Dr B R Ambedkar Konaseema
-
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వెటరన్ క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ క్రీడా మైదానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమలాపురానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా ప్రతిభ చాటింది. 35, 45 వయస్సు విభాగాల్లో ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. హై జంప్లో మెహబూబ్ షకీలా బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. పట్టణానికి చెందిన బూరగాయల శివరామకృష్ణ కూడా డిస్కస్ త్రో క్రీడలో తలపడ్డారు. జిల్లాకు చెందిన దాట్ల ఎన్ఎస్ రామరాజు 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెంలో వెండి పతకాలను, జావెలిన్ త్రోలో ఎం.సాయిబాబు కాంస్య పతకాన్ని, 100 మీటర్ల పరుగు పందెంలో ఐ.సురేష్కుమార్ కాంస్య పతాకాన్ని సాధించారు. వైభవంగా పండిత సదస్యం ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు వైభవంగా పండిత సదస్యం నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులు మహదాశీర్వచనం చేశారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, తీర్థం బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలి హరణం, ద్రవిడ వేద పారాయణ, సాగాయి. మధ్యాహ్నం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం నిర్వహించారు. రాత్రి ప్రధాన హోమాలు, బలి హరణము, నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు వేద పండితులను సత్కరించారు. ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామ సర్పంచ్ పోచిరాజు బాబురావు, సూర్యకుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. 20 నుంచి మురమళ్ల వీరేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు శైవాగమ పండితులు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో జరగనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న బ్రహ్మోత్సవ కల్యాణం జరుగుతుందని, పాల్గొనే భక్తులు కార్యాలయంలో గాని దేవదాయశాఖ వెబ్సైట్లో గాని నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీ వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముంబయ్కి చెందిన ఎస్.వి.ఎస్.కె. కిషోర్ రూ.పది వేలు విరాళంగా అందించారు. ఆలయాన్ని రాతి కట్టడంతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి ˘ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం జిల్లా కేంద్రమైన కాకినాడలో పర్యటించనున్నందున సంబంధిత ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ వస్తున్నారన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో హెలిపాడ్ను సిద్ధం చేసి, రూట్ బారికేడింగ్ చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాన్వాయ్, రూట్ క్లియరెన్స్, గార్డ్ ఆఫ్ ఆనర్ వంటివి పోలీస్ శాఖ చేపట్టాలన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కొరత లేకుండా వంట గ్యాస్ ఇవ్వాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కొరత లేకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగళవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం, సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు షాపులు మూసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆహారం కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ డి–6 బ్లాక్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా వెలికితీసి, గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారని చెప్పారు. ఇందులో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు. ఇరాన్తో పాటు సరిహద్దు దేశాలతో కూడా కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తే మన దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాకు లొంగిపోవడమే కాకుండా ఇజ్రాయిల్ వంటి దురాక్రమణ దేశానికి మద్దతు ప్రకటించడం దేశ ప్రతిష్టను దిగజారుస్తోందని అన్నారు. అమెరికా షరతులను వ్యతిరేకించి దేశ ప్రయోజనాల కోసం కేంద్రం నిలబడాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు కేఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ కేజీ బేసిన్లో సగం గ్యాస్ మన రాష్ట్రానికే కేటాయించాలి ఫ సీపీఎం డిమాండ్ -
మూడో బిడ్డను కంటేనే..
లూప్ వేస్తున్నాం పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలు, రెండో కాన్పు సిజేరియన్ జరిగిన వారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ఆదేశాలూ లేనప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం వచ్చేవారికి లూప్ వేస్తున్నాం. ఆపరేషన్లు చేయడం లేదు. – ఎం.కీర్తి, సూపరింటెండెంట్, సీహెచ్సీ, పిఠాపురం ·˘ A糚yól MýS$.°. Bç³Æó‡çÙ¯ŒS ·˘ {糿¶æ$™éÓçܵ{™èl$ÌZÏ Mö™èl¢ °º…«§ýl¯]lË$ ·˘ Ô>ç³…V> Ð]l*ǯ]l çÜÆ>PÆý‡$ Ñ«§é¯]l… ·˘ »êÍ…™èlÌS B…§øâýæ¯]l పిఠాపురం: పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పేరిట ప్రతి జంటా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఇందుకు తగినట్టుగానే ప్రజలు జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి చెప్పాలని, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలేవీ ఇంకా రాకముందే ప్రభుత్వాస్పత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. జనాభా నియంత్రణ పేరిట ఇప్పటి వరకూ ఒకటి లేదా రెండు కాన్పులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. అటువంటిది ఇప్పుడు మూడో బిడ్డను కంటేనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తామంటూ పలు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు షరతులు పెడుతున్నారు. దీంతో, ప్రభుత్వాస్పత్రుల్లో కు.ని. శస్త్రచికిత్సలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)లో గత ప్రభుత్వ హయాంలో ఏటా సుమారు 1,100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగేవి. దీని ప్రకారం ప్రతి నెలా దాదాపు 91 శస్త్రచికిత్సలు చేసేవారు. అటువంటిది గత జనవరి నుంచి నెలకు 25కు మించి ఆపరేషన్లు జరగడం లేదు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్తోమత లేదన్నా.. సాధారణంగా నిరుపేదలు ఎక్కువ శాతం ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే పురుడు పోసుకుని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటూంటారు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తే.. మూడో బిడ్డను కనే వరకూ ఆపరేషన్ చేయబోమని కరాఖండీగా చెప్పేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది బాలింతలకు శాపంగా మారింది. పేదరికం, ఇతర కారణాలతో మూడో బిడ్డను పోషించే ఆర్థిక స్తోమత తమకు లేదని, ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుంటామని ఎంత వేడుకుంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు వినడం లేదని తల్లులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక కొంత మంది తల్లిదండ్రులు కు.ని. శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెర లేపుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు బాలింతలు వాపోతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నీ ఉచితం కాగా.. ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్కు అయిన ఖర్చు కంటే ఆస్పత్రిలో ఉన్నందుకు అవుతున్న ఖర్చులు తడిపి మోపెడవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో, అప్పులు చేసుకుని ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. -
15 నాటికి కాలువలకు నీటి సరఫరా బంద్
అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా పంట కాలువలలో నీటి సరఫరాను ఏప్రిల్ 15వ తేదీ నాటికి నిలుపుదల చేసి క్లోజర్ పనులను ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 2,23,087 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. రూ.25 కోట్లతో ఆపరేషన్ మేనేజ్మెంట్ వర్కులు, రూ.125 కోట్లతో ఇతర పనులు, రూ.153 కోట్లతో పుష్కర పనులు నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారి వెంకటరామారావు మాట్లాడుతూ రాబోయే వేసవిలో ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, ఉష్టోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో నవ ధాన్యాల సాగు మేలు అన్నారు. కాలువగట్లను హైవేలుగా మార్చకూడదు కాలువ గట్లను హైవేలుగా మార్చడానికి వీలు లేదని గతంలోనే హైకోర్టు జస్టిస్ కృష్ణప్రసాద్ చారిత్రక తీర్పు ఇచ్చారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. సమావేశంంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వరల్డ్ బ్యాంకు డీపీఆర్కి విరుద్ధంగా 130 సంవత్సరాల క్రితం కాటన్ దొర నిర్మించిన కాలువలను ఆనుకుని జాతీయ రహదారి నిర్మాణం చేయడం మంచిది కాదన్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు హైవే కారిడార్ వల్ల కొబ్బరి చెట్లు కోల్పోవలసి వస్తుందని, దీంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలను అరికట్టడానికి పోలీసు, ఎకై ్సజ్ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ క్షణికానందం కోసం డ్రగ్స్ వైపు వెళ్లడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనన్నారు. ఆర్డీవోలు మమ్మీ, భాగ్యవతి, డి శ్రీనివాసరావు, డీపీఓ శాంత లక్ష్మి, డీఎంఅండ్ హెచ్ఓ దుర్గారావు దొర, ఆర్టీసీ డీఎం డీఎల్ఎన్ శర్మ పాల్గొన్నారు. పరిష్కారాలు చూపాలి మ్యుటేషన్ 22 ఏ, రీ–సర్వే, రెవెన్యూ, పీజీఆర్ఎస్ క్యాస్ట్ వెరిఫికేషన్లపై దృష్టి పెట్టి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి అమరావతి నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీపై సమీక్షించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కుల ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్... అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ గ్రేడు క్వింటాలు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పించామని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ పి శ్రీనివాస్, అధికారి ఏ ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాణాలకు రక్షణ లేదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాణాలకు రక్షణ లేదని వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ జనవరి 28వ తేదీన రాజమహేంద్రవరం రవి హాస్పిటల్లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కలెక్టర్, ఎస్పీలకు గ్రీవెన్స్లో విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కీర్తికి, రాజమహేంద్రవరం డీఎస్పీకి మంగళవారం మరోసారి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. మృతుడు జనసేన కార్యకర్త అయినా ఆ పార్టీ ఈ విషయంపై స్పందించకపోవడం విచారకరం అన్నారు. వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కల్తీ పాల ఘటనలో చనిపోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప నిజాయితీగా విచారణ చేపట్టలేదన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
పాత్ర రోజులొచ్చాయ్..
కుమ్మరి చక్రంపై మట్టితో కూజా తయారు చేస్తున్న కార్మికుడు పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.. ఆధునికతతో వస్తున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తది వద్దు.. పాతదే ముద్దు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎలాంటి హాని లేని మట్టి పాత్రలపై మోజు పెరుగుతోంది. దీంతో వీటికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులదే అగ్రభాగం అయ్యింది. ఆధునిక పద్ధతులతో పాటు అంతే వేగంగా వ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వంట సాయంత్రానికే పాడవుతోంది. అదే మట్టి పాత్రలో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాల సౌలభ్యం. అందుకే మట్టి పాత్రలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. సాధారణంగా మట్టి పాత్రల ప్రాధాన్యం తగ్గిపోయాక కుమ్మర్లు కుల వృత్తిని వీడి ఇతర వృత్తులకు చేరువయ్యారు. అక్కడక్కడా కొందరు మట్టి పాత్రలు తయారు చేసినా, కేవలం కొందరు మాత్రమే అదీ వేసవిలో మంచినీటికి, శుభకార్యాల్లో సంప్రదాయాలకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇలా వీటి తయారీ తగ్గిపోయింది. కానీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వంటి ఆరోగ్య సూచనలు పెరగడంతో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వీటి తయారీ ఊపందుకుంది. మళ్లీ కుమ్మర్లకు చేతినిండా పని వచ్చింది. జిల్లాలో 500 కుటుంబాలు ప్రస్తుతం మట్టి పాత్రల తయారీ చేస్తుండగా, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఆ‘పాత్ర’మధురాలు పూర్వం పాలు తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, పెరుగు తోడెట్టినా అన్నీ మట్టి పాత్రలోనే జరిగేవి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా మట్టి పాత్రలో వేసిన ప్రతీది ఒక అద్భుతంగా మారేది. మట్టి పాత్రలు కేవలం వంట పాత్రలు లేదా నిల్వ పాత్రలు మాత్రమే కాదు. అవి మన సంస్కృతీ సంప్రదాయం, గ్రామీణ జీవన విధానానికి ప్రతిబింబం. భారతీయ సంస్కృతిలో మట్టి పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మట్టి కుండల్లో నీరు నిల్వ చేయడం, ఆ పాత్రల్లో వంట చేయడం అనేది సాధారణం. పండగలు, ఉత్సవాలు, వివాహాలు, పూజలలో కూడా మట్టి పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. దీపావళి సందర్భంగా వెలిగించే ప్రమిదలు, గ్రామీణ దేవాలయాలలో ఉపయోగించే మట్టి పాత్రలు ఇవన్నీ మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు. వీటి తయారీ అనేది ఒక సాధారణ పనికాదు. ఇది అనుభవం, నైపుణ్యం, సహనం కలిసిన కళ. సరైన మట్టిని సేకరించాక శుభ్రపరిచి, నీటితో కలిపి మృదువుగా చేయడం, కుమ్మరి చక్రంపై చేతులతో ఆకారమివ్వడం, సూర్యరశ్మిలో ఆరబెట్టడం, అగ్నిలో కాల్చి దృఢంగా మార్చడం, కొన్నిసార్లు రంగులు వేసి అలంకరించడం ఇలా ఈ ప్రతి దశలో శ్రద్ధ అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం పాత్ర రూపాన్ని మార్చేస్తుంది. కొన్ని గ్రామాల్లో వీటి తయారీకి ప్రత్యేకంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిని స్థానికంగా కుమ్మర వీధి అని పిలుస్తారు. ఈ వృత్తినే నమ్ముకుని అక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కుండ బిర్యానీకి మంచి గిరాకీ ప్రస్తుతం ‘సస్టైనబుల్ లివింగ్’ అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. నగరాల్లో కూడా ఇప్పుడు మట్టి పాత్రలను ఉపయోగించే అలవాటు తిరిగి వస్తోంది. రెస్టారెంట్లు, ఆర్గానిక్ స్టోర్లు, హోమ్ డెకర్ రంగంలో కూడా మట్టి వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు కుండ బిర్యానీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బిర్యానీ ప్రేమికుల అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు సైతం తమ వద్ద కుండ బిర్యానీ లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. కుండలు, కూజాలు, వాటర్ బాటిళ్లు వంట పాత్రలు ఇలా అనేక రకాల మట్టి పాత్రల తయారీ ఊపందుకుంది. ఆదరణ పెరుగుతోంది మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. రాను రాను వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో తప్ప మట్టి పాత్రలను వినియోగించడం మానేశారు. ఈ పాత్రలను వినియోగించడం మన ఆ రోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిదని తెలుసుకున్న తరువాత వీటికి ఆదరణ పెరిగింది. ము ఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు వీటిని వినియోగించడం వల్ల మాకు చేతి నిండా పని దొరుకుతోంది. –ఎస్.అప్పారావు, మట్టి పాత్రల తయారీ కార్మికుడు, పిఠాపురం ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు మట్టి పాత్రలు వినియోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మట్టి బిందెల్లో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆహారం మెల్లగా వండబడటం, రసాయనాలు లేని సహజ వంట విధానం వల్ల పోషక విలువలు నిలుస్తాయి. పూర్తిగా సహజ పదార్థం మట్టితో తయారు చేయడం కారణంగా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని వీడడంతో కాలుష్యం తగ్గుతుంది. ఫ మట్టి పాత్రలకు పెరుగుతున్న ఆదరణ ఫ కుమ్మర్లకు చేతినిండా పని ఫ గడిలో పడిన బతుకు చక్రం -
రికార్డులు లేని నగదు స్వాధీనం
యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి, యానాం సరిహద్దుల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక హనుమాన్ దాబా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఓ కారులో రూ.2.50 లక్షలను కనుగొన్నట్లు ఎన్నికల సిబ్బంది తెలిపారు. ఆ నగదుకు సంబంధించి అకౌంట్ల వివరాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేసినట్లు సిబ్బంది తెలిపారు. -
చదరంగం పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా అండర్–9 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ బి.శాన్వి ప్రథమ స్థానం, ఓపెన్ కేటగిరీ నుంచి మోక్స్ సైనీ తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారని కోచ్ వి.శ్రీనుబాబు సోమవారం తెలిపారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరంలో జరిగే అండర్ –9 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనున్నారు. ఎనిమిదేళ్ల శాన్వి మొదటి స్థానం సాధించి జిల్లా చాంపియన్గా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. చదువుతో పాటు చదరంగంలో రాణిస్తున్న విద్యార్థినులను స్కూల్ చైర్మన్ నాయుడు, డైరెక్టర్ పిన్సిపాల్ నంద్యాల మనువిహార్ అభినందించారు. -
ఎమ్మెల్యే అశోక్పై దాడికి యత్నం
త్రుటిలో తప్పించుకున్న వైనం యానాం: స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై కొంతమంది దాడికి యత్నించడంతో త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన సావిత్రినగర్కు ఓ పుట్టినరోజు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారు వద్దకు వెళుతుండగా, ఒక్కసారిగా సుమారు 50 మంది రాళ్లు పట్టుకుని దాడికి యత్నించారని, దాని నుంచి త్రుటిలో తప్పించుకున్నానని ఎమ్మెల్యే అశోక్ విలేకరులకు తెలిపారు. తాను ముందస్తు అనుమతితో సావిత్రినగర్కు వెళ్లానని, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి గొంతియ్యకు సైతం తెలిపానని, అయితే తనను గొంతియ్య ఏకపక్షంగా నువ్వు అంటూ సంబోధించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారానికి రాలేదని తెలిపానన్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఒక్కసారి తన వైపునకు రాళ్లతో వచ్చారని, మరోవైపు తన అనుయాయులు ఆపినప్పటికీ ముందుకు రావడంతో తాను కారులో తిరిగి యానాంకు వచ్చేశానన్నారు. తనపై ఎన్ని దౌర్జన్యాలకు దిగినా తనదే విజయమని ఆయన అన్నారు. ఘటనపై పుదుచ్చేరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, వేద పారాయణ అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం కరప కళాకారుల బృందంచే సుందరకాండ, తోలు బొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షించారు. హైదరాబాద్కు చెందిన వెంకట మహాదేవ కుమార్ దంపతులు రూ.5,116, కాకినాడ వాస్తవ్యులు గంగరాజు దంపతులు రూ.5,116 విరాళం సమర్పించారు. దాతలకు స్వామివారి ఫొటోలను సిబ్బంది అందజేశారు. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలేశ్వరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పెద్దనాపల్లి గ్రామంలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వెలగలేరు థియేటర్స్ వారి ఉరి నాటిక ఆలోచింపజేసింది. నేటి సమాజంలో మనిషికి ఇగో ఉంటే చివరికి ఎంతో నష్టపోతాడో సవివరంగా ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం పోలుదాసు శ్రీనివాసరావు అందించారు. రెండో ప్రదర్శనగా కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటిక ఆకట్టుకుంది. ఒక మహిళ డాక్టర్ తన స్వార్థంతో చేసిన పనిని తోటి మహిళలు తిరగబడి బుద్ధి చెప్పిన కథాంశంతో నాటిక ఆసక్తికరంగా సాగింది. దీనికి మూలకథ డి.కామేశ్వరి, నాటకీకరణ డి.ఉమాశంకర్ అందించగా, దర్శకత్వం డి.వినయ్ నిర్వహించారు. నాటిక ప్రదర్శనలు తిలకించేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
తీర్మానం పేరుతో రూ.లక్ష కోట్ల స్కామ్
● రాజధానిపై అసెంబ్లీ తీర్మానం ఒక డ్రామా ● లోకేష్ను ప్రపంచ కుబేరుడిని చేయాలనే తపన ● కూటమి ప్రభుత్వం అస్థిత్వం కోల్పోయింది ● ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం: అసెంబ్లీలో రాజధాని తీర్మానం పేరుతో చంద్రబాబు చేసిన హంగామా వెనుక రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందన్నారు. రావులపాలెంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన రాజధానికి ఇప్పుడు తీర్మానం చేయడం వెనక పెద్ద స్కామ్ ఉందన్నారు. బాబు రాజధాని పేరుతో జరిపే అవినీతికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. 50వేల ఎకరాలు సేకరించి రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చేందుకే తీర్మానమనే నాటకం ఆడుతున్నారన్నారు. 2014–2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు తీర్మానం చేయలేదని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని కోసమంటూ మరో 50 వేల ఎకరాలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో సేకరించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు బాబు ఈ తీర్మానం చేస్తున్నారన్నారు. ఈ లక్ష కోట్లలో ప్రతి అంగుళం అవినీతి ఉంటుందన్నారు. రైతులను నట్టేట ముంచారు గతంలో 50 వేల ఎకరాలు సేకరించి, ఆ రైతులకు ప్లాట్లు ఈరోజు వరకు కేటాయించకుండా నట్టేట ముంచారని ఆయన విమర్శించారు. కొంతమంది రైతులకు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మరికొంతమందికి ఉన్న ప్లాట్లకు రోడ్లు లేవు, కొంతమందికి చెరువుల్లో ఉన్న ప్లాట్లకు బోట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ఒకపక్క రైతులను మోసం చేస్తూ మరోపక్క లోకేష్ను ప్రపంచ కుబేరుడిని చేయడానికి రాజధాని పేరుతో ల్యాండ్ ఫూలింగ్కు పన్నాగం పన్నారన్నారు. గతంలో ఇచ్చిన రైతులకే న్యాయం చేయని బాబు కొత్తగా రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశ పరిచిన సమయంలోనే మండలిని కూడా సమావేశ పర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై లేదా అని ప్రశ్నించారు. రాజధానిని మంత్రి నారాయణ సెల్ఫ్ ఫైనాన్సింగ్గా చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన భూములకు రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేసినట్టుగా చూపిస్తున్నారన్నారు. ఇందులో రూ.2,000 కోట్లు కేంద్రం ఇస్తే, రూ.3,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారన్నారు. రాజధాని తీర్మానం కోసమని అసెంబ్లీని సమావేశపరచి అదేమీ మాట్లాకుండా జగన్ కోసం మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జగన్ చేసిన ప్రకటనపై బాబు, పవన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము కమీషన్ల రూపంలో జేబులోకి.. అత్యంత నాణ్యమైన ఆధునికమైన నిర్మాణాలు చేపట్టడానికి చదరపు అడుగుకు రూ.2,000 అవుతుంటే కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు చదరపు అడుగుకు రూ.11,000 ఖర్చు చేస్తున్నారన్నారు. చివరకు ఆ కాంట్రాక్టులను కూడా తన బినామీలకు దోచిపెడుతున్నారన్నారు. చెరువుల్లో రాజధానిని నిర్మిస్తూ అది మునిగిపోతే మళ్లీ ఆ నీరు తోడేందుకు తన బినామీలకే కాంట్రాక్టులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. 2014లో రాజధాని డిజైన్ల పేరుతో రూ.400 కోట్ల కాంట్రాక్ట్ను సింగపూర్ కంపెనీకి ఇచ్చి దగా చేసి, ఇప్పుడు మళ్లీ రూ.700 కోట్లు డిజైన్ల పేర్లతో తన బినామీ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజల సొమ్మును దోచేస్తున్నారన్నారు. రోడ్లకు కిలోమీటరుకు రూ.2.50 కోట్లు నేషనల్ హైవే సంస్థ ఖర్చు పెడుతుంటే రాజధానిలో రోడ్లు వేసేందుకు కిలోమీటరుకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజల సొమ్మును కమీషన్ రూపంలో జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. మీ అవినీతిని జనంలోకి తీసుకొచ్చింది జగనే ప్రజల సొమ్ముతో ఏర్పాటవుతున్న 11 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అమ్మేసుకోవాలనే ప్రయత్నాన్ని.. మీరు అన్న ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రజల్లోకి తీసుకువచ్చి ప్రశ్నించారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు ఇస్తా అన్న సబ్సిడీ రూ.20,000 మాత్రమే ఇచ్చి, మరో రూ.60,000కు ఎగనామం పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2019లో ప్రజలు జగన్మోహన్రెడ్డిని గెలిపించడం వల్లే సంక్షేమం, రైతులకు గిట్టుబాటు ధర, రైతు భరోసాతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారం చేసే మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. మహిళలకు, బలహీన వర్గాల మహిళలకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సాయం మాట ఏమైందన్నారు. జగన్ ఐదేళ్లలో సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తే చంద్రబాబు జేబులు నింపుకునేందుకు రూ.మూడు లక్షల 31 కోట్లు అప్పు చేశారన్నారు. రాజధానికి వ్యతిరేకమని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉన్న రాజధానిలో రాజ్యాంగబద్ధంగా బిల్డింగులు నిర్మించి, విశాఖ సాఫ్ట్వేర్ హబ్గాను, కర్నూలును జ్యుడీషియల్ హబ్గా తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధి సమతుల్యతను జగన్ ఆకాంక్షించారన్నారు. -
రాజకీయ నిరుద్యోగులకు అవార్డులే!
సాక్షి, అమలాపురం: పార్లమెంట్.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు పదవీ యోగం కల్పించనుండగా... మున్సిపల్ వార్డుల విభజన పట్టణాలు.. నగర పంచాయతీల పరిధిలో ద్వితీయశ్రేణి నాయకుల పదవీ కాంక్షలను నెరవేర్చనుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వార్డుల సంఖ్య పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో సుమారు 16 నుంచి 20 వరకు వార్డులు పెరిగే అవకాశముంది. కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రమైన అమలాపురంలో 30 వార్డులున్నాయి. రామచంద్రపురంలో 28 వార్డులు, ముమ్మిడివరం నగర పంచాయతీలో 20 వార్డుల వరకు ఉన్నాయి. ఈ మూడుచోట్లా కలిపి మొత్తం 78 వరకు వార్డులున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వార్డుల సంఖ్య పెంచితే 16 నుంచి 20 వార్డుల వరకు పెరిగే అవకాశముందని అంచనా. జిల్లా కేంద్రమైన అమలాపురంలో మొత్తం 30 వార్డులున్నాయి. ఇక్కడ జనాభా సుమారు 65 వేల మంది. ఇప్పుడు బూత్కు 600 నుంచి 1,000 ఓట్లు వరకు (వార్డుకు 1,300 నుంచి 1,500 ఓట్లు) ఉన్నాయి. పట్టణాన్ని ఆనుకుని ఉన్న పంచాయతీలలోని శివారు ప్రాంతాలను విలీనం చేయడం, ప్రతి వెయ్యి మందికి అటూఇటూ ఓటర్లకు ఒక వార్డు చొప్పున కేటాయించినా సుమారు 40 వార్డులు అవుతాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఇక రామచంద్రపురం మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. జనాభా సుమారు 49,500 మంది వరకు ఉన్నారు. వార్డుకు ప్రస్తుతం వేయి నుంచి 1,200 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఒక వార్డులో అయితే 1,400 మంది ఓటర్లు ఉన్నారు. ఏడు గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది ఆచరణకు నోచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వేయి మందికి ఒక వార్డు చొప్పున కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈ పట్టణంలో నాలుగు నుంచి ఆరు వార్డులు పెరగనున్నాయి. దీంతో మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 32 నుంచి 34కు చేరనుంది. ముమ్మిడివరం నగర పంచాయతీలో జనాభా సుమారు 22 వేల మంది కాగా మొత్తం 20 వార్డులున్నాయి. వార్డుకు 900 నుంచి 1,300 మంది వరకు ఓటర్లున్నారు. ఇక్కడ రెండు నుంచి నాలుగు వార్డులు పెరుగుతాయని అంచనా. పెరగనున్న వార్డుల సంఖ్య పట్టాణాల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ద్వితీయశ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. విలీనాలకు అన్నీ అవాంతరాలే.. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో శివారు గ్రామాల విలీన ప్రతిపాదనలు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనల దశలోనే ఆగిపోతున్నాయి. అమలాపురం మున్సిపాలిటీలో బండారులంక, ఈదరపల్లి, కామనగరువు, పేరూరు, జనుపల్లి, వేమవరం, వేమవరప్పాడు, నడిపూడి, చిందాడగరువు, రోళ్లపాలెం, భట్నవిల్లి గ్రామాలను, గ్రామాల శివారు ప్రాంతాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. పట్టణాన్ని ఆనుకుని మూడు కిలోమీటర్ల పరిధిలో పంచాయతీల విలీన ప్రతిపాదనలకు అన్నీ అవాంతరాలే. ఆయా పంచాయతీలు కోర్టులను ఆశ్రయించడం, స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఇది ముందుకు సాగడం లేదు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఏడు గ్రామాల విలీన ప్రతిపాదనపై కూడా ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పసలపూడి, ఏరుపల్లి, తాళ్లపొలం, ఉట్రుమిల్లి, యనమదల, చోడవరం, నర్సారావుపేట పంచాయతీలను విలీనం చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా స్థానికులు అంగీకరించడం లేదు. తాజాగా రాయవరం మండలంలోని పసలపూడి తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, జిల్లాలోని కొత్తపేట, రావులపాలెం, రాజోలు, మలికిపురం, తాటిపాకలను నగర పంచాయతీలుగా చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఆయా పంచాయతీలు అంగీకరించకపోవడం గమనార్హం. మున్సిపాలిటీలలో పెరగనున్న వార్డుల సంఖ్య జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఇప్పుడున్న వార్డులు 78 పెరగనున్నవి 16 నుంచి 20 వరకు అమలాపురం మున్సిపాలిటీలోనే పది వరకూ పెరిగే అవకాశం -
అప్పన్నపల్లి బాలాజీ హుండీ ఆదాయం రూ.56.08 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి హుండీల ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నరసన్న హుండీల ఆదాయం రూ.37,08,338 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. భక్తుల నుంచి కానుకలుగా మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకూ 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో పై లెక్కింపు జరిగింది. కాగా ఆదాయం మొత్తంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,93,457, గుర్రాలక్క ఆలయ హుండీల ద్వారా రూ.27,872, అన్నదాన హుండీల ద్వారా రూ.87,009 సమకూరినట్టు ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
మూడో రోజూ చూడముచ్చటగ..
● వైభవంగా వెంకన్న కల్యాణోత్సవాలు ● పొన్న వాహనంపై ఉభయ దేవేరులతో ఊరేగిన స్వామివారు ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు మూడో రోజు సోమవారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి మేలుకొలుపు, తీర్థపు బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలిహరణము, ద్రవిడ వేద పారాయణ, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. సాయంత్రం 6.02 గంటల నుంచి ప్రధాన హోమాలు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. 7.02 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారికి పొన్న వాహన సేవ, మాడవీధులలో మేళ తాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ భారీ సంఖ్యలో భక్తుల గోవింద నామస్మరణలతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. తీర్థ, ప్రసాద వితరణ చేశారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. భక్తుల కోసం సోలార్ లైట్ల ఏర్పాటు వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా వెలుగులు అందించేందుకు అధికారులు సోలార్ లైట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊబలంక శిరిడి సాయి ఆలయం నుంచి మెర్లపాలెం మీదుగా వాడపల్లి వరకు రహదారిలో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 లక్షల వ్యయంతో 20 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో సూర్యచక్రధరరావు తెలిపారు. ఆయన సోలార్ లైట్ల ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. -
కార్మిక సంక్షేమానికి మేడే నాడు నూతన చట్టం
కార్మిక శాఖ మంత్రి సుభాష్ అమలాపురం రూరల్: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ మేరకు వచ్చే మే 1న సీఎం చంద్రబాబు నాయుడు నూతన చట్టం అమల్లోకి తీసుకురానున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక కిమ్స్ ప్రాంగణంలో జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాతాడ నవీన్ రాజు అధ్యక్షతన ఆదివారం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగంలో జర్నలిస్టులను చేర్చి అన్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు, అనుకోని కారణాల వల్ల జర్నలిస్టు మరణిస్తే రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రమాద బీమా వచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. నూతన లేబర్ కోడ్ ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న 2.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ మూలధన నిధికి ఆయన రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించకపోవడం వల్ల పింఛన్, బీమా సౌకర్యం ఉంటడంలేదన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతామని తెలిపారు. ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు జర్నలిస్టుల సంక్షేమానికి కార్పస్ ఫండ్గా రూ.ఐదు లక్షలు ప్రకటించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అందించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి, గన్నవరపు శ్రీనివాసు మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంతో పాటు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్న నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.50 వేల కార్పస్ ఫండ్ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచె రమణారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆకుల అమరయ్య, వల్లి, మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు, రాష్ట్ర దృశ్యకళల అకాడమీ మాజీ చైర్మన్ కుడుపూడి సత్య శైలజ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, దేశంశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: పీజీఆర్ఎస్ మీకోసం రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో, డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు అర్జీలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. -
జేసీ నిశాంతి బదిలీ
● అల్లూరి జిల్లా కలెక్టర్గా పదోన్నతి ● రెవెన్యూలో కీలక పోస్టులు ఖాళీ సాక్షి, అమలాపురం: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన తయారైంది జిల్లాలోని రెవెన్యూ శాఖ తీరు. ఇప్పటికే కీలకమైన పోస్టులకు రెగ్యులర్ ఉద్యోగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలో ఆ శాఖకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న టి.నిశాంతిని అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్గా పదోన్నతి కల్పించి బదిలీ చేసింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆమె ఇక్కడ జేసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమలాపురం మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం ఆమెను నియమించింది. బదిలీపై వెళుతున్న ఆమె స్థానంలో కొత్తగా జేసీని ప్రభుత్వం నియమించలేదు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. గత నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. 2018 గ్రూప్–1 మూల్యంకనంలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో నాడు ఎంపికై న వారికి హోదా తగ్గించడంతో పాటు ప్రాధాన్యం లేని పోస్టులలో నియమించాలని తీర్పునిచ్చింది. దీనిని అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మండిపడింది. దీనితో ప్రభుత్వం నాడు ఎంపికై న వారిని అమరావతిలోని హెడ్ క్వార్టర్కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో నాడు డీఆర్వోగా, అమలాపురం ఆర్డీవోగా ఉన్న కె.మాధవి, కొత్తపేట ఆర్డీవోగా శ్రీకర్, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిలలు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. వారి స్థానంలో కొత్త వారి నియామకం జరగలేదు. డీఆర్వో, అమలాపురం ఆర్డీవోగా ఇప్పుడు బదిలీపై వెళుతున్న జేసీ నిశాంతి ఉన్నారు. కొత్తపేటకు ఆర్డీవోగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీగా ఉన్న మమ్మీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం ఆర్డీవో పి.భాగ్యవతి కూడా ఇన్చార్జిగా ఉన్నారు. ఈమె రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ల్యాండ్ అక్విజేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జేసీ, డీఆర్వో, ముగ్గురు ఆర్డీవోలు ఇన్చార్జిలుగా ఉన్నారు. ప్రస్తుతం డీఆర్వో, అమలాపురం ఆర్డీవోగా ఉన్న జేసీ బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులు కూడా ఖాళీగా మారాయి. ఇక చాలా మండలాలకు తహసీల్దార్లు కూడా ఇన్చార్జిలు ఉండడం గమనార్హం. అమలాపురం, ఉప్పలగుప్తం మండలాలకు వీఎస్ దివాకర్ రెండు చోట్లా ఇన్చార్జిలుగా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కలెక్టర్ మహేష్ కుమార్ మినహా మిగిలిన కీలకమైన పోస్టులన్నీ ఇన్చార్జిలతో సాగుతున్నాయి. కీలకమైన రెవెన్యూ శాఖను చంద్రబాబు ప్రభుత్వం ప్రయోగాలకు వేదికగా మార్చి నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వాడవాడలా వేంకటేశు నామమే..
● వాడపల్లి క్షేత్రంలో వైభవంగా శ్రీవారి కల్యాణం ● గోవింద ఘోషతో మార్మోగిన పుర వీధులు ● కోలాహలంగా రథోత్సవం కొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వివిధ పూజా, హోమం, కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించగా వేలాది భక్త జన సందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు. కల్యాణం.. కనుల వైకుంఠం వాడపల్లిలోని విశాలమైన ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసన భరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మంటపంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆషామాషీ అనుకున్నారా?
ఆలమూరు: సగటు జీవి జీతంలో సింహభాగం ఖర్చయ్యేది వైద్యానికి, వారి పిల్లల చదువులకు. ఈ రెండు విషయాల్లోనే వారు ఏ ప్రభుత్వం నుంచైనా ప్రోత్సాహకాలను.. మినహాయింపులను.. సబ్సిడీలను ఆశిస్తారు. వైద్య శాస్త్రం విస్తృతమయ్యాక సూక్ష్మదశలో వైద్యం అందించాల్సి వస్తోంది. ఇందుకు భారీగానే వ్యయమవుతోంది. కొన్ని సందర్భాలలో ఈ భారం సగటు జీవికి కొన్ని నెలల జీతంతో సమానమయ్యే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలెవ్వరూ ఖరీదైన వైద్యం అందక అనారోగ్యంతో మృతి చెందకూడదనే దృఢ సంకల్పంతో 2007 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనే బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఆయన మరణానంతరం దశాబ్దకాలం తరువాత అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి మరింత ఊపిరి పోశారు. అప్పటి వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1059 చికిత్సలను ఒక్కసారిగా 3257కు పెంచారు. అదే కాకుండా కుటుంబ తలసరి ఆదాయాన్ని రూ.ఐదు లక్షల వరకూ పెంచి ఎక్కువ కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో పాటు అప్పటి వరకూ ఆరోగ్యశ్రీ చికిత్సకు ఉన్న రూ.రెండు లక్షల పరిమితిని ఒకేసారి రూ.25 లక్షలకు పెంచి రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అటువంటి బృహత్తర పథకంగా రోగులకు అపర సంజీవినిగా మారిన ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో ఏకంగా నాలుగు సార్లు ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే రోగి కోలుకునే వరకు కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరాగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. సేవలపై నీలినీడలు జిల్లాలోని 19 మండలాల పరిధిలో 28 ఆస్పత్రులు ఉండగా అందులో ప్రభుత్వ ఆస్పత్రులు 11, ప్రైవేట్ ఆస్పత్రులు 17 వరకూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కాలం నుంచి సుమారు రూ.100 కోట్ల వరకూ బకాయిలు ఉండడంతో ఈ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు, అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్య సేవలను నిలిపివేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తొలుత సాధారణ సేవలను నిలిపివేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తారని ఆషా ప్రతినిధులు ప్రకటించడంతో ఆరోగ్యశ్రీ సేవలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనివల్ల రోగుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. బకాయిలపై కోర్టుకు వెళ్లినా.. ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోతుండటంతో ఆస్పత్రులను నడపటం కష్టంగా ఉందంటూ నెట్వర్క్ ఆస్పత్రులు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది అక్టోబర్లో సమ్మెకు దిగిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు అప్పట్లో ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి బకాయిలను తీరుస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే పెరిగిన ఖర్చుల దృష్టా్య్ ప్రొసీజర్ల ధరలు పెంచుతామన్న హామీని కూడా విస్మరించింది. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు మరోసారి సమ్మెకు ఉపక్రమించక తప్పడం లేదని ఆషా ప్రతినిధులు చెబుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీని ఉద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది చివరిలో ఆషా ప్రతినిధులతో వైద్యారోగ్యశాఖ బకాయిలపై చర్చలు జరిపినా నెట్వర్క్ ఆస్పత్రులకు స్పష్టమైన హామీ లభించలేదు. భీమా సంస్థలకు ధారాదత్తం చేసేందుకే రాష్ట్ర ప్రజల ప్రశంసలు అందుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)ని నిర్వీర్యం చేసి వైద్య సేవలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో ఆరోగ్య బీమాను ప్రవేశపడితే సామాన్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా దిశగా అడుగులు వేస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదలలో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పందించని హెల్ప్ డెస్క్ ఆరోగ్యశ్రీ నిలిపివేతపై సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హెల్ప్ డెస్క్లలోని ఆరోగ్య (వైద్య) మిత్రల వద్దకు వెళితే వారి నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుతాయో లేదోననే అందోళనను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని వాగ్దానాలతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చాక వైద్య సేవల్ని నిర్వీర్యం చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వం తమకు ఆరోగ్య భరోసాను కల్పిస్తున్న ఆరోగ్యశ్రీని పూర్తిగా ఆపేయాలని చూస్తోందని పేదవర్గాల ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు.. ఏరియా ఆస్పత్రులు 02 సామాజిక ప్రభుత్వ ఆస్పత్రులు 09 ప్రైవేట్ ఆస్పత్రులు 12 దంత వైద్యశాలలు 05 రూ.కోట్ల బకాయిలపై నెట్వర్క్ ఆస్పత్రుల ఆగ్రహం ఆరోగ్యశ్రీని కొనసాగించలేమంటూ ఏప్రిల్ నుంచి సమ్మెబాట ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ప్రాణాలు అరచేత పట్టుకుని నిరాశగా ఎదురుచూస్తున్న పేదలు -
ఐఎస్ఓ సర్టిఫికెట్పై విశ్వరూప్ హర్షం
అమలాపురం రూరల్: అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నం పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడంపై వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు రాష్ట్ర మాజీమంత్రి, పినిపే విశ్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. కొమ్మరగిరిపట్నం సర్పంచ్ విజయలక్ష్మి ఆదివారం భట్నవిల్లిలో విశ్వరూప్ను కలసి సర్టిఫికెట్ వచ్చిన క్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆమెను సత్కరించారు. ఆమెతో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, సర్పంచ్ బర్రె సీతారత్నం, ఎంపీటీసీ సుబ్బిరామ్, ఇళ్ల ఏడుకొండలు, సాపే సత్యనారాయణ పాల్గొన్నారు. ఉత్కంఠగా అండర్–9 చెస్ పోటీలు అమలాపురం టౌన్: స్థానిక విద్యానిధి స్కూలులో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–9 జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. 30 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ క్రీడల్లో బాలుర విభాగంలో ద్రాక్షారామకు చెందిన పాయసం నిఖిల్ దుర్గా వికాస్ ప్రధమ, అమలాపురానికి చెందిన పేరూరి రుత్విక్ ద్వితీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి ప్రధమ, రావులపాలేనికి చెందిన బొచ్చు హిమబిందు ద్వితీయ స్థానాలను గెలుచుకున్నారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరం జరగనున్న అండర్–9 రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. కిక్కిరిసిన అయినవిల్లి అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపారు. స్వామివారి సన్నిధిలో జరిగే లక్ష్మీ గణపతి హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఘనంగా వేద సదస్యం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్ పర్యవేక్షించారు. -
కల్యాణ వైభోగమే..
● వాడపల్లి వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవాలు ప్రారంభం ● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆత్రేయపురం: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమ శాస్త్రానుసారం ఆలయ వసంత మండపంలో మధ్యా హ్నం 2.02 గంటలకు మేలుకొలుపు, నిత్యార్చన, నిత్య బలిహరణ, బాలభోగ నివేదన నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, దీక్ష ధారణ, అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఈవో దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. కాగా.. శనివారం కావడంతో ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేసి..
తాళ్లరేవు: తన ఆస్తిని రాయించుకుని, అనాథగా వదిలివేశారంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను శనివారం విలేకర్లకు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. సుంకరపాలెం పంచాయతీ అంబేడ్కర్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్న గుత్తుల వెంకాయమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఉన్న ఎకరం పొలంలో నాలుగు కుంచాల భూమిని ఇచ్చి కుమార్తెకు వివాహం చేశారు. అనంతరం వెంకాయమ్మ భర్త మృతి చెందాడు. దీంతో కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉండగా ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటితో పాటు సుమారు రూ.కోటికి పైగా విలువ చేసే 1500 గజాల స్థలాన్ని రాయించుకున్నాడు. అనంతరం ఆమెను చూడకుండా వదిలేశాడు. దీంతో వెంకాయమ్మ అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతోంది. ఇటీవల ఆమెకు సొరియాసిస్ రావడంతో తీవ్ర అనారోగ్యంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నానని వాపోయింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. 31న రామచంద్రపురంలో జాబ్ మేళా సాక్షి,అమలాపురం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కోనసీమ జిల్లా, ఎంప్లాయిమెంట్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న రామచంద్రపురం శ్రీనివాస శైల ఐటీఐలో భారీ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు తెలిపారు. సుమారు 10 ప్రముఖ కంపెనీల్లోని 380కి పైగా ఉద్యోగాలను మేళాలో భర్తీ చేస్తారన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, ఆసక్తి కలవారు అన్ని పత్రాలతో హాజరుకావాలన్నారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ, తొలి హారతిని అర్చకులు ఘనంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి మాట్లాడుతూ ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,54,430 వచ్చిందన్నారు. స్వామివారిని 6,200 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని, నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,01,437 విరాళాలుగా అందించారన్నారు. -
సర్పంచ్లకు షాక్
సాక్షి, అమలాపురం: స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్నా సకాలంలో ఎన్నికలను పూర్తి చేయని చంద్రబాబు సర్కార్.. సర్పంచ్ల చేతుల్లో ఉన్న పవర్ను మాత్రం గడువు కన్నా ముందే లాగేసింది. పదవీ కాలం ముగిసే సమయంలో పాలక వర్గాలు, పంచాయతీ అధికారులు కలిసి వృథా ఖర్చులు చేస్తారనే వంకతో చెక్ పవర్కు ఆంక్షలు విధించింది. అలాగే పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి, తమ కనుసన్నల్లోనే చంద్రబాబు సర్కార్ పాలన సాగించనుంది. ఇప్పుడున్న సర్పంచ్లలో మూడొంతుల మందికి పైగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,069 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 342, కాకినాడ జిల్లాలో 385, తూర్పుగోదావరి జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు వచ్చాయి. ఏప్రిల్ రెండో తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. అయితే మరో వారం రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకోనున్న సర్పంచ్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారికున్న చెక్ పవర్పై ఆంక్షలు విధించింది. ఐదేళ్లు పాలించిన సర్పంచ్లు చివరి వారం రోజుల్లో వృథా ఖర్చులు చేసేస్తారని, ఇష్టానుసారం బిల్లులు చెల్లించేస్తారంటూ ఈ ఆంక్షలు విధించింది. సర్పంచ్ల ఆవేదన ఇప్పటికే చెక్ పవర్ ఉన్నా డీఎల్పీవో అనుమతులు తీసుకున్న తర్వాతే సొమ్ములు డ్రా చేయాల్సి వస్తోంది. జిల్లాలో బుధవారం నుంచి సర్పంచ్లు నేరుగా చెల్లింపులు చేయడానికి అవకాశం లేదు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ) ఆమోదించాలి. సర్పంచ్ సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే మంగళవారం వరకూ నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డీడీవో లాగిన్కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులను పరిశీలించి థంబ్ వేస్తేనే ట్రెజరీకి చేరుతుంది. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు, సర్పంచ్లతో కుమ్మకై నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం ముమ్మాటికీ తమను అవమానించడమేనని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి పార్టీలకు అనుకూలమైన సర్పంచ్లు కూడా తప్పుపడుతున్నారు. గ్రామాల్లో చేపట్టిన పలు రకాల పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించాలన్నా అనుమతులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఎం.బుక్ నమోదు చేసిన తర్వాత కూడా అనుమానంతో బిల్లులు చెల్లింపులకు ఆంక్షలు విధించడం భావ్యంగా లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారుల జాబితా సిద్ధం ఏప్రిల్ మూడో తేదీ నుంచి సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకునేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మండలాల వారీగా ప్రత్యేక అధికారులుగా ఎవరిని నియమించాలనే దానిపై జాబితాను సిద్ధం చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశారు. ప్రత్యేక అధికారులుగా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, ఇద్దరు ఎంఈఓలు, మండల వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, మండల పరిషత్ పరిపాలనాధికారి వంటి వారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడానికి నిబంధనలు వర్తించవు. ఎందుకంటే వారే పనులకు సంబంధించి ఎం బుక్ చెక్ మెజర్మెంట్ చేస్తారు. అందువల్ల వాళ్లకే నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కొన్ని మండలాల్లో ఎక్కువ గ్రామ పంచాయతీ ఉండటం వల్ల రెండు, మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్, మండల విద్యాశాఖ వంటి అధికారులు బిల్లులు చెల్లింపులో మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటంతో పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థపై తగినంత అవగాహన లేకపోవడం వల్ల వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపడం లేదని సమాచారం. ఆలమూరు పంచాయతీ వారం ముందుగానే చెక్ పవర్ రద్దు చంద్రబాబు సర్కార్ నిర్ణయం పంచాయతీలలో చెల్లింపులకు ఆంక్షలు పెత్తనమంతా డీడీఓలదే ఏప్రిల్ 2తో ముగియనున్న పాలక వర్గాల పదవీకాలం మూడొంతులకు పైగా వైఎస్సార్ సీపీ సర్పంచ్లే -
నారాయణాచార్యులు జీవితం ఆదర్శం
అమలాపురం రూరల్: పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం ఆదర్శమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. శనివారం నారాయణాచార్యుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం టౌన్: తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాషా కోవిదుడని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీసీఐ పుల్లారావు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులు నేడూ చెల్లించొచ్చు అమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అలాగే సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. -
మమ్మేలుకోవా సీతారామా..!
కన్నుల పండువగా కళ్యాణం మహోత్సవంసీతమ్మకు సమర్పించిన కోవా కంత సీతారాముల కల్యాణం జరిపిస్తున్న పండితులుపి.గన్నవరం: స్థానిక పాత అక్విడెక్టు వద్ద కొలువైన పట్టాభి రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణానికి భక్తజనం భారీగా తరలివచ్చారు వాడపల్లి రాంబాబు అర్చకత్వంలో వైనతేయ నదీ తీరాన జరిగిన కల్యాణానికి సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో కోవాతో చేసిన వంద రకాల స్వీట్లు, అంతకు మించి పిండి వంటలను రామయ్య తరఫున సీతమ్మతల్లికి సారె (కంత) సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాతో పాటు పరిసర గ్రామాల భక్తులు పాల్గొనగా వారికి అన్నసమారాధన చేశారు. -
బ్లాక్స్పాట్లలో భద్రతా చర్యలు
● ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారుల పరిశీలన ● స్థానికులతో మాట్లాడి అభిప్రాయాలు, సూచనల సేకరణఆలమూరు: 216ఏ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ రావు, హైవే ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో రావులపాలెం–ఆలమూరు మండలం పొట్టిలంక వరకూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రూరల్ సిఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ రహదారిలోని జొన్నాడ వద్ద కోటిపల్లికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు, ఆంజనేయస్వామి గుడి, మూలస్థాన అగ్రహారం సెంటర్, చొప్పెల్ల లాకులు, చెముడులంక, మడికి గ్రామాల్లో ఆరు ప్రమాదకర ప్రదేశాలు (బ్లాక్ స్పాట్లు)ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలలో దుర్ఘటనలకు కారణాలను స్థానికులను అడిగి నష్ట నివారణ కోసం తీసుకోవలసిన చర్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించారు. జంక్షన్ల వద్ద అధిక ప్రమాదాలు 216ఏ జాతీయ రహదారి వెంబడి ఉన్న జంక్షన్లలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తగిన ప్రణాళికను రూపొందించి సత్వర కార్యాచరణను రూపొందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీమోహన్, పీడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. హైవే టీం లీడర్ ఎ.శ్రీనివాసు, ప్రాజెక్ట్ మేనేజర్ కె.బాలసుబ్రమణ్యం, రూట్ మేనేజర్ పి.రమేష్, టోల్ మేనేజర్ కేవీవీఎస్ఎన్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చైత్ర శుద్ధ దశమి శనివారం నుంచి బహుళ పాడ్యమి వరకు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 28న అంకురార్పణ, 29న ధ్వజారోహణం, రథోత్సవం, రాత్రి కల్యాణం, 30న పొన్న వాహన సేవ, 31న సదస్యం, ఏప్రిల్ 1న జల విహారోత్సవం, 2న చక్రస్నానం, 3న పుష్పోత్సవం నిర్వహిస్తారు. మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామాలకు.. కేసీఎం చొరవతో వచ్చిన బాధితులు అమలాపురం రూరల్: మస్కట్ వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరి మహిళలను కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో కేసీఎం అధికారులు కోనసీమకు సురక్షితంగా తీసుకు వచ్చారు. గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన బీరా శేషారత్నం గత ఏడాది ఆగస్టులో, పోతవరం గ్రామానికి చెందిన గుమ్మల్ల శ్రీలక్ష్మి అదే ఏడాది సెప్టెంబర్లో మస్కట్ వెళ్లారు. శేషారత్నం పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో మధుమేహానికి గురై అనారోగ్యం పాలైంది. దీంతో కాలికి గాయమై పరిస్థితి విషమించింది. పని చేయలేని స్థితిలో ఆమెను యజమానులు సంబంధిత కార్యాలయానికి అప్పగించారు. ఆమెను పంపిన ఏజెంట్ను సంప్రదించగా, భారతదేశానికి పంపేందుకు నిరాకరించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను సంప్రదించగా అధికారులు ఏజెంట్తో మాట్లాడి ఆమెను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. అలాగే లక్ష్మి మొదట ఒక ఇంటిలో పనికి చేరినప్పటికీ, పని నచ్చకపోవడంతో తిరిగి ఏజెంట్కు అప్పగించారు. అనంతరం మరో ఇంటిలో కుదిరి బుద్ధి మాంధ్యం ఉన్న బాలుడి బాగోగులు చూడాల్సి వచ్చింది. అక్కడ ఆమెకు పలు ఇబ్బందులు రావడంతో ఆమెను ఏజెంట్కు అప్పగించారు. అతడు రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విషయం తెలుసుకున్న కేసీఎం సభ్యులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబీ సఫియా పాల్గొన్నారు. 15 ప్రైవేటు బస్సులపై కేసులు రూ.74,800 అపరాధ రుసుము వసూలు రావులపాలెం: నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసి ఫిట్నెస్ రద్దు చేస్తామని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.74,800 అపరాధ రుసుము విధించినట్టు డీటీఓ తెలిపారు. నాలుగు పశువులపై పులి పంజా దేవీపట్నం: నెల రోజులకు పైగా జిల్లా వాసులను వణికిస్తున్న పులి గురువారం రాత్రి దేవీపట్నం మండలంలోకి ప్రవేశించింది. ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామం వద్ద కట్టి ఉంచిన వీరపాటి కొండబాబుకు చెందిన మూడు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. మరో చూడి ఆవును చంపి, కొంత మేర ఈడ్చుకుపోయి తినేసింది. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఈ పులి కొత్తవీధి సమీపాన ఉన్నట్లు అటవీ సిబ్బంది శుక్రవారం ఉదయం గుర్తించారు. వెంటనే తిరుపతి నుంచి వచ్చిన టీమ్, హనుమ టీమ్, స్థానిక అటవీ సిబ్బంది బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ పులికి మత్తు మందు ఇచ్చేందుకు మాటు వేశారు. అయితే, అక్కడి పొదల్లో సేద తీరుతున్న పులి మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని ఈనుకొండ వైపు మళ్లిపోయింది. దీంతో, పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పులి శుక్రవారం రాత్రికి తిరిగి రంపచోడవరం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముస్తాబైన వాడపల్లి వెంకన్న ఆలయం27ఆర్వీపీ41: 27ఆర్వీపీ42: వాడపల్లి వేంకటేశ్వరస్వామి -
ప్రమాదాలు తక్కువ
పీఎన్జీలో మీథేన్ ఉంటోంది. అంటే దీని అణు భారం 16 యూనిట్లు. అదే సాధారణమైన గాలి అయితే అణుభారం 32 యూనిట్లు. అంటే పీఎన్జీ మనం పీల్చే గాలి కన్నా తక్కువ బరువు ఉంటోంది. లీకులైనా తొందరంగా గాలిలో కలిసిపోతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువు. కాని ఎల్పీజీ బ్యూటేన్ పదార్థంతో కలిసి ఉంటోంది. దీనికి అణుభారం 58 వరకు ఉంటోంది. గాలి కన్నా బరువు ఎక్కువ. లీకుల సమయంలో ఈ గ్యాస్ గాలి కన్నా బరువుగా ఉండడం వల్ల ఎక్కువ సమయం కిందనే ఉండిపోతోంది. దీని వల్ల ప్రమాదాలు జరిగితే తీవ్రత అధికంగా జరుగుతాయి. – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, కోనసీమ కాలుష్య అధ్యయనకర్త, అమలాపురం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం మా ఇంటికి పైప్లైన్, మీటర్లు బిగించి ఆరేళ్లు దాటుతోంది. కాని ఇంత వరకు గ్యాస్ సరఫరా మొదలు కాలేదు. దీని వల్ల ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. గ్యాస్ ఇబ్బందులు ఎదురవుతున్న ఈ సమయంలో పీఎన్జీ ఉంటే వినియోగదారులకు, ప్రభుత్వానికి సరఫరా చేసే భారం తగ్గుతాయి. – మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ, విశ్రాంత ఏఎస్ఐ, పోలీసు క్వార్టర్స్, అమలాపురం -
కమనీయం.. రామయ్య కల్యాణం
పెదపూడి: వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మార్మోగుతున్న మంగళవాయిద్యాల ఘోష.. భక్తుల శ్రీజై శ్రీరామ్శ్రీ నినాదాల నడుమ.. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై.. కోదండ రాముని కల్యాణం కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శుక్రవారం జరిగిన కోదండ రాముని కల్యాణోత్సవాన్ని.. వేలాదిగా వచ్చిన భక్తులు కన్నులారా తిలకించి పులకించిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయ సమీపంలోని కోనేటికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వెల్లువలా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుక నిర్వహణ ఇలా.. ఉదయం 11.30 గంటలకు స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పండితులు కల్యాణ సంకల్పం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు స్వామి, అమ్మవార్ల కరకమలాలకు రక్షబంధనం గావించారు. యజ్ఞోపవీత ధారణ అనంతరం, వధూవరులను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు. మిథిలాధిపతి జనక మహారాజు తరఫున అర్చక స్వామివారు మధ్యాహ్నం 2.05 గంటలకు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రునికి ఇచ్చి కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 2.20 గంటల సుముహూర్తంలో కల్యాణమూర్తుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, హారతి ఇచ్చారు. వరుడు కోదండ రాముని తరఫున అర్చకుడు మధ్యాహ్నం 2.45 గంటలకు సీతమ్మవారికి మాంగల్యసూత్రధారణ గావించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసి, కల్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. తలంబ్రాలు, పట్టువస్త్రాలు అంతకు ముందు వధూవరులైన సీతారాములకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కూడా నూతన వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు సైతం స్వామివారికి తలంబ్రాలుగా మంచి ముత్యాలు సమర్పించారు. ఉదయం 11.45 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, తొమ్మిది రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకీలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, భువన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని, కల్యాణోత్సవాన్ని తిలకించారు. కోదండ రాముని కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పిల్లల వేలంపాట తంతు ఆనవాయితీగా జరిగింది. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ముత్యాల తలంబ్రాలు, అక్షతలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్తో పాటు ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల పర్యవేక్షణలో 106 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కల్యాణప్రదం.. మంగళసూత్ర దర్శనంముత్యాల తలంబ్రాలను భక్తులకు చూపిస్తున్న అర్చకులు ఫ వైభవంగా కోదండ రాముని పరిణయ వేడుక ఫ గొల్లల మామిడాడకు వెల్లువెత్తిన భక్తజనం -
ఫీజులు కట్టించుకోవడం లేదని నిరసన
తాళ్లరేవు: ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు కడితేనే పరీక్షల ఫీజు కట్టించుకుంటామని కోరంగి కై ట్ కళాశాల ప్రతినిధులు బెదిరించారంటూ గురువారం ఆ కళాశాల గేటు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు కడితేనే పరీక్షల ఫీజు కట్టించుకుంటామని నిబంధన విధించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.గంగాసూరిబాబు తదితరులు వెళ్లగా యాజమాన్యం బెదిరింపులకు పాల్పడిందంటూ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కొమరగిరిపట్నం పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు
అల్లవరం: ప్రజాసేవల పంపిణీ, పారదర్శక పాలన, రికార్డుల నిర్వహణ, పౌరుల సంతృప్తి తదితర అంశాలపై జరిగిన ఆడిట్లో ప్రపంచ నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తున్న పంచాయతీగా కొమరగిరిపట్నం పంచాయతీ ఎంపికయింది. కేరళకు చెందిన ప్రేమానంద్, సలీమ్ కెమ్, రాష్ట్ర పంచాయతీరాజ్ కోఆర్డినేటర్ ఇమామ్లతో కూడిన బృందం మూడురోజుల పాటు ఆడిట్ నిర్వహించింది. గ్రామ పంచాయతీలో అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం గురువారం జరిగిన సమావేశంలో ఐఎస్ఓ డ్రాప్ట్ సర్టిఫికెట్ను సర్పంచ్ రాకాపు విజయలక్ష్మికి బృందం సభ్యులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 24 పంచాయతీలను ఐఎస్ఓ సర్టిఫికెట్కు ఎంపిక చేయగా తొలిదశలో కొమరగిరిపట్నం పంచాయతీ ఐఎస్ఓ డ్రాఫ్ట్ గుర్తింపు పొందిందన్నారు. కొమరగిరిపట్నంలో పంచాయతీలో అందిస్తున్న సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎంపీడీఓ గౌరికుమారి, డిప్యూటీ ఎంపీడీఓ యు.నాగేంద్ర, ఎంపీటీసీ సభ్యులు మామిడిశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శి చిక్కం శ్రీను, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కొంగు బంగారు.. భక్తి పొంగారు..
● ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వైభవంతో అలరారుతున్న వాడపల్లి క్షేత్రం ● ‘ఏడు వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలమ’ని భక్తుల విశ్వాసం ● ప్రతీ శనివారం లక్షలాదిగా తరలివస్తున్న భక్త జనం ● రేపటి నుంచి వచ్చే నెల 3 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు కొత్తపేట/ఆత్రేయపురం: తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అత్యంత భక్తజనాదరణ పొందిన పుణ్యక్షేత్రంగా అనతికాలంలోనే వాడపల్లి ప్రసిద్ధి చెందింది. గౌతమీ – వశిష్ట గోదావరి నదుల నడుమ, పచ్చని పంట పొలాల మధ్య గల వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ గ్రామం వాడపల్లి. దీనికి కొద్దిదూరంలోనే విజ్జేశ్వరం సమీపంలో మరో వాడపల్లి ఉన్నందున, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలిచేవారు. కొన్ని సంవత్సరాల్లోనే భక్తుల విశ్వాసం చూరగొన్న ఈ వాడపల్లి కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ‘ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం’ అనే విశ్వాసంతో ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. శనివారం భక్తుల తాకిడి విపరీతంగా పెరిగి, ప్రదక్షిణలకు, స్వామి దర్శనానికి ఇబ్బందిగా మారడంతో కొందరు మిగిలిన ఆరు వారాల్లో ఏదో ఒకరోజును ఎంచుకుంటున్నారు. అదే రోజున ఏడు వారాలపాటు వచ్చి ఏడు చొప్పున ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా అన్ని రోజులూ మొక్కుబడులు తీర్చుకోవడానికి జనం వస్తుండడంతో ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్థల పురాణం ఇక్కడి దేవాలయంలోని మూర్తి ధారుమూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడ గల శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది... వైకుంఠంలో ఒకసారి మహర్షులు నారాయణుని దర్శించుకునేందుకు వచ్చి భూలోకమున పాపం, అధర్మం, అన్యాయం పెరుగుతున్నవి వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అప్పుడు విష్ణువు వారితో అధర్మం ప్రబలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను. కలియుగంలో అచ్చాస్వరూపుడనై గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలుస్తాను. ఆ మేరకు లక్ష్మీసహితంగా ఒక చందన పేటికలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. ఆ ప్రకారం కలియుగంలో సుమారు 400 సంవత్సరాల క్రితం గౌతమీ నదీ తీరాన వున్న నౌకాపురి తరువాత ఓడపల్లి (నేటి వాడపల్లి) ఋషి పుంగవులతో తపోవనంగా విరాజిల్లేది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. రక్త చందనం రూపంలో గోదావరిలో స్వామివారి విగ్రహం ఉన్నట్టు భక్తులకు ఋషులు కలలో చెప్పారు. ఆ కొయ్య విగ్రహాన్ని బయటకు తీసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగించి ఏటి ఓడ్డున ప్రతిష్టించారు. దేవర్షి నారదుడు కూడా వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టామహోత్సవంలో పాల్గొన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి పూజలు అందుకుంటున్న కోనేటి రాయుడిని ప్రస్తుతం పూజలందుకుంటున్న చోట తిరిగి పునః ప్రతిష్ఠించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. 550 ఎకరాలు స్వామివారికి విరాళం ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే సంపన్న వ్యాపారి 1759వ సంవత్సరంలో నిర్మించారు. గజేంద్రుడికి స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహారాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు అప్పట్లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణకు 275 ఎకరాల భూమిని విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు. విరాళంగా ఇచ్చిన భూములను అర్చక మాన్యాలు, రజక, మంగలి, సన్నాయి, ధూపదీప నైవేద్యం మాన్యాల కింద విడదీసి స్వామి వారికి సర్వ హక్కులు కల్పించారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో వీరంతా జీవనం సాగిస్తూ స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. ఏడు వారాల దర్శనంతో.. ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ అధీనంలోనికి తీసుకున్న అనంతరం కొంతకాలం పాటు సేవలు అంతంత మాత్రంగానే కొనసాగించారు. ఇటీవల స్వామిని దర్శించే వారి సంఖ్య విశేషంగా పెరిగింది. దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి శనివారం సుమారు రూ.55 లక్షలకు పైబడి ఆదాయం సమకూరుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునందుకుని దాతలు, కాంట్రాక్టర్లు ఈ క్షేత్రం అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆలయ ఆవరణలో గోశాల, భారీ రేకు షెడ్లు, అన్నదాన భవనం నిర్మించారు. రూ.55 కోట్లతో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.5.5 కోట్లతో వకుళమాత అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేస్తున్నారు. రూ.65 లక్షలతో శాశ్వత వార్షిక కల్యాణ వేదికను ఊబలంక, రావులపాలెం కాంట్రాక్టర్లు నిర్మించారు. రూ.22 లక్షలతో తాగునీరు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 29న స్వామి కల్యాణం ఈ క్షేత్రంలో చైత్రశుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శనివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. 28 న అంకురార్పణ, ధ్వజారోహణం, 29న కల్యాణం, రథోత్సవం, 30న పొన్నవాహనంపై గ్రామోత్సవం, 31న సదస్యం, ఏప్రిల్ 1న జల విహారోత్సవం, 2న చక్రస్నానం, 3న పుష్పోత్సవం నిర్వహిస్తారు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంశ్రీవేంకటేశ్వర స్వామివారుఅన్ని ఏర్పాట్లూ చేశాం గత కల్యాణోత్సవాల కంటే మించి భక్తుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలతో ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ మహేష్కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. – నల్లం సూర్యచక్రధరరావు, దేవదాయ శాఖ డీసీ, ఆలయ ఈఓ -
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. -
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
అమలాపురం రూరల్: జిల్లాలో పెట్రోలు, డీజిల్కు ఏ విధమైన కొరత లేదని జిల్లా వినియోగం ఎంతయితే ఉందో అంత పెట్రోలు డీజీల్ నిల్వలు బంకులకు వస్తున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎవరూ కంగారు పడి ఎక్కువ ఆయిల్ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని అన్నారు. పెద్ద పెద్ద క్యాన్లలో, బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దని, నేరుగా వాహనాల్లోకి మాత్రమే పోయాలని బంకు యజమానులకు సూచించారు. వీవీ ప్యాట్, ఈవీఎంలకు నిరంతర పర్యవేక్షణ ముమ్మిడివరం: ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాముకు నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని జేసీ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎయిమ్స్ కళాశాల మూడో అంతస్తులో గోదాములను ఆమె వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక, విద్యుత్ పరికరాలను పరిశీలించి రిజిస్టర్లో సంతకం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సిటీ: నా ఇంటిపై దాడి చేసి, వాహనాలను తగులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారికి శిక్ష పడేదాకా పోరాడుతానని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్ను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తనపై అత్యంత కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో40 శాతం ఓట్లు ఉన్న పార్టీలో, 20 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంలో నేను ఒక నాయకుడినన్నారు. ప్రభుత్వం అక్రమంగా నన్ను జైల్లో పెట్టిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది నాకు అండగా నిలిచారన్నారు. వారందరినీ కలిసి కృతజ్ఞత చెప్పేందుకు గోదావరి జిల్లాకు వచ్చానన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదు మానవ హక్కుల చైర్పర్సన్ శైలజ తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, ఒక వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడి ఉండటం అసాధ్యమన్నారు. పోలీస్శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. గిరిజన దివ్యాంగురాలిపై అఘాత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
రావులపాలెం పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు
పాలకవర్గానికి డ్రాఫ్ట్ కాపీ అందజేత రావులపాలెం: కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రపంచ నాణ్యత ప్రమాణాలు (ఐఎస్ఓ) సర్టిఫికెట్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామపంచాయతీ దక్కించుకుంది. కొద్ది నెలలుగా ఈ సర్టిఫికెట్కు సంబంధించి ఈ పంచాయతీ చేపట్టిన ప్రయత్నం ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 పంచాయతీలు పోటీ పడగా రావులపాలెం పంచాయతీ దానిని దక్కించుకుంది. మూడు రోజులుగా కేరళకు చెందిన ఐఎస్ఓ ఆడిట్ బృందం ప్రేమానంద్ సీఎం, సలీం కెమ్, రాష్ట్ర పంచాయతీరాజ్ కోఆర్డినేటర్ ఇమామ్ పలు రికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్టిఫికెట్ను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి వారం రోజుల అనంతరం అధికారిక సర్టిఫికెట్ రానుంది. సర్పంచ్ తాడేపల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శ్రీనివాస్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చిలువూరి సతీష్ రాజు తదితరులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, దాతలు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ఈ ఘనత దక్కిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ కృషి ప్రశంసనీయమని వారు కొనియాడారు. -
‘ఆదిరెడ్డి’ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల
● అట్రాసిటీ కేసు నమోదు చేసి టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ ● అప్పారావు వైఖరిపై అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ, దళితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆదిరెడ్డి అహంకార తీరుకు నిరసనగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. దళితులను అవమానించిన ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకార పూరిత వైఖరిని ఖండిస్తూ.. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ఆదిరెడ్డి అరాచకాలు నశించాలని, దళితులకు క్షమాపణ చెప్పాలి, ఆదిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నివాళులు అర్పించి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయి : సుధాకర్బాబు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తండ్రిగా, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమని, వివక్షతో కూడుకున్నవన్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలోని దళిత నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : జడ శ్రావణ్కుమార్ ప్రముఖ న్యాయవాది, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ టీడీపీలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దళిత వర్గాలను వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు.. ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయపరంగా ఏ స్థాయి వరకు అయినా వెళ్లి కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పారావు విషయంలో టీడీపీలోని దళిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అప్పారావు మాట్లాడిన విధంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడి ఉంటే.. కేసులు పెట్టి జైలుకు పంపించేవారన్నారు. దళితుని మృతదేహాన్ని ఒక వీధిలోకి రాకుండా అడ్డుకున్న ఘటన సిగ్గుచేటన్నారు. టీడీపీకీ దళితుల రక్షణ ఆలోచన లేదా : మాజీ ఎంపీ భరత్రామ్ మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దళితులపై దూషణ, దాడుల సంఘటనలో అప్పారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆదిరెడ్డికి టీడీపీ అధిష్టానం కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ దళితుల రక్షణపై ఆ పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం, రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్సీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితులకు వివక్ష తప్పడం లేదన్నారు. ఆదిరెడ్డిపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి పోలీసులు విలువ ఇవ్వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఒక వివాదంలో పెద్దమనిషిగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి దళితులను కులం పేరుతో దూషించడం, చంపేస్తానని బెదిరించడం, దాడులు చేయడం గర్హనీయమన్నారు. కేసు కట్టేంతవరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడతారా? రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడుస్తోందని ప్రశ్నించారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు కూడా దళితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీలను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాయకులు ప్రదర్శనగా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఆదిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయసారధి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నాయకులు కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న పాల్గొన్నారు. -
పాత నేరస్తులపై నిఘా విస్తృతం
అధికారులకు ఎస్పీ రాహుల్ మీనా ఆదేశం అమలాపురం టౌన్: జిల్లాలోని పాత నేరస్తులపై నిరంతర నిఘా మరింత విస్తృతం చేయాలని ఎస్పీ రాహుల్ మీనా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులపై వారి నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదిలికలపై నిఽఘా పెంచి తరుచూ కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు, కామెంట్లు వల్ల సమాజం అలజడికి గురువుతోందన్నారు. సమావేశంలో తొలుత ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఎస్పీ, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించి నేర నియంత్రణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ 14న జిల్లాలో అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఐజీ ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై ఆయన సమీక్షిస్తూ రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ నాగ ప్రసాద్తో పాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పెట్రోల్ సెగ!
సాక్షి, అమలాపురం: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం జిల్లాలో పలు రంగాలపై నెమ్మదిగా పడుతోంది. ఎగుమతులు నిలిచి కొబ్బరి, వనామీ రైతులు.. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా వాసులకు తాజాగా పెట్రోల్.. డీజిల్ సెగ తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వేలాడుతుండడంతో వాహన చోదకులు హైరానా పడుతున్నారు. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలతో కలుపుకొని 18 మండలాల్లో సుమారు 136 పెట్రోల్ బంకులు ఉన్నాయని అంచనా. వీటిలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీఎల్)తో పాటు నయారా, రిలయన్స్ కంపెనీలకు చెందిన బంకులు ప్రధానమైనవి. హెచ్పీసీఎల్, ఎల్ఓసీ కంపెనీలకు కోరుకొండ సమీపంలో ఉన్న గుమ్మళ్లదొడ్డి నుంచి డీజిల్, పెట్రోల్ వస్తుండగా బీపీఎల్కు వైజాగ్ నుంచి, నయారాకు కాకినాడ నుంచి వస్తున్నాయి. ఆయా బంకులలో సామర్థ్యాన్ని బట్టి ప్రెటోలు, డీజిల్ విక్రయాలు సాగుతుంటాయి. పట్టణాలు, వాటిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు, రావులపాలెం, కొత్తపేట, తాటిపాక, ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లోని ప్రధాన బంకులలో పెట్రోల్ రోజుకు ఎనిమిది వేల లీటర్ల నుంచి పదివేల లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఇక డీజిల్ నాలుగు వేల నుంచి ఐదు వేల లీటర్ల వరకు విక్రయిస్తుంటారు. చిన్న బంకులలో పెట్రోల్ రోజుకు మూడు వేల లీటర్ల నుంచి నాలుగు వేల లీటర్ల వరకు విక్రయిస్తుండగా, డీజిల్ రెండు వేల నుంచి మూడు వేల లీటర్ల వరకు ఉంటున్నాయి. చిన్నా, పెద్ద పెట్రోల్ బంకులు అన్నిటిలోని కలిపి జిల్లాలో సగటున రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ సుమారు 4.08 లక్షల లీటర్ల విక్రయాలు కలిపి మొత్తం కలిపి 10.88 లక్షల లీటర్ల చమురు అమ్ముడవుతోంది. అయితే జిల్లాలో ఐ.పోలవరం మండలంతో పాటు కాకినాడకు రాకపోకలు సాగించేవారు పుదుచ్చేరి యానాంలో ఎక్కువగా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ పెట్రోల్ మీద లీటరు రూ.13, డీజిల్ మీద రూ.10 వరకు ధర తక్కువ. దీని వల్ల రామచంద్రపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల వారు అటు కాకినాడ, ఇటు అమలాపురం రాకపోకలు సాగించేవారు యానాంలో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. సరఫరా ఆలస్యం.. అతి జాగ్రత్తతో అధిక కొనుగోళ్లు ఇజ్రాయిల్తో కలసి అమెరికా ఇరాన్పై దండయాత్ర మొదలైన తరువాత నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, అన్నదాన ప్రసాద కేంద్రాల వారు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీనితో పలు బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులతో కనిపిస్తున్నాయి. కంపెనీల నుంచి జిల్లాలోని బంకులకు సకాలంలో ట్యాంకర్లు రావడం లేదు. ‘వారం రోజుల క్రితం వరకు ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల కల్లా బంకుల వద్ద డెలివరీ అయ్యేది. ఇప్పుడు మూడు రోజుల సమయం పడుతోంది’ అని అమలాపురానికి చెందిన ఒక ఏజెన్సీ నిర్వాహకుడు ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాప్యంతో బంకుల వద్ద నిల్వలు నిండుకుని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని అయన తెలిపారు. పెద్ద బంకులలో ట్యాంకర్ పెట్రోలు ఒక రోజు మాత్రమే వస్తోంది. ఇప్పుడు సకాలంలో రాకపోవడంతో కొరత ఏర్పడుతోంది. జనం అతి జాగ్రత్తకు పోయి అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండడం కూడా కొరత ఏర్పడడానికి కారణమవుతోంది. ‘ముందు ముందు పెట్రోల్ దొరకదని ఫుల్ ట్యాంకు చేయించుకునేవారు ఎక్కువయ్యారు. రోజువారి సగటు విక్రయాల కన్నా గత రెండు, మూడు రోజుల నుంచి 30 శాతం అధికంగా విక్రయాలు సాగుతున్నాయంటే వాహన చోదకుల అతి జాగ్రత్తే కారణమని’ బంకు యజమానులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఖాలీ బాటిళ్లు, పీపాలలో లూజు పెట్రోల్, డీజిల్ విక్రయాలు చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెట్రో ఉత్పత్తులకు కొరత లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. క్షేత్రస్థాయిలో మధ్య ప్రాచ్యంలో సాగుతున్న యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సరఫరాపైన.. కొనుగోళ్లపైన పరిమితులు విధిస్తారు.. పెట్రోలు లేక బంకులు మూసేస్తున్నారు.. ఇటువంటి గాలి వాటం మాటలతో చాలా మంది అవసరం లేకపోయినా సరే చేతనైనంత నిల్వ చేసుకోవాలన్న ఆలోచనతో సమీప బంకులకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారు. దీంతో విక్రయాలు అమాంతం పెరిగిపోయాయి. తద్వారా బంకులు త్వరగా నిండుకుంటున్నాయి. నిజానికి మినిమమ్ స్టాక్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రకారమే ఏ బంకు యజమానులైనా ఆయా చమురు ఉత్పత్తి సంస్థలకు ఇండెంట్లు పెట్టి సరకు తెప్పించుకుంటారు. వినియోగదారుల్లో ఈ ట్రోలింగులు, రూమర్లు విపరీతంగా వ్యాప్తి చెంది బంకులు త్వరగా ఖాళీ అయిపోతుండడంతో ఇండెంట్ల ప్రకారం సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు రావడం ఆలస్యమవుతోంది. పర్యవసానంగా బంకుల వద్ద పెట్రోలు లేదన్న బోర్డులు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితి వినియోగదారులను మరింత అయోమయానికి గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కాకుండా స్థానిక పెట్రో సంస్థల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులకు కొరత లేదన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఆక్వా రైతుల ఆందోళన పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం తొలిగా పడేది ఆక్వా రైతుల మీదనే. ఇప్పటికే యుద్ధం వల్ల వెనామీ రొయ్యల రేట్లు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు తగ్గి రైతులు నష్టపోతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు డీజిల్ దొరకకపోతే రైతులు పంట నష్టపోయే ప్రమాదముంది. వెనామీ సాగుకు విద్యుత్ సౌకర్యం ఉన్నా 24 గంటలు పూర్తిస్థాయిలో సరఫరా లేదు. కోతల వల్ల ఏరియేటర్లను డీజిల్ మోటార్లు, జనరేటర్ల మీద నడపాల్సి ఉంది. అలాగే బోర్ల ద్వారా నీటి తోడకానికి సైతం కొంతమంది డీజిల్ మోటార్ల పైనే ఆధారపడుతుంటారు. ఈ సమయంలో డీజిల్కు కొరత ఏర్పడితే పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం నేపథ్యంలో పెట్రో ధరలు, నిల్వలపై రూమర్లు ముందు జాగ్రత్త చర్యలతో పెట్రోల్ కోసం వినియోగదారుల పరుగులు 30 శాతానికి మించి పెరిగిన విక్రయాలు ఇండెంట్ పెట్టిన మూడు రోజులకు కానీ బంకులకు చేరుకోలేకపోతున్న ట్యాంకర్లు క్షేత్రస్థాయిలో వెలుస్తున్న ‘నో స్టాక్’ బోర్డులు పలుచోట్ల మూసివేస్తున్న యజమానులు -
భక్తి పతాక స్థాయిలో..
ఇనుగంటివారిపేటలో నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం ఫ ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఫ ఆలయాలు లేకుండానే ఏర్పాటు ఫ అక్కడ కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం ఫ ప్రత్యేకతను చాటుతున్న వైనం సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది. ఆలయాలు ఉన్నా.. ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది. ఎందుకు నెలకొల్పారంటే.. పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు. ఎంతో విశిష్టమైంది తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది. –ఆరాధ్యుల వెంకట నారాయణ, ఇనుగంటివారిపేట కోరిన కోర్కెలు నెరవేరతాయి పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –సత్యం రాంపండు, సర్పంచ్, ఇనుగంటివారిపేట -
సృజనమేవ జయతే
ఆలోచనకు సృజన తోడైతే.. పనికిరాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం -
ప్రాణం తీసిన ఈత సరదా
ఫ చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు ఫ ఇందులో ఇంటర్ విద్యార్థి మృతి కాకినాడ రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్మాకాలనీలో విషాదం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
మెరిసిపోయి.. మురిసిపోయి
ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్పీటర్ తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో కుల వివక్ష
పి.గన్నవరం: చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ప్రేమ పేరుతో మోసం
యువకుడిపై పోక్సో కేసు నమోదు ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన
వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. -
8న ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 8వ తేదీన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు, సర్వసభ్య సమావేశం జరుగుతాయి. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వైఎన్వీ కుమార్ (నీలాద్రి), రమేష్బాబు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేవారి నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం 1.15 గంటలకు సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కాగా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలు, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డేటా పత్రాలను వెంట తీసుకుని రావాలి. మరిన్ని వివరాలకు 89851 33338, 95508 44046 నంబర్లను సంప్రదించవచ్చు. విఘ్నేశ్వరుని ఆలయానికి రూ.31.48 లక్షల ఆదాయం అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయ, ధర్మదాయశాఖ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 56 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ. 30,35,547, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.1,12,890 కలిపి మొత్తం రూ.31,48,437 లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు, తెలిపారు. అలాగే హుండీల్లో బంగారం 500 మి.గ్రాములు, వెండి 118 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 12 లభించాయన్నారు. దేవదాయ శాఖ అధికారులు, అర్చక స్వాములు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, పోలీసుల సమక్షంలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. వెంకన్నకు వెండి శంఖం సమర్పణ ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామికి మట్టపర్తి మరిడి కుమార్, పూర్ణిమ దంపతులు, కుటుంబ సభ్యులు (ముమ్మిడివరం మండలం అన్నంపల్లి) రూ.లక్ష విలువైన 307 గ్రాముల వెండి శంఖం, ఆలయ నిత్య అన్న ప్రసాద పథకానికి రూ.10,116 విరాళం సమర్పించారు. ఈ వెండి శంఖాన్ని మంగళవారం ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషుకు స్వామివారి ఆలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ పర్యవేక్షకుడు రాంబాబు స్వామివారి ఫొటో అందించారు. కువైట్ నుంచి స్వదేశానికి.. అమలాపురం రూరల్: ఉపాధి కోసం కువైట్కు వెళ్లి, అక్కడ నరకయాతన పడిన కొల్లాటి ధనలక్ష్మి క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన కె.అర్జునరావు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్టా ధనలక్ష్మి ఉపాధి కోసం కువైట్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సత్తిబాబు అనే ఏజెంట్ ద్వారా 2024 అక్టోబర్ 22న కువైట్ వెళ్లింది. అక్కడ తొలుత ఒక కార్యాలయంలో, నవంబర్ 11 నుంచి ఒక ఇంట్లో పని మనిషిగా చేరింది. అయితే యజమానులు ఆమెను చిన్న కారణాలకే కొట్టడం, మా నసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఈ వేధింపుల మధ్య పని చేయలేక, తీవ్ర ఒత్తిడితో ధనలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్కు తెలియజేశారు. దీంతో జిల్లా యంత్రాంగం, కేసీఎం బృందం.. కువైట్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ముందుగా ఆమెను అక్కడి ఎంబసీకి తరలించి, నెల రోజులకు పైగా ఆశ్రయం కల్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జేసీ, కేంద్ర నోడల్ అధికారి టి.నిషాంతి, సమన్వయకర్త గోళ్ల రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. -
ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు
పి.గన్నవరం: ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మరించారని మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించారు. పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని, సీపీఎస్ను మెరుగైన రీతిలో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ప్రకారం ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ పి.శ్రీపల్లవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాల్లో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పి.మురుగేశ్వరరావు, వరిగేటి రత్నం, యూటీఎఫ్ మండల శాఖల అధ్యక్షులు ఎన్వీవీ ప్రసాద్, ఎం.సూర్యనారాయణ, టి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పిస్తున్న మాజీ ఎంపీ అనురాధ, మాజీ మంత్రి ఆర్కే రోజా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు అల్లవరం: దేవగుప్తంలోని ఉమా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులుగా నక్షత్ర నవగ్రహ శివపంచాయతన సుబ్రహ్మణేశ్వర యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. చివరి రోజు మంగళవారం వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పోచినపెద్ది శ్యామ్శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగానికి మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ చింతా అనురాధ విచ్చేశారు. వారికి పండితులు వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. భీమవరం వాస్త వ్యులు వారణాసి సేతు మాధవ లక్ష్మీనరసింహమూర్తి వారిచే జరిగిన సుబ్రహ్మణేశ్వర స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలను రోజా, అనురాధ అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు వంటెద్దు వెంకయ్య నాయుడు, తిక్కా ప్రసాద్, సత్యం కాపు, అంబికా శ్రీను, బసవా అనిల్ పాల్గొన్నారు. -
నిక్షయ్ పోషణ్తో క్షయ రోగులకు పౌష్టికాహారం
అమలాపురం రూరల్: నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా క్షయ రోగులు త్వరగా కోలుకోవడానికి పౌష్టికాహారం అందజేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి పిలుపు నిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ టీబీ నిర్మూలనలో భాగంగా భారత ప్రభుత్వం రోగులకు ఆర్థిక, పోషకాహార మద్దతు అందించడానికి పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. పేదరికం కారణంగా ఆహారం సరిగ్గా తీసుకోలేని రోగులకు సహాయం చేయడానికి నిక్షయ్ పోషణ్ యోజనను ప్రారంభించారన్నారు. ప్రతి టీబీ రోగికి చికిత్స కొనసాగినంత కాలం నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ మొత్తం నేరుగా రోగి ఆధార్తో అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయబడుతుందన్నారు. ఈ డబ్బుతో రోగులు పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు వంటి బలవర్థకమైన ఆహారాన్ని కొనుగోలు చేసి పోషకాహారాన్ని పొందాలన్నారు. దాతలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు టీబీ రోగులను దత్తత తీసుకుని అందించిన పోషకాహార కిట్లను జేసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. టీబీ ముక్త సిల్వర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, అదనపు డీఎంహెచోవో సీహెచ్వీ భరతలక్ష్మి, డాక్టర్ల సుమలత, విజయేంద్ర, డీసీహెచ్ ఎస్.కార్తిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సంక్షోభంలో ఆక్వా రంగం
అల్లవరం: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి, ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం సంక్షోభంలో నెట్టివేసిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అల్లవరం మండలం గోడిలోని ఆయని నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల హెక్టార్లలో సుమారు ఆరు లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నాన్నారు. వారందరూ ఉత్పత్తి చేసిన రొయ్యలను ఒక సామాజికవర్గానికి చెందిన కొనుగోలుదారులందరూ సిండికేట్గా మారి, కౌంట్ ధరలను 40 శాతం తగ్గించి, ఆక్వా రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వారందరికీ చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్లకు అన్ కండిషనల్గా విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీచ్చిన చంద్ర బాబు, అధికారం చేపట్టి రెండేళ్లయినా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించడంలో విఫలమయ్యారన్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధులు ఎందుకు సమకూర్చలేదో ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఏపీ నుంచి 80 శాతం రొయ్యల ఎగుమతులు యూరప్, అమెరికాలకు జరుగుతున్నాయన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి, మనకూ ఎలాంటి సంబంధం లేకపోయినా కౌంట్ ధరలు నానాటికి తగ్గిపోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని కాపాడారని తెలిపారు. కరోనా సమయంలోనూ ఆదుకున్నారని, ధరల స్థిరీకరణ ఏర్పాటుచేసి ఆక్వా రైతులకు భరోసా నిలిచారని తెలిపారు.ఫ చంద్రబాబు విధానాలే కారణం ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ -
పోలీస్ గ్రీవెన్స్కు 34 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 34 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి గ్రీవెన్స్ను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఎస్పీ, ఏఎస్పీలకు అందించారు. అర్జీదారులుతో వారు ముఖాముఖి చర్చింది వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి పోలీస్ అధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఉండడంతో ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కారాలకు సూచనలిచ్చారు. జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు కోనసీమ విద్యార్థులుఅమలాపురం రూరల్: ఈ నెల 24 నుంచి 28 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా 28వ సబ్–జూనియర్ బాల బాలికల జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు జరుగుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాత బాబు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచి గోసంగి సందీప్, జి.శశిధర్ నాగ్, సాయి సూర్య, అప్పారి యశ్వంత్, మట్టపర్తి అవంతి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ క్రీడా దినదినాభివృద్ధి చెందుతోందని, దానికి నిదర్శనమే ఈ ఐదుగురు జాతీయ స్థాయికి ఎంపిక అవడమని తెలిపారు. జిల్లాకు చెందిన కేత సాయి దుర్గా ప్రసాద్, రాష్ట్ర బాలుర, బాలికల జట్టు కోచ్గా యాండ్ర గౌతమ్, కోచ్లు గా రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాంచీలో శిక్షణలో ఉన్నారని, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం తీసుకురావాలని తెలిపారు. న్యాయసేవలు వినియోగించుకోండి కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కాకినాడ స్పెషల్ సబ్జైలును సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆర్యోగ పరిస్థిఽతులు, వసతులు, భోజనం ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్స్, సేవలపై అడిగి తెలుసుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు మాట్లాడుతూ మాకు కేసులో రెండు షూరిటీలతో బెయిల్ అనుమతి వచ్చిందని, రెండు షూరిటీలు పెట్టుకునే స్థామత లేదని ఒక్క షూరిటీకి అనుమతి ఇప్పించాలని అడిగారు. -
శెట్టిబలిజల సంస్కర్త దొమ్మేటి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ అనురాధ అమలాపురం టౌన్: శెట్టిబలిజ సామాజిక వర్గ సంఘ సంస్కర్తగా దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ జోన్–2 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. దొమ్మేటి జయంతి సందర్భంగా స్థానిక హైస్కూలు సెంటర్లో సోమమవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. తొలుత ఆ సెంటర్లో గల వెంకటరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. శెట్టిబలిజల సామాజిక వర్గానికి ఆ పేరు రావడానికి ఆయన చేసిన కృషిని వివరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (బులి నాని), రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల చిరంజీవిరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, కోనసీమ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి, పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, సంసాని శ్యామలాదేవి, పార్టీ నాయకులు వాసర్ల సుబ్బారావు, చెల్లుబోయిన నాని, అంబికా శ్రీను, దొంగ చిన్న తదితరులు దివంగత వెంకటరెడ్డి శెట్టిబలిజీలకు చేసిన సేవలను, త్యాగాలను గుర్తు చేశారు. -
షర్మిల ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మ
– వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణికాకినాడ రూరల్: రాజకీయ ఉనికి కోసం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మ అవతారం ఎత్తారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని అంతర్గత వ్యవహారానికి సంబంధించిన లేఖ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీలో ముందుగా ప్రత్యక్షమవడాన్ని చూస్తుంటే షర్మిల తన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని బజారున పడేశారన్నది స్పష్టం అవుతోందన్నారు. రాజకీయాల్లో మాట తప్పని నైజం ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన బాటలో కుమారుడు జగన్మోహన్రెడ్డి పయనిస్తుంటే అదే కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మాత్రం దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న చరిష్మాను, పరువును షర్మిల మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ను నేరుగా ఢీకొట్టలేని కూటమి ప్రభుత్వం మహిళలను అడ్డం పెట్టుకుని కుటుంబాల జోలికి వెళ్లడంపై నాగమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని భారతమ్మను లక్ష్యంగా చేసుకుని జనసేన మహిళా కార్యకర్త సుభాషిణి అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. సభ్యత సంస్కారం లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను దూషించినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. -
నారికేళం.. వేళాకోళం!
● యుద్ధం పేరుతో జిల్లాలో ధరకు కోత ● గత నెలలో రూ.20 వేలు ఉండగా నేడు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ● ఇష్టారాజ్యంగా దళారుల వ్యవహారం ● మండిపడుతున్న కొబ్బరి రైతులు సాక్షి, అమలాపురం/అంబాజీపేట: బోడి గుండుకు.. మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి వనామీ రొయ్యల ధరలను తగ్గించినట్టుగానే తాజాగా దళారులంతా ఏకమై కొబ్బరి కాయ ధరలు తగ్గించేశారు. శుభకార్యాలు.. పండుగలు లేవంటూనే... మరో వైపు యుద్ధ ప్రభావం వల్ల ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయంటూ ధరలకు కోత పెట్టారు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి కొబ్బరికాయల ధరను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కొబ్బరి కాయల ధరలు గణనీయంగా తగ్గాయి. వెయ్యి కొబ్బరికాయల ధర (పచ్చికాయ, నీటికాయ) ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. యుద్ధం ప్రారంభానికి ముందు దీని ధర రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు ఉండేది. యుద్ధం పేరుతో ఏకంగా రూ.మూడు వేల వరకు కోత పెట్టారు. గత నెలలో ఇవే రోజులలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు పలికేది. దానితో పోల్చుకుంటే వెయ్యి కాయలకు రూ.ఆరు వేలు తగ్గినట్టు అంచనా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఏడాదికి సగటున 91 కోట్ల కొబ్బరి కాయల దిగుబడిగా వస్తోంది. మొత్తం మార్కెట్ పచ్చికొబ్బరి కాయ ధర మీదనే ఆధారపడుతోంది. కొబ్బరి కాయ ధర గత ఏడాది కొంత వరకు ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొబ్బరికి మంచి ధర వచ్చింది. పండగలు పూర్తయినా శుభ కార్యక్రమాలు జరుగుతున్నందున కొబ్బరికి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఉమ్మడి తూర్పు నుంచి రోజుకు 70 లారీల వరకు పచ్చి కొబ్బరి ఎగుమతి అవుతోంది. అయినా యుద్ధాన్ని బూచిగా చూపి దళారులు ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే గుజరాత్, మహారాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయ ఎగుమతులు తగ్గాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. వేసవి సీజన్ ఆరంభం అవుతుండడంతో కొబ్బరి బొండాలకు డిమాండ్ వస్తోంది. కోనసీమ జిల్లా నుంచి ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి కొబ్బరి బొండాల రవాణా పెరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరుకు బొండాల ఎగుమతి జోరందుకున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మరింత పెరుగుతాయి. పండగలు లేకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గినా ఆ లోటును కొబ్బరి బొండాలు తీరుస్తాయి. ఈ విధంగా చూసినా ఇప్పుడు యుద్ధం సాకుతో ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు. కురిడీ ధరలు రివర్స్ కొబ్బరి పచ్చికాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత నెలలో కురిడీ కొబ్బరి పాతకాయ గండేరా (పెద్దకాయ) వెయ్యి కాయల ధర రూ.31,500, గటగట (చిన్నకాయ) ధర రూ.29 వేల వరకు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.25 వేలకు, గటగట రూ.22 వేలకు తగ్గింది. ఇక కొత్తకాయ కురిడీ గత నెలలో గండేరా రూ.25 వేలు, గటగట రూ.22 వేలు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.24 వేలు, గటగట రూ.21 వేలకు తగ్గింది. కొబ్బరి కాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా తగ్గడంతో అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో నిరుత్సాహ వాతావరణం అలముకొంది. -
ఉమ్మడి గోదావరి జిల్లా స్ట్రాంగ్ మెన్ వీరేంద్ర
● రన్నర్గా నిలిచిన యశ్వంత్ ● ముగిసిన పవర్ లిఫ్టింగ్ పోటీలు అమలాపురం రూరల్: ఉమ్మడి గోదావరి జిల్లాల స్ట్రాంగ్ మెన్ విన్నర్గా అమలాపురానికి చెందిన ఎం.వీరేంద్ర, రన్నర్గా యశ్వంత్ గెలుపొందారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో జనహిత కార్యాలయంలో జరిగిన పోటీలు సోమవారంతో ముగిసాయి. పోటీలలో 206 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీ పడగా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్కు చెందిన వీరేంద్ర 690 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగ్ మెన్గా నిలిచారు. యశ్వంత్ 570 కేజీల బరుఎత్తి రన్నర్గా గెలుపొందారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 24 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజేతలు జూనియర్ విభాగంలో 59 కేజీల భాగంలో శ్రీరామ్ (కాకినాడ), 66 కేజీల విభాగంలో కె.ఎస్.మణికంఠ (రామచంద్రపురం), 74 కేజీల విభాగంలో బి.యశ్వంత్ (అమలాపురం), 83 కేజీల విభాగంలో పి.భానుచంద్ర (కాకినాడ), ప్లస్ 83 కేజీల విభాగంలో కె.సుధీర్ (శివకోడు), సీనియర్స్ విభాగంలో 59 కేజీల విభాగంలో ఎన్.గణేష్ (ఏలూరు), 66 కేజీల విభాగంలో ఎన్.వెంకటేశం (అమలాపురం), 74 కేజీల విభాగంలో కె.బాల కిషోర్ (రామచంద్రపురం), 83 కేజీల విభాగంలో ఎం.వీరేంద్ర (అమలాపురం), ప్లస్ 83 కేజీల విభాగంలో బి.పెద్దిరాజు (కలిదిండి) గెలుపొందారు. కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వంటెద్దు వెంకన్న నాయుడు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పప్పుల శ్రీరామ్ చంద్రమూర్తి విజేతలకు బహుమతులు అందచేశారు. -
కుందాలపల్లి ఘటన బాధ్యులను అరెస్టు చేయాలి
విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్ అమలాపురం రూరల్: కుందాలపల్లి ఘటనలో దోషులను జైలులో పెట్టాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది దళితులు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టేలా లోకేష్ రెడ్బుక్లో పెట్టాలని కోరారు. బాధ్యులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదలు చేస్తున్నందు వల్లనే కోనసీమలో పదే పదే ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వికేసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ మాట్లాడుతూ ఎస్సీలపై దాడుల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే స్పందించక పోవడం వల్లే మూకలు ఈ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ఇంత వరకు కలెక్టర్, ఎస్పీ స్పందించి ఆ గ్రామంలో ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. దోషులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పి.గన్నవరం స్టేషన్ను ముట్టడించడంలో పది మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి నేటికీ అరెస్టు చేయకపోగా, ఒక యువకుడిని అంతు చూస్తామని బెదిరించారని జేసీ టి.నిశాంతికి వివరించారు. దీంతో ఆమె అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించారు. అనంతరం వారు ర్యాలీగా వెళ్లి ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రేవు తిరుపతి రావు, డీబీఎంఎస్ జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మాలమహానాడు నాయకులు పెయ్యల పరశురాముడు, జల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడతో నాకు ఎంతో అనుబంధం
ప్రముఖ సినీ నేపథ్య గాయని సుశీల బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల అన్నారు. సత్కశావాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ 92 సంవత్సరాలు వయసులో తాను కాకినాడపై అభిమానం, సత్కళావాహిని సంస్థతో ఉన్న అనుబంధంతో మూడవసారి ఇక్కడకు వచ్చానన్నారు. కళల కాణాచి కాకినాడలో అభిమానుల ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 55 సంవత్సరాలుగా సత్కళావాహిని సంస్థ సంగీతానికి చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. సత్కళావాహిని వ్యవస్థాపకులు ఈవీ కృష్ణమాచార్యులు పి.సుశీలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుశీలతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, ఎస్పీ శైలజ, పీబీ శ్రీనివాసు, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజ గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు సత్కళావాహినిలో కార్యక్రమాలు నిర్వహించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని అధ్యక్షుడు గోపాల నర్సరాజు, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులను సత్కరించారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఫ బాలుడి మృతి ఫ ఎనిమిది మందికి గాయాలు కాకినాడ రూరల్: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్నగర్ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్నగర్ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్షంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు. -
పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ దగ్ధం
సురక్షితంగా వాహనచోదకులు పి.గన్నవరం: పోతవరం గ్రామ శివారులో ఉన్న బంకు వద్ద ఒక మోటారు సైకిల్ కాలిపోయింది. దానిపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన బాలు అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలను అమలాపురం రూరల్ మండలం బండారులంక హైస్కూల్లో ప్రైవేట్గా రాస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం జరిగిన సైన్స్ పరీక్షకు ఆ విద్యార్థిని తండ్రి గంగులూరి రాజు, తల్లి జ్యోతి మోటారు సైకిల్పై బండారులంకకు తీసుకువచ్చారు. పరీక్ష రాసిన అనంతరం మోటారు సైకిల్పై స్వగ్రామానికి తిరిగి బయల్దేరారు. పోతవరంలోని బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకుని తిరిగి మోటారు సైకిల్ స్టార్ట్ చేస్తుండగా, సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో రాజు మోటారు సైకిల్ను బంకు నుంచి కాస్త ముందుకు తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంకు సిబ్బంది ఏబీసీ ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అమలాపురం నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపు చేసింది. మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. బంకు వద్ద సరైన ఫైర్ సేఫ్టీ లేదని, నాలుగు ఏబీసీ ఎక్విప్మెంట్స్లో రెండు మాత్రమే పనిచేశాయని, మంటలు ఆర్పేందుకు వాటర్ పైపు కూడా లేదని, దీంతో మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు రాజు ఆరోపించాడు. -
తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?
ఫ 18 మంది పురోహితులకు నోటీసులపై వివాదం ఫ దేవస్థానం చైర్మన్, ఈఓలను కలిసిన వైనం అన్నవరం: స్థానిక సత్యదేవుని దేవస్థానం వ్రత విభాగంలో వ్రత పురోహితుడు చేతివాటం ప్రదర్శించి, రూ.రూ.58.39 లక్షలు కాజేసిన వ్యవహారంలో తమ పాత్ర ఉందని దేవస్థానం అధికారులు నోటీసులు ఇవ్వడంపై 18 మంది పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈఓ వి.త్రినాథరావు ఈ నెల 17న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే.. దేవస్థానం వ్రత విభాగంలో పురోహితుల పారితోషికం చెల్లింపు వ్యవహారం చూడాల్సిన ఆ సెక్షన్ గుమస్తా విధులను అనధికారికంగా ఒక పురోహితుడు చాలా ఏళ్లుగా నిర్వహిస్తూ, రూ.58.39 లక్షల అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సెక్షన్ గుమస్తా, సూపరింటెండెంట్, ఆపై ఏఈఓ, తదితర అధికారులు ఆ పురోహితుడు తయారు చేసిన పారితోషికం బిల్లులపై సంతకాలు చేసేవారు. ఇది ఆసరాగా తీసుకున్న ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి 2025 నవంబర్ వరకూ అవకతవకలకు పాల్పడ్డాడు. ఆ పురోహితుడు 18 మంది వ్రత పురోహితులకు వారి పారితోషికం కన్నా సుమారు రూ.25 లక్షలు ఎక్కువగా వారి అకౌంట్లకు జమ చేయించాడు. ఆ తరువాత మీ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయ్యిందని చెప్పి, తిరిగి ఆ మొత్తాన్ని తన అకౌంట్కు జమ చేయించుకున్నాడు. అధికారులు ఈ విషయం గుర్తించి అతడిని నిలదీయడంతో ఆ మొత్తంలో రూ.28 లక్షలు చెల్లించాడు. తరువాత గత డిసెంబర్లో అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే అధికారులు తిరిగి రూ.25 లక్షలు కట్టాలని 18 మంది వ్రత పురోహితులకు నోటీసులు ఇచ్చారు. అదనంగా పంపిన మొత్తాన్ని ఆ పురోహితుడికి పంపేశామని వారు ఆధారాలు చూపించారు. అయితే మీరు చెల్లించాల్సింది దేవస్థానానికి తప్ప ఆ పురోహితునికి కాదని దేవస్థానం అధికారులు చెప్పడంతో వారంతా తిరిగి రూ.25 లక్షలు దేవస్థానానికి చెల్లించారు. దీంతో వ్యవహారం ముగిసిపోయిందని అంతా భావించారు. కుమ్మక్కు అయ్యారంటూ.. అవకతవకలకు పాల్పడిన పురోహితునితో కుమ్మక్కు అయ్యారంటూ 18 మంది పురోహితులకు ఈ నెల 17న నోటీసులు ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరు శనివారం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ను, సోమవారం ఈఓ త్రినాథరావును కలసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయిన విషయం వాస్తవమేనని, వెంటనే ఆ పురోహితునికి చెల్లించేశామని, విషయం వెలుగులోకి వచ్చాక తిరిగి దేవస్థానానికి కూడా చెల్లించామని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారంటున్నారు. చేతివాటం ప్రదర్శించిన పురోహితుడితో కుమ్ముక్కై తమ అకౌంట్లలో ఎక్కువ పారితోషికం జమైనా అధికారులకు తెలపలేదనే అభియోగంపై పురోహితులకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులిచ్చామని ఈఓ త్రినాథరావు తెలిపారు. వారి జవాబులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. -
ఆగని గాండ్రింపులు
ఫ వేములోవలోనే పెద్ద పులి సంచారం ఫ అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రచారం గంగవరం: పెద్ద పులి ఎక్కడా ఆగడం లేదు.. రోజుకోచోట ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం గంగవరం మండలంలో దాని జాడలను అధికారులు గుర్తిస్తున్నారు. మూడు రోజులుగా గంగవరం మండలం వేములోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఓ ఆవు దూడను హతమార్చింది. సోమవారం పెద్దపులి గంగవరం మండలం వేములోవ రిజర్వు ఫారెస్ట్లోని ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, వేములోవ అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని కనుగొన్నామని, అటవీ ప్రాంతంలోనే ఉందని ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. వేములోవ – ఉయ్యాలమడుగు, గొరగుమ్మి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందన్నారు. బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. దీనికోసం శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావొద్దని ప్రచారం నిర్వహించారు. ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజర్ పి.శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. జీడిమామిడి రైతుల్లో గుబులు గంగవరం మండలంలో జీడిమామిడి సాగు చేసే రైతులు ఆ తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆర్డీ పురం, పిడతమామిడి, వడ్డిచెరువు, పెదగార్లపాడు, చినగార్లపాడు, చిన్నంపాలెం, గొరగుమ్మి, లక్కొండ, గంగవరం తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు జీడి పిక్కలు సేకరించేందుకు వెళ్లడం లేదు. దీంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. -
పక్కకు దిగపడి
రోడ్డు దిగబడుతోంది.. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన కలిగిస్తోంది. పెదపూడి మండలం చింతపల్లి పరిధిలో ఆర్అండ్బీ రోడ్డు బెర్ములు పెద్ద కాలువలోకి జారిపోతున్నాయి. నిత్యం చింతపల్లి గ్రామం మీదుగా అటు కాండ్రేగుల, కరప, కాకినాడ.. ఇటు రామచంద్రపురం, జి.మామిడాడ గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –పెదపూడి ఏముందీ బురదే.. నిత్యం రద్దీగా ఉండే గోపాలపట్నం – తొండంగి ప్రధాన రహదారిలో గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలప ట్నం శివారులో భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది నెలల క్రితం అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా మళ్లీ మామూలే అయ్యింది. గ్రావెల్, బండ రాళ్లతో టిప్పర్లు వెళ్తుండడంతో కొద్ది రోజులకే ఇలా పాడవుతోంది. రెండు రోజుల క్రితం కొద్దిపాటి చినుకులకే ఇలా బురదగా మారింది. –తొండంగి -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ రూ.20 లక్షల విలువైన ఆభరణాలు మాయం ఫ సామర్లకోటలో సంఘటన సామర్లకోట: స్థానికంగా ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సామర్లకోట అంబటివారి తోటలోని తన ఇంట్లో విశ్రాంత ఉపాధ్యాయురాలు మట్టిపల్లి లక్ష్మీదేవి (82) ఉంటున్నారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి బంధువులతో కలసి హైదరాబాద్లో పెళ్లికి వెళ్లారు. బంధువులు తిరిగి సామర్లకోట వచ్చినప్పటికీ లక్ష్మీదేవికి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్లో ఉండిపోయారు. రోజూ పని మనిషి సాయంత్రం వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుంది. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించింది. వెంటనే సమీపంలోని లక్ష్మీదేవి బంధువు వజ్జులు మాస్టారుకు సమాచారం ఇచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న ఆయన దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎ.కృష్ణభగవాన్, ఎస్సై రాజా, క్రైం ఎస్సై కృష్ణారావు, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కృష్ణభగవాన్ హైదరాబాద్లో ఉన్న లక్ష్మీదేవికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి, రూ.50 వేల నగదు బీరువాలో ఉంచినట్లు ఆమె వివరించారు. దొంగలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి, ఇంటి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని వెండి, బంగారం, నగదును తస్కరించారు. సుమారు ఏడాది క్రితం తన భర్త వెంకట్రావు చనిపోవడంతో ఆయన పేరున బ్యాంకు లాకరులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఇటీవల ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రపరిచినట్లు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి నిమిత్తం కొన్ని బంగారు ఆభరణాలను వెంట తీసుకువెళ్లానన్నారు. వేలిముద్ర నిపుణులు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తవారి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దగ్గురలో ముప్పు
ఫ క్షయను నిర్లక్ష్యం చేయొద్దు ఫ సకాలంలో చికిత్సతో వ్యాధి నయం ఫ డాట్స్ థెరపీతో నివారణ సాధ్యం ఫ నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం ఆలమూరు/ రాయవరం: దగ్గరలోనే ముప్పు ఉంది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లొంగదీసుకుంటోంది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే నివారణ సాధ్యమవుతోంది. ఈ ప్రాణాంతక ట్యూబర్ క్యులోసిస్ (క్షయ) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 2028 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్ఓ తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా టీబీ వస్తుందని 1882 మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్కాక్ కనుగొన్నాడు. అప్పటి నుంచి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో కలసి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రతి లక్ష మంది జనాభాలో 203 మందికి క్షయ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 123 గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 52.86 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకూ నమోదైన సుమారు ఐదు వేల కేసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ సిబ్బంది రోగుల వద్దకు వెళ్లి మందులు సక్రమంగా వాడే విధంగా చైతన్యం నింపుతున్నారు. దీంతో వ్యాధి త్వరితగతిన తగ్గుముఖం పట్టి ఏటా రోగుల సంఖ్య తగ్గుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ 2,601 మంది క్షయ బాధితులను గుర్తించారు. ఇందులో 1,780 మంది పూర్తి వైద్యం పొందగా, 821 మంది ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. 549 మందికి దాతల ద్వారా ఫుడ్ బాస్కెట్ పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సీబీ నాట్ మిషన్ ఉంది. నమోదవుతున్న కేసుల్లో చాలామందికి డాట్స్ కీమో థెరపీ ద్వారా నయం చేయడం జరుగుతుంది. మూడు రకాలు క్షయ శరీరంలోని ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ద్రవాల తడితో కూడిన (వెబ్ టైప్) మొదటి రకం కాగా, ఉదరకోశ కండరాలను ముద్దలా చేసే పొడిరకపు (డ్రై టైప్) రెండో రకం, శరీరంలో కంతుల మాదిరిగా సంభవించే (ఒమెంటమ్) మూడో రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినప్పుడు కాని దగ్గినప్పుడు కాని నోటి, ముక్కు నుంచి వెలువడే గాలిలోని తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా కారకాలతో ఇతరులకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డాట్ చికిత్స ద్వారా కాని నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్డీసీ విధానంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ● వ్యాధి గుర్తింపు ముఖ్యం క్షయ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, వైద్యుల సూచనలు పా టించి పూర్తి కాలం వైద్యం తీసు కుంటే నయం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించకుంటే ఆ రోగి ఏడాదికి 10–15 మందికి వ్యాధిని కలగజేస్తాడు. క్షయ వ్యాధికి అవసరమైన మందులు ప్రతి పీహెచ్సీలో ఉచితంగా అందజేస్తారు. డయాబెటిక్ రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. –ఎన్.వసుంధర, జిల్లా క్షయ నివారణ అధికారి, రాజమహేంద్రవరం ● నివారణకు ప్రత్యేక చర్యలు క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి సత్వరమే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన విలువైన మందులను అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చూస్తుంన్నాం. అలాగే పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నాం. –ఎం.సుమలత, అడిషనల్ డీఎంహెచ్ఓ, కొత్తపేట వ్యాధి లక్షణాలివే.. క్షయ సోకిన రోగికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అప్పుడే క్షయగా అనుమానించాలి. సాయంత్రం పూట జ్వరం రావడం, నిద్ర పట్టకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం తదితర కారణాలతో రోగి నీరసించిపోతాడు. క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తొందరగా వస్తుంది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారిలో మూడో వంతు క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. క్షయ వ్యాధి దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా, మాట్లాడిన సమయంలో వ్యాధికారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లగా బయటకు వస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చినప్పుడు క్షయ వ్యాధికి గురవుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ టీకాను అందించాలి. ఫ దగ్గు వచ్చినప్పుడు నోటికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాలి. ఫ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నిర్ధేశించిన సమయం వరకూ మందులు వాడాలి. ఫ వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయాలి. -
నూనె చుక్కలే..
ఆలమూరు: వంట నూనెల ధర సలసల కాగుతోంది.. వంటింట్లో ధరల మంట రేపుతోంది.. కూరల్లో నూనె చుక్క కరవవుతోంది.. పిండి వంటలు ఊసే మరిచిపోవాల్సి వస్తోంది.. మార్కెట్లో వంట నూనెల ధర కొండెక్కింది. సామాన్యులకు పెనుభారంగా మారింది. మార్కెట్కు వెళ్లి నూనె ప్యాకెట్ కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యావసరాల ధరల నియంత్రణపై ముందుచూపు లేక ప్రజలకు శాపమైంది. ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రభావంతో బహిరంగ మార్కెట్లో నూనెల ధర మంట రేగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండేళ్లలో లీటరుకు రూ.50 పైనే పెరిగింది. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే, రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తోంది. రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం పంపిణీకే పరిమితం కావడం మరింత ఇబ్బందిగా మారుతోంది. ముం‘ధర’ యుద్ధం కోనసీమ జిల్లాలోని 19 మండలాల్లో 4.93 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరిపై ఈ ధరల పెరుగుదల కారణంగా నెలకు రూ. మూడు కోట్ల వరకూ అదనపు భారం పడుతోంది. జిల్లాలో సగటున నెలకు సుమారు 100 టన్నుల వరకూ వంట నూనెలను ఉపయోగిస్తున్నారు. గతంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సాకుతో పెంచిన ధరల తరహాలోనే, ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం అంటూ పెరిగిన ధరలను ఆసరాగా చేసుకుని బహిరంగ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వంట నూనె ధరలను రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. దీనిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతోంది. సుంకాలు తగ్గిస్తేనే ఉపశమనం ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో వంట నూనెలపై విధించిన భారీ సుంకాలను కొంతమేరైనా తగ్గిస్తేనే ధరల భారం తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో 2024 ఆగస్టు వరకూ ఎటువంటి సుంకాలు లేని పామాయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్ వంటి ముడి సరకుగా దిగుమతి చేసుకునే వంట నూనెలపై విధించిన 20 శాతం మేర బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీటీ)ని తగ్గిస్తే ప్రజలకు ధరాభారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.అలాగే శుద్ధి (రిఫైన్డ్) చేసిన వంట నూనెలపై గతంలో పెంచిన 32.5 శాతం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల ప్రతి లీటర్ ప్యాకెట్కు రూ.20 నుంచి రూ.30 వరకూ తగ్గుతుందని భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలనే తారతమ్యం లేకుండా రోజూ ఇంట్లో వంటకాల్లో ఉపయోగించే వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయితీ.. లేక అధోగతి రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన వంట నూనె ధరల నుంచి పేదలకు ఉపశమనం కలిగించేందుకు రేషన్న్షాపుల ద్వారా రాయితీపై వంట నూనెలను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కందిపప్పు, వంట నూనెలను సరఫరా చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఆ మాటను నేడు మరిచారు. అలాగే మార్కెట్లో వ్యాపారులు సృష్టించే కృత్రిమ కొరతను అరికట్టలేకపోతున్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే భవిష్యత్లో ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు. అలాంటి చర్యలూ చేపట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా వాటిపై దృష్టిసారిస్తే మేలని విశ్లేషకులు భావిస్తున్నారు.నియంత్రణకు చర్యలు అవసరం వంట నూనె ధరల నియంత్రణకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి. వంటకాల్లో నిత్యం ఉపయోగించుకునే నూనెల ధరలు ఒకేసారి అంత దారుణంగా పెంచడం సరికాదు. రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నూనెలను సరఫరా చేయాలి. అప్పుడే సామాన్యులకు వెలుసుబాటుగా ఉంటోంది.– ఎస్.ధనలక్ష్మి, గృహిణి, ఆత్రేయపురంసరఫరా నిలిచిపోయింది హోల్సేల్ మార్కెట్ల నుంచి వంట నూనెల సరఫరా పూర్తి స్థాయిలో జరగడం లేదు. తమ వద్ద నిల్వలను ఇప్పటికే పాత ధరలకే విక్రయించాం. హోల్సేల్ వ్యాపారుల ధరలకనుగుణంగా క్షేత్ర స్థాయిలో విక్రయాలు జరపక తప్పడం లేదు. – పిల్లి నాగరాజు, రిటైల్ వ్యాపారి, పినపళ్ల, ఆలమూరు మండలంఆందోళన కలిగిస్తోంది రోజు రోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాలను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై అందించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వంట నూనెల ధర పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. – వాసిరెడ్డి వీరబాబు, నర్శిపూడి, ఆలమూరు మండలం -
నిర్మలగిరికి భక్తుల తాకిడి
● ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు ● సందర్శించిన ఎస్పీదేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో తొలి రోజే భక్తుల తాకిడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి, మరియ తల్లిని దర్శించుకుని, దీవెనలు పొందారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకూ పుణ్యక్షేత్రంలో గడిపి ప్రార్థనలు, పూజలు చేస్తారు. తొలి రోజు సహాయ గురువులు ఫాదర్ ప్రేమ్కుమార్ దివ్య బలి పూజ సమర్పించారు. పలువురు గురువులు, ఫాదర్లు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విస్తరించినందున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ను మళ్లించినట్టు సీఐ నాయక్ తెలిపారు. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, పంగిడి గ్రామాల్లో ట్రాఫిక్ను 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. 215 మందితో బందోబస్తు మేరీ మాత ఉత్సవాలకు 215 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపారు. ఉత్సవాలు నాలుగు రోజులూ పుణ్యక్షేత్రానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్పారన్నారు. అదనపు ఎస్పీ ఇన్చార్జిగా ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పుణ్యక్షేత్రంలోని 30 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు డ్రోన్ కెమెరాలు, క్రైం పార్టీని కూడా ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించడానికి ఈ ఏడాది అత్యాధునికమైన 50 ఫింగర్ ప్రింట్ డివైజ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. ఫేస్ రికవరీ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. -
నూనె చుక్కలే..
● ధరలతో ఇక కష్ట‘వంట’ ● మార్కెట్లో భారీగా పెరిగిన వంట నూనెలు ● పట్టించుకోని చంద్రబాబు సర్కారు ● జిల్లాలో 4.93 లక్షల కుటుంబాలపై ప్రభావం ఆలమూరు: వంట నూనెల ధర సలసల కాగుతోంది.. వంటింట్లో ధరల మంట రేపుతోంది.. కూరల్లో నూనె చుక్క కరవవుతోంది.. పిండి వంటలు ఊసే మరిచిపోవాల్సి వస్తోంది.. మార్కెట్లో వంట నూనెల ధర కొండెక్కింది. సామాన్యులకు పెనుభారంగా మారింది. మార్కెట్కు వెళ్లి నూనె ప్యాకెట్ కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యావసరాల ధరల నియంత్రణపై ముందుచూపు లేక ప్రజలకు శాపమైంది. ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రభావంతో బహిరంగ మార్కెట్లో నూనెల ధర మంట రేగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండేళ్లలో లీటరుకు రూ.50 పైనే పెరిగింది. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే, రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తోంది. రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం పంపిణీకే పరిమితం కావడం మరింత ఇబ్బందిగా మారుతోంది. ముం‘ధర’ యుద్ధం జిల్లాలోని 19 మండలాల్లో 4.93 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరిపై ఈ ధరల పెరుగుదల కారణంగా నెలకు రూ.మూడు కోట్ల వరకూ అదనపు భారం పడుతోంది. జిల్లాలో సగటున నెలకు సుమారు 100 టన్నుల వరకూ వంట నూనెలను ఉపయోగిస్తున్నారు. గతంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సాకుతో పెంచిన ధరల తరహాలోనే, ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం అంటూ పెరిగిన ధరలను ఆసరాగా చేసుకుని బహిరంగ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు ఽకృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వంట నూనె ధరలను రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. దీనిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతోంది. సుంకాలు తగ్గిస్తేనే ఉపశమనం ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో వంట నూనెలపై విధించిన భారీ సుంకాలను కొంతమేరైనా తగ్గిస్తేనే ధరల భారం తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో 2024 ఆగస్టు వరకూ ఎటువంటి సుంకాలు లేని పామాయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్ వంటి ముడి సరకుగా దిగుమతి చేసుకునే వంట నూనెలపై విధించిన 20 శాతం మేర బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీటీ)ని తగ్గిస్తే ప్రజలకు ధరాభారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే శుద్ధి (రిఫైన్డ్) చేసిన వంట నూనెలపై గతంలో పెంచిన 32.5 శాతం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల ప్రతి లీటర్ ప్యాకెట్కు రూ.20 నుంచి రూ.30 వరకూ తగ్గుతుందని భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలనే తారతమ్యం లేకుండా రోజూ ఇంట్లో వంటకాల్లో ఉపయోగించే వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయితీ.. లేక అధోగతి రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన వంట నూనె ధరల నుంచి పేదలకు ఉపశమనం కలిగించేందుకు రేషన్న్షాపుల ద్వారా రాయితీపై వంట నూనెలను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కందిపప్పు, వంట నూనెలను సరఫరా చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఆ మాటను నేడు మరిచారు. అలాగే మార్కెట్లో వ్యాపారులు సృష్టించే కృత్రిమ కొరతను అరికట్టలేకపోతున్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే భవిష్యత్లో ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు. అలాంటి చర్యలూ చేపట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా వాటిపై దృష్టిసారిస్తే మేలని విశ్లేషకులు భావిస్తున్నారు. వంట 2024 2025 2026 నూనెలు లీటరు (రూ.) లీటరు (రూ.) లీటరు (రూ.) పామాయిల్ 95 113 142 సన్ఫ్లవర్ 115 135 168 సోయాబీన్ 108 130 162 వేరుశెనగ 157 168 186 రైస్ బ్రాన్ 118 128 173నియంత్రణకు చర్యలు అవసరం వంట నూనె ధరల నియంత్రణకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి. వంటకాల్లో నిత్యం ఉపయోగించుకునే నూనెల ధరలు ఒకేసారి అంత దారుణంగా పెంచడం సరికాదు. రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నూనెలను సరఫరా చేయాలి. అప్పుడే సామాన్యులకు వెలుసుబాటుగా ఉంటోంది. – ఎస్.ధనలక్ష్మి, గృహిణి, ఆత్రేయపురం సరఫరా నిలిచిపోయింది హోల్సేల్ మార్కెట్ల నుంచి వంట నూనెల సరఫరా పూర్తి స్థాయిలో జరగడం లేదు. తమ వద్ద నిల్వలను ఇప్పటికే పాత ధరలకే విక్రయించాం. హోల్సేల్ వ్యాపారుల ధరలకనుగుణంగా క్షేత్ర స్థాయిలో విక్రయాలు జరపక తప్పడం లేదు. – పిల్లి నాగరాజు, రిటైల్ వ్యాపారి, పినపళ్ల, ఆలమూరు మండలం ఆందోళన కలిగిస్తోంది రోజు రోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాలను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై అందించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వంట నూనెల ధర పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. – వాసిరెడ్డి వీరబాబు, నర్శిపూడి, ఆలమూరు మండలం -
ఆధ్యాత్మిక తరంగం
● భక్తుల కొంగుబంగారం విజయదుర్గా పీఠం ● భక్తులను బంధువులుగా పిలిచే ‘గాడ్’ రాయవరం: అక్కడ అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నిత్యం దేవీ నామస్మరణ తో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచే ఆ ప్రదేశానికి వెళ్లగానే బంధువుల మాదిరిగా పలకరింపులే కాదు.. మానసిక చింతనతో వెళ్లే వారికి బాధలను తొలగించే సలహాలు సైతం అందుతాయి. అదే భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న విజయదుర్గా పీఠం. రాజమహేంద్రవరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన రాయవరం మండలం వెదురుపాకలో ఈ పీఠం వెలుగొందుతోంది. పీఠం వ్యవస్థాపక అధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం పుట్టినప్పటి నుంచే ‘గాడ్’గా పిలుపు అందుకున్నట్లు భక్తులు చెబుతారు. 1972 ఆగస్టు 18వ తేదీన స్వయంగా జగన్మాత వ్యాఘ్రవాహినిగా దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 1989లో శృంగేరి జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి ఆదేశంతో భారతీతీర్థ స్వామి చేతుల మీదుగా అష్టభుజాలతో కూడిన విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఈ పీఠంలో జరిగింది. ఇక్కడ నిత్యం పలు పూజలు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పీఠానికి వస్తారు. భక్తులను గాడ్.. అబ్బాయి, అల్లుడు, కూతురు, కోడలు వంటి వరుసలతో పిలుస్తారు. ఏటా శరన్నవరాత్ర వేడుకలు పీఠంలో ఏటా దసరా శరన్నవరాత్ర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ పది రోజులూ భక్తులు స్వయంగా కలశాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటారు. ఏటా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో పీఠాధిపతి ‘గాడ్’ జన్మదిన వేడుకలను భక్తులే ఘనంగా నిర్వహించుకుంటారు. 19వ తేదీన జరిగే గాడ్ జన్మదిన వేడుకలకు వేలాదిగా తరలివస్తారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతులు అభినవ ఉద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, సద్గురు శివానందమూర్తి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ తదితర ప్రముఖులెందరో ఈ పీఠాన్ని సందర్శించారు. లోక కల్యాణం కోసం.. పీఠంలో లోక కల్యాణం కోసం నిత్యం పలు రకాల పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూంటారు. ప్రత్యేక సందర్భాల్లో రాహుకేతువుల కల్యాణం, నవావరణార్చన, శ్రీనివాస కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వంటివి నిర్వహిస్తారు. టీటీడీ శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి, తిరుత్తణి దేవస్థానం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పీఠానికి అందజేశాయి. -
ఉత్తమ నాటికగా చిటికెన వేలు
● ముగిసిన సీఆర్సీ ఉగాది నాటిక పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం రావులపాలెం: స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యంలో కాటన్ కళావేదికలో ఉగాది రోజున మొదలైన తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శనివారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా చిటికెన వేలు నాటిక నిలిచింది. అనంతరం బహుమతుల ప్రధానోత్సవంలో సీఆర్సీ కాటన్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి, సినీ నటుడు గౌతంరాజు, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. నాటిక పోటీల్లో విజేతలకు తనికెళ్ల భరణి బహుమతులను అందజేశారు. ఈ ఏర్పాట్లను సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, నాటక కళా పరిషత్ డైరెక్టర్ కె.సూర్య, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ త్రిమూర్తులు, డైరెక్టర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి (చిన్నబుజ్జి), మల్లిడి అంజనీకుమార్రెడ్డి, మల్లిడి విజయభాస్కరరెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, దండు సూరిబాబురాజు, నడింపల్లి వెంకటసుబ్బరాజువర్మ, పడాల సత్యనారాయణరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రథమ ప్రదర్శనగా విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెన వేలు నాటిక నిలిచింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం వారి అసత్యం నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి అమ్మచెక్కిన బొమ్మ నాటికలు నిలిచాయి. ప్రథమ బహుమతిగా రూ. లక్ష, ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, తృతీయ స్థానానికి రూ. 50 వేలు, షీల్డ్స్ అందించారు. ఉత్తమ దర్శకత్వం అసత్యం నాటికకు పి.బాలాజీనాయక్, ఉత్తమ రచన అమ్మచెక్కిన బొమ్మ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ నటన తృతీయ స్థానం దొందూదొందే నాటిక సుబ్బారావు పాత్రధారి ఎస్.డేవిడ్రాజు, ఉత్తమ నటన ద్వితీయ స్థానం సహన నాటిక సహన పాత్రధారిణి జీఎన్డీ కుసుమసాయి, ఉత్తమ నటన చిటికెన వేలు నాటిక సోమన్న పాత్రధారి కె.సత్యనారాయణ, ఉత్తమ ఆహార్యం కన్నీటికి విలువెంత నాటిక కె.నాగేశ్వరరావు, ఉత్తమ సంగీతం అసత్యం నాటిక పి.లీలామోహన్, ఉత్తమ రంగాలంకరణ చిటికెన వేలు నాటిక ఎస్ రమణలు దక్కించుకున్నారు. అలాగే రెండు ప్రత్యేక బహుమతులు అమ్మచెక్కిన బొమ్మ నాటిక రెండో శివ పాత్రధారి భానుప్రకాష్, ఆచమనం నాటికలోని కృష్ణ పాత్రధారి బి.వెంకన్నబాబు దక్కించుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా పి.గోవిందరావు, గోపరాజు విజయ్ వ్యవహరించారు. -
చెస్ పోటీల్లో చిన్నారుల ప్రతిభ
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరి అకాడమీలో అండర్–7 జిల్లా చెస్ చాంపియన్ పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇందులో ఏడేళ్ల లోపు చెస్ క్రీడాకారులైన చిన్నారి విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల్లో ప్రథమ స్థానాన్ని ఆరేళ్ల వయసు కలిగిన తటవర్తి అవ్యక్త సాధించగా, ద్వితీయ స్థానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కుమార్తె ఆరేళ్ల ఎం.సంస్కృతి పొందింది. అలాగే బాలుర విభాగంలో రావులపాలేనికి చెందిన ఆరేళ్ల దంగేటి అరుణ్ ప్రథమ, ఐదేళ్ల ఉడతా శ్రీకర్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ విజేతలు వచ్చే నెల 5 నుంచి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–7 చెస్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో పీజీఆర్ఎస్, మీకోసం రెవెన్యూ క్లీనిక్ సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కార మార్గాలను పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, తదితర వివరాల కోసం 1100 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి తెలుసుకోచ్చని కలెక్టర్ వివరించారు. భజే విఘ్ననాయకా.. అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి గణపయ్యను ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 43 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 మంది, గరిక పూజలో ఒక జంట పాల్గొన్నారు. 19 మంది ఉండాళ్ల పూజ, ఒక చిన్నారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. తొమ్మిది మందికి తులాభారం, ఓ చిన్నారికి అన్నప్రాశన, 30 మంది వాహన పూజ లు చేయించుకున్నారు. 2,694 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.2,19,358 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ఉత్కంఠగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం రూరల్: హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఐదో ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ (మెన్ – ఉమెన్) పోటీలు ఆదివారం ఉత్కంఠగా జరిగాయి. అమలాపురం ఈదరపల్లిలోని జనహిత కార్యాలయంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ పోటీలను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెట్ల రమణబాబు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ స్ట్రాంగ్ ఉమెన్గా ఏలూరి చెందిన శరణ్ ప్రథమ, అమలాపురం చెందిన పి.వందన ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆయా విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. విజేతలకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావులు బహుమతులు అందించారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా టీమ్ను ఎంపిక చేస్తామని ఆర్గనైజర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్కుమార్, ఆశెట్టి ఆదిబాబు, మండేల బాబీ, గారపాటి చంద్రశేఖర్, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, పెద్దిరెడ్డి రాము, గోకరకొండ సూరిబాబు, ముత్తాబత్తుల వెంకటరమణ, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘దళితులపై వివక్ష చూపడం దారుణం’
కుందాలపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కుందాలపల్లిలో కుల వివక్షకు గురైన బాధితులను జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుందాలపల్లిలో దళితులపై వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జడ శ్రవణ్. ఎస్సీ వర్గాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితు కుటుంబానికి తానే న్యాయవాదిగా ఉండి వాదిస్తానని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
స్వామి దర్శనం.. పరమపావనం
మామిడికుదురు: అప్పనపల్లిలోని శ్రీబాల బాలాజీ స్వామివారిని దర్శించుకున్న భక్తుల మది పులకించింది. శనివారం కావడంతో స్వామివారి ఆలయం కిక్కిరిసింది. తెల్లవారు జామున సుప్రభాత సేవను అర్చకులు వైభవంగా జరిపించారు. అనంతరం తొలి హారతి కనుల పండువలా జరిపించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన మాగంగి గోవిందరాజులు, సాయిలక్ష్మి దంపతులు రూ.10,116, కై కలూరుకు చెందిన సాయింకూరి శ్రీరామకృష్ణ, పుష్పసాయి దంపతులు రూ.10,116 విరాళాలుగా సమర్పించారు. కాగా ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.4,04,987 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. మొత్తం 6,800 మంది భక్తులు దర్శించుకోగా, 3,100 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు రూ.1,41,136 విరాళాలుగా వచ్చాయి. వీరేశ్వరుని హుండీ ఆదాయం రూ.13 లక్షలు ఐ.పోలవరం: మురమళ్లలోని వీరేశ్వరస్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ, తనిఖీ అధికారి జె.రామలింగేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 138 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీ ద్వారా రూ.13,11,858, అన్నదాన హుండీ ద్వారా రూ.43,131 కలిపి రూ.13,54,989 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు, సత్యసాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. రేపటి పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలతో ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం తెలిపారు. తమ సమస్యలు పరిష్కారానికి ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. -
మే 6 నుంచి వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలు
అమలాపురం టౌన్: భూమి, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యాలుగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ 30వ రాష్ట్ర మహాసభలు మే 6, 7, 8 తేదీల్లో అమలాపురంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు వెల్లడించారు. స్థానిక యూటీఎఫ్ హోమ్లో శనివారం జిల్లా సంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర మహా సభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మహా సభల ప్రాముఖ్యతను వివరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ఆ సభల మూడు రోజుల షెడ్యూల్ను వివరించారు. రాష్ట్ర మహా సభలకు ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షుడిగా రవణం వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కారెం వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కె.శంకర్కుమార్తో పాటు రాష్ట్ర సభలకు పేట్రన్లుగా పది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
నాటక రంగానికి ప్రోత్సాహం ఎనలేనిది
● సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు ● చివరి రోజు ఆకట్టుకున్న నాటికలు రావులపాలెం: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యంలో నాటక రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేదని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు అన్నారు. స్థానిక సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్న 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు విశేషంగా అలరిస్తున్నాయి. మూడో రోజు శనివారం నాటికలను సీఆర్సీ కార్యదర్శి నల్లమిల్లి వీరాఘవరెడ్డి, నాటక పరిషత్ డైరెక్టర్ కె.సూర్య, డైరెక్టర్ నడింపల్లి వెంకట సుబ్బరాజు వర్మ ప్రారంభించారు. ఈ నాటికలను తనికెళ్ల భరణి, గౌతంరాజు తిలకించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి కాకినాడ వారు ప్రదర్శించిన ఆచమనం నాటిక మనసు హత్తుకుంది. దీనికి రచనా, దర్శకత్వం పి.వెంకన్నబాబు వహించారు. రాధా, కృష్ణలు భార్యాభర్తలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పిల్లల చదువు కోసం రూ. 30 లక్షల అప్పు చేస్తాడు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మావయ్య కొండల రాయుడు అల్లుడు కృష్ణకు ఎల్ఐసీ ఆఫర్ చెప్పి చనిపోమని ప్రేరేపిస్తాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన కృష్ణను సహచరుడైన ఆటోవాలా రక్షిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ భార్య రాధ తన తండ్రిని నిలదీసి అసహ్యించుకుంటుంది. భర్తకు అండగా నిలుస్తూ అప్పుల నుంచి బయటపడేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీంతో ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకోవాలంటే భార్యా, పిల్లలు, కుటుంబం గుర్తుకు రావాలని కృష్ణ చిన్నాన్న రామస్వామి హితబోధ చేస్తాడు. వారి స్ఫూర్తితో అప్పులు తీరుస్తాడు. ఈ కథాంశంతో ఆచమనం నాటిక ఆకట్టుకుంది. సందేశాత్మకంగా దొందుదొందే.. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ వారి దొందుదొందే నాటిక సందేశాత్మకంగా సాగింది. దీనికి రచన, దర్శకత్వం ఎస్.డేవిడ్రాజు వహించారు. 40 ఏళ్ల పైబడిన ఒక లావుపాటి పెద్ద పొట్ట కలిగిన వ్యక్తికి తనకున్న మరో ప్రధాన లోపం వల్ల పెళ్లి జరగదు. చివరకు పెళ్లిళ్ల పేరయ్య చనువుతో ఒక సంబంధం కుదురుతుంది. అయితే తనకున్న లోపాన్ని ముందుగానే తన అత్తింటి వారికి చెప్పాలని పెళ్లికొడుకు తన తాతకి చెప్తాడు. అయితే చెవులు సరిగా వినపడని తాత ఆ విషయాన్ని అమ్మాయి బంధువులకు చెప్పడం మర్చిపోతాడు. చివరకు అమ్మాయితో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన మర్నాడు మొదటి రాత్రికి బదులు మొదటి పగలు జరిపించాలని పెళ్లి కొడుకు తన అత్తింటి వారిని కోరతాడు. అలా మొదటి రాత్రికి బదులుగా మొదటి పగలు జరపటం హిందూ సంప్రదాయం కాదని, ఆ సంస్కృతి మనకు లేదని అత్తింటి వారు సున్నితంగా తిరస్కరించి నవ దంపతుల్ని మొదటి రాత్రికి సిద్ధం చేస్తారు. ఈలోగా తనకున్న లోపాన్ని ముందుగానే తన భార్యకు చెప్పాలని ఉద్దేశంతో మాట్లాడడానికి పెరట్లోకి రమ్మంటాడు. అయితే తనకు రేచీకటి ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు దాచిపెట్టి పెళ్లి జరిపించారని పెళ్లికూతురు చెబుతుంది. దాంతో ఆగ్రహించిన పెళ్లికొడుకు అత్తామామను పిలిచి గొడవ పడతాడు. ఆ గొడవలో అల్లుడికి కూడా రేచీకటి ఉందన్న విషయాన్ని అందరూ గ్రహిస్తారు. అయితే నాకు పెళ్లొద్దని గొడవ పడుతున్న అల్లుడితో....‘లోపాలనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయని, వాటిని భూతద్దంలో చూస్తూ.. సంసారాలు చిన్నాభిన్నాం చేసుకోకూడదని, ఇద్దరూ సర్దుకుపోండి.. ‘దొందూ– దొందే’ అని నచ్చచెప్పడంతో అతనిలో మార్పు వచ్చి నాటిక ముగుస్తుంది. అనంతరం రావులపాలెం సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శనగా బండారులేడి నాటికను ప్రదర్శించారు. దీనికి రచన సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, దర్శకత్వం గంటా రామమోహన్రావు వహించారు. చివరి రోజు నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏర్పాట్లను సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, నాటక కళా పరిషత్ డైరెక్టర్ కె.సూర్య, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ పలివెల త్రిమూర్తులు, డైరెక్టర్లు సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్నబుజ్జి), నడింపల్లి వెంకట సుబ్బరాజువర్మ, మల్లిడి విజయభాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్రెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఆచమనం నాటికలో ఓ సన్నివేశం -
కష్టాలు కట్టెపెట్టేలా..!
● ప్రముఖ ఆలయాల్లో అన్నదానానికి గ్యాస్ సెగ ● వందలాది మందికి ప్రసాదాల పంపిణీ ● గ్యాస్ కొరతతో సిబ్బందికి ఇబ్బందులు ● ప్రత్యామ్నాయంగా స్టీమ్, కట్టెలతో వంటకాలు సాక్షి, అమలాపురం: ‘గ్యాస్’ సెగ.. సామాన్యులకే కాదు.. దేవునికి కూడా తాకింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రత పెరిగే కొద్దీ స్థానికంగా గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపి వేయడంతో తోపుడు బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు పలు రకాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా గ్యాస్ సెగ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను తాకింది. ఈ దేవాలయాల వద్ద రోజూ క్రమం తప్పకుండా వందలాది మంది భక్తులకు భోజనం, ప్రసాదాలు అందించేందుకు గ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేక దేవస్థానం అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ పద్ధతిలో స్టీమ్ కుక్కర్లు, కట్టెల పొయ్యిలపై అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ● ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రోజూ ఇక్కడ సుమారు మూడు, నాలుగు వేల మంది వరకూ భోజనాలు చేస్తారు. ఇక ప్రతి శనివారం సుమారు 35 వేల మందికి భోజనాలు అందించాల్సి ఉంది. ఇది కాకుండా ప్రసాదం రూపంలో లడ్డూ, పులిహోర అందిస్తుంటారు. వీటిని పూర్తిగా గ్యాస్పై తయారు చేయాలి. గతంలో తమిళనాడులోని కోయింబత్తూరు నుంచి స్టీమ్ యూనిట్ తీసుకువచ్చారు. ఇది తెచ్చి 15 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు జనాభా పది రెట్లు పెరిగింది. దేవాలయాలకు క్రమం తప్పకుండా కమర్షియల్ సిలిండర్లు అందించాలని అధికారులు చెబుతున్నా, అవి ఆయా ఆలయాల వద్ద అవసరాలకు సరిపోవడం లేదు. దీనితో స్థానిక దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై భోజనం, ప్రసాదాలు తయారు చేయిస్తున్నారు. ఇందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు సరిపడినంత భోజనం అందించేందుకు కట్టెల పొయ్యిల వద్ద తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చిందని వంట సిబ్బంది చెబుతున్నారు. ● ఐ.పోలవరం మండలం వీరేశ్వరస్వామి ఆలయంలో సైతం గ్యాస్ కొరత కారణంగా దేవస్థానం సిబ్బంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. రోజూ ఇక్కడ రాత్రి సమయాల్లో జరిగే కల్యాణాలకు హాజరైన సుమారు 700 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సోమవారం నుంచి కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. అన్నంతో పాటు కూరలు, సాంబారు తదితర పదార్థాలను కట్టెల పొయ్యిలపైనే చేస్తున్నారు. ● అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి గ్యాస్ ఇబ్బందులు లేవు. ఇక్కడ ఎప్పటి నుంచో స్టీమ్పై పనిచేసే కుక్కర్, ఇతర వస్తువులతో వంటలు చేస్తున్నారు. వాటితో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. వంటలకు కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ స్టీమ్ సిస్టమ్ జీడి పిక్కల పొయ్యిలతో పనిచేస్తున్నాయి. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరం పడుతున్నాయి. ప్రస్తుతం కొరత లేకున్నా ముందు ముందు గ్యాస్ ఇక్కట్లు తప్పేటట్టు లేదు. ● రామచంద్రపురం మండలం ద్రాక్షారామలోని భీమేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ 600 నుంచి 800 మంది వరకూ అన్నప్రసాదం అందిస్తున్నారు. ఆదివారం వెయ్యి మంది వరకూ ఉంటున్నారు. ప్రస్తుతం గ్యాస్కు ఇబ్బంది లేకున్నా.. ప్రత్యామ్నాయంగా కట్టెలను సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక ఏజెన్సీ నుంచి గ్యాస్ వస్తున్నా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. ● అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద రోజూ సుమారు 1,500 మంది వరకూ భోజనం చేస్తారు. ఆదివారం సుమారు 2,500 మంది, పండగల సమయంలో ఐదు వేల మంది వరకు ఉంటారు. ప్రస్తుతానికి గ్యాస్ ఇబ్బంది లేదని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా సాంబారు వంటి ఆహార పదార్థాలు పొయ్యిలపై కానిచేస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో శని, ఆదివారాలు సుమారు 3,500 మంది చొప్పున భోజనం చేస్తారు. ఇక్కడ గ్యాస్ మీద వంటలు తక్కువ. ప్రత్యేకంగా జీడి పప్పు చెక్కను వంట చెరకుగా వినియోగిస్తుండడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. ధూపదీప నైవేద్యాలకు, లడ్డూ ప్రసాదం గ్యాస్పై వండుతారు. ఇందుకు నెలకు 60 సిలిండర్లు అవసరం కాగా, కేవలం 15 మాత్రమే అందించారు. దీంతో సిబ్బందికి గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు. వాడపల్లి వెంకన్న ఆలయంలో అన్న ప్రసాదాన్ని కట్టెల పొయ్యిలపై సిద్ధం చేస్తున్న సిబ్బంది -
ఉగాది కానుక కాదు.. కంటితుడుపు చర్య
కపిలేశ్వరపురం (మండపేట): ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రకటన కంటితుడుపు చర్య మాత్రమేనని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల చంద్రబాబు పాలనలో 6,28,347 ఉద్యోగాలిచ్చామంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలన్నీ అబద్ధాలని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకమన్నారు. రాష్ట్రంలో ఏయే కంపెనీల్లో ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయో నియామక ఆర్డర్లతో కూడిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు, అరాచక పాలనతో సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్ల అసహనం కలుగుతోందన్నారు. విసిగి వేసారిన నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో చేరిన వారు ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలన తీరుపై వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజలతో కలిసి పోరాడతామని ఎమ్మెల్సీ తోట స్పష్టం చేశారు. -
టిప్పర్ ఢీకొని వృద్ధుడి మృతి
పి.గన్నవరం: టిప్పర్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఊడిమూడి గ్రామానికి చెందిన రైతు విళ్ల నాగేశ్వరరావు (63) శనివారం మధ్యాహ్నం పశువులను మేపేందుకు సైకిల్పై లంకలోకి వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో అక్కడి నుంచి ఇంటికి సైకిల్పై వస్తున్నాడు. ఏటిగట్టు ర్యాంపు వద్ద సైకిల్ను నడిపించుకుంటూ పైకి ఎక్కుతున్నాడు. అదే సమయంలో లంక నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్ని ఏటిగట్టుపైకి ఎక్కించే క్రమంలో డ్రైవర్ రివర్స్ చేస్తున్నాడు. పైకి వస్తున్న నాగేశ్వరరావును గమనించకుండా టిప్పర్తో వెనుక నుంచి ఢీకొన్నాడు. వృద్ధుడిపై నుంచి టిప్పర్ వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం టిప్పర్ను ఆపకుండా డ్రైవర్ లంకలోకి తిరిగి వెళ్లి మట్టిని అన్లోడ్ చేసి పరారయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపైకి వచ్చి మృతునికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై బి.శివకృష్ణ ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదకరంగా మారినా.. ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి టిప్పర్లను కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతున్నారని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయాలని అన్నారు. -
కార్మిక చట్టాలను పునః సమీక్షించాలి
● 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి ● ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభల డిమాండ్ అమలాపురం టౌన్: కార్మిక చట్టాలను సవరణ చేయడంతో పాటు పునః సమీక్షించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు డిమాండ్ చేశాయి. అమలాపురం ప్రెస్క్లబ్ భవనంలో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలు తొలి రోజు శనివారం పలు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాయి. ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య, రాష్ట్ర కోశాధికారి బీవీవీ కొండలరావు, జాతీయ సమితి సభ్యుడు తోకల ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత సభా ప్రాంగణం వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు ఎంఎస్ఎన్ మూర్తి నిర్వహణలో సభ జరిగింది. అంతకు ముందు ఏఐటీయూసీ జిల్లా ప్రథమ సభల జెండాను జట్టు లేబర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కురచ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్క్లబ్ భవనం నుంచి స్థానిక గడియారం స్తంభం సెంటరు వరకూ పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘యుద్ధం వద్దు...శాంతి ముద్దు’ అనే నినాదాన్ని హోరెత్తించారు. ప్రదర్శన తిరిగి సభా స్థలికి చేరుకుంది. సభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ.26 ఉండాలని, ఆటో కార్మికులకు, జట్ల లేబర్కు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, మహిళా కార్మికుల హక్కులను పరిరక్షించాలని మహా సభల్లో మాట్లాడిన వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉద్యోగుల పీఆర్సీ కమిటీ వేయాలని, కోనసీమ జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మన గ్యాస్ మనకే అనే నినాదంతో 50 శాతం మన రాష్ట్రానికి కేటాయించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఏఐటీయూసీ నివేదికను సభల్లో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 31 మందితో ఏఐటీయూసీ నూతన కౌన్సిల్ ఏర్పాటైంది. ఆదివారం జరిగే రెండో రోజు జిల్లా మహా సభల్లో నూతన ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరగనుంది. సభల్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దొరబాబు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు పలివెల సత్తిబాబు, పసుపులేటి సుబ్బారావు, అమలాపురం, రామచంద్రపురం బార్ అసోసియేషన్ల అధ్యక్షులు చింతపల్లి అజయ్కుమార్, ఉండవల్లి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది నాటికలు.. సందేశాత్మకాలు
● రెండో రోజూ కొనసాగిన పోటీలు ● మూడు నాటికల ప్రదర్శన రావులపాలెం: ఉగాదిని పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్న 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు విశేషంగా అలరిస్తున్నాయి. రెండో రోజు శుక్రవారం పోటీలను తిలకించేందుకు పరిషత్ గౌరవ అధ్యక్షుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి, నటులు రాజీవ్ కనకాల, గౌతంరాజు, గుండు సుదర్శన్ హాజరయ్యారు. వారు జ్యోతి వెలిగించి నాటికలను ప్రారంభించారు. రెండో రోజు మూడు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన చేసిన బాలికలకు సినీ, రాజకీయ ప్రముఖులు, సీఆర్సీ సభ్యులు ప్రశంసా పత్రాలను అందజేశారు. నాటకాల ఏర్పాట్లను సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, సీఆర్సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య, సీఆర్సీ డైరెక్టర్లు మల్లిడి విజయ భాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్రెడ్డి, సత్తి సూర్యభాస్కరరెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, పడాల సత్యనారాయణరెడ్డి, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ పలివెల త్రిమూర్తులు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ‘సహన’ న్యాయం కోసం తండ్రీ కూతురు చేసిన పోరాటమే అంశంగా సహన నాటిక సాగింది. గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించిన నాటికను స్నిగ్ధ రచించగా, ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. తమకు ఎదురైన సమస్యలకు ఆ తండ్రీ కూతురు నిరంతరం ప్రశ్నించబడుతూ, ఆ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు పేర్చుకుంటూ, సహనంతో అధిగమిస్తూ న్యాయం కోసం అడుగులు వేసిన తీరు ఎంతో ఆకట్టుకుంది. ఆలోచింపజేసిన ‘చిటికెన వేలు’ విశాఖపట్నం తెలుగు కళా సమితి వారు చిటికెన వేలు నాటికను ప్రదర్శించారు. అట్టాడ అప్పల నాయుడు రచించగా, చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించారు. కొండ ప్రాంతంలో సరస్సు ఆధారంగా గిరిజన గూడెం చుట్టూ తిరిగిన కథ ఇది. రోజులు మారడంతో వారి పద్ధతులు కూడా మారిపోయి, కొత్త పుంతలు తొక్కాయి. సోమన్న, రెంజిన్, బుద్ధుడు పాత్రలు ఆకట్టుకున్నాయి. అంతా నిజం కాదు విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి ప్రదర్శించిన ఆ సత్యం నాటిక సందేశాత్మకంగా సాగింది. పిన్నమనేని మృత్యుంజయరావు రచించగా, పి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు. ప్రతి సత్యం వెనుక, ప్రతి అసత్యం వెనుక మనిషి స్వార్థం ఉంటుందని, భయమే చుట్టుకుని ఉంటుందని, అది అతడికి కీడో, మేలో చేస్తోందని చక్కగా వివరించారు. సత్యమైనా, అసత్యమైనా కంటికి కనిపించేదంతా నిజం కాదని, ఒక్కోసారి అసత్యం కూడా మంచి జరుగుతుందని చెప్పారు. -
నేడు ఈద్ ఉల్ ఫితర్
● ముగిసిన రంజాన్ మాసం ● మసీదుల్లో ప్రార్థనలకు పూర్తయిన ఏర్పాట్లు కొత్తపేట: పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. షవ్వాల్ నెల ప్రారంభ సూచికగా శుక్రవారం సాయంత్రం చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటిస్తూ, నమా, సహర్, ఇఫ్తార్, ఖురాన్ పఠనం, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు. ఈద్ నమాజుకు సిద్ధం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలతో పాటు మసీదుల్లో ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేస్తారు. నెల రోజుల తమ ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రంజాన్ మాసంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ధనికులతో పాటు పేదలు సైతం పండగ ఆనందంగా చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈద్ ఉల్ ఫితర్ సమాజ్కు ముందే ఫిత్రా ఇచ్చేయాలి. రంజాన్లో జకాత్ ఇస్తే 70 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం. ఫిత్రా దానం ప్రధానం రంజాన్ సందర్భంగా పేదలకు దానం చేయడమే ఫిత్రా, దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. సద్గ–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లా కల్పిస్తారంటారు. పండగకు ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పడే పుట్టిన బిడ్డ మొదలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున వేర్వేరుగా ఫిత్రా దానం చేయాలి. సర్వం సిద్ధం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జిల్లాలో సామూ హిక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంప్రదాయం ప్రకారం ముస్లింలు ఖర్జూర పండు తిని, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుకుని ప్రార్థనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ సామూహిక ఈద్ నమాజ్ చదివి, అనంతరం పరస్పరం అలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ప్రార్ధనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గం ద్వారా ఇంటికి చేరుకుని సేమియా పాయసం సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికీ సేమియా పంపిణీ చేసి, తమ ఆత్మీయతను చాటుకుంటారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. మార్గదర్శకం గడచిన మాసంలో చేసిన ఉపవాస దీక్షలు, సమాజులు, దానాలు సంకల్ప సిద్ధిని చేకూర్చుతాయి. రంజాన్ మాసంలో అనుసరించిన నియమ నిష్టలు, ప్రత్యేక ప్రార్థనలు మానవాళి సత్ప్రవర్తనకు మార్గదర్శకంగా దోహదపడతాయి. ఖురాన్ పఠనం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో జీవిస్తారు. కుల, మత, వర్గ రహితంగా సమాజంలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుంది. – షేక్ గౌస్, మండల ముస్లిం సంఘ నాయకుడు, కొత్తపేట పేదలకు చేతనైన సాయం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో జన్మధన్యమవుతుంది. రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో ప్రధానమైనది. అల్లా దివ్య సందేశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించాలి. పండగ పూట ఏ ఒక్కరూ పస్తులు ఉండకూడదు. ఆకలి విలువ తెలియజేసేదే రంజాన్ ఉపవాస దీక్ష. ప్రతి ముస్లిం చుట్టుపక్కల ఉన్న పేదలకు చేతనైన సాయం చేయాలి. తనతో పాటు వారూ సంతోషంగా పండగ చేసుకునేలా దానధర్మాలు చేయాలి. – షేక్ ఖాజాబాబు, ప్రెసిడెంట్, మసీదు, షాదీఖానా కమిటీ, కొత్తపేట -
కాస్త మారిస్తే బెటర్
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దు ర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తా రు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవీ విమర్శలు ● సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. ● ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అమ్మవారి ఆలయంలో పరుపులు గుట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి. ● పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. . ● ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు. ● పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నా రు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది. ● ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి. ● గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -
వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
అమలాపురం టౌన్: వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) టి.నిషాంతి హెచ్చరించారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు మానటరింగ్ కమిటీలుఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో ఉన్న రాజేశ్వరి హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ఏజెన్సీలోని స్టాక్, డెలివరీ రికార్డులను పరిశీలించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కొరత అనివార్యమైందన్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకే సిలిండర్లు అందించేందుకు అఽత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాణిజ్య వినియోగానికి గృహ సిలిండర్లను మళ్లించడం పూర్తిగా నిషేధమన్నారు. తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి శరత్, అమలాపురం తహసీల్దార్ వీఎస్ దివాకర్, సీఎస్డీటీ భారతి, జిల్లా తూనికలు, కొలతల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మగౌరవం కథకు ప్రథమ స్థానం రామచంద్రపురం: జిల్లా స్థాయి ఉగాది కథల పోటీలో రామచంద్రపురానికి చెందిన గోదావరి కవి ర్యాలి శ్రీనివాసు రచించిన ఆత్మగౌరవం కథకు ప్రథమ స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆలమూరు బాలమందిరం సాహితీ సంస్థ నిర్వహించిన ఈ ఉగాది కథల పోటీలో తన కథ ప్రథమ బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణశ్రీ తెలిపారన్నారు. సమకాలీన అధ్యాపకులు ఎదుర్కొనే సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని ఆ కథ రచించానని తెలిపారు. ఆలమూరులో ఈ నెల 22న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తారన్నారు. 8న ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నిక అమలాపురం రూరల్: జిల్లా క్రీడాఅభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏప్రిల్ 8న కోనసీమ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించాలని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వైఎస్వీ కుమార్ (నీలాద్రి) అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుందన్నారు. అనంతరం సభ్యుల వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన పత్రాలు తీసుకు రావాలని కోరారు. వివరాలకు 89851 33338, 95508 44046 నంబర్లను సంప్రదించాలన్నారు. -
సాగునీటి పాట్లు
శివారు అవస్థలు అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ నుంచి కె.పెదపూడి చానల్ మీదుగా అంబాజీపేట మండలం గంగలకుర్రు బీసీ హాస్టల్ వద్ద వరిచేలు నీరందాలి. ఇది శివారు ప్రాంతం. ఈ కాలువ పొడవునా కొబ్బరి తోటలు ఉండడం, ఎండలు పెరగడంతో ఇక్కడకు నీరు వచ్చే అవకాశం లేదు. సాగు చేయాలంటే మోటార్లే ఆధారం. పంట కాలువ వ్యవస్థ ఉన్నా చుక్క నీరందడం లేదు. సాగు చేయకుండా వదిలేయక ఇలా మోటార్ల మీద సాగు చేస్తున్నా వాటి ద్వారా కూడా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ● కాలువలకు ఫుల్లు ● శివారుకు అరకొరే ● మెరక పొలాలకు నీటి ఎద్దడి ● పంటలను రక్షించుకునేందుకు రైతుల అవస్థలు సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ అవసరాలకు మించి సాగునీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు గొప్పగా చెబుతున్నారు. కానీ డెల్టాలోని శివారుల్లో అరకొరగా అందుతున్న నీరు చేలకు చేరకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యుత్ మోటార్లతో భూగర్భ జలాలు, మురుగునీటి కాలువలు, వృథా నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు. తాజాగా పడిన వర్షంతో జిల్లాలోని రైతులు కొంత ఊరట చెందినా, పంట చేలు గింజ గట్టి పడే దశలో మున్ముందు సమృద్ధిగా సాగు నీరందకపోతే దిగుబడిపై ప్రభా వం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో.. జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో మొత్తం 1.82 లక్షల ఎకరాల ఆయకట్టులో రబీ వరిసాగు జరగాల్సి ఉంది. వరిని కాదని కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడంతో వరి ఆయకట్టు అంచనా 1.69 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఫిబ్రవరి మూడో వారంలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. అయితే నాట్ల్ల సమయంలోనే రబీలో శివారు, మెరక ప్రాంతాలలో చేలకు నీరందక రైతులు పాట్లు పడ్డారు. మెరక పొలాలకు అందని నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మూడు డెల్టాలకు కలిపి రోజుకు 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. అయినా శివారు, మెరక పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. దీనితో రైతులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటి సేకరణ చేసుకుంటున్నారు. పంట కాలువలు ఆధ్వానంగా ఉండడంతో పాటు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. దీని వల్ల చేలకు తరచూ తడులు అందించాల్సి ఉంది. ఇదే సమయంలో తీర ప్రాంతాల్లో రైతులు ఆక్వా చేలకు, మరీ ముఖ్యంగా చేపల సాగు చేసే రైతులు మోటార్లతో నీరు పెద్ద ఎత్తున చెరువులకు మళ్లిస్తున్నారు. మెరక ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, అరటి వంటి ఉద్యాన పంటలకు సైతం నీరు మళ్లిస్తుండడంతో శివారు, మెరక చేలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ఎద్దడికి గురవుతున్న ప్రాంతాలన్నీ ప్రధాన పంట కాలువలకు అనుబంధంగా ఉన్న చానళ్ల శివారు ప్రాంతాల్లోనివే. ఇదే పరిస్థితి కొనసాగితే చానళ్లు మొదలయ్యే ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంబాజీపేటలో కురుస్తున్న వర్షంఊరటనిచ్చిన వర్షాలు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో గంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీని వల్ల ఈ నియోజకవర్గాల పరిధిలో శివారుల్లో కొంత వరకు రైతులకు నీటి బాధలు తప్పాయి. అయితే ఇది తాత్కాలికమేనని రైతులు చెబుతున్నారు. వర్షాలు తగ్గి ఎండలు పెరిగితే ఇబ్బందులు తప్పవని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంట కాలువల్లో పూడిక తొలగింపు చేయడంతోపాటు శివారుకు అధికంగా నీరిచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
గోదావరి.. కవితా ఝరి
గంగ– రుషుల నది.. యుమున– ప్రేమికుల నది.. కృష్ణ– శిల్పుల నది.. కావేరి– సంగీతకారుల నది అని చెబుతూ.. ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు గోదావరిని ‘కవుల నది’గా అభివర్ణిస్తారు. వేదంలా ఘోషించే గోదావరి తీరాన.. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలన.. శతాబ్దాలుగా కవితా ఝరులు పొంగి పొరలుతూనే ఉన్నాయి. పావన గోదారి నీరు తాగి పెరిగిన ఎంతోమంది అక్షర శిల్పులు.. అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. రేపు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కొంత మంది గోదావరి కవులను చూసొద్దాం రండి..● ఉమ్మడి ‘తూర్పు’న వికసించిన కవితా సుమాలెన్నో.. ● సుప్రసిద్ధ కవులకు ఈ నేల పుట్టినిల్లు ● రేపు ప్రపంచ కవితా దినోత్సవం కపిలేశ్వరపురం: మానవ జీవితంలోని వెలుగునీడల్ని ప్రతిబింబించే కథ, కవిత్వం, నవల, నాటకం.. ఇలా ఏ ప్రక్రియ అయినా సమాజ అభ్యున్నతికి దోహదపడినవే. ప్రకృతి వర్ణనలు, భావావేశపు వెల్లువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, ఎవ్వరూ పట్టించుకోని చీకటి కోణాల గురించి ఎంతో మంది కవులు తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారు. అణువణువునా పావన గోదావరి జలాలతో పునీతమవుతున్న ఈ నేల.. అటువంటి ఎంతో మంది కవులకు జన్మనిచ్చింది. ● 1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా, ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పదహారేళ్ల చిరుత ప్రాయంలోనే తత్త్వవేత్తగా, కవిగా గుర్తింపు పొందార. ఆయన కవితలు అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందాయి. ● ఐ.పోలవరంలో పుట్టి.. 1947 నుంచి 1974 వరకూ రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఒక్క అక్షరం ఎక్కువ, తక్కువ కాకుండా సమపాళ్లలో అక్షరాల పొందికతో కవిత్వాన్ని సృజియించడం ఆయన ప్రత్యేకత. ● పిఠాపురం ప్రాంతంలోని చంద్రపాలెంలో జన్మించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ఆయన కలం నుంచి ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు భావ కవిత్వం అద్భుతంగా జాలువారింది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మా లేకుండా’, ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’ వంటి ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రాశారు. ● మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించిన బోయి భీమన్న ‘కుల, మత, వర్గ విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలన్నదే నా ధ్యేయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ● 1865 ఫిబ్రవరి 11న సీతానగరంలో జన్మించిన కవిశేఖరుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‘సాక్షి’ పేరిట రాసిన వ్యాసాల ద్వారా నాటి సామాజిక పరిస్థితులను ఎండగట్టారు. ● పిఠాపురానికి చెందిన ఆవంత్స సోమసుందర్– నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ‘వజ్రాయుధం’ పేరిట వెలువరించిన కవితా సంకలనం.. ఓ సంచలనం. ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందంటే.. ఆయన ఎంతటి పదునైన పదాలతో ఈ కవిత్వాన్ని వెలువరించారో చెప్పనవసరం లేదు. ● రామచంద్రపురానికి చెందిన అదృష్ట దీపక్– ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ వంటి సినిమా పాటలతో పాటు, అనేక అభ్యుదయ కవితలను రాశారు. ● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు విప్లవ కవుల ప్రభావంతో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వంటి సమీక్షా పుస్తకాలు రాశారు. ● ఈ కోవలోనే ర్యాలి ప్రసాద్ వంటి అనేక మంది కవులు అనేక సమస్యలను అక్షరీకరిస్తూ తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు. ‘అమ్మకు స్వరనీరాజనం’ ● మండపేటలోని సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు చల్లా రవికుమార్ తన తల్లి లక్ష్మి మరణించిన వేళ దశదిన కర్మకాండలకు దూరంగా ఉంటూ ‘అమ్మకు స్వర నీరాజనం’ పేరిట కవితలు, పాటల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ‘భూమిని చీల్చుకునే పుట్టే చెట్టుకు విత్తే కదరా అమ్మ, పురిటి చావుతో యుద్ధం చేసి అమ్మ ఇచ్చును మరుజన్మ’ అంటూ రవికుమార్ స్వయంగా అమ్మపై రాసిన పాటను గాయకుడు సురేష్ నిఖిలం స్వరపరిచారు. ● అలాగే, యుద్ధం ప్రభావాలపై ‘పుడమి గాయం, శోకసంద్రం దీనవదనం దిగులు గగనం! యుద్ధమా! ఇది యుద్ధమా?’ అంటూ నల్లి ధర్మారావు రాసిన గేయానికి రాజమహేంద్రవరానికి చెందిన గాయకుడు సురేష్ స్వరకల్పన చేయగా విశేషంగా ఆదరణ పొందింది. సాహితీ కృషీవలులెందరో.. సాహిత్యాన్ని సృజియించడమే కాదు.. ఆ ప్రవాహం తరువాతి తరానికి కూడా అందించేలా.. ఆ స్ఫూర్తిని కొనసాగించేలా అనేక సంస్థలు నిరంతర కృషి చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు, కవుల జయంతులు, వర్ధంతులు, గ్రంథ సమీక్షల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరం, కాకినాడ కేంద్రంగా సాహితీ స్రవంతి, రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి, మండపేటలో సంగమం సాంస్కృతిక వేదిక, అ.ర.సం వంటి సంస్థలు ఈ కృషిని కొనసాగిస్తున్నాయి. యుద్ధం, కరోనా, మహిళలపై వేధింపులు, వాణిజ్య, వ్యాపారాల ప్రభావం, మానవ వికాసం, విలాపం వంటి అనేక సామాజిక అంశాలపై కవితా గోష్టులు నిర్వహిస్తున్నాయి. కవులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన అంగర గోపాలకృష్ణాచార్యులు (కృష్ణశ్రీ) అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట సాహిత్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. సామర్లకోటకు చెందిన బసా బలరామకృష్ణ (శ్రమేరా) ‘సాహిత్య సహచరుల వేదిక’, కాకినాడకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు ‘పుస్తకం’ పేరుతోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలోని కవితలు, సాహిత్య పుస్తకాలను పంచుకుంటున్నారు. సమాజ మార్పునకు దోహదం నా జీవన భాగస్వామి అమ్మాజీ మృతి చెందిన నాటి నుంచి ‘పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి’ పేరిట ఆమె వర్ధంతి రోజున మూడేళ్ల నుంచి ఏటా పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంచుతున్నాం. ఇప్పటి వరకూ ‘నేను–నా దేశం’, ఉక్కుపాదం’ పుస్తకాలను ప్రచురించి పంచాం. – పోలిశెట్టి కృష్ణ, ప్రజానాట్య మండలి కళాకారుడు, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా -
జిల్లా స్థాయి ఉగాది కథల పోటీల విజేతలు వీరే
ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన బాలమందిరం నిర్వహించిన జిల్లా స్థాయి కథల పోటీల్లో నలుగురు విజేతలను ఎంపిక చేశారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కంచుకుని నిర్వహించిన ఈ పోటీలకు విశేష సంఖ్యలో కథలు అందినట్టు అధ్యక్షుడు కృష్ణశ్రీ గురువారం తెలిపారు. రామచంద్రపురానికి చెందిన ర్యాలి శ్రీనివాసు రచించిన ఆత్మగౌరవం కథకు (ప్రథమ), ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గొడవర్తి శ్రీనివాసు రచించిన మైసూర్ మల్లిగే కథకు (ద్వితీయ), ఆలమూరుకు చెందిన ఆకుల సూర్య రచించిన ఉగాది పచ్చడి కథకు (తృతీయ), పి.గన్నవరం మండలంలోని మానేపల్లికి చెందిన కేవీ లక్ష్మణరావు రచించిన ఉభయ కుశలోపరి కథకు (చతుర్థ) స్థానాలు లభించాయి. ఈ కథల పోటీల్లో ఎంపిక చేసిన 18 కథలతో త్వరలోనే పుస్తకాన్ని రూపొందిస్తామని కృష్ణశ్రీ తెలిపారు. ఉగాది పురస్కారం అందుకున్న శిల్పి మాధవరావు ముమ్మిడివరం: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న వారికి ఇచ్చే ఉగాది పురస్కారాన్ని గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి వెంకట కృష్ణ మాధవరావు గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. శిల్పకళలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. సంప్రదాయ శిల్పకళను ఆధునిక శైలితో మేళవిస్తూ ఎన్నో అద్భుత విగ్రహాలను రూపొందించిన మాధవరావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రుముఖల విగ్రహాలను సృష్టిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. దళితుడి మృతదేహాన్ని అడ్డుకున్న 10 మందిపై అట్రాసిటీ కేసుపి.గన్నవరం: మండలంలోని కుందాలపల్లిలో ఈ నెల 16న కాట్రు శ్రీనివాస్ అనే దళితుని మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకువెళ్లకుండా అడ్డుకున్న, మరొక వర్గానికి చెందిన 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ విలేకరులకు చెప్పారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పెళ్లి పందిరి ఉందన్న కారణంగా ప్రధాన రహదారిపై తీసుకువెళ్లకుండా కొందరు అడ్డుకున్నారన్నారు. వివాదం అనంతరం మృతదేహాన్ని ప్రధాన రహదారి మీదుగా తరలించి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అయితే మృతదేహాన్ని అడ్డుకోవడం నేరమన్నారు. దీనిపై మర్రి శ్రీనివాస్తో పాటు తొమ్మిది మంది ఇచ్చిన ఫిర్యాదుపై పప్పుల లక్ష్మణరావు సహా 10 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా ప్రధాన రహదారిపై ఉన్న పెళ్లి పందిరిని గురువారం తొలగించారు. కాగా కుందాలపల్లిలో బాధితులను మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం పరామర్శించారు. -
సత్యదేవునికి జయము జయము
● పరాభవ నామ సంవత్సర ఫలితం భేష్ ● ఈ ఏడాది భక్తుల సౌకర్యాలకు భారీగా వెచ్చించే అవకాశంఅన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవునికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సర్వత్రా జయం చేకూరుతుందని ప్రముఖ పంచాంగకర్త, అన్నవరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ తెలిపారు. ఆదాయ, వ్యయాలతో నిమిత్తం లేకుండా స్వామివారి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి, సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో వేంచేయించారు. నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంతన ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పరాభవ నామ పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం, పూర్ణప్రసాద్ సిద్ధాంతి నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. సత్యదేవునిది మఖ నక్షత్రం, సింహరాశి కావడంతో ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయన్నారు. ఈ రెండూ సమానమని అంటే ఈ ఏడాది దేవస్థానంలో అనేక సత్రాలు, నూతన నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు వ్యయం చేస్తారని అర్థమన్నారు. భక్తుల సౌకర్యాలు కల్పనకు కూడా నిధులు వెచ్చిస్తారన్నారు. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 7 చొప్పున సమానంగా ఉన్నాయని, అయితే, ఇవి దేవతలకు వర్తించవని చెప్పారు. వైశాఖ మాసంలో సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని వివరించారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. దైవ ప్రార్థనలు, పూజలు, దానాల వలన ఆయా రాశుల వారికి అవి సానుకూల ఫలితాలుగా మారుతాయని ఆయన వివరించారు. పలువురికి సత్కారం పంచాంగ శ్రవణానంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు వెంపరాల సీతారామ అవధాని (అమలాపురం), సుందరరామ శ్రోతి(విజయవాడ)లను రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించారు. పంచాంగ ఫలితాలను వివరించిన పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కూడా సత్కరించారు. దేవస్థానం సీనియర్ వేద పండితుడు గంగాధరభట్ల గంగబాబు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, సీనియర్ అర్చకుడు బులుసు సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో గంగబాబు, ఇంద్రగంటిలను చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్చకుడు బులుసు తరఫున ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ వీటిని స్వీకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం.. భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్యాల నడుమ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా సత్యదేవుని ఆలయం, అనివేటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. -
కొత్త వత్సరానికి స్వాగతం
● పచ్చని సీమలో... తెలుగు వెలుగుల ఉషస్సు ● గ్రామా గ్రామాన ఉగాది పర్వదిన వేడుకలు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు ● పోటెత్తిన భక్తజన సందోహం ● కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక సాక్షి, అమలాపురం: విశ్వావసు నామ తెలుగు సంవత్సరానికి ఘన వీడ్కోలు పలుకుతూ... శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు. ఉగాది వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా జరిగాయి. పురాతన, చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, గ్రామ, పట్టణాలలో అమ్మవారి ఆలయాలు పూల అలంకరణతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. స్వామివారు, అమ్మవారి దర్శనాలకు భక్తులు బారులు తీరారు. పంచాంగ శ్రవణాలు, వేప పువ్వు పచ్చడి పంపిణీలు, దేవాలయాలలో అభిషేకాలు, అమ్మవారి జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కలెక్టరేట్లో ప్రత్యేక వేడుకలతో జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి అంబరాన్నటింది. కన్నుల పండువగా అలంకరణ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలు, పండ్లతో కన్నుల పండువగా అలంకరించారు. అర్చక స్వాములు ఉదయం స్వామివారికి తొలి హారతి, సుప్రభాత సేవ, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ అర్చకులు గురువారం పంచాంగ పఠనం చేసి, ఈ ఏడాది రాశుల ఫలితాలను వివరించారు. ఆలయానికి గత సంవత్సరం సుమారు రూ.56 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. పంచాంగాలకు పూజలు నిర్వహించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచాంగ శ్రవణాలు.. పండిత సత్కారాలు రామచంద్రపురం మండలం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లలితా సహస్ర నామ పారాయణ చేశారు. పండితులను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్కరించారు. ఈవో అల్లూ వెంకట దుర్గాభవానీతోపాటు పలువురు పాల్గొన్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకల సందర్భంగా బ్రహ్మశ్రీ నాగాభట్ల వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకల సందర్భంగా భక్తులకు పంచాంగాలు పంపిణీ చేశారు. మురళీ కోలాటం, కుచిపూడి నృత్య ప్రదర్శనతోపాటు పండితుల సన్మానం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఏసీ ఎం.కె.టి.ఎన్.వి.ప్రసాద్, ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు పాల్గొన్నారు. పండగ సందర్భంగా వందలాది మంది భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అయినవిల్లి శ్రీ వర సిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. శ్రీవారణాశి సేతు మాధవ నర్శింహమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం సాగింది. కలెక్టరేట్లో... శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం, వేద పండితుల సన్మాన కార్యక్రమాలతో వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పండితులు మాట్లాడుతూ ఈ ఏడాది శ్రమకు తగిన ఫలితాలు, ఆత్మ విశ్వాసం, అభివృద్ధి, కొత్త అవకాశాల వల్ల కలిగే మార్పులను రాశుల వారీగా వివరించారు. జిల్లాలో విద్య, వ్యాపారం, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముందన్నారు. ఆధ్యాత్మికత పట్ల ప్రజలలో మరింత ఆసక్తి పెరిగి దేవాలయ దర్శనాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి.మమ్మీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో నూతన సంవత్సరానికి ప్రతీకగా భావించే ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, సంకల్పాలకు నాంది పలకాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ, జిల్లా ఖజానాధికారి రామనాథం పాల్గొన్నారు. -
జిల్లాలో భారీ వర్షం
ఐ.పోలవరం: జిల్లాలో గురువారం దఫదఫాలుగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన అమలాపురం మధ్యాహ్న సమయంలో తడిసి ముద్దయ్యింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. అమలాపురంతోపాటు అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం,ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో మధ్యాహ్నం, రాత్రి వేళ్లల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం భయపెట్టగా, సాయంత్రం ఒక మోస్తరు గాలి, మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడడంతో సామాన్యులు సేద తీరారు. శివారు ప్రాంతాల్లో సాగునీరందక ఇబ్బంది పడుతున్న వరి రైతులకు, ఉద్యాన పంటల రైతులకు వర్షం కాస్త మేలు చేసింది. మామిడికుదురులో భారీగా.. మామిడికుదురు: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మామిడికుదురు మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉంది. ఉదయం ఎండ కాసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. అంతలోనే భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఉగాది పండుగ సందర్భంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి అప్పనపల్లిలో రెండు ప్రధాన రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. మూడు రోడ్ల కూడలి నుంచి స్వామివారి గుడికి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డుపై సంతపేటలో మూడడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. దీంతోపాటు అదే గ్రామంలోని పోస్టాఫీసుకు వద్ద మైనర్ రాజుగారి వీధికి వెళ్లే ప్రధాన ఆర్అండ్బీ రోడ్డుపై కూడా వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. నీటి మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
నేటి నుంచి సీఆర్సీ ఉగాది నాటిక పోటీలు
రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 26వ సిల్వర్ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తెలిపారు. సీఆర్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ఏడు నాటికలు, సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 26 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తూ నాటికలకు పూర్వ వైభవం తీసుకు రావాలని కృషి చేస్తున్నామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం బాలబాలికల నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అందిస్తారన్నారు. తెలుగు రంగస్థలానికి మణిహారంగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన నటీమణి కె.విజయలక్ష్మిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గురువారం హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ బృందం ‘అమ్మ చెక్కిన బొమ్మ’, కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ బృందం ‘కన్నీటికి విలువెంత’ ప్రదర్శించనున్నారు. శుక్రవారం గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ బృందం ‘సహాన’, విశాఖకు చెందిన తెలుగు కళా సమితి ‘చిటికెన వేలు’, చైతన్య కళా స్రవంతి ‘అసత్యం’, మూడో రోజు 21న కాకినాడకు చెందిన ఎస్వీ రంగారావు కళా స్రవంతి బృందం ‘ఆచమనం’, విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్ బృందం ‘దొందూ దొందే’ నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ‘బంగారు లేడి’ ప్రదర్శించనున్నారు. ప్రతి నాటికకు రూ.25 వేలు పారితోషికం, వివిధ విభాగాల్లో వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సీఆర్సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్న బుజ్జి), కొవ్వూరి నరేష్కుమార్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు, కె.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మతాతీతం.. మరియారాధన..
దేవరపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కొర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1976లో ఏలూరు క్యాథలిక్ పీఠం ఏర్పడింది. అప్పటికే ఏలూరులో బిషప్గా ఉన్న జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం ఆయన కారులో విశాఖపట్నం వెళ్తూ గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురవడంతో అక్కడ దిగి ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ఆయన మనసులో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖకు బయలుదేరారు. గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మాణానికి సంకల్పించి 1979లో ఆలయాన్ని నిర్మించి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు. 1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో అక్కడ ప్రేమసేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న పీఠాధిపతుల రాక ఈ నెల 25న ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయకుమార్ రాయరాల, ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి ఉత్సవాలకు హాజరై సమష్టి దివ్యబలి పూజ నిర్వహిస్తారని జాన్ పీటర్ తెలిపారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు దాతలు, భక్తుల సహకారంతో నిత్యం సుమారు 2 వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు వస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, విశ్రాంతి పందిళ్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు భక్తులు పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. భారీగా రానున్న భక్తులు ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. దీపకాంతుల నడుమ క్రీస్తు శిలువగౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం 2000లో అఖండ దేవాలయ నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో అప్పటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ దిరిసిన ఆరోన్ ఆలయ నిరా్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్థనలు చేసుకునేందురు వీలుగా దేవాలయాన్ని నిర్మించారు. క్షేత్రంలో పలు కట్టడాలను కళాత్మకంగా రూపొందించారు. వంద అడుగుల క్రీస్తు మందిరం నిర్మలగిరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపరిచారు. 22 నుంచి మరియతల్లి పండగ ముస్తాబైన పుణ్యక్షేత్రం అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది వస్తారని అంచనా వివిధ ప్రాంతాల నుంచి {ç³™ólÅMýS BÈtïÜ ºçÜ$ÞË$ ˘ -
‘సువర్ణ’ బాధితులకు న్యాయం చేయాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అమలాపురం రూరల్: ఏపీ, తెలంగాణలలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఎండీ, డైరెక్టర్లకు కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించినా బాధితులకు న్యాయం జరగలేదని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బుద్ధ విహార్లో జరిగిన ఏజెంట్లు, బాధితుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 2011లో స్థానికంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి 2014 వరకు సుమారు రెండు వేల మంది నుంచి రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారన్నారు. 2015లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.అంకయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు మండలం ఈదరపల్లి పంచాయతీ పరిధిలో రెండు భవనాలు, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో 25 సెంట్ల కొబ్బరి తోట, 8 సెంట్ల ఇంటి స్థలం. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 4 ఏకరాల భూమి, శ్రీకాకుళంలో 10 ఎకరాలు భూమి, తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ ప్రాంతంలో 140 ఎకరాల భూమి. రాజోలు మండలం శివకోడులో వారు నివసిస్తున్న రూ.50 లక్షల విలువైన భవనం, సంస్థ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. కేసు విచారణ సమయంలో సీజ్ చేసిన ఆస్తులను కంపెనీ ఎండీ భూసిం నాగ వెంకట వేణు, డైరెక్టర్లు బినామీ పేర్లతో విక్రయించారు. ఈ కేసులో మార్చి 16వ తేదీన సంస్థ ఎండీ భూసి నాగ వెంకట వేణుకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, డైరెక్టర్లు రాజ్యలక్ష్మికి ఐదేళ్లు, గౌతమికి మూడేళ్ల జైలు శిక్షతో భారీ జరిమానా విధించారు. రూ.వెయ్యి డిపాజిట్ చేసిన బాధితులందరికీ న్యాయం చేయాలని కోర్టు అదేశించిందని, గతంలో కలెక్టర్ సీజ్ చేసిన సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెంట్లు సంఘం ప్రతినిధులు చింతా రత్నం రాజు, జల్లి ప్రసన్నవాణి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
హద్దూ అదుపూ లేక..
సాక్షి, అమలాపురం: చంద్రబాబు సర్కారులో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గోదావరిని చెరబట్టి అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన లంకలను కొల్లగొట్టి గుల్ల చేస్తున్నారు. అభివృద్ధి పనుల ముసుగులో కొందరు, అనుమతులు పేరుతో మరికొందరు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ తవ్వకాల వల్ల గోదావరి గమనం మారి ఏటిగట్లకు ప్రమాదం ఏర్పడడంతో పాటు కొన్ని లంక గ్రామాలు కనుమరుగయ్యే దుస్థితి కల్పిస్తున్నారు. ఇప్పటికే పి.గన్నవరం మండలం కేంద్రంగా సాగుతున్న మట్టి దందాకు, ఇప్పుడు ఆత్రేయపురం మండలం తోడయ్యింది. యథేచ్ఛగా.. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వీరవరం రెవెన్యూ పరిధిలోని గోదావరి లంక భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. భారీ యంత్రాలను వినియోగించి పగలు, రాత్రి అనే తేడా లేకుండా లంక మట్టిని తవ్వేసి సమీపంలోని ఇటుక బట్టీలకు విక్రయాలు చేస్తున్నారు. తవ్వకాలు జరిపే చోట లారీ మట్టి రూ.1,200 చేసి అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. వీటికి అనుమతులు ఉన్నాయని తవ్వకం దారులు చెబుతున్నారు. పనిలో పనిగా వీరు సరి‘హద్దు’లు దాటి గౌతమీ నది కుడివైపునకు కూడా వచ్చేస్తున్నారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ శివారు రెడ్డిపల్లిలో వరకు మట్టి తవ్వకాలు విస్తరించాయి. అక్రమంగా తరలింపు కోనసీమ జిల్లా పరిధిలో తవ్వకాలు చేస్తున్న అక్రమార్కులు లంకల నుంచి నేరుగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కడియం మండలం బుర్రిలంక, పొట్టిలంకల ఏటిగట్ల మీద నుంచి చొప్పెల్ల, ఆలమూరు, కపిలేశ్వరపురం, అయినవిల్లి మీదుగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. దీనితోపాటు మరికొంత మట్టి ప్రైవేట్ ఇళ్ల రియల్ ఎస్టేట్లకు మళ్లిపోతోంది. ఇలా రోజుకు 40 నుంచి 50 లారీల మట్టి తవ్వకాలు సాగుతున్నాయని అంచనా. జేసీబీలను తరలించి లారీలు వెళ్లేందుకు బాటలు వేసి మరీ ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. ఏటిగట్ల వెంబడి లారీల రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. ఈ లంక గ్రామాల్లో సుమారు 50 ఎకరాలకు సంబంధించిన భూమిపై దశాబ్దాల కాలంగా అనేక వివాదాలు నడుస్తున్నా అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వీటి మీద తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. ఆగని దందా జాతీయ రహదారి 216ఏపై జొన్నాడ వద్ద సాగుతున్న ఫ్లైఓవర్ పేరుతో పి.గన్నవరంలో సాగుతున్న మట్టి దందా ఆగడం లేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 10వ తేదీన ‘తమ్ముళ్ల ఫ్లైఓవర్ యాక్షన్’ పేరుతో వెలుగులోకి తెచ్చినా అధికార యంత్రాంగంలో స్పందన లేదు. గత రెండేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ రోడ్డుకు మట్టి కావాల్సి ఉందని, దానిని సేకరించేందుకు అంటూ అనుమతులు పొందుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారి పాలెం (వైవీ పాలెం) మీదుగా ఎల్.గన్నవరం పరిధిలో, ఉడుమూడిలంకల్లో తవ్వకాలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ములు చేసుకోవడం పరిపాటిగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కీలక తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల సన్నహితులు కనుసన్ననలలో ఇక్కడ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీరికి స్థానిక అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉండడంతో అడ్డుకునేవారు లేకుండా పోతున్నారు. లే అవుట్ల ఫిల్లింగ్కు.. ఎల్.గన్నవరం వద్ద ఎకరం భూమిలోనూ, ఉడిమూడిలంక వద్ద రెండు ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతులు పొందారు. ఎల్.గన్నవరంలో తువ్వ ఇసుకను సేకరించి లేఅవుట్ల ఫిల్లింగ్కు అమ్మకాలు చేస్తున్నారు. అలాగే ఉడుమూడిలంకలో మట్టి సేకరించి లేఅవుట్లకు, ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వద్ద ఇటుక బట్టీలకు, లేఅవుట్ల సైట్ ఫిల్లింగ్కు దొడ్డి దారిన అమ్మకాలు చేస్తున్నారు. తువ్వ ఇసుక రోజుకు 30 లారీల నుంచి 40 లారీల వరకు తరలిస్తుండగా, ఉడమూడిలంక వద్ద పది నుంచి ఇరవై లారీల మట్టి తరలిపోతోంది. ఒక్క లారీ కూడా మట్టి, తువ్వ ఇసుకను జొన్నాడ ఫ్లైఓవర్ వద్ద డంప్ చేయకపోవడం గమనార్హం. జొన్నాడ ఫ్లైఓవర్ అప్రోచ్ పనులు ఇటీవల మొదలయ్యాయి. నిర్మాణ సంస్థ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతం ఫ్లైయాష్ మాత్రమే వినియోగిస్తోంది. కానీ ఇక్కడ తువ్వ ఇసుక, మట్టి వినియోగిస్తున్న దాఖలాలు లేవు. రావులపాలెం మండలం గోపాలపురంలో సైతం మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. సరిహద్దును ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంగా కావడంతో రెండు రోజుల క్రితం తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.·˘ ÌS…MýS Ð]l$sìæt° ™èlÐólÓ-çÜ$¢¯]l² A{MýS-Ð]l*-Æý‡$PË$ ·˘ ™égêV> «§ýlÐ]l-âôæ-ÔèæÓÆý‡… బ్యారేజీ దిగువన జోరుగా తవ్వకాలు ·˘ í³.VýS-¯]l²Ð]lÆý‡…™ø ´ër$ ఆత్రేయపురానికి విస్తరించిన దందా ·˘ Mø¯]l-ïÜÐ]l$ hÌêÏ OÐðlç³# ™èlÐ]lÓ-M>Ë$ ·˘ ™èl*Æý‡$µ Vø§éÐ]lÇ OÐðlç³# ™èlÆý‡-Í…ç³# ·˘ ç³sìæt…^èl$-Mø° ^èl…{§ýl-»êº$ çÜÆ>PÆŠ‡ కోత బారిన.. సహజ సిద్ధంగా ఏర్పడిన లంక భూముల్లో మట్టిని తవ్వేస్తే, ఆ తర్వాత ఉన్న భూములు ప్రవాహ వేగానికి కోతకు గురవుతాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి లంకల మధ్య సాగుతున్న ఈ తవ్వకాలు ఆయా గ్రామాలకు పెను ముప్పుగా మారాయి. భవిష్యత్తులో ఇక్కడ స్థానికులు నివాసం ఉండలేని ప్రమాదం నెలకొంది. వశిష్ట నదీపాయ మధ్య ఉన్న ఈ లంక గ్రామాలకు నదీకోత పెనుముప్పుగా మారింది. ఏటా వరద ఉధృతికి గోదావరిలో లంక భూములు కలిసి పోతున్నాయి. దీనికి మట్టి తవ్వకాలు తోడు కావడంతో ఈ గ్రామాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. కొందరు వ్యక్తుల స్వార్థానికి పంటలు పండే భూములను తాము కోల్పోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. -
టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం
ఐసీడీఎస్ ఆర్జేడీ సుజాతా రాణి కాకినాడ క్రైం: టీనేజీ గర్భ ధారణలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సుజాత రాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయ ఆవరణలో ఫ్యాబిన్ కన్వెన్షన్లో శాఖ తరఫున పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో టీనేజ్ గర్భ ధారణలు, బాల్య వివాహాల నిర్మూలనపై డివిజినల్ స్థాయి దిశానిర్దేశ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజాత రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి సంభవిస్తోందన్నారు. సరైన లైంగిక విద్య, కుటుంబం వ్యవస్థ, సమాజం పట్ల అవగాహన లేకపోవడం బాలికల భవితను చిదిమేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరకపోతే సిబ్బంది విఫలమైనట్లేనని అన్నారు. సమాజంలో కీలక వర్గాలన్నీ పని చేస్తేనే బాలికలను ఈ దురాగతాల నుంచి రక్షించగలమని సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీడీ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు, అందువల్ల కలుగుతున్న టీనేజీ గర్భధారణలు బాలికల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అవగాహన క్షేత్రస్థాయికి చేరేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులో వివాహం జరిగితే చదువు మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక వెసులుబాటు లోపించడం, జీవితంలో స్వతంత్రత కోల్పోవడం, తల్లీ బిడ్డలకు పోషకాహార లోపం, మాతా శిశు మరణాలు సంభవించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు, వారి ఎదుగుదలలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు వాటిల్లుతాయన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని లక్ష్మి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణమూర్తి, డీసీపీవో వెంకట్, డీఐవో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా అసిస్టెంట్ పీడీ జిలానీ, డీఎస్డీవో గోపికృష్ణ, పారా లీగల్ అడ్వకేట్ హేమ పద్మజ సహా ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, మెప్మా సిబ్బంది, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ, వన్స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
అమలాపురం టౌన్/కాట్రేనికోన/ముమ్మిడివరం/: ఉగాది సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లాలోని పలువురు ఎంపికయ్యారు. విజయవాడలో గురువారం జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. పురస్కారానికి ఎంపికై న వారిలో అమలాపురానికి చెందిన సాహితీవేత్త, కవి, రచయిత నల్లా నరసింహమూర్తి, కాట్రేనికోన మండలానికి చెందిన చిత్ర కారుడు ఆకొండి అంజి, ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి వెంకట కృష్ణ మాధవరావు తదితరులు ఉన్నారు. -
వెంకన్న హుండీల ఆదాయం రూ.9.48 లక్షలు
అమలాపురం టౌన్: అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం దేవదాయశాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో తెరచి లెక్కించారు. 45 రోజులకు రూ.9.48 లక్షలు వచ్చిందని దేవస్థానం ఈవో పీవీవీ సత్యకుమార్ తెలిపారు. లెక్కింపులో దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బు లు, ప్రధాన అర్చకుడు పెద్దింటి లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ముమ్మిడివరం: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం 108 కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు 19,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. 44 మంది పరీక్షలు రాయలేదు. డీఈఓ పి.నాగేశ్వరరావుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. -
జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభం
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఇష్టారీతిన తవ్వేస్తున్నారు పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్అండ్బీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నూతన పైపులైన్ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్లైన్ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్లైన్ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. 22న పవర్ లిఫ్టింగ్ పోటీలు అమలాపురం టౌన్: స్థానిక హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల జనహిత భవనంలో ఐదవ ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ (మెన్ అండ్ వుమెన్) పోటీలు–2026 జరగనున్నాయని ఆ జిమ్ కోచ్, పోటీల ఆర్గనైజర్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరగనున్న ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ క్రీడాకారుల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. 70 కిలోల గంజాయి స్వాధీనం బాలుడితో సహా ఐదుగురి అరెస్టు రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
కొత్త ఆశలు.. కోటి కాంతులు
కొత్తపేట: తెలుగు వారి పండగల్లో అతి ముఖ్యమైనది ఉగాది. మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి, పంచాంగ పఠనం, కవి సమ్మేళనాలు, కమ్మనైన పిండి వంటల రుచులు దీని ప్రత్యేకతలు. జీవితంలో కష్టసుఖాలు, సంతోషాలు, దుఖాలు, భావావేశాలు, ప్రేమానురాగాలకు ప్రతీకగా భావించే ఉగాది పచ్చడిని రుచి చూడని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉగాది సందర్భంగా గురువారం విశ్వావసు నామ సంవత్సరం నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి ఆడుగుపెడుతున్నాం. సందడే సందడి శశిర రుతువు ఆకులు రాలే కాలం. తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండగ సందడి సందడి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఉగాదికి ఇళ్లను శుభ్రం చేసుకుని, ఇంటి వాకిళ్లను రంగవల్లులతో అలంకరిస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. ఇంటిల్లిపాదీ కొత్త దుస్తులు ధరించి నిండుదనాన్ని తెస్తారు. అనంతరం ఆలయాలను సందర్శిస్తారు. ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తి కావాలని తమ ఇష్టదైవాలను కొలుస్తారు. ముందుగా ఉగాది పచ్చడి తింటారు. తీపి, చేదుల కలబోత ఉగాది పేరు తలవగానే టక్కున గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడులకు సూచికగా తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పుతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది రోజు పంచాంగ పఠనం నిర్వహించడం ఓ ప్రత్యేకత. తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పండితులతో పలు సంస్థలు, దేవస్థానాలు, పంచాంగ పఠనం నిర్వహిస్తాయి. అలాగే గ్రామ దేవతల తీర్థాలను కూడా ఈ రోజే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అమ్మవార్లు, గ్రామ దేవతల ఉత్సవాలు, తీర్థాలు జరుగుతాయి.·˘ ¯ólsìæ ¯]l$…_ పరాభవ నామ సంవత్సరం ·˘ BÆý‡$ Æý‡$^èl$ÌS ÝëÓVýS™èl… ·˘ EV>¨ Ðólyýl$-MýS-ÌSMýS$ çÜÆý‡Ó… íܧýl®… మన సంప్రదాయం రుతువులను అనుసరించి ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం. ఇది తెలుగు వారి మొదటి పండగ. నేటి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వల్ల మహా ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట, సుఖాలకు ప్రతీకగా, తీపి, చేదుల కలబోత అయిన ఉగాది పచ్చడిని స్వీకరించడం సంప్రదాయంగా వచ్చింది. – బిక్కవోలు అనంత లక్ష్మణ కుమారాచార్యులు, వేద పండితుడు, కొత్తపేట ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగజేయాలి. పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. కొత్త ఏడాది ప్రజలందరికీ ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందం పంచాలి, తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం వరించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
కదలదు.. వదలదు
ప్రత్తిపాడు రూరల్: వారం రోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ నెల 11న ప్రత్తిపాడు మండలం ధారపల్లిలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి నుంచి బవురువాక, తాడువాయి, శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో సంచరించింది. తిరిగి జి.కొత్తపల్లి మీదుగా మైదాన ప్రాంతాన్ని వీడి.. బవురువాకలోని చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్టుకు మంగళవారం చేరిందని అధికారులు ధ్రువీకరించారు. దీంతో, బవురువాక, తాడువాయి, కొత్త అచ్చింపేట, సింగధార, డి.పోలవరం పరిసర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సరైన ప్రదేశంలో దీనిని బంధించేందుకు అన్ని అనుమతులూ తీసుకుని, సర్వసన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఏపీ అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు బవురువాకలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంచనాలకు అందకుండా.. మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంచరించిన బెంగాల్ టైగర్ ఎక్కడైనా పశువుపై దాడి చేస్తే.. ఆ ప్రాంతంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఆ పశు మాంసాన్ని ఆహారంగా స్వీకరించేది. ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే సంచరించేది. జనావాసాల్లోకి వచ్చిన దాఖలాల్లేవు. అయితే, ప్రస్తుతం సంచరిస్తున్న పులి స్వభావం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో ఈ పులి పూర్తిగా జనావాసాల్లోనే ఠీవిగా సంచరించింది. అయితే, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దీనివలన ప్రజలకు ఎటువంటి హానీ కలగలేదు. ఈ పులి ఇప్పటి వరకూ ఏ ప్రాంతంలోనూ 24 గంటలకు మించి నివాసం ఉండలేదు. అధికారుల ట్రాప్లో పడకుండా రూటు మార్చుకుంటూ ముప్పుతిప్పలు పెడుతోంది. పాపికొండలు ప్రాంతం నుంచి ఈ పులి ఇప్పటి వరకూ సుమారు 250 కిలోమీటర్లు సంచరించి, దాదాపు 15 పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఆలయాల పరిసరాల్లో.. ఈ పులి సంచరిస్తున్న దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక్క ఆలయం ఉండటం విశేషం. ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి ఈ నెల 10న ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలాశయ ప్రాంతంలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో సంచరించింది. అక్కడి నుంచి బవురువాకలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంతానికి చేరింది. ఆ తరువాత శంఖవరం మండలం జి.కొత్తపల్లిలో పైడితల్లిమ్మవారి ఆలయ ప్రాంతంలో ఒక రాాత్రి, ఒక పగలు సంచరించింది. అక్కడి నుంచి శంఖవరంలో వేపాలమ్మతల్లి, తరువాత మండపంలో నూకాలమ్మ తల్లి ఆలయం ప్రాంగణాల్లో కనిపించింది. తిరిగి శంఖవరంలోని సత్మెమ్మ తల్లి, జి.కొత్తపల్లిలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంగణాలకు చేరింది. అక్కడి నుంచి బవురువాకలోని వాక అటవీ ప్రాంతంలోని నల్లకొండమ్మతల్లి ఆలయ పరిసరాల్లో ఈ పులి మకాం చేసింది. హిందువులు పులిని అమ్మవారి వాహనంగా కొలుస్తారు. దానికి అద్దం పట్టేలా పులి సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఫ పట్టుబడని పులి ఫ ప్రత్తిపాడు మండలంలోనే సంచారం ఫ బంధించేందుకు అనుమతులు తీసుకున్న అధికారులు -
18 మంది పురోహితులకు నోటీసులు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంచలనం రేకెత్తించిన ‘పురోహితుని చేతివాటం’ వ్యవహారంలో 18 మంది వ్రత పురోహితులకు దేవస్థానం అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికం బిల్లులు తదితర అంశాలు చూసే పురోహితుడు 2024 జనవరి నుంచి 2025 నవంబర్ వరకూ రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. దేవస్థానం అధికారుల హెచ్చరికతో ఆ పురోహితుడు గత ఏడాది డిసెంబర్లో రూ.28.54 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత అతడు మృతి చెందాడు. అతడు మరో 18 మంది వ్రత పురోహితుల అకౌంట్లలో వారికివ్వాల్సిన పారితోషికం కన్నా ఎక్కువ మొతాన్ని జమ చేయించాడు. తరువాత వారికి రకరకాల కారణాలు చెప్పి, ఆ మొత్తాలను తిరిగి తన అకౌంట్కు బదిలీ చేయించుకున్నాడు. చివరకు ఆ 18 మందీ కూడా తాము అధికంగా పొందిన మొత్తాలను దేవస్థానానికి తిరిగి చెల్లించారు. మొత్తం రూ.58.39 లక్షలూ రికవరీ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. ఈ మేరకు తమ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయినప్పటికీ అధికారుల దృష్టికి ఎందుకు తీసుకు రాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ 18 మంది వ్రత పురోహితులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై 14 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. సంచలనం రేపిన వదల బొమ్మాళీ.. వ్రత పురోహితుని చేతివాటం వ్యవహారంలో బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై ‘వదల బొమ్మాళీ..’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనం అన్నవరం దేవస్థానంలో తీవ్ర సంచలనం రేపింది. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై మాత్రమే చర్యలుంటాయని అందరూ భావించారు. కానీ, 18 మంది పురోహితులపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించిన విషయాన్ని ‘సాక్షి’ మాత్రమే వెలుగులోకి తెచ్చింది. దీంతో, ఆ పురోహితుల్లో ఆందోళన మొదలైంది. దీనికితోడు మంగళవారం నోటీసులు జారీ అవడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వ్రత విభాగం సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఏఎస్సై శ్రీనివాసరావుకు అతి ఉత్కృష్ట ఉత్తమ అవార్డు రావులపాలెం: స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న దేవరపల్లి గంగాధర శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అతి ఉత్కృష్ట సేవా పథక్ను మంగళవారం ప్రకటించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి శ్రీనివాసరావు ఒక్కరికే ఈ అవార్డు లభించింది. శ్రీనివాసరావును ఎస్పీ రాహుల్మీనా, డీఎస్పీ మురళీమోహన్, సీఐ శేఖర్ బాబు అభినందించారు. మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట
– తిరుపతిలో బాధిత మహిళలనే అరెస్ట్ చేయడం దారుణం – టీటీడీ చైర్మన్ నాయుడు రాజీనామా చేయాలి – వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆగ్రహం – అమలాపురంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల భారీ నిరసన అమలాపురం రూరల్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్సార్ సీపీ మహిళా నాయకులపై దాడికి పాల్పడటమే కాకుండా, వారిపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ఈ అంశంపై అమలాపురంలో మంగళవారం బుద్ధ విహార్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం అరెస్టులకు నిరసనగా నల్ల రిబన్లు పెట్టికొని రోడ్డుపై ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపట్టిన మహిళా నాయకులపై పోలీసులు దాడులు చేసి, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు. తిరుమల తిరుపతి వంటి పవిత్ర క్షేత్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యవహారాల్లో చిక్కుకోవడం అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే బీఆర్ నాయుడును పదవి నుంచి తప్పించాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఫామ్హౌస్లో ఇటీవల జరిగిన పోలీసుల దాడిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్కుమార్ యాదవ్ డ్రగ్స్ వాడినట్టు పరీక్షల్లో తేలిన ఘటనను జగ్గిరెడ్డి ప్రస్తావించారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని కాపాడుతూ మరోవైపు మహిళలపై దాడులు చేయడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. అత్యంత సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ తిరుమల తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న చైర్మన్ నాయుడు ఇటీవల ఓ మహిళతో నడిపిన వ్యవహారం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ఇకనైనా కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడును వెనకేసుకుని రావడం మానేసి వెంటనే ఆయనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరిదేవి, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరం శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్ నాయుడిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంకా వెనకేసుకు రావడం, ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం, పూర్తిగా గతి తప్పిన చంద్రబాబు వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబీ) ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి వెంకటేశ్వరబాబు, కుడుపూడి భరత భూషణ్, కాశీబాల మునికుమారి, తోరం భాస్కరరావు, అల్లవరం పార్టీ అధ్యక్షుడు సంసాని నాని, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, యిళ్ల శేషారావు, జెడ్పీటీసీ సభ్యుడు కొనుకు గౌతమ్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, చింతపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు సంసాని చంద్రశేఖర్ (నాని) కొనుకు బాబూజీ, జిన్నూరి వెంకటేశ్వరరావు, వంగా గిరిజకుమారి, తోరం గౌతమ్ రాజా, మిండగుదుటి శిరీష్, గొల్లపల్లి డేవిడ్, చీకట్ల కిషోర్, బాకర్ హుస్సేన్, జిల్లెళ్ల రమేష్, సరేళ్ల రామకృష్ణ, చల్లా ప్రభాకర్, ఉండ్రు వెంకటేష్, నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్, మందపాటి కిరణకుమార్, మద్దింశెట్టి ప్రసాద్, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ అకృత్యాలు చంద్రబాబుకు కనబడడం లేదు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల ఆలయంలో టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికినా, దీన్ని భక్తులు, మహిళా లోకం తప్పు పడుతున్నా, విపక్షాలు ఎత్తి చూపుతున్నా సీఎం చంద్రబాబుకు కనబడడం లేదన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఏ మాత్రం నైతిక విలువలు, సత్ప్రవర్తన లేని టీటీడీ చైర్మన్ నాయుడు మహిళలను లైంగికంగా వేధించే పనికిమాలిన వ్యక్తి అని అన్నారు. సీఎం చంద్రబాబు సమర్థిస్తూ ఇంకా ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ బీఆర్ నాయుడు తాను చేసిన ఘనకార్యాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకోవడమే కాకుండా, అప్పటికప్పుడు మూడు రకాల మాటలు మాట్లాడి ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు అన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చైర్మన్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి, తప్పుకోకపోతే తప్పించాలి అన్నారు. -
ఐదుగురు పోలీస్ అధికారులకు సేవా పతకాలు
17ఎఎంపీ17 కడలి సత్యనారాయణ, అమలాపురం రూరల్ పోలీస్ సర్కిల్ ఏఎస్ఐ అమలాపురం టౌన్: విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థత, అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్ అధికారులకు ఉగాది పురస్కారాల పేరుతో సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ శాఖలో స్మార్ట్ పోలీసింగ్ విధానం ద్వారా వీరిని ఎంపిక చేసింది. ఆగస్టు 15న అమరావతిలో జరిగే స్వాతంత్య్ర వేడుకల వేదికపై పతకాలను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అమలాపురంలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడు శాఖలో రిజర్వు ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా పనిచేస్తున్న నేకూరి బ్రహ్మానందం, ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న త్రిపురాన ప్రసాదరావు, అమలాపురం రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న కడలి సత్యనారాయణ, అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగా వీర వెంకట సత్యనారాయణ, జిల్లా ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో ఏఆర్ఎస్సైగా పనిచేస్తున్న ఉప్పాటి చిన్నిలకు ఈ సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. వీరిని ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. -
మత సామరస్యం, ఆత్మీయతకు ప్రతీక ఇఫ్తార్ విందు
జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: మత సామరస్యం, ఆత్మీయతకు ప్రతీక ఇఫ్తార్ విందు అని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మంగళవారం సత్యనారాయణ గార్డెన్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, సీపీఓ మురళీకృష్ణ, ఎల్ ఎల్డీఎం కేశవవర్మ, జిల్లా టూరిజం అధికారి అన్వర్, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధిని 2030 నాటికి నియంత్రించాలి గాలికుంటు వ్యాధిని 2030 నాటికి పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో వ్యాధి నివారణ టీకాలు ఏడాదిలో రెండుసార్లు క్రమం తప్పకుండా వేస్తున్నట్లు జేసీ టి.నిషాంతి తెలిపారు. గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల వాల్పోస్టర్ను జేసీ మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ టీకాల కార్యక్రమాన్ని ఏప్రిల్15 వరకు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె.భవానీప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పాడి పశువుకూ 4 నెలలు నిండిన దూడ దగ్గర నుంచి అన్ని వయసుల్లో ఉన్న ప శువులకూ ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా వేస్తుందనివెల్లడించారు. డాక్టర్ఎల్.విజయరెడ్డి పాల్గొన్నారు. -
ఎక్స్ట్రీమ్గా వంటకాలు
● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు ● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం ● భక్తులకు రుచికరమైన భోజనం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గ్యాస్ సెగ ఆమడ దూరంలో ఉంది. ఈ పథకం 2009లో మొదలై నేటికీ నిరాఘాటంగానే భక్తులకు భోజన వసతి కల్పిస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని పాటిస్తూ స్వామి దర్శనానికి తరలివస్తున్న భక్తులందరికీ కడుపునిండా రుచికరమైన వంటకాలతో సిబ్బంది వండి పెడుతున్నారు. కేవలం 25 నిమిషాల్లోనే.. కేవలం 25 నిమిషాల్లోనే 110 కేజీల బియ్యం ఉడికేటట్టుగా ఒకేసారి స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లతో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆర్వో ప్లాంటు ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ క్షేత్రంలో అన్నదాన పథకానికి పుష్కర కాలం పైబడి జీడిపిక్కల పొయ్యితో ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టం, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో పూర్తిగా కలసి వచ్చింది. కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే వంటలు వండుతున్నారు. తక్కువ సమయంలో అన్నం తయారీ ఇక్కడ స్టీమ్ సిస్టంలో జీడిపిక్కల పొయ్యికి చేరి అంతర్గతంగా ఉన్న నీటి తొట్టెలోని నీళ్లు మరగకాగి తద్వారా వచ్చే స్టీమ్ను గొట్టాలతో స్టీల్ కుక్కర్లలోకి పంపుతున్నారు. జీడిపిక్కల పొయ్యి నుంచి వచ్చే పొగను ప్రత్యేక గొట్టం ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేశారు. పిక్కల పొయ్యిపై పప్పును ఉడికించి సాంబారు సిద్ధం చేస్తున్నారు. అలాగే పిక్కల పొయ్యిలపై సలసలా కాగే నీటిలో బంగాళాదుంపలు, ఇతర కాయగూరలు ఉడికిస్తున్నారు. స్టీమ్ ద్వారా ఒక్కో కుక్కర్లో 25 నిమిషాల్లోనే వేడి వేడి అన్నం సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు గ్యాస్ పొయ్యి మీద కంటే త్వరితగతిన స్టీమ్ ద్వారా స్టీల్ కుక్కర్లలో అన్నం క్షణంలో వండి వారుస్తున్నారు. 26 కేజీల బియ్యం కట్ట 150 మందికి చొప్పున సాధారణ రోజుల్లో రెండు వేల మంది భక్తులు, వారాంతపు సెలవుల్లో నాలుగు వేలకు పైబడి భక్తులు భోజనం చేస్తున్నారు. అదే పర్వదినాల్లో పది వేల మందికి భోజనం చేస్తున్నారు. 26 కేజీలు ఉన్న ఒక బియ్యం కట్ట 150 మందికి సరిపోతుంది. ఈ క్రమంలో సాధారణ రోజుల్లో 10 నుంచి 15 కట్టలు, వారంతపు రోజుల్లో 25 కట్టలు, పర్వదినాల్లో 40 కట్టల బియ్యాన్ని వారుస్తున్నారు. కాగా స్టీమ్ సిస్టమ్ ఉండడంతో ఇతర అవసరాలకై రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. నిత్యాన్నదాన పథకానికి, అర్చకులు స్వామికి నివేదన చేసే ప్రసాదాల తయారీకి ఈ రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలోచన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు మదిలో నాడు మెదిలిన ఈ ఆలోచనను స్థానిక దాతలు, భక్తులు, నాయకులు ప్రోత్సహించారు. లక్ష్మీనృసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ను 2009 అక్టోబరు 28న ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభించిన మొదటి నెల రోజులు జంపన రామరాజు కుమారులు జంపన సత్యనారాయణ రాజు, వెంకట రంగరాజు కలిపి భక్తులకు సొంత విరాళాలతో అన్నదానం అమలు చేశారు. పప్పు, సాంబారు, పెరుగుతో ప్రారంభమైన అన్నదాన పథకం తదనంతరం కూరలు, పచ్చళ్లు, బూరెలు, పులిహోర, పసందైన వంటకాలకు చిరునామాగా మారింది. అంతర్వేది క్షేత్రంలో స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లు పథకం వద్ద గ్యాస్ పొయ్యిలపై వంటకాల తయారీ ఇరాన్తో అమెరికా– ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మన దేశానికి రావలసిన చమురు, ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో వాటితో పాటు దేవాలయాల్లో నిత్యాన్నదానాలపైనే ఈ ప్రభావం పడింది. కానీ అంతర్వేది దేవస్థానంలో అధికారులు, నాయకులు పదిహేనేళ్ల ముందు చూపు కారణంగా అన్నదానం ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఆలయానికి గ్యాస్ కొరత లేదు క్షేత్రంలో ప్రస్తుత తరుణంలో గ్యాస్ కొరత లేదు. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరమవుతున్నాయి. నిత్య అన్నదాన పథకానికి, స్వామివారికి నివేదించే ప్రసాదాల తయారీకి రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నాం. నిత్యాన్నదాన పథకానికి గ్యాస్తో సమానంగా స్టీమ్ సిస్టం క్షేత్రంలో కొనసాగుతోంది. భక్తులకు రుచికరమైన భోజనాన్ని వండి పెడుతున్నాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, ఆలయ ఏసీ, అంతర్వేది దేవస్థానం -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
అమలాపురం టౌన్: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల కింగ్స్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈనెల 15న జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 270 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–15 విభాగంలో స్థానిక విక్టరీ అకాడమీ క్రీడాకారులు తాడి సాయివెంకటేష్, బాలికల విభాగంలో పినిశెట్టి ధరణి, అలాగే అండర్–13 విభాగంలో తామరపు ప్రసన్నకుమార్ ప్రథమ స్థానాలు సాధించారు. వీరు ఒక్కొక్కరు రూ.1,500 నగదు బహుమతులు కూడా గెలుచుకున్నారని అకాడమీ ప్రిన్సిపాల్, జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకటసురేష్ తెలిపారు. విజేతలను ఏపీ చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ తదితరులు అభినందించి ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందజేశారు. -
బైక్లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
గోకవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం పెద్ద రేలంగిపాడుకు చెందిన కాకూరి స్వామిరెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. దీంతో బైక్ల చోరీలకు పాల్పడ్డాడు. బైక్లను చోరీ చేసి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మకాలు సాగించాడు. వివిధ బైక్ చోరీ కేసులపై నమోదైన కేసు విషయంలో విచారణ నిర్వహించగా గోకవరం ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు. -
ఫ కరుణించమ్మా..
ఫ బోనమెత్తి.. అమ్మకు జైకొట్టి రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ తల్లికి మండలం నలుమూలల నుంచి ఊరేగింపుగా వచ్చిన మహిళలు మంగళవారం బోనాలు ఎత్తుకుని అమ్మకు జైకొట్టి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో వందలాది భక్తులు పాల్గొన్నారు. డప్పువాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొన్న ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించాన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. – రాజవొమ్మంగి కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో కొలువై ఉన్న ధారాలమ్మ అమ్మవారి బోనాల జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తలపై బోనాలు ధరించి, తుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ధర్మకర్త దొంగల సత్తిబాబు ఆధ్వర్యాన జరిగిన ఈ జాతర సందర్భంగా వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు. – తుని రూరల్ -
కంటైనర్లో గోవుల అక్రమ రవాణా
చింతూరు: ఒడిశా నుంచి హైదరాబాద్కు కంటైనర్లో తరలిస్తున్న 89 పశువులను చింతూరు మండలం లక్కవరం జంక్షన్ వద్ద మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని లక్కవరం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో కంటైనర్ను సోదా చేయగా గోవుల అక్రమ రవాణా బయట పడినట్లు మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నాసిర్హుస్సేన్ తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న గోవులను గో సంరక్షణశాలకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్పై బయలుదేరారు. ఉండ్రాజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఎదురుగా వస్తున్న యువకుల బైక్, శర్మ స్కూటర్ ఎదురెదురుగా ఢీకొనడంతో శర్మ కిందపడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. శర్మకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెంటపాడు మండలం నుంచి ఉండ్రాజవరం మండల పరిషత్కు బదిలీపై వచ్చారు. అనతికాలంలోనే మంచి వ్యక్తిగా పేరుపొందిన శర్మ అకాల మరణం జీర్ణించుకోలేనిదని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు, మానవత ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కటారి సిద్ధార్థరాజు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలు పంచాయతీల కార్యదర్శులు, ఉద్యోగులు ఆయనను కడసారి చూసేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన భార్య, పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. బ్రెయిన్స్ట్రోక్తో సీఆర్ఎంటీ.. గంగవరం: మండల విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్ఎంటీగా పనిచేస్తున్న దుమ్ముల వరప్రసాద్ (55) బ్రెయిన్స్ట్రోక్తో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వరప్రసాద్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరప్రసాద్ స్వగ్రామం గంగవరం మండలం నెల్లిపూడి. మంగళవారం ఆయన స్వగ్రామం నెల్లిపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వరప్రసాద్ మృతికి జిల్లా విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి–2 టి.మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ, మండల అధ్యక్షులు బొజ్జిదొర తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. గుర్తు తెలియని వృద్ధుడు.. రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అస్వస్థతతో ఉన్న గుర్తుతెలియని వృద్ధుడు స్థానిక ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రైల్వే జీఆర్పీ హెచ్సీ నాగేశ్వరరావు విలేకరులకు తెలిపా రు. సోమవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. మృతుడికి సు మారు 70 ఏళ్లు ఉంటాయని, 5.2 అడుగుల ఎత్తు ఉన్నాడని మరే విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91545 78496 నంబర్కు సంప్రదించాలన్నారు. -
సహచర ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
అమలాపురం టౌన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అంతర్వేది రోడ్ బ్యాంక్ బ్రాంచ్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి రవికుమార్ ఇటీవల కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. అతడి కుటుంబం ఆర్థిక అవస్థలు తెలుసుకుని సహచర ఉద్యోగులు, ఎస్బీఐ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా అతడి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున అమలాపురం రీజినల్ పరిధిలోని 50 బ్యాంక్ బ్రాంచీల రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మృతి చెందిన ఉద్యోగి రవికుమార్ స్వగ్రామమైన మలికిపురానికి వారు మంగళవారం వెళ్లి ఆ బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్, నిత్యావసరాలను అందజేశారు. తొలుత రవికుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అమలాపురం రీజినల్ మేనేజర్ అశోక్ నాగరాజన్, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కార్యదర్శి వై.గణేష్, సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్వేది రోడ్ బ్రాంచి మేనేజర్ వై.విజయ్, యూనియన్ లోకల్ సెక్రటరీ టి.రామప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్హెచ్ కార్యాలయ భవనం అటాచ్మెంట్
రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొవ్వూరు నుంచి గుండుగొలనుకు ఉన్న మార్గంలో ఈ సంస్థకు ఉన్న మూడు ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ట్రస్టు ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ సమస్య పై చివరకు కోర్టు ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనీ డిక్రీ అమలుకు ఆదేశాలిచ్చింది. దీంతో దివాన్చెరువులో ఆర్ఎస్ నం.560/3లో 2.110 ఎకరాలలో ఉన్న ఎన్హెచ్ కార్యాలయ భవనాన్ని, ప్రాంగణాన్ని అటాచ్మెంట్ (జప్తు వరకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికిగాను ప్రాథమికంగా తీసుకునే చర్య) చేస్తూ, ఎటువంటి క్రయ, విక్రయాలు సాగించడానికి వీలులేదంటూ నోటీసు బోర్డులను కూడా ఏర్పాటుచేశారు. -
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సామర్లకోట: వేట్లపాలెం కెనాల్ రోడ్డులో పెట్రోల్ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సమీపాన పెట్రోలు బంకు ఉండటంతో ఏం జరుగుతుందోనని వేట్లపాలెం దుర్గానగర్ కాలనీకి చెందిన ప్రజలు కంటిపై నిద్రలేకుండా గడిపారు. ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదాన్ని గమనించిన కార్మికులు, స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో ఉన్న సరకు అగ్నికి ఆహుతైంది. పెట్రోలు బంకు సమీపాన ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఉండటం ఎప్పటికై నా ప్రమాదమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రమాదానికి కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాందీ షాపులో బ్రాండ్ మిక్సింగ్ గుర్తింపు సామర్లకోట: పెద్దాపురం సినిమా సెంటర్లోని ఎంఎస్ సాయి వైన్స్లో బ్రాండ్ మిక్సింగ్ జరిగిన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈనెల 15వ తేదీ రాత్రి మద్యం షాపులో తనిఖీలు చేసిన విషయం విదితమే. ఈ మేరకు విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం వివరాలను ప్రకటించారు. దీనికి సంబంధించి షాపు యజమాని, షాపులో పని చేస్తున్న వ్యక్తులపై కాకినాడ, పెద్దాపురం ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. షాపులో అనుమానంగా ఉన్న వివిధ మద్యం బ్రాండ్ సీసాలను స్వాధీనం చేసుకొని రసాయన విశ్లేషణ పరీక్షకు పంపామన్నారు. 108లో మహిళ ప్రసవం చింతూరు: పురుడు నిమిత్తం ఆసుపత్రికి తీసుకువస్తున్న క్రమంలో 108 వాహనంలో ప్రసవమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మదుగూరుకు చెందిన గర్భిణి మడకం సుబ్బమ్మకు పురుటినొప్పులు రావడంతో 108లో చింతూరు ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశావర్కర్ లక్ష్మి సాయంతో ఈఎంటీ అరుణ ఆ మహిళకు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా వున్నారని, వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు పైలట్ సురేష్ తెలిపారు. ఉరివేసుకుని ఆత్మహత్యకొత్తపల్లి: భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఒక వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన పెదపాటి శ్రీను (38) గత కొంతకాలంగా రెండో వివాహం చేసుకుని మూలపేటలో కాపురం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా శ్రీను సోమవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. దీనిపై ఎస్సై వెంకటేష్ అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మత్తు మందు జల్లి ఆభరణాలు చోరీ!
నల్లజర్ల: హైదరాబాద్ నుంచి నల్లజర్ల మండలం పోతవరానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ప్రయాణికురాలిపై అర్ధరాత్రి మత్తుమందు జల్లి ఆమె బ్యాగులో ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరగ్గా బాధితురాలు గద్దె భారతిలక్ష్మి మార్చి 2న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతవరంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పోతవరానికి చెందిన గద్దె భారతీలక్ష్మి ఫిబ్రవరి 20న హైదరాబాద్లో బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు గద్దె భారతీలక్ష్మి, బంధువు కరుటూరి నాగశిరోమణి కలసి 28న రాత్రి ఏయస్బీఆర్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. డ్రైవర్ వెనుక ఉన్న స్లీపర్లో వీరద్దరూ పడుకున్నారు. రాత్రి పడుకునే ముందు భారతీలక్ష్మి ఫోన్ బ్యాగ్లో పెట్టేటప్పుడు అందులో ఉన్న బంగారు ఆభరణాలు సరిచూసుకున్నారు. బస్సు ఎక్కడా ఆగలేదు. పోతవరం వచ్చాక బంధువులకు ఫోన్ చేసేందుకు బ్యాగులో చేయిపెడితే నగల ఆచూకీ లేదు. తలదగ్గర పెట్టుకున్న బ్యాగు పెట్టుకున్నట్టే ఉంది. కానీ అందులో నగలు లేవు. దీంతో కంగారు పడి బంధువులకు ఫోన్చేసి చెప్పారు. బస్సు ప్రయాణంలో తన నగలు బంగారు నెక్లెస్, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు మొత్తం 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్టు భారతీలక్ష్మి ఫిర్యాదు చేశారు. బస్సు సిబ్బందే తమపై మత్తుమందు చల్లి ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు పోలీసులు విచారణ చేపట్టక పోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. దీనిపై నల్లజర్ల ఎస్ఐ ఆంజనేయబాబును వివరణ కోరగా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అందుకే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో పాటు భారతీలక్ష్మితో పాటు ప్రయాణించిన 15 మంది ప్రయాణికులను విచారించామని ఈరోజు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. -
వరిలో నకిలీలలు
కోరుకొండ: వ్యవసాయ రంగంలో రైతన్నకు నానాటికీ కష్టాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో రైతు దగాకు గురవుతూనే ఉన్నాడు. విత్తన కంపెనీల కారణంగా నష్టాలపాలు కావాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతమైన గోకవరం, సీతానగరం మండలాల్లో విత్తన కంపెనీల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో 330 మంది రైతులు, 1,150 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు అగ్గితెగులు సోకింది. ఖరీఫ్ సాగులో దిగుబడి తగ్గడంతో రబీసాగుపై నమ్మకం పెట్టుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. కార్పొరేట్ విత్తన కంపెనీల రూపంలో రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వ్యవసాయశాఖ కోరుకొండ సబ్–డివిజన్లో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలున్నాయి. ఈసబ్ డివిజన్లో 10,150 మంది రైతులు రబీ సీజన్లో 21,526 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. కాగా కోరుకొండ మండలంలో 5,621 ఎకరాలు, సీతానగరం మండలంలో 11,022 ఎకరాలు, గోకవరం మండలంలో 4,883 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే అగ్గితెగులు కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెదుతున్నారు. గింజ పెరిగే దశలోని చేలల్లో, పుష్పగుచ్ఛానికి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు. దీంతో తాలు, తప్ప గింజలు మాత్రమే రైతులకు దక్కుతాయని గగ్గోలు పెడుతున్నారు. ఈకారణంగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఇటీవల వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫిర్యదు చేశారు. విత్తన దుకాణాల కారణంగానే నష్టపోయినట్టు రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. శాస్త్రవేత్తలకు పంపాం గోకవరం, సీతానగరం మండలాల్లోని రైతుల ఫిర్యాదు మేరకు విత్తనాల విషయమై శాస్త్రవేత్తలకు ఫిర్యాదులను పంపాము. వారు వచ్చి పంటపొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ధారణ చేస్తారు. అలాగే సమస్యను వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్య నిర్దిష్టంగా తంటికొండ, గాదెలపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అగ్గితెగులు కారణంగా ఆశించినంత దిగుబడి రాదు. తాలు, తప్పలు మాత్రమే వస్తాయి. – డి.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ ఏడీ, కోరుకొండ నకిలీ విత్తనాలే కారణమంటున్న రైతులు గోకవరం, సీతానగరం మండలాల్లో 1,150 ఎకరాల్లో పంట నష్టం పొలాలను పరిశీలించిన అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఫిర్యాదు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధవళేశ్వరం: స్థానిక ప్రధాన రహదారి శాంతారామ్ హాస్పిటల్ సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరు మండలానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బేబీ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకకు చెందిన భార్యాభర్తలు యర్రంశెట్టి శ్రీనివాస్, బేబి గ్రామంలో త్వరలో జరగనున్న ఉత్సవాలకు కొత్తబట్టలు కొనుక్కునేందుకు సోమవారం షాపింగ్కు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ధవళేశ్వరం శాంతారామ్ హాస్పిటల్ సమీపానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మృతుని భార్య బేబిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బేబి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఆటోపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దర్జాగా నీటి చౌర్యం
తాళ్లరేవు: నీటి అవసరాలు పెరిగిపోవడంతో అక్రమార్కులు భూగర్భ జలాలను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో నీటిని నిత్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థల అవసరాల కోసం భూగర్భ జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహదారుల చెంతన బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పలుచోట్ల అనధికారికంగా బోర్లను వేసి నీటిని యథేచ్ఛగా తోడుతున్నారు. నిత్యం లక్షలాది లీటర్ల నీటిని తోడి తరలిస్తుండడంతో భూగర్భజలాల స్థాయి పడిపోతుందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, పోలేకుర్రు తదితర పంచాయతీల్లో రహదారుల చెంతన బోర్లను వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో పట్టి కంపెనీలకు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా మండల అధికారులుగాని, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతుల్లేకుండా ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో తరలింపు పట్టించుకోని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న మంచినీటి బోర్లు అడుగంటుతున్న భూగర్భజలాలు -
కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకూ పోరాడతాం
ప్రకాశం నగర్: మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదని, పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు ఎరజ్రెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆరవ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ స్టేడియం నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తాడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటలు పని సమయాన్ని పెంచడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంటగ్యాసుపై రూ.60, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ప్రజలు మరిచిపోరన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్రం నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాల్ కార్మిక నాయకులు తమ ఐక్యతను చాటారు. ఈ బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షుడు అసుల రంగనాయకులు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసు రత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణరావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం (విశాఖ): విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ.కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జేఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తూ మరణించిన ఆరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని, సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఎ.శ్రీనివాస్, ఎల్.అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో శిలాఫలకం ధ్వంసం ముమ్మిడివరం: కొమానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో సుమారు రూ.50 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటణకు కారకులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఆర్కు సీఐ రాంబాబు నల్లజర్ల: స్థానిక సీఐ వై.రాంబాబు వీఆర్కు వెళ్లారు. ప్రసుత్తం ఆ బాధ్యతలను దేవరపల్లి సీఐ నాగేశ్వరావునాయక్కు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలు రావడం, పోవడం పరిపాటిగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారనే విషయం స్థానికులకు సైతం తెలియకుండా పోయింది. అపుడే దాదాపు ఐదారుగురు సీఐలు, పది మందికి పైగా ఎస్ఐలు మారుతూనే ఉన్నారు. కారణం ఏమిటో తెలియడం లేదని స్ధానికులు అంటున్నారు. కోడిపందాలు, పేకాటలు, జూదాలు, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియా అన్నీ ఈ మండలంలోనే ఉన్నాయి. వీటన్నింటిని చూసీచూడనట్టు ఉంటేనే ఇక్కడ ఏ అధికారి అయినా ఉద్యోగం చేయగలుగుతారు. లేకుంటే మర్నాడే వేరే చోటికి బదిలీ కావాల్సిందేనన్న విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. ప్రస్తుత సీఐకు కూడా ఈవిధంగానే వీఆర్ జరిగిందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. సీఐ వీఆర్కు వెళ్లిన సంగతి ఇంతవరకు గోప్యంగానే ఉంది. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాయలం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న టి.గణేష్బాబును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్రిజిస్ట్రార్గా నియమించారు. కాకినాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసమూర్తిని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సబ్రిజిస్ట్రార్గా నియమించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు
అమలాపురం రూరల్: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి 58 రోజుల పాటు కఠిన నిరాహార దీక్షకు పూని ఆత్మ బలిదానం చేసిన మహోన్నత వ్యక్తి అమర జీవి పొట్టి శ్రీరాములని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ప్రసంగిస్తూ తెలుగు మాట్లాడే వారందరికీ ఒక ప్రత్యేక గుర్తింపును, రాష్ట్రాన్ని అందించిన ఆయన త్యాగం అజరామరం అన్నారు. గాంధేయవాదిగా ఆయన చూపిన పట్టుదల, సత్యం, అహింస మార్గాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ టి. నిషాంతి, తహసీల్దార్ వీఎస్ దివాకర్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎస్పీ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సరఫరా కావడం లేదు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కేటరింగ్ అండ్ కుకింగ్ నిర్వాహకులు, హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక కొంతమంది వంటలు చేయడం నిలిపివేశారు. దీంతో పనులు లేక కార్మికులు, వ్యాపారులు, హోటళ్ల యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం హాటళ్లకు గ్యాస్ సరఫరా చేయకుంటే మూతపడే ప్రమాదం ఉంది. – సలాది సూరిబాబు, జిల్లా అధ్యక్షుడు, కోనసీమ కేటరింగ్ అండ్ కుకింగ్ సంఘం, అమలాపురం ఆందోళన వద్దు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుంది. వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరంలేదు. సిలిండర్ల డెలివరీ విషయంలో ఏవైనా ఇబ్బంది కలిగిస్తే అధికారులకు ఫిర్యాదు చేయండి. లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలి. జిల్లాలో హోటళ్లపై దాడులు చేసి 28 సిలిండర్లను స్వాధీనం చేసుకొని 6ఏ కేసులు నమోదు చేశాం. – అడపా ఉదయ భాస్కరరావు, డీఎస్వో, అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వైఎస్సార్ సీపీ మహిళా నేతలపై దాడికి నేడు నిరసన
సాక్షి, అమలాపురం: తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్తో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్ సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) తీవ్రంగా ఖడించారు. దాడికి నిరసనగా పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అమలాపురంలోనిని ఈదరపల్లి వంతెన వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దాడికి పాల్పడటమే కాకుండా బాధితులైన మహిళా నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రతినిధులు, సభ్యులు పాల్గొని నిరసననువిజయవంతం చేయాలని బాబీ పిలుపునిచ్చారు. పోలీస్ గ్రీవెన్స్కు 33 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 33 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ తమ చాంబర్ల నుంచి ఈ పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చారు. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీలు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలపై చర్చించారు. వచ్చిన అర్జీల్లో కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. పాలనలో పారదర్శకత అవసరం అమలాపురం రూరల్: పరిపాలనలో వేగం, పార దర్శకత ఉన్నప్పుడే సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లో ఈ–ఆఫీస్ ఫైళ్ల పరి ష్కారంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జేసీ నిషాంతిని జిల్లా యంత్రాంగం సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రతి వినియోగదారుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న ప్పుడే మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని జేసీ నిషాంతి అన్నారు. కలెక్టరేట్లో వినియోగదారుల హక్కుల దినోత్సవం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
● జిల్లాలో 99.67 శాతం మంది విద్యార్థుల హాజరు ● పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు సాక్షి, అమలాపురం: పాఠశాల చదువులో విద్యార్థికి కీలకమైన పదవ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యా శాఖాధికారులు ముందు నుంచీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనివ్వడంతో..ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే నిబంధన అమల్లో ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్దకు ముందుగానే హాజరై తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. చాలాచోట్ల కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను వారి పాఠశాల వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు తరలించాయి. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల వెంట ఉండి చివరి నిమిషం వరకు తగు సూచనలిస్తూ కన్పించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరిగాయి. 19,066 మంది హాజరు జిల్లావ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాల్లో 19,066 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు పరీక్ష 19,130 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 19,066 మంది హాజరు కాగా, 64 మంది గైర్హాజరయ్యారు. ఇంగ్లిషు మీడియం నుంచి 19,001 మంది, తెలుగు మీడియం నుంచి 65 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంగ్లిషు మీడియం నుంచి 64 మంది గైర్హాజరయ్యారు. 19,047 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్గా 19 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 99.67 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు జిల్లాలోని రెండు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో కూడా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల్లో భాగంగా తొలి రోజు తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ రావిరాల, జిల్లా పరిశీలకులు ఎల్.కృష్ణఫణి, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టాయి. వీరంతా 52 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. కాగా తొలిరోజు జరిగిన పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. టెన్షన్గా.. విద్యార్థి దశలో తొలిసారిగా ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు కావడంతో విద్యార్థులు టెన్షన్ ఫీలయ్యారు. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని, పరీక్షా కేంద్రంలో వారి నంబర్లు ఏ గదిలో కేటాయించారో సరిచూసుకున్నారు. పలువురు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వరకు పుస్తకాలతో కుస్తీ పట్టడం కన్పించింది. పలువురు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు తమ ఇష్టదైవాల ఆలయాల్లో పూజలు చేశారు. -
హోటళ్లకు ఇబ్బండలు!
అమలాపురం రూరల్: ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో ఈ ప్రభావం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో హోటల్ రంగంపై పడింది. తగినంత నిల్వలు లేకపోవడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్రం ప్రభుత్వం వారం రోజులుగా నిలిపివేసింది. దీంతో హోటళ్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల మంది కార్మికులపై ఈ ప్రభావం పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక హోటళ్లు–టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతపడే పరిస్థితి నెలకొంది. అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ముమ్మిడివరం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో హోటళ్లలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో డొమెస్టిక్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు సిలిండర్లను అధిక ధరకు బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి వరకు డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.885 ఉంది. మార్చిలో ప్రభుత్వం రూ.56 పెంచడంతో 941కు చేరింది. డెలివరీ బాయ్స్ అదనంగా వసూలు చేస్తుండడంతో సిలిండర్ ధర రూ.1,000కి చేరింది. ప్రస్తుతం డిమాండ్ను బట్టి బ్లాక్లో రూ.1,400 నుంచి రూ.1,500 వరకు విక్రయిన్నారు. జిల్లాలోని పట్టణాల్లో 60 వరకు, గ్రామాల్లో 160 వరకు పెద్ద హోటల్స్ ఉన్నాయి. 400 చిన్న హోటల్స్ ఉన్నాయి. కోనసీమలో కేటరింగ్, అండ్ కుకింగ్ అసోసియేషన్లో పరిధిలో సుమారు 200 వంటల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటీతో పాటు వేలాది టీ పాయింట్లు, ఫాస్ట్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో నెలకు 11 వేల నుంచి 16 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తున్నారు. మెనూలో మార్పులు పెద్ద హోటళ్లలో మెనూలో మార్పులు చేశారు. గ్యాస్ పూర్తిగా లభించే సమయంలో పలు రకాల పీతలు, చికెన్, మటన్, సూప్లు వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేవి. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వేడివేడిగా తయారు చేసి వడ్డించేవారు. ప్రస్తుతం బిర్యానీలు, చికెన్ కర్రీ, చేపల పులుసు, కూరగాయలు, సాంబారు వంటి వాటిని మాత్రమే తయారు చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా అప్పటికప్పుడు కట్టెల పొయ్యిలపై చేసే వంటలు మాత్రమే మెనూలో ఉంచుతున్నారు. ఎల్పీజీ ఏజెన్సీల తనిఖీకి ఆదేశాలు ఇరాన్ –ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, ఇతర రంగాలకు మళ్లింపును నిలిపివేయాలని డీలర్లను కలెక్టర్ మహేష్ ఆదేశించారు. జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. మిడ్–డే–మీల్ పథకాలు, అంగన్వాడీలకు ఎల్పీజీ సిలిండర్ల నిరంతరాయంగా సరఫరా చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా 94416 92275 ఫోన్ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సేల్స్ అధికారులు వారంలో రెండు రోజులు జిల్లాలో పర్యటించి ఎల్పీజీ ఏజెన్సీలను తనిఖీ చేసి, ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, పెద్ద క్యాటరింగ్ సంస్థలలో రోజువారీ తనిఖీలు నిర్వహించాలన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గమనిస్తే స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేయాలన్నారు. సౌరశక్తితో వంట ఏర్పాట్లు : జేసీ ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో వాణిజ్య రంగానికి ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిపివేసిన కారణంగా దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నదానం, అక్షయపాత్ర కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో వంట ఏర్పాట్లు చేసుకోవాలని జేసీ టీనిషాంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, దేవదాయ ధర్మాదాయ శాఖ, నెడ్క్యాప్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేత దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంటలు చాలాచోట్ల మూతపడే పరిస్థితి వేలమంది కార్మికులపై ప్రభావం గ్యాస్బండ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు గ్యాస్ కొరతను తగ్గించేందుకు గ్యాస్బండ బుకింగ్కు 21 రోజులు ఉన్న గడువును కేంద్రం ప్రభుత్వం 25 రోజులకు పెంచింది. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 25 రోజుల తర్వాత, రెండు బండలు ఉన్నవారు 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే వీలు ఉంది. ఇప్పటికే వంట గ్యాస్ బుకింగ్స్ పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు కొత్త విధానం ప్రకారం చమురు సంస్థల సాఫ్ట్వేర్లో మార్పులు చేశాయి. దీంతో సిలిండర్లు సకాలంలో రాక గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ లెక్క.. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 27 సింగిల్ సిలిండర్లు 2,438డబుల్ సిలిండర్ 99,879 దీపం 1,85,442 ఉజ్వల 9,581 కమర్షియల్ 14,72 సీఎస్ఆర్ 9,440 కనెక్షన్లు మొత్తం 5,06,252 గ్యాస్ కావలసిన సిలిండర్లు 34,156 ఏజెన్సీల్లో నిల్వ ఉన్న స్టాక్ 6,977 వీరేశ్వరుని ఆలయానికి గ్యాస్ సెగ ఐ.పోలవరం: ఇరాన్– అమెరికా,ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలతో ఎల్పీజీ గ్యాస్ సెగ ప్రముఖ పుణ్యక్షేత్రం మురమళ్ల భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామివారి ఆలయానికి తగిలింది. నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో రోజూ సాయంత్రం స్వామివారి సామూహిక కల్యాణాలు జరుగుతాయి. ఈ కల్యాణాలకు హాజరయ్యే సుమారు 700 మందికిపైగా భక్తులకు రోజు అన్నదానం సాగుతుంది. ఇందుకు గ్యాస్ స్టవ్లపైనే వంట చేస్తారు. యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా దేవస్థానం అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం నుంచి కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. అన్నంతోపాటు కూరలు, సాంబారు తదితర పదార్థాలను కట్టెల పొయ్యిలపైనే చేస్తున్నారు. గ్యాస్ కొరత లేకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో చర్యలు కనిపించడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. -
గోదావరిలో కొట్టుకుపోయి యువకుడి మృతి
మరో ఇద్దరు సురక్షితం ముమ్మిడివరం: అంత్యక్రియలకు వెళ్లి గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటన ముమ్మిడివరం మండలం అయినాపురం వియర్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అయినాపురానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు మృతి చెందగా, అతని బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్మశానంలో అంత్యక్రియల అనంతరం అయినాపురం వియర్ వద్ద గౌతమీ గోదావరి పాయలో స్నానం చేస్తుండగా ప్రవాహ వేగానికి మట్టపర్తి భానుప్రసాద్ (28)కొట్టుకుపోయాడు. అందరూ స్నానం చేస్తుండగా భానుప్రసాద్, సానబోయిన రాములు నదిలో కొంచెం ముందుకు పోతుండగా రాము తండ్రి పట్టాభి వారిద్దరినీ రక్షించేందుకు వెళ్లాడు. తనకు రాము చేయి చిక్కగా, భానుప్రసాద్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే పట్టాభి, రాములు కూడా ప్రవాహ వేగం నుంచి బయటకు రాలేకపోవడంతో స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. మట్టపర్తి శ్రీనివాస్, మహాలక్ష్మి దంపతుల రెండో కుమారుడు భానుప్రసాద్. శ్రీనివాస్ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. మృతుడు భానుప్రసాద్ హైదరాబాద్లో ఏసీ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ నుంచి అయినాపురంలో సొంత ఇంటికి వచ్చాడు. గోదావరిలో గల్లంతైన భానుప్రసాద్ కోసం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా, అక్కడికి కొంచెం దూరంలో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని ఎస్సై డి.జ్వాలాసాగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థీ విజయోస్తు..
సాక్షి, అమలాపురం: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.. వచ్చే నెల 1వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. గతేడాది ‘పది’ పరీక్షల్లో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ చెబుతోంది. ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే సెక్షన్ 25 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. సాధ్యమైనంత వరకూ విద్యార్థులు సమయ పాలన పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సివిల్ డ్రస్లోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థుల సమస్యలు అధిగమించేందుకు జిల్లా కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షలు సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్.కృష్ణఫణిని జిల్లా పరిశీలకులుగా నియమించారు. గతేడాది మాదిరిగానే జిల్లా కేంద్రంగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎన్ని కేంద్రాలంటే.. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 405 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 19,310 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 మండలాల పరిధిలో 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. 12,668 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి, 6,642 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరు కాకుండా 167 మంది ఒకసారి పరీక్షలు తప్పిన విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అలాగే 3,279 మంది విద్యార్థులు ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారు. నోఫోన్ జోన్లుగా కేంద్రాలు పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, వైద్య సిబ్బంది ఫోన్లు తీసుకుని వెళ్లడానికి వీల్లేదు. ఏ ఒక్కరి వద్ద సెల్ఫోన్ ఉన్నా సస్పెన్షన్తో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. సీఎస్ ఒక్కరి వద్ద మాత్రమే సమాచారం అందజేసే నిమిత్తం ఫోన్ వినియోగించే అవకాశముంది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రజాప్రతినిధులు, మీడియాకు అనుమతి ఉండదు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి మూడు పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ చేయనున్నారు. ఈసారి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా పనిచేయనున్నారు. ఒక కేంద్రానికి కేటాయించిన ఇన్విజిలేటర్లను మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచరు. తర్వాత మరో కేంద్రానికి పంపుతారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సబ్జెక్టు టీచర్లను నియమించరాదు ఇన్విజిలేషన్ విధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్టు టీచర్లను నియమించరు. పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్లతో పాటు ఎస్జీటీల సేవలను వినియోగించుకోనున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులను వారి సబ్జెక్టు రోజు ఇన్విజిలేషన్ విధులు నిర్వహించడానికి లేదు. పాఠశాల విధులకు ఆటంకం కలగకుండా ఇన్విజిలేటర్ల నియామకం చేపడుతున్నారు. సింగిల్ టీచర్ ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి ఇన్విజిలేషన్ విధులకు టీచర్ను నియమించరు. సెల్ఫ్ సెంటర్లుగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో అదే పాఠశాలల నుంచి టీచర్లను సీఎస్, డీఓ, ఇన్విజిలేషన్ విధులకు నియమించకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించే ముందు నామినల్ రోల్స్, ఫొటో అటెండెన్స్ షీట్లలో ఉన్న విషయాలను సరిచూసుకున్న తర్వాతే అనుమతించాలని స్పష్టం చేసారు. ఫ నేటి నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం ఫ ప్రతి మూడు పరీక్షలకు జంబ్లింగ్ ఇన్విజిలేషన్ ఫ జిల్లాలో 108 పరీక్షా కేంద్రాలు ఫ హాజరు కానున్న 19,310 మంది విద్యార్థులు జిల్లాలో ఇలా.. పరీక్ష కేంద్రాలు 108 మొత్తం విద్యార్థులు 19,310 బాలురు 9,779 బాలికలు 9,531 చీఫ్ సూపరింటెండెంట్లు 108 డిపార్ట్మెంటల్ అధికారులు 108 అసిస్టెంట్ డిపార్ట్మెంటల్ అధికారులు 03 ఇన్విజిలేటర్లు 1,300 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 05 సిట్టింగ్ స్క్వాడ్స్ 35 సీసీ కెమెరాలు ఉన్న పరీక్షా కేంద్రాలు 08 కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 96664 37749 జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్: 93981 33739 25 యాక్ట్ అమలుకు ఆదేశాలు మరోవైపు యాక్ట్–25, 1997 అమల్లో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో స్క్వాడ్స్ వచ్చినప్పుడు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే, దానికి ఇన్విజిలేటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారితో పాటు సీఎస్, డీఓలను బాధ్యులను చేస్తారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా వేస్తారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. మాల్ ప్రాక్టీస్ కేసులు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబరు విద్యార్థులకు అందించే ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబరు ఉంటుంది. పరీక్షకు హాజరు కాాని వారి ప్రశ్నపత్రాలు పక్కన పెడతాం. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ను ఇస్తారు. అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ను ఇస్తారు. –పి.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం డ్రోన్ కెమెరాలతో నిఘా అమలాపురం టౌన్: జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు డ్రోన్ కెమెరాలు, నిరంతర పెట్రోలింగ్తో పూర్తి నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపు గుంపులుగా ఉండడం నిషేధమన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేఫ్లను వాటి నిర్వాహకులు విధిగా మూసివేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. జిల్లా విద్యా శాఖతో తమ పోలీస్ శాఖ సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. -
విజయమివ్వు.. విఘ్నేశ్వరా
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, లక్ష్మీగణపతి హోమంలో 16 మంది పాల్గొన్నారు. పంచామృతాభిషేకాలు ఒక జంట, ఉండాళ్ల పూజ ఏడుగురు దంపతులు చేశారు. ముగ్గురు చిన్నారులకు నామకరణ, ఐదుగురికి అక్షరాభ్యాసాలు జరిపారు. 8 మంది చిన్నారులకు తులాభారం, ఏడుగురు చిన్నారులకు అన్నప్రాశన, 39 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,469 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,09,594 ఆదాయం వచ్చిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్కు నేరుగా చేసి తెలుసుకోచ్చని అన్నారు. ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై న స్నేహిత అమలాపురం టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందడం అంత సులువేమీ కాదు.. ఇలాంటి రోజుల్లో అమలాపురానికి చెందిన నాట్ర రమ స్నేహిత ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల మొదటి వారంలో వెలువడిన బ్యాంక్ ఉద్యోగాల ఫలితాల్లో ఆమె నాలుగు బ్యాంక్ ఉద్యోగాలకు అర్హత సాధించింది. నాట్ర సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ విశాలి దంపతుల కుమార్తె రమ స్నేహిత. తండ్రి సుబ్రహ్మణ్యం అమలాపురంలో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్గా, తల్లి అన్నపూర్ణ గృహిణిగా ఉన్నారు. స్నేహిత సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ల క్లర్క్ ఉద్యోగాలకు, గ్రామీణ బ్యాంక్ స్కేల్–1 ఆఫీసర్ ఉద్యోగానికి ఆమె ఎంపికై ంది. స్నేహిత విద్యాభ్యాసం పదో తరగతి వరకూ అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాగింది. అలాగే ఇంటర్ అమలాపురం శ్రీచైతన్య జూనియర్ కళాశాల, బీటెక్ భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్నేహిత సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లకుండా బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి బ్యాంక్లో కొలువు సాధించాలని పట్టుదలతో ముందుకు సాగింది. ఒకేసారి నాలుగు బ్యాంక్ ఉద్యోగాలకు అర్హత సాధించడం పట్ల స్నేహితను ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు. తలుపులమ్మ సన్నిధిలో రద్దీ తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 19 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,44,720, పూజా టికెట్లకు రూ.1,72,190, కేశఖండన శాలకు రూ.9,040, వాహన పూజలకు రూ.9,830, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.51,870, విరాళాలు రూ.25,475 కలిపి మొత్తం రూ.4,12,675 ఆదాయం సమకూరిందని వివరించారు. -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు
అమలాపురం రూరల్: అమలాపురం బాలయోగి స్టేడియంలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. మొత్తం 8 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. శాప్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్లో రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట చక్కని సమన్వయంతో ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. అనంతరం జరిగిన సభలో కోనసీమ క్రీడా మండలి అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ షటిల్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ మాతృమూర్తి రంగమణి మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆకాంక్షించారు. ముగింపు వేడుకలో విజేతలకు బహుమతులు అందజేశారు. పప్పుల శ్రీరామ చంద్రమూర్తి, మండేల బాబీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనందాల ఊయల్లో..
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో మంగళస్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దానికి ఆధునిక హంగులు అద్దుతూ కొత్తగా హల్దీ ఫంక్షన్ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక అని కూడా పిలుస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది. కొత్త పుంతలు పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సెట్టింగ్లు హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్గా మారింది.డ్రెస్ కోడ్ హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు. చెప్పలేని ఆనందంఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. – కె.సాయికుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాకినాడ ఉత్సాహాన్నిస్తాయికొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.– కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం ప్రత్యేక ఆకర్షణపెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. – కె.సతీష్, ఎన్కేఎస్ ఈవెంట్ మేనేజర్,రాజమహేంద్రవరం -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
ముమ్మిడివరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీఈవో కార్యాలయంలో ఆయన శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 19,310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి 108 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 108 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామన్నారు. జిల్లాలోని 25 పోలీస్ స్టేషన్లలో పరీక్షా పేపర్లు డిపాజిట్ చేశామని, పరీక్షకు అర్ధగంట ముందు పరీక్షా కేంద్రాలకు తీసుకు వస్తారన్నారు. 234 మంది దివ్యాంగుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, అసలు రాయడానికి వీలు లేనంటువంటి విద్యార్థులకు సహాయకులుగా కేంద్రానికి ఒక ఐఆర్టీని ఏర్పాటు చేేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేస్తోందని, అలాగే విద్యార్థులు సివిల్ డ్రెస్లో రావాలన్నారు. పరీక్షల విభాగం ఏపీ బి.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. కల్యాణ మండపం, అన్నదాన భవనానికి శంకుస్థాపన ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కల్యాణ మండపం, అన్నదాన భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వాడపల్లిలో ఆర్యవైశ్య ప్రముఖులను కలిసి అభినందించారు. ఆయన తొలుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జగ్గిరెడ్డి వెంట మండల పరిషత్ అధ్యక్షురాలు కుండ అన్నపూర్ణ, మార్గాని గంగాధర్, జెడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు, వైఎస్సార్ సీపీ నాయకులు కనుమూరి శ్రీను రాజు, మెర్ల వెంకటేశ్వరరావు, వాసు ఉన్నారు. గ్యాస్ బుకింగ్ పేరుతో సరికొత్త మోసాలుఅమలాపరం టౌన్: గ్యాస్ బుకింగ్ పేరుతో తాజాగా జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. ఈ మేరకు శనివారం రాత్రి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వైబ్ సైట్ లింకులు పంపిస్తూ తక్కువ ధరకే సిలిండర్ ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తారన్నారు. గ్యాస్ కోసం ముందుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుతూ ప్రజల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు, మొబైల్ యాప్లను మాత్రమే వినియోగదారులు ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ వెబ్ సైట్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.75 లక్షల భారీ పరిహారంగొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు. -
కొత్తగా వచ్చి.. అందరికీ నచ్చి..
● కల్యాణంలో కొత్త టెండ్ర్ ● హల్దీ ఫంక్షన్లకు పెరిగిన క్రేజీ ● ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చిన ఆచారం ● ఖర్చుకు వెనకాడని కుటుంబాలు రాయవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను వైభవంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అందరూ భావిస్తారు. ఈ క్రమంలో వివాహ తంతులో అనేక కొత్త పద్ధతులు, విధానాలు వచ్చి చేరాయి. ఆర్థిక స్థోమతను బట్టి కొందరు హంగురంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. అయితే మాన్యుల నుంచి సామాన్యుల వరకూ హల్దీ ఫంక్షన్ అనే కొత్తగా ట్రెండ్ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరి వేడుకగా మారింది. కొత్త పుంతలు పెళ్లికి ఒకరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సెట్టింగ్లు హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్గా మారింది. డ్రెస్ కోడ్ హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు. చెప్పలేని ఆనందం ఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. – కె.సాయికుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాకినాడ ఉత్సాహాన్నిస్తాయి కొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. – కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం అదిరిపోయేలా సెట్టింగ్లు పెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 వరకు సెట్టింగ్లు వేశాం. – కె.సతీష్, ఎన్కేఎస్ ఈవెంట్ మేనేజర్,రాజమహేంద్రవరం -
అత్యాచార నిందితుడిని అరెస్ట్ చేయాలి
అమలాపురం టౌన్: మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి సంఘటనపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ ఆ గ్రామంలో పర్యటించి వాస్తవాలను రాబట్టింది. ఈ ఘటనలో నిందితుడైన ఎడ్ల సూరిబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని వేదిక డిమాండ్ చేసింది. నిందితుడు గతంలో కూడా ఇదే బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారాన్ని సేకరించింది. ఈ విషయాలను ఉమ్మడి జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ శనివారం ప్రకటనలో తెలిపారు. బాలిక తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, తనపై కేసు లేకుండా గ్రామ పెద్దల ఒత్తిడితో రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని కమిటీ బృందానికి గ్రామ ప్రజలు చెప్పారని ఇక్బాల్ పేర్కొన్నారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నాటకీయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కోరింగ అభయారణ్యం సందర్శన తాళ్లరేవు: కేరళకు చెందిన వరల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల బృందం శనివారం కోరింగ అభయారణ్యాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కోరింగ ఫారెస్ట్ కాంప్లెక్స్లో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఈటీ నిర్వహణ, మడ అడవుల భాగస్వామ్యంతో ఈడీసీల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి డాక్టర్ సనల్ సి.విశ్వనాథ్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని తమ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎఫ్బీఓలు గోపి నాగేంద్ర కుమార్, ధనుంజయ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరంలోని ఏపీ ఫారెస్ట్ అకాడమీకి చెందిన 41 మంది ట్రైనీలు అభయారణాన్ని సందర్శించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.మహేష్ కోరింగ అభయారణ్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఏవీ రమణమూర్తి, ఎఫ్బీఓ సీహెచ్ ధనలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్లో 1,018 కేసుల పరిష్కారం అమలాపురం టౌన్: స్థానిక కోర్టుల ప్రాంగణంలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో రూ.2,69,73,408 విలువైన 1,018 కేసులు పరిష్కారమయ్యాయి. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. పరిష్కారమైన వాటిలో 21 సివిల్, 935 క్రిమినల్, 26 మోటారు ప్రమాదాలు, 12 బీఎస్ఎన్ఎల్, 24 బ్యాంక్ కేసులు ఉన్నాయి. అదాలత్లో సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి పి.రమణారెడ్డి, జూనియన్ డివిజన్ సివిల్ జడ్జి ఎం.రహీంతుల్లా తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి అమలాపురం రూరల్: ఆటల్లో గెలుపు, ఓటమి సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని జేసీ నిషాంతి అన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్షిప్ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ స్టేడియంలో షటిల్ కోర్టుకు ఏసీ సౌకర్యం కల్పిస్తామన్నారు. డీఎస్డీవో రుద్ర వైకుంఠరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఇక్కడ నిర్వహించడం వల్ల స్థానిక క్రీడాకారులకు మంచి అనుభవం లభిస్తుందన్నారు, కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడ స్వామి నాయుడు స్టేడియం క్రీడాకారుడు మండెల బాబీ, స్టేడియం కోచ్ భీమేష్ పాల్గొన్నారు. -
ఆలీవ్ రిడ్లే తాబేళ్లను రక్షించుకుందాం
కాట్రేనికోన: ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి వర ప్రసాదరావుతో కలిసి శనివారం ఆయన గచ్చకాయలపోర సముద్ర తీరంలో ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణ ఇంక్యుబేషన్ కేంద్రంలో గుడ్ల నుంచి విడుదలైన 300 పిల్లలను సముద్ర జలాల్లో వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాబేళ్లు పెట్టిన గుడ్లును కృత్రిమంగా ఇంక్యు బేషన్ కేంద్రంలో సుమారు రెండు అడుగుల గోతుల్లో 45 రోజులు భద్రంగా రక్షించడంతో పిల్లలు విడుదలవుతున్నాయన్నారు. సుమారు 50 వేల గుడ్లు ఇంక్యుబేషన్ కేంద్రాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రవికిరణ్, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ప్రాధాన్యతా రంగాలకే సరఫరా అమలాపురం రూరల్: ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, ఇతర రంగాలకు మల్లింపును నిలుపుదల చేయాలని డీలర్లను కలెక్టర్ మహేష్ ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని 25 గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, పెద్ద క్యాటరింగ్ సంస్థల్లో రోజు వారీ తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లయితే స్వాధీనం చేసుకుని 6ఎ కేసులు నమోదు చేయాలన్నారు. -
బాబుగారి కోతల పథకం!
సాక్షి, అమలాపురం: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయడంతోపాటు.. ఇచ్చిన హామీకి ఇంకా మెరుగైన ప్రయోజనం చేకూరుస్తూ మేలు చేసింది’ జగన్ ప్రభుత్వం. అదే రైతు భరోసా. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొలి ఏడాది తుంగలో తొక్కి.. రెండో ఏడాదిలో అమలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నా లబ్ధిదారులకు కోత పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం.’ ఇదే అన్నదాతా సుఖీభవ. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మూడో విడత, 22వ విడత పీఎం కిసాన్ నిధులు శుక్రవారం జిల్లాలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం మొదలు పెట్టింది ప్రభుత్వం. ఈ పథకం మూడో విడత జనవరిలో 1,34,829 రైతు కుటుంబాలకు రూ.4 వేలు చొప్పున రూ 53.93 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా 1,15,400 రైతు కుటుంబాలకు రూ.23.08 కోట్ల మేర నిధులు జమ చేయనున్నారు. మొత్తం ఈ రెండు పథకాలకు సంబంధించి రూ.77.01 కోట్లు జమ చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులకు కోత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసాతో పోల్చుకుంటే అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏడాదికి సగటున 1,45,890 మందికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవలో 1,34,829 మందికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సుమారు 11,061 మందికి కోత పడినట్టు అంచనా. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో లబ్ధిపొందేది 1,15,400 రైతులు మాత్రమే. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ఏకంగా 30,490 మందికి పీఎం కిసాన్ సొమ్ములు రానట్టే లెక్క. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాలుగా రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గడం వల్ల జిల్లాలో 11,061 మంది రైతులు రూ.22.12 కోట్లను నష్టపోయారు. గత ఏడాది అసలు పథకమే అమలు చేయకపోవడం వల్ల రైతులు రూ.291.78 కోట్లను కోల్పోయారు. మొత్తం మీద అన్నదాత సుఖీభవ పేరు చెప్పి ప్రభుత్వం తమకు రూ. 313.9 కోట్లు బకాయి ఉన్నట్టు చెబుతున్నారు. కౌలుదారుల నోట మన్ను.. గత ప్రభుత్వం కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేశారు. దీర్ఘకాలికంగా సాగు చేసిన వారితో పాటు, దేవస్థానం భూములు ఎక్కువ సంవత్సరాలు సాగు చేసిన వారికి సైతం రైతు భరోసా అందించారు. ీకౌలు గుర్తింపు కార్డులు ఉండి రైతు అనుమతి ఉన్న కౌలుదారులకు సైతం భరోసా సొమ్ములు అందాయి. కాని చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల నుంచి కౌలుదారులను తప్పించేశారు. నిజమైన సాగుదారులకు జరుగుతున్న అన్యాయంపై వారు మండిపడుతున్నారు. జిల్లాలో 1.63 లక్షల వరకు వరి ఆయకట్టు ఉంటే సుమారు 80 శాతం భూములను కౌలుదారులు సాగు చేస్తుండడం గమనార్హం. ఇచ్చిన హామీ కన్నా పెంచి.. వైఎస్సార్ రైతు భరోసా ఏడాదికి సగటున 1,45,890 మందికి రూ.13,500 చొప్పున ఐదేళ్లకు ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.67,500 అందించారు. మొత్తం ఐదేళ్లకు కలిపి రూ.984.75 కోట్లు అందించారు. 2019 ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలలో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయిన తరువాత తొలి ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఎన్నికల ముందు ఇస్తానన్న రూ.12,500కు అదనంగా మరో రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.13,500 అందించారు. అది కూడా నాలుగేళ్లు అన్న ఎన్నికల హామీని ఐదేళ్లకు పెంచి రైతులకు లబ్ధి చేకూరేలా చేశారు. కాని చంద్రబాబు మాత్రం ఎన్నికల ముందు ఏటా క్రమం తప్పకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చి తొలి ఏడాది విజయవతంగా ఎగొట్టారు. రెండో ఏడాది ప్రోత్సాహం ఇచ్చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నా లబ్ధిదారులలో కోత పెట్టారు. సాగుకు భరోసా ఇవ్వని సర్కారు సుఖీభవ పేరుతో శుష్క వాగ్దానాలు 1,34,829 మందికి మాత్రమే జమ కూటమి కట్టి 11,061 మందికి మొండిచెయ్యి జగన్ ప్రభుత్వంలో 1.45 లక్షల మందికి లబ్ధి కౌలుదారులకు అడుగడుగునా దగాఒక్క రూపాయి కూడా రాలేదు నేను ఆరు ఎకరాల్లో కౌలుకు వరి సాగు చేస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా నాకు అన్నదాత సుఖీభవ అందలేదు. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.13,500 చొప్పున నా అకౌంట్లో సొమ్ములు పడ్డాయి. చిన్నచిన్న పెట్టుబడులకు సొమ్ములు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో చిన్నచిన్న పెట్టుబడులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. – ధోనిపాటి వెంకటేశ్వరరావు, కౌలు రైతు, వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం నగదు జమ చేస్తే గట్టెక్కుతాం నేను 12 ఎకరాల్లో కౌలుకు వరి సాగు చేస్తున్నాను. వ్యవసాయంలో వరుస నష్టాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 చొప్పున జమ చేసేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా వేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా పోర్టల్లో అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. గత ఏడాది తుపాను వల్ల పంట నష్టపోవడంతో మరో రూ.2 లక్షల అప్పుల పాలయ్యాను. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం నగదు జమ చేస్తే కష్టాల నుంచి ఎంతో కొంత బయటపడేవాళ్లం. పంట నష్టం నమోదు చేశారు. తప్ప ఇప్పటి వరకూ ఇవ్వలేదు. – చల్లా సంతోష్ కుమార్, తాళ్లరేవు, కాకినాడ జిల్లా -
బోను పెట్టినా.. రానురానంటూ..
● అధికారుల అంచనాలకు భిన్నంగా పులి సంచారం ● ఎస్.జగ్గంపేట వద్ద మకాం ప్రత్తిపాడు రూరల్/శంఖవరం: మూడు రోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిధిలో సంచరిస్తున్న పులి ఏమాత్రం దొరక్కుండా అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి గత బుధవారం ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలపాతం పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమైన ఈ పులి.. అక్కడి నుంచి ప్రత్తిపాడు – శంఖవరం సరిహద్దులోని నాగులకొండ (పెద్ద కొండ) వద్ద రెండు రోజుల పాటు మకాం వేసింది. గురువారం సాయంత్రం తాడువాయి వద్ద గేదె దూడపై దాడి చేసి, శుక్రవారం సాయంత్రం వరకూ రాజవరం, మాసంపల్లి మధ్య సరుగుడు తోటల్లో సంచరించింది. మాసంపల్లి – బవురువాక గ్రామాల మధ్య పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు చూసినట్లు ప్రచారం జరిగింది. ఆ పులి మెడలో అమర్చిన జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను అటవీ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు పులిని బంధించేందుకు మాసంపల్లి వద్ద సరుగుడు తోటలో బోను ఏర్పాటు చేసి, అందులో ఆవు దూడను కూడా ఉంచారు. దానిని ఎలాగైనా బంధించేందుకు అటవీ శాఖ, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు, వెటర్నరీ డాక్టర్లు, నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నిపుణులతో కసరత్తు చేశారు. అయితే, వారి అంచనాలకు పూర్తి భిన్నంగా ఆ పులి రూటు మార్చింది. మాసంపల్లి నుంచి రాజవరం, గొంది, అచ్చంపేట, జి.కొత్తపల్లి మీదుగా ఎస్.జగ్గంపేట వద్ద పెదబాపన్నదొర చెరువు సమీపానికి చేరుకుంది. పులి ఉన్న ప్రాంతానికి ఎస్.జగ్గంపేట కిలోమీటరు దూరంలో ఉంది. పులి ఉన్న ప్రాంతంలో పశువుల మకాం ఉందని సమాచారం. పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గౌరంపేట, మాసంపల్లి, జగన్నాథపురం, రాజారం, గొంది, జి.కొత్తపల్లి, అచ్చింపేట, ఎస్.జగ్గంపేట తదితర గ్రామాల్లో అధికారులు పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను పొలాల్లో ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పాడి రైతులకు సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో డీఎఫ్ఓ రామచంద్రరావు, ఆర్ఎఫ్ఓ దుర్గా రాంప్రసాద్, సీఐ బి.సూర్య అప్పారావు, తహసీల్దార్ తాతారావు, ఎస్సైలు శ్రీహరిబాబు తదితరులు పర్యటించారు. -
విధానం లేని నిధానం!
● సాంకేతిక సమస్యలతో నిధి పోర్టల్లో నమోదు కాని సిబ్బంది వివరాలు ● వేతనాలందక ఆందోళన చెందుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ● ఈ నెలా సరిదిద్దకపోతే వచ్చేనెల జీతాలకూ ఎసరు ఆలమూరు: ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం, ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం.., వాస్తవంలో చీకటిని చూపిస్తున్న ప్రభుత్వం, సమాన పనికి సమానం వేతనం.. తమ క్రమబద్ధీకరణ ఎప్పుడు అంటూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే వేతనాలు అందజేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం వాస్తవ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు నిలిచిపోయాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ తారతమ్యం లేకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు మంజూరయ్యేవి. కాగా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ ఉద్యోగులను మినహాయించి మిగతా ఉద్యోగులకు కొత్తగా ఏర్పాటు చేసిన నిధి పోర్టల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఆ పోర్టల్లో సాంకేతిక లోపంతో ఉద్యోగుల వివరాలు అనుసంధానం కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 25 వేల మందికి వేతనాలు నిలిచిపోయాయి. ఈ నెల ఆరు నుంచి పది వరకూ రెండోసారి బిల్లులు అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉన్నా పోర్టల్లో లోపంతో ఆ సమయం కూడా ముగిసిపోయింది. అయితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తేనే కాని మార్చి నెలకు సంబంధించిన జీతాలు ఏప్రియల్లో పడే అవకాశం లేదు. కనిపించని క్యాడర్ వివరాలు నిధి పోర్టల్లో ఇప్పటి వరకూ ఉద్యోగుల వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే ఆయా శాఖల్లోని యూడీసీలు, అక్కౌంట్స్ అధికారులు బిల్లులు అప్లోడ్ చేస్తున్నా పోర్టల్ తీసుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మార్చినెల జీతాలు సైతం ఏప్రిల్లో పడకపోవచ్చునని, సకాలంలో వేతనాలు అందక అందిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాలను, ఆర్థిక వ్యవహారాలను నెట్టుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఫిబ్రవరి వేతనాలు అందించాలి. నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలను సత్వరం సరిదిద్ది వినియోగంలోకి తీసుకురావాలి. – గుత్తుల వీరబ్రహ్మం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు సాంకేతిక సమస్యల పరిష్కారం నిధి పోర్టల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందజేస్తాం. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే అందరికీ వేతనాలు అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – బి.రామభద్రం, డీటీఓ ఇన్ ట్రెజరీస్, ముమ్మిడివరం -
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం
సాక్షి, అమలాపురం: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను నియమించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రామచంద్రపురం నియోజకవర్గానికి కర్రి నాగిరెడ్డి, ముమ్మిడివరానికి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురానికి కటకంశెట్టి విజయధర్మ ఆదిత్యకుమార్, రాజోలుకు కర్రి పాపారాయుడు, పి.గన్నవరానికి చింతపాటి శ్రీనివాసరాజు, కొత్తపేటకు పాటి శివకుమార్, మండపేటకు ఒంటెద్దు వెంకన్న నాయుడులను నియమించారు. మొల్లమాంబకు ఘన నివాళి అమలాపురం రూరల్: వాల్మీకి రామాయణాన్ని అచ్చ తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుందని జేసీ టి.నిశాంతి పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో మొల్ల చిత్రపటానికి నివాళులర్పించారు. మొల్లమాంబ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించుకో వడం హర్షణీయమన్నారు. 16వ శతాబ్దానికి చెందిన ఆమె కడప జిల్లా గోపవరంలో జన్మించారని, మహిళా సాధికారతకు, భక్తి సాహిత్యానికి ఆమె ప్రతీక అని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జి.మమ్మీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, శాలివాహన సంఘ ప్రతినిధులు జిల్లాస్థాయి అధికారులు కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది భరత్ పాల్గొన్నారు. -
ఎండల వేళ ఆరోగ్యం భద్రం
జేసీ నిశాంతి అమలాపురం రూరల్: ఉష్టోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు జేసీ టి.నిశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈ మేరకు సమీక్షించారు. అలాగే వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన విగ్రహాల వల్ల నెలకొన్న కోర్టు కేసులు పరిష్కార స్థితిగతులపై చర్చించారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు నీరు ఎక్కువగా తాగాలని, వైద్య శాఖ ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని, పీహెచ్లు, ప్రాంతీయ ఆస్పత్రులలో వడదెబ్బ బాధితుల కోసం 10 పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ కమిషనర్లు వేసవి కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపడంతో పాటు పంచాయతీలు ఎన్జీవోల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, వోల్టేజ్ సమస్య విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాతరలు శాంతియుతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎంఅండ్ హెచ్ఓ ఎం.దుర్గారావు దొర తదితరులు పాల్గొ న్నారు. రైతులకు సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు అమలాపురం రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ మూడో విడత, 22వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలకు జమ అయినట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ శుక్రవారం తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,34,829 రైతు కుటుంబాలకు రూ.77.01 కోట్లు జమ అయినట్టు ఆయన తెలిపారు. జిల్లావ్యా ప్తంగా 1,15,400 రైతు కుటుంబాలకు రూ.23.08 కోట్లు మేర నిధులు జమ కాపడ్డాయన్నారు. -
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా, తన సోషల్ మీడియా అకౌంట్ను మూడేళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
అమలాపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి 2014 –2018లో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎఫ్ఎస్కే ఎఫ్డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025డిసెంబర్ 31 వరకు ఉన్న వడ్డీని రద్దు మాఫీ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి గురువారం తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 66 మంది వినియోగించుకుని, రూ.25.23 లక్షల అసలును చెల్లించి రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు. వీధి వ్యాపారులు ఆహార నాణ్యత పాటించాలి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య అమలాపురం టౌన్: వీధి వ్యాపారులు ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వై.రామయ్య సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అమలాపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక మెప్మా కార్యాలయ ప్రాంగణంలో పట్టణంలోని వీధి వ్యాపారులకు గురువారం జరిగిన అవగాహన సదస్సులో రామయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార భద్రతపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమలాపురం మెప్మా సిటీ మిషన్ మేనేజర్ మంగాదేవి, జిల్లా మెప్మా ప్రతినిధి మోహన్కుమార్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు సీతామహాలక్ష్మి, కృష్ణవేణి, హాసన్పవన్కుమార్తోపాటు ఆర్పీలు, పట్టణ వీధి వ్యాపారులు పాల్గొన్నారు. ఉగాది కథల పోటీ కరపత్రాల ఆవిష్కరణ ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన బాలమందిరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉగాది కథల పోటీలను నిర్వహిస్తున్నట్లు రచయిత కృష్ణశ్రీ గురువారం తెలిపారు. ఆలమూరు శాఖా గ్రంథాలయంలో వెటర్నరీ ఏడీఏ ఎల్.అనిత, గ్రంథాలయాధికారి టి.నమశ్శివాయ, పాఠకుల చేతుల మీదుగా కథల పోటీల కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. కృష్ణశ్రీ మాట్లాడుతూ ఈ పోటీలకు కథలను పంపే గడువును మార్చి 12 నుంచి 16వ తేదీ వరకూ పెంచామన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు, విలువలకు అద్దం పట్టే విధంగా, కుటుంబ వ్యవస్థను బలపరిచే విధంగా, గతంలో ఎక్కడా ప్రచురితం కాని, హామీ పత్రంతో కూడిన కథలను పంపించవచ్చునని చెప్పారు. కథలు పంపే రచయితలు వాట్సాప్ ద్వారా 9963163136 నంబరుకు పంపాలని కోరారు. వచ్చిన కథలను బాలమందిరం కార్యాలయంలో ఈ నెల 19న పరిశీలించి అందులో నాలుగింటిని ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 22న విజేతలకు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీపై అవగాహన మలికిపురం: ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో బీచ్ సాండ్ హెవీ మినరల్స్ సమృద్ధిగా లభిస్తున్నాయని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అణు శాస్త్రవేత్త తడక మహేశ్ తెలిపారు. మండలంలోని పడమటి పాలెం జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఖనిజాలు భారతదేశ రక్షణ రంగం, అంతరిక్ష రంగం, ఇతర కీలక పరిశ్రమలకు అత్యంత అవసరమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ల్యాబోదిబో..
● ల్యాబ్ టెక్నీషియన్ల దురవస్థ ● ఆదుకోని ప్రభుత్వం ● ఉద్యోగాలు అంతంత మాత్రం ● యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు ● నేడు ల్యాబ్ టెక్నీషియన్స్ డే కాకినాడ క్రైం: ప్రభుత్వ సాయం లేదు.. యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు.. స్వయం ఉపాధి పొందుదామన్నా దక్కని ప్రోత్సాహం.. కార్పొరేట్ ల్యాబ్లలో అంతంత మాత్రం జీతాలకే ఊడిగం చేయాల్సి రావడం.. పర్యవేక్షణ లోపం.. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్టీ) రోడ్డున పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిర్ధారించి, వైద్య సేవల్ని నిర్దేశించడంలో వారీ పాత్ర కీలకం. కానీ, ఎల్టీలుగా పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక.. తగినంత సంపాదన లేక తమ భవిత అగమ్య గోచరమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రత్యే కథనం.. ఉద్యోగాలు లేక విలవిల జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 400 మంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీరు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నా వ్యాపారాలు లేవంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎండమావిగానే మిగులుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేవే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టులు. అవి కూడా ఏనాటికో ఒక నోటిఫికేషన్. ఓవైపు చదివిన చదువుకు విలువ లేక, పట్టాలు పొందినా ఉద్యోగాలు రాక, సొంత వ్యాపారాలకు అవకాశం లేక, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేక ఎల్టీల పరిస్థితి కడు దయనీయంగా ఉంటోంది. కుటుంబాలతో సహా రోడ్డున పడే దుస్థితిని ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక బతుకు తెరువు కోసం జొమేటో, బ్లింకిట్, స్విగ్గీ, ర్యాపిడో వంటి వాటిల్లో డెలివరీ బాయ్స్గా, కెప్టెన్లు పని చేస్తూ బతుకు బండి నెట్టుకొస్తున్నారు. సవాల్గా స్వయం ఉపాధి పోనీ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసినా తీవ్ర నష్టాలు తప్పడం లేదు. గతంలో ఓ ల్యాబ్ ద్వారా కనీసం నలుగురు జీవనోపాధి పొందే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం అద్దె డబ్బులైనా రాని పరిస్థితి. మిషనరీ, రియేజంట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండటం వ్యాపారానికి సవాల్గా మారింది. తాజాగా జీఎస్టీ సవరణలో తగ్గుదల కనిపించినా అది కంటితుడుపు చర్యగానే మిగిలింది. గతంలో ఏదో ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ను నెలకొల్పి బతికేవాడు. ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో వైద్యులే సొంతంగా ల్యాబ్లు పెట్టుకోవడం వీరి ఉపాధిని దెబ్బ తీస్తోంది. ఆన్లైన్ సేవల పేరుతో.. వివిధ ఆన్లైన్ యాప్లు కూడా ఎల్టీల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. వీటికి స్థానికంగా ల్యాబ్లేవీ ఉండవు. పార్టనర్ ల్యాబ్స్ పేరిట అనుసంధానమవుతున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎంతవరకూ నిజమో పర్యవేక్షించేవారెవ్వరూ ఉండరు. వీరు పరీక్షలు చేసే యంత్రాలు, రియేజంట్ల నాణ్యత ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చి నమూనాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకుంటారు. తరువాతి రోజు వాట్సాప్కు రిపోర్టు పంపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందో, ఎక్కడ పరీక్షించారో ఎవ్వరికీ తెలియవు. -
మౌలిక సదుపాయాలపై దృష్టి
అమలాపురం రూరల్: కిమ్స్ వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ పి.చంద్రశేఖర్ అన్నారు. ఆధునిక అకడమిక్ బ్లాక్లు, క్లినికల్ సెటప్లు, అడ్వాన్స్డ్ స్కిల్ అండ్ సిమ్యులేషన్ సెంటర్, వినూత్న సాంకేతికతో ఏర్పాటు చేసిన ఆయువు కమాండ్ సెంటర్ పనితీరు మెరుగ్గా ఉందని అన్నారు. ఆయన గురువారం అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలను సందర్శించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు, ఎండీ రవికిరణ్ వర్మ పాల్గొన్నారు. -
విద్యార్థుల సమరగ్రాభివృద్ధే లక్ష్యం
ముమ్మిడవరం: విద్యార్థుల సమగ్రాభివృద్ధిని సాధించడం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఫరక్–2024 రెండురోజుల వర్క్షాపును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్ధుల అభ్యాసన స్థాయిని కేవలం పరీక్షల ద్వారానే కాకుండా వారి ఆలోచనా శక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యం, సృజనాత్మకతతో పాటుగా జీవన నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయాలన్నారు. విద్యార్థులలో లోతైన అవగాహనను పెంపొందించడం వల్ల ఉపాధ్యాయుల బోధనా విధానాలను మరింత ప్రభావవంతంగా మార్చడం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మండలానికి ఎనిమిది మంది వంతున 186 మందితో వర్క్షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ కో ఆర్డినేటర్ సమగ్ర శిక్షా ఏఎంఓ పి.రాంబాబు, రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట, డీవైఈఓలు పి.రామలక్ష్మణమూర్తి, జి.సూర్యప్రకాష్, కడలి వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్షా ఫైనాన్స్ అకౌంట్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంఈవో మోకా ప్రకాష్, మాట్లాడారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ కె.కృష్ణసాయి, ఆర్.వెంకటేశ్వరరావు, గణేష్, నరసింహారావు, ఏ.చంద్రసూర్యం ఫరక్–2024 ప్రకారం విద్యావ్యవస్ధ బలోపేతంపై అవగాహన కల్పించారు. ఫరక్ రెండు రోజుల వర్కుషాపు ప్రారంభం -
పతాక రెపరెపలు.. సేవా పరిమళాలు
సాక్షి, అమలాపురం: ‘ఆడిన మాట తప్పని.. ఇచ్చిన హామీని నెరవేర్చిన’’ పార్టీగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా పండగలా సాగాయి. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు.. గ్రామాలలో ఈ వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. పార్టీ 16వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్లు కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచారు. దివంగత మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు, రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలలో పార్టీ పదవులు, అనుబంధ విభాగాల పదవులు ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తపేట: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. అన్ని మండలాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రావులపాలెంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల సమక్షంలో పార్టీ పతాకాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. కార్యాలయంలో కేకును కట్ చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు, పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు మూసునూరి వెంకటేశ్వరరావు, కర్రి నాగిరెడ్డి పాల్గొన్నారు. రాజోలు : రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మలికిపురం, రాజోలులో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తాటిపాక, రాజోలు, మలికిపురాల్లో దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్లు కట్ చేసి అభిమానులకు పంచారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం మేరిమాత వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, సీఈసీ సభ్యుడు కె.ఎస్.ఎన్.రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్యకుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నవరాజు పాల్గొన్నారు. ముమ్మిడివరం : వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన ముమ్మిడివరం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగరవేసి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. పొన్నాడ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో శ్రమ పడుతున్న ప్రతి కార్యకర్తకి, నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ సభ్యురాలు కాశీ బాల మునికుమారి పాల్గొన్నారు. రామచంద్రపురం : పార్టీ ఆవిర్భావ దినోత్సవం రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని గాంధీపేటలో పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయంలో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీ, మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేస్తున్న రాజోలు కో ఆర్డినేటర్ రాజేశ్వరిదేవి తదితరులు రామచంద్రపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన నేతలు పండగలా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో వేడుకలు వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులు పార్టీ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల సేవా కార్యక్రమాలు -
జిల్లాలో గ్యాస్ కొరత లేదు
అమలాపురం రూరల్: ఇరాన్– ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరత ఉండదని జేసీ టీ. నిషాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిధిలోని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం కంపెనీల డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ సరఫరా విధి విధానాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులు నమ్మవద్దని అన్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను చమురు కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయన్నారు. హోటల్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు ఇతర రకాల ఇంధన వనరులను వినియోగించుకోవాలని సూచించారు. మొదటగా గృహ అవసరాలకు రెండో ప్రాధాన్యత గా ఆసుపత్రుల అవసరాలకు గ్యాస్ సరఫరా చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం అంగన్వాడీ కేంద్రాలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే డీఎస్ఓ కార్యాలయంలో 98481 41965 నంబర్లో సంప్రదించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్, ఏ ఎస్ఓ శరత్, డీలర్లు పాల్గొన్నారు. ఈ – ఫైళ్ల పరిష్కారంలో ప్రథమ స్థానం ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలో కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జేసీ నిషాంతి పేర్కొన్నారు. ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్ పరిష్కారంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్లు జాబితా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ జాబితాల్లో సంయుక్త కలెక్టర్ల కేటగిరిలో తాను ప్రథమ స్థానంలో నిలిచానన్నారు.


