Dr B R Ambedkar Konaseema
-
ఇంటింటికీ రేషన్ రద్దు అమానుషం
అల్లవరం: అధ్వాన విధానాలతో కూటమి ప్రభుత్వం ప్రజలను అష్టకష్టాలు పెడుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇంటింటికీ రేషన్ పథకం ద్వారా లబ్ధిదారుల చెంతకే నాణ్యమైన సరకులు పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం చాలా అమానుషమని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థలను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటింటికీ రేషన్ పథకం రద్దు ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన 20 వేల మంది ఎండీయూ ఆపరేటర్ల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని అనురాధ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేయడం ఆయన పాలానా వైఫల్యానికి నిదర్శమని అన్నారు. చంద్రబాబు నిర్ణయంతో వందలాది మంది కార్డుదారులు రేషన్ డిపోల వద్ద గంటల తరబడి నిలబడే పరిస్థితి మళ్లీ మొదలైందన్నారు. ఇంటి వద్దకే అందుతున్న సేవలపై ఎందుకు అంత కక్షని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిందచాల్సిన ప్రభుత్వమే, ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని ఆక్షేపించారు. ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంటింటికీ రేషన్ పథకాన్ని పునఃప్రారంభించాలని అనురాధ డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ చింతా అనురాధ -
పర్యావరణ పరిరక్షణే మనకు రక్ష
రాయవరం: పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని జిల్లా విద్యా శాఖ అధికారులు అన్నారు. ఆ శాఖ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురువారం నిర్వహించారు. పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ గ్రీన్కోర్ ఆధ్వర్యాన మొక్కలు నాటారు. జిల్లావ్యాప్తంగా 1,581 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కలు నాటడంతో పాటు, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, ఉప విద్యాశాఖాధికారులు జి.సూర్యప్రకాష్, పి.రామలక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానానికి విరాళాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి ఆలయంలో అన్నదాన పథకానికి గ్రామానికి చెందిన పేర్చెర్ల శాన్వితరాజు గురువారం రూ.50,116 విరాళం అందజేశారు. అలాగే, పేర్చెర్ల నాగ వెంకట అనిందిత్వర్మ రూ 10,116, పేర్చెర్ల భానురిధి రూ.5 వేలు, చెరుకునీడి ఉదయ్ కిషన్, హేమలత దంపతులు, కుమార్తెలు చోళ లతీక్ష, రిత్యశ్రీ (ఏలూరు) రూ.5,116 చొప్పున విరాళాలు సమర్పించారు. రూ.2.50 లక్షల వెండి గరగ సమర్పణ మామిడికుదురు: పాశర్లపూడిలంక గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ వారికి అదే గ్రామానికి చెందిన తెలగారెడ్డి రాధాకృష్ణ, కృష్ణవేణి, తెలగారెడ్డి వెంకట సాయిరామ కనకరాజు, స్పందన దంపతులు గురువారం రెండున్నర కిలోల వెండితో చేయించిన గరగను సమర్పించారు. దీని విలువ రూ.2.50 లక్షలని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం, ప్రత్యేక పూజలు చేయించి గరగను అమ్మవారికి సమర్పించారు. దాతలను సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశరావు, కమిటీ సభ్యులు అభినందించారు. డీఎస్సీ అభ్యర్థులకు రిక్వెస్ట్ స్టాప్ల సదుపాయం అమలాపురం రూరల్: డీఎస్సీ పరీక్షలు జరిగే భట్లపాలెం, చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఆర్టీసీ రిక్వెస్ స్టాప్లు ఏర్పాటు చేశామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ తెలిపారు. ఆయా రూట్లలో తిరిగే అన్ని బస్సులను ఆ కేంద్రాల వద్ద ఆపాలని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం ఆర్టీసీ డిపోల అధికారులకు, ఉద్యోగులకు సూచనలిచ్చామని వివరించారు. రెండు కేంద్రాలను గురువారం సందర్శించామని తెలిపారు. ఈ మేరకు ఆ కేంద్రాల వద్ద రిక్వెస్ట్ స్టాపు బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. 4 రోజుల పాటు విద్యుత్ అంతరాయాలు అమలాపురం రూరల్: జిల్లాలోని 132 కేవీ రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం డబుల్ సర్క్యూట్ లైన్లలో 30 టవర్లు పాడవగా.. ఇప్పటి వరకూ 23 టవర్లను తిరిగి ఏర్పాట చేశామని ఈపీడీసీఎల్ ఎస్ఈ రాజబాబు, ట్రాన్స్కో ఈఈ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఏడు టవర్లను మార్చేందుకు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం రూరల్, అల్లవరం, అయినవిల్లి, అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో దశల వారీగా ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ విద్యుత్ అంతరాయాలు ఉంటాయని వారు వివరించారు. -
నాడు అతివకు అందలం
సాక్షి, అమలాపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు.. చెప్పనివి కూడా అమలు చేసి మహిళలను మహరాణులను చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది కాగా.. అరచేతిలో వైకుంఠం చూపించి, అందలం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయని అపఖ్యాతి నేటి కూటమి ప్రభుత్వానికే దక్కింది. జగన్ హయాంలో ప్రతి సంక్షేమ లబ్ధి మహిళలకే అందించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కూడా వారికే అందించారు. అదే సమయంలో స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారికి రాజ్యాధికారం దక్కేలా చేశారు. దీనికి భిన్నంగా ప్రస్తుత కూటమి సర్కారులో సంక్షేమ పథకాల అమలే లేకుండా పోయింది. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1,500, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలుకే నోచలేదు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అరకొరగానే అమలవుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు. మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు. పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడే. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ఒక మంచి అన్నగా, తమ్ముడిగా.. వారికి మంచి చేయాలనే బాధ్యత తీసుకున్నాను. – నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (గతంలో అన్న మాటలివి) ఫ అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేశారు. 2019–20 విద్యా సంవత్సరంలో 1,70,994 మందికి రూ.206.991 కోట్లు, 2020–21లో 1,44,797 మందికి రూ.217.196 కోట్లు, 2021–22లో 1,45,462 మందికి రూ.218.193 కోట్లు, 2022–23లో 1,45,462 మందికి రూ.218.193 కోట్ల చొప్పున అందజేశారు. ఫ పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, డీఎడ్, బీఎడ్ వంటి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన అందించేవారు. సుమారు 29,878 మంది తల్లుల ఖాతాల్లో విడతకు రూ.25.80 కోట్ల వరకు అందించేవారు. ఇలా ఏటా మూడుసార్లు అందజేసేవారు. వసతి గృహాల్లో చదువుకున్న 9,591 మంది విద్యార్థులకు వసతి దీవెన సొమ్ము సైతం తల్లుల ఖాతాలకు జమ చేశారు. ఫ స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్హెచ్జీ) పొదుపు మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకూ ఉన్న ఎస్హెచ్జీ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆవిధంగా 2020 నవంబర్ 11న మొదటి విడత, 2021 అక్టోబర్ 7న రెండో విడత, 2023 మార్చి 25న మూడో విడత, 2024 మార్చి 23న నాలుగో విడత సొమ్ము చెల్లించారు. మొత్తం నాలుగు విడతలూ కలిపి మహిళా సంఘాలకు ఏకంగా రూ.1,015.96 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలు కాకుండా ఇతర అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి చేకూర్చారు. వీరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈవిధంగా జిల్లాలోని 11,496 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.53.03 కోట్లు వేశారు. ఫ మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున వైఎస్సార్ సీపీ నేతన్న నేస్తం సొమ్ము అందించారు. దీని ద్వారా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17,811 మందికి రూ.43.33 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దీనివలన నేత కార్మికులు బయట అప్పులు చేయనవసరం లేకుండానే తమకు కావాల్సిన ముడి సరకు, రంగుల వంటివి కొనుగోలు చేసుకోగలిగారు. ఫ ఆర్థికంగా వెనుకబడిన కాపు కుటుంబాలకు మేలు చేసేందుకు గత ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందజేసింది. ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా 34,962 మంది మహిళలకు రూ.165.609 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఫ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీల్లోని పేద మహిళల ఆర్థిక ఉన్నతికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను బహుళజాతి కంపెనీల ద్వారా విక్రయించడంతో పాటు, బ్యాంకుల ద్వారా సకాలంలో రుణాలిచ్చేలా చర్యలు చేపట్టింది. తొలి ఏడాది అమూల్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. రెండో సంవత్సరం జియో – రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టీనేజర్, మహేంద్ర–ఖేతి వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడింది. ఫ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత గత సీఎం వైఎస్ జగన్కే దక్కింది. దీనివల్ల అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్లుగా మహిళలకు అవకాశం దక్కింది. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవుల్లో అతివలకు 50 శాతం అవకాశం వచ్చింది. దీంతో పాటు నామినేటెడ్ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పదవులలో సగానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చారు. అమ్మ ఒడి ఇవ్వాలి నాకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడు 9వ తరగతి, రెండో వాడు ఏడో తరగతి చదువుతున్నారు. అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్నారు. ఒక ఏడాది గడిచిపోయి, రెండో ఏడాది వచ్చింది. రెండేళ్ల సొమ్మూ ఒకేసారి వేస్తే మా వంటి పేద కుటుంబాలకు మేలు చేసినట్లవుతుంది. – గంటా అరుణకుమారి, గొల్లపాలెం, మలికిపురం మండలం అది చరిత్రాత్మక నిర్ణయం నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది చరిత్రాత్మకం. అది వైఎస్ జగన్ వల్లనే సాధ్యమైంది. ఆ నిర్ణయం వల్ల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, ఇతర కార్పొరేషన్లలో మహిళలకు సమాన అవకాశాలు వచ్చాయి. గతంలో కేవలం సభ్యులుగా మాత్రమే ఒకరిద్దరు ఉండేవారు. ఇప్పుడు చైర్పర్సన్లు అవుతున్నారు. – దంగేటి డోలామణి, అమలాపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఫ కూటమి ఏడాది పాలనలో మహిళల దరి చేరని సంక్షేమం ఫ ప్రతి నెలా రూ.15 వందలెక్కడో! ఫ కొంత మందికే ఉచిత గ్యాస్ ఫ ఆర్టీసీ ఉచిత ప్రయాణం బహుదూరం -
నేటి నుంచే డీఎస్సీ
ఏ రోజు ఏ పరీక్షంటే.. తేదీ సబ్జెక్టు 6 టీజీటీ గణితం (ఇంగ్లిషు మీడియం) 8 ఎస్ఏ హిందీ 9 ఎస్ఏ ఫిజిక్స్ 10 ఎస్ఏ బయాలాజీ 11 ఫిజికల్ డైరెక్టర్ 12 ఎస్ఏ గణితం 13 ఎస్ఏ ఇంగ్లిష్, ఎస్జీటీ 14 పీజీటీ బోటనీ, పీజీటీ పీఎస్, పీజీటీ సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం) 16, 17 ఎస్ఏ సోషల్ స్టడీస్ 17, 18 ఎస్జీటీ 19 పీజీటీ బయోసైన్స్ (ఇంగ్లిష్ మీడియం), ఎస్జీటీ 20, 21 ఎస్జీటీ 22 టీజీటీ–తెలుగు, పీఈటీ–వీహెచ్ 23, 24 ఇంగ్లిషు ప్రొఫిషియెన్సీ టెస్ట్ 25 టీజీటీ–సైన్స్ (ఇంగ్లిషు మీడియం), పీజీటీ హిందీ, టీజీటీ–సైన్స్ (ఇంగ్లిషు మీడియం) 26 టీజీటీ–ఇంగ్లిష్, పీఎస్ (ఇంగ్లిష్ మీడియం) 27 టీజీటీ సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం) 28 పీజీటీ–ఇంగ్లిష్ 29, 30 ఎస్ఏ తెలుగు రాయవరం/అమలాపురం రూరల్: ఉపాధ్యాయ నియామకానికి నిర్వహిస్తున్న డీఎస్సీ–2025 పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకూ జరిగే ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) కావడంతో కంప్యూటర్ సౌకర్యాలున్న కేంద్రాలను ఈ పరీక్షలకు ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 11,795 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలోని అమలాపురం రూరల్ భట్లపాలెంలోని బీవీసీ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఒక్కో కేంద్రంలో ఒక్కో సెషన్కు 170 మంది పరీక్షలు రాసే అవకాశముంది. స్క్రైబ్స్కు అవకాశం విజువల్లీ హ్యాండీక్యాప్డ్ (వీహెచ్), ఆర్థో హ్యాండీక్యాప్డ్ (ఏహెచ్) రెండు చేతులూ లేని వారికి స్క్రైబ్స్ను (సహాయకులు) ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. ఇంటర్మీడియెట్ అర్హత కలిగిన వారిని స్క్రైబ్స్గా ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన వివరాలు ఆయా సెంటర్లలో తెలియజేస్తారు. వీహెచ్లో స్క్రైబ్ వాడుకునే వారికి 50 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ఏహెచ్ వారికి అదనపు సమయం వర్తించే అవకాశం లేదు. అంగవైకల్యాన్ని పరిశీలించి, మెడికల్ బోర్డు (డీఎంహెచ్ఓ) జారీ చేసిన సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే స్క్రైబ్స్ ఏర్పాటు చేసే అవకాశముంది. హాల్ టికెట్పై ఫొటోగ్రాఫ్ లేని వారికి తాజా ఫొటోగ్రాఫ్పై గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన వాటిని పరీక్షలకు అనుమతిస్తారు. జిల్లాలో 18 మంది వీహెచ్, 8 మంది ఏహెచ్ అభ్యర్థులను గుర్తించినట్లు సమాచారం. పకడ్బందీగా పరీక్షలు రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి గురువారం పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖ, ఆర్టీసీ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) డాక్టర్ షేక్ సలీం బాషా తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి అక్రమాలు, అవకతవకలకు తావులేని విధంగా ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున కంప్యూటర్లు, సాంకేతిక పరికరాల్లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కళాశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య కన్నా పది శాతం కంప్యూటర్లను అదనంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక డిపార్ట్మెంటల్ అధికారి పర్యవేక్షిస్తూంటారు. అమలాపురం డీవైఈఓ జి.సూర్యప్రకాశం ఆధ్వర్యాన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతుంది. అభ్యర్థులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు డీఈఓ కార్యాలయంలో 98663 87500, కలెక్టరేట్లో 96664 37749 నంబర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ·˘ hÌêÏÌZ Æð‡…yýl$ B¯ŒSOÌñ毌S MóS…{§éË$ ·˘ ç³È„ýSË$ Æ>Ķæ$¯]l$¯]l² 11,795 Ð]l$…¨ గంట ముందుగానే చేరుకోవాలి డీఎస్సీ అభ్యర్థులు నిర్ణీత సమయాని గంట ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం -
బాబు ష్యూరిటీ.. లేదు గ్యారెంటీ..
ఫ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గడచిన ఏడాది కాలంలో మహిళలకు ఎటువంటి సంక్షేమమూ అందకుండా పోయింది. అమ్మ ఒడి పథకాన్ని ‘తల్లికి వందనం’గా పేరు మార్చినప్పటికీ అమలు చేయలేదు. గత విద్యా సంవత్సరం దాదాపుగా 1.45 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల వంతున సుమారు రూ.217.50 కోట్లు జమ చేయాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఫ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చింది. కూటమి సూపర్ సిక్స్ పథకంలో ఇది ప్రముఖమైనదిగా ఎన్నికల సభల్లో చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ నయా పైసా కూడా ఇవ్వలేదు. ఈ పథకానికి జిల్లాలో కనీసం 4.50 లక్షల మంది అర్హులున్నట్లు అంచనా. నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి వీరికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈవిధంగా ఏడాది కాలంలో జిల్లాలోని మహిళలకు కూటమి ప్రభుత్వం రూ.810 కోట్లు ఎగ్గొట్టింది. ఫ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. ఏడాది గడుస్తున్నా దీని అమలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెబుతోంది. అయితే, ఏడాది కాలంగా ఇంకా విధివిధానాల రూపకల్పనలోనే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూండటం గమనార్హం. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా జిల్లాలోని సుమారు 9 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉంది. ఫ జిల్లాలో 3.90 లక్షల మంది వరకూ గ్యాస్ వినియోగదారులున్నారు. వీరికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాది ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా సగం మందికేననే విమర్శలున్నాయి. తరువాత మరో ఉచిత సిలిండర్ ఇచ్చిన దాఖలాలు లేవు. -
వెన్నుపోటుపై కన్నెర్ర
సాక్షి, అమలాపురం: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలనా కాలంలో సంక్షేమం పథకాల అమలు విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి... ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేయడానికి నిరసనగా బుధవారం వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలు జిల్లా వ్యాప్తంగా హోరెత్తాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మోసం, దగాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, జనం ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమలాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ల ఆధ్వర్యంలో జరిగింది. భట్నవిల్లిలోని విశ్వరూప్ ఇంటి వద్ద నుంచి బైక్ ర్యాలీ మొదలై నల్లవంతెన, ఎర్ర వంతెన మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం డీఆర్వో రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. పి.గన్నవరంలో వైఎస్సార్ సీపీ నియోకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పి.గన్నవరం అక్విడెక్టు నుంచి మూడు రోడ్ల సెంటర్ మీదుగా వెన్నుపోటు ర్యాలీ సాగింది. వైఎస్సాఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యానారాయణకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. మలికిపురంలో నల్లి కామేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ ప్రారంభమైంది. ప్రధాన కూడలి మీదుగా సెంటర్కు వచ్చి అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. కోనసీమ ముఖద్వారం వద్ద ఉన్న పార్టీ కార్యాలయం వద్దకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రావణాసురుని ఆకృతిలో తయారు చేసిన చంద్రబాబు చిత్రపటానికి పది తలలు పెట్టారు. వాటిపై సూపర్ సిక్స్ పథకాల పేర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్, చిర్ల సోమసుందర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆఫీసు నుంచి జెండాలు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కళా వెంకట్రావు సెంటర్ నుంచి బలరామిరెడ్డి ఆసుపత్రి జంక్షన్ మీదుగా యూటర్న్ తీసుకుని తిరిగి కళా వెంకట్రావు సెంటర్కు చేరుకుని, అక్కడ నుంచి రింగ్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. జగ్గిరెడ్డి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ప్రసంగించారు. మండపేటలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట తిమూర్తులు ఆధ్వర్యం వహించారు. పట్టణంలోని విజయలక్ష్మీనగర్లోని పార్టీ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజారత్న సెంటర్ వద్ద దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి బస్స్టాండ్ మీదుగా కలువపువ్వు సెంటర్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్లు నేతృత్వం వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో అఖిలకు వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వ తీరుపై... గళమెత్తిన వైఎస్సార్ సీపీ కోనసీమలో ‘వెన్నుపోటు దినం’ ఏడు నియోజకవర్గాలలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు కూటమి ఏడాది పాలనపై వెల్లువెత్తిన నిరసన పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావులపాలెంలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి పలుచోట్ల మోటార్ సైకిళ్ల ర్యాలీలు రెవెన్యూ అధికారులకు విజ్ఞాపన పత్రాల అందజేత ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలమ్మ చెరువు అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ జరిగింది. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘కోరింగ’లో ‘స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ ఫ అత్యంత విషపూరితం ఫ కాటేస్తే ప్రాణానికే ప్రమాదం ఫ పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా! ఫ భవిష్యత్తులో అంతరించిపోయే జాతిగా నిర్ధారణ ఫ షెడ్యూల్ 4 నుంచి 1కి మార్పు ఫ దేశంలో మూడో అతి పెద్ద కోరింగ అభయారణ్యంలో గుర్తింపు ఫ పరిరక్షణకు నడుం బిగించిన వన్యప్రాణి విభాగం -
నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు
మామిడికుదురు: ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ కాశీలో గంగానది అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరంలో వెలసిన బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారం నుంచి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దివ్య తిరు కల్యాణం శుక్రవారం రాత్రి 9.15 గంటలకు జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో జరుగుతుందని ఈఓ తెలిపారు. గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి ఉదయం ఆరు గంటలకు విశ్వక్సేనారాధనతో కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. శ్రీదేవి, భూదేవితో పాటు బాల బాలాజీని వధువు, వరులుగా చేసి బుగ్గన కల్యాణం తిలకం తీర్చిదిద్దే మహత్తర ఘట్టంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి రాయబారోత్సవం జరుగుతుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వేద సదస్యం (పండిత సన్మానం) ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి వారికి పవిత్ర వైనతేయ గోదావరి నదిలో చక్రస్నానం నిర్వహిస్తారు. సోమ వారం ఉదయం 9 గంటలకు చోర సంవాదం, సాయంత్రం ఏడు గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, బుత్విక్ సన్మానంతో స్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణమవుతాయి. కల్యాణోత్సవాలు జరిగే అయిదు రోజులు ఆలయం వద్ద పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశా రు. కల్యాణోత్సవాల నిర్వహణకు ఆలయం వద్ద భారీ గా ఏర్పాట్లు చేశారు. భారీగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. స్వామి వారి ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.రేపు స్వామివారి తిరు కల్యాణం -
వెన్నుపోటు ఫిక్స్!
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025● సూపర్ సిక్స్.. సాక్షి, అమలాపురం: ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది. ఎన్నికల ఫలితాలు వచ్చాక మేనిఫెస్టోను మడతపెట్టి అవతల పాడేయాలి అనే సూత్రాన్ని కూటమి ప్రభుత్వం ఒంట బట్టించుకుంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ను అమలు చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి ప్రచారం ప్రారంభించారు. బాబు ష్యూరిటీ... భవిష్యత్తు గ్యారంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీల వర్షం కురిపించారు. తర్వాత బాబుతో జట్టు కట్టిన ప్రస్తుత ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం సూపర్ సిక్స్ అమలు బాధ్యత తాను తీసుకుంటానని గొప్పగా చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా దానిలో ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు సంపూర్ణంగా అమలు చేయలేదు. సూపర్ సిక్స్ హామీ–1యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. జిల్లాలో 50 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. నెలకు రూ. 3వేల చొప్పున రూ.180 కోట్లను విజయవంతంగా ఎగ్గొట్టేసింది. కొత్తగా ఉద్యోగాల మాట అటు ఉంచి, తొమ్మిది వేల మందినికి పైగా ఉన్న వలంటీర్ల వ్యవస్థను ఎత్తివేసింది. ఇంటింటా ఇచ్చే రేషన్ ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి కొత్త నిరుద్యోగులను సృష్టించింది. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్పై సంతకం చేసి ఈ రోజుకి పూర్తి చేయలేదు. సూపర్ సిక్స్ హామీ–2స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు గత ప్రభుత్వం అమ్మ ఒడి రూపంలో అర్హులైన ప్రతి కుటుంబంలోని ఒక విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తానంది. ఈ లెక్కన చూస్తే జిల్లాలో 1.45 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.217.50 కోట్లు అందించాల్సి ఉంది. గత ఏడాది సొమ్మను కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఎగొట్టింది. ఈ ఏడాది ఇస్తానని ప్రకటించినా ఏదో వంకతో లబ్ధిదారులను కుదించి వేస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. సూపర్ సిక్స్ హామీ– 3ప్రతి రైతుకు ఏటా రూ. 20వేల సాయం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏటా మూడు దఫాలుగా రైతులు ఖాతాలో సొమ్ము జమ చేసేది. రైతుకు ఏటా 13,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని ఐదేళ్లపాటు అందించింది. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున అందిస్తామని చెప్పింది. దీనికి అన్నదాత సుఖీభవ అనే పేరు కూడా పెట్టింది. గత ఏడాది ఇవ్వాల్సిన సొమ్ము రూ.480 కోట్ల దిక్కూమొక్కూ లేదు. ఈ ఏడాది ఇస్తామని చెబుతున్నప్పటికీ ఎంత అనేది మాత్రం ప్రకటించలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వస్తే జిల్లాలో 1,45,890 మంది రైతులకు రూ.482.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సూపర్ సిక్స్ హామీ–4ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు జిల్లాలో 3.90 లక్షల మంది వరకు గ్యాస్ వినియోగదారులున్నారని అంచనా. వీరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాది కేవలం ఒక సిలిండరు మాత్రమే ఉచితంగా అందించారు. అది కూడా లబ్ధిదారులలో సగం మందికే. సూపర్ సిక్స్ హామీ–5ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఖాతాలో జమ చేస్తామని చెప్పి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మహిళల ఖాతాలో జమ చేయలేదు. 18 ఏళ్ల వయసు దాటిన వారి నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులని తెలిసింది. ఈ విధంగా చూస్తే జిల్లాలో కనీసం 4.50 లక్షల మంది వరకు అర్హులు ఉన్నట్టుగా అంచనా. నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఏడాది కాలంలో జిల్లాలో మహిళలకు రూ.810 కోట్లను కూటమి ప్రభుత్వం బకాయి పడినట్టయ్యింది. సూపర్ సిక్స్ హామీ – 6 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీని అమలును దఫ దఫాలుగా వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు తాజాగా దీనిని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాటి నుంచి అమలు చేస్తామని చెబుతోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఏడాది కాలంగా ఇంకా విధివిధానాల రూపకల్పనలోనే ఉన్నట్టు చెబుతుండటం విశేషం. ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు అయితే జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. కానరాని సంక్షేమం... అక్కరకు రాని సాయం కూటమి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది సూపర్ సిక్స్లో ఒక్క హామీని నెరవేర్చని వైనం ఏడాది పాలనపై జిల్లా వాసుల పెదవి విరుపు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అసంతృప్తి నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలుగత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి బుధవారానికి ఏడాది పూర్తి కావస్తోంది. కూటమి ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించి కూడా ఏడాది అవుతోంది. నాటి నుంచి నేటి వరకు ఏడాది పాటు ప్రశ్నిస్తే అణచివేయడం, రెడ్బుక్ పేరుతో అరాచకం, ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో అక్రమాలు ఇలా సాగిపోతోంది పాలన. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, దళితులకు, మహిళలకు అందాల్సిన సంక్షేమ పథకాలు దాదాపు నిలిచిపోయాయి. రైతులు, నిరుద్యోగులు వంటి వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం ఆగిపోయింది. మొత్తం మీద కూటమి ఏడాది పాలన సామాన్య ప్రజలకు దగా... మోసం అన్నట్టుగా సాగిపోయింది. సర్కారు నిర్వాకంపై నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. హామీలు గుర్తున్నాయా? బాబూ... పవన్ఎన్నికల ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల్లో కొన్ని.. నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను ఉచితంగా అందించి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కల్లుగీత కార్మికుల నుంచి వృత్తి పన్ను వసూలు చేయకుండా వారు ఉచితంగా కల్లు గీసుకునే వెసులుబాటు సఖినేటిపల్లి– నరసాపురం వంతెన నిర్మాణ పనులు పూర్తికి కృషి కోనసీమ టూరిజం హబ్గా మార్పు జిల్లా వ్యాప్తంగా గోదావరి నదీ కోత నివారణకు గ్రోయిన్లు, రివిట్మెంట్ల నిర్మాణం వరదల సమయంలో కె.ఏనుగుపల్లి, ఎదురుబిడియం కాజ్వేలు ముంపుబారిన పడకుండా వంతెనల నిర్మాణం అప్పనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగునీరు కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ)ని కోనసీమకు తీసుకురావడం. కొబ్బరి పరిశ్రమల ఏర్పాటు. నైపుణ్యాభివృద్ధి ద్వారా చిన్న పరిశ్రమల ఏర్పాటు. కొబ్బరిలో నాణ్యమైన మొక్కలను స్థానికులకు అందేలా చర్యలు కోనసీమ రైల్వేలైన్ త్వరితగతిన పూర్తి ఇసుక దోపిడీ రాష్ట్రంలో అధికారం మారిన జూన్ 4వ తేదీ రాత్రి నుంచి జిల్లాలో ఇసుక దోపిడీ మొదలై ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అంతకుముందు ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను కొల్లగొట్టుకుపోయారు. లారీకి అదనంగా రూ.ఐదు వేల చొప్పున దోపిడీ చేశారు. ప్రభుత్వ అధికారిక ర్యాంపులలోనే బరి తెగించి అక్రమాలకు పాల్పడ్డారు. ముసివేసిన ర్యాంపులలో ఇప్పటికీ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుపోతున్నారు. పి.గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, రాజోలు ఇలా చెప్పకుంటూ పోతే గోదావరి ప్రవహించే ప్రతి చోటా అక్రమ ఇసుక ర్యాంపులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. లంక మట్టితోపాటు సముద్రతీరంలోని ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. నిరసనల పథం కూటమి ప్రభుత్వ విధానాలపై విసిగి వేశారిన పలు ప్రజా సంఘాలు, ఆయా వర్గాలవారు తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సందర్భంగా పలు సంఘాల వారు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. రాజోలు బీసీ సంక్షేమ శాఖ వసతిగృహం వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల నిరసనను కలెక్టరేట్ వద్ద గేట్లు బంద్ చేసి పోలీసులు అడ్డుకున్నారు. సీహెచ్వోలు, వ్యవసాయ కార్మికులు, యానిమేటర్లు ఇలా పలు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. జీతం బకాయిలు చెల్లించాల్సి ఉందని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య కార్మికులు, వాచ్మన్లు ఆందోళన చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం విజయవంతంగా నడుస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై ఎడాపెడా కేసులు పెడుతూనే ఉన్నారు. రావులపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులతోపాటు 41 మందిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో 2025 జనవరి 31వ తేదీన మూడు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం ఇస్టానుసారం అరెస్టు చేశారు. జిల్లాలో నలుగురిపై కేసులు నమోదు చేసి వారిలో ఒకరిని జైలుకు పంపించారు. -
వెన్నుపోటులో సిద్ధహస్తుడు చంద్రబాబు
● మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి ధ్వజం ● నేడు అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరిట నిరసనలు కొత్తపేట: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం శ్రీవెన్నుపోటు దినంశ్రీ పేరిట అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన రావులపాలెం మండలం గోపాలపురంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. గడచిన ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటి అమలును గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలనూ నేడు నిలిపివేసి పేదలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. కరెంటు చార్జీలు, నిత్యావసర సరకుల ధరలు పెంచి, ప్రజలపై భారం మోపిందన్నారు. సీఎం చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. అందుకే ఎన్నికలు జరిగి జూన్ 4కు ఏడాది అవుతున్నందున వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మోసాలను ఎండగడతామని, హామీలు నెరవేర్చే వరకూ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామన్నారు. నియోజకవర్గంలో కార్యక్రమం ఇలా.. కొత్తపేట నియోజకవర్గం వెన్నుపోటు దినం కార్యక్రమాలను జగ్గిరెడ్డి వివరించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గంలో 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులు రావులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమై రావులపాడు రోడ్డు వరకూ సాగి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని తిరిగి ఆంజనేయస్వామి గుడి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మెమోరాండం సమర్పిస్తామని తెలిపారు. -
యోగాతో పరవశించిన సాగర తీరం
సఖినేటిపల్లి/మలికిపురం: అంతర్వేది సాగర తీరం మంగళవారం యోగాతో పరవశించింది. సుమారు 3 వేల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం సముద్ర తరంగాల సాక్షిగా, సూర్యోదయ కిరణాల మధ్య శరీరం, మనసు, శ్వాసలు సమన్వయంతో ఒక్కటై యోగా ముద్ర వేశాయి. అంతర్వేది బీచ్లో యోగాంధ్ర 2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి పాల్గొని మాట్లాడుతూ ప్రతి రోజూ కేవలం పది నిమిషాలైనా యోగా చేయడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు వస్తాయన్నారు. జిల్లా యంత్రాంగం ఆహ్వానంతో యోగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సోషల్ మీడియా యోగా యాక్టివిస్ట్ లక్కవరంనకు చెందిన వేగేశ్న పూజాకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ యోగాంధ్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డీఆర్ఓ బి. రాజకుమారి, అమలాపురం ఆర్డీవో కె.మాధవి, డీఈఓ షేక్ సలీంబాషా, పీడీ డ్వామా మధుసూదన్, జి.ఎస్.డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసర్ రాజేశ్వరరావు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.కె.నవాబ్ జాన్ జిల్లా అధికారులు, మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కాపులపై కేసులను తిరగతోడడం కక్ష సాధింపే
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: కాపులపై కోర్టు కొట్టేసిన కేసులను ఇప్పుడు తిరగతోడడం అంటే కేవలం కక్ష సాధింపు అని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఉన్న ద్వేషంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీస్తోందని స్పష్టం చేశారు. అమలాపురం హైస్కూలు సెంటరులో గల తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా రిజర్వేషన్ల కోసం ముద్రగడతోపాటు అనేకమంది కాపు నాయకులు ఉద్యమించారని గుర్తు చేశారు. కేవలం ముద్రగడపై కక్ష సాధింపు కోసం కేసులను తిరగతోడే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం అందుకు ప్రతికూల ఫలితం పొందక తప్పదని ఆయన స్పష్టం చేశారు. 2023లో కాపులపై కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తే ఇప్పడు ఈ కేసులపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక కక్ష సాధింపు అనే కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ముద్రగడ కాపుల కోసం చేసిన ఉద్యమాలన్నీ గాంధేయ మార్గంలోనే చేశారని, ఆయనపై చంద్రబాబు ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడమే పెద్ద తప్పు అయితే ఇప్పుడు కోర్టు కొట్టేసిన కేసులను తిరగతోడాలనుకోవడం మరో అతి పెద్ద తప్పు అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులు, శెట్టిబలిజల మైత్రీ బంధం బలంతో టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మార్పులపై దృష్టి సారించాలి అమలాపురం టౌన్: నూతన విద్యా సంవత్సరంలో అమలవుతున్న మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా బోధన చేయాలని డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు సూచించారు. అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన జిల్లా రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమంలో డీఈవో బాషా ప్రసంగించారు. జిల్లా విద్యా శాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సెకండరీ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు నియమితులైన జిల్లా రిసోర్స్ పర్సన్లకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ఈ పాఠశాలలో ఏర్పాట్లు చేసినట్లు డీఈవో బాషా తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్ జి.మమ్మీ ప్రారంభించారని చెప్పారు. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్సర్ బుక్స్, పరీక్షా విధానంలో చోటు చేసుకున్న మార్పులు, తరగతి గది బోధనలో వినియోగించే టీచ్ టూల్స్, అబ్జర్వేషన్ పద్ధతులు, నూతన అకడమిక్ క్యాలెండర్ తదితర అంశాలపై ఈ శిక్షణ ఉంటుందని డీఈవో స్పష్టం చేశారు. శ్రీరామ నామ సప్తాహం నిర్వహణకు రూ.1.50 లక్షల విరాళం రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 2 నుంచి జూలై 21 వరకు 49 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీరామ నామ సప్త సప్తాహ మహోత్సవం నిర్వహణకు ద్రాక్షారామకు చెందిన చెరుకు వీరభద్రరావు రూ.1,50,000 విరాళంగా తన కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు. కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు బోణం శ్రీను, కై రం వీరవెంకటసత్యనారాయణ(సతార్ స్వామి), చెరుకు బాబూరావు, సలాది బ్రహ్మానందం పాల్గొన్నారు. -
మహిళలకు న్యాయం చేయాలి
ఎన్నికల ముందు మహిళలకు నెలకు ఇస్తానన్న రూ.1,500 తక్షణం ఇవ్వాలి. ప్రతి నెలా అందించడంతోపాటు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా విడుదల చేయాల్సి ఉంది. – ఎం.పుణ్యవతి లక్ష్మి, తాటిపాక, రాజోలు మండలం అమ్మ ఒడి జమ కాలేదు మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. మా పెద్ద బాబు గౌతమ్ 5వ తరగతి, చిన్నబాబు నిఖిల్ 3వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది అమ్మ ఒడి ఇంకా ఖాతాలో జమ కాలేదు. – గోసాల చిన్నిదుర్గ, గృహిణి, రాయవరం కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ అంబాజీపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డుని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ ఏర్పాటు చేయలేదు. అది ఏర్పాటు చేస్తే రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఉపయోగపడుతుంది. – కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, శ్రీ వ్యాఘ్రేశ్వరా ఐక్య రైతు సంఘం అధ్యక్షుడు. -
ఇంటర్ తరగతులు ప్రారంభం
● అంతంత మాత్రంగా హాజరు ● జిల్లాలో 136 కళాశాలలు రాయవరం: జిల్లాలో ఇంటర్మీడియెట్ కళాశాలలు సో మవారం పునఃప్రారంభమయ్యాయి. పదవ తరగతి అనంతరం ఇంటర్లో చేరిన విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. అయితే రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండుతుండడంతో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. 2025–26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలండర్ను ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. ప్రవేశాలు అంతంత మాత్రం మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్లు, డిజిటల్ విద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా బోధన, ఇంటర్ విద్యతో లభిస్తున్న భవిష్యత్ అవకాశాలను వివరిస్తున్నారు. జిల్లాలో కళాశాలల పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 136 కళాశాలలున్నాయి. 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఆరు, ఒకేషనల్ జూనియర్ కళాశాలలు 18, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 67, హైస్కూల్ ప్లస్లు 31 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 17,253 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరనున్నారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 12,613 మంది ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ విద్యను అభ్యసిస్తారు. 235 పనిదినాలు ఇంటర్మీడియెట్ బోర్దు అకడమిక్ క్యాలండర్ను ఏప్రిల్లోనే విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. నూతన అకడమిక్ క్యాలండర్ ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో 235 పనిదినాలు ఉంటాయి. మొత్తం 314 రోజులకు 79 రోజులు సెలవు దినాలున్నాయి. జూలై 17 నుంచి 19 వరకు యూనిట్–1, ఆగస్టు 18 నుంచి 20 వరకు యూనిట్–2, సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తారు. అక్టోబరు 22 నుంచి 24 వరకు యూనిట్–3, నవంబరు 17 నుంచి 22 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, డిసెంబరు 15 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. జనవరి 21 నుంచి 28 వరకు ప్రీ ఫైనల్–2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు, 2025–26 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 18 చివరి పనిదినంగా నిర్ణయించారు. -
సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు
రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామ సచివాలయంలో జయబున్నీసా బేగం గ్రేడ్–5 హోదాలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ సచివాలయంలో వారంతా ఒకే నోటిఫికేషన్లో నియమితులయ్యారు. దీంతో వారి మధ్య సీనియారిటీ సమస్య కూడా లేదు. అయితే, బేగంకు కొన్నాళ్ల క్రితం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. డీడీవోగా సిబ్బంది జీతాల ఫైల్ సిద్ధం చేయడం ఆమె చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆ సచివాలయ సిబ్బంది రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని డీఎల్డీవో, వార్డు, గ్రామ సచివాలయాల ఇన్చార్జి వీణాదేవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెల జీతాలు నేటికీ రాలేదని బేగం ఫైల్ సిద్ధం చేయకపోవడమే అందుకు కారణమని డీఎల్డీవో దృష్టికి తీసుకెళ్లారు. బేగం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డీఎల్డీవో సిబ్బంది ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. -
జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు
మామిడికుదురు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాశర్లపూడిలంకకు చెందిన కోలా ప్రవీణ్కుమార్ సత్తా చాటాడు. ఇతను జాతీయ స్థాయిలో 328వ ర్యాంకు సాధించాడు. విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్కుమార్కు ముంబయి సీఎస్ఈలో సీటు వచ్చింది. తండ్రి గోపాలకృష్ణ రైతు, తల్లి జ్యోతి గృహిణి. పేరెంట్స్ ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. ప్రతి రోజు 14 గంటలు చదవడం వల్ల మంచి ర్యాంకు వచ్చిందని ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపాడు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. అతడిని స్థానికులు అభినందించారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ఒకరికి ఐదురోజులు, తొమ్మిది మందికి రెండు రోజుల చొప్పున జైలు, 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 27 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల అదుపులో కారు యజమాని అమలాపురం టౌన్: స్థానిక ఏఎస్ఏ ఆస్పత్రి వద్ద 216 జాతీయ రహదారిపై ఓ మోటారు సైకిలిస్ట్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అక్కడ నుంచి కారుతో సహా పరారైన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు యజమాని దీపక్ను అదుపులోకి తీసుకుని రోడ్డు ప్రమాదంలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. స్థానిక పితానివానిపాలేనికి చెందిన దీపక్ స్థానికంగా రోల్స్ ఆన్ రోడ్డు పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడని ఎస్సై పేర్కొన్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసును విచారిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో 4 నుంచి 7 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో పాల్గొనే పురుషుల జిల్లా జట్టు ఎంపి కను మంగళవారం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్రీడామైదానంలో నిర్వహించిన సెలెక్షన్స్లో 15 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ మ హిళల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం తరఫున క్రీడాదుస్తులు అందజేశామని తెలిపారు. -
ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్
మునికూడలి ర్యాంపులో ఆగని ఇసుక రవాణా సీతానగరం: జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిపివేస్తున్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ మునికూడలి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మండలంలోని ములకల్లంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి కాటవరం ర్యాంప్ నుంచి, పక్కిలంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి మునికూడలి ర్యాంపు నుంచి, రఘుదేవపురం, వంగలపూడి ర్యాంపుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ర్యాంపులను అక్టోబర్ వరకు నిలిపివేస్తున్నట్లు, ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి లారీలపై మునికూడలి ర్యాంపు నుంచి రవాణా చేస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో మూడు భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా జరుగుతోందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా తక్షణమే ర్యాంపును నిలిపివేస్తామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి. -
నాణ్యమైన విద్యకు నవోదయం
రాయవరం: జవహర్ నవోదయ విద్యాసమితిలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉండగా..కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఇక్కడ దరఖాస్తుకు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత. పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఒక్కసారే అవకాశం ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయలో ప్రవేశం లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందగోరే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3,4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం తగ్గకుండా సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు ఏడు శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. వసతులు బాలబాలికలకు వసతి గృహాలు, భోజనం, విద్య, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్, షూస్, టాయిలెట్ సామగ్రి ఉచితం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నవోదయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బాలికలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జూలై 29వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. దరఖాస్తుకు రుసుం చెల్లించనవసరం లేదు. 2026–27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష గతేడాది జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన దరఖాస్తులు కోనసీమ 3,869 తూర్పుగోదావరి 1,741 కాకినాడ 3,361పరీక్షా విధానమిదీ.. నవోదయ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబరు 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు భాషను(తెలుగు/ఇంగ్లీషు) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహియిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 40 ప్రశ్నలు 50 మార్కులకు, గణితం(అర్ధమెటిక్), ఎంచుకున్న భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ఎంపికై న వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిషు భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిషులోనే బోధన చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్టీటీపీఎస్://నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు అవగాహన కల్పించాలి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం -
ఇద్దరు లారీ డ్రైవర్ల దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం కాపవరం వద్ద హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. కొవ్వూరు ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ బత్తుల శీనయ్య(40) హైదరాబాద్ నుంచి మండపేటకు ధాన్యం లోడుతో వస్తున్నాడు. కాపవరం వద్దకు వచ్చే సరికి కునుకుపాటుకు గురై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం రోడ్డు డివైడర్ను ఢీ కొట్టడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీని ఇతర వాహనాలకు ఢీకొనకుండా, శీనయ్య కిందకు దిగి డైరెక్షన్ ఇస్తూ దారి చూపుతున్నాడు. ఇంతలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ.. శీనయ్య లారీని బలంగా ఢీకొట్టడంతో అందులోని డ్రైవర్ కొయ్యే బాబూరావు(40) లారీ క్యాబిన్లో ఇరుకుపోయి మృతి చెందాడు. డైరెక్షన్ ఇస్తున్న బత్తుల శీనయ్య కూడా ఐచర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు. -
ఉత్కంఠగా సీనియర్ ఓపెన్ చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన సీనియర్ ఓపెన్ చెస్ జిల్లా స్థాయి పోటీలు ఉత్కంఠగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. ద్రాక్షారామ సాత్విక్ (ప్రథమ), తాడి వెంకటేష్ (ద్వితీయ), బండారు నానిబాబు (తృతీయ), పి.ధరణి (4వ స్థానం) సాధించారని చెప్పారు. ఈ నలుగురు విజేతలు ఈనెల 6వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిధి స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి బహుమతులు అందజేశారు. -
రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిపై గల ప్రతిష్టాత్మకమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్ బిడ్జిల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పీఈ ఎడ్విన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో గల రెండు బ్రిడ్జిలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే వంతెనలపై జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నాణ్యత, భద్రతా తనిఖీని నిర్వహించామన్నారు. 2027 నాటికి సురక్షితమైన, బలమైన వంతెనలుగా తీర్చిదిద్దడానికి, రూ.115 కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై సురక్షితమైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశామన్నారు. ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జ్పై రూ.70 కోట్లతో కేబుల్ రీ ప్లేస్మెంట్ వర్క్ పూర్తి చేస్తున్నామన్నారు. భారతీయ రైల్వేలతో అవగాహన ఒప్పందం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతును ఆశిస్తున్నామన్నారు. పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పుస్తకావిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ అనే పుస్తకాన్ని జమాత్–ఎ–ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీఖ్ ఆవిష్కరించారు. మండపేట పట్టణం గాంధీనగర్ అల్–ఆమీన్ మస్జిద్లో మంగళవారం జమాత్–ఎ–ఇస్లామీ హింద్ మండపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సమావేశంలో రక్షీఖ్ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండగ పాడిరైతులకు ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని, మేధావులు, ధార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు శాసీ్త్రయ దృక్పథంతో వక్ఫ్ చట్టాన్ని సమీక్షించాలని కోరారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పేరుతో ప్రచురితమైన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ స్థానిక కమిటీ అధ్యక్షుడు ఫారుఖ్ అలీ, జిల్లా అధ్యక్షుడు అబుల్ ఆలా, అల్– ఆమీన్ మస్జిద్ అధ్యక్షుడు రహీం, జమియా మస్జిద్ అధ్యక్షుడు అల్తాఫ్, ముస్లిం జేఏసీ నాయకులు ఎండీ కరీం, సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్, షేక్ ఇబ్రాహీం, కరీం పాల్గొన్నారు. -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
గ్రీవెన్స్లో కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ టి.నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, డీఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ, సర్వశిక్షా అసిస్టెంట్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జి.మమ్మీతో కలిసి ఆయన అర్జీదారు నుంచి 212 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించాలని, గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అర్జీదారుడు తన అర్జీ స్థితిని ఆన్లైన్ పోర్టల్ లేదా 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. జేసీ నిషాంతి మాట్లాడుతూ, అంతర్వేది బీచ్లో ఈ నెల మూడున జరిగే యోగా అభ్యసన గ్రాండ్ ఈవెంట్కు వివిధ శాఖల సిబ్బంది తరలిరావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్డీసీ పి.కృష్ణమూర్తి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పీకేపీ ప్రసాద్, డీఈవో షేక్ సలీంబాషా తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా పని చేస్తేనే సంతృప్తి జిల్లా ఆర్థిక గణాంకాధికారి(సీపీవో) పి.వెంకటేశ్వర్లు ఉన్నత విలువలకు, సాటి ఉద్యోగులకు ఆదర్శమని కలెక్టర్ మహేష్కుమార్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశ్వర్లును కలెక్టర్తో పాటు, జేసీ నిషాంతి, ఇతర జిల్లా అధికారులు సోమవారం సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా ఉద్యోగంలో పని చేసినప్పుడే జీవితంలో సంతృప్తి కలుగుతుందన్నారు. ఉద్యోగ పదవీ విరమణ పొందిన వెంకటేశ్వర్లుతో పాటు, ఉప గణాంకాధికారి ఆర్.శంకర్రావు, రాజోలు, కపిలేశ్వరపురం తహసీల్దార్లు ఎన్ఎస్ఎస్ ప్రసాద్, పి.చిన్నారావును కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 18 అర్జీలు అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 18 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జిల్లాలోని డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించగానే ఎస్పీ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. కొన్ని అర్జీలు ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉండడంతో వారికి ఎస్పీ కౌన్సెలింగ్ చేశారు. -
పోరాట పటిమ కార్యకర్తల సొంతం
● వారి కోసమే పార్టీ బాధ్యతలు తీసుకున్నా ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ● వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ మలికిపురం: ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటానికై నా జెండా పట్టుకుని ముందుండేది ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మాత్రమేనని, అటువంటి పోరాట పటిమ తమ కార్యకర్తలకే సొంతమని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ మలికిపురంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ అనే విత్తనం వేస్తే, దానిని మానుగా మార్చింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొనైనా పార్టీని సగర్వంగా నిలిపిన కార్యకర్తలను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తమ పార్టీ స్థాపించిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నాయని గుర్తు చేశారు. కార్యకర్తల కోసమే తాను పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించానన్నారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకూ శత్రువులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత తమదని, దానికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వొద్దని నేరుగా కూటమి పెద్దలే చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో పనిచేసి ఓడిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది తమ అధినేత మాత్రమేనని జగ్గిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జెడ్పీటీసీ సభ్యులు బల్ల ప్రసన్నకుమారి, కుసుమ వనజకుమారి, ఎంపీపీ వీరా మల్లిబాబు, పార్టీ మండల అధ్యక్షులు బొలిశెట్టి భగవాన్, కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీరావు, కుసు చంద్రశేఖర్, కేఎస్ఎన్ రాజు, కంచర్ల శేఖర్, జంపన బుజ్జీరాజు, జాన శంకరరావు, రుద్రరాజు చిన్నరాజా, ఈద రవిరెడ్డి, దొంగ నాగసత్యనారాయణ, ముప్పర్తి త్రిమూర్తులు, కూనపరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. -
కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్
బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్ కేటగిరీ లో నాలుగో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్లో రెగ్యులర్ సిలబస్తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి. -
పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ
● దేవస్థానం అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ చెల్లింపు ● ఊపిరి పీల్చుకున్న 349 మంది సిబ్బంది అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఎట్టకేలకు చెల్లించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది ఖాతాలకు సొమ్ము జమ అయింది. మే నెల గడిచినా ఏప్రిల్ వేతనాలను పారిశుధ్య సిబ్బందికి చెల్లించకపోవడంపై శ్రీవీరి కష్టం తుడిచే వారేరిశ్రీ శీర్షికన మే 26న వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన దేవస్థానం అధికారులు మే 28న సంబంధిత కనకదుర్గా ఏజెన్సీస్ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లించేందుకు రూ.58 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష తనకు రావాల్సి ఉందని, అది వస్తే కానీ తాను జీతాలు చెల్లించనంటూ కాంట్రాక్టర్ భీష్మించడంతో.. కార్మికుల వేతనాలు మరింత ఆలస్యమయ్యాయి. దీనిపై ఇలాగైతే మేమెలా బతకాలి శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. అధికారుల ఒత్తిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంపై దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారమే కార్మికుల అకౌంట్లకు వేతనాలు జమ కావాలని కాంట్రాక్టర్కు స్పష్టం చేయడంతో.. గత్యంతరం లేక ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది అకౌంట్లలో నగదు జమ అయింది. వరుసగా రెండు నెలల జీతాలు ఆలస్యం కావడంపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. మే నెల జీతాలైనా జూన్ పది కల్లా చెల్లించేలా చూడాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. నలుగురికి అందని వేతనాలు కాగా, దేవస్థానంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు మార్చి వేతనాలు ఇంకా చెల్లించలేదు. గత నెలలో అందరికీ మార్చి వేతనాలు చెల్లించగా, వీరికి అందలేదు. సాంకేతిక కారణాలతో జమ కాలేదని, వచ్చే నెల చెల్లిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. వీరికి మార్చి బకాయి చెల్లంచకుండా, ఏప్రిల్ వేతనాలు మాత్రమే చెల్లించారు. -
సత్తా చాటిన అన్నదమ్ములు
కె.గంగవరం: ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో కె.గంగవరానికి చెందిన కొడవటి ప్రసాద్చౌదరి (విశ్రాంత ఉపాధ్యాయుడు) మనవడు సువర్ణ రామ్ప్రత్యూష్కు అత్యుత్తమమైన ఆలిండియా 510 ర్యాంక్ సాధించినట్టు కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో అతని అన్నయ్య కొడవటి సాయిప్రణీత్ ఆలిండియా 565 ర్యాంక్ సాధించడం గమనార్హం. తమ ఇద్దరు కుమారులు ప్రఖ్యాత ఐఐటీ కాలేజీల్లో సీట్లు సాధించడంపై తండ్రి కొడవటి సురేష్ (డీఈ, ఏపీ ట్రాన్స్కో), తల్లి వసుధ (సాఫ్ట్వేర్ ఇంజినీర్)తో పాటు, తాతయ్య కొడవటి ప్రసాద్చౌదరి, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వారం పరీక్ష రాసి, పొరపాట్లు సరిదిద్దుకోవటం, సందేహాల నివృత్తి, సమయ పాలన, రోజుకు 14 గంటలు శ్రమించడం వంటివి తన విజయానికి ప్రధాన కారణాలుగా తెలిపారు. -
బండారులంకలో రేషన్ బియ్యం పట్టివేత
డ్రైవర్, ఇద్దరు డీలర్లపై కేసు నమోదు అమలాపురం రూరల్: బండారులంక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 బస్తాల బియ్యం లోడుతో వెళుతున్న వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు. సరకును స్వాధీనం చేసుకుని, వ్యాన్ సీజ్ చేసి, డ్రైవర్తో పాటు, ఇద్దరు రేషన్ డీలర్లపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు, రూరల్ మండలం బండారులంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని వ్యాన్లో లోడ్ చేసి తరలిస్తుండగా, సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వాహనాన్ని అడ్డగించి, పోలీసులకు, సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ వ్యాన్లో 50 కేజీల వంతున 55 బస్తాల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాహనాన్ని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఎ.సత్యనారాయణ, రేషన్ డీలర్లు సుగ్గు మాణిక్యాలరావు, కాశిన సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్బాబు తెలిపారు. -
బైక్లు ఢీకొని యువకుడి మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు, కోరుమామిడి గ్రామానికి చెందిన ఆరుగొల్లు చంద్రరావు కుమారుడు పండు(21) గేదెల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పిట్టా సందీప్ కోరుమామిడి కంచాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో పండును వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పండును నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు అతడి తండ్రి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు కె.ప్రణీత్ రెండో ర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ ఎనిమిది, ఇ.వర్షిత్ 12, ఎం.సుమంత్దొర 38, కె.అభినవ్ 42, జి.సుజోష్రాజ 43, జి.అఖిల్సాయి 45, తుమాటిపూజిత అఖిల్రాజ్కుమార్ 85, కప్పల వెంకటరామవినీష్ 127, పాతపాటి వెంకటవివేక్వర్మ 132, మువ్వల లిఖిత 137 ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంకా 165, 174, 193, 195, 231, 238, 246, 270, 275, 276 ర్యాంకులు సాధించారన్నారు. వెయ్యిలోపు 69, మూడు వేలలోపు 201, ఐదు వేలలోపు 333, పది వేలలోపు 456 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. 260 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకర్లను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం
వైద్య కళాశాలకు భౌతికదేహం అందజేత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి.చిరంజీవిని కుమారి భౌతికదేహాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. అభిమానులు, పూర్వ విద్యార్థులు. ప్రజాప్రతినిధుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రతాప్నగర్లోని ఆమె స్వగృహం నుంచి ఇంద్రపాలెం లాకుల వద్దనున్న ఐడియల్ కళాశాలకు ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆమె భౌతికకాయాన్ని రంగరాయ వైద్య కళాశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందజేవారు. ఆమెకు సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, మురళీకృష్ణ, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పి.కృష్ణారావు, మాజీ రిజిస్ట్రార్ వి.రవీంద్ర, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సీపోర్టు సీఈఓ మురళీధర్, జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పూర్వ విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఉన్నారు. -
రైతు బిడ్డకు 1911 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని చెముడులంకకు చెందిన రైతు బిడ్డ నాగిరెడ్డి తేజ చంద్రనారాయణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 1911 ర్యాంకు సాధించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన అతడు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అత్యున్నత ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అతను తెలిపాడు. ఇదే కుటుంబంలో తేజ చంద్రనారాయణ సోదరి శ్రావణి 2022లో జేఈఈ అడ్వాన్స్డ్లో 1800వ ర్యాంకును సాధించి, ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. సరస్వతీ కటాక్షం కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసు, నాగ అరుణ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. -
కోనసీమ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
కొత్తపేట: జేఈఈ అడ్వాన్స్డ్–2025లో కోనసీమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో తమ సత్తా చాటారు. భరద్వాజ్కు ఆలిండియా 82 ర్యాంక్ కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెం గ్రామానికి చెందిన తోరాటి భరద్వాజ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంక్ను, ఈడబ్ల్యూఎస్లో ఐదో ర్యాంకు సాధించాడు. గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తోరాటి శివ, పుష్ప దంపతుల కుమారుడైన భరద్వాజ్ పదో తరగతి వరకూ అమలాపురం, ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివాడు. ముంబై ఐఐటీలో సీఎస్ఈ సీటు సాధించి కంప్యూటర్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమని భరద్వాజ్ తెలిపాడు. మణిదీప్వర్మకు ఆలిండియా 386 ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి మణిదీప్వర్మ జేఈఈ అడ్వాన్స్ ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో 386 ర్యాంక్ను, ఈడబ్ల్యూఎస్లో 21 ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ముదునూరి శ్రీనివాసరాజు, మాధవీ ఝాన్సీ దంపతుల కుమారుడైన మణదీప్వర్మ రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ముంబై ఐఐటీలో సీఎస్ఈ సీటు సాధిస్తానని భరద్వాజ్ తెలిపాడు. కంప్యూటర్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమన్నాడు. -
సంధిపూడి విద్యార్థికి ఆలిండియా 1533 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన తోట మోహన్ నాగవీరవెంకటరాజు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1533 ర్యాంకు సాధించాడు. గత ఏప్రిల్ 19న విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 3557 ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. వెంకటరాజు టెన్త్ రాజమహేంద్రవరంలో, ఇంటర్మీడియెట్ విజయవాడలో అభ్యసించాడు. ప్రముఖ జాతీయ విశ్వవిద్యాలయంలో సీటు పొంది, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతానని వెంకటరాజు తెలిపారు. తల్లి భవానీ సర్పంచ్ కాగా, తండ్రి వెంకటేశ్వర్లు రాజకీయవేత్తగా ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం
పెరవలి: వ్యాపారం కలసిరాక, అప్పులు తీర్చలేక, అప్పు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన సంచలనం కలిగించింది. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముత్యాలవారిపాలెం గ్రామానికి చెందిన గంటా తేజనవీన్ తణుకులో గిఫ్ట్ ఆర్టికల్స్ షాపు నిర్వహించేవాడు. వ్యాపార, కుటుంబ అవసరాల కోసం రూ.25 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు బాకీ తీర్చమని ఒత్తిడి చేయసాగారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం కుటుంబం సహా బయటకు వెళ్లిన తేజనవీన్ తిరిగి ఇంటికి చేరలేదు. ఈ మేరకు తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. తేజనవీన్, అతని కుటుంబ సభ్యులు కనిపిస్తే తమకు 94407 96642 లేదా 91548 75611 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. బంగారం, నగదుతో ఉడాయించిన వ్యక్తి అరెస్ట్ రూ.6.53 లక్షల సొత్తు రికవరీ అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గంగుమళ్ల కాసుబాబు వద్ద నుంచి బంగారు నగలు, నగదు తీసుకెళ్లి, పత్తా లేకుండాపోయిన కంతేటి రాజాను సోమవారం అరెస్ట్ చేసినట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయన వివరాల మేరకు, వ్యాపారవేత్త కాసుబాబు వద్ద అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన కంతేటి రాజా ఐదేళ్లుగా క్లర్క్ కం అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. ఆ నమ్మకంతోనే గత నెల 26న కాసుబాబు అతడికి 322 గ్రాముల బంగారు నగలు, రూ.2.25 లక్షల నగదు ఇచ్చి ముమ్మిడివరంలోని ఓ వాణిజ్య బ్యాంక్కు పంపించారు. నగలు, నగదుతో వెళ్లిన రాజా మళ్లీ కనిపించలేదు. దీంతో మరుసటి రోజు కాసుబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు రాజా కోసం గాలిస్తున్నారు. సోమవారం స్థానిక సావరం రోడ్డులో తచ్చాడుతున్న రాజాను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.6.53 లక్షల విలువైన 217 గ్రాముల బంగారు నగలను రికవరీ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
రేపటి నుంచి సత్యసాయి రథోత్సవం
కొత్తపేట: భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని (రథోత్సవం) ఈ నెల 3 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రవేశించి ఈ నెల 6 వ తేదీ వరకూ కొనసాగుతుందని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మన్యం పర్వతవర్ధనరావు తెలిపారు. రథోత్సవం నిర్వహణపై ఆదివారం స్థానిక సత్యసాయి సేవా మందిరంలో సేవా సమితి ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కన్వీనర్ కంకటాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వర్ధనరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు 150 దేశాలలో విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో రథోత్సవం ఇలా.. మంగళవారం ఉదయం యానాంలో రథోత్సవం ప్రారంభమై ఎదుర్లంక బాలయోగి వారథి మీదుగా మురమళ్ల, ముమ్మిడివరం, అమలాపురం, బండార్లంక, పి.గన్నవరం, డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ మీదుగా సాయంత్రానికి వాడ్రేవుపల్లి చేరుకుంటుంది. 4న ఉదయం అక్కడ బయలుదేరి పెదపట్నం అగ్రహారం, మామిడికుదురు, మగటపల్లి, గోగన్నమఠం, శంకరగుప్తం, అంతర్వేది, సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, జగ్గన్నపేట మీదుగా సాయంత్రానికి లక్కవరం చేరుకుంటుంది. 5వ తేదీ ఉదయం కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం నుంచి కొత్తపేట, రావులపాలెం, ఊబలంక, ఆలమూరు మీదుగా సాయంత్రానికి మండపేట చేరుకుంటుంది. 6న వల్లూరు వెదురుమూడి, అంగర, పామర్రు, ద్రాక్షారామం, చెల్లూరు, పసలపూడి, రామచంద్రపురం మీదుగా కేశవరంతో జిల్లాలో రథోత్సవం ముగుస్తుంది. సమావేశంలో సేవా సమితి సభ్యులు చొప్పెల్ల రాంబాబు, సత్యవరపు భాస్కరరావు పాల్గొన్నారు. -
సీపీవో సేవలు అభినందనీయం
అమలాపురం రూరల్: జిల్లా ప్రణాళికాధికారి పి.వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వహించి విశిష్ట సేవలు అందించారని అధికారులు ప్రశంసించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా అమలాపురంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఆయనకు ఉద్యోగులు వీడ్కోలు సభ నిర్వహించారు. ప్రణాళికా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రణాళికా అమలు, గణాంక విశ్లేషణ, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయంలో విశేష దక్షత చూపారని అన్నారు. 2022లో నూతనంగా ఏర్పడిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు గుంటూరు నుంచి బదిలీపై వచ్చిన వెంకటేశ్వర్లు, జిల్లా ప్రణాళికాధికారిగా అమలాపురంలో విశిష్ట సేవలు అందించారని అన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు బదిలీ అయిన తరువాత కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యాలయ వ్యవస్థను పునాది నుంచి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో తాను నివసిస్తున్న ఇంట్లోనే కార్యాలయం ప్రారంభించి, తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్వర్లు దంపతులతోపాటు పదవీ విరమణ పొందిన డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్.శంకర్రావును కూడా సత్కరించారు. -
అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యం
కొత్తపేట: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కొత్తపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ప్రగతిశీల రాష్ట్రంగా నిలిపేందుకు సహకరిస్తుందన్నారు. రూ.3 వేల కోట్లతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమలాపురం నుంచి కాకినాడ 4 లైన్ల హైవే, జొన్నాడ హైవే నుంచి యానాం హైవే వరకూ రూ.200 కోట్లతో ఏటిగట్టు రోడ్డు విస్తరణ, కోనసీమ అభివృద్ధి, ఇక్కడ టూరిజం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. కృష్ణా, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఇసుక అక్రమ నిల్వలు, రవాణాపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేపు వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని నిల్వలు పెడతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా వరదలను దృష్టిలో పెట్టుకునే నిల్వలు పెడితే చంద్రబాబు, కూటమి నాయకులు గుట్టల వద్ద ఫొటోలు తీయించుకుని విమర్శలు చేశారు? అన్న ప్రశ్నకు అప్పటి కంటే ఇప్పుడు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం పాల్గొన్నారు. -
అన్న ప్రసాద భవనానికి విరాళాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎన్ చైతన్యజనార్థన్, సిందూరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,307, వీ వినోద్, సులోచనారాణి దంపతులు రూ 50,307 వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. అయినవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారి సన్నిధిలో భక్తులు లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్న ప్రాసన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు. తాగునీరు, వీధి దీపాలను బంద్ చేస్తాం ఉధృతమవుతున్న మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ సమ్మె అమలాపురం టౌన్: రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు అమలాపురంలో చేపట్టిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. అమలాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుంచి సమ్మె చేస్తున్న 50 మంది వర్కర్లు మోకాళ్లపై నిలబడి ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నామని మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం.దుర్గా అర్జునరావు ప్రకటించారు. ఆదివారం నుంచి తాము విధులు నిర్వర్తించే తాగునీరు, వీధి దీపాలను కూడా బంద్ చేస్తూ నిరసన స్థాయిని పెంచుతున్నట్లు వివరించారు. ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62కి పెంచాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, జీతాలను టెక్నికల్, నాన్ టెక్నికల్గా పెంచి ఇవ్వాలన్న డిమాండ్లతో వారు సమ్మె బాట పట్టారు. అమలాపురం యూనియన్ అధ్యక్షుడు దంగేటి షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి యెరుబండి వెంటక సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నాగారపు శ్రీనివాస్, యూనియన్ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. -
మంత్రికి ప్రొటోకాల్తో పనిలేదా?
వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షురాలు సతీష్కుమారి రామచంద్రపురం రూరల్: రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్కు ప్రొటోకాల్తో పని లేదా.. అని వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు, వెంకటాయపాలెం సర్పంచ్ యల్లమిల్లి సతీష్కుమారి ప్రశ్నించారు. వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రేషన్ డిపోల ప్రారంభోత్సవాల నేపథ్యంలో జరిగిన ఘటనలను ఆమె ఆదివారం విలేకరులకు వివరించారు. ఏదో కొత్త వ్యవస్థను తమ ప్రభుత్వంలో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉండగా 51వ రేషన్ షాపును తాను, గ్రామంలోని జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు కణితి వెంకటేశ్వరి, ఇతర గ్రామ పెద్దలతో కలసి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తరువాత 52వ షాపు వద్దకు వెళ్లగా ఎంపీటీసీ సభ్యురాలు స్థానిక కూటమి నాయకులతో కలసి రిబ్బన్ కత్తిరించి అప్పటికే ప్రారంభించడంతో.. మీరు చేసింది సరైన విధానం కాదని డీలర్తో చెప్పి అక్కడి నుంచి వచ్చేసి తహసీల్దార్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం ఈ రెండు షాపులూ ప్రారంభించేసినా మంత్రి సుభాష్ను కూటమి నాయకులు మధ్యాహ్నం పిలిపించి మళ్లీ వాటికి రిబ్బన్ కత్తిరింపజేయడం గ్రామంలో చర్చనీయాంశం అయ్యిందన్నారు. కూటమి నాయకులు మంత్రిని అవమానించినట్లు భావించాలో, మంత్రి వచ్చిన తరువాత పిలవకపోవడం సర్పంచ్గా నన్ను అవమానించినట్లు భావించాలో అర్థం కావడంలేదన్నారు. ఏది ఏమైనా మంత్రి సుభాష్ ప్రొటోకాల్కి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లం అయ్యిందని ఆమె మండిపడ్డారు. -
జాతీయ యోగా పోటీలకు ముగ్గురి ఎంపిక
అమలాపురం టౌన్: శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్న ముగ్గురు బాల బాలికలు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గత ఏప్రిల్ 8న వైజాగ్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఈ ముగ్గురి బాల బాలికలు జాతీయ పోటీలకు అర్హత సాధించారని ఆ యోగాశ్రమం యోగా గురువు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. జూనియర్ కేటగిరీలో వెయిట్ విభాగంలో బంగారు మేఘన, చామకూరి వర్ధిని, గుత్తల ప్రవీణ్ ఎంపికకై నట్లు చెప్పారు. వీరు ఈ నెల 12న ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్టపతి అవార్డు గ్రహీత, జాతీయ యోగా న్యాయ నిర్ణేత మోటారి భైరవస్వామి ఎంపికై న ముగ్గురిని యోగా శిక్షకులను అభినందించారు. విలేకరి రాముపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించిన ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జగ్గిరెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ అమలాపురం టౌన్: అయినవిల్లి మండల సాక్షి విలేకరి భావిశెట్టి రామకృష్ణ నాగేశ్వరరావు (రాము)పై జరిగిన దాడిని జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామును పార్టీ జిల్లా నేతలు ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ రామును పరామర్శించారు. రాముపై జరిగిన దాడి వివరాలపై వారు ఆరా తీశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజు, కుడుపూడి భరత్ భూషణ్ రామును పరామర్శించారు. వివాహిత అదృశ్యం అమలాపురం టౌన్: గత నెల 30వ తేదీన తన భార్య చర్చికి వెళతానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలేనికి చెందిన ఉండ్రాజవరపు జగదీష్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. జగదీష్, నందినికి మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇంకా సంతానం లేదు. రెండు రోజులుగా భార్య ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో భర్త జగదీష్ ఫిర్యాదు చేశాడు. -
ఖరీఫ్కు నీరు విడుదల
ధవళేశ్వరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వివి రామకృష్ణ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. తొలుత తూర్పు డివిజన్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వీవీ రామకృష్ణ గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సునీల్కుమార్ మాట్లాడుతూ రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ త్వరగా ప్రారంభించడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుపానులు, వరదల ముంపు బారిన పంటలు పడకుండా రైతు చేతికి అందుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జూన్ 1న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో 10,13,161 ఎకరాలకు నీటిని కాటన్ బ్యారేజీ ద్వారా అందిస్తున్నామన్నారు. ఖరీఫ్ని సకాలంలో పూర్తి చేయడం ద్వారా రబీ త్వరగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని తద్వారా రబీలో కూడా నీటి ఎద్దడి లేకుండా సాగుకు నీరు అందుతుందన్నారు. 6.1కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. డెల్టా కాలువలకు మొత్తం 500క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ వద్ద 10.25 అడుగుల వద్ద నీటిమట్టం నెలకొంది. బ్యారేజీ నుంచి ఆదివారం సాయంత్రం 10,707 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ బి వెంకటస్వామి, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ డీసీ సుబ్బారెడ్డి, ఇరిగేషన్ అధికారులు డీఈలు ఆనంద్బాబు, రమేష్, ఏఈలు అద్దంకి సాయిరామ్, డి.రాధాకృష్ణ పాల్గొన్నారు. -
ఇద్దరు సీఆర్వో ఆఫీసు గుమస్తాల సస్పెన్షన్
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు వసతి గదులు ఖాళీ ఉండి కూడా అద్దెకు ఇవ్వకుండా భక్తుల్ని ఇబ్బంది పెట్టారన్న అభియోగంపై సీఆర్వో కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న గుమస్తాలు కె. శ్రీనివాస్, కలికేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఈఓ వీర్ల సుబ్బారావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి కొంతమంది భక్తులు వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయం వద్ద వాకబు చేయగా గదులు ఖాళీ లేవని అక్కడ సిబ్బంది తెలిపారు. దీంతో వారు డిస్ప్లే బోర్డులో గదులు ఖాళీ ఉన్నాయని చూపిస్తుంటే మీరు గదులు ఖాళీ లేవంటున్నారేంటని ప్రశ్నించారు. దీంతో బాటు సీఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది భక్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఈఓకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో ఈఓ వెంటనే సీఆర్వో కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా 60 గదులు ఖాళీ ఉన్నట్టు తేలింది. దాంతో ఆ గదులను ఆ భక్తులకు అద్దెకి ఇప్పించారు. భక్తుల్ని ఇబ్బంది పెట్టినందుకు కౌంటర్లో ఉన్న ఇద్దరినీ సస్పెండ్ చేశారు. -
భక్తులతో పోటెత్తిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలలో రాష్ట్రంలోని పలుచోట్ల కూడా వివాహాలు జరగడంతో నవదంపతులు వారి బంధుమిత్రులు ఆదివారం సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు. ఘనంగా రథసేవ ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్ఠించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం అర్చకస్వాములు సుధీర్, గణేష్ ప్రాకారసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
వాడపల్లిలో భక్తజన సందోహం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా తిరుమల క్షేత్రాన్ని తలపిస్తోంది. శ్రీఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలంశ్రీ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపిస్తున్నారు. ఆదివారం వాడపల్లి క్షేత్రానికి భక్తులు తరలివచ్చి అష్టోత్తర పూజలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ 8,06,929 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..
● ప్రజ్ఞావేత్త చిరంజీవిని కుమారి అస్తమయం ● ప్రజల సందర్శనార్థం నేడు ఇంద్రపాలెం ఐడియల్ కళాశాలలో పార్థివ దేహం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గోదావరి జిల్లాల్లో ప్రఖ్యాత విద్యాసంస్థలు ఐడియల్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు, సీ్త్ర హక్కుల పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్ పి.చిరంజీవిని కుమారి (94) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె భర్త పీఎస్ శర్మ పదేళ్ల క్రితం మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు గోపాల్ వైద్యవృత్తిలో కొనసాగుతుండగా, చిన్నకుమార్ కిరణ్ ఐడియల్ కళాశాల అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. పూర్వ విద్యార్థులు, సాహితీ ప్రియులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని ఇంద్రపాలెం ఐడియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం 11 గంటల వరకూ ఉంచనున్నారు. 1931 మార్చి 30వ తేదీన జన్మించిన డాక్టర్ చిరంజీవిని కుమారి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి కొద్దికాలం సేవలందించి, డాక్టర్ పి.వి.ఎన్.రాజుతో కలిసి 1970లో ఐడియల్ జూనియర్ కళాశాలతో ఐడియల్ విద్యాసంస్థను ప్రారంభించారు. క్రమేణా డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించి లక్షలాది మంది విద్యార్థులను తయారు చేశారు. ఒకపక్క విద్యాసంస్థల నిర్వహణతో పాటు తూర్పుగోదావరి రచయితల సంఘం కార్యదర్శిగా జిల్లాలో భాషా సాహిత్యాభివృద్ధికి చాలా కృషిచేశారు. ఐడియల్ విద్యాసంస్థల్లో తెలుగు భాషను మాత్రమే ద్వితీయ భాషగా కొనసాగిస్తూ, తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎనలేని సేవలు అందించారు. మహాకవి శ్రీ శ్రీ సప్తతి, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య వేడుకలు, పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం మొదలైన కార్యక్రమాలు ఐడియల్ విద్యాసంస్థల ద్వారా జరిపించారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి, జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రచనకు సారథ్యంతో పాటు జన విజ్ఞాన వేదికకు సేవలందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండలి సభ్యురాలిగా సేవలందించి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తూర్పుగోదావరి అనే గ్రంథాన్ని రచించి ప్రశంసలు పొందారు. ఏయూ నుంచి స్వర్ణ పతాక అవార్డు పొందారు. డాక్టర్ శిఖామణి సంతాపం యానాం: ప్రముఖ విద్యావేత్త, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఐడియల్ కాలేజీ కరస్పాండెంట్, అభ్యుదయ రచయిత్రి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మృతిపట్ల యానాం కవిసంధ్య సంపాదకుడు, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ శిఖామణి ఆదివారం ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల నుండి కవిసంధ్య పత్రిక వరకు ఆమె అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. వయోభారాన్ని సైతం పక్కనపెట్టి గత సంవత్సరం కథా సదస్సు నిర్వహించడం, గత నెలలో యానాంలో కవిసంధ్య నిర్వహించిన దాట్ల అభినందన సభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆయన మృతి అటు జిల్లా విద్యారంగానికి, సాహిత్యరంగాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. జిల్లా క్రీడారంగానికి తీరని లోటు ఒలింపిక్ సంఘ కార్యదర్శి ఎలీషాబాబు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 25 సంవత్సరాల పాటు జిల్లా ఒలింపిక్ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందించిన, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి మృతి జిల్లా క్రీడారంగానికి తీరని లోటని జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి డాక్టర్ జి.ఎలీషాబాబు పేర్కొన్నారు. డాక్టర్ చిరంజీవినీ కుమారి ఒలింపిక్ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా సేవలు అందించారన్నారు. అన్ని క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆర్థికంగా వివిధ క్రీడాపోటీల నిర్వహణకు, ఒలింపిక్ సంఘానికి చేయూతనిచ్చారని తెలిపారు. రాజమహేంద్రవరం నన్నయ యూనివర్శిటీ ఏర్పాటులో కూడా గోదావరి సాధన సమితి ద్వారా ఆమె చేసిన కృషి ఎంతో ఉందన్నారు. ఒలింపిక్ రన్ కన్వీనర్గా మినీ ఒలింపియాడ్, ఒలింపిక్ రన్ నిర్వహణలో చాలాకాలం ఆమె సర్టిఫికెట్లు అందించారన్నారు. వాలీబాల్ సంఘానికి కూడా ఆమె సేవలు అందించారని తెలిపారు. ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, గౌరవ అధ్యక్షుడు చుండ్రుగోవిందరాజు, కర్రిభామిరెడ్డి, డీఎస్డీఓ బిశ్రీనివాస్ కుమార్, రెడ్క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీను, మాచరరావు చిరంజీవినీ కుమారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. గొప్ప సాహితీవేత్తను కోల్పోయాం విద్య, సామాజిక, సాహితీవేత్తగా పేరొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి మృతి సమాజానికి తీరని లోటు. జిల్లా చరిత్రను గ్రంథస్తం చేసిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి సామాజ ఉన్నతికి పాటుపడిన గొప్ప విద్యావేత్త ఎంతోమంది విద్యార్థులను ఐడి య కళాశాల ద్వారా చిరంజీవినికుమారి ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి మంచి పౌరులను అందించారు. ఇంటర్, డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఇంజినీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆమె మరణం సాహితీ వేత్తలకు, రచయితలకు తీరని లోటు. – డాక్టర్ పి.కృష్ణారావు, ప్రగతి కళాశాల చైర్మన్ -
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ కష్టాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కార్ నిలిపివేయడంతో రాష్ట్రంలో రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో రేషన్ తెచ్చుకొనేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర పాట్లు పడుతున్నారు.పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి, పెద్ద రాజపురం, చిన్న రాజపురం, చీపురుపల్లి, పెద్దగూడ, దిగువగూడ, గ్యాసరగూడ, శివుడి మామిడిగూడ, జెన్నోడుగూడ, బలదగూడ, దబ్బాగూడ గ్రామాలకు చెందిన గిరిజనులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: ఏజెన్సీలోనూ రేషన్ కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి మళ్లీ రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా తమకు చాలా మేలు జరిగిందంటున్న గిరిజనులు.. అదే పథకాన్ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.కోనసీమ జిల్లా: ఇంటి వద్దకే రేషన్ అందించే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుు వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండల్లో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కూటమి పాలనలో విలేకర్లపై పెరిగిన దాడులు
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో విలేకర్లపై దాడులు పెరిగిపోయాయని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అయినవిల్లి మండల సాక్షి విలేకరి బావిశెట్టి నాగేశ్వరరావుపై అయినవిల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ముసుగులు ధరించి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. అమలాపురంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావును ఆయన శనివారం పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి విలేకరిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజవర్గ ఇన్చార్జి గన్నవరం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్ సీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెండగుదిటి శిరీష్, విఘ్నేశ్వరస్వామి ఆలయం మాజీ చైర్మన్ గుత్తుల నాగబాబు, నాయకులు సలాది బుచ్చిరాజు, మద్దాల చంటిబాబు, గుర్రాల రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. ‘ఉపాధి’ బకాయిల కోసం రేపు ధర్నా అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.శివ, దైవవాణి తెలిపారు. అమలాపురం మండలం కామనగరువు పరిధిలోని కరక్కాయపేటలో శనివారం వారు ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలకు గతంలో అనేక సదుపాయాలు కల్పించేవారని, టెంట్లు, మెడికల్ కిట్లు, మంచినీరు, మజ్జిగ ఇచ్చేవారని, మేట్లకు రూ.5 ప్రోత్సాహం ఇచ్చేవారని చెప్పారు. గతంలో ఒక్క పూట మాత్రమే పని చేయించేవారని, కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలన్నీ రద్దు చేశారని, రెండు పూటలా మస్తరు వేయాలనే నిబంధన పెట్టారని చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉపాధి కూలాలకు జిల్లాలో రూ.55 కోట్లు పైగా వేతన బకాయిలున్నాయని చెప్పారు. కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని తరమికొట్టాలి ఆలమూరు: గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సక్రమంగా అమలు చేయకుండా పేద వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తరమి కొట్టాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మండలంలోని చెముడులంక వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయం వద్ద మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల మన్ననలను పొందిన రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసి అందులో పనిచేస్తున్న ఆపరేటర్లను రోడ్డు మీద పడవేశారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్ బిల్లులు నాలుగింతలు పెంచేచారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటి వరకూ ఒక రేషన్కార్డును కాని, పింఛన్ను కాని మంజూరు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల నాలుగున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా అధిక సంఖ్యలో పాల్గొని వెన్నుపోటు దినం ఆవశ్యకతను, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చాటి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పార్లమెంటరీ పార్టీ పరిశీలకురాలిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మండలానికి విచ్చేసిన విజయలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, మాజీ ఏజీపీ నామాల శ్రీనివాసు, నాండ్ర నాగమోహన్రెడ్డి, కోలా నాని, చామకూరి శ్రీనివాసు, నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పనపల్లిలో భక్తజన కోలాహలం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. అర్చకులు, వేద పండితులు తెల్లవారుజామున సుప్రభాత సేవ నిర్వహించారు. తొలి హారతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు తొలి హారతితో పాటు శ్రీదేవి, భూదేవీ సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారు స్వయంభువుగా వెలసిన పాత ఆలయాన్ని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,03,024 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 5,800 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. మూడు వేల మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.90,835 విరాళాలుగా అందించారని పేర్కొన్నారు. -
ఎండీయూ ఆపరేటర్లను అవమానిస్తారా?
సాక్షి, అమలాపురం: ‘ఇంటింటా రేషన్ అందించే ఎండీయూ వాహనాల యజమానులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగ్రవాదులతో పోల్చడం దారుణం. ప్రభుత్వంతో కలిసి పని చేసేవారిని కించపరుస్తూ.. వ్యక్తిత్వ హననానికి గురి చేయడం దేశంలో మరే ముఖ్యమంత్రీ చేసిన చరిత్ర లేదు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ఆయన శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వాహనాల యజమానులకు న్యాయం చేయాలని కోర్టు మొట్టికాయ వేస్తే వారిని ఉగ్రవాదులతో పోల్చడం దారుణమని మండిపడ్డారు. సీఎంగా చంద్రబాబు వస్తే తమ బాధలకు పరిష్కారం చూపుతారని జిల్లావాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తే నిరాశకు గురి చేశారని అన్నారు. మహానాడులోనే కాదు.. కోనసీమలో కూడా చంద్రబాబు అబద్ధాలే మాట్లాడారని దుయ్యబట్టారు. ‘జిల్లాలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో సొమ్ము ఇస్తామన్నారు. తరువాత 46 గంటల్లోనైనా చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజుకు కూడా కూడా చెల్లించలేదు. ఇప్పటికీ రూ.కోట్ల బకాయిలున్నాయి. దీనిపై సీఎం హోదాలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని విమర్శించారు. మహానాడులో అందరితో పొగిడించుకునే శ్రద్ధ జిల్లాలో రైతులపై లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. మహిళలను చంద్రబాబు మోసం చేశారని, దఫదఫాలుగా గ్యాస్ ఉచితంగా అందిస్తామని చెప్పి, చివరకు గ్యాస్ కొట్టి వెళ్లారన్నారు. ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దగా చేశారన్నారు. ‘గత సీఎం జగన్మోహన్రెడ్డి డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రూ.26 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి, ఆ లబ్ధిని మహిళలకు దఫదఫాలుగా అందించారు’ అని గుర్తు చేశారు. నిరుద్యోగుల విషయంలో కూడా బాబు నోరు మెదపలేదని జగ్గిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు కల్పిస్తానన్నారని, ఆ పెట్టుబడుల సొమ్ము ఆయన ఎక్కడ దాచిపెట్టిందీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో కూడా చెప్పలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.14 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి పదో తరగతి పరీక్షలు రాశారని, వాటి స్పాట్ వేల్యుయేషన్లో తీవ్ర తప్పిదాలు జరిగాయని, దీనికి చంద్రబాబు పుత్రరత్నం, విద్యా శాఖ మంత్రి లోకేష్ కారణం కాదా అని ప్రశ్నించారు. ‘సఖినేటిపల్లికి చెందిన ఒక అమ్మాయికి సోషల్ సబ్జెక్టులో తొలుత 23 మార్కులు వచ్చాయి. రీ వెరిఫికేషన్కు వెళితే 84 మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 66 వేల మంది తల్లిదండ్రులు రీ వేల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం, వ్యక్తిగతంగా లోకేష్ అసమర్థత కారణం’ అని జగ్గిరెడ్డి మండిపడ్డారు. తప్పులకు కారకులైన అసలు వ్యక్తులను వదిలేసి, ఐదుగురు చిరుద్యోగులను సస్పెండ్ చేస్తే ప్రభుత్వ అసమర్థత ప్రజలకు తెలియకుండా పోదని అన్నారు. ఇసుక మీద చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎవరైనా అక్రమాలు చేస్తే మీ వెనుక నా డ్రోన్ తిరుగుతోందని బాబు అంటున్నారని, కానీ మొన్న ముమ్మిడివరంలో ఎనిమిది మంది, పి.గన్నవరంలో ముగ్గురు పిల్లలు గోదావరి స్నానానికి వెళ్లి చనిపోవడానికి ఇసుక అక్రమ తవ్వకాలే కారణమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించకపోవడం దారుణమని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ ప్రభుత్వంలో భాగస్వాములైన వారిని ఉగ్రవాదులంటారా? ఫ జిల్లాకు మేలు చేసే ఒక్క ప్రకటనయినా చేశారా? ఫ చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత జగ్గిరెడ్డి ఫైర్ -
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా..
పోగొట్టుకున్న ఉంగరం భక్తుడికి అందజేతకొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి, స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. అనేక మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించారు. శ్రీనివాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనల అనంతరం రంగురంగుల సుగంధభరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈఓ చక్రధరరావు ఆధ్వర్యాన అధికారులు, సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ వేలాదిగా వచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.52,15,096 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యాన ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న క్షేత్రంలో ఒక భక్తుడు పోగొట్టుకున్న బంగారు ఉంగరాన్ని దేవస్థానం అధికారులు భద్రపరిచి ఆ భక్తునికి తిరిగి అప్పగించారు. ఈ క్షేత్రానికి ప్రతి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గత శనివారం విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన సుదర్శనరెడ్డి సుమారు రూ.లక్ష విలువ చేసే బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాక చూసుకుంటే ఉంగరం కనిపించలేదు. ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించారు. అయితే ఆ ఉంగరం దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ వై.శ్రీనుకు దొరకగా ఆ విషయాన్ని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దృష్టికి తీసుకువెళ్లి ఆయన సూచనల మేరకు భద్రపరిచారు. కాగా ఈ శనివారం మళ్లీ వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆ భక్తుడు సుదర్శనరెడ్డి దేవస్థానం వారిని సంప్రదించారు. ఆయన చెప్పిన ఆధారాలు పరిశీలించి, ఆ ఉంగరం ఆ భక్తునిదేనని నిర్ధారించుకుని శ్రీను చేతుల మీదుగానే ఆ ఉంగరాన్ని భక్తునికి తిరిగి అప్పగించారు. దానితో ఆ భక్తుని ఆనందానికి అవధులు లేవు. పోయిందనుకున్న ఉంగరం తిరిగి తనకు చేరడం ఆ వేంకటేశ్వరస్వామి కృపా కటాక్షమేనని అన్నారు. దేవస్థానం ఈఓ చక్రధరరావుకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం అన్నమాచార్య సంకీర్తనాచార్యులు కరుటూరి వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్
పామర్రు పోలీస్ స్టేషన్కు తరలింపు ముమ్మిడివరం: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలపాలని మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం రూరల్, క్రైమ్ సీఐల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బందరుపాలెం సమీపంలో కర్రివానిరేవుకు చెందిన జేఏసీ నాయకుడు కాశి జగపతిరావు, ఎదుర్లంక గ్రామానికి చెందిన దుక్కిపాటి సత్యనారాయణ, ముమ్మిడివరానికి చెందిన దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పామర్రు పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకురాలు కాశి బాలమునికుమారిని ముమ్మిడివరం బాలయోగి ఆశ్రమం వద్ద గృహ నిర్బంధం చేశారు.అలాగే కాట్రేనికోనకు చెందిన వడ్డి శ్యాంప్రసాద్, గల్లా రాజేందర్లను గృహ నిర్బంధం చేశారు. శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు జేఏసీ నాయకులను తీసుకు వచ్చి అప్పగించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు) 14,500 – 15,000 కాయ (వెయ్యి) కొత్త (పచ్చి) కాయ 14,500– 15,000 (వెయ్యి) కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి సమాచారం
సీతానగరం: మండలంలోని సింగవరం ర్యాంపు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై చైన్నె, ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)కు మెయిల్ ద్వారా సమాచా రం ఇచ్చానని వంగలపూడికి చెందిన మాజీ సైనికుడు, న్యాయ వాది సూరెడ్డి శివకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకుని, వాటిని వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్, ఏడీ మైన్స్, తహసీల్దార్, ఎస్సైలకు సామాజిక మాధ్య మాల ద్వారా తెలియపర్చానని తెలిపారు. దీంతో ఎస్సై స్పందించి లారీలను నిలిపివేశారని అన్నా రు. శనివారం ఉదయం మైన్స్ ఏడీ నుంచి లిఖిత పూర్వక మెసేజ్ ఇచ్చారని, అందులో జిల్లా కలెక్టర్కు గాని, తనకు గాని సంబంధం లేదని తెలిపారన్నారు. అనకాపల్లి కలెక్టర్, మైన్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే సంబంధం ఉందని తెలియపర్చారని వివరించారు. జిల్లాలో తవ్వకాలపై వారికి సంబంధం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్జీటీకి తెలిపర్చిన తరువాత తనకు సమాచారం అందించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సింగవరం లంక భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండగా, వంగలపూడి లంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి, సింగవరం ర్యాంపు నుంచి కాకుండా వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లారీలపై తరలిస్తున్నారని అన్నారు. సోమవారం గ్రామస్తులంతా లారీలను అడ్డుకుంటారని, అనకాపల్లి కలెక్టర్, ఏడీ మైన్స్ వారు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసే వరకూ ఆ లారీలను అడ్డుకుంటామని శివకుమార్ హెచ్చరించారు. -
అలా స్పాగిపోతున్నారు..!
హెయిర్ కటింగ్తో ప్రారంభమై.. ముందుగా హెయిర్ కటింగ్తో కస్టమర్లను ఆకర్షించే నిర్వాహకులు కస్టమర్లు అడగకపోయినా హెడ్ మసాజ్ వంటివి చేస్తారు. వారు చూపిస్తున్న ఆసక్తిని బట్టి తమ వద్ద బాడీ మసాజ్ కూడా ఉందని చెబుతారు. అలా ముగ్గులోకి వచ్చిన కస్టమర్లతో మసాజ్ ప్రక్రియలో భాగంగా పరిచయం పెంచుకుంటారు. చీకటి మాటున జరిగే ఈ మసాజ్ ప్రక్రియలో ఫుల్ మసాజ్, బాడీ టూ బాడీ మసాజ్ వంటి పేర్లతో యువతులతో మగ కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ప్రత్యేక గదిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరిగిపోతుంది. అలవాటు పడిన కస్టమర్లు వారానికి ఒకసారైనా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ఫోన్లో బ్యూటీపార్లర్కు వచ్చే ఆడవారికి మగ వ్యభిచారులను కూడా సమకూరుస్తున్నట్టు రికార్డింగ్ బయటపడటం విష సంస్కృతికి అద్దంపడుతోంది. ఫ మసాజ్ పేరుతో మగువలతో వల ఫ రాజమహేంద్రవరంలో స్పా సెంటర్లు ఫ గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం ఫ దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం కంబాలచెరువు: (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నయా సంస్కృతి మొదలైంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో ఉండే స్పా సెంటర్ల కల్చర్ ఇక్కడకు విస్తరించింది. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం అధికమైంది. ఉపాధి పేరుతో ఆయా స్పా సెంటర్లలో చేరిన యువతులను నిర్వాహకులు పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఏడాది కాలంలో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న సుమారు 14 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం చూస్తే.. జిల్లాలో చాపకింద నీరులా విష సంస్కృతి పెరిగిందని చెప్పకనే అర్థమవుతోంది. ఎక్కడే ఎందుకంటే.. రాజమహేంద్రవరంలో ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఏవీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, దానవాయిపేట వంటి ప్రాంతాల్లో ఇటీవల స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉపాధి వేటలో భాగంగా బ్యూటీ కోర్సులు, మసాజ్ కోర్సులు వంటివి చేసి స్పా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగుంటుండటంతో అసాంఘిక శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి పెట్టుబడి పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు పథక రచన చేస్తున్నారు. బ్యూటీపార్లర్లతో కూడిన మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కస్టమర్లను వ్యభిచారం వైపు లాగుతున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లే విటులలో ఎక్కువ వ్యాపార వర్గాలు, యువత ఉంటున్నారు. కొద్దినెలల కిందట ఏవీ అప్పారావు రోడ్డులో పట్టుబడిన స్పా సెంటర్ నిర్వాహకురాలు బ్యూటీ పార్లర్లకు వచ్చే మహిళలకు వారి అభిరుచి మేరకు మగ వ్యభిచారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ వాయిస్ రికార్డింగు బయటపడటం చూస్తే పరిస్థితి చేయిదాటిందని అర్థమవుతోంది. ఎక్కడో మెట్రోపాలిటిన్ సిటీల్లో బయటపడే ఇటువంటి ఘటనలు జిల్లాలో విస్తరించడం చూస్తే అసాంఘిక శక్తులు ఏ మేరకు చొచ్చుకు వస్తున్నాయో స్పష్టమవుతోంది. ఉద్యోగం పేరుతో.. బ్యూటీపార్లర్, సెలూన్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు ప్రారంభించే నిర్వాహకులు ముందుగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మసాజ్ సెంటర్లలో అనుభవం ఉన్న ఒకరిద్దరు యువతులను ఆకర్షణీయమైన ప్యాకేజీతో నియమించుకుంటారు. జన సంచారం తక్కువగా ఉండే ధనిక వర్గాలు నివసించే ప్రాంతాల్లో అట్టహాసంగా స్పా, సెలూన్ సెంటర్లు ప్రారంభించి రిసెప్షన్, హెల్పర్ల పేరుతో అందమైన యువతులను పనిలో పెట్టుకుంటారు. ముందే అనుభవం ఉన్న యువతులు కొత్తగా చేరిన వారితో సన్నిహితంగా ఉంటారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ తమవైపు తిప్పుకుంటారు. వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ పూర్తిగా వీరి ఉచ్చులో పడే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్తగా చేరిన యువతులకు పాత యువతులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిని కూడా మసాజ్ ప్రక్రియకు ఉపయోగించుకుని కమీషన్ ఇస్తారు. నిర్వాహకులు ఆ యువతులతో చనువుగా ఉంటూ ఫోటోలు దిగడం చేస్తుంటారు. అవి నిర్వాహకుల వద్ద ఉండటంతో ఆ యువతులు పూర్తిగా విధేయతతో ఉంటారు. వారితో గొడవ పెట్టుకునేందుకు సాహసించరు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. ఏడాదిలో 14 సెంటర్లపై దాడి ఏడాది కాలంలో జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మసాజ్ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో అసాంఘిక కార్యకలాలు నిర్వహిస్తున్న 14 సెంటర్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్కడ దొరికే యువతులను సాక్షులుగా పరిగణిస్తూ విటులపై, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. స్పాలు, బ్యూటీపార్లర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ఇవ్వాలి. –డి.నరసింహకిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
భార్యకు తీవ్ర గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన బిక్కన సత్యభాస్కరరావు (69), అతని భార్య పాపాయమ్మతో కలసి స్కూటీపై పెద్దాపురం మండలం కట్టమూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి వెనుక నుంచి వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో సత్యభాస్కరరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తర భారత దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు మీదుగా వారణాసి, ప్రయోగరాజ్, రామ జన్మభూమి, త్రివేణి సంగమం నైమిశా శరణ్యం సందర్శించుకోవచ్చన్నారు. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పర్యటన ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల్లో ఉందన్నారు. ఈ రైలుకు విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూలై 5న పంచ జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమై అదే నెల 13న యాత్ర ముగుస్తుందన్నారు. నాగపూర్, ఉజ్జయిని, నాసిక్, పూణే ఔరంగాబాద్, డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహా పుణ్యస్థలాల సందర్శన ఉంటుందన్నారు. ఈ రైలుకు కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ స్టేషన్లో బోర్డింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి లేహ్, లడఖ్, చారుదాం, గోవాలకు విమాన ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఐసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు. -
రైతు ప్రాణం తీసిన కలుపు మందు
నల్లజర్ల: పంట పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ఓ యువ రైతు ప్రాణం తీసింది. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలాకృష్ణ ప్రసాద్ (30) పదిహేను రోజుల కిందట పొలాల్లో కలుపు నివారణకు ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు డబ్బాను పొలానికి తీసుకెళ్లాడు. ఆ డబ్బాను బైక్ ముందు కవర్లో పెట్టాడు. మార్గ మధ్యంలో డబ్బా మూత లీకై అతని ప్యాంట్పై పడింది. ఏమీకాదులే అని కడిగేసుకుని ఆ మందు స్ప్రే చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒంటిపై పడిన మందు ద్రావణం వృషణాల నుంచి శరీరంలోని కిడ్నీ, లివర్ తదితర అవయవాలకు సోకింది. అతను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది క్రితమే ప్రసాద్కు ఆవపాడుకు చెందిన మౌనికతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అటవీ భూమిలో చెట్ల నరికివేత గోపాలపురం: మండలంలోని కోమటికుంట అటవీ భూమిలో ఉన్న చెట్లు నరికివేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్ల పుల్లలను స్వాధీనం చేసుకున్నామని డీఆర్ఓ కె.వేణుగోపాల్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉన్న వేప, జీడిమామిడి చెట్లు అక్రమార్కులు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అక్కడ రెండు ట్రాక్టర్లతో ఉన్న సుమారు 12 టన్నుల పుల్లలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. -
సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్కటీ అమలు చేయకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. శనివారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క మాటకు కట్టుబడక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. వేదిక ఏదైనా జగన్ను నిందించడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే:మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఆత్మని క్షోభకు గురిచేస్తున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్ ఔరంగజేబు, రావణాసురుడుతో పోల్చితే ఏఐ టెక్నాలజీ వాడుకుని పొగిడించుకోవడం సిగ్గుచేటు. వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నందమూరి కుటుంబ సభ్యులెవర్నీ మహానాడుకి పిలవకుండా ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు. ప్రజలు ఇదంతా తెలియని అమాయకులని తండ్రీకొడుకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు.మూడు రోజుల మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప, ప్రజలకు ఏడాదిలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏడాది గడిచినా సూపర్ సిక్స్లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజల గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. మహానాడుకి జనం కరువైపోతే డ్వాక్రా మహిళలు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారు.ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేక..:ప్రతినెలా రూ.4 వేల పింఛన్ పంపిణీ కార్యక్రమం పేరుతో చంద్రబాబు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాడు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నాడు. ఏడాదిగా కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా పంపిణీ చేయకుండా ఇలాగే కాలక్షేపం చేశాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఎండీయూ వాహనాలు నడుపుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. నెలకు రూ.10 వేల వేతనం తీసుకునే రేషన్ వాహనాల డ్రైవర్లు లంచాలు ఇవ్వడానికి తన వద్దకే వచ్చినట్టు చంద్రబాబు దారుణమైన అభాండాలు వేయడం సిగ్గుచేటు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరం.పేదలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం:వేల కోట్ల విలువైన బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆరోపణలు ఇవేనా? బియ్యం అక్రమంగా తరలిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలాంటి అక్రమార్కులను ఎందుకు పట్టుకోలేకపోయారు? రేషన్ వాహనాలు ఎత్తేయాలని తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోలేక అమాయకుల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నాడు. వెనుకబడిన వర్గాల వారిని, నిరుపేదలను కొవ్వెక్కిపోయారని మాట్లాడటం దారుణమైన విషయం.అది అహంకార నిర్ణయం:వెనుకబడిన వర్గాల మీద ఇంత చులకనభావం పనికిరాదు. 18 నెలల కాలపరిమితి ఉన్నా ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అహంకారపూరిత నిర్ణయంతో వారు తీసుకున్న వాహనాలకు నెలనెలా కిస్తీలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను ఆర్థిక నేరస్తులని, టెర్రరిస్టులుగా చెప్పడం ఎంత దారుణం? చంద్రబాబు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎండీయూ ఆపరేటర్లు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఎండీయూ ఆపరేటర్లకి వైయస్సార్సీపీ కూడా అండగా ఉంటుంది.పింఛన్ డోర్ డెలివరీ ఇవ్వలేనివారు, రేషన్ ఇస్తారా?:కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలవరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఒకపక్క కొత్తగా 6 వేల రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ, చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్కి బదులు డీబీటీ ద్వారా డబ్బులిస్తామని చెబుతున్నాడు. ఈ రేషన్ షాపులను ఒక్కోటి రూ.5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు. -
రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన చంద్రబాబు
సాక్షి, కోనసీమ జిల్లా: రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు ప్రజా వేదికలో ఎండీయూ ఆపరేటర్లను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు.. డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు, మాఫియా అంటూ ప్రేలాపనలు చేశారు.‘‘వీళ్లు బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. కరుడుగట్టిన దుర్మార్గులు వీళ్లు. వేల కోట్లు ఖర్చు పెట్టే మాఫియాగా మారారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కొనే పరిస్థితికి వచ్చారు. వాళ్ల కొవ్వు ఎంతుందంటే నా దగ్గరకు కూడా వస్తున్నారు’’ అంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎండియూ ఆపరేటర్లను అవమానపరుస్తూ సీఎం మాట్లాడారు.రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన సీఎం.. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడమే లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడారు. వాలంటీర్ల తొలగింపుపై ఒక్క ముక్క కూడా ప్రస్తావించని బాబు.. చేనేత మత్స్యకారులకు విస్తృతంగా సహాయం అందిస్తున్నామంటూ డాంబికాలు పలికారు.హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు విద్యుత్ పథకం అమలు చేయకపోయినా ఇస్తున్నట్లే మాట్లాడిన చంద్రబాబు.. కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు సోలార్ పవర్ ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవాలంటూ వేదికపైన కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. -
జమైకా హ్యాపిల్!
యానాం: కరీబియన్ దీవులలో వెస్ట్ండీస్ సమీపంలోని జమైకా ద్వీప దేశంలో జమైకా ఆపిల్గా పిలిచే చెట్టు యానాం పట్టణంలో ఓ గృహంలోని పెరట్లో వందలాది కాయలతో విరగకాస్తుండటంతో పలువురిని ఆకర్షిస్తోంది. దీంతో పలువురు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఆ చెట్టును చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బాలయోగి కాలనీలో కేతా ఫణి, జగదాంబకు చెందిన గృహంలో 15 ఏళ్ల క్రితం నాటిన జమైకా ఆపిల్ చెట్టు ఉంది. దీనికితోడు ఆ మొక్క పూలనుంచి ఎర్రని పుప్పుడులు కిందికి పడటంతో చెట్టుకింద ఎర్రని తివాచీగా పరచినట్టు ఉంది చూపరులను ఆకర్షిస్తోంది. చూసేందుకు వాటర్యాపిల్లా ఉన్నప్పటికి దీని రుచి కమ్మగా ఉంటుంది. జమైకా ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న జమైకా ఆపిల్ బలమైన ఎముకలు, దంతాలను నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు. -
అంగన్వాడీ కార్యకర్త తొలగింపుపై నిరశన
● నాలుగు రోజులుగా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు ● అస్వస్థతకు గురైన బాధితురాలు పద్మ ● ఆసుపత్రికి తరలించిన సహచరులు శంఖవరం: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో 12 ఏళ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం.పద్మను అక్రమంగా తొలగించి అదే గ్రామానికి చెందిన బీసీ డీ కులానికి చెందిన పాకిలా భవానీని విధుల్లోకి చేర్చుకోవడం అన్యాయమని ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఈ నెల 17 నుంచి ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తకు నోటీస్, రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా మరొకరిని విధుల్లోకి ఎలా చేర్చుకుంటారంటూ నాలుగు రోజులుగా ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. బాధితురాలు పద్మ నాలుగు రోజులుగా ఆహారం సక్రమంగా తీసుకోకుండా శుక్రవారం దీక్షలో కూర్చుంది. దీక్షలో కూర్చున్న గంటలో తీవ్ర అస్వస్థకు గురైంది. ఆమెను 108 వాహనంలో అంగన్వాడీలు సీహెచ్సీకీ తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అంగన్వాడీ కార్యకర్త పద్మకు పలువురు పరామర్శ నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ కార్యకర్త ఎం.పద్మ అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం పలువురు పరామర్శించారు. జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శేషు బాబ్జి చికిత్స పొందుతున్న పద్మను పరామర్శించి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అప్పటివరకు పని చేస్తున్న కార్యకర్తలనే కొనసాగించాలంటూ గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 4వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసిందని, అయినా అధికారులు ఈ జీవోన దాచిపెట్టి, ఈ నెల 16న కోర్టు ఆర్డర్ ఉన్నదంటూ మరో ఆమెను విధుల్లోకి చేర్చుకోవడం ఆన్యాయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పద్మను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు గెడ్డం బుల్లమ్మ, బి.రత్నకుమారి, డి.సత్యవేణి, నూకరత్నం, రాజేశ్వరి పాల్గొన్నారు. -
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సీఐ
సామర్లకోట: పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బుధవారం సంతమార్కెట్ సెంటర్లో ఒక బాలుడు సెల్ఫోన్ చూస్తూ నడుచుకొంటూ వెళ్లిపోతున్నాడు. దానిని గమనించిన సీఐ ఎ.కృష్ణభగవాన్ బాలుడి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలుడు మూగవానిగా తెలుసుకున్నారు. దాంతో సెల్ఫోన్లో నంబర్కు ఫోన్ చేయడంతో ఆ బాలుడిని వేదాంశ్ కార్తికేయగా గుర్తించారు. సీఐ సమాచారం మేరకు తల్లి పోతుల తులసీ, తండ్రి శరత్కుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తాము విశాఖపట్నం నుంచి వేసవి సెలవుల కారణంగా కోట్లమ్మ చెరువు వద్ద బంధువుల ఇంటికి వచ్చామని తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల తమ కుమారుడు వేదాంశ్ కార్తికేయ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకొంటూ బయటకు వచ్చేయడాన్ని తాము గమనించలేదని చెప్పారు. క్షేమంగా తమ కుమారుడిని అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు సీఐకి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
అమలాపురంలో తొలిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు
ఎన్హెచ్ఆర్సీ కౌన్సెలింగ్తో ఒక్కటైన దంపతులు ఆలమూరు: మండలంలోని బడుగువానిలంకలో మూడేళ్ల క్రితం విడిపోయిన దంపతులు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) చొరవతో ఒక్కటయ్యారు. స్థానికుల కథనం ప్రకారం బడుగువానిలంకకు చెందిన పాలూరి వెంకటేష్తో పెదపళ్లకు చెందిన దేవి గౌతమికి 2014 లో వివాహమైంది. మూడవ కాన్పులో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో 2022 మార్చిలో దేవి గౌతమిని పిల్లలతో సహా భర్త వెంకటేష్ పుట్టింటికి పంపించి వేశాడు. అప్పట్లో పెద్దల వద్దకు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి కాపురాన్ని నిలబెట్టాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గారపాటి శ్రీనివాసరావు నియమితులు కావడంతో దేవి గౌతమి ఆయనకు తన పరిస్థితి వివరించింది. దీనిపై స్పందించిన వైస్ చైర్మన్ గారపాటి భర్త వెంకటేష్ నివాసానికి వెళ్లి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సాయంతో కౌన్సెలింగ్ ఇచ్చి భార్యాభర్తలిద్దరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాపురానికి ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. ఎన్హెచ్ఆర్సీ కృషిని ఇరు గ్రామాల ప్రజలు అభినందించారు. అమలాపురం టౌన్: గుర్రాల విజయ కృష్ణ మెమోరియల్ పేరిట అమలాపురంలో మొట్టమొదటిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు స్థానిక గండువీధిలో ఈ నెల 28వ తేదీన మొదలయ్యాయి. జూన్ 3వ తేదీతో ఈ పోటీలు ముగిస్తాయని నిర్వాహకుడు కన్నా చెప్పారు. వారం రోజుల పాటు పోటీలను తమ సోదరుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతిగా రూ.30 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడనున్నాయన్నారు. ప్రతీ మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని విజేత జట్టుకు అందజేస్తున్నారు. -
ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలంటూ ధర్నా
రామచంద్రపురం రూరల్: ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని కోరుతూ వెంకటాయపాలెం, వేగాయమ్మపేట గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్కుమారి, వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ లారీలు, ముఖ్యంగా ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండి పడ్డారు. ఈ నెల 28న మహిళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తల్లిని కూడా కోల్పోయి అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపాలెం ప్రధాన రహదారి నుంచి వేగాయమ్మపేట, యర్రపోతవరం, యానాంలకు దగ్గరి దారిగా ఉండటంతో చీమలదిబ్బ గ్రామం నుంచి కాలువ గట్టు రహదారిపై నుంచి లారీలు రాకపోకలు సాగించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటం రెండు పక్కలా కాలువలు ఉండటంతో అధిక బరువు కలిగిన లారీల వల్ల రోడ్డు కూడా కుంగిపోయి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడులు వేస్తున్న ఇసుక లారీలకు కనీసం బరకాలు కూడా కప్పకపోవడంతో లారీల వేగానికి ఇసుక ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, చీమలదిబ్బ దారిలో లారీలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, రాయుడు కృష్ణ, కోడి అర్జునుడు, ఇళ్ల గణపతి, అనుసూరి దుర్గ, దంగేటి జ్యోతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దడాల రవికుమార్ పాల్గొన్నారు. -
చెరువు గుట్కాయస్వాహా!
● బియ్యపుగుంట చెరువును పూడ్చేసిన ఆక్రమణదారులు ● అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ● పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిడదవోలు: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తుందా.. పాగా వేసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. దీనికి తాజా ఉదాహరణగా నిడదవోలులోని బాలాజీనగర్లో మున్సిపాలిటికి చెందిన బియ్యపుగుంట చెరువును ఆక్రమణదారులు పూడ్చివేశారు. బుధవారం రాత్రికి రాత్రే లారీలతో మంటి తరలించి 80 సెంట్ల ఉన్న చెరువును పూడ్చివేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలిచి సరిహద్దు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. విలువైన భూమి పట్టణ శివారున బాలాజీనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంజోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి పొలాలు కొని వెంచర్లు వేసి అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన 80 సెంట్ల బియ్యపుగుంట చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం భూమి రూ.10 వేలు పలుకుతోంది. సెంటు భూమి సుమారు 4.80 లక్షలు అయితే 80 సెంట్ల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఎక్కువగా చాగల్లు మండలం ధారవరం, బ్రాహ్మణగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 300కి పైగా పశువులు చెరువులో దాహం తీర్చుకునేవి. సుమారు 50 ఎకరాలకు సంబంధించిన మురుగునీరు చెరువుకు చేరడంతో పొలాలకు నష్టం లేకుండా ఉండేది. అయితే చెరువును పూడ్చివేయడంతో వర్షపునీరు, పంట మురుగునీరు వెళ్లే దారిలేక భవిష్యత్తో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు కరువవుతుందని వాపోతున్నారు. -
పేదోడి ప్రొటీన్ నత్త కూర
మలికిపురం: నత్త.. నెమ్మదిగా కదిలే జీవి. వీటిని బద్ధకానికి సూచికగా భావిస్తారు. కానీ.. ఇది వేసే ప్రతి చిన్న అడుగు అర్థవంతమైన విజయాలకు దారి తీస్తుందని భావించే వారూ లేకపోలేదు. జీవితంలో తొందరపడకుండా.. సమయం తీసుకోవడమనే ప్రాముఖ్యతను నత్త నొక్కి చెబుతుంది. ఈ విషయాలు పక్కన పెడితే నత్తల వల్ల మానవాళికి అనేక ఉపయోగాలున్నాయి. నత్తలను వ్యవసాయ క్షేత్రాల్లో రక్షకులుగా రైతులు, వ్యవసాయ అధికారులు భావిస్తారు. క్రిమికీటకాల నుంచి పంటలను కాపాడతాయని విశ్వసిస్తారు. నత్త గుల్లలను సేకరించి ప్రత్యేక బట్టీలలో కాల్చి సున్నంగా వినియోగిస్తారు. కోస్తా జిల్లాల ప్రజలు నత్త మాంసాన్ని పేదోడి ప్రొటీన్గా భావిస్తారు. చికెన్, మటన్ మాదిరిగా నత్త మాంసంతో కూరలు వండుకుని ఆరగిస్తారు. కాలువలు.. పొలాలే వీటి ఆవాసం పొలాలు, బోదెలు, కాలువలు, చెరువుల్లో నత్తలు విరివిగా పెరుగుతాయి. పదేళ్లుగా కోనసీమలో పలుచోట్ల క్రాప్ హాలిడే పాటిస్తుండటం వల్ల ఆ పొలాల్లో నత్తల పెరుగుదల అధికంగా ఉంది. అనేక మంది నత్తల్ని సేకరించి మాంసం తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. దశాబ్దాల కాలంగా నత్త మాంసం విక్రయాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో స్టార్ హోటళ్లలో నత్త మాంసంతో చేసే కూరలకు డిమాండ్ పెరిగింది. నత్త మాంసంతో పలు రుచికరమయిన వంటలు తయారవుతున్నాయి. సాధారణంగా శనగపప్పు కాంబినేషన్లో వండుతారు. ఇప్పుడు మామిడి కాయలు, జీడిపప్పు, చింత చిగురు కాంబినేషన్లో నత్త కూర వండుతున్నారు. విదేశాల్లో నత్తల పెంపకం ఫ్రాన్స్, వియత్నాం, పోర్చుగల్, బల్గేరియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో నత్తలను ఆహారంగా వినియోగిస్తున్నారు. సాగు ప్రయోజనాలతో పాటు ఆహారం కోసం నత్తల్ని పెంచటాన్ని ‘హెలిసి కల్చర్’గా పిలుస్తారు. స్పెయిన్లోని లైడా నగరంలో ఏటా వసంత కాలంలో ‘లా అప్లెక్ డెల్ కారాగోల్’ పేరిట ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక్కడ కేవలం నత్తలతో చేసిన వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది ఆహార ప్రియులు ఇక్కడికొచ్చి హాజరై నత్తల వంటకాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. నత్తలను రుచికర ఆహారంగా తినడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలలోని చాలా మందికి ప్రొటీన్ అందించే ఆహారంగా వీటికి పేరుంది. నత్తల్లో ఉండే పోషకాలు నత్తల్లో 82 శాతం వరకూ నీరు ఉంటుంది. కొవ్వు తక్కువ. చేపల్లో మాదిరిగా ఒమేగా–3 ఆమ్లాలు ఉంటాయని, ఇవి గుండెకు మంచిదని వైద్యులు చెబుతారు. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. నియాసిన్, సెలీనియం వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. ప్రొటీన్, ఇతర పోషకాల వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల్ని బలపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గ్రామీణ, సముద్రతీర ప్రాంతాల్లో నత్తలను కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే.. నత్తలను శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోస్తాలో ఆహారంగా తింటారు కోస్తా జిల్లాల్లో అనాదిగా నత్త మాంసం ఆహారంగా వినియోగంలో ఉంది. చేపల మాదిరిగా వీటిని సేకరించి ప్రాసెస్ చేసి విక్రయిస్తారు. మాంసాహారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటారు. నత్తల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తారు. - సిద్ధార్థ వర్ధన్, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ -
నేడు సీఎం చంద్రబాబు రాక
ముమ్మిడివరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ముమ్మిడివరం, కాట్రేనికోనలో పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 12.50 గంటలకు హెలికాప్టర్లో సీహెచ్ గున్నేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యేరులో ఉపాధి హమీ పథకంలో చెరువు పూడిక తీత పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడతారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజలతో ముఖాముఖీ ఉంటుంది. అక్కడే జిల్లాకు సంబంధించి బంగారు కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీహెచ్ గున్నేపల్లిలో 3.35 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 5.15 గంటలకు సీహెచ్ గున్నేపల్లి హెలీప్యాడ్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. కలెక్టర్ మహేష్కుమార్, ఎస్సీ బి.కృష్ణారావు, చంద్రబాబు పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
బాకా సరే.. బకాయిల మాటేమిటి?
ఇదీ లెక్క.. జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డులు : 2.31 లక్షలు వాడుకలో ఉన్న జాబ్కార్డులు 1.59 లక్షలు ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలు 5.42 లక్షలు జిల్లాలో కూలీల పనిదినాలు 63.48 లక్షలు వేతన బకాయిలు : రూ.28,87 కోట్లు ● నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక ● సామాజిక పింఛన్ల పంపిణీ అంటూ ప్రచార ఆర్భాటం ● ఉపాధి కూలీలకు నెలల తరబడి అందని వేతనాలు ● గోకులాల షెడ్ల పెండింగ్ నిధులు మంజూరు కాని వైనం ● జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మొత్తం బకాయిలు రూ.110.90 కోట్లు ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరులో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారిక పర్యటన ఖరారైంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టనున్న పనులను ప్రారంభించడంతో పాటు సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తారని అధికార యంత్రాంగం గొప్పగా ప్రచారం చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి కూలీలకు కాని, పాడిరైతులకు గాని న్యాయం చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్ఆర్జీఈఎస్లో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలల నుంచి రూ.కోట్లలో వేతన బకాయిలు ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున ఇప్పటికై నా అధికారులు వేతనాలు మంజూరు చేస్తారని ఎదురు చూసిన కూలీలకు నిరాశే ఎదురైంది. వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక వేత్తలు ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటా అసహనం పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్జీఈఎస్ దోహదపడుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న తీరుకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంకా సక్రమంగా చెల్లింపులు లేక గ్రామాల్లోని అభివృద్ధి ఎండమావిగా మారింది. ఉపాధి హామీ ద్వారా నిర్ణీత సమయానికి ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, రైతులకు రాయితీలను అందించకపోవడం, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపులపై దృష్టి సారించకపోవడంపై అంతటా అసహనం వ్యక్తమవుతోంది. ఎన్ఆర్జీఈఎస్ ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవి అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో అసంపూర్తి భవనాలు ప్రజా ప్రతినిధులను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లో 385 గ్రామాల్లో 2,31,116 జాబ్కార్డులు ఉండగా అందులో 1.59 లక్షలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 5.42 లక్షల మంది కూలీలు ప్రభుత్వం మంజూరు చేసిన 2,385 పనులకు సంబంధించి సుమారు 63.48 లక్షల పని దినాలు పనిచేశారు. వీరందరికి 2025 మే 30 నాటికి ఎన్ఆర్జీఈఎస్ శాఖ సుమారు రూ.28.87 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉందని ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఉపాధి కూలీల ఆకలి కేకలు ఆరుగాలం కష్టించి పనిచేసిన ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేతనాలను మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాథుడు లేడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీల రోదనను, ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోదా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. అధికారంలోకి రాగానే కూటమి నేతలు ఆగమేఘాల మీద ఎన్ఆర్జీఈఎస్, పశుసంవర్థకశాఖ అఽధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి నిర్మించిన గోకులాల(పశువుల షెడ్ల)కు ఆరు నెలలైనా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు వేగంగా అందిస్తామన్న హామీతో అప్పులు చేసి మరీ పనులు చేస్తే నెలలు తరబడినా మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మంజూరైన గోకులాలు (పశువుల షెడ్లు) 1,150 ఇప్పటి వరకూ రైతులు నిర్మించుకున్న గోకులాలు 880 లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన నిధులు రూ 7.11 కోట్లు జిల్లాలో ఇప్పటి వరకూ నిర్మించిన సీసీ రోడ్లు 1,098 కి.మీ కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు 74.82 కోట్లు ఉపాధి బకాయిల కోసం సీఎం చంద్రబాబును కలుస్తాం జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు బకాయి పడ్డ వేతనాల మంజూరు కోసం సీఎం చంద్రబాబును కోనసీమ పర్యటనలో కలుస్తాం. ఎన్ఆర్జీఈఎస్ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండటంపై కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పనులు లేని కాలంలో ప్రతి వ్యవసాయ కార్మికుడి ఖాతాలో రూ.ఆరు వేలు వేస్తామన్న హామీపై నిలదీస్తాం. – కారెం వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, అమలాపురం -
సినిమా థియేటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
అమలాపురం టౌన్: స్థానిక సినిమా థియేటర్లపై మొదటి రెండు రోజులూ రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి మౌలిక సదుపాయాలు, తిను బండారాల విక్రయాలు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్ల నిర్వహణపై వరస తనిఖీలు చేశారు. తాజాగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం థియేటర్లపై ఆకస్మిక దాడుల చేసి తినుబండారాల దుకాణాలను తనిఖీలు చేసి ఆహార పదార్థాల నిర్వహణ సక్రమంగా లేదని నోటీసులు జారీ చేశారు. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీకాంత్ చౌదరి ఆధ్వర్యంలో ఆహార భద్రత అధికారులు ఈ దాడులు చేశారు. స్థానిక రమా, వీపీసీ, శేఖర్ థియేటర్లను అధికారుల బృందం తనిఖీలు చేసింది. ఆయా థియేటర్లకు ఫుడ్ లైసెన్స్లు లేనట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. పనిచేసే సిబ్బందికి ఫిజికల్ ఫిటెనెస్ చేయించాలని, ఆయా థియేటర్ల అధికారులు సూచించారు. పరిశుభ్రమైన ఆహారాన్ని నిర్ధేశించిన ధరలకే విక్రయించాలన్నారు. గడువులోపే థియేటర్లలో ఫుడ్ లైసెన్స్లు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. 3 థియేటర్లకు నోటీసులు జారీ ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీకాంత్ చౌదరి -
రైల్వే లైన్పై హామీని నిలబెట్టుకోవాలి
పనుల నత్తనడకపై కోనసీమ జేఏసీ సమీక్ష అమలాపురం టౌన్: గత ఎన్నికల ప్రచారం సందర్భంగా అమలాపురం సెంటర్లో జరిగన సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ తమ ప్రసంగాల్లో కోనసీమ రైల్వే లైనును తాము అధికారంలోకి వస్తే తొందరగా పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామమోహనరావు గుర్తు చేశారు. స్థానిక జేఏసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం రైల్వే లైన్ పనులపై సమీక్షించింది. జేఏసీ కన్వీనర్ రామమోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీని ఈ కూటమి ప్రభుత్వంలో నిలబెట్టుకోవాలని సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ రైల్వే లైన్ పనులపై స్పందించాలని డిమాండ్ చేశారు. లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కోటిపల్లిలో గౌతమి నదిపై నిర్మించిన రైల్వే వంతెన పిల్లర్స్పై గడ్డర్స్ వేయడానికి టెండర్లు ఖరారు అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు. జేఏసీ ప్రతినిధులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రదమూర్తి, కరాటం ప్రవీణ్, కల్వకొలను బాబు, జంగా రాజేంద్ర, ఎస్.సంసోను, మాచిరాజు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆరోగ్యమైన జీవనానికి యోగా అమలాపురం రూరల్: ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ 26 జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు తీరు, ప్రజా సంతప్తి స్థాయిల పురోగతి, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యోగా ట్రైనర్లను గుర్తించామని, వారితో అన్ని ప్రాంతాలలోని ప్రజలతో యోగాభ్యాసన చేయించడంతోపాటు, యోగా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో 8 లక్షల రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. గ్రామ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై సమీక్షిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవ ర్గంలో 10 వేలు కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యమన్నారు. ఆ మేరకు ట్రాన్స్కో అధికారులు, బ్యాంకర్ల సమన్వయంతో రాయితీలతో ప్రోత్సహిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జేసీ టీ.నిషాంతి, అధికారులు పాల్గొన్నారు. -
అప్పటి సేవలు ఇప్పుడు లేవు
అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు సైతం పీహెచ్సీలు, పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం గతంలో చేసినట్టుగా ఇంటి వద్దనే వైద్య సేవలు, మందులు అందేలా చేయాలి. – పోతుల చంద్రావతి, కొత్తపేట ఆర్బీకేలను మరింత పటిష్టం చేయాలి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవలపై సన్న, చిన్న కారు రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. వరదలకు, భారీ వర్షాలకు పంట నష్టపోతే ఒకటి రెండు రోజుల్లోనే ఆర్బీకేల సిబ్బంది వచ్చి పంట నష్టం నమోదు చేసేవారు. నాలుగైదు నెలల్లో పరిహారం వచ్చేలా చూసేవారు. మాకు పెద్దగా పని ఉండేది కాదు. – పినిశెట్టి నాగబాబు, మామిడికుదురు ● కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ● ఒకవైపు సంక్షేమ పథకాల ఎత్తివేత ● మరోవైపు సామాన్యుల సేవలకు దూరం ● వలంటీర్లను నిలిపివేశారు ● ఇక ఇంటి వద్ద రేషన్ లేనట్టే... ఇంటి ముంగిట అందని వైద్యం ● కూటమి ఏడాది పాలనలో అన్నీ కష్టాలే ● నాడు ప్రభుత్వం పరంగా ఏం కావాలన్నా గుమ్మాల వద్దకే.. ● నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటున్న జనం సాక్షి, అమలాపురం: సంక్షేమ పథకాల లబ్ధి సకాలంలో అందించడం... పదుల సంఖ్యలో సేవలను సామాన్యులకు చేర్చడం.. వలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్లతోపాటు పలు పథకాల్లో లబ్ధి చేకూరేలా పనిచేయడం.. పంట నష్టపోతే తరువాత రోజే రైతు ఇంటికి వచ్చి పంట నష్టం నమోదు చేయడం.. పంట యాజమాన్యం గురించి రైతులకు చెప్పే రోజులకు కాలం చెల్లిపోయింది. ఇంటింటికీ వచ్చి ఆరోగ్యం గురించి క్షేమ సమాచారం తెలుసుకునే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్లూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడొంతుల ప్రభుత్వ సేవలు గడప వద్దనే అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. వలంటీర్ వ్యవస్థ నిలిచిపోయింది. సచివాలయంలో మూడొంతుల సేవలు ఆగిపోయాయి. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థను దాదాపు ఎత్తివేసిన ప్రభుత్వం.. సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులను నిలిపివేయడం ద్వారా ఈ వ్యవస్థలను పక్కనబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆధార్ అప్డేట్ కోసం ఇబ్బందులు పడుతున్నా.. ఆధార్ అప్డేట్ చేయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం సచివాయాల ద్వారానే ఆధార్ అప్డేట్ సేవలు అందించేది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఆధార్ అప్డేట్ చేయించుకోవాలంటే పోస్టాఫీసుకు వచ్చి నమోదు చేయించుకోవల్సి వస్తోంది. ఇక్కడకు వచ్చాక సర్వర్ డౌన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. – సరెళ్ల వెంకట్రావు, మాజీ ఉప సర్పంచ్, జి.అగ్రహారం, అంబాజీపేట మండలం నేడునాడు -
ప్రశంసలు పొందిన సేవలు
● గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా పట్టణ, గ్రామ ప్రజలకు, రైతులకు, రోగులకు అందిన సేవలు అద్భుతం. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ నిర్మాణం, దాని ద్వారా అందిన సేవలను వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలకు చెందిన వారు అభినందనలు కురిపించారు. వీటికి అనుబంధంగా వలంటీర్లు ఉండడంతో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటి వద్ద గడపలకే వచ్చి చేరాయి. 54 రకాల సేవలు నిరంతరాయంగా అందాయి. చివరకు భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ మొదలు పెట్టారు. ● రైతులకు ఆర్బీకేల ద్వారా మేలైన సేవలు అందాయి. తమ గ్రామంలోనే ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వ్యవస్థతో రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలతోపాటు పంటకు సాంకేతిక సహకారం, ధాన్యం కొనుగోలు, సాగు యాజమాన్య పద్ధతులు వంటివి పొందారు. వీటి ద్వారానే ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కూటమి ప్రభుత్వం సైతం వీటి ద్వారానే కొనుగోలు చేస్తోంది. ఉచిత పంటల బీమా, నష్ట పరిహారం, పంట బీమా పరిహారం ఇలా అన్ని ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్ద కష్టం లేకుండా అందాయి. ● విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సమీపంలోనే మెరుగైన ఆరోగ్యం పొందగలిగారు. గ్రామంలో చిన్నచిన్న రోగాలకు మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకు వెళ్లకుండా గ్రామంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. గతంలో 104 ద్వారా సేవలందించేవారు. హెల్త్ క్లినిక్లు పెట్టడం వల్ల స్థానికంగా వైద్య సదుపాయాలు పెరిగాయి. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేవారు. జగనన్న సురక్ష ద్వారా వేలాది మంది రోగులకు ఉచిత ఓపీ, ఉచిత మందులు, కళ్లజోళ్లు అందాయి. ● సచివాలయాల ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం, పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, ఓటర్ ఐడీలు, 1బీలతో పాటు మరెన్నో సేవలు అందేవి. ఆధార్ అప్డేట్ సచివాలయాల్లో అందుబాటులో ఉండేవి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ప్రతీ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు, సేవలన్నీ ప్రజల ముంగిటకే చేరేవి. -
పల్లె.. కళ తప్పింది
ప్రభుత్వ భవన నిర్మాణాలకు బ్రేక్ జిల్లావ్యాప్తంగా 789 గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన రూ.229.89 కోట్లతో ఈ పనులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలోనే సుమా రు రూ.156.06 కోట్లతో 508 భవనాల నిర్మాణాలు (సుమారు 64.38 శాతం) పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 27 భవనాల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అవి కూడా నత్తను తలపిస్తున్నాయి. 244 భవనాల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. 10 భవన నిర్మాణాల పనులు వివిధ కారణాలతో అనుమతుల దశలోనే ఆపేశారు. కొన్ని భవనాల పనులను పునాది దశలోనే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వ తీరు చూస్తూంటే ఈ వ్యవస్థలను క్రమంగా ఎత్తేస్తారనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. -
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయాలు పూర్తిగా పని చేయడం లేదు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ధ్రువీకరణ పత్రాలను వలంటీర్లు స్వయంగా అందించేవారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేవి. ఇప్పుడా రోజులు లేవు. ఇప్పుడు జనం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. – షేక్ అహ్మద్ ఆలీషా, ద్రాక్షారామ, రామచంద్రపురం రూరల్ సక్రమంగా అందని సేవలు గ్రామ సచివాలయంలో సేవలు సక్రమంగా అందడం లేదు. ఆర్బీకేల ద్వారా అమ్మిన ధాన్యానికి డబ్బులు పడటం లేదు. రబీలో ధాన్యం అంతా అమ్ముకున్న తరువాత మద్దతు ధర కొద్దిమేర పెంచారు. రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. – ఎన్.వెంకటేశ్వర్లు, పినపళ్ల, ఆలమూరు మండలం వెబ్సైట్లు ఓపెన్ చేయాలి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సేవలను కొనసాగించాలి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ప్రజలకు ఎలాంటి పథకాలూ అందించకపోవడం దారుణం. రైస్ కార్డులతో పాటు పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్లు ఓపెన్ చేసి, ప్రజలకు సేవలను అందించాలి. – వాసంగి కుమారస్వామి, తొండవరం, అంబాజీపేట -
అయ్యో.. అసలే వద్దంటారా..!
● పంపాలో స్నానాలు వద్దంటున్న దేవస్థానం ● యువకుడి మృతితో చర్యలు ● అప్రమత్తం చేసే బదులు ఇదేం పని? ● ఘాట్లలో రక్షణ ఏర్పాట్లు చేయాలని భక్తుల విన్నపంఅన్నవరం: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లిన వారు గోదావరిలో స్నానం చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను కాపలా పెడితే ఎలా ఉంటుంది? అన్నవరం పంపా జలాశయం వద్ద ఇటువంటి పరిస్థితే భక్తులకు ఎదురవుతోంది. పంపా జలాశయంలో శ్రీచక్ర స్నానం గొయ్యిలో మునిగిపోయి బుధవారం ఒక యువకుడు మృతి చెందిన విషయం విదితమే. అక్కడ గొయ్యి ఉందని తెలియక, పెద్దగా లోతుండదని భావించి వెళ్లిన అతడు ఆ గోతిలో పడి మృతి చెందాడు. అక్కడ దేవస్థానం అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ గొయ్యి చుట్టూ మెష్ ఏర్పాటు చేసి, కర్రలు పాతి, జెండాలు అమర్చినా గొయ్యి ఉందనే విషయం అందరికీ తెలిసి ఉండేది. అటువంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద సంఘటనతో మేల్కొన్న అధికారులు విచిత్రమైన చర్య తీసుకున్నారు. ‘గేట్లు దాటి లోపలకు వెళ్లేందుకు ప్రవేశం లేదు’ అంటూ అధికారులు పంపా గేట్లకు గురువారం ఫ్లెక్సీలు తగిలించారు. అలాగే, నది వద్ద ‘ఇచ్చట నీటిలో దిగుట ప్రమాదకరం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే, పంపాలో స్నానం చేయడం నిషిద్ధమని బోర్డులు పెట్టారు. దీంతో, పంపా జలాశయానికి స్నానం చేయడానికి వస్తున్న భక్తులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పండగలు, కార్తిక మాసం వంటి పవిత్ర దినాల్లో పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తూంటారు. దేవస్థానం అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలే తప్ప మొత్తానికే స్నానం చేయవద్దంటే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.32 కోట్ల రాబడి
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా రూ1.32 కోట్ల ఆదాయం సమకూరింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 31 రోజుల అనంతరం గురువారం తెరచి, వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,11,60,745, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.20,43,431 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఒక భక్తురాలి నిలువు దోపిడీ ద్వారా 104 గ్రాములు, మిగతా భక్తులు సమర్పించినది 8 గ్రాములు కలిపి మొత్తం 112 గ్రాముల బంగారం, 980 గ్రాముల వెండి, 64 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. గురువారం ఒక్క రోజే వివిధ సేవలు ద్వారా రూ.3,77,057 ఆదాయం వచ్చిందని చక్రధరరావు పేర్కొన్నారు.సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనముమ్మిడివరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31న ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో చేపట్టనున్న పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ప్రాంతీయ ఇంటెలిజెన్స్ అధికారి కృష్ణారావు, ఇతర జిల్లా అధికారులతో కలసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ పర్యటన చేపట్టారు. సీహెచ్ గున్నేపల్లిలో సత్తెమ్మ గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన హెలిపాడ్ను, చెయ్యేరులో ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.9.88 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వేదిక ఏర్పాట్లను, చెయ్యేరు జెడ్పీ హైస్కూల్ వెనుక ఏర్పాటు చేసిన ప్రజా వేదికను, సీహెచ్ గున్నేపల్లిలో సత్తెమ్మ తల్లి గుడి పక్కన పార్టీ శ్రేణుల సమావేశ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్డీఓలు డి.అఖిల, ఎ.మాధవి, డ్వామా పీడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి శనివారం మధ్యాహ్నం 12.25 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12.50 గంటలకు సీహెచ్ గున్నేపల్లి చేరుకుని, చెరువు పూడికతీత పనులను పరిశీలిస్తారు. అనంతరం పీ–4 బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత ఇచ్చే కార్యక్రమం చేపట్టి, పింఛన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ముఖాముఖి, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు.డీలర్లు నిబంధనలు పాటించాలిఅమలాపురం రూరల్: నిబంధనలకు లోబడి డీలర్లు వినియోగదారులకు రేషన్ సరకులు సరఫరా చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ ఆదేశించారు. వచ్చే నెల 1 నుంచి ప్రజాపంపిణీ విధానం ద్వారా నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ షాపులు తెరచి ఉంచాలని డీలర్లను ఆదేశించారు. దుకాణాల పని వేళలు, ధరలు, సరకుల నిల్వను సూచించే బోర్డు షాపు ముందు భాగంలో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దనే రేషన్ పంపిణీ చేయాలన్నారు. ఈ–పోస్, వేయింగ్ మెషీన్లు కండిషన్లో ఉంచుకోవాలని, కార్డుదారులందరికీ కచ్చితమైన కొలతలు, తూకంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, రశీదు ఇవ్వాలని ఆదేశించారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకుని వచ్చిందని డీఎస్ఓ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ మార్పులు చేసుకోవచ్చన్నారు. కొత్త బియ్యం కార్డు, కార్డు విభజన, సాధారణ విభజన, వితంతువు విభజన, విడాకుల విభజన, సింగిల్ మెంబర్ స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, ఉన్నవారి తొలగింపు, తప్పు ఆధార్ సీడింగ్, చిరునామా మార్పు, కార్డు సరెండర్ వంటివి చేసుకోవచ్చని ఉదయ భాస్కర్ వివరించారు. -
నాడు గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట
గత ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. కులం, మతం, రాజకీయం అనే వివక్ష లేకుండా.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను వెతికి మరీ గుర్తించి, సంక్షేమ లబ్ధి చేకూర్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. వారి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకే వచ్చేవి. దీనికి సమాంతరంగా పల్లెల్లో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారు. గతంలో ఊళ్లో ఒక ప్రభుత్వ భవనం ఉంటే గొప్ప. కానీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామ సచివాలయం, ఇంగ్లిష్ మీడియం విద్య, నాడు – నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారిన ప్రభుత్వ బడి, ఆర్బీకే, విలేజ్ క్లినిక్.. ఇలా కనీసం రూ.కోటి విలువైన భవనాలు ప్రతి గ్రామంలోనూ సమకూరాయి. -
బదిలీలకు 8,836 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్ హెచ్ఎంలు 215, ఎల్పీ హిందీ 41, ఎల్పీ సంస్కృతం 3, ఎల్పీ తెలుగు 93, ఎల్పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్ఏ తెలుగు 524 మంది, ఎస్ఏ ఇంగ్లిష్ 729, ఎస్ఏ హిందీ 396, ఎస్ఏ సంస్కృతం 9, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ బయలాజికల్ సైన్స్ 479, ఎస్ఏ గణితం 873, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 615, ఎస్ఏ సోషల్ స్టడీస్ 471, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ 260, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 10, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,826 మంది ఉన్నారు. పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ.. రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది. -
సర్కారు వారి ఆయిల్బామ్!
కాకినాడ జిల్లాలో సాగు వివరాలు వరి సాగు చేసే భూములు – 1.58 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులు – 1.45 లక్షల మంది ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు (ఒక పంటకు) పట్టు సాగు చేస్తున్న మండలాలు – 19 పట్టు సాగు చేస్తున్న గ్రామాలు – 155 పట్టు సాగు చేస్తున్న రైతులు – 1,150 మంది పట్టు సాగు చేస్తున్న భూమి –4,500 ఎకరాలు పట్టుగూళ్ల దిగుబడి –రోజుకు 5 టన్నులు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న భూములు – 36,738 హెక్టార్లు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు – సుమారు 40 వేల మంది పామాయిల్ సాగవుతున్న భూములు – 12,679 హెక్టార్లు పామాయిల్ సాగు చేస్తున్న రైతులు – సుమారు 10 వేల మంది పిఠాపురం: పంట చేతికందితే రైతుకు ఏటా ఆదాయం వస్తుంది. అది ఒక్క వార్షిక పంటలకే సాధ్యమవుతుంది. అదే బహు వార్షిక పంటలైతే పంట నాటిన కొన్నేళ్ల వరకు రైతుకు ఆదాయం రాదు. వార్షిక పంటలైతే ఏటా లాభాలతో పాటు నష్టాలు ఉంటాయి. అలా నష్టాలు వస్తే పరిహారం కోసం రైతు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాడు. రాయితీలు, నష్ట పరిహారాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా ఒకటేమిటి అన్నీ ప్రభుత్వం రైతుకు కల్పించాల్సి ఉంటుంది. వీటికితోడు సాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలి. వరదలు వచ్చినా, వానలు వచ్చినా తెగుళ్లు విజృంభించినా రైతుకు నష్ట పరిహారం ఇవ్వక తప్పదు. ఇలాంటి బాధలు తప్పించుకోవడానికి, భారం తగ్గించుకోవడానికి కూటమి ప్రభుత్వం బహు వార్షిక పంటల సాగును తెరపైకి తెచ్చింది. దీని కోసం ప్రతి జిల్లాకు టార్గెట్లు నిర్ణయించింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాకు 10 వేల ఎకరాల ఆయిల్పామ్ వంటి పంటలు సాగు చేయించాలని టార్గెట్ పెట్టారు. దీంతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవల పట్టు రైతులు తమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడగడానికి వెళితే జిల్లా ఉన్నతాధికారులు నష్టం వచ్చే పంటలకు బదులు ఆయిల్ పామ్ వంటివి సాగు చేసుకోండి అని ఇచ్చిన సలహా ఇప్పుడు వరి, ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇస్తున్నారు. అగ్రికల్చర్, సెరీ కల్చర్, హార్టి కల్చర్కు జిల్లా అధికారులు లక్ష్యాలు నిర్ణయించడంతో ఆయా శాఖల అధికారులు ప్రస్తుతం రైతులను ఒప్పించే పనిలో బిజీగా మారారు. ముందుగా ఖాళీ భూములను గుర్తించి వాటిలో ఆయిల్పామ్ సాగు చేయాలని చెబుతున్నారు. ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్పామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని రైతులకు నచ్చజెబుతున్నారు. బహు వార్షిక పంటలను సాగు చేయమని చెబుతున్నామని అధికారులు అంటున్నప్పటికీ ఎక్కువ శాతం ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆయిల్పామ్ లాభదాయకమేనా? సాధారణంగా ఆయిల్పామ్ సాగు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి తక్కువగా ఉన్న ఏరియాల్లో చేస్తుంటారు. నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వీటి సాగుకు రైతులు ముందుకు రారు. ఆయిల్పామ్ ఒక్కో ఏడాది మంచి లాభాలు ఇచ్చినా కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే చూపించిందంటున్నారు రైతులు. గత ఐదేళ్లుగా టన్ను రూ.10 వేలు మాత్రమే ఉండడంతో పెట్టుబడి కూడా రాలేదని రైతు ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి కావడం, అది తక్కువ రేటు ఉండడంతో ఇక్కడ ఆయిల్పామ్కు డిమాండ్ లేకపోయింది. దీంతో రేటు అమాంతం పడిపోయి జిల్లాలో ఉన్న ఒక పామాయిల్ కంపెనీ సైతం మూతపడినట్లు రైతులు చెబుతున్నారు. అలాంటిది ఈ ఏడాది థాయిలాండ్ నుంచి దిగుమతులు లేక ఇక్కడి వాటికి డిమాండ్ పెరిగి టన్ను రూ.21 వేలకు చేరడంతో ప్రస్తుతం లాభాలు వస్తున్నాయంటున్నారు. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో మాదిరిగా డిమాండ్ ఉండే ఆయిల్పామ్ను లాభదాయక పంటగా అధికారులు చెబుతుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తే కనీసం నాలుగేళ్ల పాటు ఎటువంటి ఆదాయం ఉండదు. అంతర పంటలు సాగు చేసుకుంటే తప్ప ఆదాయం రాదదని రైతులు చెబుతున్నారు. అంతర పంటలు కూడా అంతగా ఆదాయాన్ని ఇవ్వవని, ఏ పంటా వీలు లేని పొలాల్లో మాత్రమే ఆయిల్పామ్కు ప్రాధాన్యం ఇస్తారని రైతులు చెబుతున్నారు. రైతు ఎలా ఉన్నా తమపై భారం పడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా ఉండాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం బహువార్షిక పంటల పేరుతో వరితో సహా ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్పామ్ సాగును పెంచే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయిల్పామ్ సాగుకు జిల్లాలకు టార్గెట్లు వరి, పట్టు వంటి పంటలకు ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం రాయితీలు, నష్ట పరిహారాల భారం తగ్గించుకోవాలని సర్కారు ఎత్తుగడ రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం నష్టాలు రాకుండా చూడాలనే.. విచ్చల విడిగా రసాయనాలు వాడడం వల్ల పంటలు దెబ్బతిని రైతు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ప్రభుత్వం బహు వార్షిక పంటలను వేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఆయిల్పామ్ వంటి పంటలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. అందువల్లే బహవార్షిక పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – చైత్రవర్షిణి, పాడా పీడీ, పిఠాపురం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...
గండేపల్లి: హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశాకు చెందిన చంద్రశేఖర్ ప్రధాన్ (27), త్రిలోచన్ ప్రధాన్ పనుల కోసం కారులో ముంబయి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు మండలంలోని నీలాద్రిరావుపేట పరిధి చక్రవర్తినగర్ వద్ద రోడ్డుపై నిలిపిన కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో ఉన్న చంద్రశేఖర్ ప్రధాన్ తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు 108 అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్ షాక్తో... పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్డీ కరెంట్ పనులు చేస్తున్న కూలి గురువారం కరెంట్ షాక్తో మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం అడ్డతీగల మండలం జీ కొత్తూరుకు చెందిన బూడిద మహేష్బాబు విద్యుత్ పనులు చేస్తుంటాడు. గురువారం గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్డీ కరెంట్ పనులు చేస్తూ విద్యుత్ స్తంభాన్ని పైకి లేపగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతనిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువు బూడిద మరియ ఇచ్చిన ఫిర్యాదుపై గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వివాహిత..పిఠాపురం: గొల్లప్రోలు మండలం కొడవలి పాత హరిజనపేటకు చెందిన నామా నాగమణి బుధవారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం తన భర్తకు గల అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. గురువారం రాత్రి కొడవలిలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. ఈమెకు భర్త, కుమార్తె మౌనిక, కుమారుడు నిఖిల్ ఉన్నారు. మృతురాలి అక్క పుప్పాల సూర్యమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గోపాలపురం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపురం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన తుంగా వంశీ (25) బుధవారం రాత్రి గోపాలపురం గ్రామ శివారు పొగాకు బోర్డు సమీపంలో ఉన్న వేప చెట్టుకు వేలాడుతూ మృతిచెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న వంశీ మేనమామ కూనపోం వెంకట్రావు వెళ్లి చూసి గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ తల్లి 10 సంవత్సరాల వయసులో మృతిచెందింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్లపోవడంతో వంశీ, అతని అక్క వందన మేనమామ ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగించారు. అయిదు సంవత్సరాల క్రితం అక్క వందన మలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోయింది. దీంతో అతను తన మేనమామ వద్ద ఉంటూ కూలి పనులు చేస్తుండేవాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిస కావడంతో మేనమామ పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఒంటరి జీవితాన్ని గడప లేక మనస్తాపానికి గురైన వంశీ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. మేనమామ వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై యెగ్గేపల్లి సత్యనారాయణ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
నిడదవోలు : పట్టణంలో ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి అనువైన ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం వివిధ ప్రాంతాల్లో రైల్వే, మున్సిపల్ అధికారులు పర్యటించారు. ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి ప్రజలు రైల్వేట్రాక్ దాటవలసి వస్తోంది. అయితే ఇందిరానగర్ వద్ద ఉన్న రైల్వేగోడకు ఉన్న మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో అక్కడి స్థానికులు గోడను మూయడానికి వీలు లేదని గతంలో అడ్డుకున్నారు. దీంతో అధికారులు గోడ మార్గాన్ని మూసివేసే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రావడంతో విజయవాడ రైల్వే డివిజినల్ ఆపరేటింగ్ మేనేజర్ సోమశేఖర్నాయుడు తన సిబ్బందితో కలిసి ఫుట్పాత్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలో చినకాశిరేవు వద్ద కూడా మరో ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, నిడదవోలు రైల్వే ఐవోబీ అధికారి కిషోర్, టౌన్ఫ్లానింగ్ అధికారి సుప్రియ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు రామచంద్రపురం రూరల్: మండలంలోని వెంకటాయపాలెం శివారు చీమలదిబ్బ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుయ్యేరు గ్రామానికి చెందిన శీలం కమల(43) మృతి చెందినట్టు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. శీలం కమల బుధవారం వెంకటాయపాలెంలోని పేపకాయల బాబ్జీ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల అమ్మాయి ఓణీల ఫంక్షన్కి కుటుంబీకులు, బంధువులతో కలసి 5 మోటారు సైకిళ్లపై బయలుదేరారు. మరొక 5 నిమిషాల్లో కల్యాణ మండపానికి చేరుకుంటారన్న సమయంలో ఈమె ప్రయాణిస్తున్న వాహనం గోతిలో పడటంతో వెనుక కూర్చున్న కమల జారి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ద్రాక్షారామ నుంచి కుయ్యేరు వైపుగా వెళ్తున్న కోళ్లు సరఫరా చేసే లారీ చక్రాలు ఆమె పైనుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త సుమారు 2 సంవత్సరాలు క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరి పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. ఇంకా 9 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె ఆమైపె ఆధారపడి ఉన్నారు. ఆమె ద్రాక్షారామలో వస్త్ర దుకాణంలోలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కుమారుడు చిన్నతనం నుంచీ కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. కుమార్తెకు చిన్న వయస్సులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఆ చిన్నారుల పరిస్థితి తలచుకుని బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆసుపత్రి సమాచారం, బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సామర్లకోటలో బార్పై కేసు నమోదు
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అశ్విన్ రెస్టారెంట్ అండ్ బార్పై కేసు నమోదు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కె. రామోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘బార్ తెగించి అమ్మకాలు’ అనే శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించి కాకినాడ నార్త్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే బార్లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఆయనతోపాటు ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. బార్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచవలసి ఉండగా తెల్లవారు జాము నుంచీ బహిరంగంగా అమ్మకాలు చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. బాలికపై అత్యాచారం పోక్సో కేసు నమోదు కె.గంగవరం: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను మోసం చేసి, ఆనక ముఖం చాటేసిన యువకుడిపై కె.గంగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ చెప్పిన వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పామర్రుకు చెందిన మందపల్లి సాగర్ అనే యువకుడు అదే పేటకు చెందిన బాలికతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఏడవ నెల గర్భవతిగా ఉంది. కొంతకాలంగా సాగర్ను పెళ్లి చేసుకోవాలని బాలిక అడుగుతుండడంతో ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దలను అశ్రయించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డీఎస్పీ రఘువీర్, అమలాపురం మహిళా ఎస్సై గంగాభవాని, కె.గంగవరం ఎస్సై జానీబాషా పామర్రు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించి బాధితురాలు, వారి కుటుంబ సభ్యుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, ప్రసుత్తం యువకుడు పరారీలో ఉన్నాడని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి రాహుల్మీనా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తులు పరిశీలించి ఐదు సంవత్సరాలు నిండిన ఉద్యోగులను, వివిధ కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరిన 15 మంది ఉద్యోగులను వారు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం వివాదాలకు తావివ్వకుండా బదిలీ చేశామన్నారు. ఆయన బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి పాలంకి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.జయకృష్ణ పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్ హల్చల్
జగ్గంపేట: జగ్గంపేట పోలీసు స్టేషన్ వద్ద మద్యం తాగిన ఒక డ్రైవర్ గాజుముక్కతో శరీరాన్ని కోసుకుంటూ రక్తం ఓడుతుండగా పోలీసులను తిడుతూ గురువారం రాత్రి నానా హంగామా సృష్టించాడు. అతని వద్దకు వెళ్లడానికి స్థానికులు భయపడ్డారు. కొద్దిసేపటి తరువాత పోలీసులు అతన్ని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. గుర్రంపాలెం రోడ్డులో వున్న ఒక రైసు మిల్లు వద్ద రోడ్డుపై ఒక వ్యక్తి దుస్తులు విప్పేసి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని 100కి స్థానికులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు అక్కడకు కానిస్టేబుల్స్ను పంపారు.మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు వారించినా అతను వినకపోవడంతో పోలీసులు అతని వద్ద వున్న సెల్ఫోన్ తీసుకున్నారు. మద్యం మత్తులో వున్న వ్యక్తి లారీ డ్రైవర్ అని, ఎక్కడి నుంచో స్థానిక రైసు మిల్లుకు లోడ్ తీసుకువచ్చినట్లు స్థానికులు చెప్పారు. సెల్ఫోన్ తీసుకోవడంతో మద్యం సేవించిన డ్రైవర్ పోలీసులను తిడుతూ, చచ్చిపోతానని బెదిరిస్తూ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. నా సెల్ఫోన్తో పాటు నా దగ్గర నగదు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేశాడు. మీరు పోలీసులా రౌడీలా అంటూ కేకలు వేశాడు. అక్కడ దొరికిన బీరు బాటిల్ బద్దలు కొట్టి గాజుముక్కతో శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. దీంతో శరీరం రక్తంతో తడిసిపోయింది. గాజుముక్కతో బెదిరించడంతో ఎవరూ దగ్గరకు వెళ్లడానికి సాహసం చేయలేదు. కొద్దిసేపటి తరువాత పోలీసుల అతనిని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో పోలీసులపై తిట్ల పురాణం సెల్ఫోను, నగదు తీసుకున్నారని ఆరోపణ -
వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం
కొత్తపల్లి: స్థానిక ఊర చెరువు సెంటర్లో ఉన్న దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ధ్వంసం చేశారు. దీంతో మోహనరంగా అభిమానులు పిఠాపురం– ఉప్పాడ రోడ్డులో ఊరచెరువు సెంటర్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఘటనా స్థలానికి ఎస్సై వెంకటేష్ చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అభిమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని ఎస్ తెలిపారు. గురువారం తెల్లవారు జామున కొత్తపల్లి ఎస్సీ పేటకు చెందిన పెట్టా శ్రీకాంత్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించామన్నారు. విగ్రహానికి సంబంధించి చేతులను విరగ్గొట్టి పక్కనే ఉన్న చెరువులో పడవేశాడు. పలువురు సాక్షుల చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్పై కేసు నమెదు చేసి అరెస్ట్ చేశామన్నారు. పిఠాపురం–ఉప్పాడ రోడ్డులో బైఠాయించిన అభిమానులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్
అమలాపురం రూరల్: తెలుగు జాతికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కొనియాడారు. కలెక్టరేట్లో బుధవారం ఎన్టీఆర్ జయంతిని అధికారకంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారన్నారు. డీఆర్ఓ రాజకుమారి మాట్లాడుతూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాలలో ఎన్టీఆర్ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారన్నారు. కార్యక్రమంలో ఏవో కె.కాశీ విశ్వేశ్వరరావు, డీఈవో షేక్ సలీమ్ బాషా, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంల పదోన్నతులకు రంగం సిద్ధం రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రేడ్–2, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ బదిలీ దరఖాస్తుల గడువు ముగిసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ బదిలీ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా సాగుతోంది. బదిలీలకు 230 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ క్యాడర్ల బదిలీ దరఖాస్తుల సంఖ్య లెక్క తేలాల్సి ఉంది. బుధవారం సాయంత్రానికి ఎంతమంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు దరఖాస్తు చేసుకున్నారన్న సంఖ్య స్పష్టం కాలేదు. పీఎస్ హెచ్ఎంలకు బదిలీల వెబ్ ఆప్షన్లు బుధవారం రాత్రికి ఓపెన్ అయ్యే అవకాశమున్నట్లుగా సమాచారం. 98 మందికి పదోన్నతి లభించే అవకాశం స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 98 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి లభించే అవకాశముంది. 1:3 నిష్పత్తిలో పదోన్నతులకు ఉపాధ్యాయులను ఆహ్వా నిస్తున్నారు. ఈ మేరకు పదోన్నతుల సీనియారిటీ జాబితాలో ఉన్నవారు కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అనివార్య కారణాలతో కౌన్సెలింగ్ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పదోన్నతి సీనియారిటీ జాబితాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు విల్లింగ్/నాట్ విల్లింగ్ ఆప్షన్ తీసుకుంటారు. విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన అనంతరం బదిలీ దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా ఎంపిక చేసుకునే స్కూల్ కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. -
లోకేష్కు డప్పు కొట్టడానికే మహానాడు
రావులపాలెం: నారా లోకేష్కు డప్పు కొట్టడానికే టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కడపలో నిర్వహించిన మహానాడులో కూటమి ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి భ్రమరావతిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్వప్రయోజనాలను కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని జనమే చెప్పుకుంటున్నారన్నారు. లోకేష్ను జాకీలతోనైనా పైకి లేపాలనే తాపత్రయంతో మహానాడు నిర్వహించినట్టుందన్నారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలనుకుంటున్నారని, కానీ ఆయన కలెక్టింగ్ ప్రెసిడెంట్గా బాగా సూట్ అవుతారని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని కూటమి ప్రభుత్వం మోపిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకుడు గొలుగూరి మునిరెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, మండల శాఖల అధ్యక్షులు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు స్వప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
గోదావరిలో క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యం
ముమ్మిడివరం: కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలోని గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల్లో సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం బుధవారం ఉదయం సంఘటన స్థలంలో లభ్యమైంది. కె.గంగవరం మండలం శేరిల్లంకలో స్నేహితుడి ఇంట సోమవారం జరిగిన ఓణీ ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన ఎనిమిదిమంది యువకులు గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఐ.పోలవరం మండలం జి.మూలపొలం శివారు ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్, కాకినాడ తూరంగికి చెందిన యలవర్తి సాయి మహేష్, కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్, కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన ఎలిపే మహేష్, మండపేటకు చెందిన కులపాక రోహిత్, కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ల మృతదేహాలు మంగళవారం దొరికాయి. సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొన్నారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కాగా.. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయన బుధవారం ఉదయం సంఘటనా స్థలంలో క్రాంతి కిరణ్ మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జి.మూలపొలం శివారు ఎర్రగరువు చెందిన అన్నదమ్ములు వడ్డి మహేష్, వడ్డి రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట నిఘా
అమలాపురం రూరల్: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం నిరోధంపై బుధవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చి, ఉన్నత లక్ష్యాలకు చేరుకునే దిశగా ప్రోత్సహించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోస్టర్లు, పాంప్లేట్లు, బ్యానర్లు వేయించి, వాటిని స్కూళ్లు, కాలేజీల ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. ● రహదారి భద్రత దృష్ట్యా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన అధ్యక్షతన కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా, కార్లలో సీట్ బెల్టు పెట్టుకునేలా చూడాలన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. -
తల్లడిల్లుతున్న తల్లి పేగు
పి.గన్నవరం: గోదావరి పాయలో మంగళవారం సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి గల్లంతు కావడం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వీరిలో ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకై క సంతానం కాగా, మరొకరికి అక్క ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆయా కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తారన్న కుమారులు నీట మునిగి గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన కేతా ప్రవీణ్ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన నీతిపూడి పౌలు కుమార్ (15), మరో ఇద్దరు విద్యార్థులు కలిసి సాయంత్రం వరకూ నాగుల్లంకలో ఆడుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో నాగుల్లంకకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలో వశిష్ట నదీపాయలో సరదాగా స్నానం చేసేందుకు సైకిళ్లపై వెళ్లారు. పెదలంకకు చెందిన నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి నెల రోజుల క్రితం పౌలుకుమార్ వచ్చాడు. నదీలో స్నానం చేస్తున్న ప్రవీణ్, సూర్యతేజ, పౌలుకుమార్లు నీట మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు బాలురు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరారీ అయ్యారు. వారి వివరాలు తెలియరాలేదు. ప్రమాద స్థలానికి సమీప లంకల్లో పనిచేస్తున్న కూలీలు.. నీట మునుగుతున్న విద్యార్థులను గమనించి, అక్కడికి చేరుకునే సరికే వారు మునిగిపోయారు. విద్యార్థుల దుస్తుల్లో ఉన్న సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాగుల్లంకలో విషాద ఛాయలు ముగ్గురు విద్యార్థులు గల్లంతు కావడంతో నాగుల్లంక గ్రామంలో విషాయ ఛాయలు అలముకున్నాయి. కేతా ప్రవీణ్ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అతడి తండ్రి వెంకటేశ్వరరావు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సరోజిని గృహిణి. వీరి మొదటి కుమారుడు ఏడాది వయసులోనే మరణించడంతో రెండో కుమారుడైన ప్రవీణ్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రవీణ్ గల్లంతు కావడంతో వారు దుఖః సాగరంలో మునిగిపోయారు. సానబోయిన సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి దుర్గాభవాని గృహిణి. వీరికి ఏకై క సంతానమైన సూర్యతేజ నీట మునిగి గల్లంతు కావడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పెదలంకకు చెందిన పౌలుకుమార్ నెలరోజుల క్రితం నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి వచ్చాడు. ప్రమాద స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మంగళవారం రాత్రి పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పి.గన్నవరం తహసీల్దార్ పి.శ్రీపల్లవి, సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై బి.శివకృష్ణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వశిష్ట నదీపాయలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు మూడు కుటుంబాల్లోనూ ఏకై క కుమారులే -
కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే కడతేరిపోయాడు
ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పోషిస్తాడు అనుకుంటే చదువు పూర్తికాకుండానే తన కుమారుడు కడతేరిపోయాడని ఒక తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతై మృతిచెందిన తాతపూడి నితీష్ తండ్రి రాజును వారించడం అక్కడివారి వల్ల కాలేదు. తన కుమారుడు బీఎస్సీ యానిమేషన్ కోర్సు చదువుతూ తనకు ఆసరాగా ఉంటున్నాడని ఇటీవల ఆర్థిక పరిస్థితి బాగా లేక తాను ఫీజు కట్టలేనని చెప్పగా డాడీ నా ఫీజు నేనే కట్టుకుంటానని చెప్పి ఈవెంట్స్ చేసి తన ఫీజులు తానే కట్టుకుంటున్నాడని వాపోయారు. కుటుంబాన్ని ఆదుకుంటాడని, తన కుమార్తెలిద్దరికీ పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకున్నానని, అంతలోనే అర్ధంతరంగా మృతి చెందాడని రోదిస్తూ చెప్పారు. ఇక్కడి ఫంక్షన్కు రాకుండా ఉంటే నా కొడుకు బతికి ఉండేవాడని విలపించారు. -
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
రాజోలు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం పెదలంకలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెదలంక గ్రామానికి చెందిన 15 ఏళ్ల నీతిపూడి పౌలుకుమార్ ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద గోదావరిలో మంగళవారం గల్లంతయ్యాడు. 15 ఏళ్ల క్రితం పౌలుకుమార్ తండ్రి నాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ప్రస్తుతం కుమారుడు పౌలుకుమార్ గోదావరిలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పౌలుకుమార్ తల్లి నాగలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నాన్నమ్మ వద్ద ఉంటున్నాడు. రాజోలు మండలం తాటిపాక మఠం గ్రామానికి ఆనుకుని పెదలంక ఉండడంతో పౌలుకుమార్ 10వ తరగతి వరకు తాటిపాక ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇటీవల 10వ తరగతి పాసయ్యాడు. నెల రోజుల క్రితం నాన్నమ్మ గారి ఊరైన పెదలంక నుంచి అమ్మమ్మ గారి ఊరైన పి.గన్నవరం మండలం నాగుల్లంక వెళ్లాడు. ఈ నెల 24వ తేదీన పౌలుకుమార్ పెదలంక వచ్చి మళ్లీ అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాడని నాన్నమ్మ భాగ్యవతి భోరున విలపించింది. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మనుమడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని కంటతడి పెట్టుకుంది. గోదావరిలో గల్లంతైన మనుమడు పౌలుకుమార్ కోసం విలపిస్తున్న నాన్నమ్మ భాగ్యవతి, తాతయ్య నాగేశ్వరరావులను చుట్టుపక్కల వారు ఓదార్చారు. -
ఇసుక అక్రమ తవ్వకాల వల్లే యువకుల మృత్యువాత
అమలాపురం టౌన్: ఇసుక మాఫియా ఆక్రమ తవ్వకాల వల్లే కమిని లంక గ్రామంలో గోదావరి పాయలో 8 మంది యువకులు గల్లంతై మృత్యువాత పడే దుస్థితి దాపురించిందని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ యువకుల చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా సీపీఎం నాయకులు బృందం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని మంగళవారం సందర్శించింది. ఈ మేరకు సీపీఎం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు అమలాపురంలో మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇసుక మాఫియా ఆగడాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. 8 మంది యువకులు గోదావరిలోకి స్నానాలకు వెళ్లి మృతి చెందారంటే ముమ్మూటికీ ఇసుక మాఫియా అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన అంచనా తెలియని లోతుతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది.నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్అమలాపురం టౌన్: గత ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనరల్, ఒకేషనల్ పరీక్షలు బుధవారం నుంచి జూన్ 1వ తేదీ వరకూ జరుగుతాయని డీఐఈవో వనము సోమశేఖరరావు తెలిపారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకూ ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మరో పరీక్ష నిర్వహిస్తారని ప్రకటనలో తెలిపారు.నిధుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలిఅమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు జెడ్పీటీలకు తెలియకుండా ఎన్ఆర్జీఎస్ జెడ్పీ నిధులు కేటాస్తున్నారు, ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ కోనసీమ జిల్లా చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు కలెక్టర్ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో వారు మంగళవారం కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ను ఆయన చాంబర్లో కలిశారు. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, జెడ్పీ విడుదల చేసే 15 శాతం నిధులు, ఆర్డబ్ల్యూఎస్ పనుల్లో కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని వివరించారు. ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపించడం లేదని తెలిపారు. ప్రత్యక్షంగా ఎన్నికై న తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా అని అన్నారు. తమ జెడ్పీ నిధులు కూడా తమకు తెలియకుండా ఎమ్మెల్యేలు చెప్పిన పనులకు ఎంపీడీవోలు, అధికారులు ఆమోదం తెలుపుతున్నారని అన్నారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నిధుల కేటాయింపులో జెడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జెడ్పీటీసీ సభ్యులు పందిరి రామ్గోపాల్, గెడ్డం సంపతిరావు, కోనుకు గౌతమి, మట్టా శైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, వి.వీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు.ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోవిడ్ వ్యాిప్తి నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమవుతున్నారు. ముందు జాగ్రత్తగా రాజమహేంద్రరం ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. ఈ వార్డులో ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. వెంటిలేటర్ను అందుబాటులో ఉంచారు. రోగులకు వ్యాధి లక్షణాలను బట్టి అవసరమైతే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పూర్వపు క్యాంటీన్ ప్రాంతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ చర్యలు చేపట్టారు. -
మా ఆందోళన ఎవరికీ పట్టదా?
పవన్కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి వారాహి యాత్ర సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వినతిపత్రం ఇవ్వగా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో మేము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. నేరుగా కలుద్దాం అని కాకినాడ నుంచి పిఠాపురంలో జనసేన కార్యాలయానికి పాదయాత్రగా వెళితే ఆయన అందుబాటులో లేరు సరికదా బాధ్యులు కూడా కనిపించలేదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. – ఎస్.వెంకటరమణ, యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ శ్రమ దోపిడీకి గురవుతున్నాం మున్సిపాలిటీ, కార్పొరేషన్ల లో ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నా రు. అన్ని అత్యవసర విభాగాల్లోనూ మేమే సేవలందిస్తున్నాం. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచారు.. మాకు మాత్రం పెంచడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొంటాం. – ఉండవల్లి వీరవెంకటరమణరాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, సామర్లకోట మున్సిపాలిటీ ● మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆవేదన ● సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20 రోజులుగా సమ్మె ● హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పట్టించుకోని వైనం పిఠాపురం: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంజినీరింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు వినతిపత్రం అందజేయాలని వారు చేసిన ప్రయత్నం విఫలమయినట్లు కార్మికులు చెబుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న తమకు సరైన జీత భత్యాలు లేవంటున్నారు. తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 4,500 మంది ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా పని చేస్తున్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, మంచినీటి పథకాల నిర్వహణ తదితర పనులు చేస్తుంటారు. అయితే తమకు పనికి తగ్గ వేతనాలు లేవని, దీంతో జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు రూ.13,087 మాత్రమే వేతనం ఇస్తున్నారని చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో వారాహి యాత్రకు వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు, యువగళంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు వినతిపత్రాలు ఇచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ మా సంగతి పట్టించుకోలేదు. డిమాండ్లు ఇవీ.. కార్మిక చట్టాల ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు రూ.29,200, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ. 24,500 చొప్పున జీతాలు చెల్లించాలి. 15 ఏళ్లు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలి ప్రభుత్వం ప్రకటించే 52 ఆదివారాలు, 17 దేశ జాతీయ, రాష్ట్ర పండగ దినాలను సెలవు రోజులుగా ప్రకటించాలి లేదా వేతన దినాలుగా అయినా పేర్కొనాలి. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. విధి నిర్వహణ భారంగా మారి శరీరం సహకరించని వారికి, దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం వైద్య సేవలందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేబర్ యాక్టు ప్రకారం సీనియారిటీని ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా గుర్తించి టెక్నికల్ ఉద్యోగులుగా నిర్ణయించి వారికి తగిన జీతాలు ఇవ్వాలి. కార్మిక చట్టాల ద్వారా సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంజినీరింగ్ విభాగంలో వాటర్ బోర్డును ఏ ర్పాటు చేయాలి. స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి. –పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గ్రాడ్యూటీతో పాటు కనీసం రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలి, లేదా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. -
రత్నగిరిపై పడకేసిన రక్షణ
కీలకమైన ప్రదేశాలలో కనిపించని సెక్యూరిటీ గార్డులు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సెక్యూరిటీ పడకేసింది. దేవస్థానంలో కీలక ప్రాంతాలలో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. సెక్యూరిటీ కోసం దేవస్థానం ఏడాదికి సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులు వివిధ చోట్ల దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. వీరిపై దేవస్థానం నియమించిన సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఉన్నారు. కాని వీరెవరూ సరిగా విధులు నిర్వహించకపోయినా అడిగే నాథుడు లేడు. టోల్గేట్ వద్ద, రత్నగిరిపై, వై.జంక్షన్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. పశ్చిమ రాజగోపురం వద్ద కానరాని సెక్యూరిటీ దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం చాలా కీలకమైన చోటు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో 80 శాతం మంది పశ్చిమ రాజగోపురం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ నుంచి వంద మీటర్లు దూరంలో అన్నదానం భవనం ఉంటుంది. వాహనాల పార్కింగ్ స్థలం అక్కడకు 150 మీటర్ల దూరం. పశ్చిమ రాజగోపురం వద్దనే దేవస్థానం బస్సులు ఆగుతాయి. ఇంత ప్రాధాన్యం కలిగిన స్థలంలో కనీసం నలుగురు అయినా సెక్యూరిటీ గార్డులు ఉండాలి. కాని ఒక్కరూ కూడా ఉండడం లేదు. వ్రతాలు, కల్యాణం, ఇతర సేవా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద కూడా ప్రయివేట్ షాపుల వద్ద పనిచేసేవారే భక్తులను నియంత్రిస్తున్నారు. అక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు ఎవరూ ఉండడం లేదు. గత శనివారం విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో వ్రతాల టిక్కెట్లను ఒక వ్యక్తి బ్లాక్లో అమ్ముతుండగా హోమ్గార్డు పట్టుకుని మందలించి వదిలేశారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని అయినా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. కాని సోమవారం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ కనిపించలేదు. రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో... రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద కూడా అదే పరిస్థితి. ఇక్కడ గతంలో ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడం లేదు. స్వామివారి సన్నిధికి విచ్చేసే సామాన్య భక్తులు స్వామివారి వ్రతాలు, దర్శనం, అన్నదానం పథకంలో భోజనం చేశాక రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో సేద తీరుతారు. కొంతమంది మహిళా భక్తులు వ్రతాల సమయంలో తాము ధరించిన పట్టుచీరలు, నూతన చీరలను అక్కడ ఆరబెట్టి కొంతసేపు నిద్రపోతుండగా అదను చూసి కొంతమంది దొంగలు ఆ చీరలను పట్టుకుపోతున్నారు. ఆ షెడ్డుకు గల సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్ల వద్ద కూడా సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి కొంత సేపు ఆదమరిస్తే చాలు ఆ ఫోన్లు ఉండవక్కడ. ఇవే కాదు భక్తుల బ్యాగ్లు, విలువైన వస్తువులు కూడా దొంగలు అపహరిస్తున్నారు. ఎదురుగా ఈఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఈ విశ్రాంతి షెడ్డులో దొంగతనం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ రాత్రివేళల్లో వివాహాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పెళ్లి బృందాలలోని మహిళల ఆభరణాలు, నగదు కూడా చోరీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా గల ఉచిత డార్మెట్రీ వద్ద కూడా సెక్యూరిటీ లేదు. ఇలా చాలాచోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. దేవస్థానం అధికారులు పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద, ఉచిత డార్మెట్రీ వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా ఈ ప్రాంతాలలో రద్దీ సమయాల్లో హోం గార్డులతో తనిఖీలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. -
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్ అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం కమిని గ్రామం వద్ద గోదావరిలో మృతిచెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, అండగా నిలవాలని జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అమలాపురంలో మంగళవారం యువకుల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల చాలామంది విద్యార్థులు, స్థానికులు మృతి చెందుతున్నారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కోనసీమ జెడ్పీటీసీ సభ్యులు, పందిరిశ్రీహరి రామ్గోపాల్, గెడ్డం సంపదరావు, కోనుకు గౌతమి, మట్టాశైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, పుట్టి కూడివీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా సంతాపం తెలిపారు. -
పోలీసులమని చెప్పి బెదిరిస్తున్న ఇద్దరి అరెస్టు
రూ.1,000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్, బటన్ చాకు స్వాధీనం రాజమహేంద్రవరం రూరల్: పోలీసులం అని చెప్పి హైవేపై వాహనాలను ఆపి డబ్బు దోచుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి,. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు దివాన్చెరువు ఫారెస్టు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ఫీల్డ్పై వచ్చి బొలెరో వాహనాన్ని నిలుపుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ను బొలెరో వాహనానికి అడ్డుగా పెట్టి తాము పోలీసులమని చెప్పి కత్తి చూపించి బెదిరించారు. బొలెరో వాహనం డ్రైవర్ను కొట్టి జేబులోని రూ.1,000 నగదు దోపీడీ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పెదమానాపురంనకు చెందిన బొలెరో డ్రైవర్ కూరడ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్ మురళీమోహన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దివాన్చెరువు గ్రామశివారు పాలచర్ల రోడ్డులో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన సిర్ర జాస్పర్ప్రిన్స్ ఎలియాస్ జాస్పర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన గుడిసెరాబిన్లను అరెస్టు చేశారు. నిందితులు గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని డీఎస్పీ విద్య తెలిపారు. వీరిపై దారి దోపిడీ, గంజాయి కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్నాయని చెప్పారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనదారునికి ఫైన్ షాక్
డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.10 వేల జరిమానా కొత్తపేట: లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి రూ.10 వేలు ఫైన్ పడింది. వివరాలిలా ఉన్నాయి... కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర సోమవారం స్థానిక కమ్మిరెడ్డిపాలెం మలుపు వద్ద సిబ్బందితో కలిసి ట్రాఫిక్ బీట్ వేశారు. ఆ సందర్భంగా స్థానిక బాలయోగిపేటకి చెందిన ఒక యువకుడు మరో ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఎస్సై సురేంద్ర ఆపారు. లైసెన్స్ ఏది? అని అడగ్గా లేదని చెప్పడంతో నంబరుతోపాటు మోటార్ సైకిల్తో సహా అతని ఫొటో తీసి నేషనల్ ఎంవీ యాక్ట్ యాప్లో నమోదు చేసి ఆ వాహనదారు ని పంపించేశారు. అయితే రాత్రి అతని సెల్ఫోన్కు మోటార్సైకిల్ డీటెయిల్స్తో పాటు లైసెన్స్ లేనందుకు రూ.10,035 ఫైన్ పడినట్టు మెసేజ్ వచ్చింది. ఆ ఫైన్ను ఆన్లైన్లో చెల్లించాలని ఆ చలానాలో పేర్కొన్నారు. దీంతో ఆ వాహనదారుడు నిర్ఘాంతపోయాడు. -
సీఎం పర్యటన కోసం చెట్ల నరికివేత
కాట్రేనికోన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31 పర్యటించనున్న నేపథ్యంలో సందర్భంగా చెయ్యేరులో రోడ్డు వెంబడి చెట్లను నరికి వేస్తున్నారు. పచ్చదనం కోసం రోడ్డుకు ఇరువైపులా మహిపాలచెరువు నుంచి పల్లంకుర్రు వరకు ప్రభుత్వం మొక్కలు నాటింది. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం పర్యటన సందర్భంగా రోడ్డు వెంబడి పచ్చదనంగా ఉండి ప్రయాణికులకు నీడను అందిస్తున్న చెట్లు నరివేస్తుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యేరులో రోడ్డు వెంబడి నరికి వేసిన చెట్లు -
కోనసీమ విషాదం: ఏడు మృతదేహాలు లభ్యం
కోనసీమ జిల్లా: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గొదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్న(సోమవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. వారిలో ఏడు మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. -
కోనసీమలో విషాదం.. గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు!
సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం/సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు.అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కలెక్టర్ ఆర్. మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు. గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు.వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టండి : సీఎం చంద్రబాబు ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని నీటి వనరులున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. -
కొబ్బరి అధరహో..
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: శ్రీరామ నవమి నుంచి వినాయక చవితి వరకూ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు అన్సీజన్. చవితి పండుగకు నెల రోజుల ముందు నుంచి కొనుగోలు సీజన్ మొదలవుతుంది. అటువంటిది అన్ సీజన్లో కొబ్బరి ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఒకవైపు పచ్చి కొబ్బరికాయ ధర పెరగగా.. మరోవైపు కురిడీ కొబ్బరి రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ఒక్కసారిగా ధరలు పెరగడంతో మార్కెట్కు కొత్త జోష్ వచ్చింది.కొనుగోళ్లు... ఎగుమతులుగత రెండు మూడు రోజుల్లో కొబ్బరి పచ్చికాయ ధర గణనీయంగా పెరిగింది. వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. రెండు రోజుల కిందట రూ.13,500 నుంచి రూ.14 వేల వరకూ ఉండేది. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు గత మార్చి నెల నుంచి కొబ్బరి బొండాల సేకరణ అధికంగా ఉంది. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల కొబ్బరి అవసరాలను రాష్ట్ర కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల స్థానిక అవసరాల కోసం మన రాష్ట్రం నుంచి కొబ్బరికాయ కొనుగోలు పెరిగింది. ఈ కారణంగా ధర పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కురిడీ... సంబరపడి అంబాజీపేట మార్కెట్లో కురిడీ కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వారం రోజుల కిందట కురిడీ కొబ్బరిలో పాతకాయ గండేరా రకం (పెద్దకాయ) ధర వెయ్యికి రూ.20 వేలు మాత్రమే ఉండేది. ఇది రూ.22,500 వరకూ పెరిగింది. అలాగే గటగటా (చిన్నకాయ) వెయ్యికి రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరింది. కొత్త కాయలో గండేరా రూ.21,500, గటగటా రూ.19,500 చొప్పున ధర పలుకుతున్నాయి.కురిడీకి ధర రావడం వెనుక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేకపోవడం కూడా ఒక కారణం. ఉత్తరాదిలో ఆషాఢ మాసంలో కొబ్బరి వినియోగం అధికంగా ఉంటుంది. ఆ మాసానికి ఇంకా నెల రోజులు ఉండడంతో ధర పెరగడానికి ఇదొక కారణం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 70 నుంచి 100 లారీల వరకూ కురిడీ కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.మరింత పెరుగుతుందనే అంచనాతో..ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు నెలల దింపు కాలానికి 1,500 నుంచి 2 వేల వరకూ కాయలు దిగుబడిగా వస్తున్నాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండడం, అందుకు తగినట్టుగా ధరలు పెరగడంతో చాలా రోజుల తరువాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు జోష్ వచ్చింది. ధర మరింత పెరుగుతోందనే అంచనాతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. -
కోనసీమ జిల్లాలో విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
సాక్షి,ముమ్మిడివరం: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం శేరిలంక గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ నుంచి కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు యువకుల్ని కాపాడారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేశ్, రోహిత్, మహేష్గా గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. -
కలిసొచ్చిన కొబ్బరి
సాక్షి, అమలాపురం: అన్సీజన్ సమయంలోనూ పచ్చి కొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు అమాంతం పెరిగాయి. గడచిన మూడు రోజుల్లో పచ్చికాయలతోపాటు కురిడీ ధరలు సైతం పెరగడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో సందడి నెలకొంది. సాధారణంగా శ్రీరామనవమి నుంచి వినాయక చవితి ముందు వరకూ అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు అన్సీజన్. చవితి పండుగకు నెల రోజుల ముందు సీజన్ మొదలవుతుంది. కానీ.. ఈసారి అన్ సీజన్లోనూ కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది.పచ్చి కాయలకూ భలే డిమాండ్అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి పచ్చి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. రెండు రోజుల క్రితం రూ.13,500 నుంచి రూ.14 వేల వరకూ ఉండేది. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు మార్చి నెల నుంచి కొబ్బరి బొండాల సేకరణ అధికంగా ఉంది. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల కొబ్బరి అవసరాలను మన రాష్ట్రమే తీర్చాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల అవసరాల కోసం మన రాష్ట్రం నుంచి కొబ్బరి కొనుగోలు పెరిగింది. దీంతో పచ్చికాయకు డిమాండ్ వచ్చిoది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 150 లారీల వరకూ కొబ్బరి కాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్టు అంచనా.కురిడీ ధరల్లోనూ రికార్డు కురిడీ కొబ్బరికి సైతం రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. వారం క్రితం కురిడీ కొబ్బరిలో పాత కాయ గండేరా రకం (పెద్ద కాయ) వెయ్యికి రూ.20 వేలు ధర ఉండేది. ప్రస్తుతం వీటి ధర రూ.22,500 వరకూ పెరిగింది. గటగట (చిన్నకాయ) వెయ్యికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ పెరిగింది. కొత్త కాయలో గండేరా రూ.21,500, గటగట రూ.19,500 చొప్పున పలుకుతున్నాయి. కురిడీ ధరలు పెరగడానికి కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేకపోవడమే కారణం. తమిళనాడులోని ఈరోడ్, తిరువూరు, కేరళలోని కోజికోడ్, కర్ణాటకలో హసన్, మాండ్యాల నుంచి కురిడీ కొబ్బరి ఎగుమతులు అధికం. ప్రస్తుతం ఆ మార్కెట్లలో కురిడీ కొబ్బరి తయారీ తగ్గడంతో ఇతర రాష్ట్రాలకు అవసరమైన మేరకు ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇది కోనసీమ కురిడీ వ్యాపారులకు వరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 70 నుంచి 100 లారీల వరకూ కురిడీ కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.మార్కెట్లో పెరిగిన జోష్ కొబ్బరి దిగుబడులు ఈ సీజన్లో చాలా తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు నెలల దింపు కాలానికి 1,500 నుంచి 2 వేల వరకూ కాయల దిగుబడి వస్తోంది. ఎకరాకు నెలకు సగటున 800 వరకూ కాయలు వస్తుండటం కూడా రైతులకు ఊరటనిస్తోంది.దిగుబడి ఆశాజనకంగా ఉండటం, అందుకు తగినట్టుగా ధరలు పెరగడంతో చాలా రోజుల తరువాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో జోష్ నెలకొంది. రానున్న రోజుల్లో ధర మరింత పెరుగుతుందనే అంచనాలతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. -
ఏడాది కాలంలో ఏం పొడిచారు?
● ఫ్లెక్సీలు కట్టి డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారు? ● అసలు బాబూకొడుకులకేం తెలుసు? ● నా చరిత్ర తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు ● ఆదిరెడ్డి కుటుంబంపై గోరంట్ల ఫైర్ రాజమహేంద్రవరం రూరల్: ‘‘బుచ్చయ్య చౌదరి ఒక చరిత్ర. నా చరిత్ర తెలియనివారు ఏదో మాట్లాడుతున్నారు. రాజమండ్రి నగరం అభివృద్ధి నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఏడాది కాలంగా బాబూ కొడుకులు ఏం చేశారు? నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏడాదిగా ఏం పొడిచారు? ఫ్లెక్సీలు కట్టుకుని డబ్బాలు కొట్టుకోవడమే చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్కు ఏం చేశారని ఫ్లెక్సీలు కట్టుకున్నారు? నన్ను అవమానపరచాలంటే తాతలు దిగి రావాలి’’ అంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సొంత పార్టీ టీడీపీకే చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటును ఆదిరెడ్డి వాసు తన ఘనతగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. తెలుగు విశ్వ విద్యాలయం భూముల కేటాయింపులో తాను భాగస్వామినని, రాష్ట్ర విభజన తరువాత తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని, దీని కోసం 2014–19 మధ్య అనేకసార్లు చంద్రబాబుతో తాను మాట్లాడానని చెప్పారు. వాసు వ్యవహారం చూస్తూంటే.. ఎవరో కన్న బిడ్డకు తాను తండ్రిగా చెప్పుకున్నట్లు ఉందని దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యం మైదానంలో సభ ఏర్పాటు చేసి, తాను చేసిన అభివృద్ధిని సవివరంగా చెబుతానని గోరంట్ల అన్నారు. తారస్థాయికి చేరిన రాజకీయ వైరం టీడీపీలో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య చిరకాలంగా నెలకొన్న రాజకీయ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడుకు ముందే వారి మధ్య వైరుధ్యాలు వెలుగు చూశాయి. -
‘సూపర్ సిక్స్’ అమలు ఎక్కడో?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కిషోర్ అమలాపురం టౌన్: పేదలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా, 2029 నాటికి పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ అన్నారు. సంపద సృష్టిస్తానని, పేదరికాన్ని నిర్మూలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా సూపర్ సిక్స్ అమలు చేయలేనప్పుడు అవి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఆదివారం అమలాపురంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని అంతం చేస్తానన్న చంద్రబాబు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని కిషోర్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీని పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన గురించి అడిగారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడగలేదని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు, ఎగుమతులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన దానంతటికవే వస్తాయన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించి ఎంత సేపూ మోదీని పొగడడం, ఏవేవో కోరడంతోనే సరిపోతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెనకబడుతోందన్నారు. బాలాజీ స్వామి కల్యాణోత్సవాలకు శ్రీకారం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వైశాఖ మాసం, కృష్ణ పక్షం, త్రయోదశి, అశ్వని నక్షత్రం శుభ ముహూర్తంలో పందిరి రాట వేసి ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో దిగ్విజయంగా జరిపించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరగాలని అభిలాషిస్తూ పందిరి రాట పాతారు. జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు స్వామివారి వార్షిక కల్యాణం ఉంటుందన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి, సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు ఆయా స్థాయిల్లో తమ సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదులను తెలపవచ్చని ఆయన చెప్పారు. రేపు నిధి ఆప్ కే నికట్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికట్ – డిస్ట్రిక్ట్ ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్టానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి చెల్లూరు సర్వారాయ షుగర్స్లో, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి పీఏసీఎస్(సొసైటీ)లో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వెంకటరామ పీఏసీఎస్(సొసైటీ)లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపెండెంట్ పేరెంట్ పెన్షన్, పెన్షనర్లు మరణిస్తే ఏంచేయాలి, పెన్షన్ ప్రయోజనాల కోసం అర్హత అండ్ డీఎస్సీ, ప్రయాస్ – పదవీ విరమణ రోజున పీపీఓ, పెన్షన్ అండ్ ఈడీఎల్ఐ కాలిక్యులేటర్పై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్లు ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నామన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ బకాయి ఉన్న పింఛనుదారులు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించాలన్నారు. -
ఇంటి బాట నుంచి పోరుబాటకు..
● రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు ● కూటమి ప్రభుత్వం నిర్ణయంతో అవస్థలు కొత్తపేట: ఇంటింటికీ రేషన్ సరకులు అందించే ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది.. ఈ నిర్ణయంతో జిల్లాలో 710 మంది మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు, హెల్పర్లను ఉపాధి కోల్పోయారు. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరుబాటకు సిద్ధమవుతామని జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు హెచ్చరిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 ఎండీయూలను తీసుకుని ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున మొత్తం 18,520 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ జీఓ జారీ చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో అనేక మంది ఆపరేటర్లు, హెల్పర్లు వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడ్డారు. 2027 జనవరి వరకూ అగ్రిమెంట్ ఉండగా, కేవలం వైఎస్సార్ సీపీ హయాంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారనే సాకుతో కక్షగట్టి, 20 నెలల మందుగానే ఎండీయూ వ్యవస్థ రద్దుకు ఈ నెల 20న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 355 ఎండీయూ వాహనాలకు సంబంధించి 355 మంది ఆపరేటర్లు, 355 మంది హెల్పర్లు పని చేస్తుండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి కోల్పోనున్నారు. వారి డిమాండ్లు ఇవీ.. ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించి, ఈ కాలవ్యవధి ఉన్నంత వరకూ ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలి. లేదా తమ సేవలను వేరే శాఖలకు మార్చాలి. కార్మిక చట్టం కింద ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా , ముందస్తు సంప్రదింపులు లేకుండా తమను విధుల నుంచి తొలగించినందుకు తగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ అధికార, ప్రతిపక్ష నాయకులకు వినతిపత్రాలు సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలి ఎండీయూ వ్యవస్థ ద్వారా కరోనా కాలంలోనూ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలు అందించాం. ఈ వ్యవస్థ ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా వ్యవస్థను రద్దు చేసి, మా జీవనోపాధికి గండి కొట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదు. పునరాలోచించి ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – బొంతు రామదాసు, అధ్యక్షుడు, జిల్లా ఎండీయూ ఆపరేటర్ల యూనియన్, అయినవిల్లి -
అభ్యసనం.. మరింత పటిష్టం
● 1, 2 తరగతుల్లో మెరుగైన అభ్యసనానికి ఎఫ్ఎల్ఎన్ ● ఓడలరేవు బీవీసీ కళాశాలలో డీఆర్పీలకు శిక్షణ రాయవరం: పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో మంచి బోధన జరిగినప్పుడే విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఇందులో భాగంగా 2023 నుంచి విద్యార్థి అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్)లో భాగంగా ఎన్జీవో సంస్థ ప్రథమ్ భాగస్వామ్యంతో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నూతన విద్యా విధానం–2020లో భాగంగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. నిపుణ్ భారత్ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎర్లీ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)ను తీసుకొచ్చింది. ఇందులో ప్రీ ప్రైమరీ–1, 2ను అమలు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ–1లో 3–4 ఏళ్ల చిన్నారులకు, ప్రీ ప్రైమరీ–2లో 4–5 ఏళ్ల చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తారు. ప్రీ ప్రైమరీలోనే పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాలను అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీలో 1, 2 తరగతులకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి రెండో తరగతి నుంచి మూడో తరగతికి వెళ్లే విద్యార్థులంతా ఆయా తరగతుల అభ్యసనా సామర్థ్యాలను కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నారు. మండలానికి ముగ్గురు ఎస్జీటీలను డీఆర్పీలుగా ఎంపిక చేసి వారికి రెసిడెన్షియల్ మోడ్లో శిక్షణ అందిస్తున్నారు. దీనికి ప్రతి జిల్లాలో మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎఫ్ఎల్ఎన్ అమల్లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను జ్ఞాన జ్యోతిగా, ప్రాథమిక విద్యను జ్ఞాన ప్రకాష్గా పేర్కొన్నారు. రేపటి నుంచి రెండో దశ శిక్షణ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఎంపికై న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ (డీఆర్పీ)లకు మొదటి దశ శిక్షణ 2023 జూలైలో ఇచ్చారు. రెండో దశ అమల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 25 వరకు కేఆర్పీలకు విజయవాడలో శిక్షణిచ్చారు. ఈ నెల 27 నుంచి శిక్షణ పొందిన కేఆర్పీలు డీఆర్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు. అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి 60, ఏలూరు 88, తూర్పుగోదావరి 57, కాకినాడ 63, కోనసీమ జిల్లా నుంచి 66 మంది డీఆర్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వచ్చే నెల 5 నుంచి ఆయా జిల్లాల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. కచ్చితంగా హాజరు కావాలి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో పునాది అభ్యసనం బలంగా ఉండాలనే ఉద్దేశంతో జ్ఞాన్ జ్యోతి, జ్ఞాన ప్రకాష్ ప్రోగ్రామ్స్ను గతేడాది జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేశాం. రెండో దశ అమల్లో భాగంగా తొలుత డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి డీఆర్పీ శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం మంచి ఫలితాలు వస్తాయి ఎఫ్ఎల్ఎన్ను సమర్ధవంతంగా అమలు చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. తెలుగు, గణితంలో ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థికి మంచి పునాది ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం సమర్ధవంతంగా అమలుకు ఆదేశాలు ఇచ్చాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో భాగంగా యాక్టివిటీస్ ప్రదర్శిస్తున్న డీఆర్పీలు (ఫైల్) -
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
అమ్మా నాన్నా లేరని.. ఇక రారని
ఫ చలించిన పసి హృదయాలు ఫ కళ్లెదుటే తల్లిదండ్రుల మృతితో షాక్ అయిన పిల్లలు ఫ జాతీయ రహదారి దేవరపల్లి వద్ద హృదయ విదారక ఘటన దేవరపల్లి / గోకవరం : పసిప్రాయం చిన్నబోయింది.. తల్లిదండ్రులు తమ కళ్లెదుటే మృత్యువాత పడడం చూసి గుండె ఆగినట్టు అయ్యింది. తమ ఆలనాపాలనా చూసే అమ్మానాన్న విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ పసివాళ్లు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.. తల్లిదండ్రులతో కలసి నానమ్మ ఇంటికి వెళుతున్నామన్న ఆ చిన్నారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. అనుకోని ప్రమాదంలో తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పేడూరి పెదబేబీ (30), దేవరపల్లి సమీపంలో యాదవోలుకు చెందిన తుంటా దుర్గాప్రసాద్ (35)కు సుమారు 13 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. వివాహం అనంతరం దుర్గాప్రసాద్ గోపాలపురంలోనే తాపీ చేస్తుండగా, పెదబేబీ అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరికి కుమార్తె ప్రవల్లిక, కుమారుడు ఇమ్మానుయేల్ ఉన్నారు. కుమార్తె వీరలంకపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి, కుమారుడు గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు కావడంతో శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు ఇద్దరూ పిల్లలను తీసుకుని యాదవోలుకు బైక్పై బయలు దేరారు. వీరు గుండుగొలను – కొవ్వూరు మధ్య జాతీయ రహదారిపై దేవరపల్లి డైమండ్ జంక్షన్కు వచ్చేసరికి ఆ ఇద్దరు పిల్లలు టాయ్లెట్ వస్తోందనడంతో రోడ్డు పక్కన బైక్ ఆపారు. పిల్లలను రోడ్డుకు అటువైపు టాయ్లెట్కు పంపించారు. తన సోదరుడికి తీసుకు వెళుతున్న మామిడి పండ్లను దుర్గాప్రసాద్ సర్దుకుంటుండగా వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి భార్యాభర్తలను ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదబేబీ, దుర్గాప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, టాయ్లెట్కు వెళ్లిన పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ కాలు తెగి దూరంగా పడిపోయింది. తమ కళ్ల ఎదుటే తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో పిల్లలు ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆనందం ఆవిరి అప్పటి వరకూ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపిన పిల్లలు తల్లిదండ్రులు ఇక లేరని తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణంతో ప్రవల్లిక, ఇమ్మానుయేలు దిక్కులేని వారిగా మిగిలారు. ప్రమాద ఘటనను కళ్లారా చూసిన ఆ చిన్నారులు షాక్కు గురయ్యారు. అమ్మా నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు. గోపాలపురంలో విషాదం భార్యాభర్తలు మృతి చెంది పిల్లలు అనాథలు కావడంతో గోపాలపురంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులతో సత్ససంబంధాలు కలిగిన వీరు ప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనాథలైన చిన్నారులను తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. మధ్యాహ్నం తాపీ పని ముగించుకుని.. దుర్గాప్రసాద్ గ్రామంలో తాపీ పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం వరకూ పనిచేసి ఇంటికి వచ్చిన అతను భార్యా పిల్లలతో కలసి సరదాగా గడిపేందుకు తన గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల కిందట పెదబేబీ తన భర్త దుర్గాప్రసాద్తో కలసి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో తోటి అంగన్వాడీ టీచర్కు సంబంధించిన ఫంక్షన్లో పాల్గొంది. ఈ సమయంలో తమతో కలసి ఎంతో సందడి చేసిందని ఇంతలోనే ఇలా జరిగిందని, సహచర అంగన్వాడీ సిబ్బంది బోరున విలపించారు. -
మట్టిమాయం చేసేందుకు...
గోపాలపురం మండలం గంగోలు పెద్దచెరువులో జేసీబీలతో మట్టి తవ్వకాలు ఫ దందాకు తెర లేపిన టీడీపీ ఫ వాటాలు పంచుకుంటున్న వైనం ఫ కూటమిలో భాగస్వాములకు మొండిచేయి గోపాలపురం: మట్టి దందాకు తెరలేపారు.. అందినకాడకు తవ్వేస్తున్నారు.. అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. గోపాలపురం మండలం గంగోలు, భీమోలు, కరిచర్లగూడెం, గోపాలపురం గ్రామాల్లోని పెద్ద చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం చెరువులో మట్టిని తరలించుకునేందుకు ప్రభుత్వానికి నామమాత్రంగా ఫీజు చెల్లించి ఆయకట్టు రైతులు తీసుకోవచ్చు. అనుమతులు వచ్చాక ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై మట్టిని తరలించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. దీనికి నీళ్లు వదిలి అసలు రైతులకు కాకుండా ఆయా గ్రామాల టీడీపీ నాయకులు మట్టిని ఇటుక బట్టీలకు లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రైతులకు మొండిచేయి చూపి మట్టిని రాత్రనక పగలనక ఒక్కో చెరువులో రెండు జేసీబీలు, 15 లారీలతో తరలిస్తున్నారు. గంగోలు పెద్ద చెరువు నుంచి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఇటుక బట్టీలకు మట్టిని తీసుకెళ్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల్లో నియోజకస్థాయి ప్రతినిధి వాటాగా 70 శాతం, మిగిలిన 30 శాతం స్థానిక టీడీపీ నాయకులు పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని, 15 వేల క్యూబిక్ మీటర్లకు తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇటువైపు చూడడం లేదు. మట్టి తరలింపు లారీల రాకపోకలతో ఆయా గ్రామాల్లో రోడ్లు ఛిద్రంగా మారుతున్నాయని, లారీలో తరలించే మట్టి సుమారు 40 నుంచి 45 టన్నుల బరువు ఉండటంతో రోడ్లు గోతులు పడుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మరిన్ని గ్రామాల్లో మట్టిని అక్రమంగా తరలించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. తవ్వకాలపై ఫిర్యాదులకు.. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులు మొండిచేయి చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలోనూ వారికి వాటాలు ఇవ్వకపోవడంతో ఆయా పార్టీల నాయకులు అధిష్టానానికి తెలియజేసేలా, మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసేందుకు కార్యాచరణ చేసుకున్నట్లు సమాచారం. -
ఐఐఎఫ్టీలో సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ): స్థానిక జేఎన్టీయూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) క్యాంపస్లో గురువారం ఎగుమతి– దిగుమతి నిర్వహణపై సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. దీనిని ఆన్లైన్లో ఐఐఎఫ్టీ వీసీ రాకేష్మోహన్ జోషి ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు, దాని అనిశ్చితి తెలుసుకోవడంతో పాటు అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్మించడంలో ఈ ప్రోగ్రామ్ ఏవిధంగా సహాయపడుతుందో వివరించారు. ఈ సందర్భంగా ఐఐఎఫ్టీ కాకినాడ హెడ్ రవీంద్రసారథి మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి నిర్వహణలో అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది మంచి విలువైన కోర్సు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తలు, సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థ శంకర్రాయ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్లాన్.. అట్టర్ఫ్లాప్
● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన నిర్మాణాలు ● ప్లాన్లు ఇవ్వడానికి సర్వేయర్ల నిరాకరణ ● పుర ప్రజలకు గుదిబండగా జీఓ–20 సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా సర్కారు నిర్ణయాలు తయారయ్యాయనే విమర్శ వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యవస్థల్లో ప్రభుత్వం తెస్తున్న మార్పులతో మొదటికే మోసం వస్తోంది. మూడు నెలల క్రితం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) కోసం విడుదల చేసిన జీఓ–20 నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు అవరోధంగా మారింది. ఈ జీఓ దెబ్బకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి ప్లాన్లు అక్కడే చతికిలపడ్డాయి. ఈ జీఓ అమలులోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపన్నుల నుంచి మధ్య తరగతి వరకూ వారి స్థాయికి తగ్గట్టుగా నిర్మించుకునే ఇళ్లకు ముహూర్తాలు చూసుకుంటారు. అన్నీ చూసుకుని పనులు మొదలు పెట్టాలంటే ముందుగా బిల్డింగ్ ప్లాన్లకు అనుమతి రావాలి. దీనిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో నిర్మాణదారులకు పెద్ద సమస్యగా మార్చేసి, చుక్కలు చూపిస్తోంది. కొత్తగా భవనాలు నిర్మించుకోవాలనే వారికి మున్సిపల్ ప్లాన్లు ఇచ్చేందుకు సర్వేయర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఇలా.. పట్టణాలు, నగరాల్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్ను సంప్రదించి, ప్లాన్ రెడీ చేసుకుంటారు. దరఖాస్తు, ప్లాన్తో పాటు సంబంధిత సొమ్మును కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చెల్లించిన అనంతరం ఆ ఫైల్ ఆన్లైన్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చేరుతుంది. న్యాయ, సాంకేతికపరమైన అంశాలతో పాటు నిబంధనలను పరిశీలించిన తర్వాత టౌన్ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనం నిర్మిస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సర్వేయర్దే బాధ్యత కూటమి సర్కారు కొత్తగా జారీ చేసిన జీఓ–20 ప్రకారం ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ప్లాన్ గీసిన సర్వేయర్ లేదా ఇంజినీర్ పైనే మొత్తం బాధ్యత పెట్టారు. ప్లాన్ వేసిన అనంతరం సర్వేయర్లు బేస్మెంట్, లింటల్, స్లాబ్లు.. ఇలా వివిధ దశల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోతే ఆ విషయాన్ని కూడా ప్లాన్ వేసిన సర్వేయరే అప్లోడ్ చేయాలి. వాస్తవానికి ఈ ప్రక్రియను మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షించాలి. అన్ని అధికారాలూ ఉండే మున్సిపల్ అధికారులకు కాకుండా తమపై ఈ బాధ్యత పెడితే ఎలాగని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడైనా ఉల్లంఘనలుంటే ప్లాన్ వేసిన సర్వేయర్ లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం వారిని బాధ్యులను చేస్తారు. ఇదెంతవరకూ సహేతుకమని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ పుణ్యమా అని సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు మూడు నెలలుగా ముందుకు రావడం లేదు. ప్లాన్ వేస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయంతో వారు ఒకవిధంగా పెన్డౌన్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఒక ప్లాన్ తయారు చేసి, అప్లోడ్ చేసి, అనుమతి లభిస్తే భవన యజమాని నుంచి రూ.ఐదారు వేలు, మరీ ఎక్కువైతే రూ.10 వేలు వస్తాయి. ఈ జీఓ అమలు పుణ్యమా అని చేయని తప్పునకు తామెందుకు బాధ్యత వహించాలని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో మూడు నెలలుగా ప్లాన్లు నిలిచిపోయాయి. దీనిపై భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ నగరంజీఓలో నిబంధనలు సడలించాలి జీఓ–20లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యలు సవరించడం ద్వారా ఈ జీఓ మరింత ఫలవంతమవుతుంది. భవన నిర్మాణాల్లో యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు లైసెన్స్ సర్వేయర్లను బాధ్యులను చేయడం సరైంది కాదు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించాం. జీఓ అమలులో లైసెన్స్ హోల్డర్ల హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా ఉండేలా చూడాలి. – సత్తి రాంబాబు, అధ్యక్షుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఇదీ పరిస్థితి కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 100 మంది సర్వేయర్లున్నారు. ప్లాన్ల ద్వారా కార్పొరేషన్కు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.40 లక్షల ఆదాయం వస్తూంటుంది. గడచిన మూడు నెలలుగా రూ.రెండు మూడు లక్షలు కూడా రావడం లేదు. సుమారు వెయ్యి ప్లాన్లు ఆగిపోయాయని చెబుతున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్ల వద్దకు గతంలో నెలకు 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చేవి. ఏడాదికి సుమారు 120 ప్లాన్లు అప్లోడ్ అవడంతో రూ.52 లక్షల ఆదాయం వచ్చేది. జీఓ–20 కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. పెద్దాపురం మున్సిపాలిటీలో నలుగురు సర్వేయర్లున్నారు. ప్లానింగ్ ద్వారా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.లక్ష వస్తే గొప్పన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ప్లాన్లు ఇవ్వడం లేదు. తుని మున్సిపాలిటీలో 20 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రతి నెలా 60 వరకూ ప్లాన్లు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. జీఓ–20 అమలులోకి వచ్చాక ప్లాన్లు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలో సుమారు 250 మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30కి మించి దరఖాస్తులు రావడం లేదు. నిడదవోలు మున్సిపాలిటీలో నలుగురు ప్రైవేటు సర్వేయర్లున్నారు. ఏటా ప్లాన్ల కోసం 10 దరఖాస్తులు వచ్చేవి. జీఓ–20 విడుదలైన తరువాత ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అమలాపురం మున్సిపాలిటీలో 20 మంది ప్రైవేటు సర్వేయర్ల వద్దకు జీఓ–20కి ముందు ప్రతి నెలా 25 నుంచి 35 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు వచ్చేవి. ఈ జీఓ వచ్చిన తరువాత సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మండపేట మున్సిపాలిటీలోని 15 మంది ప్రైవేటు సర్వేయర్లు నెలకు సుమారు 20 ప్లాన్లు ఇస్తూంటారు. మున్సిపాలిటీకి నెలకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. జీఓ–20తో నెలకు కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వస్తున్నాయి. సర్వేయర్లు ప్లాన్లు తయారు చేయడం ఆపేశారు. -
వైభవం.. నారసింహుని కల్యాణం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో శనివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం విష్వక్సేన పూజతో అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పెద్దింటి వెంకట శ్రీనివాస్ ఈ కల్యాణం జరిపించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. మహా జ్యేష్టాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి మూలవరులకు వచ్చే నెల 11న మహా జ్యేష్టాభిషేక ఏర్పాట్లపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, అర్చకులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం అంతర్వేది దేవస్థానం కార్యాలయంలో అర్చకులతో చర్చించారు. సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో స్వామి మూలవర్లకు మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్ రూ.400గా నిర్ణయించామన్నారు. స్వామిని చూసి.. మది మురిసిమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. తెల్లవారు జామున అర్చకులు సుప్రభాత సేవ, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతిని కనుల పండువలా జరిపించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు. వచ్చే నెల 5 నుంచి కల్యాణోత్సవాలు స్వామివారి తిరు కల్యాణోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఈఓ సత్యనారాయణరాజు తెలిపారు. జూన్ 9 వరకూ ఈ కల్యాణోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. బౌద్ధ భారతంగా తీర్చిదిద్దాలన్నదే ఆశయం అమలాపురం టౌన్: దేశాన్ని బౌద్ధ భారతంగా తీర్చిదిద్దాలన్నదే తన తాతయ్య డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయమని ఆ మహానీయుని మనమడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) అధ్యక్షుడు భీమారావు యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. తన తాతయ్య ఆశయాన్ని నెరవేర్చేందుకు తాను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్ర శాఖ స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా యశ్వంత్ అంబేడ్కర్, సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి నికాడే హాజరయ్యారు. సొసైటీ రాష్ట్ర శాఖ కన్వీనర్ ఎం.మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థను 1955లో తన తాతయ్య డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్థాపించారని గుర్తు చేశారు. 1956లో నాగపూర్లో దీక్ష భూమి వద్ద ఐదు లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పారు. త్వరలోనే బీఎస్ఐ ఆంధ్ర శాఖకు కొత్త కమిటీని నియమిస్తామని చెప్పారు. ఈ జిల్లాలో అంబేడ్కర్ అనుచరులు, అభిమానులు చాలా మంది ఉన్నారని.. వీరంతా బుద్ధిజం వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు పెనుమాల సుధీర్, కార్యదర్శి కె.వెంకటరమణ, బీఎస్ఐ రాష్ట్ర నాయకులు మట్ట వెంకట్రావు, పెనుమాల చిట్టిబాబు, టి.అజయ్ బోస్, డాక్టర్ డి.చిన్న కేశవులు, బి.రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. దరఖాస్తులకు గడువు పెంపు రాయవరం: టీచర్ల బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీ దరఖాస్తులకు ఒక రోజు గడువు పెంచారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శనివారంతో గడువు ముగియగా, ఈ దరఖాస్తుల గడువును ఆదివారం రాత్రి 11.45 గంటల వరకు పెంచినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నోడల్ డీఈఓ పి.రమేష్ తెలిపారు. -
విద్యుదాఘాతానికి తాపీమేస్త్రి మృతి
జగ్గంపేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు జగ్గంపేట ఎస్సై రఘునందనరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామానికి చెందిన సుంకరరాజు (35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను స్థానిక బాలాజీ నగర్లో ఓ ఇంట్లో తాపీపని చేస్తున్నాడు. శనివారం యథావిధిగా ఉదయం పనిలోకి వచ్చిన రాజు శ్లాబ్ వేసే నిమిత్తం కర్రలు కోస్తుండగా కర్రలు కోసే మెషీన్ వైర్లు ప్రమాదవశాత్తూ తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మహిళకు గాయాలు పిఠాపురం: గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఒక మహిళకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వెళుతున్న పాల ట్యాంకర్ గొల్లప్రోలు టోల్గేట్ దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ వేయడంతో దాని వెనుక వస్తున్న ఆటో అదుపుతప్పి ట్యాంకర్ని ఢీకొంది. ఆటోలో ఉన్న డ్రైవరు గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన మేడిద ధర్మేంద్ర వరప్రసాద్ (34), అదే గ్రామానికి చెందిన బి.లోవకుమారిలకు గాయాలయ్యాయి. ఇందులో వరప్రసాద్ మృతి చెందగా, లోవకుమారి చికిత్స పొందుతోంది. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో యువకుడు.. రాజోలు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై కె.నరసింహారావు కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పొదలాడకు చెందిన బత్తుల వంశీకృష్ణరాజు (19) పాల ప్యాకెట్ కోసం మోటార్ సైకిల్పై ఆ గ్రామంలో సెంటర్కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. తాటిపాక నుంచి మోటార్ సైకిల్పై రాజోలు వస్తున్న కొప్పాడి రాజీవ్, మొగలి గణేష్లు ఢీకొట్టారు. దీంతో వంశీకృష్ణరాజు తలకు తీవ్రగాయం కావడంతో వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంశీకృష్ణ విజయవాడలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మృతితో తండ్రి బత్తుల దొరరాజు కన్నీరు మున్నీరుగా విలపించారు. దొరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. -
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
ఫ కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం ఫ వర్షాన్నీ లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తులు కొత్తపేట: దినదిన ప్రవర్థమానంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పులకించింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ‘ఏడు శనివారాలు– ఏడు ప్రదక్షిణలు’ నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరస్వామిని నూతన దంపతులు దర్శించుకుని తరించారు. దేవదాయ –ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. అనంతరం ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.48,99,380 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో నీరుసించాయ్...
డెల్టా కాలువ వ్యవస్థ కాలువల వ్యవస్థ ఇలా... మధ్య డెల్టాలో పంట కాలువల వ్యవస్థను పరిశీలిస్తే.. ధవళేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి లొల్ల లాకుల వరకూ మెయిన్ కెనాల్ 13.20 కిలోమీటర్లు కాగా అక్కడి నుంచి ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ 75.64 కిలోమీటర్లు ఉంటుంది. అమలాపురం కాలువ 64.210 కిలోమీటర్లు. దీని పరిధిలో బెండా కెనాల్ 45 కిలోమీటర్లు. పి.గన్నవరం బ్యాంకు కెనాల్ 72.300 కిలోమీటర్లు. మొత్తం మధ్య డెల్టాలో 225.35 కిలోమీటర్ల ప్రధాన పంట కాలువలు ఉన్నాయి. ప్రధాన పంట కాలువలు, వాటి అనుబంధంగా ఉన్న చానల్స్, డైరెక్ట్ పైప్ (డీపీలు), చానల్స్కు అనుబంధంగా ఉన్న పంట బోదెలు కలిపి మొత్తం వెయ్యి కిలోమీటర్ల నడివిడి ఉంటోందని అంచనా. అలాగే తూర్పు డెల్టాలో కొంత భాగం ఇప్పుడు కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చింది. కోటిపల్లి బ్యాంకు కెనాల్ పరిధి సుమారు 35 కిలోమీటర్లు. కోరంగి కాలువ 33 కిలోమీటర్లు కాగా మండపేట కాలువ 21 కిలోమీటర్లు. మొత్తం కలిసి 89 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇవి కాకుండా డీపీలు, చానల్స్, పంట బోదెలు కలిపి 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని అంచనా. అడ్డుకట్టలు.. ఎవరూ అడగరు! సఖినేటిపల్లి లాకుల వద్ద పి.గన్నవరంలో బ్యాంకు కెనాల్ దుస్థితి ఇది. ప్రధాన కాలువకు ఇలా అడ్డుకట్ట వేసి వదిలేశారు. క్లోజర్లో ఆధునీకరణ పనుల అటుంచి కనీసం అడ్డకట్టలు తొలగించే వారే లేకపోయారు. దీని దిగువన ఉన్న రెండు చానళ్లపై సుమారు 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. లాకుల వద్ద చేరే నీటి మట్టాన్ని బట్టీ చానళ్లకు నీరు విడుదల చేస్తారు. రబీలో వంతుల వారీ విధానం, నీటి ఎద్దడి సమయంలో శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. చిట్టడవి కాదండోయ్.. తూడు, గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది పంట కాలువ అంటే నమ్మకం కలగదు. కానీ ఇది అంబాజీపేట మండలం పరిధి అవిడి నుంచి మాచవరం వరకూ ఉన్న చానల్. దీనిపై రెండు మండలాల పరిధిలో సుమారు 900 ఎకరాలు ఆయకట్టు ఉంది. గత రబీలో నీరందక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇటువంటి చోట కనీసం జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడం గమనార్హం. ‘కాలువ’రపాట్లు ఇది పంట బోదెను తలపిస్తోంది కదా. కానీ ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినవిల్లి మండలం చింతపల్లి లాకుల వద్ద లాకు చాంబర్కు అనుబంధంగా ఉన్న కాలువ ఇది. దీని దిగువన అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 5 వేల ఎకరాలు చేపల చెరువులకు, తాగునీటి ప్రాజెక్టులకు నీరందించే కాలువ ఇలా చిక్కిపోయింది. సాక్షి, అమలాపురం: పచ్చని సిరులు పండించేందుకు జలజల పారే ధారను తీసుకెళ్లే పంట కాలువలు రూపురేఖలను కోల్పోయాయి.. పాలకుల నిర్లక్ష్యానికి నీరసించాయి.. ‘పెంట’ కాలువలను తలపిస్తున్నాయి.. డెల్టా శిల్పి సర్ ఆర్థర్ కాటన్ చేతి నుంచి పంట కాలువలు ఊపిరిపోసుకున్నాయి. గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేశాయి. సుమారు 140 ఏళ్లుగా లక్షలాది ఎకరాల్లో వరి, కొబ్బరి, అరటి, పోక, కంద, చేమ, కర్రపెండలం తదితర పంటలకు.. చేపలు, రొయ్యల చెరువులకు.. పదుల సంఖ్యలో ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులకు నీరందిస్తున్నాయి.. అలాంటి డెల్టా కాలువల వ్యవస్థ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో చిక్కి శల్యమవుతున్నాయి. ఆక్రమణల బారిన పడి కనుమరుగవుతున్నాయి. తూడు, గుర్రపుడెక్కలతో పూడుకుపోతున్నాయి. ఈ కాలువల ద్వారా సహజ ప్రవాహం లేక శివారు, మెరక చేలకు రబీలోనే కాదు.. ఖరీఫ్లో సైతం సాగునీరందని పరిస్థితి నెలకొంది. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.1,160 కోట్లతో పంట కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారు. ఆయన మృతితో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. లేకుంటే డెల్టా కాలువల వ్యవస్థ మరో విధంగా ఉండేది. జిల్లాలో డెల్టా పరిధిలో 2,52,742 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు కాగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు ఉంది. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోందని అంచనా. అంతటి కీలకమైన డెల్టాలో కాలువ వ్యవస్థ దుస్థితిపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్టు’ ఇది. నీరెళ్లే దారేది నాయనా! రాయవరం మీదుగా మండపేట నుంచి వెళ్లే పంట కాలువ పరిస్థితి ఇది. ఈ కాలువపై సుమారు 4 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువల్లో గుర్రపు డెక్క, తూడు, చెత్తా చెదారంతో నిండిపోయింది. రబీలోనే కాాదు, ఖరీఫ్లో నీటి సరఫరాకు అవాంతరం ఏర్పడుతుంది. అయినా ఈ కాలువ వైపు చూసేవారు లేకపోయారు. క్లోజర్ పనుల్లో కనీసం తూడు, గుర్రపుడెక్క అయినా తొలగించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ‘మట్టి’... ఉంది కాబట్టి పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయింది. సాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పి.గన్నవరం బ్యాంకు కెనాల్ పరిధిలో లొల్ల నుంచి సఖినేటిపల్లి వరకూ పెద్ద సంఖ్యలో ఉన్న వంతెనల వద్ద ఇలా మట్టి పేరుకుపోయింది. చెత్తతో పూడుకుపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతోంది. పి.గన్నవరం బ్యాంకు కెనాల్పై వైవీ పాలెం వంతెన వద్ద మట్టి ఇలా నిలిచిపోయింది. ఖరీఫ్లోనూ కష్టాలే.. అమలాపురం నుంచి చల్లపల్లి ప్రధాన పంట కాలువ ద్వారా అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల పరిధిలో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీనిపై మరో మూడు వేల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. గతంలో ఈ పంట కాలువల్లో పూడిక తొలగించారు. తిరిగి యథావిధిగా మూసుకుపోయింది. ఈ కాలువ పరిధిలో చిందాడగరువు, రోళ్లపాలెం, గూడాల, తాడికోనలకు ఖరీఫ్లోనే నీరందడం లేదు. డెల్టాలో ‘పెంట’ కాలువలు జిల్లాలో 313 కిలోమీటర్లలో విస్తరించిన వైనం ఎక్కడికక్కడే పూడుకుపోయి అధ్వానం రూ.5 కోట్లు కేటాయించినా ప్రారంభం కాని పనులు మరో పక్షం రోజుల్లో కాలువలు తెరిచే అవకాశం -
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడదాం..
● వైఎస్సార్ సీపీ ముఖ్య నేతల పిలుపు ● పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష రావులపాలెం: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడదామని వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పెద్దలు సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థగత నిర్మాణంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గోపాలపురంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నాయకులు, నియోజవర్గ ఇన్చార్జులు హాజరయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకం గురించి చర్చించారు. అలాగే వచ్చే నెల 4న నిర్వహించనున్న ప్రభుత్వ వైఫల్యాలపై జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడారు. అనంతరం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడి ప్రజల పక్షాన నిలబడాలని నాయకులు నిర్ణయించారు. సమావేశంలో అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పీఏసీ సభ్యులు పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి సూర్యారావు, పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొన్నారు. -
థియేటర్లు మూసివేత.. చంద్రబాబు సర్కార్పై చెల్లుబోయిన వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం సమస్యను సరిదిద్ద లేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతుంది. అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా’’ అంటూ వేణు గుర్తు చేశారు.‘‘ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు వండి వార్చారు. అబద్దాన్ని ప్రజలకు చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా, ప్రజలను ఆదుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎక్కడ రాజీ పడలేదు. ప్రతి పక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపి నిత్యం ఒక అబద్ధాన్ని వండివార్చేవారు. అప్పట్లో రాష్ట్రం అప్పులపాలు అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారు. అప్పులను కప్పి పుచ్చటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’’ అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తిరుమల లడ్డూపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు చేయలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై గతంలో తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మీ కేంద్రమంత్రే దానిని అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత ఇసుక స్కీమ్ కాదు.. స్కామ్. గోదావరిలో ఇసుక అక్రమ దారి అంటూ ఈనాడు పేపర్ లోనే ఐటం వచ్చింది. గోదావరిలో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ జరుగుతుంది. 80 డ్రెడ్జర్లతో పనిచేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు పనిచేస్తున్నట్టా లేనట్టా?బోట్స్మెన్ సొసైటీలకు చెల్లించాల్సిన డబ్బులు యంత్రాలకు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ మొత్తం అధికార పార్టీ నేతల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది. ఆదాయం పెరిగింది. ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఆదాయం తగ్గింది. తప్పు ఎక్కడ జరుగుతుంది?. కేవలం ఏడాది కాలంలో లక్షా 59 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. ఇసుక, మద్యంపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజమండ్రి పరిధిలో గోదావరిలో 80 డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే మీ నాయకుల ప్రమేయం లేదా?. గోదావరి లో 80 డ్రెడ్జర్లతో జరుగుతున్న తవ్వకాలు వెనుక ఎవరున్నారు? స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడున్నా, విదేశాల్లో ఉన్నా.. ఇసుక వ్యవహారంపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
యోగాపై అవగాహన కార్యక్రమాలు
అమలాపురం రూరల్: రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ స్థాయి వరకు యోగా అభ్యసన అవగాహన కార్యక్రమాలు నెల రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి యోగ అభ్యసన, శిక్షణ కార్యక్రమాలవిధి విధానాలపై సమీక్షించారు. రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీని పునః ప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని జేసీ నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్ ఎల్పిజి, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి డీలర్ల ద్వారా రేషన్ సరఫరా, దీపం–2 సిలిండర్ ఖరీదు ముందస్తుగానే ఆన్లైన్లో లబ్ధిదారులు ఖాతాకు జమ చేయడం, డెలివరీ అంశాలపై సమీక్షించారు. డీఎస్ఓ ఉదయ భాస్కర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కుమారి ఎం.బాలసరస్వతి, ఎల్పీజీ డీలర్ల ప్రతినిధి త్రినాథ్, రేషన్ డీలర్ల ప్రతినిధి అడపా వెంకట రమణ పాల్గొన్నారు. -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో.. ఏం చేయాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. సేవ చేయడానికి వచ్చిన తమను ఏఈఓ కె.కొండలరావు దూషించారంటూ మంచిర్యాల భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో కాషాయ రంగు చీరలు ధరించిన మహిళా సేవకులు.. భక్తులకు కనిపిస్తూంటారు. వీరందరూ తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్న స్వచ్ఛంద సేవకులు. వీరందరూ దేవస్థానంలో తమకు నిర్దేశించిన సేవలు ఉచితంగా అందిస్తూంటారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధిలో సేవ చేద్దామనే ఆశతో వస్తున్నా.. రత్నగిరిపై ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సేవా విభాగం లేక.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి రోజూ వేలాదిగా మహిళా సేవకులు వివిధ చోట్ల సేవలందిస్తూంటారు. అలాగే, పరకామణి అంటే హుండీ లెక్కింపుతో పాటు ఇతర సేవలను పురుషులు అందిస్తూంటారు. భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీలో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. దాని ఫోన్ నంబర్ టీటీడీ వెబ్సైట్లో ఉంటుంది. సేవకు వెళ్లాలనుకునేవారు ఆ నంబర్కు ఫోన్ చేస్తే వారు పూర్తి వివరాలు చెబుతారు. దాని ప్రకారం ఆ సేవా కార్యకర్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు సేవకు రావాలి, ఎవరిని కలవాలనే వివరాలు తెలియజేస్తారు. దాని ప్రకారం భక్తులు అక్కడకు వెళ్లి సేవ చేయవచ్చు. ఇటువంటి ఏర్పాటు అన్నవరం దేవస్థానంలో లేదు. గతంలో సేవ చేసిన వారైతే దేవస్థానంలో పరిచయం ఉన్నవారికి ఫోన్ చేసి వస్తున్నారు. కొత్తవారైతే మధ్యవర్తులను ఆశ్రయించి, మోసపోవాల్సిన పరిస్థితి. మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవా కార్యకర్తలు ఇదేవిధంగా మోసపోయారు. అన్నవరం దేవస్థానంలో సేవ చేసేందుకు మధ్యవర్తిని ఆశ్రయించగా, అతడు మరో మహిళకు ఈ పని అప్పగించాడు. ఆమె అన్నవరం దేవస్థానానికి పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసింది. తీరా ఇక్కడకు వస్తే సేవ చేయడానికి ఖాళీ లేదని, వెళ్లిపోవాలని ఏఈఓ చిరాకుపడ్డారని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ.. ఆ తరువాత రూ.300 చొప్పున వెనక్కి ఇచ్చి, మిగిలిన రూ.200 ఉంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటువంటి అవస్థలు భక్తులకు ఎదురవకుండా ఉండాలంటే అన్నవరం దేవస్థానంలో కూడా టీటీడీ తరహాలో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనంతరం, సేవ చేయాలనుకునేవారు ఆ విభాగాన్ని సంప్రదించేలా ఫోన్ నంబర్ను దేవస్థానం వెబ్సైట్లో పొందుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ·˘ Æý‡™èl²WÇOò³ çÜÓ^èle…§ýl õÜÐ]lMýS$ÌSMýS$ Cº¾…§ýl$Ë$ ఫ సేవకు దేవస్థానంలో ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి ·˘ {ç³™ólÅMýS Ñ¿êVýS… HÆ>µr$ చేయాలని భక్తుల డిమాండ్ మాకూ ఇలాగే జరిగింది సత్యదేవుని దీక్ష, ఉత్సవాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూంటాను. మా ప్రాంతం నుంచి సేవా కార్యకర్తలను అన్నవరం దేవస్థానానికి తీసుకువెళ్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దాంతో వెనక్కి వచ్చేశాం. దీనికోసం దేవస్థానంలో ఒక విభాగం ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవ చేసే భక్తులకు సమయం నిర్దేశిస్తే మేలు. – కృష్ణ, సేవా కార్యకర్త -
మినీ మహానాడులో.. టీఢీపీ
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: మినీ మహానాడు వేదికగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. కార్యక్రమ నిర్వహణ పద్ధతిగా లేదంటూ ఒకరు.. తమ నేతకు ప్రాధాన్యం దక్కలేదని మరో వర్గం.. అసలు పార్టీ కార్యాలయమే లేకపోవడమేమిటని మరొక నేత వ్యాఖ్యానించడంతో సభలో కలకలం రేగింది. స్వపక్షంలోనే నేతలు విపక్షంగా మారి ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలే ఆవేదన వెళ్లగక్కడం చూస్తూంటే టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడు శుక్రవారం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాసు వర్గం కొంత మందికే ప్రాధాన్యం ఇచ్చిందని, మిగిలిన వారిని పక్కన పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పరస్పరం విమర్శలకు దిగడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. నిర్వహించే పద్ధతి ఇదేనా? క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో క్రమశిక్షణ కొరవడిందని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) మాజీ చైర్మన్, సీనియర్ నేత గన్ని కృష్ణ ధ్వజమెత్తారు. ఒక పద్ధతి లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికే రాలేదని విమర్శించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చామని.. తన వ్యాఖ్యలు కొందరికి కోపం రప్పించినా ఫర్వాలేదన్నారు. పార్టీ క్రమశిక్షణతో నడవాలనే ఉద్దేశాన్ని కుండ బద్దలుగొట్టినట్లు వెల్లడించారు. గన్ని ప్రసంగం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. పార్టీ కార్యాలయానికే దిక్కులేదు రాజకీయాలకు కీలకమైన తూర్పు గోదావరిలో టీడీపీకి ఇప్పటి వరకూ జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయమే లేదు.. ఇక పార్టీ అంతర్గత నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గోరంట్లకు ఘోర అవమానం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలక నేతగా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఘోర అవమానం ఎదురైంది. సభా ప్రాంగణం స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీంతో కోపోద్రిక్తులైన గోరంట్ల అనుచరులు, పార్టీ నేతలు ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు వ్యవహార శైలికి నిరసనగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి నిరసనకు దిగారు. సీనియర్ నేత అనే గౌరవం కూడా లేకుండా ఫొటో పెట్టకుండా అవమానించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. దీంతో, ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లింది. ఆయన రంగంలోకి దిగి, ఎమ్మెల్యేకి సూచించడంతో చివరకు సభా వేదిక వద్ద ఉన్న బ్యానర్లో హుటాహుటిగా బుచ్చయ్య ఫొటో ఏర్పాటు చేశారు. ఆది నుంచీ ఇదే తంతు ఫ ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య కొన్నేళ్లుగా వర్గ పోరు నడుస్తూనే ఉంది. తాజాగా పేపర్ మిల్లు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేపర్ మిల్లు కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరిపై ఫోన్లో రెచ్చిపోయారు. నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. వారిద్దరి ఫోన్ కాల్ సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. ‘నువ్వు వైఎస్సార్ పార్టీలోకి బుచ్చయ్య మాట విని వెళ్లావు. ఏం పీకావు? మా మీద కామెంట్లు చేశావు. విడిచిపెడతాననుకోకు. కామెంట్లకు పనిష్మెంట్లు ఉంటాయి’ అంటూ ప్రవీణ్పై అప్పారావు ధ్వజమెత్తారు. ఫ రాజమహేంద్రవరానికి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎన్నికలు ఎప్పుడున్న స్పష్టత రావడం లేదు. ఫ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు – రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఇటీవల రాజమహేంద్రవరం బోధనాస్పత్రి వద్ద మెడికల్ షాపు వివాదం మళ్లీ అగ్గి రాజేసింది. తమకు కావాలంటే తమకే దక్కాలంటూ పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలా ప్రతి విషయంలోనూ వర్గ విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో మినీ మహానాడు జరగడం.. బుచ్చయ్యతో విభేదాల నేపథ్యంలోనే ఆయన ఫొటోకు స్వాగత ఫ్లెక్సీలో స్థానం కల్పించలేదన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎంత విభేదాలున్నా పార్టీ కార్యక్రమానికి అందరూ కలసి రావాలి తప్ప.. ఇలా రచ్చకెక్కడమేమిటని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ·˘ M>Æý‡Å{MýSÐ]l$ °Æý‡Óç߿׿Oò³ AçÜ…™èl–í³¢ ·˘ ç³§ýl®†V> fÆý‡VýSÌôæ§ýl…r* గన్ని కృష్ణ ధ్వజం ·˘ hÌêÏ A«§ýlÅ„ýS$yól OVðSÆ>áfOÆð‡™ól ఎలాగంటూ మండిపాటు ·˘ ´ëÈtMìS hÌêÏ M>Æ>ÅÌSĶæ$… లేకపోవడమేమిటన్న బొడ్డు ·˘ ïܰĶæ$ÆŠ‡ GÐðl$ÃÌôæÅ VøÆý‡…rÏ ఫొటోకు దక్కని చోటు ·˘ ¯ól™èlÌS A…™èlÆý‡Y™èl కుమ్ములాటలు బహిర్గతం అగ్నికి ఆజ్యం పోసిన పరిశీలకుడు మినీ మహానాడు వేదికగా పార్టీ బలోపేతం, అంతర్గత నిర్మాణం, నేతల ప్రాధాన్యంపై టీడీపీ శ్రేణులు ప్రశ్నించగా.. పుండు మీద కారం జల్లినట్లు.. పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర అటవీ కార్పోరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు చేసిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో మరింత ఆగ్రహావేశాలు నింపాయి. అనుకున్న పదవులు రానందువల్లనే నేతలందరూ ఇలా ఆవేదన చెందుతున్నారని అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరిశీలకుడిగా పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి.. అగ్నికి ఆయన మరింత ఆజ్యం పోస్తున్నారన్న భావన కార్యకర్తల్లో వెల్లడైంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు. -
ఖరీఫ్ ఆశలపై నీళ్లు!
ఆలస్యమే రబీ నష్టాలకు కారణం గత ఏడాది ఖరీఫ్ సమయంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. జూన్ 1న నాటికి పోలింగ్ పూర్తయ్యి కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయినప్పటికీ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జూన్ 1వ తేదీకి నీరు విడుదల చేసింది. ముందస్తు సాగుకు అనుకూలంగా నీరు విడుదల చేసినా శివారు రైతులు ఆలస్యంగా సాగు ఆరంభించారు. దీనివల్ల అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన ఖరీఫ్ కోతలు డిసెంబర్ మొదటి వారం వరకు సాగాయి. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఈ ప్రభావంతో రబీ ఆలస్యమైంది. జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలో కూడా నాట్లు వేశారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన కోతలు ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మామిడికుదురు, మలికిపురం మండలాల్లో ఇంకా కోతలు అవుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల చేలు దెబ్బతినడం, మెషీన్ కోతలు నిలిచిపోవడం, ధాన్యం రాశులు తడిసిపోయి రైతులు కనీస మద్దతు ధర కూడా పొందలేకపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జూన్ 10 తరువాత నీరు విడుదల చేస్తే ఖరీఫ్, రబీ ఆలస్యమై ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నట్టయ్యిందని రైతులు వాపోతున్నారు. సాక్షి, అమలాపురం: కోటి ఆశల ఖరీఫ్కు వాతావరణం సహకరించినా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం మోకాలు అడ్డే పరిస్థితి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమవుతోంది. ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. జిల్లాలో 2,52,742 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉండగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు. దీనిలో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోందని అంచనా. జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అనుకున్న సమయం కన్నా ముందే వస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు తగినట్టుగానే రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకనున్నాయి. తొలకరి ఇంకా రాకున్నా జిల్లాను వర్షాలు పలకరించాయి. గడిచిన మూడు రోజులుగా రోజూ క్రమం తప్పకుండా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. జిల్లాలో ఈ నెల 20వ తేదీన 21 మి.మీటర్లు, 21న 17.2 మి.మీటర్లు, 22న 12.1 మి.మీటర్లు, 23న 17.9 మి.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో గురువారం అత్యధికంగా 39.2 మి.మీటర్ల వర్షం కురిసింది. నిప్పులు కురిపించే ఎండల నుంచి ఉపశమనం కల్పిస్తూ వాతావరణం చల్లబడింది. ఈ పరిణామాలు ముందుస్తు ఖరీఫ్కు శుభారంభం. గత ప్రభుత్వంలో ముందస్తు సాగు కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు పంపిణీ చేసే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం లేకపోవడం ఆయకట్టు రైతులను నిరాశకు గురి చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలంలో గోదావరి డెల్టాలో ముందస్తు సాగుకు అనుకూలంగా జూన్ ఒకటో తేదీన పంట కాలువలకు నీరు విడుదల చేసేవారు. గోదావరి డెల్టా పరిధిలో ఒకటి, రెండు రోజులు అటూఇటూగా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కనీసం రైతులు తరఫున గళం వినిపించేవారే లేకుండా పోయారు. క్లోజర్ పనులు నత్తనడక క్లోజర్ సమయంలో చేపట్టిన పనులు అరకొరగా సాగుతున్నా ఆ పనులు కూడా ఆలస్యంగా మొదలు పెట్టారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాలో కలిపి మొత్తం రూ.ఐదు కోట్ల లోపు పనులు జరుగుతున్నాయి. కాలువలను ఏప్రిల్ 15న మూసివేస్తామన్న అధికారులు రైతుల కోరిక మేరకు 20వ తేదీ వరకు పెంచారు. తరువాత చేపల సాగు చేసే రైతులు కాసులు చెల్లించడంతో గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ 27వ తేదీ వరకు నీరు విడుదల చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత కూడా వెంటనే పనులు మొదలు పెట్టలేదు. చాలా ఆలస్యంగా పనులు మొదలు పెట్టగా, దీనికితోడు గత పక్షం రోజులలో పలు సందర్భాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో క్లోజర్ పనులు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన కల్వర్టుల నిర్మాణం మధ్యలో ఉంది. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది. ఇవికాకుండా మామిడికుదురు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో పూడిక తొలగింపు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఈ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావడం అసాధ్యమని సాగునీటి పారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే కనీసం జూన్ పదవ తేదీ నాటికై నా నీరు విడుదల చేస్తారనే నమ్మకం ఆయకట్టు రైతులకు కలగడం లేదు. 23ఎఎంపీ02: ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద మధ్యలో ఉన్న క్లోజర్ పనులు ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద మధ్యలో ఉన్న క్లోజర్ పనులు సాగుకు అడుగడుగునా అవాంతరాలే.. తొలకరి కన్నా ముందే పలకరించిన వర్షాలు వాతావరణం ముందస్తు సాగుకు అనుకూలం జూన్ 1కి కాలువలకు నీరు వదలడం అసాధ్యం 10వ తేదీకి ఇస్తే గొప్పే అంటున్న రైతులు -
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోంది
అమలాపురం రూరల్: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పటివరకు కూటమి సంకీర్ణ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ అన్నారు. అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహుజన సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ ప్రజల ఆస్తులు అమ్మి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు ప్రజలకు సూపర్ సిక్స్తో మోసపూరిత హామీలను ఇచ్చారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు భూమి పంపిణీ చేయకుండా తాత్కాలిక పథకాలతో మభ్యపెడుతూ పేదరికంలోనే ఉంచుతున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కొల్లబత్తుల సత్యం, నాయకులు గెడ్డం సంపత్రావు, అశోక్ ఉమ్మడి జిల్లాల ఈసీ మెంబర్ బత్తుల లక్ష్మణరావు, జిల్లా ఇన్చార్చి కె లక్ష్మీ భవాని పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతి లేదు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలో శనివారం నిర్వహించ తలపెట్టిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సభకు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హైకోర్టు అనుమతి కోరారన్నారు. దీనిపై నిర్ణయం వెలువడనందువలన అనుమతి లేదని, సభకు వచ్చే వారు విషయం గమనించాలని ఎస్పీ పేర్కొన్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ప్రారంభించిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ సామర్లకోట: పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలివచ్చారు. గురువారం సాయంత్రం శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ అంటే ఒక శక్తి అని, వారి జోలికి వస్తే మట్టి కరిపిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతిలోని అలిపిరి ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా స్వామీజీ వివరించారు. హిందువులు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారని అన్నారు. రామనామం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా శక్తి ఏర్పడుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది శోభాయాత్రకు తరలి వచ్చారు. సీఐ ఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పిఠాపురం రోడ్డు నుంచి పెద్దాపురం రోడ్డు మీదుగా శోభాయాత్ర ర్యాలీ పెద్దాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరి తిరిగి సామర్లకోట వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు స్వామిజీ మోటారు సైకిల్పై కూర్చుని శోభాయాత్రలో పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్అండ్బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. రౌతులపూడి గ్రామానికి చెందిన మోర్త రమేష్బాబు, గెడ్డ ప్రతాప్ మెరక చామవరం బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా రౌతులపూడి శివారు మరిడమ్మ తల్లి గుడి వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెనుక కూర్చున్న మోర్త రమేష్బాబు (15) రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన రమేష్ను రౌతులపూడి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. మృతుడికి తల్లి సత్యవతి, తండ్రి నాగేశ్వరరావు, సోదరుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా
కాకినాడ క్రైం: బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ధూమపానం వల్ల ఎదురయ్యే అనర్థాలను వాల్పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని అన్నారు. ప్రార్థనా ప్రదేశాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత శాఖతో కలిసి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాల్లో చిక్కుకున్న సొత్తును తిరిగి ఖాతాదారుడికి అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చేసిన విచారణను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన పెంపొందించాలని సూచించారు. పోక్సో, రేప్ కేసుల్లో బాధితులను విచారించేందుకు శక్తి టీం సేవలను వినియోగించుకోవాలని, ఇటువంటి కేసుల్లో 60 రోజుల్లోపు చార్జిషీటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాత కేసులు, ఆస్తి తగాదాలు, పోక్సో, రేప్, ఎన్డీపీఎస్, సైబర్ క్రైం, మిస్సింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం ఎస్డీపీవో హరిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు రామచంద్రపురం రూరల్: మండలంలోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన యువతి ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. ఆదివారపుపేట గ్రామానికి చెందిన పిచ్చిక సత్యవతి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామం ఆదివారపుపేట వచ్చారు. ఈ నేపథ్యంలో 21 రాత్రి 2 గంటల సమయంలో తల్లి సత్యవతి ఇంటిలో తన కూతురు అపర్ణ లేకపోవడం గమనించింది. పరిసరాల్లోను, బంధువు ఇళ్లల్లోను విచారణ చేసినా ఉపయోగం లేకపోవడంతో ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పట్టు వదలకుండా పోరాడుదాం
పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం స్థానిక పట్టు పరిశ్రమ కేంద్రంలో నిర్వహించిన పట్టు రైతుల సమావేశంలో పట్టు వదిలేసి పామాయిల్ సాగు చేయండి అన్న ఉన్నతాధికారుల సలహాలపై చర్చించుకున్నారు. రైతులు మాట్లాడుతూ వేలాది మంది రైతులకు జీవనోపాధి, రాష్ట్రంలో పట్టు సాగులో కీలక పాత్ర వహించే చేబ్రోలులో పట్టు సాగు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పంట కాదని ఎందరికో ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ అని ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. కొంతకాలంగా ఈ పరిశ్రమ ఇలా దిగజారిపోవడానికి జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి గీతారాణి అని, ఆమె పట్టు పరిశ్రమ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ఆమె పోలీసులతో తమపై దౌర్జన్యం చేయించి రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. పంటలు నాశనం అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని, ఆమెను తక్షణం బదిలీ చేసి పట్టు పరిశ్రమ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టు సాగు వదిలేసి పామాయిల్ సాగు చేయడం జరగని పని అని అన్నారు. పట్టు సాగులో నష్టాలు రాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి, చర్యలు తీసుకుని పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావాలని రైతులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మళ్లీ విజ్ఞప్తులు చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. పట్టు రైతులు ఉలవకాయల రాంబాబు, ఓరుగంటి సందీప్, ఓరుగంటి శ్రీను, చల్లా రామకృష్ణ, ఎలుగుబంటి బాబు పాల్గొన్నారు. చేబ్రోలులో పట్టు రైతుల సమావేశం -
అర్ధరాత్రి కారు బీభత్సం
పిఠాపురం: స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో బుధవారం అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి మోటారు సైకిల్పై వెళుతున్న ముగ్గురిని ఢీకొట్టి పాదగయ ఆలయం వద్ద పార్కింగ్లో ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా పలు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు బుధవారం అర్ధరాత్రి పిఠాపురం పాదగయ సెంటర్లో ఒకే మోటార్ సైకిల్పై చంద్రపాలెం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్థానిక ఇందిరానగర్కు చెందిన పల్లా కృష్ణ, ఏడిద వెంకటేష్, బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్రను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి పాదగయ క్షేత్రం వద్ద పార్కింగ్లో ఉన్న పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడగా పాదగయ సెంటర్లో ఉన్న పలు మోటారు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి మోటార్ సైకిలిస్టులను ఢీ కొట్టిన వైనం ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం కారులోని వారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
టీచర్లపై పనిభారం తగ్గించేందుకే 9 రకాల పాఠశాలలు
అమలాపురం రూరల్: అభ్యసన సామర్థ్యాలు పెంచి, బడి మానివేస్తున్న వారి సంఖ్యను, ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆ దిశగా జూన్ 12 నాటికి తరగతి గదులను, పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లస్టర్ అకడమిక్ టీచర్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక గది ఉండాలన్నారు. మన బడి – మన భవిష్యత్తు కింద పాఠశాల విద్యా కమిటీలకు మంజూరైన నిధుల్లో మిగిలిన నిధుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. ప్రధానమంత్రిశ్రీ పథకం కింద మంజూరైన మొదటి దశ పనులను ఈ నెల 25 నాటికి, రెండో దశ పనులను జూన్ 5 నాటికి పూర్తి చేయాలని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాకు సంబంధించి ఇప్పటి వరకూ బెల్టులు, ఆక్స్ఫర్డ్ నిఘంటువులు, 80 శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయని, మిగిలిన మెటీరియల్ జూన్ 5 నాటికి రాకుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. స్థల సమస్యను అధిగమించేందుకు బహుళ అంతస్తుల్లో పాఠశాల భవనాలు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం బాషా, సర్వశిక్ష సహాయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ జి.మమ్మీ సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, లుంగీ ధరించి ఉన్నాడని, మృతదేహం ఉన్న తీరుని బట్టి చనిపోయి సుమారు 15 రోజులు అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించామని, వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కె.గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కులం పేరుతో దూషించారంటూ నిరసన కె.గంగవరం: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట గ్రామంలో దళిత కాలనీకి చెందిన మహిళలు, పురుషులు భారీగా స్టేషన్ వద్దకు తరలివచ్చి కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు మోటారు సైకిల్పై ఏటిగట్టు వైపు వెళుతున్న సమయంలో అటుగా రోడ్డపై వస్తున్న ఉపాధి కూలీలకు మోటారు సైకిల్ హ్యాండిల్ తగిలింది. వెంటనే కూలీలు అతనిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో ఈశ్వరరావు మహిళా కూలీలను కులం పేరుతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో వారు ఈశ్వరరావును స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈశ్వరరావు కూడా రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. స్టేషన్ వద్ద నిరసన.. కోట గ్రామానికి చెందిన పలువురు వాహనాలలో భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కులం పేరుతో దూషించి మహిళలను దాడి చేసిన ఈశ్వరరావును వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొంత సేపు నిరసన చేశారు. ఈశ్వరరావు గతంలో కూడా దళితులను చిన్నచూపు చూశాడని, తమ కాలనీలో గల చెరువును తవ్వనీయకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. చెరువు లేకపోతే మాకు నీరు ఉండదని లంక భూములు సాగు చేసుకునే విషయంలో కూడా అడ్డుకుంటున్నాడని వారు నిరసన చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో) నగరం/పట్టణం పన్ను డిమాండ్ కాకినాడ 110.99 పిఠాపురం 10.17 సామర్లకోట 8.78 రాజమహేంద్రవరం 137.32 నిడదవోలు 8.47 ఏలేశ్వరం 2.61 అమలాపురం 14.72 రామచంద్రపురం 7.65 పెద్దాపురం 7.18 కొవ్వూరు 4.56 సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టినప్పటి నుంచీ బాదుడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలకు పెను భారం మోపిన సర్కారు.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, ఖాళీ స్థల, కుళాయి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం 15 శాతం చెల్లిస్తున్న ఆస్తి పన్నును 20 శాతానికి పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తోంది. పురపాలక సంస్థల్లో చాలా ఆస్తులకు అసెస్మెంట్ చేయలేదని, దీనికోసం సర్వే చేపడుతున్నామని నమ్మబలుకుతోంది. కానీ, ప్రజలకు ‘అదనపు వడ్డింపు’లు చేయడమే దీని వెనుక అసలు లక్ష్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20 శాతం అధికంగా పన్నులు వసూలు చేయాలని ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో తలమునకలవుతున్నారు. ఇదేనా సంపద సృష్టి? కూటమి అధికారంలోకి వస్తే ఏటా పెంచే 15 శాతం పన్నును తగ్గిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. గద్దెనెక్కిన కొన్ని నెలల వ్యవధిలోనే కూటమి పెద్దలు ప్రజల నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా భవనానికి నిర్మాణ సమయంలోనే కొలతలు, నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి, పన్ను విధిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో లోపాలున్నాయంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ప్రభుత్వం.. తాజాగా కొలతలు తీసుకోవాలని పేర్కొంటూ, కొత్తగా పన్ను భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20 శాతం అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు నాంది పలుకుతోంది. ఈ మేరకు పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పట్టణ స్థానిక సంస్థలో ఎంత మేర అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టాక మోపుతున్న భారాలను చూస్తూంటే.. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు గారూ.. అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. బాదుడు ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.307.89 కోట్ల పన్ను డిమాండ్ ఇక్కడ ఉంది. తాజా ‘పన్ను పోటు’లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల ప్రజలపై అత్యధిక భారం పడనుంంది. రాజమహేంద్రవరంలో అత్యధికంగా రూ.137.32 కోట్ల డిమాండ్ ఉంటోంది. సర్వే పూర్తయితే ఇక్కడి ప్రజలపై మరో రూ.15 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లో పన్నుల డిమాండ్ రూ.110.99 కోట్లు కాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ బాదుడుతో ఈ నగర ప్రజలపై మరో రూ.12 కోట్లు వడ్డిస్తారు. ఇంటింటి సర్వే చేస్తారిలా.. సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ, సర్వేయర్ల సహాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఇళ్లు, భవనాలున్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, లేదా తనిఖీ చేస్తారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. నిర్మాణ విస్తీర్ణం మేరకు పన్ను విధించారా, లేదా.. అదనపు అంతస్తులకు పన్ను విధించారా.. నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తారు. అదనపు వసూళ్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల 15లోగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీయాలని ఆదేశాలు కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో అమలు రాజమహేంద్రవరంలో రూ.15 కోట్లు.. కాకినాడలో రూ.12 కోట్ల భారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల వడ్డింపు -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి. రాజోలు దీవిలో.. రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది. కొత్త గింజలతో వ్యాపారం ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. స్వదేశీ గింజలతో వ్యాపారం సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే మార్కెట్లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది. జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా కలసిరాని పెళ్లిళ్ల సీజన్ అమాంతంగా పెరిగిన గింజల ధర పెరిగిన గింజల ధర కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది. – ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి మందకొడిగా వ్యాపారం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది. – జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి -
శిథిల భవనాలు.. పాముల పుట్టలు
సాక్షి, అమలాపురం: ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి భవనాలు.. నిర్మించి దాదాపుగా 140 ఏళ్లవుతోంది. గతంలో కనీస మరమ్మతులు చేసేవారు. కానీ మూడు నాలుగు దశాబ్దాలుగా చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు. ఫలితంగా డెల్టాలోని పంట కాలువలపై ఉన్న లాకుల వద్ద నిర్మించిన ఇరిగేషన్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. చాలా భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్ని కనుమరుగవ్వగా.. మరికొన్ని పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. చెద పుట్టలు, పాము పుట్టలు పుట్టుకొచ్చాయి. చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవుల్లా మారిపోయాయి. దీనికితోడు పాములు, విష క్రిములు వస్తూండటంతో వీటి వంక చూసేవారే లేకుండా పోయారు. గోదావరి డెల్టాలో పంట కాలువల వ్యవస్థ సక్రమంగా నడవడం, ఏటా రెండు పంటలకూ సమృద్ధిగా నీరందించే బాధ్యత ఇరిగేషన్ శాఖది. సాగునీటి యాజమాన్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎస్ఈ నుంచి లాకులను నిర్వహించే లస్కర్ (గంటా కళాసీ) వరకూ కీలకమే. లాకుల నిర్వహణ, నీటి యాజమాన్యం విధులకు, నేవిగేషన్ వ్యవస్థ విజయవంతంగా పని చేసేందుకు వీలుగా ఆయా లాకుల వద్ద అధికారులు, సిబ్బంది ఉండేందుకు వీలుగా గతంలో క్వార్టర్లు, కార్యాలయాలు నిర్మించారు. సుదీర్ఘ కాలంగా నిర్వహణకు నోచక ఇవి కాస్తా దెబ్బ తినడంతో సిబ్బంది ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఒకటి రెండు భవనాల్లో కార్యాలయాలున్నా అధికారులు రావడం లేదు. దీంతో నీటి యాజమాన్యం, లాకుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనివల్ల రబీ ఎద్దడి సమయంలో శివారు, మెరక ప్రాంతాలకు నీరందక రైతులు నష్టపోతున్న విషయం తెలిసిందే. మధ్య డెల్టాలో మూడు ప్రధాన పంట కాలువలకు నీరందించే కీలకమైన లొల్ల లాకుల వద్ద సైతం భవనాలు శిథిలావస్థకు చేరాయి. తూర్పు డెల్టా పరిధిలో ప్రధాన లాకులు ● కోటిపల్లి బ్యాంకు కెనాల్పై చొప్పెల్ల, కపిలేశ్వరపురం, కూళ్ల, మసకపల్లి. ● కోరంగి కాలువ పరిధిలో ఆలమూరు, వెల్ల, ఎర్రపోతవరం. ● మండపేట కాలువ పరిధిలో తాపేశ్వరం, పసలపూడి. మధ్య డెల్టా పరిధిలో ప్రధాన లాకులు ● మధ్య డెల్టా ప్రధాన పంట కాలువపై లొల్ల. ● ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్పై వాడపాలెం, చింతనలంక, అన్నంపల్లి, కుండలేశ్వరం. ● అమలాపురం కాలువపై పలివెల, ముక్కామల, నడిపూడి, వన్నెచింతలపూడి. ● పి.గన్నవరం బ్యాంకు కెనాల్పై గోపాలపురం, మొండెపులంక, పొదలాడ, శివకోడు లొల్ల లాకుల వద్ద ఇరిగేషన్ క్వార్టర్ల దుస్థితి జిల్లాలో ఇరిగేషన్ భవనాల దుస్థితి గాలికొదిలేసిన అధికారులు శిథిలమైన లాకు క్వార్టర్లు లాకులకు దూరంగా సిబ్బంది నివాసం జిల్లాలోని 10 లాకుల వద్ద ఇదే పరిస్థితి చింతనలంక అయినవిల్లి మండలం చింతనలంక లాకుల వద్ద 1888లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రెండు మూడు దశాబ్దాలుగా కనీస మరమ్మతులు కూడా చేయడం లేదు. క్వార్టర్లు ధ్వంసం కావడంతో కార్యాలయ నిర్వహణ, లాకుల వద్ద పని చేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వానపల్లి కొత్తపేట మండలం వానపల్లి లాకుల వద్ద ఉన్న ఇరిగేషన్ భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా వీటికి కనీస మరమ్మతులు లేవు. నివాసయోగ్యం కాకపోవడంతో సిబ్బంది ఈ భవనాలను వదిలేశారు. ఇప్పుడు ఈ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. -
ఆగివున్న లారీని ఢీకొట్టిన టాటా వ్యాన్
ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన నాగుల వెంకటేశ్వరరావు, ఎన్.రాజ్యలక్ష్మి, బి.రఘుబాబు, లక్ష్మీదుర్గ, తాళం రాధ, బి.దేవిక, బి.లోకేశ్వర్రావు, బి.దేవేంద్ర, ఎన్.పావని అన్నవరానికి టాటా మేజిక్ వ్యాన్లో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వైఎస్సార్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్క ఆగివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ చింతలచెరువు మధుతోపాటు అందులో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రమం ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, దైవ దర్శనం కోసం అన్నవరానికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు డ్రైవర్ కునుకు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ
బంగారం, వెండి వస్తువుల రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను బుధవారం అధికారులు తనిఖీ చేశారు. దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను ప్రతి మూడేళ్లకు ఒకసారి దేవదాయ – ధర్మాదాయశాఖ జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ (జేవీఓ) తనిఖీ చేస్తారు. ఆ మేరకు జేవీఓ వి.పళ్లంరాజు, డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బందితో కలిసి తనిఖీ జరిపారు. రికార్డుల ప్రకారం బంగారం వస్తువులు 163 (7.421 కేజీలు), వెండి వస్తువులు 303 (183.339 కేజీలు) ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్ఎస్ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సారా నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్అండ్బీ రహదారిలోని రైస్మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తపేట: అవిడి పెదపేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవిడి రేవు సమీపంలో పంట కాలువ కల్వర్టు గోడపై అతడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్కు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉండగా, పెద్ద కుమార్తె ఎంసెట్ పరీక్ష రాసింది. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న సుధాకర్ మంగళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో పంట కాలువ కల్వర్టు వద్ద అతడు మద్యం మత్తులో ఉండగా స్థానికులు చూశారు. ఉదయానికి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయి ఉండగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య నామాడి రవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కంప్యూటర్లు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
శంఖవరం: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం అన్నవరం పోలీస్స్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 18న రూ.15 వేలు విలువైన కంప్యూటర్లు, సీపీయూలు, ప్రింటర్లు చోరికి గురైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.భాస్కరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లిపూడి – బెండపూడి రోడ్డు మధ్యలో శంఖవరానికి చెందిన గామాల అశోక్, బోడపాటి చిన్నోడు ఆటోలో కంప్యూటర్లను వేరే చోటుకు తరలిస్తుండగా అరెస్టు చేశారు. -
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు.