10 వేల వేతనం ఇవ్వాలని సూచించింది. వంట చేసేటప్పుడు కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. -
నెమ్మదిగా తగ్గుతున్న వరద
ఐ.పోలవరం: గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. వరద నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద జలాల రాక తగ్గుతోంది. దీనితో బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి దిగువునకు 5,86,477 క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం ఆరు గంటల సమయానికి 5,14,177 క్యూసెక్కులకు తగ్గింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతానికి 4,71,927 క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే బ్యారేజీ వద్ద ఉధృతి తగ్గినా దిగువున లంక గ్రామాలను వరద వీడలేదు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి, పి.గన్నవరం అక్విడెక్టులను తాకుతూ ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరికి జూలై నెలలో రెండవ సారి వచ్చిన వరద కూడా స్వల్పంగానే ప్రభావం చూపించడంతో లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు. సగటున పది మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 10 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యధికంగా పి.గన్నవరం మండలంలో 36.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మలికిపురం మండలంలో ఒక మిల్లీమీటర్ కురిసింది. అంబాజీపేటలో 30.8, అమలాపురంలో 25.2, ముమ్మిడివరంలో 20.4, ఐ.పోలవరంలో 16.4, మామిడికుదురులో 16.2, అల్లవరంలో 12.8, ఉప్పలగుప్తంలో 11.8, రాజోలులో 10, అయినవిల్లిలో 9.6, కాట్రేనికోనలో 9.2, మండపేటలో 6.2, కొత్తపేటలో 5, కె.గంగవరంలో 4.2, ఆత్రేయపురంలో 3.6 మిల్లీ మీటర్లు నమోదైంది. -
పశుదాన యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు
● కలెక్టర్ మహేష్ కుమార్ ● అధికారులతో సమావేశం అమలాపురం రూరల్: జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుదాన యూనిట్లు నెలకొల్పేందుకు మండలాల వారీగా సంఘాలను ఏర్పాటు చేసి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆయన గురువారం పశుసంవర్ధక శాఖ, ఉద్యాన అధికారులుతో సమావేశం నిర్వహించారు. కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ప్రధాన మంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను రాయితీలతో ప్రోత్సహించాలన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమ స్థాపనకు జిల్లా పరిశ్రమల కేంద్రం లీడ్ బ్యాంకు అధికారులు రాయితీలలు ఇవ్వాలని ఆదేశించారు. స్థానికంగా కొబ్బరి ఆక్వా ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ● జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ, మామిడికుదురు మండలం పూర్వపు విద్యార్థులైన నవీన్, సూర్యప్రసాద్, రవీంద్రనాథ్, నిరంజన్.. కెరీర్ గైడెన్స్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి మేరకు ఏ రంగాలలో స్థిరపడాలనుకున్నారో, ఆ దిశగా అవగాహన కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ వారిని ఫలానా వృత్తి కోర్సులు తీసుకోవాలని బలవంతం చేయరాదన్నారు. ● అర్హులైన రైతులందరికీ శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు రూ.7 వేల జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు తీరుపై అధికారులతో మాట్లాడారు. ● పీ4 కార్యక్రమంలో గ్రామ సభలు, సర్వేల ద్వారా బంగారు కుటుంబాల అవసరాల గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 65 వేల బంగారు కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 27 వేల కుటుంబాలను దత్తత ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 19 మార్గదర్శులను గుర్తించినట్లు తెలిపారు. -
స్మార్ట్ షాక్
భవిష్యత్తులో ఇబ్బందులు విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఇది వినియోగదారులకు మోయలేని భారంగా మారనుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిరసనగా ఈనెల 5న చేపట్టే ఆందోళనకు అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలి. – కొప్పుల సత్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు అపోహలొద్దు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై అపోహలు వద్దు. వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవస్థలో పారదర్శక పెరుగుతుంది. స్మార్ట్ మీటర్ కన్స్యూమర్ యాప్ ద్వారా 247కు కనెక్ట్ అయి ఉంటాయని, ఫలితంగా వినియోగదారులు తమ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. – బి రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ, కోనసీమ సాక్షి, అమలాపురం: తమపై విద్యుత్ భారం పడుతుందని వినియోగదారులు.. తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని అని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్ వెనక్కు తగ్గడం లేదు. ఎంత మంది వేడుకున్నా, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేశారు. దీనితో ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలకు ప్రజా సంఘాలకు సిద్ధమవుతున్నాయి. 49,325 సర్వీసులకు ఏర్పాటు జిల్లాలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వినియోగదారులు గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ క్యాటగిరీలలో 6.32 లక్షల విద్యుత్ సర్వీసులున్నాయి. తొలి విడతలో క్యాటగిరీ–2 పరిధిలో ఉన్న షాపులు, పరిశ్రమలు, సినిమా హాళ్లు, ఎక్కువ విద్యుత్తు వినియోగించే వ్యాపార సంస్థలకు సర్వీసులకు స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 63,686 సర్వీసులు క్యాటగిరి– 2 పరిధిలో ఉండగా, ఇంత వరకు 49,325 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు వేయడం పూర్తి చేశారు. ఈ మీటర్ల ఏర్పాటుపై వ్యాపార సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు వెనకడుగు వేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మీటర్లు వేయవద్దని అడ్డుకుంటున్నా లెక్క చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5,43,481 సర్వీసులు క్యాటగిరీ –1లో ఉన్నాయి. వీటికి స్మార్ట్ మీటర్లు వేసేది లేదని అధికారులు చెబుతున్నా వినియోగదారులలో నమ్మకం కలగడం లేదు. ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ఉండడం వల్ల కేటగిరీ–1లో ఉన్న గృహాలకు కూడా రెండో దశలో స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు ఇవే స్మార్ట్ మీటర్ల బిగింపు భారం వినియోగదారులపై ఉండదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ భారం ఏదో ఒక రూపంలో తమపై వేస్తారని వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్ ఖర్చు సింగిల్ ఫేజ్కు రూ.9 వేలు, త్రీఫేజ్కు రూ.17 వేల చొప్పున మొత్తం 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచే వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందన సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. ● ఏదైనా కారణాల వల్ల స్మార్ట్ మీటర్ పాడైపోతే సొమ్ములు చెల్లించి కొత్త మీటర్ మార్చుకోవాలి. ● స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత గంట గంటకూ రీడింగ్ తీస్తారు. పగలు కంటే రాత్రి వాడే కరెంటుకు అధిక బిల్లులు వేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని వినియోగదారుల అనుమానం. ● విద్యుత్ బిల్లులలో తప్పులకు సమాధానం చెప్పే నాథుడే ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందనే అనుమానాలున్నాయి. 5న సబ్ స్టేషన్ల ముట్టడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైపు విద్యుత్ చార్జీల బాదుడు, మరో వైపు స్మార్ట్ మీటర్ల భారంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. దీనిపై ఈ నెల 5వ తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావేదిక ఆధ్వర్యంలో అమలాపురం సీఐటీయూ కార్యాలయంలో ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విసయం తెలిసిందే. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గా ప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం తదితర ప్రజా సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఉపాధికి ఎసరు స్మార్ట్ మీటర్ల వల్ల తాము ఉపాధి కోల్పోతామనే ఆందోళనలో మీటర్ రీడర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది వరకు ఉండగా కోనసీమ జిల్లాలో సుమారు 180 మంది వరకు ఉన్నారని అంచనా. వీరికి నెలకు సగటున రూ.పది వేల వరకు వస్తోంది. స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. వీరందరూ పొట్టకూటి కోసం పోరుబాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అమలాపురంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (ఫైల్) కొనసాగుతున్న స్మార్ట్ మీటర్ల బిగింపు అభ్యంతరాలు వస్తున్నా పట్టించుకోని సర్కారు జిల్లాలో 6.32 లక్షల విద్యుత్ సర్వీసులు తొలి దశలో కేటగిరీ –2 సర్వీసులకు ఏర్పాటు వినియోగదారుల ఆవేదన -
బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లను తొలగించాలి
అమలాపురం టౌన్: జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిపోయిన మద్యం బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లను తక్షణమే తొలగించి పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం అమలాపురంలో ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో గత జూన్లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో పాత్రధారులను అరెస్ట్ చేసి, సూత్రధారులను వదిలేశారని ఆరోపించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు ఉంటే తక్షణమే తొలగించాలని ఇటీవల మద్యం అమ్మకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సాక్షాత్తూ కలెక్టర్ ఆదేశించినా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోలేదన్నారు. అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయం సమీపంలోనే లైసెన్స్ మద్యం షాపుల వద్ద అనధికారికంగా పర్మిట్ రూమ్లు ఉన్నాయన్నారు. ఇక అమలాపురంలో అనేక చోట్ల బెల్ట్ షాపులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మద్యం షాపుల యాజమానులు, ఎకై ్సజ్ అధికారులు కుమ్మక్కు కావడంతో బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్ సీపీ తరఫున జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. శ్రీవారి ఆలయానికి ముడి వెండి విరాళం రాయవరం: మండల కేంద్రమైన రాయవరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం దాతలు ముడి వెండిని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన దుర్గపు వెంకన్నబాబు, సత్యరత్నభవాని దంపతులు, కుటుంబ సభ్యులు కలసి రూ.1.01 లక్షల విలువైన ముడి వెండిని మకర తోరణం తయారీ కోసం సమర్పించారు. వారిని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, స్థానిక నేతలు వల్లూరి శ్రీనివాస చౌదరి, పులగం శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు అభినందించారు. ముక్కోటి ఏకాదశి సమయానికి మకర తోరణం సిద్ధం చేసేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ధర్నా అమలాపురం టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట శనివారం ఉదయం ధర్నా చేయనున్నట్టు ఫ్యాప్టో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంటీవీ సుబ్బారావు తెలిపారు. ఈ ఆందోళనను జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమలాపురంలోని యూటీఎఫ్ హోమ్లో గురువారం జరిగిన ఫ్యాప్టో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ అనేక రూపాల్లో, అనేక సార్లు ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈ ధర్నా చేపడుతోందన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించకూడదన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు, ఫ్యాప్టో ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పెంకే వెంకటేశ్వరరావు, సరిదే సత్య పల్లంరాజు, గిడ్డి వీవీ సత్యనారాయణ, సిరాజ్, షబ్బీర్ హుస్సేన్, ప్రజా సంఘాల ప్రతినిధులు జీవీ రమణ, దుర్గాప్రసాద్, జి.రవి, జి.వెంకటేశ్వరావు, పెన్నాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి దివ్యాంగ పిల్లలకు శిబిరాలు
రామచంద్రపురం రూరల్: జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి దివ్యాంగ బాలలకు ఉపకరణాలు అందించే లక్ష్యంతో వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఏడాది నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న బాలలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ ఆధార్ కార్డు, తల్లిదండ్రుల రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలు తీసుకురావాలన్నా రు. ఈనెల 6న రామచంద్రపురం ఎంఈవో కార్యాలయంలో జరిగే శిబిరానికి రామచంద్రపురం, కె.గంగవరం, రాయవరం మండలాలకు చెందిన వారు హాజరవ్వాలన్నారు. 7న ముమ్మిడివరం జెడ్పీ హైస్కూల్లో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల వారికి, 11న అమలాపురం జెడ్పీ హైస్కూల్లో అమలాపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలకు, 12న రాజోలు దొరగారితోటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల వారికి నిర్వహిస్తున్నామన్నారు. అలాగే 13న అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలకు, 14 రావులపాలెం జెడ్పీ హైస్కూల్లో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాలకు, 18న మండపేట ఉన్నత పాఠశాలలో ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం మండలాల వారికి శిబిరాలు జరుగుతాయన్నారు. నిత్య కల్యాణాల టిక్కెట్లు విడుదల ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో 2025 సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్య కల్యాణాల టిక్కెట్లను గురువారం విడుదల చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా ఆ రోజు కల్యాణాలు రద్దు చేశామన్నారు. మిగిలిన 29 రోజులకు సంబంధించి 3,364 కల్యాణాలకు ఆన్లైన్ 1,972, కార్యాలయంలో 1,392 అందుబాటులో ఉంటాయన్నారు. వీటి టిక్కెట్లను ఆన్లైన్లో, నేరుగా గానీ పొందవచ్చన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ మాస పూజలు రుద్ర హోమం, చండి హోమం, లక్ష పత్రి పూజ టిక్కెట్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతం కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. -
ఇంకెనా్నళ్లీ ఎదురుచూపులు
● స్పౌజ్ పింఛన్లపై స్పష్టత ఇవ్వని సర్కార్ ● మూడు నెలలుగా 2,823 మంది అవస్థలు ● ఆగస్టులోనైనా పంపిణీ జరిగేనా? ఆలమూరు: సాధారణంగా పింఛన్ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవడం, వాటిని ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేయడం, జాబితాలో పేరు రాగానే పింఛన్ సొమ్ము లబ్ధిదారులకు అందించడం మనందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తెర మీదకు వచ్చింది. అర్హుల జాబితాలో లబ్ధిదారుడి పేరు కనిపిస్తుంది. కానీ పింఛన్ సొమ్ము రావడం లేదు. స్పౌజ్ పింఛన్ల విషయంలో జరుగుతున్న ఈ తికమకతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్నాళ్లీ ఎదురు చూపులు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌజ్ పింఛన్లు అంటే.. పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు మృతి చెందితే, ఆయన భాగస్వామికి ఇచ్చే వాటినే స్పౌజ్ పింఛన్లు అంటారు. అంటే ఇవి కొత్తగా మంజూరు చేసేవి కావు. పాత వాటినే భాగస్వామి పేరు మీదకు మార్చుతారు. అయితే ప్రస్తుతం స్పౌజ్ పింఛన్ వ్యవహారం అయోమయంగా మారింది. చాలామంది వృద్ధ దంపతులు ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో పింఛన్ పొందుతున్న పెద్ద చనిపోతే, వెంటనే ఆయన భార్యకు పింఛన్ మంజూరు చేస్తే చాలా ఆసరాగా ఉంటుంది. అయితే రాష్ట్ర సర్కారు మాత్రం స్పౌజు పింఛన్ల విషయంలో మొద్దు నిద్ర వహిస్తోంది. నెలలు గడుస్తున్నా.. స్పౌజ్ పింఛన్లకు సంబంధించి అర్హుల జాబితా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో లబ్ధిదారుల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా జనవరి, జూలై నెలల్లో క్రమం తప్పకుండా అర్హులకు కొత్త పింఛన్ మంజూరు చేసేవారు. స్పౌజ్ పింఛన్ అయితే మరుసటి నెలలోనే భార్యకు అందించేవారు. లబ్ధిదారుల ఆవేదన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్క కొత్త పింఛన్ను మంజూరు చేయక పోగా, స్పౌజ్ పింఛన్ను కూడా సక్రమంగా అందజేయడం లేదు. దీనిపై ఇటీవల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2024 నవంబర్ నుంచి స్పౌజ్ పింఛన్ను అమలు చేశారు. అయితే అంతకు ముందు స్పౌజుకు ఎంపికై న లబ్ధిదారులకు ఇంకా పింఛన్ మంజూరు కాలేదు. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకూ జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో 3,625 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో వివిధ కారణాల రీత్యా 802 పింఛన్లు తిరస్కరించబడగా, 2,823 మంది అర్హత సాధించారు. ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ గురించి ఏ విధమైన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వితంతు మహిళలకు ప్రతి నెలా నిరాశ ఎదురవుతోంది. దీనిపై గ్రామ సచివాయాలకు వెళ్లి ఆరా తీస్తున్నా తమకేమీ తెలియదని అధికారులు, సిబ్బంది చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. జాబితా ప్రదర్శన స్పౌజ్ పింఛన్కు అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచించారు. అనంతరం ఈ ఏడాది జూన్ 12న స్పౌజ్ పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచే తమకు పింఛన్ సొమ్ము అందుతుందని లబ్ధిదారులు ఆనంద పడ్డారు. కూటమి నాయకులు కూడా ఈ విషయంపై ఊరూవాడా ప్రచారం చేశారు. కానీ జూన్లో పింఛన్లు పంపిణీ చేయలేదు. దీనిపై లబ్ధిదారులు మళ్లీ కూటమి నాయకులు, అధికారులను ప్రశ్నించగా జూలైలో రెండు నెలల పింఛన్ను కలిపి అందజేస్తామని తెలిపారు. ఆ నెలలో కూడా షరా మామూలుగానే పింఛన్ను పంపిణీ చేయలేదు. మళ్లీ ఆగస్టు నెల వచ్చేసింది. ఈ సారైనా పింఛన్ ఇస్తారేమోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైనా ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే స్పౌజ్ పింఛన్ల పంపిణీ ఆగస్టులో కూడా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందేమో అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే కూటమి నేతలు ఈ విషయంపై నోరెత్తకపోవడం మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ పింఛన్ మంజూరులో ప్రభుత్వానికి ఎటువంటి భారం పడదు. పాత వాటినే భాగస్వామికి అందజేస్తారు. కానీ ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాధుల నియంత్రణలో పురోగతి సాధించాలి
అమలాపురం రూరల్: హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ చర్యలకు సంబంధించి జిల్లా కొంచెం వెనుకబడి ఉందని, మెరుగైన పనితీరు కనబరుస్తూ వ్యాధుల నియంత్రణలో పురోగతిని సాధించాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకులు డాక్టర్ కె.నీలకంఠారెడ్డి అన్నారు. డీఆర్ఓ రాజకుమారి అధ్యక్షతన బుధవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలకంఠారెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాల నిర్వహణ, సుఖవ్యాధుల నివారణ, ఏరియా ఆసుపత్రులలో లైంగిక వ్యాధుల క్లినిక్లు, ఏఆర్టీ కేంద్రాల నిర్వహణను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి నెలా ఎటువంటి లోపాలు లేకుండా ఉచితంగా మందులు పంపిణీ జరగాలన్నారు. డీఆర్వో రాజకుమారి మాట్లాడుతూ ఏఆర్టీ కేంద్రాల్లో జీవితకాలం మందులను ఉచితంగా అందిస్తారని, మందులు క్రమం తప్పకుండా వాడించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రతి ఐసీటీసీ కేంద్రంలో హెచ్ఐవీ పరీక్షతో పాటు తగిన సూచనలు, సలహాలు, ఉచిత సేవలకు సంబంధించిన సమాచారాన్ని బాధిత రోగులకు అందించాలన్నారు. అదనపు ప్రాజెక్టు సంచాలకులు కామేశ్వర ప్రసాద్ జిల్లాకు సంబంధించి వివిధ పారామీటర్ల వారీగా నియంత్రణ చర్యల పురోగతిని సిబ్బంది ద్వారా సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా మాట్లాడుతూ రక్త మార్పిడి, ఇంజెక్షన్ సూదులు, విచ్చలవిడి శృంగారం తదితర వాటి ద్వారా వ్యాధి సంక్రమణకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో దుర్గారావు దొర, డీసీహెచ్ ఎస్.కార్తిక్, అదనపు డీఎంహెచ్వో, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి సీహెచ్వీ భరతలక్ష్మి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాంగోపాల్ పాల్గొన్నారు. -
బీబీ సకీనాకు కన్నీటి నివాళి
అమలాపురం టౌన్: మహ్మద్ ప్రవక్త మనమరాలు బీబీ సకీనా వర్ధంతిని గొల్లగూడెంలోని బీబీ సకీనా పీర్ల పంజా వద్ద బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు నల్లటి దుస్తులు ధరించి గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరంతో పాటు కోనసీమ జిల్లా నుంచి షియా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ప్రదేశ్ నుంచి విచ్చేసిన మత గురువు మౌలానా సయ్యద్ తాహిర్ అబెది మషేద్ది ముస్లింలనుద్దేశించి మత బోధనలు చేశారు. బీబీ సకీనా జీవిత చరిత్రను వివరించారు. చిన్నారి సకీనా సిరియా దేశంలోని బందిఖానాలో పడిన పాట్లు, బలైన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. మాతంలో కొందరు రక్తం చిందేలా గుండెలు బాదుకున్నారు. -
సబ్ జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నిస్తా
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని సబ్ జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. అమలాపురం హైస్కూలు రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆగస్టులో జరిగే శాసన మండలి సమావేశాల్లో సబ్ జైళ్ల సమస్యలపై తాను అడిగేందుకు వీలుగా దీనికి సంబంధించిన ప్రశ్నను మండలి కార్యాలయ అధికారులకు బుధవారం పంపించానని చెప్పారు. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరాల్లోని బ్రిటీషు కాలంలో రాళ్లతో నిర్మించిన పటిష్టమైన కట్టడాలతో ఉన్న సబ్ జైళ్లను ఆధునీకరణ పేరుతో వాటి సేవలను గత టీడీపీ ప్రభుత్వం నిలిపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మూడు పూర్వపు తాలూకా ప్రదేశాల్లో సబ్ జైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిందితులను పోలీస్ ఎస్కార్ట్తో వ్యయ ప్రయాసలకోర్చి కొత్తపేట లేదా రాజమహేంద్రవరం సెంట్రల్ జైళ్లకు పంపించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల పోలీసుల ఎస్కార్ట్, కేసు పూర్వ పరాల కోసం నిందితులున్న జైళ్లకు వెళ్లే న్యాయవాదులు, నిందితుల కుటుంబ సభ్యులు ములాఖత్లు కోరేందుకు ఎంతో వ్యయం, సమయం వృథా అవుతోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆధునీకరణ పేరుతో అమలాపురం సబ్ జైలు మూసివేసిన దుస్థితిపై ‘సాక్షి’లో సోమవారం వచ్చిన కధనం ఆధారంగా మిగతా జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నించనున్నట్లు ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు అమలాపురం టౌన్: రాష్ట్రంలో మహిళలకు ముఖ్యంగా బాలికలకు రక్షణ లేకుండా పోతోందని, అసలు లా అండ్ ఆర్డర్ అమలవుతుందా అనే సందేహం కలుగుతోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ప్రశ్నించారు. ప్రతి శాఖలోనూ వైఫల్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలపై పట్టు కోల్పోతోందన్నారు. అమలాపురంలోని అరిగెలపాలెంలో బుధవారం జరిగిన ఆర్పీఐ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయవరం మండలం మాచవరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో బాలికపై ఆ స్కూలు కరస్పాండెంట్ లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరస వైఫల్యాలను చూస్తుంటే ఇది మాటల ప్రభుత్వమే కానీ, చేతల ప్రభుత్వం కాదని తేటతెల్లమవుతోందన్నారు. ఆర్పీఐ నాయకుడు ఉండ్రు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయిన విద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రులతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. . నవోదయ దరఖాస్తులకు 13 వరకూ గడువు పెద్దాపురం: 2026–27వ ఏడాది పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల గడు వును ఆగస్టు 13వ తేదీ వరకుపొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2025–26లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. -
విద్యా ప్రవేషాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అడ్మిషన్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్టీఈ అడ్మిషన్లను పక్కాగా అమలు చేశారు. పేదల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. జిల్లాలో 2022–23లో 342 పాఠశాలలో 201 మందికి ప్రవేశాలకు గాను 150 మంది వరకు చేరారు. 2023–24లో ఏకంగా 1,793 మందికి 1,256 మంది, 2024–25లో 2,805 మందికి 1,501 మందికి మాత్రమే ప్రవేశాలు దక్కాయి. ఇంచుమించు సగం మందికి అంటే 1,304 మంది దూరంగా ఉన్నారు. ప్రస్తుత కూటమి సర్కారు ఆర్టీఈ ప్రవేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ● మొక్కుబడిగా ఆర్టీఈ అడ్మిషన్లు ● చట్టం ఆదేశాలు పట్టించుకోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ● సీట్ల కేటాయింపునకు సాకులు ● ఇచ్చినా అదనపు వసూళ్లు ● పేద విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు సాక్షి, అమలాపురం: కూటమి పాలనలో విద్యాహక్కు చట్టాలు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు చుట్టాలుగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చేసిన నిబంధనను ప్రైవేట్ సంస్థలు అపహాస్యం చేస్తున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు, విద్యాహక్కు చట్టం నిబంధనలను యాజమాన్యాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే లేరు. నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వెనకడుగు వేయడం వెనుక ప్రభుత్వ పెద్దల అనధికార ఆదేశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అలసత్వం విద్యాహక్కు చట్టం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీని అమలుపై విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాలి. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేందుకు రకరకాల సాకులు చెబుతున్నారు. రెండు విడతలు జిల్లాలో రెండు విడతలుగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో 815 మంది చిన్నారుల అడ్మిషన్లకు అర్హత జాబితాను ప్రకటించగా, 643 మంది వివిధ పాఠశాలల్లో చేరారు. రెండవ విడతలో 338 మంది అర్హత ఉన్న చిన్నారుల జాబితా ప్రకటించగా, 210 మంది ప్రవేశాలు పొందారు. మొత్తం 1,153 మందికి అడ్మిషన్లకు సీట్లు కేటాయించగా, 853 మంది అడ్మిషన్లు పొందారు. ఇంకా 300 మందికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. ఆదేశాలు బేఖాతరు విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆన్లైన్లో సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్లుగానే పరిగణించాలి. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం అధికారులకు ఉంటుంది. అవసరమైతే ఆ స్కూల్ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది. సీట్లు రద్దు చేశారు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులతో భర్తీ చేయాలి. అలా చేయకుంటే ప్రైవేట్ యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని అవహేళన చేస్తున్నట్టే. ఈ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలి. కొన్ని పాఠశాలలకు సీట్లు కేటాయించగా వారికి తల్లికి వందనం వచ్చిందని చెప్పి సీట్లు రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. – రేవు తిరుపతిరావు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అదనంగా వసూలు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే 8వ తరగతి వరకూ వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టార్–1 రేటింగ్ ఉన్న పాఠశాలకు రూ.8,500, స్టార్–2 పాఠశాలలకు రూ.10 వేలు, స్టార్–3 పాఠశాలలకు రూ.11,500, స్టార్–4 పాఠశాలలకు రూ.13 వేలు, స్టార్–5 పాఠశాలలకు రూ.14,500లను ఫీజుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. రెండు విడతలుగా (సెప్టెంబర్, జనవరి) అడ్మిషన్లు ఇచ్చిన పాఠశాలలకు ప్రత్యేక ఖాతాకు జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి వస్తున్నదే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇతర రకాలుగా అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. దీనితో పూర్తి ఉచిత విద్య కాస్తా పాక్షిక ఉచిత విద్యగా మారిపోతోంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు ఇలా రకరకాల బాదుడు మామూలే. ఆ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషన్ ఫీజులో మాత్రమే కొంత రాయితీ ఇస్తున్నట్టుగా మారింది. అడ్మిషన్ల అమలు ప్రక్రియ అంటేనే ప్రైవేట్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
పి.గన్నవరం: ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ ఆధ్వర్యంలో ఆయన బుధవారం పి.గన్నవరం మండలం నరేంద్రపురం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంతో సంబంధిత శాఖల అధికారుల్లో కాస్తంత కదలిక వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుల రాకముందే హాస్టళ్లలో పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపడుతున్నారన్నారు. దీనికి నరేంద్రపురం గురుకుల వసతి గృహంలో అత్యవసరంగా చేపట్టిన శుభ్రత – పరిశుభ్రత కార్యక్రమమే నిదర్శనమన్నారు. తాము గురుకులాన్ని సందర్శించిన సమయంలో అక్కడ క్షీణించిన పారిశుధ్యం మెరుగుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తూ దర్శనమిచ్చారన్నారు. స్టూడెంట్స్ యూనియన్ నాయకులు వస్తున్నారని తెలిసి, తూతూమంత్రంగా వంటగది, పాత్రలు శుభ్రం చేశారని కొందరు విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. నిరంతరం పారిశుధ్య చర్యలు కొనసాగాలని, విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ పెట్టాలని పానుగంటి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రసాద్, రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సహదేవ్, రాజోలు అధ్యక్షుడు నవీన్, కొత్తపేట అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు కరుణ సాయి, అర్జున్, అమర్, సుజిత్, పి.గన్నవరం మండల అధ్యక్షుడు సురేష్, ఐనవోలు మండల అధ్యక్షుడు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి నరేంద్రపురం గురుకులం పరిశీలన -
దశల వారీ పోరాటానికి సిద్ధం
ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటానికి సిద్ధమవుతున్నాం. దానిలో భాగంగా ఆగస్టు 2న డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నాం. వేల మంది ఉపాధ్యాయులు తరలి వచ్చేలా కార్యాచరణ చేపడుతున్నాం. – ఎంటీవీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు, ఫ్యాఫ్టో ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాల నుంచి తీసుకున్న ఏ ఒక్క వినతిపైనా సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన సమస్యలపై కనీస స్పందన లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు విచారకరం. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాఫ్టో -
లోవోల్టేజీ సమస్య లేకుండా చర్యలు
అమలాపురం రూరల్: జిల్లాలో లోవోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఏపీఈపీడీసీఎల్ ఇంజినీర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ తీర ప్రాంతం వెంబడి లోవోల్టేజీ, విద్యుత్ కోత సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వినియోగదారుల కోసం ప్రత్యేక విభాగం ద్వారా విద్యుత్ సరఫరా, ఆక్వా కమర్షియల్కు రంగాలకు ప్రత్యేక సెక్షన్లుగా విభజించుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని, పవర్ డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ లైన్లను నవీకరించాలన్నారు. ఆగస్టు నెలాఖరుకు విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు యూనిట్లకు ఏర్పాట్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ బి.రాజేశ్వరి, ఈఈలు రాంబాబు, రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు. -
శాంతించిన గోదారమ్మ
ఐ.పోలవరం: గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం స్వల్పంగా పెరిగిన వరద తొమ్మిది గంటల సమయం నుంచి నెమ్మదిగా తగ్గుతోంది. ఉదయం ఆరు గంటల సమయంలో బ్యారేజీ వద్ద 6,00,890 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఏడు గంటలకు 6,40,120 క్యూసెక్కులకు పెరిగింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో 6,37,240 క్యూసెక్కులకు, మధ్యాహ్నం ఒంటి గంటకు 6,09,540 క్యూసెక్కులకు, రెండు గంటలకు 6,00,100 క్యూసెక్కులకు తగ్గింది. సాయంత్రం ఆరు గంటలకు 6,00,100 క్యూసెక్కుల వద్ద వరద తగ్గింది. ఎగువ ప్రాంతాలలో వరద తగ్గడం వల్ల ఇది మరింత తగ్గుతోందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో గోదావరికి రెండవసారి వచ్చిన వరద కూడా తొలి ప్రమాద హెచ్చరిక వరకు వెళ్లకుండా తగ్గడం పట్ల లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు. -
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం
రాయవరం: విద్యారంగ సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. బోధనమాటెలా ఉన్నా, బోధనేతర పనులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పీ 4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని ఉపాధ్యాయులపై రుద్దడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తమ ఆర్థిక సమస్యలను పక్కన పెట్టడంతో పాటు తిరిగి తమను పీ4లో భాగస్వాములు కావాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కు తగ్గినట్లుగా చెబుతున్నాయి. అయినప్పటికీ అపరిష్కృత సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రాల్లో, ఆగస్టు 12న రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపట్టడానికి ఫ్యాఫ్టో పక్షాన నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లు ఫ పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. ఫ ఇటీవల అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ఫ పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి. ఫ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, 30శాతం ఐఆర్ ప్రకటించాలి. ఫ రిటైర్మెంట్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలి. ఫ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మూడు పెండింగ్ డీఏలను ప్రకటించాలి. ఫ డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఫ సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం అమలు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలి. ఫ ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. ఫ హైస్కూల్ ఫ్లస్ల్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి. ఫ ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. ఫ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి. ఫ మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలి. ఫ ఈహెచ్ఎస్/మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి. ఫ మండల విద్యాశాఖాధికారుల బదిలీలు చేపట్టాలి. ఫ ఇంకా పదవీ కాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను తిరిగి కొనసాగించాలి. ఫ అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి. ధర్నా విజయవంతానికి కార్యాచరణ ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా విజయవంతానికి కార్యాచరణ రూపొందించే పనిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమగ్నమయ్యారు. ఆగస్టు 2వ తేదీన చేపట్టే జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వాలు సమావేశం కానున్నాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గురువుల కన్నెర్ర పోరుబాటకు సిద్ధమైన వైనం విద్యారంగ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి డిమాండ్ ప్రత్యక్ష చర్యకు నోటీసు ఇచ్చిన ఫ్యాఫ్టో నాయకత్వం ఆగస్టు 2న జిల్లా, 12న రాష్ట్ర స్థాయిలో ధర్నాలు -
5న అక్రిడిటేషన్ల కోసం నిరసనలు
అమలాపురం టౌన్: జిల్లాలోని నియోజకవర్గాల స్థాయిలో పాత్రికేయులు ఆగస్టు 5న సమావేశమై అక్రిడిటేషన్ల మంజూరు కోసం నిరసనలు తెలిపాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ సమావేశం నిర్ణయించింది. అలాగే అదే రోజు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్వీ ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశం జరిగింది. జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి ముగ్గురు సభ్యులను నామిటేడ్ చేయాల్సి ఉన్న దృష్ట్యా సమావేశం ఆ ఎంపికపై చర్చించింది. ఆగస్టు 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు సమావేశం తీర్మానం చేసింది. యూనియన్ జిల్లా కార్యదర్శి కాటే భీమ శంకరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్, ఉమ్మడి జిల్లా యూనియన్ మాజీ కార్యదర్శి సుంకర ప్రసాద్ మాట్లాడారు. అనుబంధ కమిటీల అధ్యక్షుల నియామకం అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. వీరిద్దరూ మండపేట నియోజకవర్గానికి చెందిన వారే. పార్టీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా మరిశెట్టి సత్యనారాయణ, పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా టపా గోవిందరావు నియమితులయ్యారు. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీలను బుధవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. -
పురుగుమందు తాగి కమ్యూనిస్టు నాయకుడి మృతి
అయినవిల్లి: మండలానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మచ్చా నాగయ్య పరుగుమందు తాగి మృతి చెందారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు నాగయ్య సోమవారం ముక్తేశ్వరంలోని ఎరువుల దుకాణంలో పురుగుమందు కొనుగోలు చేశారు. అనంతరం అయినవిల్లిలంకలోని తన కొబ్బరితోటలో ఆ మందు తాగేశారు. అయితే కడుపులో మంట భరించలేక రోడ్డు మీదకు వచ్చి ఆ విషయాన్ని స్థానిక యువకులకు తెలిపారు. వెంటనే అతడిని అంబులెన్స్లో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నాగయ్య బంధువుల ఫిర్యాదుపై అయినవిల్లి ఎస్సై శాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం
రాయవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు, అవసరమైన పక్షంలో మూసివేసేందుకు వెనుకాడబోమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. మాచవరంలోని మార్గదర్శి పాఠశాలలో బాలికను ఆ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతిని చేసిన ఘటనపై మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. రాయవరం ఎంఈవో–1 పి.రామలక్ష్మణమూర్తి ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకున్న ఆయన హుటాహుటిన మాచవరం గ్రామానికి చేరుకున్నారు. ఆ స్కూల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఒకటి నుంచి 7వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. విచారణ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఇటువంటి పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సమగ్ర శిక్షా జీసీడీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ డి.రమేష్బాబు తదితరులు ఉన్నారు. ట్రైనీ డీఎస్పీ విచారణ మాచవరంలో బాలిక ఘటనపై ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, మండపేట సీఐ పి.దొరరాజుతో కలిసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలలో నేర స్థలాన్ని పరిశీలించారు. మాచవరంలో ప్రైవేట్ పాఠశాలను కరస్పాండెంట్ ఆకుమర్తి షాజీ జయరాజ్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన బాలికను లోబర్చుకుని, ఆమెను భయపెట్టి గర్భవతిని చేసినట్లుగా ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరగ్గా, పరువు పోతుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే తమ కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనేఉద్దేశంతోబాలిక తండ్రి ఆ పాఠశాల కర స్పాండెంట్ షాజీ జయరాజుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఈవో సలీం బాషా విచారణ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన వైనం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ, సీఐ -
దేవుడి పేరుతో ఇసుక దోపిడీ!
కొత్తపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చివరకు దేవుడి పేరును వాడుకుని మరీ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం అధికారిక ఇసుక ర్యాంపు సమీపంలో ప్రజల అవసరాల కోసం స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇసుక నిల్వలు పెట్టారు. ఆ పాయింట్ నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణాను ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం రాత్రి మాటు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఎందుకు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు నిలదీస్తే, వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అభివృద్ధి పనులకు తీసుకువెళుతున్నామని అక్రమార్కులు సమాధానం చెప్పారు. ఆలయానికి అయితే అర్ధరాత్రి దొంగతనంగా తరలించడమేమిటి, పగటి పూటే తోలుకోవచ్చు కదా అని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. ఈ లోపు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలని గ్రామస్తులు పట్టుపట్టగా, అది రెవెన్యూ అధికారుల పని అని చెప్పి, వాహనాలను అక్కడి నుంచి పంపించేశారని పలువురు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై రామును ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవపడుతున్నారనే సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపిచేశామని తెలిపారు. వాహనాలేమీ సీజ్ చేయలేదని స్పష్టం చేశారు. మండల స్థాయి నాయకుడి ఆగడాలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలంలో టీడీపీ నాయకులు ముఖ్యంగా ఒక మండల స్థాయి నాయకుడి ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ నాయకుడి అక్రమ వ్యవహారాల్లో భాగంగానే గత నెల 16, 17 తేదీల్లో ఆత్రేయపురం చినపేట సమీపం నుంచి లంక భూముల్లోకి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మట్టి తరలించే ప్రయత్నాలు చేయగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు స్పందించకపోవడంతో గ్రామస్తులే అడ్డుకున్నారు. అప్పట్లో వారి ప్రయత్నాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కూటమి నాయకుల అక్రమ దందా అడ్డుకున్న గ్రామస్తులు -
ఇంటర్ ఫస్టియర్కు కొత్త సిలబస్
అమలాపురం టౌన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పాఠ్య పుస్తకాలు మారడం వల్ల కొత్త సిలబస్లో వచ్చిన మార్పులను గమనించి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఇంటర్మీడియట్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేసీ) ఎం.ఆదినారాయణ సూచించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్ కూడా మారుతుందని తెలిపారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డీఐఈవో వనుము సోమశేఖరావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆర్జేసీ ఆదినారాయణ మాట్లాడారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కష్టపడి విద్యార్థులను చదివించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో ఆర్జేడీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి మారుతున్న సిలబస్ను వివరించారు. మారుతున్న సిలబస్కు అనుగుణంగా ఉండాల్సిన విద్యా బోధనపై చర్చించారు. -
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి అవసరం
పెద్దాపురం: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కబడ్డీ మీట్నుద్దేశించి శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు క్రీడారంగానికి ప్రాధాన్యనివ్వడంలో నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమన్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కృష్ణా క్లస్టర్, తుంకుర్ క్లస్టర్ అండర్–19 బాలుర లీగ్ మ్యాచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతానికి చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త మట్టే శ్రీనివాస్ ‘నవోదయ’లో కబడ్డీ మీట్ ప్రారంభం -
కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం ● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే ● ఫంక్షన్ హాల్స్, టెంట్హౌస్లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీరికి డిమాండ్ వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు. ప్రారంభమైన వివాహాలు శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. – సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితులు, కాకినాడ టెంట్ హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్హౌస్లకు గిరాకీ పెరిగింది. – కొండబాబు, టెంట్హౌస్ నిర్వాహకుడు, కాకినాడ -
రెగ్యులేటర్ను ఆనుకుని..
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో పి.గన్నవరం ప్రధాన పంట కాలువల వద్ద ఉన్న రెగ్యులేటర్ పక్కనే సాగిన అక్రమ నిర్మాణం ఇది. ప్రధాన పంట కాలువకు అనుబంధంగా ఉన్న చానల్ (మామిడి తోట చానల్)పై సుమారు 1,200 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ చానల్కు ఉన్న లాకు పక్కనే ప్రధాన పంట కాలువ వైపు దర్జాగా బడ్డీ పెట్టి పక్కాగా ఆక్రమణ చేశాడు. ఈ కాలువపై పలుచోట్ల ఇదే పరిస్థితి. అక్రమ నిర్మాణాల వల్ల ఇక్కడ లాకులు, రెగ్యులేటర్కు గాని, తూరలకు గాని మరమ్మతులు చేసే అవకాశం లేకుండా పోయింది. కాలువ పొడవునా.. అల్లవరం బెండ కాలువ పరిధిలో అమలాపురం మున్సిపాలిటీనీ ఆనుకుని ఈదరపల్లి నుంచి ముక్కామల వరకు పలుచోట్ల పంట కాలువ ఆక్రమణకు గురైంది. కాలువ పొడవునా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణం జరిగింది. గతంలో ఇక్కడ నిర్మించిన ఇరిగేషన్ భవనాలను సైతం కొంతమంది ఆక్రమించారు. ఇంత జరిగినా ఆ శాఖ అధికారులలో మాత్రం స్పందన లేదు. ఇదే కాలువపై స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు అధికంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వంతెన నిర్మాణాల కోసం మెయిన్ రోడ్డును ఆనుకుని ఆక్రమణలు తొలగించిన అధికారులు ఇరిగేషన్ స్థలాల కబ్జాలపై మాత్రం దృష్టి సారించలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. -
రెగ్యులేటరీ బోర్డు నిర్ణయం మేరకు ఫీజులు
ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాలకు ఆదేశం అమలాపురం రూరల్: వినియోగదారుల ఫోరం, ప్రభుత్వ రెగ్యులేటరీ బోర్డు విధి విధానాల మేరకు ఫీజులను వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీంబాషా, జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ భాస్కర్, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు, ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఫీజుల వసూలు, విద్యార్థుల బస్సులలో రవాణా భద్రత, స్థానికంగా పాఠ్య, నోటు పుస్తకాలు నిర్దేశిత ధరలకు విక్రయించడం వంటి అంశాలపై సమీక్షించారు. వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలకు ట్యూషన్ ఫీజు ఒకే విధంగా ఉంటుందన్నారు. పుస్తకాల ధరలలో వ్యత్యాసం వలన వినియోగదారులు నిలువునా మోసపోతున్నారని, ఫీజుల చెల్లింపు, పుస్తకాలు కొనేటప్పుడు రసీదులను తీసుకోవాలని చెప్పారు. నష్టపోయిన వినియోగదారుడు, వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించి న్యాయం పొందాలన్నారు. ఫీజుల వివరాలను పాఠశాల ముఖద్వారం వద్ద ప్రదర్శిచాలన్నారు. డిటీఓ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ యాజమాన్యాలు పూర్తి ఫిట్నెస్తో బస్సులు నడపాలన్నారు. కోనసీమ వినియోగదారుల సంఘల చైర్మన్ అరిగెల బాలరామమూర్తి, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు, డిప్యూటీ డీఈవో జి.సూర్య ప్రకాష్, పరీక్షల కంట్రోలర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
సమర్థంగా వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం
– కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశం అమలాపురం రూరల్: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన మాట్లాడుతూ చాలామంది వృద్ధులు తమ పిల్లల నిరాదరణకు గురై ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరితనంతో ఎన్నో అవమానాలను భరిస్తున్నారన్నారు. ఈ చట్టం అమలుకు వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలన్నారు. 60 సంవ త్సరాలు దాటిన వారి భద్రత కోసం ఈ చట్టం రూపొందించారని తెలిపారు. సెక్షన్ 19 ప్రకారం ప్రతి జిల్లాకు ఒక వృద్ధా శ్రమాన్ని ప్రభుత్వ పరంగా నెలకొల్పాలని, కనీసం 150 మంది వృద్ధులు, నిరాదరణ గురైన తల్లిదండ్రులు ఆశ్రయం కల్పించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజనుల సంక్షేమ అధికారి శ్రీనివాసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణలో పర్యవేక్షణ కమిటీ కీలకం జిల్లాలో ధరల పర్యవేక్షణ కమిటీ నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించి, నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్, కమిటీ చైర్మన్ టీ నిషాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ పనితీరుపై ఆమె కమిటీ సభ్యులతో సమీక్షించారు. బియ్యం, పప్పులు, చక్కెర, నూనె ధరలు నియంత్రణలో ఉండేటట్లు పర్యవేక్షించాలన్నారు. కమిటీ కన్వీనర్, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, మా ర్కెట్ కమిటీ ఏడి కే. విశాలాక్షి, తూనికలు కొలతల నియంత్రణ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అదిగో జాగా.. ఇదిగో పాగా!
సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాకు జీవనాడులైన ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు, వీటికి అనుబంధంగా ఉండే చానల్స్, మీడియం, మైనర్ డ్రెయిన్లు పలుచోట్ల ఆక్రమణదారుల బారిన పడి చిక్కి శల్యమవుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రవాహాలను కోల్పోతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు సాగు సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. తూర్పు, మధ్య డెల్టా అనే తేడా లేదు, పంట కాలువ, మురుగునీటి కాలువ అనే భేదం లేదు, పెద్దా, చిన్నా అనే అంతరం లేదు, కాలువలకు – రోడ్లకు మధ్య కొద్దిపాటి స్థలం ఉంటే చాలు కబ్జాల బారిన పడుతున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే జాగాలో టింబర్ డిపోలు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు జరిగిపోయాయి. పూరి గుడిసెల నుంచి రెండంతస్తుల పక్కా భవనాల వరకు నిర్మాణాలు చేసేశారు. చివరకు ఈ స్థలాలపై హక్కులున్న జలవనరుల శాఖకు చెందిన కార్యాలయాలను సైతం ఆక్రమించేశారు. ఇటీవల ఆ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,800 వరకు ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని తమ శాఖతోపాటు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామని ప్రకటించారు. ఇతర శాఖల వత్తాసు ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదనేది పలువురి అభిప్రాయం. ఇటీవల కాలంలో పెరిగిన మితిమీరిన రాజకీయ జోక్యంతోపాటు పలు నిర్మాణాలకు సంబంధించి పక్కాగా దస్తావేజులు కూడా పుట్టుకురావడం వంటి కారణాలతో వీటి తొలగింపు కేవలం ప్రకటలకే పరిమితమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖకు చెందిన ఈ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తుంటే వీటికి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్ శాఖలు వంత పాడుతుండడం గమనార్హం. ఈ నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు పన్నులు వసూలు చేస్తుండగా, రెవెన్యూ శాఖ పట్టాలు మంజూరు చేస్తోంది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నట్టుగా మారింది. హద్దూ పద్దూ లేదు జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరొందిన రావులపాలెం మండలం మీదుగా మధ్య డెల్టాలోని మూడు ప్రధాన పంట కాలువలు ప్రవహిస్తాయి. ఈ మూడు కాలువల మీద ఈ మండలంలో ఆక్రమణలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ మీద ఊబలంక, రావులపాలెంలో ఇరువైపులా అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇళ్లు, వాణిజ్య దుకాణాలు, ప్రార్థనా స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కాలువలపై ఊబలంక నుంచి రావులపాలెం, కొమరాజులంక, వెదిరేశ్వరం ఇరువైపులా ఆక్రమణలతో నిండిపోయింది. అమలాపురం కాలువపై ఈతకోట– ర్యాలీ రహదారి వెంబడి కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. రావులపాలెం వద్ద ముక్తేశ్వరం కాలువ గట్లపై ఆక్రమణలు కొత్తపేట కౌశిక డ్రెయిన్ ఇరువైపులా నిర్మాణాలు గోదావరి డెల్టాలో కాలువల వెంబడి ఆక్రమణలు ఉమ్మడి జిల్లాలో 4,800 ఆక్రమణల గుర్తింపు రెవెన్యూ, పోలీసు సహకారంతో తొలగిస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు రాజకీయ జోక్యంతో అసాధ్యమంటున్న రైతులు పలు ప్రాంతాల్లో పక్కాగా భవన నిర్మాణాలు చిరు దుకాణాల నుంచి షాపింగ్ కాంప్లెక్స్ల వరకూ..చిన్న కాలువలను కూడా వదల్లేదు ఆలమూరు మండలం కోటిపల్లి ప్రధాన పంట కాలువ మీదనే కాదు... దీనికి అనుబంధంగా ఉండే చానల్స్ను కూడా అక్రమార్కులు వదల్లేదు. ప్రధాన పంట కాలువ పరిధిలో మూలస్థానం వద్ద ఏటిగట్లను ఆనుకుని నిర్మాణాలు చేశారు. ఆలమూరు సూర్యారావుపేట, వెదురుమూడి కాలువలు కూడా ఆక్రమణలకు చిక్కి శల్యమవుతున్నాయి. మురుగునీటి కాలువను వదల్లేదు కొత్తపేట నడిబొడ్డున ఉండే కౌశిక ఇది. ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. మురుగునీటి కాలువకు ఇరువైపులా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి. కాలువల్లో పిల్లర్లు వేసి డాబాలు, మేడలు, రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాడకం నీరంతా దీనికిలోకి వదిలేస్తున్నారు. మురుగునీరు దిగేందుకు మరో మార్గం లేకపోవడంతో దీనిని అమలాపురం పంట కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారు. కొత్తపేట దిగువున ఉన్న అమలాపురం మున్సిపాలిటీతోపాటు అంబాజీపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాల్లోని ప్రధాన రక్షిత మంచినీటి పథకాలకు ఈ నీరే వెళుతోంది. మండపేట కాలువ గట్టుపై.. తూర్పు డెల్టా పరిధిలో కీలకమైన మండపేట కాలువ గట్టుపై అక్రమ నిర్మాణాలు లెక్కలేనన్ని. రాయవరం మండలం పసలపూడిలో కాలువ గర్భంలోకి వచ్చి మరీ నిర్మాణాలు చేశారు. ఈ కాలువపై మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీతోపాటు రామచంద్రపురం రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగాయి. దీనివల్ల కీలక రబీ సమయంలో శివారుకు నీరందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
జాతీయ విద్యా దినోత్సవానికి తొండవరం ప్రాజెక్ట్
అంబాజీపేట: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 31 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ప్రదర్శనకు తొండవరం ప్రాజెక్ట్ ఎంపికై ందని పాఠశాల హెచ్ఎం పి.కేశవాచార్యులు సోమవారం తెలిపారు. ఈ ప్రాజెక్లు మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేటివ్ సెల్, ఏఐసీటీఏ ద్వారా జాతీయస్థాయికి సెలెక్ట్ అయి, 2024 సంవత్సరానికి ఏపీ నుంచి ఎంపికై న ఏకై క ప్రాజెక్టుగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందింది. స్థానిక హైస్కూల్ మెంటార్ కె.గణేష్ నరసింహారావు ఆధ్వర్యంలో స్టూడెంట్ శ్రీరామ్ తేజ్ తయారు చేసిన కార్బన్ డై యాకై ్సడ్ ఫిల్టర్ను ప్రగతి మైదానంలో ప్రదర్శిస్తారు. ఈ అవకాశం అందిపుచ్చుకోవడంలో సహకరించిన కలెక్టర్ మహేష్ కుమార్, డీఈఓ సలీం బాషా, డీఎస్ఓకు పాఠశాల తరఫున హెచ్ఎం కేశవాచార్యులు, గణేష్ నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆషాఢం ఆదాయం అదుర్స్ తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం ఆదాయం రూ.1.56 కోట్లు లభించింది. అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు పర్యవేక్షణలో లోవ దేవస్థానం ఆవరణలో హుండీలను సోమవారం తెరిచారు. అమ్మవారి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో ఆదాయం లెక్కించారు. నోట్లు రూ.63,15,141, నాణేలు రూ.4,42,318 కలిపి మొత్తం రూ.67,57,459 సమకూరిందని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. -
228 అర్జీల స్వీకరణ
అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 228 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ మాట్లాడుతూ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, వికాస జల మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 27 వినతులు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 27 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయాకి వచ్చి ఫిర్యాదు చేశారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉండడంతో ఎస్పీ అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. -
రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 52 డీసీసీబీ బ్రాంచ్ల్లో మేనేజర్లు, ఇతర సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్న డీసీసీబీని రెండేళ్లలో లాభాల బాటలో నడిపించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రుణాల వసూళ్లు బాగుంటేనే డీసీసీబీ బాగుంటుందన్నారు. గతంలో బినామీ పేర్లతో రుణాలు అధికంగా ఇచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా రుణాల మంజూరుకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయా రుణాలను వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. పిఠాపురం బ్రాంచ్ పరిధి బి.కొత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని తిరిగి కట్టడం లేదన్నారు. చిన్న గ్రామమైనప్పటికీ ఆ గ్రామంలో లేనివారి పేర్లతో కూడా రుణాలు తీసుకుని బ్యాంకుకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ప్రస్తుతం ఇటువంటి రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ తరహా రుణాల మంజూరుకు ఏఏ అధికారులు సహకరించారో వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం అన్నీ బ్రాంచ్లు సిబ్బందిని ఎంత మేర రుణాలు ఇచ్చారు, ఎంత తిరిగి చెల్లించారు, రుణాలు రికవరీకి తీసుకొంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీసీబీ ఇన్చార్జ్ సీఈఓ ప్రవీణ్కుమార్, డీజీఎం శ్రీధర్ పాల్గొన్నారు. -
బెల్టు షాపులు లేకుండా చూడండి
అమలాపురం రూరల్: బెల్టు షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా ఎకై ్సజ్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎకై ్సజ్ శాఖ ఈఎస్, సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మద్యం షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించేలా చర్యలు చేపట్టడంతో పాటు కల్తీ మద్యం విక్రయాలు, రవాణా జరగకుండా నిరోధించాలన్నారు. నాటు సారా తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలను మెరుగుపర్చండి ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లాలోని నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం వసతులు కల్పించాలన్నారు. డిపో మేనేజర్లు చల్లా సత్యనారాయణ మూర్తి, పి.భాస్కరరావు, దానమ్మ, అసిస్టెంట్ మేనేజర్ జీఆర్ఎల్ దేవి పాల్గొన్నారు. ఎకై ్సజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు -
ఏపీపీడీసీఎంఏ రీజినల్ కో ఆర్డినేటర్గా నాయుడు
అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏపీపీడీసీఎంఏ) మూడు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్గా అమలాపురానికి చెందిన విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు జె.రమణారావు ఈ మేరకు నాయుడికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్గా నాయుడు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను పర్యవేక్షించనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో సంస్థాగతంగా, పాలనపరంగా, విద్యా పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నాయుడు పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రానున్న కాలంలో డిగ్రీ స్థాయిలో వివిధ కొత్త కోర్సుల ప్రారంభానికి తన వంతు ప్రయ త్నిస్తానన్నారు. నాయుడు నియామకం పట్ల రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.రాజ్కుమార్ చౌదరి, రాజమహేంద్రవరం నన్నయ విశ్వవిద్యాలయం పరిధి అధ్యక్షుడు ఎండీ హబీత్ బాషా, కార్యదర్శి ఎన్.కనకయ్య, ప్రిన్సిపాల్స్ బి.సుబ్బారాయుడు. బి.సుధీర్బాబు హర్షం వ్యక్తం చేశారు. వెండి కవచం సమర్పణ కాజులూరు: కోలంకలో వెలసిన శ్రీలక్ష్మీకేశవస్వామి వారికి శనివారం స్థానిక క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం సమర్పించారు. దంతులూరి కుటుంబానికి చెందిన సాధుకృష్ణవర్మ, వెంకట సత్యనారాయణరాజు, వెంకట నరసింహరాజు, విశ్వనాథ వెంకట కేశవరాజు, కృష్ణవర్మ, వెంకట రాఘవరాజు, సుబ్బరాజు, వెంకట తిరుపతిరాజులు రూ. 7 లక్షలతో వెండి కవచం తయారు చేయించి దంతులూరి వెంకట విజయగోపాలకృష్ణరాజు, కృష్ణవేణి దంపతులచే ఆలయానికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవల్లి శ్రీనివాసాచార్యులు శనివారం సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరించారు. ఉపాధ్యాయులపై శిక్షణలను రుద్దడం సరికాదు అమలాపురం టౌన్: వరల్డ్ బ్యాంక్కు సంబంధించిన సాల్ట్ పథకం, కేంద్ర ప్రభుత్వ ఎన్ఈపీలో భాగంగా రకరకాల ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణలను ఉపాధ్యాయులపై నిర్బంధంగా రుద్దడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) జిల్లా శాఖ అధ్యక్షుడు నరాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి దీపాటి సురేష్బాబు అన్నారు. ఇదే సమస్యను పరిష్కరించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడికి పీఆర్టీయూ జిల్లా శాఖ తరఫున ఓ లేఖ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ ప్రతికూల విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న శిక్షణ, యాప్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరానికి కృషి చేయాలని వారు ఎమ్మెల్సీని అభ్యర్థించారు. ఈ కోర్సులు, శిక్షణలు నేర్చుకుని విద్యా శాఖకు చెందిన వివిధ యాప్లలో సమాచారం నింపడం వల్ల ఉపాధ్యాయులు తరగతి గదుల్లో చేసే బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోధనతో సమాంతరంగా శిక్షణ వద్దని వారు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా రకరకాల శిక్షణలతో బోధన – అభ్యాసనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అన్నారు. ప్రస్తుతం అత్యవసమంటూ ప్రకటిస్తున్న ‘ఐ గాట్ కర్మయోగి’, ‘ఎఫ్ఎల్ఎన్’ ఆన్లైన్ శిక్షణ చేస్తున్నప్పుడు వచ్చే సర్వర్ సిగ్నల్ సమస్యలతో ఎంత ప్రయత్నించినా ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు గుర్తు చేశారు. 30న జాబ్మేళా బాలాజీచెరువు: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మశీ సంస్థ 20 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని, 18 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చని, పదో తరగతి అపైన ఇంటర్మీడియెట్, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
ఫ అడుగంటుతున్న ప్రజాస్వామ్య విలువలు ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్యామలాంబ ఆలయ సెంటర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రావు మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల ముందు రోజు కావాలనే అరెస్టు చేసినట్లు కనిపిస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతున్నాయని సూర్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు వదిలిన లెగసీని ప్రస్తుతం పోలీసులు అందిపుచ్చుకున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, రాజ్యాంగ పండితులు ప్రజాస్వామ్యాన్ని ఉన్నత విలువలతో నిలబెట్టాలని చూశారన్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేనప్పుడు మిథున్రెడ్డి కీలకంగా వ్యవహరించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడారని ఆయన అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేని మిథున్రెడ్డి వ్యక్తిత్వం రెండేళ్లుగా ఆయనతో చేస్తున్న ప్రయాణం వల్ల తనకు తెలిసిందన్నారు. రాజకీయ నాయకుడి కంటే, మాములు వ్యక్తిగానే ఆయన వ్యవహరిస్తారన్నారు. విచారణకు సహకరించేవాళ్లను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం పోలీసులకు తగదన్నారు. ఇండియన్ పోలీస్ యాక్ట్ను అతిక్రమిస్తున్నారని ఆయన వాపోయారు. మిథున్రెడ్డిని భేషరతుగా బెయిల్పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఎలాగన్నారు. ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డిని ప్రధాని మోదీ కౌగిలించుకుని వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు మంత్రి లోకేష్ని మోదీ కౌగిలించుకున్నారని రేపటి పరిస్థితి ఏంటో అని ఛలోక్తి విసిరారు. మిథున్రెడ్డితో ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇస్తారో లేదో చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, ఎం.ప్రసాద్, పిల్లి గంగాధర్, కురుమిల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నమెంట్కు విరాళం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఆగస్టులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నమెంట్కు ఽశ్రీప్రకాష్ విద్యాసంస్థలు రూ.2 లక్షల సహకారం అందించాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ శనివారం కలెక్టర్ చాంబర్లో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్యవంతం.. కోరంగి మడ అటవీ ప్రాంతం
తాళ్లరేవు: దేశంలోనే రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యం కల్కతాలోని సుందర్బన్స్తో పోలిస్తే ఆరోగ్యవంతమైందని ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఎస్ఆర్ వరప్రసాదరావు అన్నారు. శనివారం కోరంగి బయోడైవర్సటీ కాంప్లెక్స్లో అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని వరప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరింగ అభయారణ్యంలో ఏడాదికి నాలుగు నెలలపాటు గోదావరి నీరు పుష్కలంగా లభించడంతో ఆరోగ్యవంతమైన వృక్ష, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందన్నారు. సునామీలు, తుపాన్ల నుంచి రక్షించే మడ అడవులను హోప్ ఐలాండ్ దీవిలో పెంచుతున్నట్లు తెలిపారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త కె.మృత్యుంజయరావు మాట్లాడుతూ మడ అడవులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి 111 రకాల వలస పక్షులు వస్తున్నాయని, వాటిలో చాలావరకు సముద్ర పక్షులేనని తెలిపారు. ఫిషింగ్ క్యాట్ నిపుణులు కునాల్ గోకుల్, అల్ ఈజ్ వెల్ అధ్యక్షుడు ఎన్.కిషోర్కుమార్ తదితరులు మడ అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ తదితర అంశాలను వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు సింగ వీరభద్రరావు, కుంచే సిద్ధార్థ, ఎఫ్బీఓలు కె.మహేష్, కె.ధనుంజయరావు, పి.సంధ్యారాణి, సీహెచ్ ధన లక్ష్మి, డి.మహేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
కె.గంగవరం: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలినారు. ఆయన కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం భీమకోసుపాలేనికి చెందిన కలిదిండి చంద్రశేఖర్(27) శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడికి చనిపోతున్నానని మెసేజ్ పెట్టి కనిపించకుండా వెళ్లిపోయాడు. చంద్రశేఖర్కు చెందిన మోటారు సైకిల్, సెల్ ఫోన్ సుందరపల్లి ఏటిగట్టుపై కనిపించాయి. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాని ఎస్సై జానీ బాషా చెప్పారు. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా!
ఫ రహదారులు దిగ్బంధించి మత్స్యకారుల నిరసన ఫ కాకినాడలో తీవ్ర ఉద్రిక్తత ఫ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు కాకినాడ క్రైం: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం తాళ్లరేవు సమీపంలో పటవల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, బాధిత కుటుంబాలు మత్స్యకార నేతల ఆధ్వర్యంలో న్యాయ పోరాటానికి దిగాయి. న్యాయం చేయాలని రోడ్డెక్కాయి. ఈ పరిస్థితి నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాన కూడళ్లలో మూడుచోట్ల రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమన్వి ట్రావెల్స్ అధినేత రావాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మత్స్యకార నాయకుడు సంగాడి ఈశ్వరరావు సహా పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. 60 మందితో మొదలైన ఈ నిరసన వెయ్యి మందికి చేరుకుంది. తొలుత జీజీహెచ్ వద్ద వార్ప్ రోడ్డులో బాధిత కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి ర్యాలీగా వాహనాలతో కాలినడకన వెళ్లి జగన్నాథపురం కొత్త వంతెనపై నిరసన తెలిపారు. జగన్నాథపురం నుంచి వార్ప్ రోడ్డు నుంచి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. అక్కడి నుంచి పాత వంతెనపైకి వెళ్లి నిరసన తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, సమన్వి ట్రావెల్స్ అధినేతను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ అధినేత అమర్నాథ్ యాత్రలో ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా మత్స్యకారులంతా మండిపడ్డారు. ప్రాణాలు తీసేసి యాత్రలు చేస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సహా డిప్యూటీ సీఎం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానరాని కొండబాబు తన సామాజిక వర్గ పేదలు, అందులోనూ మహిళలు ప్రాణాలు కోల్పోతే కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పందించిన తీరుపై మత్స్యకార నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. బాధితులు ఆయన దగ్గరకు వెళితే, బీమా వచ్చాక పరిహారం అందుతుందని, పరోక్షంగా తానేమీ చేయలేనని చేతులెత్తేశారని మత్స్యకారులు వాపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే నినాదాలు చేశారు. శుక్రవారం జీజీహెచ్కు వచ్చి మీడియాకు పోజులిచ్చి వెళ్లిపోయారని వారన్నారు. తన సొంత సామాజిక వర్గానికే న్యాయం చేయలేని వ్యక్తి కాకినాడకు ఏం చేస్తారని బాహాటంగానే విమర్శించారు. మూడు నిండు ప్రాణాలు పోతే ఇంతేనా చేసేదంటూ ప్రశ్నించారు. మృతదేహాల తరలింపు ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బస్సు యాజమాన్యంతో మాట్లాడిన పోలీసులు మత్స్యకార పెద్దలతో ప్రాథమిక దశ చర్చలు నిర్వహించి, నిరసనకు తాత్కాలిక విరమణ ఇచ్చారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. క్షతగాత్రురాలికి కొనసాగుతున్న చికిత్స ప్రమాద ఘటనలో గాయపడిన ఓలేటి లక్ష్మి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఎడమ కాలు, చేయిలో ఎముకలు విరిగాయని, శస్త్రచికిత్స చేస్తామని అన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరికలు
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలో శనివారం జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నుంచి 22 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. పి.గన్నవరం కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కుడుపూడి త్రిమూర్తులు, మందపాటి సందీప్, గోగి జగదీష్, నేరేడుమిల్లి వినయ్, తాడి వెంకటేశ్వరరావు, తోటే దయా, ఊటాల రెడ్డి, వెంకటరత్నం, సవరపు కిశోర్, తవిటికి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, నేదునూరి రాజేష్, శ్రీనివాస్, అయినవిల్లి మధు తదితరులు పార్టీలో చేరారు. కూటమి అరాచక పాలనకు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందని కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. అందుకే కూటమిని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల రాము, గ్రామ శాఖ అధ్యక్షుడు పోతుమూడి గోపాలకృష్ణ, కేదారిశెట్టి మల్లేశ్వరరావు, వాకపల్లి వీరాస్వామి, కాండ్రేగుల శ్రీను, కోలా సత్తిబాబు, చింతపల్లి శ్రీను, బొలిశెట్టి శ్రీను, వేగి వీరన్న, యనమదల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సఖినేటిపల్లి: అప్పనరామునిలంకలో శనివారం 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న కాన్వెంట్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆనుకుని ఆగింది. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతులు చేయకుండా రోడ్లపైకి వస్తున్న ఇలాంటి బస్సులపై రోడ్ ట్రాన్స్పోర్టు అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైవర్ల ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలు రెండు తాడిపెద్దుల మృతి తుని: స్థానిక మార్కెట్ యార్డులో విద్యుత్ తీగలు తెగిపడిన సంఘటనలో రెండు తాడి పెద్దులు మృతి చెందాయి. శనివారం ఉదయం పశువులు ఆ మార్కెట్లోని వ్యర్థాలను తింటుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు పడటంతో రెండు తాడిపెద్దులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ శాఖ లైన్ల నిర్వహణ సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు. -
హాస్టల్.. హడల్
ఫ సమస్యల చెరలో సంక్షేమ వసతి గృహాలు ఫ అధ్వానంగా మరుగుదొడ్లు ఫ కూటమి ప్రభుత్వంలో కొరవడిన పర్యవేక్షణ సాక్షి, అమలాపురం/ రావులపాలెం/ అంబాజీపేట/ రాజోలు / కాట్రేనికోన: చదువరులకు సం‘క్షేమం’ దూరమైంది.. సౌకర్యాల కల్పన అందని ద్రాక్షలా మారింది.. సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బాల్యం సతమతమవుపోతోంది.. చీకటి గదుల్లో పాట్లు, చాలీచాలని గదులు, అధ్వాన మరుగుదొడ్లతో అగచాట్లు, ఇలా ఒకటేమిటి అన్నీ అవస్థలే.. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలను ‘సాక్షి’ నెట్వర్క్ పరిశీలించింది. అక్కడ విస్తుపోయే ఎన్నో సమస్యలు కనిపించాయి. విద్యార్థుల ఇబ్బందులు వెలుగు చూశాయి. వాటిని ఒకసారి చూద్దాం రండి. జిల్లాలో 22 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు 23 ఉండగా, ఇందులో సుమారు 2,100 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన బాల బాలికలు ఉన్నత చదువులపై ఉన్న మక్కువతో ఇక్కడికి వస్తుంటారు. అటువంటి వారి కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కనీస సదుపాయాల కల్పన.. విద్యార్థుల ఆరోగ్యం.. వారికి అందించే ఆహారం.. ఇలా సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణను పూర్తిగా వదిలేసింది. జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లను చూస్తే కనీస వసతులు అంతంత మాత్రమే అని తెలుస్తోంది. చాలా వసతి గృహాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ కనీస వసతులు లేవు. మురుగుదొడ్లు చాలవు. పది మందికి ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉండాలన్న నిబంధన ఇక్కడ అమలు కాదు. ఉన్నచోట పరిశుభ్రత లేదు. వర్షం నీరు లీకు అవుతోంది. స్వచ్ఛమైన తాగునీటికి ఆర్వో ప్లాంట్లు లేవు. కిటికీల నుంచి దోమలు రాకుండా మెస్లు ఏర్పాటు చేయలేదు. ఉన్నచోట చిరిగిపోయాయి. దీంతో విద్యార్థినీ విద్యార్థులు దోమలతో నిత్యం సహవాసం చేస్తున్నారు. దీంతో సాధారణ, విష జ్వరాల బారిన పడుతున్నారు. కను‘మరుగు’.. స్నానాలు దేవుడెరుగు రావులపాలెంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 1, 2లు బాలికల హైస్కూల్ పక్కన ఒకే భవనంలో ఉన్నాయి. రెండతస్తుల భవనంలో ఉన్న ఈ హాస్టళ్లలో పైన ఉండే అంతస్తులో హాస్టల్–1, కింది అంతస్తులో హాస్టల్–2ను నిర్వహిస్తున్నారు. ప్రతి అంతస్తులో ఏడు గదులు ఉన్నాయి. ఈ భవనంలో 160 మంది విద్యార్థులు ఉండేందుకు అనుమతి ఉంది. కానీ కనీస వసతులు లేక, 122 మంది మాత్రమే ఉంటున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత తీవ్రమైంది. పది మందికి ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉండాలన్న నిబంధన ఇక్కడ కానరావడం లేదు. మొత్తం 10 టాయిలెట్స్, పది బాత్రూమ్లు ఉండగా టాయిలెట్ నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. ఇక ఐదు బాత్రూమ్లు శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారాయి. ఉన్న ఐదు వాటిలోనే బాలికలు స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పైఅంతస్తులో మూడు గదుల శ్లాబ్లు లీకవడంతో గదుల్లో వర్షం కురుస్తుంది. దీంతో రెండు గదులు నిరుపయోగంగా ఉండగా, మిగిలిన ఐదు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ గడపాల్సిన పరిస్థితి. ఇక వంట గది స్లాబ్ లీకవుతోంది. ఇక్కడ తాగునీటి కోసం ఏర్పాటైన ఆర్వో ప్లాంట్ పూర్తిగా పాడైంది. అదేవిధంగా హాస్టల్కు వెళ్లే దారి సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో మలమూత్ర విసర్జన చేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. కానరాని ప్రహరీ! అంబాజీపేట మండలం గంగలకుర్రులో ఉన్న సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలో 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వసతి గృహం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ రాత్రి వేళల్లో విద్యార్థులు భయపడుతున్నారు. వసతి గృహం చుట్టూ శుభ్రత లేనందున దుర్వాసన వెదజల్లుతుంది. విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు నెలలు గడుస్తున్నా రావడం లేదు. మామిడికుదురు బాలుర, బాలికల వసతి గృహాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. బాలుర వసతి గృహం చుట్టూ తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్రైనేజీ సదుపాయం సక్రమంగా లేక మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కూడా డ్రైనేజీ సదుపాయం సక్రమంగా లేదు. హాస్టల్ ప్రాంగణం పల్లంగా ఉండటంతో ముంపు నీరు నిలిచిపోతుంది. తరగతి గదులకు చెందిన తలుపులు, కిటికీలు పాడైపోయాయి. బాత్రూమ్ డోర్లు సక్రమంగా లేవని ఇటీవల విద్యార్థులు స్వయంగా మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేదు. సిబ్బంది.. లేక ఇబ్బంది రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి ఇన్చార్జి వార్డెన్ ఉండటం వల్ల హాస్టల్ పర్యవేక్షణ కొరవడింది. హాస్టల్ నూతన భవనం నిర్మాణంలో ఉండటంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. 57 మంది విద్యార్థులకు 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఇరుకు గదుల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. బాత్రూమ్లలో పైపులైన్లు పాడైపోవడంతో పిల్లలు నీరు మోసుకుని వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రెండు హాస్టళ్లకు వార్డెన్లు ఇన్చార్జులు కావడం వల్ల వారానికి రెండు మూడు రోజులు మాత్రమే వస్తున్నారు. రెండు హాస్టళ్లు ఒకే కాంపౌండ్లో ఉండటం వల్ల విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్న సందర్భాలున్నాయి. బీసీ సంక్షేమ హాస్టల్లో సైతం సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ట్యూటర్ లేరు. విద్యార్థులకు భోజనం, చదువు, నిద్ర అన్ని ఒకే హాలులోనే. సిబ్బంది కొరత ఉంది. ఒక వార్డెన్, ఒక రెగ్యులర్ స్టాఫ్, ఒక ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. నేలపైనే నిద్రకాట్రేనికోన బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో వార్డెన్తో పాటు ఇద్దరు సిబ్బంది, 18 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహం గోడలకు సున్నం వేయకపోవడం, గదుల్లో వెలుతురు లేకపోవడంతో చీకటిగా ఉంటుంది. ఇది బూత్ బంగ్లాను తలపిస్తోంది. గదుల్లో ఫ్యాన్లు ఉన్నా కిటికీలకు దోమలు మెస్లు లేవు. 18 మంది రెండు గదుల్లోనే సర్దుకుని ఉంటున్నారు. దోమల కాటుతో విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లు, జిమ్కానాలు ఇవ్వకపోవడం, చాపలు, బెడ్ సీట్లు లేక నేలపైనే చలిలో నిద్రిస్తున్నారు. ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. -
వరద... వర్షం
కొనసాగుతున్న వానలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన వాయుగుండం ముప్పు తప్పింది. అయితే దీని ప్రభావంతో జిల్లాలో గురు, శుక్రవారాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకూ సగటున 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 19.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ఐ.పోలవరం మండలంలో 2.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. ఆలమూరు 17.2, ఆత్రేయపురం 17, మండపేట 16, రావులపాలెం 15.6, కె.గంగవరం 14.8, కొత్తపేట 14.4, ముమ్మిడివరం 13.6, రాయవరం 12.8, కపిలేశ్వరపురం 11.2, పి.గన్నవరం 9.8, ఉప్పలగుప్తం 7.6, అంబాజీపేట 7.4, కాట్రేనికోన 6.8, అల్లవరం 6.6, అమలాపురం 6.2, మలికిపురం 4.8, అయినవిల్లి 4.6, సఖినేటిపల్లి 4.2, రాజోలులో 3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఫ జిల్లాకు మరోసారి గోదావరి పోటు ఫ కాటన్ బ్యారేజీ నుంచి 4.36 లక్షల క్యూసెక్కుల విడుదల ఫ మరింత పెరగనున్న ప్రవాహం ఫ రెండు రోజులుగా ఒక మోస్తరు వానలు సాక్షి, అమలాపురం: గోదావరికి మరోసారి వరద పోటు తగిలింది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి రెండు రోజులుగా వరద జలాల రాక పెరుగుతోంది. కాటన్ బ్యారేజీ నుంచి శనివారం ఉదయం 3,52,011 క్యూసెక్కుల వరద నీరు చేరింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి బ్యారేజీ నుంచి దిగువకు 4,36,321 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాల ప్రకారం వరద ఉధృతి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా గోదావరి ఉధృతి పెరుగుతోంది. వరద నీటి ప్రభావం దిగువన కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలపై పడింది. గౌతమీ, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట నదీపాయలలో వరదనీరు ఉరకలేస్తోంది. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్టు, ఐ.పోలవరం అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ఇక్కడ క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరంలలోని నదీ గర్భంలోని లోతట్టు ప్రాంతాల లంక భూములను తాకుతూ వరద ప్రవహిస్తోంది. పి.గన్నవరంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఊడుమూడిలంక, అరిగెలవారిపాలేనికి వెళ్లే తాత్కాలిక రహదారి ఈ నెల రెండో వారంలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీనితో ఈ లంక వాసుల రాకపోకలకు తాత్కాలికంగా పడవలు ఏర్పాటు చేశారు. తరువాత వరద తగ్గడంతో తిరిగి రాకపోకలు మొదలు కాగా, మరోసారి వరద పోటు తగలడంతో స్థానికులు పడవలను ఆశ్రయించక తప్పడం లేదు. వరద మరింత పెరిగితే ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయిలంక కాజ్వేపై నీరు చేరే అవకాశముంది. అదే జరిగితే ఇక్కడ వాహన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
పీ–ఫోర్.. శ్రీమంతులు పరార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్ప గా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.ముందుకురాని మార్గదర్శకులుపేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్రెన్స్లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు.ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.అధికారులకు గుదిబండపేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది.57 వేల బంగారు కుటుంబాల గుర్తింపుతూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1,226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు.మార్గదర్శకులు ముందుకు రావాలిపి–4 కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించే దిశగా సమష్టి కృషి జరుగుతోంది. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు, విద్యా వంతులు, పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకురావాలి. ఒక వ్యక్తి అనేక కుటుంబాలకు దరఖాస్తు చేస్తే ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతుదారుగా నిలుస్తారు. ఉపాధి, విద్య, ఆరోగ్య పరిస్థితులపై స్వావలంబన దిశగా అడుగులు పడతాయి. జిల్లాలో 489 గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, సమాజంలో మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్న వ్యక్తులు ఒకరిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. సామాజిక చైతన్యం, స్పృహ కలిగి ఉండే కార్యక్రమం ఇది.– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా -
పద్మం సిల్వర్ జ్యుయలరీ ప్రారంభం
అమలాపురం టౌన్: స్థానిక హైస్కూల్ రోడ్డులోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో శుక్రవారం పద్మం సిల్వర్ జ్యుయలరీ షాపు ప్రారంభమైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, అదే సినిమాలో బుల్లిరాజుగా నటించిన రేవంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మం సిల్వర్ జ్యుయలరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో తమ శాఖలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అమలాపురంలో కొత్తగా శాఖను ప్రారంభించామన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ రూ.లక్ష కొనుగోలుపై రూ.50 వేల సిల్వర్ నగలు, రూ.50 వేల కొనుగోలు చేస్తే రూ.25 వేల సిల్వర్ నగలు, రూ.25 వేల కొనుగోలుపై రూ.12,500 నగలు ఉచితంగా అందించడం అభినందనీయమని చెప్పారు.