breaking news
Dr B R Ambedkar Konaseema
-
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
సద్వినియోగం చేసుకోవాలి వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా.. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● విద్యార్థులకు వీరగాథ 5.0 ● మూడు నుంచి 12వ తరగతుల వారికి పలు పోటీలు ● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ ● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది. నాలుగు విభాగాల్లో.. పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ఎంచుకోవాల్సిన అంశాలు వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. నమోదు విధానం ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. -
సెల్ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనం సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు. -
జాతీయ ఫెన్సింగ్లో శేషురిషిత్రెడ్డి ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్ఈ జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2025–26 పోటీల్లో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి నల్లమిల్లి శేషురిషిత్రెడ్డి ఒక మార్కు తేడాతో మూడో స్థానం పొంది కాంస్య పతకం సాధించాడు. ఉత్తరాఖండ్ రుద్రపూర్లో గత నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకూ నిర్వహించిన పోటీల్లో 1,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ క్రీడా శాఖ మంత్రి రేఖా ఆర్యా, నేషనల్ ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్మెహతా కాంస్య పతకం అందజేశారు. శేషురిిషిత్రెడ్డిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి అభినందించారు. జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తొలిసారిగా ఏపీ నుంచి పాల్గొని ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్లో ఇదే తరహాలో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలన్నారు. స్కూల్ అధినేత సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ వందనబోహ్ర కూడా అభినందించారు.నదిలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం మలికిపురం: దిండి–చించినాడ వంతెన పైనుంచి గోదావరిలో పడిన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తుండడంతో.. అందుకు నిరాకరిస్తూ.. బెదిరించాలన్న ఉద్దేశంతో వంతెన ఎక్కిన అతడు అదుపుతప్పి నదిలోకి పడిపోయాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, సఖినేటిపల్లి మండలం వీవీ మెరక గ్రామానికి చెందిన మేడిది సుదర్శనరాజు (25)కు రష్యాలో రూ.1.50 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చింది. అతడి నానమ్మతో పాటు, కుటుంబ సభ్యులు ఉద్యోగానికి వెళ్లాలంటూ ఒత్తిడి తెచ్చారు. మద్యానికి బానిసైన సుదర్శనరాజు అక్కడకు వెళ్లనని భీష్మించాడు. ఈ నేపధ్యంతో ఈ నెల ఐదో తేదీన దిండి–చించినాడ వంతెనపైకి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ, అదుపుతప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయాడు. అతడి మృతదేహం మంగళవారం అంతర్వేది పల్లిపాలెం వద్ద నదీ తీరంలో లభించింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పీవీవీ సురేష్ తెలిపారు.వెబ్నార్లో ‘నన్నయ’ అధ్యాపకులుకాకినాడ రూరల్: అంతర్జాతీయ డీసిస్ వెబ్నార్లో నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్కు చెందిన పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాలపై విద్యార్థుల చురుకై న చర్చతో పాటు, ఎకనామిక్ డెమోక్రసీ అండ్ సోషల్ ఎకానమి తదితర అంశాలపై చర్చ జరిగింది. నన్నయ అధ్యాపకులు మనోజ్ దేవా, మధుకుమార్, అప్పారావు, మణికంఠేశ్వరరెడ్డి, శ్రీదేవి, ఉమా రజిత, యూరోపియన్ యూనియన్ నుంచి స్టెఫాన్ చచెవాలీవ్, అన్నా గలాజ్కా, ఫ్రెడరిక్ డుఫేస్, ఫ్రాంజిస్కా గోర్మార పాల్గొన్నారు. -
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక ● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను ఐపీఈ (ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) సలీమ్ బాషా ప్రారంభించారు. బేస్బాల్, హాకీ, స్విమ్మింగ్లో అండర్–14, 17 బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బేస్బాల్లో 64, హాకీలో 72, స్విమ్మింగ్లో 76 మంది ఎంపికై నట్టు ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు శ్రీనివాస్, సుధారాణి తెలిపారు. పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను పర్యవేక్షించారు. బేస్బాల్ పోటీలు ఎంపికై న కొవ్వూరు పాఠశాల క్రీడా సమాఖ్య ఽఆధ్వర్యంలో కాకినాడ డీఎస్ఏ మైదానంలో నిర్వహించిన అండర్–14, 17 బేస్బాల్ ఎంపికల్లో కొవ్పూరు జెడ్పీ పాఠశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో సోము దీక్షితారాణి, మాసాబత్తుల సూర్యహాసిని, బాలుర విభాగంలో మడుగుల తేజ, అనసూరి రోహిత్, వెంకట్గణేష్, అండర్–17లో విత్తనాల రాజా శ్రీవల్లి, వీధిసత్యశాంతి, సోము హారిక, బాలుర విభాగంలో రెడ్డిసత్య వెంకట్రావు, పిల్లి అభిరామ్ ఎంపికై నట్టు పాఠశాల హెచ్ఎం బండిసత్య శ్రీనివాస్, పీడీ ప్రసాద్ తెలిపారు. -
సత్యదేవుని సన్నిధిలో త్వరలో సంప్రోక్షణ, శాంతి పూజలు
● దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు వెల్లడి ● పండితుల సమావేశంలో నిర్ణయం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ, శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులతో కూడిన వైదిక కమిటీ నిర్ణయించింది. మంగళవారం ‘సాక్షి’లో ‘అపశ్రుతులు అందుకేనా..?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పండితులతో సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కానీ, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నట్టు ఆ కథనంలో వెలువడింది. అదేవిధంగా రెండు నెలల క్రితం సిక్స్ వీఐపీ సత్రంలో భక్తుడు మరణించినప్పటికీ, అతడు కొండ దిగువన ఆస్పత్రిలో మృతి చెందాడని భావిస్తూ సంప్రోక్షణ పూజలు చేయలేదని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై స్పందించిన చైర్మన్, ఈఓలు మంగళవారం పండితులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్తిక మాసం లోపుగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ పూజల తేదీని నిర్ణయించాలని పండితులను కోరినట్టు చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. -
అతివేగం.. తీసింది ప్రాణం
● ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ● అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం రాజానగరం: ఒక్క క్షణం.. ఇంటి వద్ద ఓ కుటుంబం ఎదురుచూస్తుందని ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఎంతో జీవితం మిగిలి ఉందన్న ఆలోచన ఒక్క క్షణమైనా వస్తే.. నిర్లక్ష్యపు ప్రయాణం, ప్రమాదకరమైన అతివే గం అనేవి ఉండవు. ఆ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే రెండు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మండలంలోని నందరాడ–నరేంద్రపురం మధ్య ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో, వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం, జట్టు కూలీగా పని చేసే రాజానగరానికి చెందిన బుదిరెడ్డి సత్యనారాయణ (30) మంగళవారం సాయంత్రం కో రుకొండ నుంచి స్కూటీపై వస్తున్నాడు. అదే సమయంలో కొవ్వూరుకు చెందిన మోర్ల శ్రీనివాసరావు (45) కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని అత్తవారింటికి వేరే మోటార్ బైక్పై వెళ్తున్నాడు. కాగితాలమ్మవారి గుడి సమీపంలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన ఇద్ద రు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కాగా శ్రీనివాసరావు వివరాలు తెలియాల్సి ఉంది. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీరని నష్టం : అతివేగం అనర్థదాయకమంటూ అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ వేగ నియంత్రణపై జనాలు దృష్టి పెట్టడం లేదు. నందరాడలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ధ్వంసమైన తీరు చూస్తుంటే.. వీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో అవగతమవుతోంది. ఆ వేగమే వారి ప్రాణాల నూ హరించి, వారి కుటుంబాలకు తీరని నష్టాన్ని చేకూర్చింది. -
కొవ్వాడలో పట్టపగలు చోరీ
● 50 కాసుల బంగారు ఆభరణాల అపహరణ ● సొత్తు విలువ రూ.40 లక్షలు కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వాడ గ్రామంలో పట్టపగలే భారీ చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి గేటు, తలుపు తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని బంగారు ఆభరణాలు కొల్లగొట్టారు. ఇంద్రపాలెం పోలీసుల వివరాల మేరకు, కిర్లంపూడి ఎంఈఓ మక్కా చిన్నారావు కొవ్వాడలో నివసిస్తున్నారు. ఆయన భార్య విద్య మాధవపట్నంలో టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం 8.30కు ఇంటి తలుపులు వేసి, బయట గేటుకు తాళం వేసి వారు విధులకు వెళ్లిపోయారు. సాయంత్రం 4.30కు తిరిగొచ్చేసరికి గేటు తాళం పగులగొట్టి ఉన్నట్టు గుర్తించారు. లోనికి వెళ్లిచూడగా.. ఇంటి తలుపు తాళం తెరిచి, గదిలోని బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారని, వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారావు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలను మంగళవారం రాత్రి మీడియాకు తెలిపారు. -
మానవాళికి మార్గనిర్దేశకుడు వాల్మీకి
జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: వాల్మీకి మహర్షి జీవితం మానవాళికి మార్గదర్శకమని జేసీ టి.నిషాంతి అన్నారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ధర్మ పారాయణులకు నేటికీ మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత వాల్మీకి చిత్రపటానికి జేసీ నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి జీవితం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు జీవనాధారమన్నారు. వాల్మీకి జీవితం గొప్ప సందేశమని, యువతరానికి మంచి ప్రేరణ అన్నారు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి, నైతిక విలువలకు గొప్ప మార్గమన్నారు. రామాయణ రచన ద్వారా సమాజంలో ధర్మానికి, సత్యానికి ప్రాముఖ్యమిచ్చారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. అమలాపురం టౌన్: రామాయణ మహా గ్రంథాన్ని జాతికి అందించిన మహర్షి వాల్మీకి చిరస్మరణీయుడని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీతో పాటు, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్ఐలు కోటేశ్వరరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. -
మినీ జాబ్మేళాలో 81 మంది ఎంపిక
అమలాపురం రూరల్: వికాస ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో మినీ జాబ్మేళా జరిగింది. మొత్తం 123 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూల్లో 81 మంది ఎంపికయ్యారు. వీరికి నియామక ఉత్తర్వులు అందించినట్టు కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వికాస కృషి చేస్తోందన్నారు. జాబ్ మేళా ద్వారా ఐటీ, ఫార్మా, కెమికల్స్, ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, ఎనర్జీ తదితర రంగాల్లో అవకాశాలను చేజిక్కించుకుని, జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలని యువతకు సూచించారు. సమాజంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికై న ఉద్యోగార్థులు ఆయా కంపెనీలకు వెళ్లాక వారి యోగక్షేమాలను పర్యవేక్షించాలని, ఎవరికీ అసౌకర్యం కలగకుండా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వికాస ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. వికాస పథక సంచాల కులు కె.లచ్చారావు, మేనేజర్ గోళ్ల రమేష్, హెచ్ఆర్లు పవన్కుమార్, ఎం.రవితేజ పాల్గొన్నారు. కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశం అన్నవరం: అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తికమాసం ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రకాష్సదన్ సత్రంలోని ట్రస్ట్బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. -
ఆహార తయారీ కేంద్రాల విస్తృత తనిఖీలు
● జిల్లాలో 200 చోట్ల ఏకకాలంలో నిర్వహణ ● కల్తీ, నిల్వ లోపాలు గుర్తించి అధికారుల తక్షణ చర్యలు ● లైసెన్స్ రద్దు చేస్తామని జేసీ హెచ్చరిక అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా వివిధ హోటళ్లలో, వ్యాపార కేంద్రాల్లో విపరీతమైన కల్తీ, ఆహార తయారీలో నాణ్యత లోపం, నిల్వ సరకుల సరఫరా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి.. జిల్లాలోని ఆహార తయారీ కేంద్రాల తనిఖీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా డీఎస్వో ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో పౌర సరఫరాల, ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖల సంయుక్తాధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్వో చెప్పారు. జేసీ నిషాంతి స్పందిస్తూ, ఎక్కడా ఆహార కల్తీలు కానీ, నాణ్యత లేని, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని సరఫరా చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి తనిఖీలు విస్తృతంగా చేపడతామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నియమాలను అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలన్నారు. కొన్నిచోట్ల ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆహారం కల్తీ కావడం, నాణ్యత తగ్గడం జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆయా యజమాన్యాలు వ్యవహరించాలని ఆదేశించారు. నిల్వ, కాలం చెల్లిన, హానికర పదార్థాలు ఆహార తయారీలో వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఫుడ్ సేఫ్టీ, తూనికలు–కొలతల శాఖల జరిమానాలతో పాటు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవన్నారు. భద్రతతో కూడిన ఆహారం అందించకపోతే వ్యాపారాలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. తనిఖీల్లో జిల్లా తూనికలు–కొలతల అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా ఆహార భద్రత అధికారి రామయ్య, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. హోటళ్లలో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కల్తీ, వంటి సమస్యలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు డీఎస్వో ఉదయభాస్కర్ చెప్పారు. -
పట్టుబట్టి.. తూర్పార పట్టి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్క్లబ్: కూటమి సర్కార్ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్ పాలనా తీరును వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం అనంతరం జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్మోహన్రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు. నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జీఎస్టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు. సాగునీటి కొరత రాకుండా చర్యలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్ ప్లస్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్రాజ్, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ తీర్మానం యూరియా కొరతపై గళం విప్పిన సభ్యులు నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత రంపచోడవరం మన్యంలో ప్రొటోకాల్పై చర్చ గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం -
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో కోట్లాది రూపాయల విలువైన నకిలీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారుతోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. ప్రభుత్వం, ఎకై ్సజ్ శాఖ పర్వవేక్షణా లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా నకిలీ మద్యం గ్రామాలకూ విస్తరించిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన నేపథ్యంలో, దీని మూలాలు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఉన్నట్టు అధికారులు గుర్తించి, నకిలీ మద్యం బాటిళ్లు, తయారీ యంత్రాలు, ఖాళీ సీసాలు, ప్యాకింగ్ సామగ్రి పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ నకిలీ మద్యాన్ని బహిరంగ మార్కెట్లో ప్రజలతో తాగిస్తున్నారన్నారు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మరణించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధనదాహంతో కూటమి నేతలు నకిలీ మద్యాన్ని విక్రయించి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. అల్లవరం మండలం కొమ రగిరిపట్నంలో రెండు నెలల క్రితం నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారని తెలిపారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బెల్ట్ షాపుల నుంచి ఎకై ్సజ్ శాఖకు మాముళ్లు అందుతున్నాయని ఆరోపించారు. తక్షణమే బెల్ట్ షాపుల నిర్వాహకులు, నకిలీ మద్యం తయారీదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. -
బెత్తంతో గుణపాఠం
తప్పు చేసే విద్యార్థులను గాడిలో పెట్టడానికి టీచర్లు బెత్తం ఝుళిపిస్తారు. హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లల మాదిరిగా.. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా.. తమ కంట్లోనే కారం కొట్టేందుకు యత్నించిన కూటమి సర్కార్కు గట్టి గుణ‘పాఠం’ నేర్పేందుకు ఉపాధ్యాయులు ‘పోరుబాట’ అనే బెత్తం సిద్ధం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ.. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్న పాలకుల వైఖరిపై ఉద్యమ శంఖం పూరించారు. రాయవరం: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన లబ్ధిని కలుగజేస్తామని, పీఆర్సీ వేస్తామని కూటమి కీలక నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. పీఆర్సీ వేయకపోగా, కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పైగా విద్యా సంస్కరణల పేరిట వారిపై పనిభారం మోపుతుండడంపైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూటీఎఫ్ రణభేరి పేరుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించి, ఉపాధ్యాయుల అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యల పరిష్కారం కోరుతూ తాజాగా పది ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో చలో విజయవాడకు పిలుపునిచ్చింది. జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మంగళవారం చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతి పండగకూ నిరాశే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తోంది. ఈ కాలంలో అనేక పండగలు వచ్చాయి.. వెళ్లాయి కానీ, ఉద్యోగులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. ప్రతి పండగకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సంక్రాంతి పండగకూ ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్లో ఉన్న డీఏలను ఇస్తారని ఆశించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునా ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూశారు. అప్పుడూ నిరాశే ఎదురైంది. వినాయక చవితికి ఇస్తారని ఆశించినా ప్రభుత్వం కనికరించలేదు. దసరా పర్వదినానికి కచ్చితంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశించారు. అప్పుడూ పీఆర్సీ కానీ, డీఏలు కానీ ప్రకటించకుండా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పరిస్థితుల్లో పోరుబాటే శరణ్యమని భావించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ కూడా ఇప్పటి వరకు ప్రకటించక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. దాచుకున్న డబ్బులకూ దిక్కులేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతభత్యాల నుంచి పీఎఫ్ మినహాయించుకుంటారు. వివిధ అవసరాల కోసం పీఎఫ్ సొమ్ము నుంచి డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి నిధుల నుంచి డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం తదితర అవసరాలకు పీఎఫ్ నుంచి దాచుకున్న డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సరెండర్ లీవ్ బిల్లులూ మంజూరు కాకపోవడంతో ఆర్థిక అవసరాలు తీరక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 48 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 48 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 18 వేల మంది వరకు ఉపాధ్యాయులున్నారు. వీరు కాకుండా మరో 30 వేల మంది పెన్షనర్లు ఉంటారు. ఉపాధ్యాయులు కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులూ ఉన్నారు. ఇప్పటి వరకు వీరికి నాలుగు డీఏలను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. దసరాకు కనీసం రెండు డీఏలు విడుదలవుతాయని ఆశించినా వీరికి నిరాశే మిగిలింది. దాటవేత ధోరణి సమంజసం కాదు 11వ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయినా, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే 30 శాతం ఐఆర్ను ప్రకటించాలి. డిమాండ్లు అడుగుతుంటే, పరిశీలిస్తున్నామంటూ దాటవేత వైఖరిని ప్రభుత్వం అవలంబించడం సమంజసం కాదు. – మేడిచర్ల త్రివెంకట ఆదిసత్య సుబ్బారావు, చైర్మన్, ఫ్యాఫ్టో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా హామీలు తక్షణం అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణం నెరవేర్చాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. నాలుగు డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించలేదు. పాత పీఆర్సీ బకాయిలూ ఇవ్వడం లేదు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. – పోలిశెట్టి దొరబాబు, ప్రధాన కార్యదర్శి, ఫ్యాఫ్టో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నమ్మక ద్రోహంపై ఉపాధ్యాయ సంఘాల పోరుబాట విద్యారంగ, ఆర్థిక సమస్యల పరిష్కారమే కీలకం నేడు చలో విజయవాడకు ఫ్యాఫ్టో నేతల పిలుపు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లనున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ మాటేమిటి? ఎన్నికల సమయంలో పీఆర్సీపై మంచి నిర్ణయం తీసుకుంటామని, ఐఆర్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా.. నేటికీ కనీసం పీఆర్సీ చైర్మన్గా ఎవరినీ నియమించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ చైర్మన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనా విడుదల కాలేదు. ముప్పేట దాడి విద్యారంగ సమస్యలతో పాటు, ఆర్థికపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఈ నెల ఏడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్, డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా, యూటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల ఏడున ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యా చరణ చేపడతామని హెచ్చరించారు. -
పోటీతత్వం పెంచేందుకు స్వచ్ఛత అవార్డులు
అమలాపురం రూరల్: స్వచ్ఛత కార్యక్రమాల్లో అగ్రగామిగా గ్రామాలను నిలపడం, గ్రామాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రేరణగా స్వచ్ఛత అవార్డులు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. సోమవారం అమలాపురం సత్యనారాయణ గార్డెన్లో జిల్లా స్థాయిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం–2025 ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేశారు. స్వచ్ఛత రంగంలో గుర్తింపు పొందిన మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, స్కూళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్సు స్టేషన్లు, పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలకు అవార్డులు జారీ చేశారన్నారు. స్వచ్ఛత, పారిశుధ్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, ఘనీభవ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం వంటి విధానాలను పురోగమింపజేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్ మాట్లాడుతూ, ఈ అవార్డులు మరింత జవాబుదారీతనం, పారదర్శకత, ప్రేరణ ఇచ్చేందుకు ఉద్దేశించబడ్డాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికై న ఆత్రేయపురం మండలం లొల్ల పంచాయతీకి సీఎం అవార్డును ప్రదానం చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, సీపీవో మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నుంచి అవార్డులు అందుకున్న వారు -
పోలీస్ గ్రీవెన్స్కు 31 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 31 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ పీవీఆర్పీబీ ప్రసాద్ వేర్వేరుగా తమ చాంబర్లలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదులపై జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అప్రమత్తంగా ఉండి, పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీ కౌన్సెలింగ్ తరహాలో చర్చించారు. ఎస్బీ సీఐగా పుల్లారావు జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) సీఐగా వి.పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్బీ సీఐగా పనిచేస్తున్న పుల్లారావు భీమవరం నుంచి అమలాపురం ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ ఎస్బీ సీఐగా పనిచేసిన బి.రాజశేఖర్ వీఆర్కు వెళ్లారు. శిశు సంక్షేమ శాఖ పీడీగా నాగమణిముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా నాగమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్లో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఆమె ఇక్కడికి వచ్చారు. స్థానిక శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు జిల్లాలోని సీడీపీవోలు కలిసి అభినందనలు తెలిపారు. నేడు జెడ్పీ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్టు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని కోరారు. ఘనంగా పవిత్రోత్సవాలు పెరవలి: అన్నవరప్పాడు అలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం హోమం నిర్వహించారు. నూలు దండలతో స్వామి, అమ్మవార్ల మూర్తులను రూపొందించి, కలశ పూజతో పాటు వివిధ అర్చనలు నిర్వహించారు. పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ క్రతువులు రాత్రి 9 గంటల వరకూ జరుగుతాయని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల సుస్వర వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల గోవింద నామోచ్ఛారణ ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
ఆర్ఆర్ ఏజెన్సీకి హార్బర్ నిర్వహణ
కలెక్టర్ మహేష్కుమార్ సాక్షి, అమలాపురం: అంతర్వేది పల్లిపాలెం హార్బర్ నిర్వహణను ఆర్ఆర్ ఏజెన్సీకి నవంబర్ నుంచి అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హార్బర్ అభివృద్ధిపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, సుమారు రూ.26 లక్షలతో వివిధ పనులకు అంచనాలు రూపొందించారని, ఈ పనులు నవంబర్ లోపు పూర్తి చేసి, నిర్వహణను ఏజెన్సీకి అప్పగిస్తారని వివరించారు. భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని, ఆర్డబ్ల్యూఎస్ విభాగం, జల్జీవన్ మిషన్ ద్వారా హార్బర్ అవసరాలకు వాటర్ ట్యాంకును నిర్మించాలని, ఉపాధి హామీ అనుసంధానంతో అప్రోచ్ రోడ్డును, విద్యుత్ సరఫరాను ఏపీఈపీడీసీఎల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒప్పంద పత్రాలపై ఆర్డీఓ, మత్స్య శాఖ సంతకాలు చేయాలని ఆదేశించారు. హార్బర్ నిర్వహణ ద్వారా అంతర్వేది ప్రాంతంలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి స్థాయి వసతులు కల్పించి, సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి, మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జేసీ నిషాంతి, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీవో కె.మాధవి, జిల్లా మత్స్య శాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏవీఎస్ రామన్, ట్రాన్స్కో ఎస్ఈ బి.రాజేశ్వరి, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్జీలపై అలసత్వం వద్దు అమలాపురం రూరల్: ప్రజల అర్జీలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల అర్జీదారుల నుంచి సుమారు 150 అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా విచారించి, నూరు శాతం సంతృప్తి కలిగేలా ఫిర్యాదును ముగించాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా, ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ఇద్దరు దివ్యాంగులకు సాంకేతిక విద్యాభ్యాసం కోసం ల్యాప్టాప్లను విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా కలెక్టర్ ఉచితంగా అందజేశారు. డీఆర్వో మాధవి, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. బ్రిటిష్ మ్యాపుల ఆధారంగా సర్వే జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి మ్యాపులు సర్వే ప్రమాణాల ప్రకారం పంట కాలువలు, డ్రెయినేజీలకు ప్రయోగాత్మక సర్వే నిర్వహించి సరిహద్దుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ మహేష్కుమార్ వెల్లడించారు. సోమవారం అమలాపురం మండలం నడిపూడి లాకు వద్ద బ్రిటిష్ కొలమానం ప్రకారం సర్వే నిర్వహించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే ప్రక్రియకు నాంది పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఉన్న డ్రెయిన్లు, పంట కాలువల సర్వేను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి, పూర్తిగా ఆక్రమణలను తొలగించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. బ్రిటిష్ సర్వే కొలమానం ప్రకారం వంద మీటర్లకు ఒక సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి, దానిపై పూర్తి వివరాలను రాస్తారన్నారు. భవిష్యత్తులో ఎవరు ఈ సరిహద్దు దాటి ముందుకు రాకూడదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల్లో అదే అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వివిధ సేవలపై దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో లభిస్తున్న సేవలపై గత ఆగస్టు మాదిరిగానే ఈసారి కూడా దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ● సత్యదేవుని దర్శనంపై జూన్లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సర్వేలో అది 74.1 శాతంగా నమోదైంది. ● మౌలిక వసతుల కల్పనలో జూన్ 66, జూలైలో 65, ఆగస్టులో 64.9 శాతం మంది సంతృప్తి చెందగా సెప్టెంబర్లో అది 66 శాతంగా ఉంది. ● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్లో 77, జూలైలో 78, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 79.2 శాతానికి పెరిగింది. ● పారిశుధ్యంపై జూన్లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5 మంది మాత్రమే సంతృప్తి చెందగా, సెప్టెంబర్లో అది 64.5 శాతానికే పరిమితమైంది. కార్తికం నాటికి చక్కదిద్దాలి ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతోంది. ఆ నెలంతా రత్నగిరికి భక్తుల తాకిడి ఉంటుంది. పర్వదినాల్లో లక్ష మందికి పైగా వస్తారు. ఆ సమయంలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోతే ప్రభుత్వ సర్వేల్లో దేవస్థానం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది. కేవలం ఈఓ మీదనే బాధ్యత వదిలేయకుండా దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ప్రత్యేకాధికారిని నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 35 రోజులకు హుండీల ద్వారా రూ.1,48,77,755 రాబడి వచ్చింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,39,47,961, చిల్లర నాణేలు రూ.9,29,794 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. హుండీల ద్వారా 62 గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 76, ఇంగ్లండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 4, సౌదీ రియల్స్ 6, యూఏఈ దీరామ్స్ 20, ఖతార్ రియల్స్ 1, మలేషియా రింగిట్స్ 1 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు. గత 35 రోజులకు సరాసరి హుండీ ఆదాయం రూ.4.25 లక్షలుగా నమోదైంది. ఈ 35 రోజుల్లో 23 రోజులు భాద్రపదం కాగా, 12 రోజులు మాత్రమే ఆశ్వయుజ మాసం. దసరా సెలవుల్లో భక్తులు రత్నగిరికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడం కూడా హుండీ ఆదాయం పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించారు. -
జో లాలీ.. నిద్ర వీడాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా: అలసిన ప్రయాణానికి ఆటో పడకగా మారింది.. చేరాల్సిన గమ్యం ప్రమాదపుటంచున సాగింది.. అసలే పరిమితికి మించిన ప్రయాణం.. ఆపై ప్రయాణికుల పవళింపు.. ఇది ఉప్పలగుప్తంలో కనిపించిన దృశ్యం. ఒక డ్రైవర్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఓ తప్పయితే, వెనుక భాగంలో డోర్ను తీసి ప్రయాణికులను కూర్చోపెట్టాడు. అంత కంటే నిర్లక్ష్యంగా ముగ్గురు మహిళలు అక్కడ కూర్చోగా, ఇద్దరు నిద్రిస్తూ వెళ్లారు. ఇంత నిర్లక్ష్యపు ప్రయాణాలతో ప్రమాదాలు జరుగుతున్నా, కాస్తయినా ఆలోచన ఉండడం లేదని ప్రజలు పెదవి విరిచారు. వాహనాలకు చిన్న కారణాలతో చలానాలు విధించే రవాణా శాఖకు ఇవి కనిపించడం లేదా అని విమర్శించారు. -
కళాపోషణ లేక..
ఫ వైభవం కోల్పోతున్న రంగస్థలం ఫ ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్లే ప్రదర్శనలు ఫ చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఆదరణ కరవు కొత్తపేట: కళా‘పోషణ’ కనుమరుగవుతోంది.. నాటక రంగం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది.. కళాకారులకు పూట గడవడమే కష్టమవుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన రంగస్థల పౌరాణిక నాటక రంగంపై క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గతంలో ఊరూరా నాటక ప్రదర్శనలతో సందడి నెలకొనేది. అనేక ఉత్సవాల్లో రంగస్థల వేదికలపై పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలతో కళావైభవం కనువిందు చేసేది. ప్రస్తుతం ఇది కొన్ని ఉత్సవ పందిర్లకే పరిమితమైంది. పెద్ద నాటకాల్లో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తోంది. చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఉపాధి దూరమైంది. ప్రస్తుతం వారి పరిస్థితి రంగులు వెలిసిన జీవితంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు చెందిన రంగస్థల నటుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారెందరో ఉన్నారు. లవకుశ సినిమా రాక ముందే చింతా సుబ్బారావు నేతృత్వంలో లవకుశ డ్రామా ట్రూపు ఉండేదట. అప్పట్లో ఆ నాటకం ప్రేక్షకాదరణ పొందిందని చెబుతూంటారు. తరువాత రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగరం లక్ష్మణరావు) ఆంజనేయుని పాత్ర పోషించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి అభినవ ఆంజనేయునిగా పేరొందారు. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. కొత్తపేటకు చెందిన జగత పెద్దకాపు 1960–75 మధ్య కాలంలో దుర్యోధనుడు, విశ్వామిత్రుడు తదితర పాత్రలకు జీవం పోశారు. కోరుకొండకు చెందిన ఎన్వీఎల్ ఆచారి దుర్యోధనుడిగా రాణించారు. కృష్ణుడిగా సత్యంశెట్టి (ద్వారపూడి) సూర్యారావు, ఆయన తనయుడు శేషగిరిరావు, యెరుబండి మందేశ్వరరావు, కోట నాగేశ్వరరావు, సుబ్బిశెట్టిగా పడాల సుందరం (జూనియర్ రేలంగి), మాయల ఫకీర్గా బెజవాడ రామారావు, బత్తిన నాగేశ్వరరావు, ధర్మరాజుగా నరేంద్రపురపు గంగరాజు, కొమ్మిశెట్టి పెద వీర్రాజు, అర్జునుడిగా తంబాబత్తుల నాగేశ్వరరావు తదితర నటులు రంగస్థలంపై తమ నటనా కౌశలాన్ని చాటారు. అలాగే ప్రస్తుతం శ్రీరాముడిగా సంపత్ నగరం లక్ష్మణరావు కుమారుడు పి.రామాంజనేయులు, ఆయన తనయుడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా, చింతామణిలో శ్రీహరిగా పుణ్యక్షేత్రం సత్యప్రసాద్ తదితరులు రాణిస్తున్నారు. ఎందరున్నా కొందరికే.. ప్రస్తుత తరం నటీనటుల్లో కేవలం కొందరికే నాటక అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, అమలాపురం, కొత్తపేట, కడియం, వాడపాలెం, వానపల్లి, అవిడి, రామచంద్రపురం, తుని, ద్రాక్షారామ, తుని, జగ్గంపేట, కాకినాడ, యానాం, తాళ్లరేవు, చల్లపల్లి, సీతానగరం, అనపర్తి, రాజోలు, రాజానగరం, బిక్కవోలు, పెద్దాపురం, సామర్లకోట, మండపేట, ముమ్మిడివరం తదితర అనేక ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులతో పాటు శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలను పురస్కరించుకుని వరుసగా 9, 10 రోజులు నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. దానితో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన పెద్ద కళాకారులకే కాక చిన్న కళాకారులకు కూడా అవకాశాలు లభించేవి. కాలక్రమేణా పందిర్ల లైటింగ్, తదితర ఏర్పాట్లు, ఉత్సవాల ఖర్చు పెరగడంతో పాటు ఆర్టిస్టుల పారితోషికం అధికమవడంతో అనేక పందిర్లలో నాటక ప్రదర్శనలకు స్వస్తి చెప్పారు. రాజమహేంద్రవరం దేవీచౌక్, చాగల్లు, అమలాపురం, కడియం వంటి పలు పందిర్లలో ఐదారు నాటకాలు ప్రదర్శిస్తూండగా, మరో ఐదారు పందిర్లలో కళా ప్రోత్సాహకుల ఆర్థిక సహకారంతో కేవలం ఒకటి, రెండు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అవీ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నటులను తీసుకువచ్చి నాటకాలు వేయిస్తున్నారు. ఆ నాటకాల్లో ఒక్కో నటుడు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. అలా ఒక్కో నాటకానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అవుతుంది. హార్మోనిస్టుల పాత్ర కీలకం రంగస్థల నాటకానికి హార్మోనియం ప్రధానం. నాటక కళాకారుడు ఎంత బాగా పాడినా, పద్య రాగాలాపన చేసినా దానికి హార్మోనియం, డోలక్, క్లారినెట్ సహకారం అవసరం. వేదికపై నటుడి కృషి ఎంతో ఉంటుందో, స్టేజీ ముందు హార్మోనియం, డోలక్, క్లారినెట్ కళాకారుల కృషి కూడా అంతే ఉంటుంది. ఇటువంటి కళాకారులు జిల్లాలో ఎంతో మంది ప్రతిభ చూపి తెరమరుగయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి చెందిన కలిగట్ల వెంకటరమణ, సత్తిబాబు, సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మైలవరపు శ్రీనివాస్ నాయుడు, కోరుకొండకు చెందిన సుబ్రహ్మణ్యం, నరేంద్రపురానికి చెందిన టేకి వీరబాబు తదితరులు హార్మోనిస్టులుగా రాణిస్తున్నారు. -
వాన లేదు.. వరద వదల్లేదు
ఫ నైరుతిలో లోటు వర్షపాతం ఫ ఇదే సమయంలో గోదావరికి ఐదుసార్లు వరద ఫ అంచనాల కన్నా అధికంగా ఇన్ఫ్లో సాక్షి, అమలాపురం: నైరుతి నిష్క్రమణ సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది లోటు వర్షాన్ని మిగిల్చింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ ప్రతి నెలా లోటు వర్షమే పడింది. ఇదే సమయంలో గోదావరి పోటెత్తింది. వరుసగా ఐదుసార్లు వచ్చి పడిన వరద గోదావరి లంక వాసులను ఇబ్బందుల పాల్జేసింది. జిల్లాలో ఈ ఏడాది లోటు వర్షం నమోదైంది. జూన్ నుంచి ఇప్పటి వరకూ ప్రతినెలా సగటు కన్నా తక్కువ వర్షమే పడింది. జూన్లో సాధారణ వర్షపాతం 111.4 మిల్లీ మీటర్లు కాగా, ఆ నెలలో 105.9 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఇది సాధారణం కన్నా 4.9 శాతం తక్కువ. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 241 మిల్లీమీటర్లు కాగా, 112.2 మిల్లీమీటర్లు పడింది. ఇది సగటు కన్నా 53.4 శాతం లోటు కావడం విశేషం. ఆగస్టులో సాధారణ వర్షం 229.7 మిల్లీమీటర్లు కాగా, 203.5 మిల్లీమీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 11.4 శాతం లోటు కావడం గమనార్హం. ఇక సెప్టెంబర్లో సాధారణ వర్షం 196.8 మిల్లీమీటర్లు కాగా, 117.7 మిల్లీమీటర్లు పడింది. ఇది సగటు కన్నా 40.2 శాతం తక్కువ. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ 42.9 మిల్లీ మీటర్లు కాగా, కురిసింది 7.6 మిల్లీ మీటర్లు. ఇది సగటు కన్నా 82.3 శాతం తక్కువ. జూన్ 1 నుంచి అక్టోబరు 4 వరకూ సాధారణ వర్షపాతం 825.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకూ 546.9 మిల్లీ మీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 44 శాతం లోటు వర్షం కావడం గమనార్హం. బాబోయ్.. ఐదుసార్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట రైతులు వర్షం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. కానీ విచిత్రంగా ఈ ఏడాది గోదావరికి మాత్రం వరుసగా వరదలు వచ్చాయి. భారీగా కాకున్నా ఏకంగా ఐదుసార్లు వరద పోటెత్తడం విశేషం. సెప్టెంబర్లోనే మూడుసార్లు వచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకూ ఈ నెల 4వ తేదీ వరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు ఇన్ఫ్లో 3,969.478 టీఎంసీలుగా నమోదైంది. ఆగస్టుతో పోల్చుకుంటే ఇది చాలా అధికం. ఆగస్ట్ నెలాఖరు నాటికి ఇన్ఫ్లో కేవలం 1,998.787 టీఎంసీలు మాత్రమే. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 1,970 టీఎంసీల నీరు వచ్చింది. వచ్చిన నీటిలో 112.023 టీఎంసీల నీటిని గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన పంట కాలువలకు వదిలారు. తూర్పు డెల్టాకు 39.191, మధ్య డెల్టాకు 19.562, పశ్చిమ డెల్టాకు 53.270 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఇక దిగువనకు 3,857.455 టీఎంసీల వృథా జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులకు లోపు ఉంటోంది. అటువంటిది ఇప్పుడు ఏకంగా 6,51,647 టీఎంసీలు ఉండడం గమనార్హం. సెప్టెంబర్లో తరచూ గోదావరి పోటెత్తడానికి తెలంగాణలో కురిసిన భారీ వర్షాలే కారణం. దీనికితోడు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలోకి వచ్చే ఒడిశా, ఛతీస్ఘడ్లో కూడా వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ఇన్ఫ్లో ఇప్పటికీ అంచనాలకు మించి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గోదావరి ఇన్ఫ్లో పెరగడం వల్ల వచ్చే రబీ రైతులకు మేలు జరుగుతోందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
అవకాశాలు లేకుంటే పస్తులే
30 ఏళ్ల నుంచి రంగస్థల నాటక రంగంలో నటులకు అలంకరణ, డ్రెస్లు, సామగ్రి సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వేషాల సామగ్రి స్థానికంగా తయారు చేయడంతో పాటు చైన్నె వంటి నగరాల నుంచి కొన్ని తీసుకు వస్తాం. నాతో పాటు మరో ఐదుగురు పని చేస్తారు. గతంలో మాదిరిగా ఇప్పుడు అవకాశాలు లేవు. వేరే వృత్తిలోకి వెళ్లలేక అవకాశాలు ఉన్నప్పుడు తింటున్నాం. లేకుంటే పస్తులుంటున్నాం. – తూము రమేష్, మేకప్ ఆర్టిస్ట్, డ్రామా డ్రెస్ కంపెనీ, రాజమహేంద్రవరం -
అన్నదాన భవనానికి రూ.లక్ష విరాళం
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన కూచుబట్ల శ్రీగిరి, సుధా దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116, పలువురు దాతలు నిత్యాన్న ప్రసాద పథకానికి విరాళాలు అందించారు. ఆయా దాతలకు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాలను అందజేశారు. నిత్యాన్నదానానికి విరాళాలు అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి పి.గన్నవరం మండలం పెదపూడి గ్రామానికి చెందిన బొరుసు వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి దంపతులు ఆదివారం రూ.51,116 విరాళంగా సమర్పించారు. ఈ సొమ్మును ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను వేదమంత్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం ఇచ్చారు. అలాగే హైదరాబాద్కు చెందిన బల్ల వెంకట నాగసతీష్, జానకి రత్న జ్యోతిర్మయిలు రూ.10,116 అందించారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరిభవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి, పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు ఏలేశ్వరం: పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయంలోకి ఆదివారం 1,616 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.46 మీటర్లు కాగా, ప్రస్తుతం 84.37 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గానూ నీటి నిల్వలు 19.81 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 900, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు. దుర్గమ్మ విగ్రహం @ రూ.1.45 లక్షలు దేవరపల్లి: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక మూడు బొమ్మల సెంటర్లోని సౌభాగ్య దుర్గాంబికా ఆలయం వద్ద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ కమిటీ ఆధ్వర్యాన శనివారం రాత్రి వేలం నిర్వహించారు. ఈ పాటలో గ్రామానికి చెందిన జుత్తిగ సత్యనారాయణ రూ.1.45 లక్షలకు అమ్మవారి విగ్రహాన్ని దక్కించుకున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 8వ తేదీన గ్రామంలో ఊరేగించి, నిమజ్జనం చేయనున్నారు. -
● ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే మనుగడ
నేను కురుక్షేత్రం నాటకంలో పలు పాత్రలు పోషిస్తాను. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఉత్సవ కమిటీలతో పాటు ప్రభుత్వం పౌరాణిక రంగస్థల నాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తేనే మాలాంటి చిన్న నటులు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అక్కడ ఏటా వివిధ ఉత్సవాల్లో నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – అన్నందేవుల నారాయణరావు, రంగస్థల కళాకారుడు, కేశవరం, మండపేట మండలం -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేద్దాం
రావులపాలెం: వైఎస్సార్ సీపీ బలోపేతానికి సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నుంచి సీఈసీ (సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) మెంబర్గా మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎస్ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) మెంబర్లుగా సాకా మణికుమారి, కుడుపూడి భరత్లు నియమితులయ్యారు. ఈ సభ్యులు రావులపాలెం మండలం గోపాలపురంలో జగ్గిరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జగ్గిరెడ్డి వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. -
కిటకిటలాడిన లోవ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చిన 10 వేల మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,77,700, పూజా టికెట్లకు రూ.1,15,860, తలనీలాలకు రూ.11,200, వాహన పూజలకు రూ.5,340, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.55,412, విరాళాలు రూ.77,780 కలిపి మొత్తం రూ.4,43,292 ఆదాయం సమకూరిందని వివరించారు. -
బస్సు, రైలు కిటకిట
రాజమహేంద్రవరం సిటీ: దసరా పండగకు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని స్వస్థలాలకు వచ్చిన వారు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో, రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఆదివారం ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర నగరాలకు తిరిగి వెళ్లే వారు బస్సులు, రైళ్ల కోసం బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బస్సులలో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడటంతో కొన్ని సందర్భాల్లో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా సుమారు 175 బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీని అనుసరించి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోల నుంచి ప్రధానంగా విజయవాడకు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తే మరిన్ని బస్సులు నడిపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని డీపీటీఓ తెలిపారు. ఇక రైళ్లలో వెళ్లే వారు రిజర్వేషన్ లేకపోయినా.. ఆ బోగీల్లో సైతం ఎక్కి ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఫ ముగిసిన దసరా సెలవులు ఫ తిరుగు ప్రయాణమైన జనం ఫ రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు -
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు
దేవస్థానానికి రూ.5.26 లక్షల ఆదాయం కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. శనికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి తిథి కలిసి రావడంతో భక్తులు అత్యధికంగా తరలివచ్చారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ప్రాతఃకాల సమయంలో అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రత్యక్షంగా భక్తుల పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా రూ.2,61,750, ఆన్లైన్, క్యూఆర్ పరోక్ష పూజా టిక్కెట్ల ద్వారా రూ.2,46,400, అన్న ప్రసాదం విరాళాల రూపంలో రూ.18,047తో మొత్తం దేవస్థానానికి రూ.5,26,197 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. స్వామివారిని వ్యవసాయ శాఖ కమిషనర్ డి.హరిత దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకం జరిపించారు. అమరావతి ఏసీ బస్సు సర్వీసు పునరుద్ధరణ అమలాపురం రూరల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమలాపురం డిపో నుంచి అమరావతి ఏసీ బస్సు సర్వీసును శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్టు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. ప్రతి రోజూ అమలాపురం నుంచి హైదరాబాద్ (బీహెచ్ఈఎల్)కు వెళ్లే ఈ సర్వీసు ఇటీవల కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిందని చెప్పారు. అమలాపురం డిపో నుంచి అమరావతి 2572 ఏసీ సర్వీస్ రాత్రి 8.30కు, హైదరాబాద్లో 2573 సర్వీసు రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతాయన్నారు. సంస్థ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణ ఆంధ్రాలో ఒక రాష్ట్ర, 49 జిల్లా అవార్డులు అమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో 49 అవార్డులు లభించాయని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ శనివారం తెలిపారు. జిల్లాకు వచ్చిన గుర్తింపులో ప్రతి వ్యక్తి, సంస్థ, గ్రామం, పాఠశాల, ఆస్పత్రి, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆత్రేయపురం లొల్ల స్వచ్ఛ పంచాయతీకి జిల్లా స్థాయి అవార్డు లభించింది. ఉత్తమ స్వచ్ఛత హరిత అంబాసిడర్లుగా ఉండ్రాజవరపు మారేష్(దంగేరు), యార్లగడ్డ వెంకాయమ్మ(సాకుర్రు), చంద్రమల్ల చంద్రరావు (పాలతోడు), పెయ్యల వెంకట్రావు (భట్నవిల్లి), ఉత్తమ స్వచ్ఛత ఎన్జీవోగా వశిష్ట లయన్స్ క్లబ్ (అమలాపురం), ఆక్సిజన్ అసోసియేషన్ (మామిడికుదురు), సేవ్ నేచర్ మహిళా సంఘం (కేశనకుర్రు), ఉత్తమ స్వచ్ఛత యోధులుగా రేలంగి సత్య నాగేశ్వరరావు, యార్లగడ్డ సుబ్బాయమ్మ (అమలాపురం మున్సిపాలిటీ), బొట్టా సూరిబాబు, వడ్డాడి దుర్గారావు (మండపేట), వడ్డాది సత్తిబాబు (రామచంద్రపురం), స్వచ్ఛ అంగన్వాడీలుగా అమలాపురం, జొన్నాడ, మలికిపురం, మారేడుబాక, పాత గన్నవరం, స్వచ్ఛ బస్ స్టేషన్గా రామచంద్రపురం బస్ స్టేషన్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా కలెక్టరేట్–అమలాపురం, మండపేట మునిసిపాలిటీ, కొత్తపేట ఎంపీడీవో కార్యాలయం, స్వచ్ఛ పంచాయతీలుగా దంగేరు, కొమరగిరిపట్నం, పాలతోడు, శివకోడు, స్వచ్ఛ హాస్పిటల్స్గా బెండమూర్లంక పీహెచ్సీ(అల్లవరం), జీహెచ్డీ (గోపాలపురం), కొత్తపేట సీహెచ్సీ,, స్వచ్ఛ హాస్టళ్లుగా రాజోలు సోషల్ వెల్ఫేర్ (బాలికలు), రాజోలు ప్రభుత్వ బాలుర బీసీ కళాశాల హాస్టల్, స్వచ్ఛ పరిశ్రమలుగా అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ (గోపాలపురం), ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఈతకోట), స్వచ్ఛ గురుకుల పాఠశాలగా అంబేడ్కర్ బాలుర గురుకులం (గోడి), స్వచ్ఛ రైతు బజార్గా రామచంద్రపురం, స్వచ్ఛ పాఠశాలగా మడికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జీహెచ్ఎస్–కొంకపల్లి (అమలాపురం), ఎస్ఐజీ ఎంపీఎల్ సీహెచ్ఎస్ నగర్(రామచంద్రపురం), జిల్లా పరిషత్(రాయవరం), స్వచ్ఛ ఎల్ఎఫ్ఎస్గా భాను, కొత్త ఎస్సీపేట(రామచంద్రపురం), ఐశ్వర్య, అంకంవారిస్ట్రీట్(రామచంద్రపురం), స్వచ్ఛ గ్రామ సంస్థలుగా నల్లమిల్లి బండారులంక (అమలాపురం), గేదెల్లంక (ముమ్మిడివరం), కందులపాలెం(రామచంద్రపురం), శివకోడు, రాజోలు ఎంపికయ్యాయి. -
కడుపుకొట్టి.. బుజ్జగింపులా..?
సాక్షి, అమలాపురం/పి.గన్నవరం: ఓవైపు ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టారనే ఆగ్రహం.. దీనికి తోడు ఇస్తానన్న రూ.15 వేల సాయానికి నిబంధనల కొర్రీలు.. ఇలా గిల్లి జోల పాడినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. టీడీపీ శనివారం నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రసాభాసగా మారింది. ‘గోరంత సాయానికి.. కొండంత హడావుడి’ అనే తీరులో ప్రచారార్భాటం చేయాలనుకున్న నేతల వ్యూహం బెడిసికొట్టింది. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఎదురు తిరిగారు. కూటమి సర్కారు తీరుపై అసంతృప్తితో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆటో డ్రైవర్ల సేవలో.. ర్యాలీకి వంద ఆటోలు కూడా రాలేదు. వచ్చిన వారిలోనూ చాలా మంది కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఇతర టీడీపీ నేతలు వచ్చిన సమయంలో కొంతమంది చోటామోటా నాయకులు ఆటోల ముందు టీడీపీ జెండాలతో ఫొటోలు దిగేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆటో డ్రైవర్లు అభ్యంతరం చెప్పడంతో ‘తమ్ముళ్లు’ కంగుతిన్నారు. టీడీపీ, జనసేన బాహాబాహీ నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు, పరుష పదజాలతో తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో.. కార్యక్రమం కోసం రవాణా శాఖ తయారు చేసిన ఫ్లెక్సీపై, ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసే నమూనా చెక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన నేతలు విరుచుకుపడ్డారు. జనసేనకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తాము నిర్వహించే కార్యక్రమాల్లో చంద్రబాబు ఫొటో వేస్తున్నామని, టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఫొటో వేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు సర్ది చెబుతున్న సమయంలో టీడీపీకి చెందిన మద్దాల సుబ్రహ్మణేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, ఇతర టీడీపీ నాయకుల పైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పారు.ఫ బెడిసికొట్టిన టీడీపీ ‘ఆటోడ్రైవర్ల సేవలో..’ ఫ ఉచిత బస్సు నేపథ్యంలో మొక్కుబడిగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు ఫ పసుపు జెండాలతో ఫొటోలకు అంగీకరించని వైనం -
నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..
● వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రం ● ఒక్కరోజు దేవస్థానానికి రూ .53,41,146 ఆదాయం కొత్తపేట: గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. శ్రీనివాసా... శ్రీ పురుషోత్తమా.. అంటూ వాడపల్లి వాసుని స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన చేరుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులతో లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను చేరవేశారు. విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి రూ. 53,41,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
7న మినీ ఉద్యోగ మేళా
అమలాపురం రూరల్: కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన మినీ ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్కుమార్ తెలిపారు. బెంగళూరులోని ఫాక్సకన్ కంపెనీ, పహార్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీకి సంబంధించి ఇంటర్వ్యూలు ఏడున ఉదయం పది గంటలకు జరుగుతాయన్నారు. జిల్లాలోని 30 ఏళ్లలోపు సీ్త్ర, పురుష అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ చెప్పారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న వారికి నియామక పత్రాలు ఇస్తారని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా, అనుబంధ విభాగాల కమిటీ సభ్యులుగా జిల్లా నుంచి పలువురికి అవకాశం దక్కింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాజోలుకు చెందిన రుద్రరాజు వెంకట నరసింహ శ్రీపద్మరాజు, పి.గన్నవరానికి చెందిన వాసంశెట్టి వీరవెంకట తాతారావు(తాతాజీ)ని నియమించారు. స్టేట్ గ్రీవెన్స్సెల్ సెక్రటరీగా వనుము సత్యకల్యాణి (కొత్తపేట), జాయింట్ సెక్రటరీగా మానే శ్రీను(అమలాపురం), వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మట్టపర్తి మీరాసాహెబ్శెట్టి(పి.గన్నవరం), ఇళ్ల గోపి (అమలాపురం), కాకిలేటి శ్రీనివాస్(పి.గన్నవరం), స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా దొమ్మేటి వెంకటరావు(కొత్తపేట), కుడుపూడి సత్యనారాయణ(అమలాపురం), ఆర్టీఐ వింగ్ రాష్ట్ర సెక్రటరీగా కోనాల రాజు(కొత్తపేట), జాయింట్ సెక్రటరీలుగా ఏడిద సూరిబాబు (ముమ్మిడివరం), సుంకర సుధ(అమలాపురం)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు
ఐ.పోలవరం మండలం మురమళ్లలో వరద వల్ల వేట లేక నిలిచిన పడవలుఅమలాపురం రూరల్: ప్రతి ఒక్కరూ జీఎస్టీ లబ్ధిని పొందడానికి అర్హులేనని, ఈ విషయంలో అడ్డంకులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ హెచ్చరించారు. జీఎస్టీ తగ్గింపుపై శనివారం కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు లభించాల్సిన ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారిపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలందరికీ చేరవేయడంలో అధికారులు, ఏజెన్సీలు, డీలర్లు, వ్యాపారులు పూర్తిగా సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో ప్రత్యేక జీఎస్టీ స్టాల్ను ఏర్పాటు చేశారు. 7,709 మందికి లబ్ధి జిల్లాలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 7,709 మంది లబ్ధి పొందారని కలెక్టర్ మహేష్కుమార్ వెల్లడించారు. శనివారం అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆటోడ్రైవర్ల సేవలో ఆయా డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేశారన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్వో కొత్త మాధవి, డీటీవో డి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.కలెక్టర్ మహేష్కుమార్ -
‘ఎప్పుడు మేమే సర్దుకుపోవాలా?’.. జనసేన శ్రేణుల ఆగ్రహం
సాక్షి, కోనసీమ జిల్లా: ‘‘జనసేన నేతలు ఏ కార్యక్రమం చేసిన సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నాం. కానీ, టీడీపీ నేతలు కార్యక్రమం చేస్తే పవన్ కల్యాణ్ ఫోటో అసలు వేయడం లేదు’’ అంటూ జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం పి.గన్నవరంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో(Auto Driver Sevalo) కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. డ్రైవర్లకు ఇచ్చిన చెక్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో.. స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ-జనసేన నాయకులు ఘర్షణకు(TDP Jana Sena Clash) దిగారు. వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్, మెగా చెక్కులోనూ పవన్ ఫోటో లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ తరుణంలో.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ(MLA Giddi Satyanarayana) ‘పోనీ..’ అంటూ వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రతీ విషయంలో తామే సర్దుకుపోతున్నామని, టీడీపీ వాళ్లు మాత్రం వాళ్లు చేసేది చేసుకుంటూ పోతున్నారంటూ జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపిన నారా ఫ్యామిలీ! -
రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి
తుని: అన్నవరం రైల్వేస్టేషన్ ట్రాక్పై గుర్తుతెలియని రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన గురువారం జరిగిందని సామర్లకోట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ పి.వాసు తెలిపారు. మృతుని వద్ద తుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్రావుకు దొరికిన ఆధారాలను బట్టి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హోనార్ గ్రామానికి చెందిన సులం పాన్(25)గా తెలిసింది. మృతుడికి తండ్రి మంగళ్సింగ్ పాన్, తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి ఉన్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కొంతకాలం నుంచి మానసికంగా మృతుడు ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. సుమారు నెలక్రితం చేపల చెరువు వద్ద ప్యాకింగ్ నిమిత్తం వచ్చినట్టు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వృద్ధుడి గల్లంతు
నిడదవోలు రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలోకి జారిపడి వృద్ధుడు గల్లంతైనట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు శుక్రవారం తెలిపారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఉల్లూరి చిరంజీవి (64) ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు గోదావరి ఒడ్డున బహి ర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. చిరంజీవి అల్లుడు ప్రత్తిపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గోదావరిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు శుక్రవారం పరిశీలించారు. -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా అడారి గణేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పుటి వరకు భీమవరం జిల్లా ట్రెజరీ శాఖలో అసెస్టెంట్ డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, ఉద్యోగులు కలిశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయవరం: మండలంలోని వెంటూరు శివారు బుట్టాయిపేట వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో దుగ్గిరాల రాంబాబు(57) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్బాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాంబాబు కుటుంబ సభ్యులు వెంటూరు నుంచి రామచంద్రపురంలో బంధువుల ఇంటి వద్ద జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో కూర్చున్న రాంబాబుకు తీవ్రగాయాలు కాగా, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. రాంబాబు తమ్ముడు కుమారస్వామి ఆటో నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. రాంబాబు కుమారుడు కనకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
న్యాయం చేయాలంటూ ధర్నా
గణేశ్ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని బ్లూ ఓషన్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికురాలు లొల్ల దుర్గమ్మను గత నెల ఏడవ తేదీన ఫ్యాక్టరీకి చెందిన వాహనం ఢీ కొనడంతో రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చెందిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించి ఇంటికి పంపించి వేశారు. అయితే ఆమెకు ప్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ చూపలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేయడానికి నిర్ణయించారు. ఆమెకు జి. రాగంపేట సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు బుంగా శేఖర్బాబు, ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఫ్యాక్టరీలో ఆమె పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటోందని చెప్పారు. దుర్గమ్మ మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. దుర్గమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, గ్రామ నాయకులు కల్యాణ్, బాబీ, విజయ్లు ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు ● మోటార్ సైకిల్ను ఢీకొట్టిన కారు పెరవలి: విజయ దశమి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద మోటార్ సైకిల్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం రాత్రి 9.20 గంటలకు నల్లాకులవారిపాలెం వద్ద రోడ్డు కట్టింగ్ను దాటే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మోటార్ సైకిల్పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో పాటు వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో ఇంజేటి ఇస్సాకు (49)పై కారు వెళ్లటంతో తీవ్ర గాయాలు అయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ మృతి చెందాడు. కంతేటి పోసయ్య (29) కారు ఢీకొట్టిన వేగానికి గాలిలోకి ఎగిరి రోడ్డు మధ్యలో ఉండే డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాతు వెంకటేశ్వరరావు ప్రమాద సమయంలో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై కొట్టుకుంటుండగా స్థానికులు 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వెనక్కి వెళ్లిపోదామనుకోగా... పండగ రోజు కావటంతో స్నేహితులు ముగ్గురు కలసి ఖండవల్లి నుంచి తణుకు వెళ్లటానికి మోటార్ సైకిల్పై వస్తుండగా నల్లాకులవారిపాలెం వచ్చేటప్పటికి తిరిగి ఖండవల్లి వెళ్లిపోదామని ఉద్దేశంతో మోటార్ సైకిల్ టర్నింగ్ తిప్పటంతో అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వస్తున్న కారు వేగంగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దీనికితో కారు ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నీటి సంద్రమైన ఖండవల్లి ప్రమాదం జరిగిందని తెలిసిన ఖండవల్లిలో మూడు కుంటుంబాలు కన్నీటి పర్యతం అయ్యాయి. పండగ రోజు ఎంతో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురు స్నేహితులు రాత్రి అయ్యే సమయానికి మృతి చెందటంతో ఆ కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ కనిపించిన భయానక దృశ్యాలను చూచి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడు పోసియ్య భార్య కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరావు తెలిపారు. -
ప్రాణ సంకటంగా బాణసంచా
రాయవరం: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. ఈ నెల 21న దీపావళి పర్వదినం జరుపుకొనేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. అయితే జీవితంలో వెలుగులు నింపాల్సిన దీపావళి పండగ..కొందరి స్వార్థంతో చీకట్లును తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ, నిల్వలు చేస్తుండడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. లైసెన్స్ పొందినవారు బాణసంచా తయీరీలో నిమగ్నమయ్యారు. అధికారికంగా బాణసంచా తయారీ చేసే వారికంటే అనధికారికంగా చేసేవారు ఎక్కువ. గతంలో అధికారికంగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలతో పాటు అనధికారికంగా బాణసంచా తయారీ చేసే చోట కూడా ప్రమాదాలు సంభవించి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. 45 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు దీపావళికే కాక పలు సందర్భాల కోసం బాణసంచా తయారు చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళికి బాణసంచా తయారు చేసే పనిలో జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అతి పెద్ద ఘటన అదే బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామ, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన జిల్లాలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. గతేడాది మండపేట మండలం ఏడిదలో దీపావళి ముందు రోజు జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో తాము నిర్వహిస్తున్న కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అనధికార నిల్వలతోనే.. బాణసంచా తయారీకి పేరొందిన తమిళనాడులోని శివకాశి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా సరకు దిగుమతి అవుతుంది. చైనా బాణసంచా కూడా అధికంగానే దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు దీపావళికి బాణసంచాను దిగుమతి చేసుకుని నిల్వలు పెట్టుకుంటారు. నిబంధనలు అతిక్రమించి గోడౌన్లలో నిల్వలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా గొడౌన్ ఏర్పాటు చేయాలంటే ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనావాస ప్రాంతంలో బాణసంచా నిల్వలు ఏర్పాటు చేయరాదు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, గ్రామ శివారు ప్రాంతాల్లోనే బాణసంచా కేంద్రాలను నెలకొల్పాలి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేమీ పాటించకుండా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది లైసెన్స్లు పొందకుండానే జనావాసాల మధ్య అవగాహన లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనధికార తయారీదారులతోనే సమస్య జిల్లాలో లైసెన్స్ పొందిన బాణసంచా తయారీదారులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని పలువురు అనధికారికంగా జనావాసాల మధ్య బాణసంచా తయారు చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, ఫైర్ అధికారులు వచ్చి తరచుగా తనిఖీలు చేపడుతున్నారు. – వి.సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ యజమానుల సంఘం, రాయవరంరాజీపడే ప్రసక్తి లేదు బాణసంచా తయారీ కేంద్రాలు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే రెన్యువల్ లైసెన్స్లకు సిఫారసు చేస్తాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అధికారిక తయారీ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనధికారికంగా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం బాణసంచా తయారీదారులు పాటించాల్సిన నిబంధనలు బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల ఖాళీ స్థలం ఉంచాలి. అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అనువుగా నాలుగువైపులా 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. గ్రామ పంచాయతీ, పట్టణాలకు 1.5 కిలోమీటర్లలోపు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు. బాణసంచా తయారుచేసే ప్రదేశాల్లో అగ్నినిరోధక పరికరాలు ఉండాలి. షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటిరీయల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధంచగలగాలి. షెడ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గుమ్మాలు కనీసం 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. తయారీ కేంద్రంలో ఆటోమెటిక్ వెంటిలేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను బాణసంచా తయారీకి ఉపయోగించకూడదు. అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైర్ఫైటింగ్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తీసుకుని ఉండాలి. తయారీ కేంద్రం విస్తీర్ణాన్ని బట్టి 5 కిలోల సామర్థ్యం ఉన్న డ్రై పౌడర్ ఎస్టింగ్విషర్ (అగ్నిమాపక సిలిండర్)లు నాలుగు సిద్ధంగా ఉండాలి. ఐదు ట్రక్కుల పొడి ఇసుకను కూడా ఆ ఆవరణలో సిద్ధంగా ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన నీటి కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మంటలు, అగ్నిని సష్టించే ద్రవ పదార్థాలు (పెట్రోలు, డీజిల్ వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదు. తయారీ కేంద్రంలో విద్యుద్దీకరణలోను జాగ్రత్తలు పాటించాలి. వైర్లను బహిరంగంగా ఉంచకూడదు. వైర్ల జాయింట్లు ఎక్కడా ఉండకూడదు. తయారీ కేంద్రంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచాలి. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా చూడాలి. అత్యవసర సమయంలో అలారం మోగించేందుకు, అవసరమైతే లోపలి వారిని బయటకు తీసుకువచ్చేందుకు తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. అగ్నిప్రమాద సమాచారాన్ని అత్యవసరంగా తెలియజేసేందుకు ఫోన్లు అందుబాటులో ఉంచాలి. మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఈ నిబంధనలను పాటించకుంటే లైసెన్సు రద్దు అవుతుంది. ఎక్స్ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫారం తగినంత దూరంలో ఉండాలి. తయారీ కేంద్రాలపై నిఘా అవసరం ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాలి దీపావళి వేళ అప్రమత్తతే రక్ష ప్రమాదాల్లో కొన్ని.. తేదీ ఊరు మృతులు 2012 డిసెంబర్ 30 వి.సావరం (రాయవరం) 3 2014 అక్టోబర్ 22 వాకతిప్ప(యు.కొత్తపల్లి) 18 2015 జూలై 22 పలివెల (కొత్తపేట మండలం) 5 2025 సెప్టెంబర్ 30 విలస (అయినవిల్లి మండలం) 2 -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని టెన్నిస్ కోర్టులలో బాలబాలికల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలకు 70 మంది హాజరయ్యారు. టెన్నిస్ కోచ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, సీనియర్ పీడీలు ఎల్.జార్జి, పట్టాభిరామం పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో త్వరలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్–14 బాలురు–5, బాలికలు–5, అండర్–17 బాలురు–5, బాలికలు–5 మందిని ఎంపిక చేశారు. ఎంపికలు ఎస్జీఎఫ్ఐ బాలికల కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులుగా మాజీ ఎంపీ అనురాధ
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా చెందిన నలుగురిని సీఈసీ సభ్యులుగా ఎంపిక చేశారు. చింతా అనురాధతో పాటు పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్టీ సీనియర్ నాయకులు పేరి కామేశ్వరరావు, పితాని బాలకృష్ణలను నియమించారు. వీరితో పాటు జిల్లాకు చెందిన ఐదుగురిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన సాకా మణికుమారి, అమలాపురం నియోజకవర్గానికి చెందిన కుడిపూడి వెంకటేశ్వరరావు (బాబు), కుడుపూడి భరత్ భూషణ్, పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేలపూడి స్టాలిన్బాబు, ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన కాశీ ముని కుమారిని ఎంపిక చేశారు. గాంధీజీ స్ఫూర్తితో సాగాలి అమలాపురం రూరల్: గాంధీజీ జయంతి మనకు మానవతా విలువలు, శాంతి, సత్యం, అహింసా మార్గాల పట్ల నిబద్ధతను గుర్తు చేస్తుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా గురువారం ఆయన కాంస్య విగ్రహానికి కలెకక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వ్యక్తిగత జీవితంలోను, సమాజంలోను ఆయన విలువలను పాటించడానికి ప్రయత్నించాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు. 7న ఫ్యాప్టో పోరుబాటఅమలాపురం టౌన్: విజయవాడలో ఈ నెల 7న జరగనున్న ఫ్యాప్టో పోరుబాట నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఆర్ధిక, ఇతర సమస్యలపై రాష్ట్ర ఫ్యాప్టో తలపెట్టిన ఈ మహా ధర్నాకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అన్ని యూనియన్లకు చెందిన ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా విద్యా భవనంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల సన్నాహాక సమావేశంలో సాయి శ్రీనివాస్ మాట్లాడారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నేటి ఉపాధ్యాయులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించింది. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం తదితర సమస్యలపై ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారని ఆయన గుర్తు చేశారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ పోతంశెట్టి దొరబాబు, సంఘ ప్రతినిధులు మోకా ప్రకాష్, రాయుడు ఉదయభాస్కర్, నాగిరెడ్డి శివ ప్రసాద్ ప్రసంగించారు. నిరసన పోరు పోస్టర్లను విడుదల చేశారు. అండర్ –14, 17 బాలబాలికలకు ఎంపికలుఅమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాల బాలికలకు ఈనెల 4 ,7 తేదీలలో క్రీడా పోటీలు, జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. 4 వ తేదీన ఆత్రేయపురం మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో నెట్బాల్ ఎంపికలు, 7 వ తేదీన మలికిపురం మండలం గుడిమెళ్ళంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాల్కాంబ్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని డీఈవో కోరారు. ఇతర వివరాలకు ఎస్జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు సెల్ నెంబర్ 93469 20718, ఎన్ఎస్ రమాదేవి సెల్ నెంబర్ 94400 94984 సంప్రదించాలన్నారు. -
పోలీసుల ఆయుధ పూజ
అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా అమలాపురంలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్) కార్యాలయంలో ఎీస్పీ రాహుల్ మీనా ఆయుధ పూజ చేశారు. జిల్లాలో పోలీసులు వినియోగించే తుపాకులు, తదితర ఆయుధాలకు, పోలీస్ వాహనాలకు ఎస్పీ మీనా గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేసి విజయదుర్గను కొలిచారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. పురోహిత బ్రహ్మ ఉపద్రష్ట విజయాదిత్య సోదరులు ఎస్పీతో ఆయుధ పూజ చేయించారు. దుర్గాదేవి చిత్రపటం వద్ద ఉంచిన ఆయుధాలకు ఎస్పీ పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన విజయ దశమి అందరికీ విజయం చేకూర్చాలని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్పీ మీనా ఆకాంక్షించారు. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఏఆర్ ఆర్ఐ కోటేశ్వరావు, పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్కుమార్, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ పుల్లారావుతో పాటు ఎస్పీ, ఏఆర్ కార్యాలయాల పోలీస్ సిబ్బంది పొల్గొన్నారు. మహాత్మాగాంధీకి నివాళి జాతి పిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సెల్యూట్ చేశారు. -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
● గగుర్పాటు కలిగించిన చెడీ తాలింఖానా విన్యాసాలు ● కత్తులు తిప్పిన ప్రజాప్రతినిధులు అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అమలాపురం దసరా ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు గురువారం అంబరాన్ని అంటాయి. పట్టణంలోని ఏడు వీధులైన కొంకాపల్లి, మహిపాల వీధి, నల్లా వీధి, గండువీధి, రవణం వీధి, శ్రీరామపురం, రవణం మల్లయ్యవీధిలకు చెందిన దేవతా మూర్తుల వాహనాలతో ఊరేగింపులు వైభవంగా జరిగాయి. జిల్లాలోని వారే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా అమలాపురానికి తరలివచ్చి దసరా ఊరేగింపులను వీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఏడు వీధుల ఊరేగింపుల సమ్మేళనంతో ఉత్సవాలు జరిగాయి. ఊరేగింపుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఉత్కంఠ భరితంగా, గగుర్పాటు కలిగించేలా సాగాయి. కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి ఉదరం, పీకలపై కొబ్బరి కాయలు, కూరగాయలు ఉంచి పట్టా కత్తితో నరికే సన్నివేశాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. అగ్గి బరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములు, బల్లేలతో పోరాటాలు, కర్ర సాముతో సాగిన ప్రదర్శనలతో ఊరేగింపులు హోరెత్తాయి. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీలు గంటి హరీష్మాధుర్, సానా సతీష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పలు వీధుల దసరా ఉరేగింపుల్లో పాల్గొని కొద్దిసేపు సరదాగా కత్తులు తిప్పారు. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఊరేగింపుల్లో పాల్గొని సరదాగా కత్తులు,కర్రలు తిప్పారు. ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏడు వీధుల ఊరేగింపుల వద్ద అడుగడుగునా పోలీసులు వలయంగా మోహరించి ఆయుధాల ప్రదర్శనలతో సాగిన చెడీ తాలింఖానా బృందాలను పర్యవేక్షించారు. ఏడు వీధుల ఊరేగింపులతో అమలాపురం పట్టణం కత్తుల సవ్వడితో హోరెత్తింది. చెడీ తాలింఖానా ప్రదర్శనలకు తోడు ప్రతీ వీధి ఊరేగింపులో శక్తి వేషాలు, తీన్ మార్ డప్పులు ఇలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమలాపురంలో ఊరేగింపులు సాగిన మెయిన్ రోడ్లన్నీ జనం రద్దీతో నిండిపోయాయి. ఇళ్ల అరుగులపై, డాబాలపై ఎటు చూసినా జనమే. వారు ఊరేగింపులను ఉత్కంఠగా, ఉత్సాహంగా తిలకించారు. ఊరేగింపులను వీక్షించిన డీఐజీ ఏడు వీధుల దసరా ఊరేగింపుల సమ్మేళనాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ శుక్రవారం తెల్లవారు జామున వీక్షించారు. గడియారం స్తంభం సెంటరులోని పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వద్ద ఐజీ, ఎస్పీ, ఏఎస్పీలు ఊరేగింపులను దాదాపు గంటన్నర పాటు వీక్షించారు. ఊరేగింపుల్లో భాగంగా రవణం వీధి మహిషాసుర మర్ధినిదేవి ఉత్సవ వాహనానికి ఐజీ, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వారితో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీనికి తోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని సన్నిధికి తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో ఏడు గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. శని, ఆదివారాల్లో కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో శనివారం తిరుచ్చి వాహనం మీద, ఆదివారం టేకు రథ పైన ఉదయం 10 గంటలకు ఊరేగిస్తారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన వేలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగారు. రత్నగిరి తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తులు తమ వాహనాలను మెయిన్ రోడ్డుపై నిలిపివేయడంతో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం -
శంకరగుప్తంపై రీ ఎస్టిమేషన్
మలికిపురం: రాజోలు దీవిలో రైతుల పాలిట దు:ఖ: దాయనిగా మారిన శంకరగుప్తం మేజర్ డ్రైన్ అభివృద్ధిపై తక్షణమే రీ ఎస్టిమేషన్ వేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డ్రైన్ ముంపు, చనిపోయిన లక్షలాది కొబ్బరి చెట్లు, రైతుల దుస్థితిపై ఇటీవల శ్రీసాక్షిశ్రీలో వరుస కథనాలు ప్రచురణ అయ్యాయి. స్పందించిన ప్రభుత్వం రంగంలోంకి దిగింది. డ్రైన్ మరమ్మతులకు ఇప్పటికే అంచనా వేసిన రూ.17 కోట్లు సరిపోవనే అంశాలన్ని కూడా సాక్షి పత్రిక ప్రస్తావించింది. గురువారం మంత్రి నిమ్మల రాజోలు నియోజక వర్గం కేశనపల్లిలో శంకరగుప్తం డ్రైన్ ముంపు వల్ల చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 24 కిలోమీటర్ల పొడవు గల ఈ డ్రైన్లో డ్రైడ్జింగ్తో పాటు పటిష్టంగా ఏటి గట్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందన్నారు. రీ ఎస్టీమేట్ వేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాణసంచా తయారీలో అప్రమత్తం
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం బాణసంచా ప్రమాదంలో భార్య భార్తలు మృతిచెందడం బాధాకరమని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాణసంచా తయారీ, నిల్వ కోసం మంజూరు చేసిన లైసెన్సులు, వాటి రెన్యూవల్ వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల సిబ్బంది తమ పరిధిలోని బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలను తనిఖీ చేయాలని, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విజయ దశమి శుభాకాంక్షలు గురువారం విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజల జీవితాలలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం విజయ దుర్గమ్మ నింపాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెడ్క్రాస్ ఎన్నికలు వాయిదా ఈ నెల మూడో తేదీన నిర్వహించనున్న జిల్లాస్థాయి రెడ్క్రాస్ ఎన్నికలు అని వార్య కారణాలవల్ల వాయిదా వేసినట్టు కలెక్టర్ బుధవారం తెలిపారు. వరుసగా దసరా సెలవులు రావడం, గోదావరి నదికి వరదల వల్ల వాయిదా వేశామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ తెలియజేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఈ నెల ఐదున పంపిణీ చేయనున్న కాత్వా అమలాపురం టౌన్: చదువులో ప్రతిభ కనబరుస్తున్న వెయ్యి మంది పేద కాపు విద్యార్థులకు ఈనెల 5న కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాత్వా) ఆధర్యంలో రూ.70 లక్షల విలువైన స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు జిల్లా కాత్వా అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ చేతుల మీదుగా కాత్వాకు భారీగా విరాళాలు అందజేశారు. అమలాపురంలోని కల్వకొలను వీధిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తాతాజీకి, కాత్వా ప్రతినిధులకు ఆ మొత్తాలను అందించారు. కాపు నాయకులు తాడి నరసింహారావు, బండిగుప్తాపు పాండురంగారావు, బోనం కనకయ్య, గంధం పల్లంరాజు, త్సవటపల్లి నాగబాబు, జయన సత్తిరాజు బూరి విరాళాలు అందించారు. ఈనెల 5న స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో వీటిని పంపిణీ చేయనున్నట్టు కాత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నందెపు శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం గుంటూరు తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్రప్రభు రూ.30 లక్షల విరాళం ఇచ్చినట్లు కాత్వా జిల్లా గౌరవాధ్యక్షుడు పప్పుల శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ఒక కాపు విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందివ్వనున్నారని కాత్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కం మైనర్బాబు తెలిపారు. ఈ సందర్భంగా స్కాలర్ షిప్ల పంపిణీ కర పత్రాలను విడుదల చేశారు. -
అంధుల చదువులపై ఔదార్యం
● విద్యార్థులకు సొంత గూడు ఏర్పాటు ● రూ.60 లక్షలతో లూయీ బ్లైండ్ స్కూల్ ● గత ప్రభుత్వంలో రూ.35 లక్షలు కేటాయింపుసాక్షి, అమలాపురం: అంధ విద్యార్థులకు సొంత గూడు కల్పించాలన్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. అమలాపురంలో సుమారు 25 మంది అంధులు స్థానిక బూపయ్య అగ్రహారంలోని మున్సిపల్ పాఠశాలలో నివసిస్తూ చదువుకుంటున్నారు. రామాయణం శ్రీనివాసరావు రెండు దశాబ్దాలుగా లూయీ అంధుల పాఠశాల పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ బ్రెయిలీలో విద్యా బోధన చేస్తున్నారు. తొలుత ఇక్కడ భవనం తుపానుకు దెబ్బతినడంతో తరువాత రేకుల షెడ్ వేసి నిర్వహించారు. తరువాత వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా, సొంత గూడు కల్పించాలని శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో నాటి మంత్రి పినిపే విశ్వరూప్ను కలిసి అభ్యర్థించారు. చమురు సంస్థలకు చెందిన సీఎస్సార్ నిధులు రూ.20 లక్షలు, ఓఎన్జీసీ నుంచి రూ.పది లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు కేటాయించారు. అలాగే మాజీ ఎంపీ చింతా అనూరాధ రూ.ఐదు లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఇలా మొత్తం రూ.60 లక్షలలో సింహభాగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీ రాజ్ ప్రాజెక్టు విభాగం ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభించి గత ప్రభుత్వ హయాంలోనే ఓ కొలిక్కి తీసుకువచ్చింది. అనంతరం ప్రభుత్వం మారిన తరువాత ఏడాదిన్నర కాలానికి పూర్తి చేశారు. ఈ భవనాన్ని 5,900 చదరపు గజాలలో నిర్మించారు. ఒక గది 40 ఇన్టు 18, మరో గది 22 ఇన్టు 18 చొప్పున నిర్మించారు. విశాలమైన వంట గది ఉంది. ఈ భవనాన్ని బుధవారం రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ప్రారంభించారు. -
జయజయహే మహిషాసుర మర్దని..
రామచంద్రపురం రూరల్/అమలాపురం టౌన్: పంచారామ క్షేత్రాలు.. త్రిలింగ క్షేత్రాలు.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలలో పదో రోజైన బుధవారం అమ్మవారి మట్టి ప్రతిమను ఆ రూపంలో అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని ఆధ్వర్యంలో మేలుకొలుపు, ప్రభాత సేవ, సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, తీర్థపు బిందె, బాలభోగం, ప్రధమాభిషేకం, ప్రధమార్చనల అనంతరం అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శ్రీదేవి ఆలయం, గోల్డ్ మార్కెట్లోని కామాక్షీ ఏకామ్రేశ్వరీదేవి ఆలయం, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని వైష్ణవీ కనకదుర్గ ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని కల్యాణ దుర్గ ఆలయాల్లోని అమ్మవార్లతోపాటు కామాక్షీ పీఠంలోని శ్రీకామాక్షీదేవి మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
ఏడు వీధుల ఊరేగింపునకు పటిష్ట బందోబస్తు
● 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ● కమాండ్ కంట్రోల్ రూమ్తో పర్యవేక్షణ ● జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: అమలాపురంలో గురువారం జరగనున్న ఏడు వీధుల దసరా ఊరేగింపులకు పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఏడు వీధుల ఊరేగింపుల కదిలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు, సోలార్ సీపీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెలు, వీడియోలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో దసరా ఊరేగింపుల నిరంతర పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 500 మందికి పైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో దసరా ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ను కూడా మళ్లించినట్లు తెలిపారు. పట్టణంలోకి ఏ వాహనం రాకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను సూచించామన్నారు. దసరా ఊరేగింపులను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఏడు వీధుల ఉత్సవ కమిటీల ప్రతినిధులు సహకరించాలని ఎస్పీ మీనా విజ్ఞప్తి చేశారు. కమిటీల ప్రతినిధులే అందుకు బాధ్యత వహించాలని సూచించారు. -
రీజెన్సీ తెరిచేందుకు ప్రజా మద్దతు అవసరం
యానాం: రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పునఃప్రారంభానికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ జీఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక ఐఏఎస్ అఽధికారి, ఆర్ఏఓ అంకిత్కుమార్ను ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్తో పాటు ఆయన కలిసారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది క్రితం సీఎం రంగసామితో చర్చించిన అనంతరం రూ.30 కోట్ల పెట్టుబతో మెషినరీ అమర్చినట్టు తెలపారు. గెయిల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో ఆ పైపులు తుప్పుపట్టాయని, వాటికి అయ్యే రూ.80 కోట్ల వ్యయాన్ని తామే భరిస్తామని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వారిని కోరినట్టు తెలిపారు. సంస్థకు సహజవాయువు కేటాయింపుపై అక్టోబర్ 15వ తేదీలోగా ఎంపీల బృందం ప్రధానిని కలవనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సైతం రీజెన్సీ తెరవాలని ప్రజల మద్దతు తెలిసేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2012 జనవరి 27న జరిగిన ఫ్యాక్టరీ విధ్వంసం తదనంతర పరిణామాలు, ఇద్దరు మృతి ఘటనలపై సీబీఐ విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయుడు కోరారు. 665 మంది కార్మికులకు 25 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు సైతం వాటిలో నివాసాలకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో వారితో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పాల్గొన్నారు. సంస్థ ఎండీ జీఎన్ నాయుడు సహజవాయువు కేటాయింపుకై ప్రధానిని కలవనున్న ఎంపీల బృందం -
పగబట్టి పోటెత్తినట్టు
సాక్షి, అమలాపురం: గోదావరి వరద కష్టాలు వీడడం లేదు. జూలైలో మొదలైన వరద అక్టోబరు వచ్చినా కొనసాగుతోంది. ఈ ఏడాది భారీ వరద లేకున్నా ఒకసారి రెండో ప్రమాద హెచ్చరిక.. మరో నాలుగు సార్లు తొలి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. వరద వచ్చిన ప్రతిసారి గోదావరి నదీపాయల మధ్య ఉన్న లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. గోదావరి మరోసారి పోటెత్తింది. జిల్లాలోని లంక గ్రామాలను వరద చుట్టు ముడుతోంది. 48 గంటల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. సోమవారం రాత్రి ఆరు గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువునకు 9,59,784 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఇది బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ==== క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వరదలకు మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వేపై రాకపోకలు నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు నిలిచిపోయాయి. మామిడికుదురు నుంచి ఉచ్చులవారిపేట మీదుగా కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. పి.గన్నవరం, అయినవిల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో వరద ముంపు కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేల్లంక, గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ గేదెల్లంక, చింతపల్లిలంకల్లోని లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరింది. స్థానికులు మోకాలు లోతు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం మత్స్యకారకాలనీ నీట మునిగింది. ఇళ్ల మధ్యకు నీరు చేరడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం కాజ్వే నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. రైతులకు అంతులేని నష్టం గోదావరికి ఐదుసార్లు తాకిన వరద లంక గ్రామాల్లోని ఉద్యాన రైతుల వెన్ను విరిచింది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 2,674 మంది రైతులకు చెందిన 2,216.82 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.2.4 కోట్లు ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, కపిలేశ్వరపురం మండలాల్లో కూరగాయ పంటలు, పశుగ్రాసాలు అధికంగా నష్టం వాటిల్లింది. ● మామిడికుదురు, ఐ.పోలవరం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వెనామీకి నష్టం వాటిల్లింది. వరదలకు భయపడి కౌంట్కు వస్తున్న రొయ్యలను మధ్యలో పట్టుబడులు చేయాల్సి వచ్చింది. నిలిచిన రేవు ప్రయాణాలతో కష్టాలు జిల్లాలో కోటిపల్లి–ముక్తేశ్వరం, సఖినేటిపల్లి–నర్సాపురం, జి.మూలపొలం–పల్లంకుర్రు, సోంపల్లి–అయోధ్యలంక, చాకలిపాలెం–దొడ్డపట్ల రేవుల్లో ప్రయాణాలు నిలిపివేశారు. పంటులు, పడవల మీద రాకపోలు నిలిపివేయడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి, రామచంద్రపురం వెళ్లేవారు ఎక్కువ. పంటు దాటితే రామచంద్రపురం 17 కిలో మీటర్ల దూరం, అటువంటిది ఇప్పుడు 60 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. సఖినేటిపల్లి నుంచి నర్సాపురం రేవు మీదుగా 9 కిలో మీటర్లు కాగా, ఇప్పుడు 25 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది. లంకాఫ్ ఠాన్నేల్లంక మత్స్యకార కాలనీలో జ్వరంతో ఇబ్బంది పడుతున్న మహిళను ఎత్తుకుని తీసుకువస్తున్న స్థానికుడుసఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక నుంచి టేకిశెట్టిపాలెం వెళ్లే రహదారిపై వరద నీరుపడలవ మీదనే ప్రయాణం పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, బూరుగులంక, ఊడిమూడిలంక గ్రామ వాసుల వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది జులై చివరి వారంలో వరద మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 3,500 మందికి పైగా జీవిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అనారోగ్యం బారిన పడినవారు ఎవరైనా సరే పడవ మీదే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు, పశుగ్రాసాలు, రోజువారి పాల విక్రయాలు ఇలా సర్వం పడవల మీదనే తరలించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. పి.గన్నవరం మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయిలంక, అనగారిలంక, శిర్రవారిలంక, అయోధ్యలంక, పుచ్చలంక వాసులు, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక వాసులు కాజ్వేలు మునిగిన ప్రతిసారి పడవలను ఆశ్రయించాల్సి రావడంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. కోనసీమ లంకల్లో వీడని వరద ముంపులో నానుతున్న గ్రామలు ఆ నాలుగు గ్రామాలకు మూడు నెలలుగా ఇదే పరిస్థితి మునుగుతున్న కాజ్ వేలు.. రోడ్లు ప్రయాణాలన్నీ పడవల పైనే పలుచోట్ల ఆగిన రేవు ప్రయాణాలు ఉద్యాన పంటలు.. పశుగ్రాసాలు.. వెనామీ రొయ్యలకు నష్టం -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పి.గన్నవరం: స్థానిక ఏటిగట్టు సెంటర్లో మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు సమీపంలోని బట్టాయగూడెంనకు చెందిన షేక్ నాగూర్ మీరా (50) 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి డీఎస్ పాలెంలో నివసిస్తున్నాడు. మంగళవారం, శుక్రవారాల్లో అతడు షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఏటిగట్టు సెంటర్లో షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేసి, మూడు రోడ్ల సెంటర్కు సైకిలుపై వస్తుండగా అతడిని వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద స్థానికులు అడ్డుకుని లారీని ఆపారు. మృతదేహం వద్ద అతడి భార్య జీ బాషా బోరున విలపించింది. అందరితో కలివిడిగా ఉండే నాగూర్ మీరా ప్రమాదంలో మృతి చెందడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు. రైల్వే ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి.. తుని రూరల్: అన్నవరం రైల్వే రెండవ ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ తుని ఎస్సై పి.వాసు మంగళవారం తెలిపారు. ప్లాట్ఫాంపై బెంచీ కింద మరణించి ఉన్న వ్యక్తి శరీరంపై నలుపు రంగు టీ షర్టు, నీలం రంగు ట్రాక్ ఉన్నాయన్నారు. మృతుడికి కొంతదూరంలో కాఫీ రంగు బ్యాగ్ ఉందన్నారు. ఎవరైన గుర్తిస్తే జీఆర్పీకి 9490619020 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్సీ మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాం తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామన్నారు. పాము కాటుకు మహిళ.. ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని ధారపల్లిలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం మేరకు బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని బాపన్నధారకు చెందిన బుట్టారి సన్యాసిరావు, లోవకుమారిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ధారపల్లిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి బుట్టారి లోవకుమారి తన ఇంటిలోనే నేలపై నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాము కాటుకు గురైంది. ఆమెను బంధువులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు భర్త బుట్టారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విరిసిన ధరలు!
కడియం: మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్లో దసరా సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల అలంకరణలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో పువ్వుల ధరలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా దసరా అలంకరణలో వినియోగించే బంతి, చామంతి తదితర రకాల ధరలు పెరిగాయని వివరించారు. స్థానికంగా పువ్వుల దిగుబడులు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా పువ్వులు దిగుమతి అయ్యాయని వ్యాపారులు తెలిపారు. మంగళవారం కడియపులంక పువ్వుల మార్కెట్లో కేజీ చామంతులు రూ.150 నుంచి రూ.200 ధర పలికాయి. లిల్లీలు రూ.400, మల్లెపువ్వులు రూ.1,500, జాజులు రూ.1,000, కాగడాలు రూ.1,100, బంతి రూ. 100 నుంచి రూ.130, కనకాంబరం బారు రూ.270–రూ.300 ధర పలికాయి. -
గురువు మార్గదర్శకత్వం అవసరం
సహస్రావధాని గరికపాటి రాయవరం: సన్మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరికీ గురు మార్గదర్శకత్వం అవసరమని, అప్పుడే దైవానుగ్రహానికి దగ్గరవుతామని సాగరఘోష కవి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్మాత్మిక ప్రసంగం చేస్తూ తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అన్నారు. తల్లిదండ్రులను, గురువును ఆరాధించడం భగవంతుడిని ప్రార్థించడం కంటే గొప్పదన్నారు. ఐశ్వర్యం, భోగభాగ్యాలు అశాశ్వతమని, గురువు చూపిన మార్గంలో పయనిస్తే దైవానుగ్రహానికి దగ్గరవుతారన్నారు. విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చూపిన దారిలో భక్తులు నడవాలన్నారు. మరో సాహితీవేత్త మహామహాపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మతత్వాన్ని వివరించారు. పీఠంలో ఆర్డీవోల పూజలు కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు శ్రీకర్, అఖిల దంపతులు మంగళవారం విజయదుర్గా పీఠాన్ని సందర్శించారు. అనంతరం పీఠంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పీఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. విజయదుర్గా అమ్మవారి ఆశ్శీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు. -
నోట్ల పెళపెళ.. లక్ష్మీ కళకళ!
పిఠాపురం: మండలంలోని రాపర్తిలో వేంచేసియున్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని రూ.15 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. సరస్వతీదేవి, ఐశ్వర్యలక్ష్మిగా..అయినవిల్లి: మండలంలోని నల్లచెరువు గ్రామంలో కొలువైన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారు మంగళవారం సరస్వతీదేవి, ఐశర్యలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు ఉదయం అమ్మవారిని పెన్నులతో సరస్వతీదేవిగా అలంకరించారు. మధ్యాహ్నం అమ్మవారిని రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు. -
డీఎస్సీలో విజయం సాధించిన హాకీ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డీఎస్సీ–2025లో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో హాకీ కోర్టులో కోచ్ రవిరాజు వద్ద తర్ఫీదు పొందుతున్న నలుగురు క్రీడాకారిణులు పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన జి.వరలక్ష్మి, డీఎస్ సింధు దేవి, ఎస్.పరంజ్యోతి, కె.భారతి ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. వీరు అనేకసార్లు రాష్ట్ర చాంపియన్షిప్ సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన క్రీడాకారిణులను, తర్ఫీదునిచ్చిన కోచ్ రవిరాజును డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్ మంగళవారం డీఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. -
ప్రాణాలు తీసిన బాణసంచా
● భార్యాభర్తల మృత్యువాత ● విలస గ్రామంలో విషాద ఛాయలు అయినవిల్లి: దీపావళి పండగకు కిరాణా సామగ్రితో పాటు బాణసంచా అమ్ముకుని నాలుగు రూపాయలు వెనుక వేసుకుందామనే ఆశ ఆ భార్యాభర్తలను బలిగొంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా పేలి కంచర్ల శ్రీనివాసరావు (51). అతని భార్య సీతామహా లక్ష్మి(46) మృత్యువాత పడ్డారు. కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు గతేడాది దీపావళికి అమ్మగా మిగిలిన బాణసంచా సామగ్రిని ఇంటి అటక పై నుంచి తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి వారి ఇంటిపై శ్లాబు, ప్రహరీ కూలింది. పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరారు. వారి కుమారుడు ప్రదీప్ గాయపడ్డాడు. అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అమలాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర మురళీకృష్ణ, సీఐ ఆర్. భీమరాజు, ఎస్ఐ హరికోటి శాస్త్రి పరిళీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న భార్యాభర్తల మృతదేహాలను అంబులెన్స్లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి ఎస్సై హరికోటిశాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పి.గన్నవరం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లైసెన్సు కలిగిన గోడౌన్స్లోనే బాణసంచా భద్రపరచాలి: ఎస్పీ బాణసంచా సామగ్రి లైసెన్సు పొందిన గోడౌన్స్లోనే భద్రపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. లైసెన్సు లేకుండా బాణసంచా సామాగ్రి నిలువ ఉంచడం, తయారు చేయడం నేరమన్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఇలా బాణసంచా నిలువ ఉంచితే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయని ఆయన హెచ్చరించారు. శిథిలాల మధ్య ఉన్న కంచర్ల శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు పేలుడు శబ్దానికి కూలిన ఇంటి శ్లాబు, ప్రహరీ -
శ్రీ దుర్గాదేవిగా అమ్మవార్ల దర్శనం
అమలాపురం టౌన్: శరన్నవ రాత్ర మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు దుర్గాదేవిగా అలంకృతమై భక్తులకు దర్శనిమిచ్చారు. స్థానిక శ్రీదేవి ఆలయం, కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని వైష్ణవీ కనకదుర్గ ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని కల్యాణ దుర్గ ఆలయం, గోల్డ్ మార్కెట్లోని శ్రీకామాక్షీ ఏకాంబరేశ్వరీదేవి ఆలయాల్లో అమ్మవార్లు శ్రీదుర్గా దేవిగా అలంకృతమై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో కుంకుమ పూజలు, హోమాలు వైభవంగా సాగాయి. కాజేసిన మొత్తం రూ.95 లక్షలు కరప: కూరాడలో వేళంగి ఎస్బీఐ బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) చిన్నం ప్రియభారతి మొత్తం రూ.95 లక్షల మేర మహిళాశక్తి సంఘాల సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయ్యిందని వెలుగు ఏపీఎం ఎంఎస్బీ దేవి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 66 గ్రూపుల సభ్యులు బాధితులుగా ఉన్నారని చెప్పారు. కూరాడ గ్రామస్తులతో కలసి ఏపీఎం సోమవారం 39 గ్రూపులను తనిఖీ చేయగా బీసీ రూ.52 లక్షలు కాజేసిందని గుర్తించారు. మిగిలిన గ్రూపుల అకౌంట్లను మంగళవారం ఏపీఎం తనిఖీ చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలున్నాయి. వీటిలో 40 గ్రూపుల వారు వేళంగిలోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్రాంచిల్లో తాము తీసుకున్న రుణాల సొమ్ము జమ చేశారు. అక్కడకు వెళ్లలేని మిగిలిన 66 గ్రూపుల వారు కూరాడలోని ఎస్బీఐ బీసీ పాయింట్లో సొమ్ము చెల్లించేవారు. ఈ బీసీ పాయింట్ను ఆ గ్రామానికి చెందిన చెందిన ప్రియభారతి నిర్వహిస్తోంది. యానిమేటర్గా ఉన్న తన తల్లి మంగ సహకారంతో మహిళాశక్తి సంఘాలు చెల్లించే పొదుపు, వాయిదాల సొమ్మును ఆమె కాజేసింది. ఎన్ని రోజులైనా ఇంకా బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు మహిళాశక్తి సంఘాల సభ్యులకు చెప్పడంతో విషయం బయటపడింది. దీనిపై ఈ నెల 27న ‘మహిళాశక్తి సంఘాల సొమ్ము గోల్మాల్’, 30న ‘తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు’ శీర్షికలతో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తానూ తగ్గేది లేదంటున్న రజతం పరుగు పందెంలో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన గతంలో కొనుగోలు చేసిన వారిలో నిండుకున్న జోష్ నెల రోజుల్లో 10 గ్రాములకు రూ.20 వేలు పెరుగుదల ఉమ్మడి జిల్లాలో రోజుకు 20 కేజీల బంగారం అమ్మకాలు -
చేనేత కార్మికులను విస్మరిస్తే చరిత్రను విస్మరించినట్టే..
కపిలేశ్వరపురం: భారతీయ నైపుణ్యం, సంప్రదాయాలకు ప్రతీకగా చేనేత వృత్తి విరాజిల్లిందని, అంతటి ప్రాశస్త్యం గల చేనేత కార్మికులను విస్మరిస్తే చరిత్రను విస్మరించినట్టే అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. తమ చేనేత సంఘానికి వివిధ పథకాల ద్వారా రావాల్సిన రాయితీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం ఎదుట రిలే నిరాహా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు ఎమ్మెల్సీ తోట సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు అడ్డాల శ్రీనివాస్తో కలిసి చేనేత కార్మికుల నిరసన శిబిరంలో పాల్గొన్నారు. శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3.85 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయకపోతే సంఘం నిర్వహణ అగమ్య గోచరమవుతుందంటూ నేత కార్మికులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నేతన్నకు ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సాయాన్ని, రెండు వందలు యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అమలు చేయలేదని విమర్శించారు. వైస్ ఎంపీపీ గుణ్ణం భానుప్రసాద్, గుడిమెట్ల రాంబాబు, శలా సుబ్రహ్మణ్యం, మత్సా గణేశ్వరరావు, శలా వీర్రాజు, తేలు సత్యనారాయణ, బళ్లా కోటేశ్వరరావు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట -
తగ్గుతూ... పెరుగుతూ...
లంకవాసులతో వరద దోబూచులాట ఐ. పోలవరం/ పి.గన్నవరం/ అయినవిల్లి/ మామిడికుదురు: గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ లంక వాసులతో దోబూచులాడుతోంది. అసలు సెప్టెంబర్ నెలాఖరున వరద రావడమే అరుదైన విషయం అనుకుంటే వరద వచ్చి తగ్గి తిరిగి మళ్లీ పెరుగుతుండటం మరింత అరుదైన విషయంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి ఆరు గంటలకు గోదావరి వరద 9,59,784 క్యూసెక్కులుగా ఉంది. ఆ తర్వాత నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. రాత్రి 7 గంటల సమయంలో ఇది 9,77,625 క్యూసెక్కులకు పెరిగింది. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు 10.09 లక్షలకు, ఆరు గంటలకు 10.14 లక్షలకు, 10 గంటలకు 10.20 లక్షలకు, 12 గంటలకు 10.25 లక్షలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు 10.30 లక్షలకు, రెండు గంటలకు 10.35 లక్షలకు, సాయంత్రం 6 గంటలకు 10,90 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వదర తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో వరద పెరగడం లంక వాసులను ఇబ్బందులు పాలు చేస్తోంది. పి.గన్నవరం మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయలంక, అనగారిలంక, శిర్రావారిలంక, అయోధ్యలంకలకు చెందినవారు పడవల మీదే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. గంటి పెదపూడిలంక, బూరుగులంక, ఉడుమూడిలంక, అరిగెలవారిపేటలకు ఇప్పటికే పడవల మీద రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తాజా వరదకు కనకాయిలంక కాజ్ వేతో పాటు మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం, సఖినేటిపల్లి మండలం అప్పనిరామునిలంక కాజ్వేలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎదురుబిడియం కాజ్వేపై పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం మండలం లంకా ఆఫ్ ఠాన్నేల్లంక, కమిని, గురజాపులంక, కాట్రేనికోన మండలం పల్లంకురు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకార కాలనీల్లో ఇళ్ల మధ్యకు వరద నీరు వచ్చి చేరింది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు, తోటల్లో వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వరద తాకిడికి గురి కావడం వల్ల లోతట్టు లంక పొలాల్లోని కూరగాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎగువన పెరుగుతున్న వరద ప్రభావం దిగువన కోనసీమ లంక గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి కనిపించనుంది. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 12.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న ముంపు మరింత పెరగనుంది. అప్పనపల్లి కాజ్వే మీద రాకపోకలు నిలిపివేసే అవకాశముందని అంచనా. జిల్లాలో కోటిపల్లి– ముక్తేశ్వరం, సఖినేటిపల్లి– నర్సాపురంతోపాటు పలు రేవుల్లో పడవ ప్రయాణాలను నిలిపివేశారు. -
వైద్యవిద్యలో పీపీపీ పద్ధతి వద్దు
ఈదరపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాజీ మంత్రి సూర్యారావు, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులుఅమలాపురం మండలం ఈదరపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ మంత్రి సూర్యారావు, కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్: ‘విద్య, వైద్యం, ప్రజారోగ్యం వంటి కీలక రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య విద్యను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అమలాపురం మండలం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ నాయకులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విలువైన ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వారికి అతి చౌకగా కట్టబెట్టేందుకే పీపీపీ విధానం అంటోందని ఎద్దేవా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, మేధావులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదలు డాక్టర్లు కావాలనేది జగన్ లక్ష్యం మాజీ మంత్రి, రాజోలు పార్టీ సమన్వయకర్త గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు మరే ముఖ్యమంత్రి చేయని విధంగా వై.ఎస్.జగన్ 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సంపదను కార్పొరేట్, పారిశ్రామికవేత్తలకు పప్పు బెల్లాల మాదిరిగా కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేద విద్యార్థులు చదువుకుని డాక్టర్లు కావాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసి ఇప్పటికే ఐదింటిని ప్రారంభించారన్నారు. కూటమి ప్రభుత్వానికి పేదలు చదువుకోవడం ఇష్టం లేదన్నారు. మెడికల్ సీట్లు రాష్ట్రానికి అవసరం లేదని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అన్నారు. జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్రావు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే ఆశయం కలగానే మిగిలిపోతుందన్నారు. లీజు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి పి.గన్నవరం కోఆర్టినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ఉద్దేశం ప్రభుత్వ సొమ్మును పెట్టుబడిదారుల పరం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం వాటాతో నిర్మించిన ఈ భవనాలను ప్రైవేట్ వారికి 60 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్ చదువుకునేందుకు జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నిర్మిస్తే వాటిని చంద్రబాబు పెత్తందారులకు అమ్మేస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరిరామ్గోపాల్, మట్టా శైలజ, ముమ్మిడివరం మున్సిపల్ చైర్ పర్సన్ కమిడి ప్రవీణ్, ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు బద్రి బాబి, వైస్ ఎంపీపీ పోలమూరి బాలకృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ ఉండ్రు బాబ్జి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులు సరెళ్ల రామకృష్ణ, సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శులు ఉండ్రు వెంకటేష్, చెట్ల రామారావు, పార్టీ అధికారి ప్రతినిధులు సూధా గణపతి, కాశి రామకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాముల ప్రకాష్, జిల్లా ఆర్గనైజషన్ కార్యదర్శి చింతా రామకృష్ణతోపాటు పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు గెడ్డం కిరణ్, కొల్లాబత్తుల సతీష్బాబు, సాధనాల రమేష్, కుంచే సుభాష్, ఈతకోట శ్రావణ్, పెయ్యల సాయి, కుంచే స్వామి, కోరుకొండ కిరణ్, పినిపే బుజ్జి, పరమట శ్రీను, బళ్ళ శ్యామ్, కోటుం స్వర్ణ శేఖర్, నక్కా సంపత్ పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ -
అంతిమంగా నిజమే గెలుస్తుంది
మిథున్రెడ్డికి బెయిల్పై ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావడం ద్వారా ఆయనపై పెట్టిన అక్రమ కేసు కూడా వీగి పోయి ఆనక అంతిమంగా నిజమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ న్యాయం లేదు. చట్టం లేదు. ఇవే అక్రమాలతో రోజులు గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాగించలేదని చెప్పారు. మిథున్రెడ్డిపై పోలీసులు మోపిన అక్రమ అభియోగాలు రుజువు కానంత వరకూ ఆయన నిర్ధోషేనని, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టామన్న కూటమి ప్రభుత్వ తాత్కాలిక ఆనందం త్వరలోనే ఆవిరై పోతుందన్నారు. ఆయన బెయిల్తో బయటకు రావడంతో చంద్రబాబు, లోకేష్ల ఆనందం ఇప్పటికే కొంత ఆవిరైందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ పాల్గొన్నారు. -
ఈవీఎంలతో ఓట్ల దుర్వినియోగం
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు డిమాండ్ అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓట్ల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏవీఎంల విధానం వద్దు.. దాని స్థానే మాన్యువల్ విధానమైన బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్, పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ అనేక ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఓట్ల అక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పరంగా వైఎస్సార్ సీపీకి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ సంతకాలను సేకరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, యార్లగడ్డ రవీంద్ర, కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా అమలాపురం ప్రెస్క్లబ్ భవనంలో ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం రుద్రరాజు రూ.25 వేల చెక్కును ప్రెస్క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. -
అంతర పంటగా అశ్వగంధను సాగు చేయొచ్చు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆయిల్పామ్ తోటల్లో మూడేళ్ల వరకూ అశ్వగంధను అంతర పంటగా సాగు చేయవచ్చని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించి అశ్వగంధ పంటను ఆయిల్పామ్లో అంతర పంటగా సాగు చేయడానికి, అధిక దిగుబడులు పొందడానికి, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఉన్న అవకాశాలను విశ్లేషించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ అన్ని నేలల్లో అశ్వగంధ వేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా అశ్వగంధ సాగుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తామన్నారు. అశ్వగంధ పంట మార్కెటింగ్, బైబ్యాక్ విధానాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలను విశ్లేషించి ఆయిల్ఫెడ్ సలహాదారుడు ఎ.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదాను రూపొందించడానికి నిర్ణయించారు. నిర్కా సంస్థ పరిధిలో చేస్తున్న మిరప, పసుపు పంట ఉత్పత్తులను తెలంగాణ ఆయిల్ఫెడ్ వారి విజయబ్రాండ్ స్టోర్స్లో చేర్చి అమ్మడానికి ఉన్న అవకాశాలను చర్చించి ఎంఓయూ ఏర్పాటు చేసి సంయుక్తంగా ముందుకెళ్లాలని రెండు సంస్థలు నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ ఆయిల్ఫెడ్ అధికారులు టి.సుధాకరరెడ్డి, ఎన్.శ్రీకాంత్రెడ్డి, అభ్యుదయ రైతులు భాస్కర్, అప్పారావు, నిర్కా సంస్థ విజన్ హెడ్స్ కె.సరళ, రాజశేఖర్, ఎల్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్తలు కస్తూరి, సుబ్బయ్య, సుమన్కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ఐరావతం.. చూసొద్దాం
ఫ గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రసిద్ధి ఫ దసరా రోజున భారీ ఊరేగింపు ఫ పోటీపోటీగా ఉత్సవాల నిర్వహణ కాజులూరు: దసరా.. ప్రతి పల్లెకూ ఓ విశిష్టతే. అందరికీ ప్రత్యేకతే. అచ్చం అలానే కాజులూరు నియోజకవర్గం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రఖ్యాతి గాంచింది. ఏటా విజయ దశమిని పురస్కరించుకుని ఇక్కడ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా ప్రతి గ్రామంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే గొల్లపాలెంలో పాత మార్కెట్ సెంటర్ వద్ద రామాలయం సమీపంలో మాత్రం శరన్నవరాత్ర రోజుల్లో భేతాళునికి పూజలు నిర్వహించడం విశేషం. చివరి రోజు దసరా పండగ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామ వీధుల్లో చిన్న ఏనుగు ప్రతిమను, రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ట్రాక్టరుపై పెద్ద ఏనుగు ప్రతిమను ఊరేగిస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఈ సంబరం నిర్వహిస్తుండడం విశేషం. ఐరావతాన్ని తలపించేలా తెల్లని వస్త్రం, ఎండు గడ్డితో తయారు చేసిన ఏనుగు ప్రతిమలకు పెద్ద, పెద్ద చావిళ్లు నిర్మించి ఏడాది పొడవునా స్థానికులు వాటిని పరిరక్షిస్తుంటారు. విజయ దశమికి 10 రోజుల ముందు ఏనుగు ప్రతిమలను బయటకు తీసి శుభ్రం చేసి మెరుగులు దిద్ది ప్రత్యేక పూజలు చేసి సంబరం చేస్తారు. ఈ గ్రామంలోని వెలమ కులస్తుల ఆధ్వర్యంలో చిన్న ఏనుగు సంబరం, కాపు, బలిజ కులస్తుల సారథ్యంలో పెద్ద ఏనుగు సంబరం చేస్తుంటారు. చిన్న ఏనుగును ఎడ్లబండి మాదిరి బండిపై ఉంచి భక్తులు జేజేలు పలుకుతూ తోసుకుంటూ ముందుకు సాగుతారు. పెద్ద ఏనుగునైతే ట్రాక్టర్పై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఎండు గడ్డి, తెల్లని వస్త్రం, తదితర వస్తువులతో తయారు చేసిన భారీ ఏనుగుల ప్రతిమలను ఊరేగించే సమయంలో వేలాది మంది ముందుకు సాగుతుంటారు. భేతాళుని రూపంలో భక్తులు ఏనుగుల ప్రతిమలకు పూజలు చేస్తుంటారు. గరగ నృత్యాలు, కోయ డ్యాన్సులు, గారడీ, బ్యాండ్ మేళాలతో ఈ ఊరేగింపు కోలహలంగా సాగుతోంది. ఇరువర్గాల వారూ పోటీపోటీగా సంబరం నిర్వహిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ సంబరాల్లో ఘర్షణలు జరిగేవి. పెద్దలు సఖ్యత కుదిర్చడంతో ఇటీవల ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారు. అలాగే బాణసంచా కాల్పులకు ప్రత్యేకత ఉంది. రాత్రి మిరిమిట్లు గొలుపేలా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం అనాదిగా వస్తుంది. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం ఈ పండగకు తిరిగి గ్రామానికి రావడం జరుగుతోంది. –టేకుమూడి దుర్గారావు, స్థానికుడు సంప్రదాయాలను కొనసాగిస్తూ.. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కాస్త తీరిక దొరికితే సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పండగలు, సంబరాలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన ఆచారాలను తెలిపేలా పురాతన సంప్రదాయాలు కొనసాగిస్తూ నేటికీ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అభినందనీయం. –జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు -
భర్త ఆత్మహత్య
సీతానగరం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాగంపల్లికి చెందిన గుడాల ప్రసన్న కుమార్ (34) భార్యపై అనుమానం పెంచుకుని మనస్థాపంతో ఉన్నాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిలోకి వస్తానని చెప్పి రాకపోవడంతో స్థానికులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లంపల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు -
సరస్వతీ కటాక్షంతో విజయం తథ్యం
విజయదుర్గా పీఠం పీఠాధిపతి గాడ్ రాయవరం: సరస్వతీ కటాక్షం ఉంటే విజయం తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగిస్తూ.. జ్ఞానప్రదాయినిగా ఉన్న సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. జ్ఞాన సంపన్నులుగా మెలగాలంటే మంచి వాక్శుద్ది లభించాలన్నారు. అమ్మవారి దయకు పాత్రులు కావాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పీఠం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. పీఠంలో విజయదుర్గమ్మ వారిని సరస్వతీమాత అవతారంలో అలంకరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వేణుగోపాల్, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమా తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సరస్వతీదేవికి పూజలు చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ విజయదుర్గా పీఠంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. చీమలకొండ వీరావధాని, శివ, చక్రవర్తుల మాధవాచార్యులు, గండికోట సూర్యనారాయణ అర్చకత్వంలో చిన్నారులు సరస్వతీ అష్టోత్తర సహస్రనామాలతో సామూహిక సరస్వతీ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు సరస్వతీదేవి ప్రతిమను, రక్షాబంధనాన్ని ప్రసాదంగా అందజేశారు. -
దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృతి
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ కాకినాడ క్రై: గంజాయి క్రయ, విక్రయాలతో పాటు తరలింపులో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ బిందుమాధవ్ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఒక ఇన్నోవా వాహనం అనుమానాస్పద రీతిలో పోలీసులను, టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని దూసుకుని వెళ్లినట్టు ఆ వాహనం కదలికలపై నిఘా ఉంచాలని విశాఖ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. విశాఖ పోలీసులు తెలిపిన వాహనాన్ని జగ్గంపేట సర్కిల్ పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఈ నెల 23న మధ్యాహ్నం గుర్తించారు. కారును ఆపే క్రమంలో డ్రైవర్ కారులో నుంచి పోలీసులతో పోరాడాడు. ఈ క్రమంలో కారు అద్దాలు బద్దలైనా లెక్కచేయకుండా ప్రత్తిపాడు వైపు వేగంగా దూసుకుపోయాడు. అయితే ఈ పెనుగులాటలో పోలీసులకు డ్రైవర్ సెల్ఫోన్ లభ్యమైంది. ఆ వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు, వెనుక సీట్లో పోలీస్ యూనిఫాం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉందని నిర్ధారించుకున్నారు. ప్రత్తిపాడు వైపు వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించగా, కొంత దూరంలో ఆ వాహనం మిస్సైంది. ఇదిలా ఉంటే టోల్ప్లాజా వద్ద ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కిర్లంపూడిలో పైడితల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న రోడ్డుపై వెళుతున్న కారు నుంచి పడిపోయిన రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పూటేజీల ఆధారంగా టోల్ప్లాజా వద్ద రచ్చ చేసిన కారు నుంచే ఈ ప్యాకెట్లు పడ్డాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. సాంకేతికత, ఈగల్ టీమ్ సహకారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కారును ట్రాక్ చేసే పనిలో పడింది. పోలీసుల కష్టం ఫలించి కారు కిర్లంపూడి మండలం రాజుపాలెం సమీపంలో ఒక రావిచెట్టు వద్ద లభ్యమైంది. కారుతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాజస్థాన్కు చెందిన వారని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగలకు వ్యాపారం నిమిత్తం వచ్చారని గుర్తించారు. వ్యాపారం ముసుగులో విశాఖ, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్ తరలిస్తున్నట్టు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అలాగే జొన్నాడ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది, పోలీసులను గాయపరిచిన ఘటనలో భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 175 కిలోల గంజాయితో పాటు ఇన్నోవా కారు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరంలో ఏడుగురు భాగస్వాములు అయినట్టు గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు.కొత్తపేట: దసరా సెలవులకు తమ కొడుకు ఇంటికి వచ్చాడని ఆనందించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని ఘటన కడుపుకోతను మిగిల్చింది. సెలవులకు కళాశాల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి, స్నేహితులతో సరదాగా గోదావరిలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నిలిపింది.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మండలం వానపల్లి శివారు నక్కావారిపేటకు చెందిన నక్కా రాంబాబు, కుమారి దంపతుల కుమారుడు అఖిల్ (19) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అఖిల్ దసరా పండగ సందర్భంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం తన తమ్ముడు, నలుగురు స్నేహితులతో కలసి ఇంటికి సమీపంలోని గోదావరి తొగరిపాయలో స్నానానికి వెళ్లాడు. అక్కడ ఒక అరటి బొంద కనిపిస్తే దానిపై అఖిల్తో పాటు యడ్ల రవితేజ అనే విద్యార్థి ఎక్కి ఈతకొడుతూ జారిపోయి గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే మత్స్యకార కాలనీ వాసులు గమనించి వెంటనే గోదావరి పాయలో దూకి గల్లంతైన విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చగా, వారిలో అఖిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై స్థానిక ఎస్సై జి.సురేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనలా కుమారుడు కాకూడదని.. నక్కావారిపేటకు చెందిన నక్కా రాంబాబుది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. అతను కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. ఇందులో అఖిల్ పెద్ద కుమారుడు. తన కుమారులు కూలి పనికి వెళ్లకుండా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలనే కోరికతో డబ్బు ఖర్చయినా గాని భీమవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్చి చదివిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి తనకు పేరు తెస్తాడని ఆశించాడు. అఖిల్ దసరా సెలవులకు వచ్చి ఇలా మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు నింపింది. -
యువకుడి బలవన్మరణం
సీతానగరం: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై డి.రామ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సీతానగరం మండలం మునికూడలికి చెందిన మురాల అనిల్దేవ (22) వెల్డర్గా పని చేస్తున్నాడు. తల్లి కువైట్లో ఉండటంతో అమ్మమ్మ నూకతట్ల సుభద్రమ్మ వద్ద ఉంటున్నాడు. ఉదయం పనిపై వేరే వీధిలోకి సుభద్రమ్మ వెళ్లగా, ఇంట్లో ఫ్యాన్కు అనిల్దేవ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
శిక్షణకు వచ్చేసారు
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఉంటుంది. భోజన వసతితో పాటు ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందే కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో శిక్షణకు హాజరు కావాల్సిందే. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మొత్తం ఏడు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ● డీఎస్సీ–2025 ఉపాధ్యాయులకు బోధనలో మెళకువలు ● ఉమ్మడి జిల్లా పరిధిలో 1,698 మందికి తరగతులు ● వచ్చే నెల 3 నుంచి 10 వరకూ నిర్వహణ ● చివరి రోజు శిక్షణ కేంద్రాల్లోనే పోస్టింగ్ ఆర్డర్లు రాయవరం: డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,352 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే నాలుగు పోస్టులకు అర్హులు లేక 1,349 పోస్టులకు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే జోన్–2 పరిధిలోని 347 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు (పీజీటీ)కు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 1,698 మందికి ఏడు చోట్లలో శిక్షణ ఇస్తారు. విధుల్లో చేరే ముందే కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలు నేర్పేందుకు సబ్జెక్టుల వారీగా సమాయత్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలోనే ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం శిక్షణ ప్రధాన ఉద్దేశం. అలాగే విద్యా శాఖ ప్రవేశపెట్టిన విధి విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యాహక్కు, బాలల హక్కు చట్టాలు, అందులోని ముఖ్య విషయాలను తెలియజేయడం, బాధ్యతలు వివరించడం, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మూల్యాంకన విధానాలు నేర్పించడం, డిజిటల్ టూల్స్, టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయడం, వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం తదితర అంశాలపై వీరికి 8 రోజుల శిక్షణలో అవగాహన కల్పిస్తారు. 10న పోస్టింగ్ ఆర్డర్లు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. 527 మంది ఎస్జీటీలు, 132 మంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, 211 మంది ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, 236 మంది ఎస్ఏ తెలుగు, ఇంగ్లిషు, హిందీ, 245 మంది ఎస్ఏ గణితం, పీఎస్, బయాలజీ టీచర్లకు శిక్షణ ఇస్తారు. వీరితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఎంపికై న పీజీటీలకు కూడా రాజమహేంద్రవరంలోనే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరం చివరి రోజు 10న ఆయా శిక్షణ కేంద్రాల్లోనే కౌన్సెలింగ్ ఏర్పాటు చేసి, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 13న నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరాల్సి ఉంటుంది. రిలీవ్ కానున్న బదిలీ ఉపాధ్యాయులు చాలా రోజులుగా ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు కోరుకున్న స్థానాల్లో నేటికీ చేరలేదు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో బదిలీ జరిగిన ఉపాధ్యాయులనే వెనక్కి పంపించిన అధికారులు పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల చేరికతో బదిలీ అయి రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది. శిక్షణ శిబిరాలు ఎక్కడంటే.. శిక్షణ శిబిరం సబ్జెక్టు సంఖ్య ఎస్ఎస్పీ పాలిటెక్నిక్ కళాశాల, కొండగుంటూరు ఎస్జీటీ 300 రాజమహేంద్రి ఇంజినీరింగ్ కళాశాల, పిడింగొయ్యి ఎస్జీటీ 227 జీఎస్ఎల్ డెంటల్ కాలేజీ–1 జోన్–2 పీజీటీ 347 జీఎస్ఎల్ డెంటల్ కాలేజీ–2 ఎస్ఏ (సోషల్) 132 ఐఎస్టీఎస్ ఉమెన్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజానగరం ఎస్ఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 211 సాయిమాధవి ఇంజినీరింగ్ కాలేజీ, మల్లంపూడి, రాజానగరం ఎస్ఏ (లాంగ్వేజెస్) 236 బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ, ఎస్ఏ (మ్యాథ్స్, ఫిజిక్స్, బీఎస్) 245 -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నేడు నిరసన
కొత్తపేట: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కొత్తపేటలో ఆయన మాట్లాడుతూ పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి, కొన్ని కళాశాలలను ప్రారంభించిందన్నారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉండగా కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈ చర్య పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు. దీనిని వ్యతిరేకరిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజే సుధాకర్బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీనికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, యువత తరలిరావాలని డేవిడ్రాజు పిలుపునిచ్చారు. లంకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అమలాపురం రూరల్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గోదావరి తీరం వెంబడి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల కాజ్ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని, బోట్ల సహకారంతో అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే తరలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సరస్వతీ.. జ్ఞానప్రదాత్రీ
దసరా శరన్నవరాత్ర ఉత్సవాలను జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో ఎనిమిదో రోజు చదువుల తల్లిగా అలంకరించారు. ఇందులో భాగంగా అమలాపురం పట్టణం శ్రీదేవి మార్కెట్ సెంటర్లోని శ్రీదేవి ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలోని కల్యాణ దుర్గమ్మ, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో వైష్ణవీ కనకదుర్గమ్మ ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం, గోల్డ్ మార్కెట్లో కామాక్షీ ఏకాంబరేశ్వరీదేవి ఆలయాల్లో అమ్మవార్లు సరస్వతీదేవిగా అలంకృతమై భక్తులకు దర్శనమిచ్చారు. –అమలాపురం టౌన్ -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
● సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఎయిర్పోర్ట్ వరకూ బైక్ ర్యాలీసాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు మిథున్రెడ్డిని సాయంత్రం 5.55 గంటలకు విడుదల చేశారు. ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్ వరకూ ఈ ర్యాలీ సాగింది. మిథున్రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కొవ్వూరు, అనపర్తి కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్ల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు. స్వాగతిస్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించేందుకు చంద్రబాబు చేసిన కుట్ర ఇది. బెయిల్ మంజూరును స్వాగతిస్తున్నాం. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే కూటమి సర్కారు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తోంది. మిథున్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదు. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దుర్మార్గమైన కేసు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కాలక్షేపం చేస్తోంది. సంబంధం లేని కేసును ఎంపీ మిథున్రెడ్డిపై పెట్టారు. ఆయనపై ఉన్నది అభియోగం మాత్రమే. కేసులో ఏం సంబంధం ఉందో చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దుర్మార్గ పాలనను తుదముట్టిస్తారు. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ చంద్రబాబు శాడిజం ఎంపీ మిథున్రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టినది మ్యానేజ్డ్ కేసు. ఈ విషయాన్ని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. బెయిల్ పత్రాలు వచ్చినా విడుదల చేసేందుకు కావాలనే ఆలస్యం చేశారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం. చంద్రబాబు ఎప్పుడూ అంతే. హింసించి ఆనందం పొందుతారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బాబు ఎవరు? – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు. ఆయన జైలు నుంచి బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. అందుకు మిథున్రెడ్డికి వచ్చిన బెయిలే నిదర్శనం. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్ -
సమస్యల నాడి పట్టరేం?
● కూటమి ప్రభుత్వంపై వైద్యుల గుర్రు ● విధులు బహిష్కరించి సమ్మెలోకి పీహెచ్సీల డాక్టర్లు ● జిల్లాలో పలుచోట్ల నర్సులతోనే వైద్య సేవలు సాక్షి, అమలాపురం/ ముమ్మిడివరం: చెప్పి చెప్పి విసిగిపోయారు.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకున్నా, కూటమి సర్కారు పట్టించుకోక పోవడంతో వైద్యులు స్టెత్ను పక్కనపెట్టారు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమ్మెకు దిగారు. ఫలితంగా పల్లెల్లో వైద్య సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీలు) వైద్యులు విధులను బహిష్కరించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 53 పీహెచ్సీలు ఉండగా, ప్రతి చోటా వైద్యులు విధులకు దూరంగా ఉన్నారు. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని, ఓపీ, ఇతర సేవలకు దూరంగా ఉంటామని తేల్చి చెప్పారు. వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని గత ఏడాది ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ బుట్టదాఖలు కావడంతో వారు సమ్మె బాట పట్టారు. గత 20 ఏళ్ల నుంచి తమకు పదోన్నతులు లేకుండా పోయాయని, టైమ్ బాండ్ పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీఓ 99ను రద్దు చేసి ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న వైద్యులకు 50 మూల వేతనాన్ని గిరిజన భత్యంగా అందించాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల భత్యం ఇవ్వాలనే తదితర డిమాండ్లతో వారు సమ్మెకు దిగారు. ఆయా పీహెచ్సీల వద్ద తమ డిమాండ్లో కూడిన నోటీసులు అతికించి ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్సీలలో వైద్యుల ద్వారా అందాల్సి సేవలు నిలిచిపోయాయి. చివరకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ– – సశక్త్ పరివార్ అభియాన్ క్యాంపులో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు సేవలందించాల్సి వచ్చింది. ఉన్నవారితో మమ అనిపించి.. ● మండపేట నియోజకవర్గం పరిధిలో మండపేటలో రెండు, కపిలేశ్వరపురంలో మూడు, రాయవరం రెండు పీహెచ్సీలు ఉన్నాయి. వైద్యులు విధులకు హాజరు కాలేదు. రోగులకు స్థానికంగా ఉన్న ఫార్మసిస్టులు, నర్సులు తాత్కాలికంగా మందులు అందించి పంపించారు. చిన్న చిన్న పరీక్షలను నర్సులు నిర్వహించారు. ఓపీ లేకపోవడంతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీనితో వారు ప్రైవేట్ వైద్యులను, ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వచ్చింది. ● ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక పీహెచ్సీలో సోమవారం ఇద్దరు వైద్యులూ సమ్మెలో ఉండటంతో ఆసుపత్రి స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్ట్ రోగులకు వైద్య సేవలందించారు. స్టాఫ్ నర్సు పి.నాగలక్ష్మి, ఫార్మసిస్ట్ ఎం.శ్రీనివాస్లు రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ ఒక్క రోజు 38 మంది ఆసుపత్రికి వచ్చి సేవలు పొందారని తెలిపారు. అయితే రిఫరల్ కేసులు ఏవీ రాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కాట్రేనికోన పీహెచ్సీలో స్టాఫ్ నర్సులు వైద్య సేవలందించారు. 83 ఓపీ నమోదైంది. సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పల్లంకుర్రు పీహెచ్సీకి మత్స్యకార గ్రామాల నుంచి జ్వరపీడితులు, ఇతర వ్యాధిగ్రస్తులు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం ఏడు పీహెచ్సీలు ఉండగా వైద్యుల ద్వారా సేవలందలేదు. కేవలం నర్సులు మాత్రమే ప్రాథమిక చికిత్స చేసి పంపారు. ● రాజోలు నియోజకవర్గం పరిధిలో ఏడు పీహెచ్సీలు ఉండగా వైద్యులు విధులు హాజరు కాలేదు. స్టాఫ్ నర్సుల ద్వారా వైద్య సేవలందించారు. స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ క్యాంప్లో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు సేవలందించారు. ● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ మొత్తం ఎనిమిది పీహెచ్సీలు ఉండగా, ప్రతిచోటా వైద్యుడి స్థానంలో స్టాఫ్ నర్సులు వైద్య సేవలందించాల్సి వచ్చింది. -
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు భద్రపర్చిన గోదాముల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు భద్రపరిచిన గోదాములను ఆయన తనిఖీ చేశారు. తొలుత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ను పరిశీలించి అందులో సంతకం చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు గార్డులను ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్, రివెన్యూ, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు అమలాపురం రూరల్: ప్రజల అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్వో మాధవి, డ్వామా పీడీ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీలు ప్రజల నుంచి సుమారు 162 అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలన్నారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ అర్జీల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. మిథున్రెడ్డికి బెయిల్ ఇవ్వడం సముచితం అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా తప్పుడు కేసు బనాయించి 71 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచిన ఎంపీ మిథున్రెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ స్వాగతించారు. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్రెడ్డిని ఎమ్మెల్సీ సోమవారం కలిశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టడంపై కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వ తీరు మారడం లేదని ఎమ్మెల్సీ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ముందు రెడ్బుక్ రాజ్యాంగం పనిచేయదని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. మిథున్రెడ్డికి బెయిల్ రావడం ద్వారా అక్రమ కేసులు ముందు ముందు నిలబడవన్న సంకేతాన్ని ఇస్తోందని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 36 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికకు 36 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ రాహుల్ మీనా ఫిర్యాదు పత్రాలు స్వీకరించారు. ఎస్పీ మీనా కూలంకుషంగా వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపించారు. సమస్య తీవ్రతను బట్టి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. -
బ్రిటిషర్లను భయపెట్టిన...చెడీ తాలింఖానా
సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్: కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది. శతాబ్దాల చరిత్ర అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది.దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం.మంత్రముగ్ధులను చేసేలా..దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరి కాయలు, కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరు పాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, ఎన్ఆర్ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు.అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితో పాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది. చెడీ తాలింఖానా ప్రదర్శనతో పాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి.కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు. తరతరాలుగా నిర్వహిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. – పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం రోజుకు ఎనిమిది గంటల శిక్షణదసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్లో కూడా ఈ ప్రదర్శన నిరి్వఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్ఆర్ఐ (అమెరికా) -
పాశర్లపూడి సమీపంలో ఓఎన్జీసీ ఆయిల్ లీక్
కోనసీమ: మరొకసారి కోనసీమ వాసుల్లో ఓఎన్జీసీ ఆయిల్ లీక్ ఘటన కలవరం పుట్టిస్తోంది. తాజాగా మామిడికుదురు మండలం పాశర్లపూడి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైటు సమీపంలో ఆయిల్ లీకవుతున్న ఘటన వెలుగుచూసింది. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) పాశర్లపూడికి అత్యంత సమీపంలోని పంట కాల్వలోకి ఓఎన్జీసీ ఆయిల్ లీకవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో ఆందోళన చెందిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. అయితే ఓఎన్జీసీ ఆయిల్ లీవ్ అవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతున్న నేపథ్యంలో మరొకటి చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తరుచుగా జరుగుతున్న ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. పాశర్లపూడి ప్రాంతంలో ఓఎన్జీసీ (ONGC) ఆయిల్ , గ్యాస్ లీకేజీలు అనేక సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రధాన లీకేజీ ఘటనలు ఇవే..1995–96: పాశర్లపూడిలో ఓఎన్జీసీ బావిలో భారీ బ్లోఅవుట్ (Blowout) జరిగింది. ఈ ప్రమాదంలో 60 రోజుల పాటు మంటలు చెలరేగాయి,ఇది ఓఎన్జీసీ చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడింది.2014 జూన్ 28: నాగారం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ కారణంగా 15 మంది సజీవ దహనమయ్యారు, మరో 15 మంది గాయపడ్డారు.2022 సెప్టెంబర్ 27: పాశర్లపూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ జరిగింది. అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.2025 సెప్టెంబర్ 23: పాశర్లపూడి వెళుతున్న పైప్ లైన్ వద్ద మరోసారి గ్యాస్, ఆయిల్ లీక్ జరిగింది. స్థానికులు వాసనను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. 2025 ఆగస్టు: డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ పైకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు. ఇదీ చదవండి: హోంమంత్రి అనితకు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత -
హోం మంత్రి, డీజీపీ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్ కొత్తపేట: రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ వైఫల్యం, దానిని న్యాయ స్థానం ధ్రువీకరించిన నేపథ్యంలో హోంమంత్రి, డీజీపీ తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేటలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు స్వగృహంలో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్స్ను జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ ఆవిష్కరించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, కార్యకర్తలకు అండగా ఉండడానికి డిజిటల్ బుక్ను ఆవిష్కరించినట్టు జగ్గిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కార్యకర్తలకు వచ్చిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ డిజిటల్ బుక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీస్ శాఖ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అరెస్ట్ చేసి కొంతమంది కూటమి నాయకుల తొత్తుల కింద పనిచేస్తున్న పోలీసు అధికారులు అబద్ధం ఆడటంతో పాటు కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అరెస్టు చేసి, చేయలేదంటూ పోలీసులు చెప్పడంపై హైకోర్టు న్యాయమూర్తులు సీబీఐ ఎంకై ్వరీకి ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ తో పాటు, డీజీపీ కూడా రాజీనామా చేయాలని జగ్గిరెడ్డి కోరారు. స్వార్థ పూరితంగా చంద్రబాబు పాలన రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలన స్వార్థపూరితంగా సాగుతోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి, అనేక కాలేజీలు ప్రారంభిస్తే, నేటి సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసం వాటి ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. శాసనసభ, శాసనమండలి గౌరవాన్ని దిగజార్చారని విమర్శించారు. మాజీ సీఎంను దుర్భాషలాడటాన్ని ఖండించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, సీనియర్ నాయకులు కర్రి నాగిరెడ్డి, గొలుగూరి మునిరెడ్డి, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి లక్ష్మీపతిరావు, సర్పంచ్లు రెడ్డి చంటి, సాగి బంగార్రాజు, దూనబోయిన నవదీప, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు షేక్ వల్లీబాబా, ఎంపీటీసీ సభ్యురాలు పితాని లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
కాజ్వేలపై వరద
– ఐదవసారి లంకవాసులకు ఇబ్బందులు సాక్షి, అమలాపురం: గోదావరి లంక గ్రామాలను ఈ ఏడాది ఐదవసారి వరద ముంచెత్తుతోంది. భారీ వరదలు లేకున్నా వరుసగా వస్తున్న వరదలు స్థానికులు, లంక వాసులను ఇబ్బందులు పాల్జేస్తోంది. సెప్టెంబర్ నెలలో వరద మూడవసారి రావడం అత్యంత అరుదు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శనివారం మధ్యాహ్నం మొదలైన వరద ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పెరుగుతూనే ఉంది. ఆరు గంటలకు 10.78 లక్షల క్యూసెక్కులు వరద నమోదు కాగా, ఏడు గంటల వరకు అదే నిలకడగా ఉంది. తరువాత నుంచి నెమ్మదిగా వరద తగ్గుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 10.71 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. తరువాత నుంచి క్రమేపీ వరద తగ్గుముఖం పడుతోంది. రాత్రి తొమ్మిది గంటల సమయానికి 10.01 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే మధ్యాహ్న సమయం నుంచి ఎగువన భద్రాచలం వద్ద వరద పెరుగుతుండడంతో దిగువన ముంపు వీడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. గోదావరి వరదకు జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు తీవ్రత పెరిగింది. కాజ్వేలు, లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, పంట పొలాలు, తోటల్లో వరద నీరు చేరింది. పి.గన్నవరం మండలంలో కనకాయిలంక కాజ్వేపై వరద ముంపు మరింత పెరిగింది. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న అయోధ్యలంక, అనగారిలంక, శిర్రావారిలంక, పెదమల్లంక పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది. పెదపట్నంలంక, అప్పనపల్లి, దొడ్డవరం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్వే నీట మునగడంతో ఇక్కడ పడవల మీద జనం రాకపోకలు సాగిస్తున్నారు. సఖినేటిపల్లి– నర్సాపురం రేవు మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేలంక మత్స్యకార కాలనీ నీట మునిగింది. కూనాలంక, గురజాపులంక, చింతావానిరేవు, చింతపల్లిలంకల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్టును తాకుతూ వరద ప్రవహిస్తోంది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు వద్ద ఇళ్ల మధ్యకు వరద నీరు వచ్చి చేరింది. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో మత్స్యకార ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుతోంది. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
రాజోలు: స్నేహితుడిని కలిసేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరిన పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడికి చెందిన బీటెక్ విద్యార్థి కడలి అక్షయ్(22) రాజోలు మండలం ములికిపల్లి–కడలి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్షయ్ తండ్రి కడలి మోహనరావు ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలగంపూడి గ్రామానికి చెందిన అక్షయ్ చైన్నెలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రి కలగంపూడి వచ్చాడు. మర్నాడు ఉదయమే తన స్నేహితుడిని కలిసేందుకు బుల్లెట్ మోటార్ సైకిల్పై ములికిపల్లి రాగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చైన్నె నుంచి ఇంటికి వచ్చి తమతో గడపకుండానే కుమారుడు మృతి చెందడం పట్ల తండ్రి మోహనరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఆందోళనకరంగా గుండెపోటు
గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్తం సరఫరా తగ్గిపోవడం వల్లనే ఛాతిలో నొప్పి వస్తుంది. ఛాతిలో బరువుగా అనిపించడం, మెడ భాగం నుంచి మొదలై, ఎడమ చేతి వరకు లాగడం, నొప్పి వీపు వెనక భాగంలో రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో మంట రావడం జరుగుతాయి. ఈ లక్షణాలు ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ కారెం రవితేజ, ఎండీ ఫిజీషియన్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రతి రోజూ వ్యాయామం చేయాలి ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్స్ అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. తెలియకుండానే శరీరంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పెరిగి, రక్తంలో బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె, మెదడు స్ట్రోక్స్ వస్తాయి. – డాక్టర్ సుమలత, డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి, ఎన్సీడీ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి
రావులపాలెం: నూతనంగా ఎన్నికై న చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వపు అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి శ్రీనివాస్రెడ్డి, మామిడిశెట్టి సోమరాజు, ఆకుల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు సూరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా కొవ్వూరి వంశీకృష్ణారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లూరి నీలకంఠ దుర్గారావు, కోశాధికారిగా మండవిల్లి నగేష్, సహ కోశాధికారిగా కండిచర్ల వీర వెంకట నాగరాజుతో ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. కనికిరెడ్డికి ఆయన శాలువా కప్పించి అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంత కుమారి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి పాల్గొన్నారు.చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం -
నేతన్నలకు బకాయిల వెతలు
కపిలేశ్వరపురం: తమ శ్రమతో స్థాపించిన చేనేత సహకార సంఘం నిర్వహణకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు గుదిబండలా మారాయంటూ అంగర చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు పూనుకున్నారు. అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం రెండు జాతీయ స్థాయి అవార్డులను సాఽధించింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందుకుంది. అలాంటి సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3,85,18,292 బకాయిలు రావాల్సి ఉంది. అందులో రూ.1,00,11, 858 ఆప్కో సంస్థ చెల్లించాల్సి ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రామంలో ఆదివారం నిరసన ర్యాలీ చేశారు. చేనేత సహకార సంఘం ఎదుట సుమారు 100 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. నాయకులు మాట్లాడుతూ ఆప్కో ద్వారా బకాయిలను చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో బకాయిలకు తోడు మరిన్ని పథకాల ద్వారా రావాల్సిన బకాయిలు సైతం సంఘం నిర్వహణకు సమస్యగా మారాయన్నారు. తమ డిమాండ్ను పరిశీలించి పరిష్కరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వారికి పలువురు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. -
హడలెత్తిస్తున్న ధార్గ్యాంగ్
రాజమహేంద్రవరం రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు షాపులో ఒక గోల్డుషాపులో దుండగులు ఈ నెల 23వ తేదీన షట్టర్ పైకి వంచి అద్దాలు పగలు గొట్టి 11 కిలోల వెండి దొంగతనం చేశారు. ● తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ వెనుక ఒంటరిగా నివసిస్తున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి ఈ నెల 24వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వెళ్లి రాళ్లతో ఆమైపె దాడి చేసి 15 కాసుల బంగారం అపహరించుకు పోయారు. ● అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైతం ఈ తరహా చోరీలకు పాల్పడ్డారని సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ఈ చోరీలకు పాల్పడుతన్న వ్యక్తులు మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్గా గుర్తించారు. చోరీలకు పాల్పడిన ప్రదేశాలలో ఒకరి వేలిముద్రలు మధ్యప్రదేశ్కు చెందిన నేరస్తుడి వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ధార్గ్యాంగ్లో నలుగురి నుంచి ఆరుగురు వరకు సభ్యులు ఉంటారన్నారు. వీరికి రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, శివారు ప్రాంతాలతో పాటు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్. ఉదయం సమయంలో ఆటోల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో నలుగురు నుంచి ఆరుగురు వెళ్లి చోరీలకు పాల్పడతారు. ఒకవేళ ఇంటిలో ఎవరైనా ఉంటే వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి సొత్తును చోరీ చేస్తుంటారు. అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పోలీస్ స్షేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు శివారు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్కి చెందిన ధార్ గ్యాంగ్ తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రైమ్ పోలీసుల హెచ్చరిక అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆదివారం హెచ్చరించింది. ధార్గ్యాంగ్తోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన గ్యాంగ్లు కూడా రాష్ట్రంలోకి వచ్చినట్టు సమాచారం ఉందని పేర్కొంది. ఈ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న మహిళలను, ఇళ్లను టార్గెట్ చేస్తుందని క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. ధార్గ్యాంగ్లోని ఎనిమిది మంది ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఒంటరి మహిళలు, తాళాలు వేసిన ఇళ్లు, శివారుప్రాంతాలే టార్గెట్ నల్లజర్ల, ప్రత్తిపాడుతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వైనం ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు -
నన్నయ వర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ డి.ఎల్.రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. పోటీల్లో 70 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ కె.వి.స్వామి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభతో అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ యూనివర్సిటీ పరిధిలో 395 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయన్నారు. 2006లో ప్రారంభించిన యూనివర్సిటీ తక్కువ కాలంలోనే పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందిందన్నారు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో జరగనున్న జాతీయ స్థాయి అంతర విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ జట్టు పోటీల్లో తమ యూనివర్సిటీ జట్టు పాల్గొంటుందన్నారు. జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ– కరస్పాండెంట్ డీ.ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ సెలెక్షన్స్ తమ కళాశాలలో నిర్వహించేందుకు అనుమతినిచ్చిన యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆలమూరు: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగల సుజాత (45) మృతి చెందారు. కడియం మండలంలోని పొట్టిలంకకు చెందిన సుజాత తన భర్త సూరిబాబుతో కలిసి బైక్పై కపిలేశ్వరపురం వెళుతున్నారు. స్థానిక ఏటిగట్టు రోడ్డుకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న సైక్లిస్ట్ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సుజాత రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ ఢీకొని.. మండలంలోని చొప్పెల్లలో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పసుపులేటి వేణుగోపాలరావు (47) మృతి చెందారు. వివరాలలోకి వెళితే మోరంపూడికి చెందిన వేణుగోపాలరావు కొద్దికాలంగా పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో రోజ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా స్థానిక ఇరిగేషన్ లాకుల వద్దకు వచ్చేసరికి తాను నడపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణుగోపాలరావును హైవే, పోలీసు సిబ్బంది అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. -
రాళ్ల దాడిలో వ్యక్తి మృతి
రాయవరం: సరిహద్దు వివాదం నేపథ్యంలో జరిపిన రాళ్ల దాడిలో పలువురు వ్యక్తులు గాయపడగా, ఒకరు మృత్యువాత పడ్డారు. రాయవరం గ్రామంలో పోలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చేర్చి ఉన్న స్థలంలో పోలమ్మ ఆలయ కమిటీ రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని ఆనుకుని ఉన్న ఇంటి యజమానికి, పోలమ్మ ఆలయ కమిటీకి కొంతకాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రేకు షెడ్డు నిర్మాణం జరుగుతుండగా, పక్కనే ఉన్న భవనంపై నుంచి రేలంగి నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు రాళ్లదాడి చేసినట్లుగా పోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తొలుత కారం నీళ్లు చల్లడంతో పాటుగా ఒక్కసారి రాళ్లదాడి ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన కమిటీ సభ్యులు గాయాలపాలయ్యారు. ఇటుకరాళ్లతో చేసిన దాడిలో సుమారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బోదంకి సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు(51) రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. రాళ్లదాడిలో కసిరెడ్డి సత్యవతి, కె.నాగమణి, పూడి సత్తిబాబు, కొఠాని దుర్గాప్రసాద్, యాళ్ల సూర్యకుమారి, బలగం నాగమణి, కిల్లి గౌరి గాయపడ్డారు. ఘటనా స్థలంలో రామచంద్రపురం ఇన్చార్జి డీఎస్పీ ప్రసాద్ విచారణ నిర్వహించారు. నిర్మాణ పనులు చేసుకుంటున్న వారిపై నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు రౌడీయిజం చేసి ఒకరి మృతికి కారణమయ్యారని, కఠినంగా శిక్షించాలని పోలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సురేష్బాబు తెలిపారు. -
గుండె లయ తప్పుతోంది
●రాయవరం: ఇటీవలి కాలంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఎలా చనిపోయారు అని ప్రశ్నించగానే ఎక్కువగా వినిపించే సమాధానం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చోటు చేసుకునే మరణాల్లో హార్ట్ ఎటాక్తో జరిగేవే అధికం. మన శరీరానికి పెద్దదిక్కుగా వ్యవహరించే హృదయం లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అతి ప్రధానమైన అవయవం మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత లేకుండా పోతోంది. వ్యాయామం లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం. పొగ తాగడం, ఒత్తిళ్లతో గుండెపోటుకు గురవుతున్నారు. మనుషుల్లో మారుతున్న అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారి తీయడంతోపాటు అంతిమంగా గుండైపె ప్రభావం పడుతోంది. అయితే మధుమేహం (సుగర్)తోనే అధిక ముప్పు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు రెండు దశాబ్దాల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటు, మారిన జీవన శైలి కారణంగా నేడు 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, సుగర్, ఫాస్ట్ ఫుడ్ , లావు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధికంగా ఫోన్ చూడడం, ప్యాక్డ్ ఫుడ్ను అధికంగా తీసుకోవడం, మితిమీరి శీతలపానీయాలు తాగడం, తరచుగా ఆయిల్ ఫుడ్ను తీసుకోవడం. జిల్లాలో 14 శాతం బాధితులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు 14 శాతం ఉన్నట్లు అంచనా. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స పొంది, కోలుకుంటున్నారు. హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడేవారు 1.06 లక్షల మంది, సుగర్ వ్యాధిగ్రస్తులు 43వేల మంది ఉన్నారు. కోవిడ్–19తో పెరిగిన కేసులు జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల గుండె సమస్యలు 50 నుంచి 60 శాతానికి పెరిగాయి. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, సుగర్, మద్యం, సిగరెట్ వల్ల ఈ సమస్య ఉండేది. గుండె నొప్పి, అధిక ఆయాసం ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 20 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పార్కులు, ఇతర ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి. కరోనాతో మరింత పెరిగిన గుండెపోటు బాధితులు ఆహారపు అలవాట్లు అదుపు చేసుకుంటేనే మంచిది నేడు వరల్డ్ హార్ట్ డే -
వాడపల్లి వెంకన్నకు దసరా శోభ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా దాదాపు ఆ స్థాయిలో ఈ ఆదివారం భక్తజనంతో ఆ క్షేత్రం కిక్కిరిసింది. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా అత్యధికంగా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు, ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కొందరు స్వామివారి కల్యాణం చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ.8,90,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.● అత్యధికంగా తరలివచ్చిన భక్తజనం ● ఒక్కరోజు రూ 8.90 లక్షల ఆదాయం -
బ్రిటిషర్లను భయపెట్టిన... చెడీ తాలింఖానా
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్ : కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మ్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. చెడీ తాలింఖానా... ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది. శతాబ్దాల చరిత్ర అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది. దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం. మంత్ర ముగ్ధులను చేసేలా.. దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీతాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరుపాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్ర ముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, ఎన్ఆర్ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట ఉద్యమ స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితోపాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది. చెడీ తాలింఖానా ప్రదర్శనతోపాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి. కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు. తరతరాలుగా నిర్వహిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. – పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం రోజుకు ఎనిమిది గంటల శిక్షణ దసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్లో కూడా ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్ఆర్ఐ (అమెరికా) కోనసీమలో దసరా ప్రత్యేకం స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో 169 ఏళ్లుగా సాగుతున్న ప్రదర్శన ఇటీవల కాలంలో పెరిగిన ఆదరణ ఎన్ఆర్ఐలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రాక మైసూర్ తరువాత... ‘పచ్చని సీమ’లోనే ‘దసరా’ శోభ సంక్రాంతికి ప్రభల తీర్థం.. దసరాకు చెడీ తాలింఖానా -
మహిషాసుర మర్దినికి దండ వేసేందుకు వేలం
రూ.1.05 లక్షలకు పాడుకున్న వైనం అమలాపురం టౌన్: స్థానికంగా జరిగే ఏడు వీధుల దసరా ఉత్సవాల్లో ఒకటైన రవణం వీధి వాహనం మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో వేసే తొలి పూల దండకు ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే రవణం వీధిలోని మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం వద్ద దండకు ఆ వీధి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆదివారం వేలం పాట నిర్వహించారు. అమలాపురానికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్లో స్థిర పడ్డ ఆకుల లక్ష్మణరావు కుటుంబం దండను రూ.1.05 లక్షలకు పాడుకున్నారు. ఈ దండనే అక్టోబర్ రెండో తేదీన జరిగే రవణం వీధి దసరా ఉత్సవాలు, ఊరేగింపు వేళ అమ్మవారి మెడలో లక్ష్మణరావు కుటుంబీకులు వేయనున్నారు. ఇదే ఆకుల లక్ష్మణరావు గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో నిర్వహించిన వేలం పాటలో అమ్మవారి దండను రూ.1.03 లక్షలకు పాడుకున్నారు. గణపతి ఆలయానికి భక్తుల తాకిడి అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 59 మంది పాల్గొన్నారు. 12 మంది భక్తులు ఉండ్రాళ్ల పూజ జరిపారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో రెండు జంటలు పాల్గొన్నాయి. నలుగురికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 27 జంటలు పాల్గొనగా, నలుగురు చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామికి ఏడుగురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 55 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,120 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,50,947 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లోపభూయిష్టంగా మెగా డీఎస్సీ– న్యాయ పోరాటం చేస్తాం అమలాపురం రూరల్: ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ లోపభూయిష్టంగా జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా సెలక్షన్ కమిటీ మెరిట్లో వచ్చిన ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరిగిందని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ అన్నారు. అమలాపురం బుద్ధవిహార్లో ఆదివారం డీఎస్సీ అభ్యర్థుల సమావేశం గోసంగి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీలను ఓపెన్ కేటగిరిలోనికి తీసుకోకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 50శాతం ఉద్యోగాలను కులాలకు అతీతంగా ఓపెన్ కేటగిరిలో భర్తీ చేయవలసి ఉందని కానీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సంపాదించినా వారిని రిజర్వుడు కేటగిరిలోనే పరిగణనలోకి తీసుకొని అన్యాయం చేశారని సమావేశం తెల్పింది. బీసీ అభ్యర్థులు వారి రిజర్వేషన్లలో సెలక్ట్ అయిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరిలో చూపించారని అన్నారు. ఈ సమావేశంలో ములపర్తి సత్యనారాయణ, మాజీ సర్పంచ్, కాశీ వెంకటేశ్వరరావు, ఎంప్లాయిస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిలకపాటి సాంబశివరావు పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కొత్తపేట: కోనసీమ తిరుమలగా, భక్తుల కోర్కెలు తీర్చే ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి 18 వరకూ జరగనున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం సాయంత్రం దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, సేవలు, స్వామివారి ఊరేగింపుల గురించి వివరించారు. వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, రూ 20 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రకటించారు. -
సర్కారీ చోద్యానికి సమ్మె వైద్యం
● సర్వీస్ కోటా అమలుపై వైద్యుల్లో తీవ్ర అసంతృప్తి ● హక్కుల సాధనకు నేటి నుంచి విధుల బహిష్కరణ ● ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక ఆలమూరు: శరీరంలో రుగ్మతలు తలెత్తితే వైద్యులు తమ మేధా సంపత్తిని ఉపయోగించి మెరుగైన చికిత్స ద్వారా రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దుతారు. అదే రీతిలో అస్తవ్యస్త నిర్ణయాలను తీసుకున్న పాలకులను దారిలో పెట్టాలంటే సమ్మె అనే చికిత్స అవసరమని రాష్ట్ర పీహెచ్సీ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) భావిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల పట్ల అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టగా గ్రామ, వార్డు సచివాలయ, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది తమ హక్కుల సాధనపై పోరాడుతున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లోను, ఉద్యోగుల్లోను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా అందులో 47 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 07 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉన్నాయి. అందులో ప్రస్తుతం 97 మంది వైద్యులు పనిచేస్తుండగా ప్రతి రోజూ సుమారు ఐదు వేల మందికి చికిత్సను అందిస్తున్నారు. దీంతో పాటు చంద్రన్న సంచార చికిత్స, స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీఎంహెచ్ఓ కార్యాలయానికి నిత్యం నివేదికలను అందచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించే పీహెచ్సీ వైద్యుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ పేద ప్రజల అభ్యున్నతి కోసం వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. పీహెచ్సీలో కచ్చితంగా ఇద్దరు వైద్యులతో పాటు 14 మంది సిబ్బందిని నియమించి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటూ పేద ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడిచే విధంగా నిర్ణయాలను తీసుకుంటోంది. గత ఏడాది సెప్టెంబర్లో పోరుబాట పడితే క్లినికల్ విభాగంలోని సీట్లను 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ ఏడాది పాత విధానమే అమలు చేస్తున్నానని చెప్పడం పీహెచ్సీ వైద్యుల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో పాటు విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో పీహెచ్సీ వైద్యులు సమ్మె చేపట్టడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర పీహెచ్సీడీఏ ఉద్యమ కార్యాచరణ జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర పీహెచ్సీడీఏ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసి అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పీహెచ్సీ వైద్యులు ఈ నెల 26న ఆన్లైన్ రిపోర్టింగ్, అధికారిక పర్యటనలను నిలిపివేయగా 27న చంద్రన్న సంచార చికిత్స, స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను బహిష్కరించి కేవలం పీహెచ్సీలోని విధులకు పరిమితమయ్యారు. 28న ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగి నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో సోమవారం నుంచి పీహెచ్సీ విధులను బహిష్కరించి కేవలం అత్యవసర సేవలకు మాత్రమే పరిమితమవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న జిల్లా స్థాయిలో నిరసనలను తెలుపుతామని ప్రకటించారు. అమలాపురంలో పీహెచ్సీ వైద్యులందరూ అక్టోబర్ ఒకటో తేదీన భారీ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పీహెచ్సీ డీఏ ఐక్యవేదిక పిలుపు మేరకు అక్టోబర్ రెండో తేదీన చలో విజయవాడకు తరలివెళ్లనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబర్ మూడు నుంచి నిరవఽధిక నిరసన దీక్షలకు దిగుతామని ఐక్యవేదిక హెచ్చరించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం పీహెచ్సీ వైద్యుల సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరుపుతున్న కారణంగా సమ్మె ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ వైద్యులు విధులు బహిష్కరిస్తే మాత్రం పీహెచ్సీల్లోని మిగతా విభాగాల్లో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బందితో పరిపూర్ణంగా సేవలను అందిస్తాం. కె.దుర్గారావు దొర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పీహెచ్సీ వైద్యుల డిమాండ్లు ఇవీ.. ఇన్ సర్వీస్లోనున్న పీహెచ్సీ వైద్యులకు పీజీ సీట్ల కోటాను పునరుద్ధరించాలి. కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఉన్న గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు బేసిక్పై 50 శాతం అదనంగా అలవెన్స్ ఇవ్వాలి. చంద్రన్న సంచార చికిత్సలో పాల్గొనే వైద్యులకు రూ.ఐదు వేలు అలవెన్స్గా ఇవ్వాలి. పీహెచ్సీ వైద్యులందరికీ సీహెచ్సీ వైద్యుల మాదిరిగానే మూడేళ్లకు పదోన్నతులు కల్పించాలి. -
వాడపల్లి.. జనసంద్రం
● భక్తులతో పోటెత్తిన వేంకన్న క్షేత్రం ● మార్మోగిన గోవింద నామస్మరణ ● ఒక్కరోజు ఆదాయం రూ––లక్షలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి క్షేత్రానికి శనివారం భక్తజనం పోటెత్తారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరుని క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శుక్రవారం రాత్రి నుంచే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు కాలినడకన వాడపల్లికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అత్యధిక సంఖ్యలో శ్రీఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో ఆ క్షేత్రం నిండిపోయింది. పలువురు భక్తులు మోకాళ్లపై ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం విశేష పూజలు చేసి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ – ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీస్ సిబ్బందితో ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు. వాడపల్లి క్షేత్రం ఉచిత వైద్య శిభిరంలో భక్తుని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న డీసీ అండ్ ఈఓ చక్రధరరావు -
అంబేద్కర్ నడయాడిన ఈలి వాడపల్లి
రామచంద్రపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామచంద్రపురంలో పర్యటించి నేటికి 81 ఏళ్లు పూర్తయ్యింది. 1944 సెప్టెంబర్ 28న ఆయన స్థానిక ఈలి వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు ఈలి వాడపల్లి 1944లో అంబేడ్కర్ను జిల్లా ప్రజలకు పరిచయం చేసేందుకు జాతికి నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించేందుకు జిల్లాకు ఆహ్వానించారు. ఆ మేరకు ఆయన కాకినాడ రాగా అక్కడ ఏనుగుపై ఆయనను కూర్చుండబెట్టి వేలాది దళితులు, పుర ప్రముఖుల సమక్షంలో ఊరేగించారు. అనంతరం వాడపల్లి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనకు కుయ్యేరు గ్రామానికి చెందిన దండంగి గంగమ్మ స్వాగతం పలికారు. రామచంద్రపురంలో వంద ఎడ్ల బండ్లను అలంకరించి గారడీలు, డప్పుల బ్యాండ్లు, కోలాటాలతో టాప్ లేని కారు మీద అంబేడ్కర్ను ఘనంగా ఊరేగింపుగా వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ దళిత విద్యార్థుల చదువు, పోషణ తదితర వివరాలను అడిగి తెలుసుకుని వాడపల్లిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వాడపల్లి పెద్ద కుమారునికి ప్రేమప్రసాద్ అనే నామకరణం చేశారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.ఆయన స్మారకంగా తపాలా కవరుఅంబేడ్కర్ రామచంద్రపురం పర్యటనను పురస్కరించుకుని తపాలా శాఖ 2021 సెప్టెంబర్లో ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేసింది. దీనిని అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీని వాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విడుదల చేశారు. -
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
మాజీమంత్రి గొల్లపల్లి, ఎమ్మెల్సీ కూడుపూడి అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వం నడుపుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ను ప్రారంభించారని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలం భట్నవిల్లిలో మాజీ మంత్రి విశ్వరూప్ నివాసంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందన్నారు. వాటి నుంచి పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్చేసి కార్యకర్తలు తమ ఇబ్బందులపై ఫిర్యాదు చేస్తే వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. db.weysrcp.com లోకి వెళ్లి కార్యకర్త ఫోన్ నంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుందన్నారు. తర్వాత వివరాలు పూర్తి చేసి అన్యాయానికి సంబంధించి డాక్యుమెంట్లు, వీడియోలు అప్లోడ్ చేస్తే డిజిటల్ బుక్లో స్టోర్ అవుతాయన్నారు. ఐవీఆర్ విధానం ద్వారా 040–49171718 టెలిఫోన్ నంబర్కు కాల్ చేసిన తర్వాత ఫిర్యాదు ఎలా చేయాలన్నదానిపై గైడెన్స్ ఇస్తూ పూర్తి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్షగా డిజిటల్ బుక్ నిలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్లో నమోదైన కేసులపై దర్యాప్తు చేయించి న్యాయం చేస్తామన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెడతామని జగన్ హామీ ఇచ్చారన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. తొలిత డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను గొల్లపల్లి, ఎమ్మెల్సీ సూర్య నారాయరావు, పార్టీ నామయకులు అవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, మహిళ విభాగం అధికారి ప్రతినిధి కాశి బాలమునికుమారి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులి నాని, బద్రి బాబ్జీ, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరిరామ్గోపాల్, కొనుకు గౌతమి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు వెంకటేష్, మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి గొవ్వాల రాజేష్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు తొరం గౌతమ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్యకుమార్, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుత్తుల ఈశ్వర ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు చింతా రామకృష్ణ, పొగాకు శ్రీను, ఒంటెద్దు వెంకయ్యనాయుడు, కూడుపూడి భారత్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరేగింపులకు పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరగనున్న దసరా ఉత్సవాల ఊరేగింపులకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. జిల్లా ప్రజలు దసరా ఉత్సవాలను స్నేహ పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆయన తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నీ సక్రమంగా జరిగేలా ఉత్సవ కమిటీ ప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. ఎల్హెచ్ఎంఎస్ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో ఎవరైనా ఊళ్లకు వెళుతుంటే పోలీస్ శాఖను సంప్రదించి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకుంటే సమీప పోలీసు స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి సీసీ కెమెరాలు బిగించి పోలీసు కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తుంటారని వివరించారు. తద్వారా ఇళ్లలో దొంగతనాలు నివారించవచ్చని అన్నారు.ఎస్పీ రాహుల్ మీనా -
ఎమ్మెల్యేలకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి
బాలకృష్ణ వ్యాఖ్యలపై పితాని ధ్వజం ముమ్మిడివరం: దేవాలయం లాంటి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారా అనే సందేహం ప్రజలకు కలుగుతోందని అన్నారు. ఎందుకంటే ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసిన వారికెవరికై నా ఇటువంటి సందేహం కలుగుతుందన్నారు. ఇకపై అసెంబ్లీకి వచ్చే శాసన సభ్యులకు బ్రీత్ అనలైజర్తో పరీక్షలు చేయాలని పితాని హితవు పలికారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని అవమానించడం అంటే అయన అభిమానులను అవమానించడమేనన్నారు. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి, చిరంజీవి, సినీ రంగ ప్రముఖుల మధ్య జరిగిన సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని, దీనివల్ల సినిమా రంగానికి ఎంతో మేలు జరిగిందని, నిర్మాతలు, లాభపడ్డారని గుర్తు చేశారు. బాలకృష్ణ నటించిన సినిమాకి కూడా టికెట్లు పెంచుకునేందుకు తమ నాయకుడు అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. తన అన్నను శాసన సభ సాక్షిగా అవమానకరంగా మాట్లాడినా పవన్ కల్యాణ్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్కు బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, మట్టపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దసరాకి దినుసులెలా?
● ఆవేదన వ్యక్తం చేస్తున్న చిరుద్యోగులు ● రెండు నెలలుగా వేతన బకాయిలు రామచంద్రపురం ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్ష ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుఅంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన (ఫైల్) సాక్షి, అమలాపురం: సూపర్ సిక్స్ పేరుతో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని, మెరుగైన పీఆర్సీ ప్రకటించి, బకాయిలన్నీ చెల్లిస్తామని ఎన్నికల హామీలు గుప్పించారు. పాలనా పగ్గాలు చేపట్టి 16 నెలలు కావస్తున్నా అవేమీ చేయకపోగా చిరుద్యోగులను మరీ దారిద్య్రంలోకి నెట్టేశారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో దసరా పండగ నాడు కూడా వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ, ఆయాలకు రెండు నెలలుగా.. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు బకాయి పెట్టారు. కార్యకర్తకు నెలకు రూ.11,500, ఆయాకు రూ.7వేలు గౌరవ వేతనంగా అందజేస్తారు. ఆ చిన్న మొత్తాన్ని సైతం జూలై, ఆగస్టు నెలలకు ఇవ్వలేదు. ఇంకో నాలుగు రోజులు గడిస్తే మూడో నెలా బకాయి పెట్టినట్టు అవుతుంది. జిల్లాలో 1,726 అంగన్వాడీ కేంద్రాల్లోని 1,637 మందికి కార్యకర్తలకు నెలకు రూ.1,88,25,500 చొప్పున, ఆయాలకు నెలకు రూ.1,14,59,000 చొప్పున మొత్తం రూ.3,02,84,500 గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. రెండు నెలలకు కలిపి రూ.6,05,69,000 ప్రభుత్వం బకాయి పెట్టింది. సమగ్ర శిక్ష సిబ్బందికి.. విద్యా శాఖలో సమగ్ర శిక్ష అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆగస్టు నెల గౌరవ వేతనం సెప్టెంబరు నెల ముగస్తున్నా నేటి వరకు ఇవ్వలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే రెండు నెలల వేతనాలు బకాయి పడతాయి. సమగ్ర శిక్షా పరిధిలో 22 మండలాల్లో వివిధ విభాగాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సీఆర్ఎంటీలు 117, పీటీఐలు 250, ఆఫీస్ సిబ్బంది 80, ఐఈఆర్పీలు 44, ఏపీసీవోఎస్లు 30, సైట్ ఇంజినీర్లు ఐదుగురు చొప్పున ఉన్నారు. సీఆర్ఎంటీకి నెలకు రూ.23,500 గౌరవ వేతనం చెల్లిస్తుండగా, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.17,500 చెల్లిస్తున్నారు. పండగ దగ్గర చేసైనా చెల్లిస్తారా అని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పండుగ పూటా పస్తులేనా దసరా సరదా మాట దేవుడెరుగు. పూట గడవడమెలా అనే పరిస్థితి వారిది. నెల జీతం రాకపోతే ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు తదితర చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుంది. అసలే అరకొర వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అసలే అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకోవలసి వస్తోంది. ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి. – కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇబ్బంది పడుతున్నాం దసరా పండుగ వచ్చేసింది. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణకు రోజు వారీ ఖర్చులు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. దసరా పండగకై నా వేతనాలు చెల్లించాలి. – సీహెచ్ వెంకన్నబాబు, జిల్లా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ -
హోం స్టే టూరిజంతో ఉపాధి మెరుగు
● కలెక్టర్ మహేశ్కుమార్ మలికిపురం: టూరిజంలో హోమ్ స్టే విధానాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణులకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తూర్పుపాలెంలో ఎంపిక చేసిన అడబాల వీరన్న మండువా ఇంటిని శనివారం ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా వెబ్సైట్కు అనుసంధానించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ హోమ్ స్టే టూరిజం అభివృద్ధికి తొలి విడతగా రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు కేంద్రాలలో కోనసీమ జిల్లా ఒకటన్నారు. ఈ మేరకు జిల్లాలో 145 మండువా ఇళ్లను గుర్తించి రాష్ట్ర టూరిజం వెబ్సైట్లో పెట్టామని, టూరిస్టులు వాటిని చూసి ఆకర్షితులై ఆనాటి వాతావరణాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఇక్కడి ప్రజలకు ఆదాయం, ఉపాధి లభిస్తాయన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, జీవనశైలిని అనుభూతి చెందే దిశగా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. -
రత్నగిరిపై అగ్నిప్రమాదం
● ఫ్యాన్సీ దుకాణం గోదాములో ఘటన ● రూ.పది లక్షల ఆస్తి నష్టం ● ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణమంటున్న అధికారులు అన్నవరం: రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం వద్ద గల ఫ్యాన్సీ షాపు గోడౌన్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఫ్యాన్సీ షాపు నిర్వాహకుడు దాని వెనుక గోడౌన్ ఏర్పాటు చేసుకుని ప్లాస్టిక్ వస్తువులు, ఫొటోలు, కూల్డ్రింక్స్, ఫ్రిజ్లు పెట్టుకున్నాడు. ఉదయం ఏడు గంటల సమయంలో ఆ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 8 ప్రిజ్లతో సహా సుమారు రెండు లారీల సరకు కాలి బూడిదైంది. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోయి ఉంటే షాపింగ్ కాంప్లెక్స్కు మంటలు వ్యాపించి రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని స్థానికులు చెప్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలియగానే దేవదాయశాఖ ఆర్జేసీ వి.త్రినాథరావు, పెద్దాపురం ఆర్డీఓ రమణి వచ్చి ఆ గోడౌన్ను పరిశీలించారు. ప్రమాద వివరాలను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు వారికి వివరించారు. -
సందడి చేసిన ‘అనగనగా ఒక రాజు’
జి.మామిడాడలో పోలిశెట్టి నవీన్ చిత్రం షూటింగ్ పెదపూడి: జి.మామిడాడలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో పోలిశెట్టి నవీన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా సీతార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్ శుక్రవారం జరిగింది. ఈ సినిమాకు మారి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన జాతిరత్నాలు చిత్రానికి ఆయన రైటర్గా పనిచేసి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మూడురోజులుగా ఎల్ఎన్పురంలో ఈ షూటింగ్ సాగుతోంది. జబర్దస్త్ ఆర్టిస్టులు చమ్మక్ చంద్ర, భద్రం, మహేష్, రోహిణీ, సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్గా నవీన్ (రాజు) ఓట్లు అభ్యర్థించే సన్నివేశాలు, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడే సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సినీ వార్గాలు తెలిపాయి. -
పేద మహిళకు ఉచితంగా శస్త్ర చికిత్స
సత్య సాయి సేవా సంస్థల రూ.58 వేల వితరణ అమలాపురం టౌన్: సత్యసాయి సేవా సంస్థలు ఓ పేద మహిళకు హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సను ఉచితంగా నిర్వహించే ఏర్పాట్లు చేసింది. అమలాపురం డివిజన్ సత్య సాయి సేవా సంస్థలు భగవాన్ సత్య సాయిబాబా అవతార శతాబ్ది మహోత్సవాల సందర్భంగా 100 గ్రామ సేవల నిర్వహణలో భాగంగా రూరల్ మండలం పాలగుమ్మి శివారు కంభంపాడులో బుధవారం సేవా కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన సరెళ్ల బేబీ కడుపులో కంతి పెరిగి నొప్పి, రక్త స్రావంతో బాధ పడడాన్ని సేవకులు గుర్తించారు. దానిని తొలగించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సేవా సంస్థ కోఆర్డినేటర్ డాక్టర్ జి.ప్రభాకర్ రూ.58 వేల ఆర్థిక సాయం చేశారు. దీంతో అమలాపురంలోని శ్రావణి ఆస్పత్రిలో డాక్టర్ శ్రావణి కేవలం శస్త్రచికిత్సకు అయ్యే రూ.48 వేలను మాత్రమే తీసుకుని ఆమెకు చికిత్స చేశారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. యువకుడి అదృశ్యం పెరవలి: మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన తోట వెంకట సత్యనారాయణ ఈ నెల 25 తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తల్లి భవాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. సత్యనారాయణ తణుకులోని ఒక ప్రేవేట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడని, 25 తేదీన సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్యనారాయణ ఆచూకీ తెలిసిన వారు 94407 96642 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. -
రూ.3.8 లక్షల విలువైన ఆభరణాల చోరీ
కపిలేశ్వరపురం: స్థానిక చప్పిడి శ్యామ్ప్రసాద్ ఇంటిలోని రూ.3.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అంగర పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు శ్యామ్ ప్రసాద్, ధనలక్ష్మి దంపతులు ఈ నెల 23న వేరే ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా తెరిచి సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. రూ.2.5 లక్షల విలువైన 25 గ్రాముల బంగారం, రూ.1.3 లక్షల విలువైన 32 తులాలు వెండి అపహరించుకుపోయారు. బాధితులు ఫిర్యాదుపై మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, ఎస్సై జి.హరీష్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అమలాపురం నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
వెదురు సాగు లాభదాయకం
రాజానగరం: వెదురును సాగు ద్వారా ఎకరానికి రూ.ఒక లక్ష ఆదాయాన్ని పొందవచ్చని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) విశ్రాంత సంచాలకుడు పి.చౌడప్ప అన్నారు. లాలాచెరువు సమీపంలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, అక్కడ పెంచుతున్న వివిధ రకాల వెదురు జాతుల మొక్కలను పరిశీలించారు. వెదురు మొక్కలను బయోచార్ ప్రిపరేషన్, అగర్బత్తీల తయారీ వంటి విభిన్న రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్నారు. జిల్లా ఉద్యాన విభాగం అధికారి ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ వెదురు సాగు చేసే రైతులకు పలు రకాల సబ్సిడీలు ఉన్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే పంటగా ఈ సాగు ఎంతో అనువైదని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ అధికారి కొవ్వూరు సుధీర్, మండల శాఖ అధికారి నాగదేవి, వేణుమాధవ్, అటవీ శాఖ రేంజర్ డేవిడ్రాజు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
యానాం: పట్టణ పరిధిలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పునీత్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. తాళ్లరేవు మండలం పటవల, రాఘవేంద్రపురానికి చెందిన 25 ఏళ్ల పేరాబత్తుల మనోహర్ ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడం లేదని సాపిరెడ్డి శివవరప్రసాద్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదృశ్యమైన మనోహర్ ఆ రోజు బైక్పై ఇంటినుంచి యానాం బాలయోగివారధి వద్ద దొడ్డి గంగమ్మ ఆలయం వద్దకు వచ్చాడని అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వివరాలు తెలిసిన వారు యానాం ఎస్పీకి 0884–2324800, 2321 210 నంబర్లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. -
దసరాల్లో అల్లల్లాచ్చికి..!
● ఉరుకుల జీవితం నుంచి ఊళ్లకు సరదాగా ● కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి పర్యటనలు ● చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఉల్లాసంగా పయనం ● సెలవులు సద్వినియోగం రాయవరం: జీవితం ఉరుకుల పరుగులమయమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎన్నో ఒత్తిళ్లు.. ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. పిల్లల పుస్తక పోరాటం మరీను. పాఠశాల.. అనంతరం హోంవర్క్ పేరుతో రాత్రంతా మేల్కొని ఉండడం. అందరికీ కాస్త విరామం దొరికేది సెలవుల్లోనే. ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి ఓ మంచి ఆరామాన్ని ఎంచుకుని రిఫ్రెష్ అవ్వాలని చూస్తుంటారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే వారు కొందరైతే, మరికొందరు, దేశ, విదేశాల్లో విహరించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు 10 రోజుల పైబడి రావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావాసులు ఎటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారో ‘సాక్షి’ కథనం. ఆధ్యాత్మికం.. ఆహ్లాదం కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎన్నో ఆలయాల్లో దైవ దర్శనాలు చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతో పాటు మనసు కుదుట పడుతుందని పలువురు భావిస్తున్నారు. అలాగే ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే పాపికొండలు, మారేడుమిల్లి, రంపచోడవరం, సముద్ర తీరప్రాంతాలైన కాకినాడ, అంతర్వేది బీచ్ వంటి ప్రదేశాలతో పాటుగా, ఇతర జిల్లా, రాష్ట్రాల్లోని అరకు, నాగార్జునసాగర్, తమిళనాడు, కేరళ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆహ్లాదకర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు పయనమవుతున్నారు. ఇక రిజర్వేషన్లు సహకరిస్తే వారణాసి, అయోధ్య వంటి ప్రాంతాలకు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరికొందరు సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్, థాయ్లాండ్ వంటి దేశాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగానే ప్లాన్ చేసుకుంటాం ఏటా దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తప్పనిసరిగా టూర్ వెళ్తాం. ఓసారి ఆధ్యాత్మికం, ఓసారి ఆహ్లాదకర టూర్స్ చేస్తుంటాం. ఈసారి దసరా సెలవుల్లో ముంబై, పూణే ప్రదేశాలు చూసేందుకు వెళ్తున్నాం. మిత్రులతో కలసి పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తున్నాం. ఈ పర్యటనలతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాం. – పితాని శ్రీనివాస్, టీచర్, జెడ్పీహెచ్ఎస్, కె.గంగవరం మండలం కొత్త విషయాలను తెలుసుకుంటాం ఏటా పర్యాటక ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో వెళ్తుంటాను. వీటి ద్వారా పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతున్నట్లవుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. తెలుసుకున్న విషయాలను పాఠశాలల్లో చిన్నారులకు ఫొటోలు, వీడియోలు చూపించి, అక్కడ విషయాలను తెలియజేస్తాను. – నయనాల శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్, వీరవల్లిపాలెం, అయినవిల్లి మండలం. చిక్మగుళూర్ వెళ్తున్నా ప్రతిసారి సెలవులకు విహారయాత్రకు వెళ్లడం అలవాటు. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, ఒడిశాలోని కోణార్క్ టెంపుల్, కర్ణాటకలోని హంపి, బాదామి, పట్టడికల్ వంటి చారిత్రక ప్రదేశాలు తిలకించాం. ఈసారి దసరా సెలవులకు చిక్మగుళూర్ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి హిల్ స్టేషన్కు కారులోనే వెళ్తున్నాం. – జానా సురేష్కుమార్, ఎస్జీటీ, వల్లాయిచెరువు, పెదగాడవిల్లి, ఉప్పలగుప్తం మండలం బ్యాంకాక్ పర్యటన మరువలేనిది మిత్రులతో కలసి చేసిన బ్యాంకాక్ పర్యటన సరికొత్త అనుభూతులనునిచ్చింది. అక్కడ సముద్రంలో అరగంట ప్రయాణించిన తర్వాత సముద్రం లోపల ఉన్న మ్యూజియంలో రకరకాల చేపలు చూసి ఆశ్చర్య పోవాల్సిందే. అలాగే బౌద్ధ దేవాలయాలు కూడా చూడముచ్చటగా ఉంటాయి. బోట్ రైడింగ్, వాటర్లో స్కై డైవింగ్ వంటి అంశాలు మరపురానివి. – సాపిరెడ్డి విశ్వనాథ బాలాజీ (దొరబాబు), యర్రపోతవరం, కె.గంగవరం మండలం ‘ఏరా.. హోంవర్క్ చేశావా.. లేదా.. గెటౌట్ ఫ్రం క్లాస్ రూం’.. ఓ పిల్లాడిపై మాస్టారి అరుపు. ‘ఏవండీ ఆ ఫైల్ రెడీ అయ్యిందా.. ఇంకా ఎంతసేపండీ ఫైవొక్లాక్కి జీఎంతో మీటింగ్ ఉంది.. స్పీడుగా కానియ్యండి’.. ఓ ఉద్యోగిపై ఆయన బాస్ అదిలింపు. ఏమేవ్.. లంచ్బాక్స్ రెడీ అయ్యిందా.. క్యాబ్ వచ్చేసింది..’ ‘ఆ.. ఇదుగో వచ్చేస్తున్నానండీ.. అయిపోయింది..’ ఓ భార్యాభర్తల ఉదయపు హడావిడి.. పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు ఆ పనులవ్వకపోతే భూమి బద్దలైపోతుందన్నట్టు ప్రతి చోటా ఇవే అరుపులు కేకల జీవితం. ఏ ఉదయమూ మృదువైన సంభాషణలు మచ్చుకు కూడా వినపడని రోజుల్లోకి వెళ్లిపోయారు మనుషులు. ఆ ఉరుకుల పరుగుల జీవితాలకు రీచార్జింగే సెలవులు. ఎక్కడో బద్ధకిష్టులు తప్ప అత్యధికులు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అటో.. ఇటో.. ఎటో పిల్లా పాపలతో బయటకు అలా అలా తిరిగొచ్చేవారే. ఇదిగో దసరా సెలవులొచ్చాయిగా.. మనవాళ్ల ప్రణాళికలేంటో చూసొచ్చేద్దామా.. పర్యాటక వాహనాలకూ డిమాండ్ ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలను, ఇతర జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఒక రోజులో సందర్శించి వస్తున్నారు. సొంత కార్లు ఉన్నవారే కాకుండా.. మరికొందరు రోజువారీగా అద్దె వాహనాలపై పర్యాటక ప్రాంతాల్లోని అందాలు చూసి వస్తున్నారు. మరికొందరు క్రూజ్ టూర్కు ఆసక్తి కనబరుస్తున్నారు. సముద్రంలో ఓడలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. విశాఖపట్నం నుంచి చైన్నె, శ్రీలంక, అండమాన్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. -
సంపద తయారీపై అవగాహన అవసరం
సామర్లకోట: సంపద తయారీ కేంద్రాలపై ఎంపీడీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని విస్తరణ శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, కె.శేషుబాబు, జగన్నాథం అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేఽడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ఈ నెల 8వ తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా జి.రాగంపేటలోని వర్మీ కంపోస్టు యూనిట్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈటీసీ టెక్నికల్ ఫ్యాకల్టీ ఎస్కే మోహిద్దీన్, రాగంపేట పంచాయతీ కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రత సామాజిక బాధ్యత
అమలాపురం రూరల్: పరిశుభ్రత అనేది సామాజిక బాధ్యత కావాలని, నిరంతర ప్రక్రియగా శ్రమదానం చేయాలని కలెక్టర్ రావిరాల మహేష్కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవ సందర్భంగా పట్టణంలోని సర్క్యులర్ బజార్ ప్రాంగణంలో ‘ఒక రోజు, ఒక గంట, ఒకేసారి’ నినాదంతో గురువారం నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు జేసీ టి.నిశాంతి, ఆర్డీవో కొత్త మాధవి, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్ తదితరులు గంట సమయం పాటు శ్రమదానం చేసి చెత్తను తొలగించారు. కలెక్టర్, జేసీ, డీఆర్వోలు స్వయంగా చీపురు, పలుగు పట్టుకుని చెత్త తొలగించారు. తొలుత సర్క్యులర్ బజార్ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్, వార్డు సచివాలయాలు, మెప్మా విభాగాల మహిళా ఉద్యోగులు తీర్చిదిద్దిన స్వచ్ఛత రంగోలీని అధికారులు పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం కలెక్టర్ వారిచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. జేసీ, ఆర్డీవోలు మాట్లాడుతూ పరిసరాల పరిశభ్రతకు ప్రజల నిత్యం శ్రమదానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రమదానంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. -
పోస్టులు ఖాళీ.. పని భారీ..
రాయవరం మండలం కురకాళ్లపల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక కేంద్రంలో వర్కర్, హెల్పర్ కూడా లేరు. మరో కేంద్రంలో హెల్పర్ లేరు. వీటిని ఓ అంగన్వాడీ కార్యకర్త నిర్వహిస్తోంది. ఆ రెండింటినీ ఆమె ఒక్కరే ఎలా సమర్థవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. రాయవరం: ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక ఆయా ఉండాలి. టీచర్ ప్రతి రోజు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. అదే సమయంలో చిన్నారులకు పౌష్టికాహారంగా గుడ్డు, పాలు, ఆకుకూరలతో కూడిన భోజనం అందిస్తారు. అలాగే గర్భిణులు, బాలింతలకు టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్)మొదటి విడత, రెండో విడతల్లో పౌష్టికాహారం అందజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయలు ఏటా చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం, టీకాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాయి. వీటితో పాటు వివిధ పరికరాల సామగ్రి అందిస్తున్నాయి. చాలా కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదన్న విమర్శలున్నాయి. ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగ యువతులు ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని వారు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,726 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 901 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో మొత్తం 18 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలున్నాయి. వీటిలో న్యాయస్థానం పరిధిలో మూడు పోస్టులు ఉండగా, మరో తొమ్మిది పోస్టులు పదోన్నతుల్లో భాగంగా భర్తీ చేయాల్సి ఉంది. ఆరు పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. అలాగే జిల్లాలో 77 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలుగా ఉండడంతో త్వరలో కానున్న పదవీ విరమణలతో మరిన్ని ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులివీ ● పూర్తి స్థాయిలో సిబ్బంది అంగన్వాడీ కేంద్రంలో లేకపోవడం వల్ల సమర్ధవంతంగా చిన్నారులకు విద్యను అందించలేక పోతున్నారు. ● అలాగే పౌష్టికాహారాన్ని అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. ● ఆరోగ్యవంతమైన సమాజానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ● అంగన్వాడీ కార్యకర్తలపై పనిభారం అధికమవుతోంది. ● ప్రీ స్కూల్ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ● సెలవులు పెట్టుకునే అవకాశాలున్నా, ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు. సమర్ధ నిర్వహణ ఎలా? అంగన్వాడీ కేంద్రం సమర్ధవంతంగా నిర్వహించాలంటే కచ్చితంగా అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉండాలి. కాని జిల్లాలో ఏళ్ల తరబడి వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇచ్చి తక్షణమే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్న చోట హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలి. – కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్తర్వులు అందిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు అందిన వెంటనే భర్తీకి చర్యలు చేపడతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తోంది. చిన్నారులకు, బాలింతలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. – వై.విజయశ్రీ, పీఓ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగన్వాడీ చిన్నారులకు బోధన చేస్తున్న టీచర్ అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత గర్భిణులకు, బాలింతలకు అందని పోషకాహారం చిన్నారులకు అందని ప్రాధమిక విద్య జిల్లాలో 18 టీచర్లు.. 77 ఆయా పోస్టులు ఖాళీ వేరే కేంద్రాల టీచర్లకు అదనపు బాధ్యతలు పని భారంతో తప్పని సిబ్బంది అవస్థలు రెండు కేంద్రాలకు ఒకే కార్యకర్త -
శిథిల వంతెన నిర్మాణాలకు అంచనాలు
కలెక్టర్ మహేష్ కుమార్ సాక్షి, అమలాపురం: రానున్న పుష్కరాల నాటికి జిల్లాలోని పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనల పునర్నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆ శాఖ ఇంజినీర్లతో శాఖాపరమైన పథకాల అమల్లో పురోగతి, పెండింగ్ ప్రతిపాదనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓఎన్జీసీ భారీ వాహనాలు రాకపోకలు సాగించే రహదారులకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులు, మరమ్మతులపై ఆరా తీశారు. ధాన్యం, ఆక్వా రంగ కార్యకలాపాలు, ఇసుక రవాణా సాగించే రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయాలన్నారు. ఈదరపల్లి నూతన వంతెన వద్ద జంక్షన్ సుందరీకరణ పనులు అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా రోడ్ల నిర్మాణ పనుల మ్యాపింగ్, రహదారుల ప్రతిపాద నలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. లొల్ల–ఆత్రేయపురం రహదారి నిర్మాణ పనులను పుష్కర పనుల ప్రతిపాదనలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ బి.రాము, డివిజనల్, అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నికల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జీఎస్టీ ప్రయోజనాలపై అవగాహన ఈనెల 22 నుంచి అమలవుతున్న జీఎస్పీ ప్రయోజనాలపై వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్, జీఎస్టీ 2.0 సంస్కరణల కోనసీమ నోడల్ జిల్లా అధికారి సీహెహచ్ రవికుమార్తో సమీక్షించారు. అత్యవసర వస్తువులపై పన్నులు గణనీయంగా తగ్గాయని, వ్యవసాయ యంత్రాలు, జన ఆరోగ్య సేవలు, విద్యా సేవలకు తక్కువ జీఎస్టీ వర్తింపజేశారని కలెక్టర్ పేర్కొన్నారు. గృహోపకరణాలపైనా జీఎస్టీ తగ్గించారని, ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పూర్తి మినహాయింపు ఇచ్చారన్నారు. జిల్లా స్థాయిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ మార్పులపై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన రంగాలలో ఈ అంశంపై మరింత అవగాహన పెంచాలన్నారు. అత్యవసర ఔషధాలపై జీఎస్టీ జీరోగా నిర్ణయించారన్నారు. వ్యాపారులు జారీ చేస్తున్న బిల్లులను పరిశీలించి జీఎస్టీ తగ్గించినదీ, లేనిదీ పర్యవేక్షించాలన్నారు. కార్య క్రమంలో జేసీ టి.నిశాంతి, డీఎస్వో అడపా ఉదయభాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళిక జిల్లాలో అతి పురాతనమైన దేవాలయాలను టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి టూరిజం కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంతర్వేది అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, మురమళ్లలకు మాస్టర్ ప్లాన్ రూపొందించి టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అంతర్వేది లైట్ హౌస్ దగ్గర పర్యాటక శాఖకు 9 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. లొల్ల లాకులు వద్ద జల వనరుల శాఖకు చెందిన 6.7 ఎకరాలు, వాడపల్లి వద్ద దేవాలయ భూమి 3.10 ఎకరాలు ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, జిల్లా టూరిజం అధికారి అన్వర్, డీఆర్డీఏ పీడీ గాంధీ జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేరం వారిది.. శిక్ష వీరికి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ అండదండ లుంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేయవచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టున్నారు. అక్రమాలకు పాల్పడినా ఇట్టే తప్పించేసుకుని, చిరుద్యోగులను బలి చేసేయవచ్చని అనుకుంటున్నారేమో! నేరం ఒకరిది.. శిక్ష మరొకరికి అన్న చందంగా.. యూరియా సరఫరాలో చేతివాటం చూపుతూ కింది స్థాయి సిబ్బందిని బలి చే స్తున్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలోని ప్రాథ మిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో తాజాగా ఇటువంటి ఉదంతం చోటు చేసుకుంది. ఇటీవల జిల్లాలో సంచలనం రేపిన చేబ్రోలు యూ రియా బాగోతాన్ని తలదన్నేలా ఒమ్మంగి పీఏసీఎస్లో తెలుగు తమ్ముళ్లు యూరియా దోపిడీకి తెగబడ్డారు. ఏం జరిగిందంటే.. ఒమ్మంగి సొసైటీకి రెండు విడతల్లో 90 టన్నుల యూరియా వచ్చింది. రెండో విడత వచ్చిన యూరియాలో ఆ సొసైటీకి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత ప్రోద్బలంతో సుమారు 170 బస్తాలను ఆ పార్టీ సానుభూతిపరులకు దోచి పెట్టేశారు. ఎకరం ఉన్నా, ఐదెకరాలున్నా ఆధార్ కార్డు చూసి ఒకటి రెండు యూరియా బస్తాలు ఇవ్వడమే గగనమైన తరుణంలో.. అధికారం అండ, అడిగేవారెవరున్నారనే తెగింపుతో ఏకంగా 170 బస్తాల యూరియాను పక్కదారి పట్టించేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు ఒమ్మంగి సొసైటీలో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టి నలుగురు అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఒకరు 50, మరో ముగ్గురు 40 మొత్తంగా 90 యూరియా బస్తాలు కొన్నట్టు గుర్తించారు. పీఏసీఎస్ అటెండర్ రామకుర్తి వంశీ, సొసైటీ చిరుద్యోగి సుంకర గంగాధర రామారావుతో పాటు మరో ఇద్దరు బయటి వారు కలిసి వాటిని తీసుకున్నట్టు తేల్చారు. అసలైన పెద్దలను తప్పించి.. యూరియాను పక్కదారి పట్టించిన నలుగురిలో ఇద్దరు అదే సొసైటీ చిరుద్యోగులని చెప్పడం సందేహాలకు తావిస్తోంది. విషయం బయట పడటంతో అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి, ఈ సంఘటనను మసి పూసి మారేడు కాయ చందంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోటాకు మించి బస్తాలను తరలించుకుపోయిన పెద్దలను తప్పించి చిరుద్యోగులను బలి చేశారని రైతులు తూర్పార పడుతున్నారు. ఒమ్మంగి సొసైటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న ఇద్దరు టీడీపీ కీలక నేతలు కనుసన్నల్లోనే ఈ తంతు సాగిందని అంటున్నారు. ఒకేసారి యూరియా భారీగా వచ్చిన నేపథ్యంలో దీని విక్రయాలు క్రమపద్ధతిలో జరపలేని గందరగోళంలో ఎవరెంత తీసుకువెళుతున్నారో తెలియలేదని మరో కట్టుకథ అల్లారంటున్నారు. ఇతరుల పేరిట దోపిడీ! మొత్తం 170 బస్తాల యూరియాను దారి మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇదే సొసైటీలో మరో పెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురి ఆధార్ కార్డులు సేకరించి, వారి పేరున పెద్ద ఎత్తున యూరియా దోచేసినట్టు బయటపడింది. అధికారులు గుర్తించిన దాని కంటే రెండుమూడు రెట్లు అధికంగా యూరియాను తెలుగు తమ్ముళ్లు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సొసైటీలో బస్తా రూ.266కు కొనుగోలు చేసి బ్లాక్లో రూ.350 నుంచి రూ.400కు అమ్మి వారు సొమ్ములు వెనకేసుకున్నారనే విషయం ఒమ్మంగిలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ‘తమ్ముళ్ల’ యూరియా దోపిడీ ఒమ్మంగి సొసైటీలో వెలుగు చూసిన బాగోతం 170 బస్తాలు పక్కదారి ఇద్దరు నేతల క్రియాశీలక పాత్ర చిరుద్యోగులను బలి చేసే యత్నం -
ఎయిడ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు
అమలాపురం టౌన్: ఎయిడ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తూ జిల్లాలో ఆ వ్యాధికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లాలో చేపట్టిన హెచ్ఐవీ నియంత్రణ చర్యలపై గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చి నిర్దేశిత లక్ష్యాలపై సమీక్షించారు. ఏఆర్టీ సేవలు హెచ్ఐవీ రోగులకు సజావుగా అందాలన్నారు. గర్భిణులకు సరైన చికిత్స అందించడం ద్వారా పిల్లలకు హెచ్ఐవీ రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి.బాలాజీ, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబు, జిల్లా మానటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీసర్ ఎంవీ రతన్రాజుతో పాటు డీఎస్ఆర్సీ ఏఆర్టీలు, ఎన్జీవోలు పాల్గొన్నారు. వీఆర్కు సోషల్ మీడియా సీఐఅమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సీఐగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వరరావుపై వీఆర్ వేటు పడింది. ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్పీ రాహుల్ మీనా గురువారం ఆయనకు రిలీవ్ ఆర్డర్లు ఇచ్చారు. దాదాపు 15 ఏళ్లుగా జిల్లాలో పనిచేస్తున్నారన్న అభియోగంపై ఆయనను వీఆర్కు పంపించినట్లు తెలిసింది. కాగా ఎస్పీ కార్యాలయంలో రెండు జిల్లా పోలీస్ విభాగాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు సీఐలలో ఒకరిని పొరుగు జిల్లాకు బదిలీ చేసేందుకు, మరో సీఐని వీఆర్కు పంపించేందుకు నిర్ణయం జరిగినప్పటికీ అమలాపురంలో జర గనున్న దసరా ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల వారి బదిలీలకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లు తెలిపింది. దసరా తర్వాత వీరి బదిలీ జరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్తపేట స్టేషన్లో ఎస్పీ తనిఖీ కొత్తపేట: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలిస్తున్నారు. దానిలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. వస్తూనే స్టేషన్ ఆవరణ, లోపల విభాగాలు, సెల్, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ స్థితిగతులు, కేసులపై ఎస్సై జి.సురేంద్రను ఆరా తీశారు. పలు అంశాలపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడేదిలేదన్నారు. అందరూ అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఆదేశించారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ కోరారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక ఆధ్వర్యాన వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని సచివాలయ ఉద్యోగుల కార్యాచరణపై స్థానిక 48వ డివిజన్ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రచార పిచ్చి
అనపర్తి: అధికార పార్టీ ప్రచార పిచ్చి ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది. అనుమతులు లేకుండా ఊరంతా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. బిక్కవోలు గ్రామానికి చెందిన గువ్వల విజయలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులు బుధవారం మోటార్ సైకిల్పై అనపర్తిలోని కంటి ఆసుపత్రికి వెళుతున్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న వంతెన వద్ద స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ఆకస్మికంగా ఆ దంపతులపై కూలింది. దీంతో వారు కింద పడిపోగా, ఫ్లెక్సీ ఫ్రేమ్ ఊచలు విజయలక్ష్మి తలకు నాలుగు అంగుళాల మేర చీరుకుని తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను స్థానిక కానిస్టేబుల్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆమె భర్త హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఫ్లెక్సీని కర్రలకు కట్టకుండా జార వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సి వస్తుందని ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా టీడీపీ నాయకులు ఆ ఫ్లెక్సీని మళ్లీ అలాగే జారేయడం గమనార్హం. ఎమ్మెల్యే ఫ్లెక్సీ పడి మహిళకు తీవ్ర గాయాలు -
‘నన్నయ’లో ప్రీ రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక
రాజానగరం: ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులలో సేవా దృక్పథం, క్రమశిక్షణ, విలువలు, సమాజంపై అవగాహన వంటివి అలవడుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలో వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ సెలక్షన్స్ బుధవారం జరిగాయి. గోదావరి జిల్లాల నుంచి 190 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు హాజరై, తమ ప్రతిభను కనబరిచారు. ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ ఎం.రామకృష్ణ మాట్లాడుతూ, ఈ క్యాంప్లో ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ప్రీ ఆర్డీ క్యాంప్కి ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు హైట్, రన్నింగ్ రేస్, మార్చ్ఫాస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు, ఇతర టాలెంట్ను పరిశీలించడానికి ఇంటర్ూయ్వలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ సంజయ్, పీఓలు, పీఈటీలు పాల్గొన్నారు. -
కుప్పకూలిన పవన్ భారీ కటౌట్
జన సంచారం లేకపోవడంతో తప్పిన ముప్పు కాకినాడ క్రైం: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. భారీ కటౌట్ కుప్పకూలగా.. అక్కడ జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గురువారం ‘ఒజి’ చిత్రం విడుదల సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మరో జనసేన నేత నున్న దొరబాబు పేర్లతో నిత్యం రద్దీగా ఉండే భానుగుడి జంక్షన్లో 70 అడుగుల భారీ పవన్కల్యాణ్ కటౌట్ను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ కటౌట్ కుప్పకూలింది. భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల బరువు తాళలేక ఆ కటౌట్ను నిలిపిన కర్రలు తునాతునకలయ్యాయి. కటౌట్ రోడ్డుపై కూలగా.. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కటౌట్ను రోడ్డు మధ్య నుంచి అతికష్టంగా పక్కకు నెట్టారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పార్టీ లీడర్లు ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ, ప్రజల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. -
జయలక్ష్మి సొసైటీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలి
అమలాపురం టౌన్: అనేక మంది విశ్రాంత ఉద్యోగులు జయలక్ష్మి కో–ఆపరేటివ్ సొసైటీ మోసాలకు బలవ్వగా, నేటికీ న్యాయం జరగలేదని కోనసీమ ప్రాంతానికి చెందిన ఆ సొసైటీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఏఎస్ఎన్ కళాశాలలో విశ్రాంత తహసీల్దార్ భాస్కర వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జయలక్ష్మి సొసైటీ బాధితుల సమావేశం జరిగింది. ప్రస్తుత సొసైటీ బోర్డు పూర్తి రాజీనామా చేసి, దాని స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది రాజమహేంద్రవరం సీఐడీ కోర్టులో జయలక్ష్మికి చెందిన నలుగురు మేనేజర్లపై అవినీతి కేసులు నమోదైనా, ప్రస్తుత బోర్డు వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. మొత్తం 2,450 మంది ఈ సొసైటీలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేదని పేర్కొంది. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ట్రిబ్యునల్లో కేసులు పెట్టారని గుర్తు చేసింది. రుణాలు తిరిగి చెల్లించని వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఏ విధమైన ఆదాయం రాకుండా, వాటికి తాళాలు వేసి అలాగే వదిలేశారని విజయవాడకు చెందిన టీవీడీఎన్ ప్రసాదరావు తెలిపారు. అన్నింటా విఫలమైన ప్రస్తుత బోర్డు సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు భాస్కర్ మీనన్ మాట్లాడుతూ, అమలాపురం సొసైటీ బ్రాంచి నుంచి రుణాలు తీసుకున్న వారంతా తిరిగి చెల్లించినా, మిగిలిన బ్రాంచీల్లో రుణాలు తీసుకున్న వ్యక్తులు ఎగ్గొట్టడం వల్లే ఇక్కడి సభ్యులైన బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ బాధితులు, విశ్రాంత ఉద్యోగుల గుళ్లపల్లి వెంకట్రామ్, వేదనభట్ల కళా పూర్ణారావు, జి.కృష్ణారావు, తురగా చిన్న, ఇళ్ల నరసింహారావు, పుత్సా కృష్ణ కామేశ్వర్, రెహమాన్, రాజ్కుమార్, మావుళ్లయ్య, అర్జునుడు, నాగ అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు. కాకినాడలో 5న డైరెక్టర్ పదవులకు ఎన్నిక కాకినాడ రూరల్: స్థానిక ది జయలక్ష్మి కోఆపరేటివ్ మాక్ సొసైటీలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు అక్టోబర్ 5వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల ఆఫీసర్ కంబాల శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం 5వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ పేర్రాజుపేట, మున్సిపల్ గరల్స్ హైస్కూల్లో ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు డైరెక్టర్ పదవులకు ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్థానిక సర్పవరం జంక్షన్లోని సొసైటీ హెడ్ ఆఫీస్లో నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల అధికారి తెలిపారు.బాధితుల సమావేశం డిమాండ్ -
అరటి ఫైబర్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి
అమలాపురం రూరల్: పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో భాగంగా అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి రైతుల జీవనోపాధి మెరుగుపర్చాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఉద్యాన, పరిశ్రమల కేంద్రం అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరంలో అరటి నార ఉత్పత్తుల తయారీ యూనిట్ను సందర్శించి, అరటినార ఆధారిత చేతివృత్తి ఉత్పత్తుల తయారీ ప్రక్రియను ఉద్యాన అధికారి బీవీ రమణతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఉద్యాన అధికారి రమణ కలెక్టర్కు వివరించారు. రావులపాలెం మండలంలో అరటి నార సేకరిస్తున్నారని, దీంతో రాజమహేంద్రవరంలో చేతివృత్తి ఉత్పత్తుల తయారీ జరుగుతోందన్నారు. అరటి సాగవుతున్న రావులపాలెం ప్రాంతంలో అరటి నార ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని పెంచడంతో పాటు, గ్రామీణ స్థాయిలో చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను అరటి ఫైబర్ పరిశ్రమ సృష్టించగలదన్నారు. కోనసీమ జిల్లాలో సుమారు 24 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతోందని చెప్పారు. ఒక్కో చెట్టుకు 200 గ్రాముల అరటి నార, పది కిలోల వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తాయని, దీని ద్వారా ఎకరానికి 160–200 కిలోల అరటి నార సేకరించవచ్చన్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో నార రూ.200 ఉండటంతో, రైతులకు ఎకరానికి రూ.32 వేల నుంచి రూ.40 వేల అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. సత్వర న్యాయం చేయాలి అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు, బాధితుల పునరావాసంతో పాటు, సత్వర న్యాయానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పౌర హక్కుల రక్షణ చట్టంపై జిల్లా స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశ మినిట్స్పై తీసుకున్న చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జ్యోతిలక్ష్మీదేవి సభ్యులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాలు అందించడంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచిందన్నారు. వసతి గృహ బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు బేసిక్ ఎమర్జెన్సీకి ఐసీఐసీఐ లాంబార్డ్ గ్రూపు ఇన్సూరెన్స్ను సీఎస్సార్ ద్వారా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తద్వారా రూ.50 వేల బీమా పరిహారం అందుతుందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 44 యూనిట్లకు రూ.376 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్దేశిత సమయంలో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 కేసులుండగా, 19 కేసులకు ఎఫ్ఐఆర్ దశలో రూ.12 లక్షలు, చార్జిషీట్ దశలో ఆరు కేసులకు రూ.6 లక్షలు పరిహారాలుగా అందించారన్నారు. కమిటీ సభ్యులు పుణ్యమతుల రజిని, డీఆర్ఓ కె.మాధవి, ఆర్డీవోలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.ఉద్యాన, పరిశ్రమల కేంద్రం అధికారులతో కలెక్టర్ -
ఆరోగ్య భాగస్వామి.. ఫార్మసిస్ట్
రాయవరం: రోగికీ, వైద్యునికీ మధ్య వారధిగా, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామిగా ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పూర్వం ఫిజీషియన్ స్వయంగా ఔషధాలను తయారు చేసేవారు. కాలక్రమంలో ఔషధ ఉత్పత్తి రంగం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. నిపుణులైన ఔషధ ప్రయోక్తలే ఫార్మసిస్టుగా అవతరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆరోగ్య రక్షణ నిపుణుల సమూహంగా ఫార్మసిస్టులు ఉన్నారు. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ, ఔషధ నియంత్రణ, పరిశోధన–అభివృద్ధి, బోధన వంటి పలు రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు. ఫార్మసిస్ట్ డే ప్రాముఖ్యమిదీ.. 1912 సెప్టెంబర్ 25న నెదర్లాండ్లోని హేగ్ నగరంలో ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్(ఐపీఎఫ్) ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తునారు. ఈ ఏడాది థింక్ హెల్త్.. థింక్ ఫార్మాసిస్ట్ అనే నినాదంతో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అతి పెద్ద రంగంగా.. కాలానుగుణంగా ప్రపంచంలో మందుల తయారీ అతి పెద్ద రంగంగా అవతరించింది. కొత్త రకం వైరస్లు అవతరిస్తూ.. కొత్త రోగాలు వస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు మందుల తయారీ సవాలుగా మారింది. ఎలాంటి రోగానికై నా మందును కనుగొనే ఫార్ములానైనా ఫార్మాసిస్ట్లు తమ భుజాలపై వేసుకుని, ప్రపంచ జనాభాకు అనుగుణంగా, వివిధ ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మందులు తయారు చేస్తున్నారు. మందుల తయారీ నుంచి పేషెంట్కు చేరే వరకు అన్ని విషయాల్లో ఫార్మసిస్ట్లదే కీలక పాత్ర. ఫార్మసీ కోర్సులు చదివితే.. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు మార్కుల ఆధారంగా ఫార్మసీ సీట్లు కేటాయిస్తారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివితే మెడికల్ షాపు పెట్టుకోవడానికి అర్హత వస్తుంది. ఆపై బీఫార్మసీ చేసిన వారు ల్యాబ్స్లో ఔషధాలకు సంబంధించి పని చేస్తారు. ఎం.ఫార్మసీ చేసిన వారు ఔషధ తయారీ సంస్థల్లో నూతన ఔషధాలు, కాంబినేషన్లు కనిపెట్టడం, పరిశోధించడం, క్వాలిటీ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉంటారు. అలాగే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులను కూడా చేయవచ్చు. కోనసీమలో పరిస్థితి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డైరెక్టర్ సెకండరీ హెల్త్ పరిధిలో ఇద్దరు చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లు, తొమ్మిది మంది సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లు, 16 మంది ఫార్మసీ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే జిల్లాలో మూడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులుండగా, ప్రతి ఏరియా ఆస్పత్రిలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్, నలుగురు ఫార్మసీ పోస్టులు ఉంటాయి. తొమ్మిది సీహెచ్సీలుండగా, ప్రతి సీహెచ్సీలో సీనియర్ ఫార్మసీ, ఫార్మసీ ఆఫీసర్ ఉంటారు. అదేవిధంగా 46 పీహెచ్సీలు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఫార్మసిస్ట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫార్మసిస్ట్ గ్రేడ్–2 ఫార్మసీ ఆఫీసర్గా మార్పు చేశారు. పూర్తి బాధ్యత ఫార్మసిస్ట్దే.. మందులు పేషెంట్కు చేరే వరకు పూర్తి బాధ్యత ఫార్మసిస్టులదే. మందుల స్టోరేజీ, బ్యాచ్ నంబర్, కాలం చెల్లే తేదీ, క్వాలిటీ వంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పేషెంట్కు ప్రమాదం. గత 12 ఏళ్లుగా ఉద్యోగం చేసిన అన్ని ప్రాంతాల్లో సంతప్తికరమైన సేవలు అందించాను. – సీహెచ్ పేరిందేవితాయారు, ఫార్మసిస్ట్, పీహెచ్సీ, రాయవరం వైద్యులతో సమానంగా సేవలు ఫార్మసిస్టులకు మాత్రమే వైద్యులతో సమానంగా సేవలందించే అవకాశం ఉంటుంది. కరోనా విజృంభించిన సమయంలో నిరంతర సేవలు అందించాం. కరోనా బారిన పడినా, తిరిగి విధుల్లో చేరి పేషెంట్లకు అవసరమైన మందులు ఆందిస్తూ, వారు కోలుకునేందుకు చేసిన సేవలు వృత్తిపరంగా సంతృప్తినిచ్చాయి. – ఎన్ వసంతరావు, ఫార్మసిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం తయారీ నుంచి మందులు పేషెంట్కు చేరే వరకు పూర్తి బాధ్యత కొత్తగా వచ్చే వ్యాధులను అడ్డుకోవడంలో కీలకపాత్ర 25న ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం -
మంత్రి గారి ఆదేశాలు.. దివ్యాంగులకు అగచాట్లు
రామచంద్రపురం రూరల్: మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో నెల రోజులుగా రామచంద్రపురం ఎంఈఓ కార్యాలయం తాళాలు వేసి దర్శనమిస్తోంది. రెండంతస్తుల భవనంలో పైన ఎంఈఓ కార్యాలయం ఉండగా, కింద దివ్యాంగ విద్యార్థుల భవిత కేంద్రం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మహిళలకు కుట్టు మెషీన్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు ఎంఈఓ కార్యాలయంలో గత ఏప్రిల్లో ప్రారంభించారు. నెల రోజుల క్రితం శిక్షణ పూర్తయినా, కార్యాలయంలో కుట్టు మెషీన్లు ఉండిపోవడంతో మీటింగ్ హాల్ను ఇంకా ఎంఈఓకు అప్పగించలేదు. శిక్షణకు వచ్చే మహిళలకు మరుగుదొడ్లకు ఇబ్బంది అవుతుందని ఎంఈఓ ఆఫీసును కింద ఉన్న దివ్యాంగుల భవిత పాఠశాలలోకి మార్చేశారు. దీంతో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీని ఆరుబయట వరండాలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి తీరుతో దివ్యాంగ చిన్నారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికై నా మంత్రి తన తప్పును సరిదిద్దుకుని ఎంఈఓ కార్యాలయాన్ని పై అంతస్తులోకి తరలించాలని, భవిత కేంద్రాన్ని దివ్యాంగ చిన్నారులకు పూర్తి స్థాయిలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఫ నెల రోజులుగా ఎంఈఓ ఆఫీస్కు తాళం ఫ చిన్నారులకు వరండాలో ఫిజియోథెరపీ -
సత్యదేవుని సన్నిధిలో రీల్స్ షూటింగ్
● పవిత్ర నక్షత్ర వనంలో నృత్యాలు ● మండిపడుతున్న భక్తులు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని రెండు యువ జంటలు బుధవారం తమ రీల్స్ షూట్కు వేదికగా చేసుకున్నాయి. ఓవైపు దసరా నవరాత్రుల సందర్భంగా దేవస్థానంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇలా సినిమా పాటలకు స్టెప్పు లేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం దేవస్థానంలోని సత్యగిరిపై ఘాట్ రోడ్, నక్షత్ర వనంలో నాగార్జున, దుర్గ, లోవరాజు లక్ష్మి సినిమా పాటలకు స్టెప్పులేశారు. తర్వాత ఆ రీల్స్ను సంక్రాంతి పేరుతో, డ్రైవర్ రాజు అనే పేరుతో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దేవస్థానం 27 నక్షత్రాల పేరుతో పవిత్రమైన వృక్షాలను పెంచుతున్న నక్షత్ర వనం లోపలకు వెళ్లి మరీ స్టెప్పులేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నా వీరు దర్జాగా రీల్స్ షూట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. దేవస్థానంలో సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ఓడలరేవు తీరంలో బోటు దగ్ధం
రూ.పది లక్షలకు పైగా నష్టం అల్లవరం: ఓడలరేవు వైనతేయ నదీ తీరం జెట్టీ వద్ద మరమ్మతులు నిర్వహిస్తున్న బోటు మంగళవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మండలంలోని కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొపనాతి శంకరానికి చెందిన బోటుకు రెండు నెలలుగా మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తయి.. చేపల వేటకు సిద్ధమవుతున్న తరుణంలో మత్స్యకార బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. కాలిపోతున్న బోటుని కాపాడేందుకు స్థానికులు ఓడలరేవు ఓఎన్జీసీకి చెందిన ఫైరింజిన్ విభాగానికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం అంతు చిక్కడం లేదు. అర్ధరాత్రి బోటు అగ్ని ప్రమాదానికి గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే బోటు యజమానికి చెందిన మరో బోటు వైనతేయ నదిలో లంగరు వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. బోటుకు ఎవరైనా నిప్పు పెట్టారా లేక యాదృచ్చికంగా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై బోటు యజమాని శంకరం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ముగిసిన 11 జిల్లాల టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరిక నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని సీనియర్ ఫ్యాక్టలీలు డి.శ్రీనివాసరావు, ఎస్ఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు వరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు నిర్వహించిన ఆరో బ్యాచ్ శిక్షణ బుధవారంతో ముగిసింది. మొత్తం 300 మంది టీఓటీలకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు ఫ్యాకల్టీలు వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండల పరిధిలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు జగన్నాథరావు, రామకృష్ణ, కె.శేషుబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
నేడు యూటీఎఫ్ రణభేరి
రాయవరం: సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి పేరుతో మోటార్ సైకిల్ జాతా నిర్వహించారు. యాప్ల పని భారం తగ్గించాలని, బోధనేతర పనులు వద్దని కోరుతూ, అలాగే వారి ఆర్థిక సమస్యల నేపథ్యంలో గురువారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా యూటీఎఫ్ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, సుబ్బారావు తెలిపారు. భక్తిశ్రద్ధలతో అహోరాత్ర లలితా పారాయణ ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో తృతీయ అహోరాత్ర లలితా సహస్ర నామ పారాయణ అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా లలితా భక్త మండలి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మొదలైన ఈ పారాయణ మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఆలయ అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమిషనర్, ఈవో వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వంతెన పనులు పరిశీలించిన ఏఐఐబీ బృందం పి.గన్నవరం: ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం వశిష్ట నదిపాయపై రూ.71.42 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐ బీ) ప్రతినిధుల బృందం బుధవారం పరిశీలించింది. వరదల సీజన్లో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూ రుగులంక గ్రామాల ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపై రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వంతెన నిర్మాణ పనులను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల రూ.21 కోట్లు విడుదల చేసింది. వంతెన నిర్మాణ పనులను ఏఐఐబీ ప్రతినిధుల బృందం ప్రతినిధి పవన్ కార్కి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అశోక్కుమార్, సోషియల్ ఎక్స్పర్ట్ శివరామకృష్ణ, ఏవీఎస్ శ్రీనివాస్, పీఆర్ ప్రాజెక్టు విభాగం ఎస్ఈ ఏవీఎస్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో వారు చర్చించారు. ఇంత వరకూ 60 శాతం మేర పనులు జరిగినట్టు కాంట్రాక్టు సంస్థ అధినేత పీపీ రాజు, పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు ఆ బృందానికి వివరించారు. ఇప్పటి వరకూ జరిగిన పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫినిషింగ్ పనులు పూర్తి కాకపోయినా, వచ్చే వరదల సీజన్ నాటికి ప్రజలు వంతెనపై నడచి వెళ్లేలా అవకాశం కల్పించాలని కార్కి సూచించారు. ఈ సందర్భంగా ఏఐఐబీ ప్రాజెక్ట్ మేనేజర్ పీవీ రమణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏఐఐబీ ద్వారా రూ.3,520 కోట్లతో 4 వేల కిలోమీటర్ల మేర రోడ్లు, ఆరు హై లెవెల్ వంతెనలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మూడు వంతెనలు 50 శాతం మేర, మరో మూడు వంతెనలు 25 శాతం మేర పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈఈ పులి రామకృష్ణారెడ్డి, ఏఈఈ పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన మత సామరస్యం
దసరా అన్న సమారాధనల్లో ముస్లిం మహిళ సేవలు అమలాపురం టౌన్: సేవకు కులాలు, మతాలు అడ్డురావడానికి అమలాపురానికి చెందిన ముస్లిం మహిళ మెహబూబ్ షకీలా నిదర్శనంగా నిలుస్తారు. స్థానిక శ్రీదేవి మార్కెట్లోని శ్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు దాతల విరాళాలతో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ అన్నదానంలో షకీలా మొదటి పంక్తి నుంచి చివరి దాకా తానూ భోజనాలు వడ్డించి సేవలు అందిస్తున్నారు. ఏటా ఈ ఆలయం వద్ద అమ్మ సన్నిధిలో జరిగే అన్నదానాల్లో దసరా తొమ్మిది రోజులూ షకీలా భోజనాలను భక్తులకు కొసరి కొసరి మరీ వడ్డిస్తుంది. ముస్లిం మహిళ అయినప్పటికీ ఆమె ఆలయం వద్ద జరిగే అన్నదాన కార్యక్రమాల్లో సేవలు అందించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. -
షట్టర్ వంచి.. ఆపై అద్దాన్ని పగులగొట్టి..
● నగల దుకాణంలో 11 కిలోల వెండి చోరీ ● ఆభరణాల విలువ రూ.2 లక్షలు ప్రత్తిపాడు రూరల్: దుకాణం షట్టర్ను పైకి వంచి.. దానిని ఆనుకుని ఉన్న అద్దాలను పగులగొట్టిన దొంగలు నగల దుకాణాన్ని కొల్లగొట్టిన ఉదంతమిది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక అల్లూరి సీతారామరాజు జంక్షన్ సమీపంలో సురేష్ జ్యూయలర్స్ అండ్ బ్యాంకర్స్లో మంగళవారం అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు దొంగలు దుకాణం వద్దకు చేరుకుని, షట్టర్ కింది భాగాన్ని ఇనుప రాడ్లతో పైకి వంచి, షట్టర్కు ఆనుకుని ఉన్న అద్దాలను పగలుగొట్టారు. దాని ద్వారా లోనికి ప్రవేశించిన నలుగురు దుకాణంలో ఉన్న రూ.2 లక్షలు విలువైన 11 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించారు. దుకాణంలోని లాకర్ను తెరిచేందుకు వారు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంలో చేతికందిన వెండి ఆభరణాలను తస్కరించారు. లాకర్లో బంగారు వస్తువులు ఉన్నాయి. ఆయా ఘటనల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సైలు ఎస్ లక్ష్మీకాంతం, శ్రీహరిరాజు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఫారెస్టు చెక్ పోస్ట్ వైపు కాలినడకన వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టు తెలిసింది. గ్రామంలోని దుర్గమ్మ గుడి వీధిలో మోటార్ బైక్ మంగళవారం రాత్రి చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు గుడివాడ వెంకటసత్య రవి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ప్రచారం పీక్
రాజమహేంద్రవరం లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడుతున్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరంలో బస వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బారులు తీరిన ఎంపికై న అభ్యర్థులుసాక్షి, అమలాపురం: పావలా కోడికి ముప్పావలా మషాలా అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ తీరు. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నట్టుగా సాగుతోంది. పుష్కరాలైనా.. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో జనాన్ని తరలించుకువచ్చి మీడియాలో హైప్ సృష్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే తాజా డీఎస్సీలో కష్టపడి ఉద్యోగాలు పొందిన వారికి ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈవెంట్గా మార్చేస్తున్నారు చంద్రబాబు. కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఇది వ్యయప్రయాసలకు గురి చేస్తోంది. మెగా డీఎస్సీ–2025 పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ మొదలు.. ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేయడం వరకూ ప్రతి విషయంలోనూ హంగూ ఆర్భాటానికి పెద్దపీట వేస్తోంది. చిన్న పని చేసినా విపరీత ప్రచారం కల్పించుకోవడం సీఎం చంద్రబాబు కోరుకుంటారనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేసిన డీఎస్సీ విషయంలోనూ అదే తీరును కనబరుస్తున్నారు. ఫోన్లలో సందేశాలు తొలుత ఈ నెల 19న విజయవాడ వేదికగా నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. వాతావరణం అనుకూలంగా లేదని దానిని వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 25న అమరావతి రావాలంటూ ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అమరావతికి రావాలని విద్యా శాఖ కార్యాలయం నుంచి ఫోన్ సందేశాలు ఎంపికై న అభ్యర్థులకు వస్తున్నాయి. అభ్యర్థితో పాటు ఓ సహాయకుడిని కూడా తీసుకురావాలంటూ ఫోన్లో సమాచారం అందిస్తున్నారు. దీనిపై ఎంపికైన అభ్యర్థులు మండిపడుతున్నారు. వ్యయప్రయాసలకు లోనై అక్కడికి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. 3,500 మందికి ఏర్పాట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,349 మంది టీచర్లు ఎంపికై నట్టు ప్రకటించారు. జోనన్–2 నుంచి టీజీటీ, పీజీటీకి ఎంపికై న194 మంది ఉపాధ్యాయులనూ జిల్లా నుంచే సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 15న డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. నియామకపత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం రా జకీయ ప్రచారంగా మలచుకుంటోంది. ఈ ప్రక్రియ ను రాష్ట్ర స్థాయిలో అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా రావాలని విద్యా శాఖ అధికారులు సందేశాలు పంపారు. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి జిల్లా నుంచి అమరావతి వెళ్లేందుకు అభ్యర్థులు కనీసం 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. వీరిలో మహిళలు, గర్భణులు, చిన్న పిల్లలతో ఉన్నవారున్నారు. వీరంతా ప్రయాసలకోర్చి నియామక ఉత్తర్వులు అందుకోవడానికి వెళ్లాల్సిందే. అలా కాకుండా ప్రతి జిల్లాలో కార్యక్రమం పెట్టి.. నియామక పత్రాలు ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,543 మంది అభ్యర్థులు, వారితో పాటు మరో 1,543 మంది సహాయకులు వెళ్లాల్సి ఉంది. వీరికి 288 మంది ఉపాధ్యాయులను ఎస్కార్టుగా నియమించారు. పది మంది వైద్య సిబ్బంది, 12 మంది విద్యా శాఖ ఉన్నతాధికారులు కలిపి మొత్తం 3,528 మంది వరకు వెళ్లనున్నారు. మొత్తం 72 బస్సులను ఏర్పాటు చేశారు. డ్యూటీలు పడిన వారికీ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కావడంతో లోపల నొచ్చుకుంటూనే బయటకు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి. పైగా నేరుగా వెళ్లేందుకు వీల్లేకుండా, అందరినీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రావాల్సిందిగా నిర్దేశించారు. వీరందరికీ స్థానికంగా శ్రీచైతన్య, బీవీఎం ఉన్నత పాఠశాల, లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్, సత్యసాయి గురుకులం, సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం (బొమ్మూరు)లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరు గురువారం ఉదయం బయలుదేరి అమరావతి వెళ్లాల్సి ఉంది.ముందెన్నడూ లేదు డీఎస్సీ నియామకాల సమయంలో గతంలో ఎప్పుడూ ఈస్థాయి ప్రచారం చేసుకున్న ఘనత మరే ప్రభుత్వానికీ, మరే ముఖ్యమంత్రికీ దక్కలేదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 2008 మెగా డీఎస్సీ ప్రకటించారు. ఏకంగా 52,655 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఎన్నికలు రావడం, వైఎస్సార్ రెండోసారి సీఎం అయినా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తర్వాత సీఎం అయిన రోశయ్య కాలంలో ఈ పోస్టులు భర్తీ అయ్యాయి. మెరిట్ లిస్టు ప్రకటించడం, తర్వాత రెండు, మూడు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం అంతా కేవలం నాలుగైదు రోజుల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం 16,347 పోస్టులు మాత్రమే. కానీ ప్రచారం మాత్రం పీక్ స్టేజ్లో నిర్వహిస్తున్నారు. నేడు అమరావతిలో డీఎస్సీ నియామకపత్రాల అందజేత ఆర్డర్లకు అభ్యర్థులు 250 కిలోమీటర్లు వెళ్లాల్సిందే.. రాజమహేంద్రవరంలో రాత్రి బస అక్కడి నుంచి అమరావతికి ప్రయాణం మండిపడుతున్న ఎంపికై న ఉపాధ్యాయులు గతంలో ఎన్నడూ లేని విధానం -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మలికిపురం: ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జయచంద్ర గాంధీ సూచించారు. మంగళవారం మలికిపురం వెలుగు కార్యాలయంలో డీఆర్డీఏ, జిల్లా చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మహిళల శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బ్యాంకులు, సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా అనేక రుణాలను ఇస్తూ ప్రోత్సాహం అందిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళ ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. జిల్లా చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆహార ప్రోసెసింగ్ పరిశ్రమలకు సబ్సిడీ అధికంగా ఉంటుందన్నారు. మన ప్రాంతంలో లభించే కొబ్బరి, జీడిపప్పు, పండ్ల తోటల ద్వారా ఆహార ప్రోసెసింగ్ పరిశ్రమలు స్థాపించుకోవాలని సూచించారు. అవసరం తెలిస్తే ఆలోచన వచ్చి ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు స్కీమ్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. సదస్సులో పాల్గొన్న ఇండస్ట్రీస్ జిల్లా ఎండీ పి.శివరామప్రసాద్ మాట్లాడుతూ మహిళలు వివిధ పథకాలను వినియోగించుకునే విధంగా ఉద్యం ఆధార్ ఉచిత రిజిస్ట్రేషన్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెడ్పీటీసీ బల్ల ప్రసన్న కుమారి, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దివ్వి దుర్గాభవాని, కమిడి దివ్య, దళం అశ్వని, ఏపీఎం సయీద్ పాల్గొన్నారు. -
29 సారా రహిత గ్రామాలు
అమలాపురం రూరల్: నవోదయం ద్వారా జిల్లాలో 8 మండలాల్లో 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో నవోదయం 2.0 కార్యక్రమాల అమలపై జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ సారా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తొలుత ప్రోహిబిషన్ ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ వి.రేణుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నవోదయం కార్యక్రమాల ప్రగతిని అధికా రులకు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో ఆలమూరు, పి.గన్నవరం, ఆత్రేయపురం మండలాల్లో సుమారు 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. ప్రత్యామ్నాయ జీవనోపాధుల కోసం మూడు కుటుంబాలను గుర్తించామన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ కే మాధవి, సాంఘిక సంక్షేమ శాఖ సాధికార అధికారి పి. జ్యోతిలక్ష్మిదేవి, డీఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీ, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ. ప్రసాద్ రావు ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థికి సాయం అమలాపురం మండలం జనుపల్లి చెందిన జాన్పాటి విజయ్ కుమార్ వైద్య ఖర్చులకు సహాయం అందించామని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. అల్లవరం మండలం గోడి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో విజయ్కుమార్ జూనియర్ ఇంటర్ బైపీసీ చదువుతూ ఈ నెల 19వ తేదీ హాస్టల్ పై భాగంలో ఆరబెట్టిన దుస్తులను తీసుకువచ్చే క్రమంలో కళ్లు తిరిగి మేడ పైనుంచి కిందికి ప్రమాదవ శాత్తు జారిపడ్డాడని తెలిపారు. విజయ్ కుమార్కు రూ.50,000 ఇన్సూరెన్స్ రూపంలో వైద్య ఖర్చులు మంజూరు చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్నాడన్నారు.కలెక్టర్ మహేష్కుమార్ -
గాయత్రీదేవిగా మాణిక్యాంబా అమ్మవారు
రామచంద్రపురం రూరల్: పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో మేలుకొలుపు, ప్రభాత సేవ, సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, తీర్థపు బిందె, బాలభోగం, ప్రథమాభిషేకం, ప్రథమార్చనల అనంతరం అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆస్ట్రానమీలో కై వల్యరెడ్డి ప్రతిభ నిడదవోలు: జర్మనీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కాంపిటీషన్–2025లో నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కై వల్యరెడ్డి 16–19 యూత్ కేటగిరీ ఫైనల్ రౌండ్ పూర్తి చేసుకుని, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ నిర్వహించిన ఈ పోటీలో 120 దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మూడు దశల్లో నిర్వహించిన ఈ పోటీలో ఖగోళ, ఖగోళ భౌతిక శాస్త్రానికి సంబంధించిన రియల్ వరల్డ్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. మొదటి రౌండ్ జూలై 4న, రెండో రౌండ్ ప్రీ ఫైనల్ ఆగస్ట్ 14న, మూడో రౌండ్ ఫైనల్ ఈ నెల 17న నిర్వహించారు. మొదటి రెండు రౌండ్లలో కటాఫ్ మార్కులు సాధించిన కై వల్యరెడ్డి ఫైనల్ రౌండ్కు అర్హత సాధించింది. సంస్థ నియమించిన ఇన్విజిలేటర్ ఆధ్వర్యాన ఫైనల్ రౌండ్ పరీక్షను ఈ నెల 17న ఆమె రాసింది. మూడు రౌండ్లలోనూ ప్రతిభ కనబరిచిన కై వల్యరెడ్డి సిల్వర్ ఆనర్ ప్రశంసాపత్రాన్ని అందుకుంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతృత్వంలో కక్షపూరిత రాజకీయాలు తారస్థాయికి చేరాయని, అందుకు నిదర్శనమే ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టు అని వైఎస్సార్ సీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న మిథున్రెడ్డితో నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడుతూ, లేని మద్యం స్కాం పేరుతో ఎంపీ మిథున్రెడ్డిని కూటమి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్తో మిథున్రెడ్డికి ఉన్న అనుబంధాన్ని తెంచేందుకే అక్రమ కేసులు బనాయిస్తోందని దుయ్యబట్టారు. వారి బంధాన్ని ఎవ్వరూ తెంచలేరన్నారు. గత సీఎం వైఎస్ జగన్ కంటే అభివృద్ధి, సంక్షేమాన్ని ఎక్కువ చేసి పోటీ పడాల్సింది పోయి, కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ‘‘ఏపీ లిక్కర్ స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదన్నారు. రూ.30 వేల కోట్లు, రూ.10 వేల కోట్లన్నారు. ఇప్పుడేమో రూ.3 వేల కోట్లని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’అని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను జీర్ణించుకోలేని సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంపీ మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. త్వరలోనే ఆయన బయటకు వచ్చి, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బ తీసేందుకు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ కూడా ఉన్నారు. -
పనులు ఆగిపోయినట్టే..
ముమ్మిడివరం మండలం గాడిలంక జెడ్పీ ఉన్నత పాఠశాలకు నాడు– నేడులో పనుల నిమిత్తం రూ.1.06 కోట్లు మంజూరు చేశారు. దీనిలో మూడు అదనపు తరగతి గదులకు సంబంధించి రూ.42 లక్షలు మంజూరు కాగా, ఇప్పటికీ పునాదుల దశ దాట లేదు. పాఠశాల మరమ్మతులు, ఇతర పనులకు కేటాయించిన రూ.24 లక్షల పనులు ఇంకా మొదలు కాలేదు. ఇంకా తరగతి గదులలో ఫ్లోరింగ్, టైల్స్ వేయాల్సి ఉంది. ఆర్వో ప్లాంట్ నిర్మాణంతోపాటు విద్యుత్ మరమ్మతులు వంటి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అన్నీ ఇచ్చారు.. నిర్మాణం పూర్తి కాలేదు రావులపాలెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణాలకు రూ.63.98 లక్షలు కేటాయించారు. తొలి దశలో రెండు, రెండవ దశలో రెండు చొప్పున నాలుగు అదనపు తరగతులు గదులకు సంబంధించి శ్లాబ్, ఇతర పనులు చేపట్టారు. విద్యుత్ పరికరాలు ఇచ్చారు. వైరింగ్ చేయలేదు. తలుపులు, కిటికీలు అందించారు. కాని కిటికీలకు గ్రిల్స్ లేవు. రంగులు వేయలేదు. మరో రూ.పది లక్షలు ఇస్తే అన్ని పనులు పూర్తవుతాయి. తలుపులు లేవు ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధికి నాడు–నేడు రెండవ దశలో రూ.36 లక్షలు కేటాయించారు. రెండు అదనపు తరగతి గదులతో పాటు ఇతర పనులకు నిధులు కేటాయించారు. ఒక గది నిర్మాణం మాత్రమే జరిగింది. రూ.పది లక్షలు మాత్రమే వచ్చాయి. నిర్మించిన గదికి గుమ్మాలు.. తలుపులు లేవు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలోనే అదనంగా బెంచీలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు. -
108కు ‘పచ్చ’కామెర్లు
ఉప్పలగుప్తం: 108 వాహనాలకు ‘పచ్చ’రంగు పడింది. సాధారణంగా అంబులెన్స్లకు నీలం రంగు, ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు వేస్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నీలం రంగు వేసి, ఎరుపు, తెలుపు రేడియం స్టిక్కర్లు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 108 వాహనాల ముందు భాగానికి పసుపు రంగు వేసి, వాహనానికి ఇరువైపులా పసుపు రంగు బోర్డులు వేయడం గమనార్హం. వాహనాలకు రంగు మార్చేందుకు విజయవాడ తీసుకుని వెళుతున్నారు. రంగుల మార్చడానికి తోడు వాహనాన్ని విజయవాడ తీసుకుని వెళ్లడం అదనపు ఖర్చు. ఒక అంబులెన్స్ వెళ్లి రంగు మార్చుకొని రావడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతోంది. ఈ సమయంలో స్థానికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా సకాలంలో 108 అంబులెన్స్లు రావడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ పార్టీ రంగులను పోలి ఉంటే చాలు పార్టీ రంగులు వేశారని నానా హంగామా చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇప్పుడు పచ్చరంగు వేయడంపై మాత్రం నోరు మెడపకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలి
అమలాపురం టౌన్: అత్యధిక ఓటు శాతం ఉన్న వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించి మాట్లాడే సమయాన్ని కేటాయించవచ్చని నిబంధనలు చెబుతున్నాయని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ అన్నారు. అమలాపురంలో ఆయన మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పదే పదే చెప్పే స్పీకర్ వాటిని అమలు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అధిక ఓటింగ్ శాతం ఉన్న వైఎస్సార్ సీపీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రశ్నించే గొంతుకను నొక్కేయడమేనని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు బిజినెస్ కమిటీ, రూల్స్ కమిటీలతో స్పీకర్ ఈ విషయమై చర్చించాల్సి ఉండగా ఏకపక్ష నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అసెంబ్లీకి రాకుండా చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి ఆదాయ మార్గాల అన్వేషణలో ఉందన్నారు. నేడు ప్రభుత్వ వైద్య కశాశాలలను, గ్రానైట్ క్వారీస్ను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేస్తూ ఆదాయ వనరులు పెంచుకుంటోందని విమర్శించారు. పేద కుటుంబాల విద్యార్థులను ప్రభుత్వ వైద్య విద్యకు దూరమయ్యేలా చేసిన పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కిషోర్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్ -
జీజీహెచ్లో 2డీ ఎకో సేవలు పునఃప్రారంభం
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో 2డీ ఎకో సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఈ విషయం తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాల మేరకు, ఇన్సోర్సింగ్ విధానంలో కార్డియాలజిస్టులను ఆసుపత్రికి తీసుకొచ్చి రోగులకు 2డీ ఎకో సేవలు అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా హృద్రోగాలతో బాధపడుతున్న వారికి తొలి దశ వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తొలి రోజు 30 మందికి 2డీ ఎకో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
తడబడిన అడుగు
సాక్షి, అమలాపురం: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి వసతుల కల్పించాలనే ఆశయం నీరుగారి పోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు జరిగేలా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనను పక్కన పెట్టిందనే విమర్శలకు నాడు–నేడు ఒక ఉదాహరణ. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా ఆధునీకరించగా కూటమి ప్రభుత్వం నాడు– నేడును ఆటకెక్కిస్తోంది. నాడు పాఠశాలలకు మహర్దశ శిథిలావస్థకు చేరి కనీసం విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు సైతం వీలు లేని పాఠశాలలను నాడు– నేడులో మహర్దశ కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యను పలు రకాలుగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అమ్మఒడి, ప్రతి రోజు ఒక కోడిగుడ్డుతో మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం, యూనిఫామ్, బూట్లు, పాఠ్య పుస్తకాలు, ట్యాబ్లు, ఇంగ్లిష్ మీడియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విప్లవాత్మక చర్యలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా నాడు–నేడులో పాఠశాలలో మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో కోనసీమ జిల్లాలో 451 పాఠశాలలను నాడు–నేడుకు ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి రూ.92 కోట్లు కేటాయించింది. దీనిలో రెండు పాఠశాలలలో పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన పాఠశాలలకు సంబంధించి 433 పాఠశాలల్లో పనులు పూర్తికాగా 16 చోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. కేటాయించిన నిధుల కన్నా అదనంగా రూ.92.12 కోట్లు ఖర్చు చేశారు. ఇక రెండవ దశకు సంబంధించి 763 పాఠశాలలను నాడు –నేడుకు ఎంపిక చేశారు. ఇందుకు రూ.249.29 కోట్లు కేటాయించారు. రెండు పాఠశాలల్లో పనులు మొదలు కాలేదు. 117 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. 644 పాఠశాలల్లో పనులు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం రూ.115.51 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ పనుల్లో 90 శాతం గత ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు దాదాపు నిలిచిపోయాయి. జిల్లాలో నాడు– నేడు రెండు దశల్లో కలిపి 1,214 పాఠశాలలు ఎంపిక కాగా ఇప్పటి వరకు 550 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన 660 పాఠశాలల్లో పనులు పూర్తి కాకపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వెనుక విద్యను మరింత ప్రైవేటీకరించాలని ఆలోచన ఉందనే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో నిలిచిపోయిన నాడు–నేడు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రెండవ దశలో 763 నిర్మాణాలకు అనుమతి రూ.249.25 కోట్ల కేటాయింపు గత ప్రభుత్వ హయాంలోనే 644 పనులు ప్రారంభం వీటిలో 117 పూర్తి.. రూ.115.51 కోట్ల ఖర్చు కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు నిలిచిపోయిన పనులు అసంపూర్తి నిర్మాణాలతో నెరవేరని లక్ష్యం కొసరు పనులు గాలికి.. మలికిపురం మండలం ఇరుసుమండ జెడ్పీ ఉన్నత పాఠశాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం రూ.64 లక్షలు కేటాయించగా రూ.32లక్షల వరకు ఖర్చు చేశారు. మరో రూ.32 లక్షల పనులు జరగాల్సి ఉంది. తరగతి గదులకు సంబంధించి శ్లాబ్లు వేశారు, గోడలు కట్టారు. కాని తలుపులు, విద్యుత్ వంటి పనులు జరగలేదు. పనులు నిలిచిపోవడంతో ఈ భవనం నిరుపయోగంగా మారింది. పునాదుల్లోనే.. అంబాజీపేట మండలం కె.పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పరిస్థితి ఇది. మూడు అదనపు తరగతులను నిర్మించేందుకు రూ.39 లక్షలు మంజూరు చేశారు. కేవలం బేస్మెంట్ వరకు నిర్మించి వదిలేశారు. 2022లో మంజూరైన నిధులతో చేపట్టిన ఈ పనులు గత ప్రభుత్వ హయాంలో జరగగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి. -
ప్రాణం తీసిన అతివేగం
● పెదవలసలలో ఎదురెదురుగా బైక్లు ఢీ ● ఇద్దరు యువకుల మృతి–మరొకరికి తీవ్ర గాయాలు ● సావిత్రినగర్లో విషాదం తాళ్లరేవు: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకోగా, మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సావిత్రినగర్కు చెందిన మచ్చా లక్ష్మీ సతీష్ (20), పాలెపు కాసురాజు (21)లు స్పోర్ట్స్ బైక్లపై అతివేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ సతీష్, కాసురాజు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్పై వెనుక కూర్చున్న సావిత్రినగర్ గ్రామానికి చెందిన మరొక యువకుడు ఇళ్లంగి మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మణికంఠను తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇలా ఉండగా రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద శబ్ధం వచ్చిందని వచ్చి చూడగా ఘటనా స్థలంలో యువకులు మృతి చెంది ఉన్నారని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదన పెదవలసల గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులతోపాటు తీవ్రంగా గాయపడ్డ యువకుడు కూడా యానాం సావిత్రినగర్ గ్రామానికి చెందినవాడు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. -
కరుడు గట్టిన నేరస్తుడి కోసం ముమ్మర గాలింపు
● 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు ● 70 కేసుల్లో ప్రభాకర్ ముద్దాయి ● నాలుగు రాష్ట్రాల్లో కేసులు ● ఇద్దరు ఎస్కార్ట్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ● డీఎస్పీ దేవకుమార్ వెల్లడి దేవరపల్లి: పోలీసుల కళ్లు కప్పి సోమవారం రాత్రి పారిపోయిన కరుడు గట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు మమ్మురంగా గాలిస్తున్నారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ప్రభాకర్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద చేతులకు బేడీలతో పరారైన సంఘటన పాఠకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సీఐ నాగేశ్వరనాయక్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 50 మంది యువకులతో బైక్లపై పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి వరకు యువకులు, పోలీసులు పొలాల్లో గాలించారు. 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు పోలీసుల కళ్లుకప్పి పరారైన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం దేవరపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. నేరస్థుడు ప్రభాకర్పై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో సుమారు 80 కేసులు నమోదైనట్టు తెలిపారు. 2011 నుంచి ప్రభాకర్ నేరాలకు పాల్పడుతూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లలో దొంతనం కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్టు ఆయన చెప్పారు. 2022లో హైదరాబాద్లోని గచ్బౌలిలోని పబ్లో ఉన్న అతనిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపినట్టు ఆయన చెప్పారు. ఫీజులు కట్టే సమయంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, గృహాలను లక్ష్యంగా పెట్టుకుని ఒంటరిగా దొంగతనాలు చేస్తాడని తెలిపారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కాలేజీలో రూ.30 లక్షలు, దేవరపల్లి మండలంలో రోమన్ కేథలిక్స్ స్కూల్లో రూ.3 లక్షలు చోరీ చేసినట్టు ఆయన తెలిపారు. 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 40 మంది పోలీసులతో రాత్రంతా పొలాల్లో గాలించడంతో పాటు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం డాగ్ స్క్వాడ్తో గాలించినట్టు ఆయన తెలిపారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. పీటీ వారెంట్లపై రాష్ట్రంలో ఎక్కడైతే కేసులు ఉన్నాయో అక్కడకు తీసుకు వెళుతున్నట్టు చెప్పారు. పారిపోయిన సమయంలో చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్టు తెలిపారు. ఎక్కడెక్కడ నేరాలు చేస్తున్నాడు, సన్నిహితుల ఆచూకీని తెలుసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల పారితోషికం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు దేవరపల్లి పోలీసుల మొబైల్ నెంబర్లు 94407 96584 (సీఐ), 9440796624 (ఎస్సై)కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనేక కేసుల్లో నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ కరుడుగట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభాకర్పై అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఒక కేసులో పోలీసులు విజయవాడ కోర్టుకు తీసుకు వెళ్లి తిరిగి వస్తుండగా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద హైవేపై గల హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో ప్రభాకర్ టీ తాగడానికి చేతులకు ఉన్న హ్యాండ్స్ కప్స్ను ఒక చేతిది తీసి మరొక చేతికి ఉంచారు. టీ తాగుతున్న క్రమంలో బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి హోటల్ వెనుక నుంచి పొలాల్లోకి పరారయ్యాడు. ఎస్కార్ట్ పోలీసులు వెంటపడినప్పటికీ దొరకలేదని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రభాకర్కు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్గా వెళ్లారు. వీరిద్దరిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. -
బార్ తొలగించాలని ఆందోళన
నిడదవోలు : పట్టణంలో సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ – రెస్టారెంట్ తొలగించాలని స్థానికులు మంగళవారం బార్ వద్ద ఆందోళన చేశారు. దళితులు, శ్రామికుల కుటుంబాలను దోచుకోవటానికే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం బార్లు తెరుస్తున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బైపే రాజేశ్వరరావు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, టి.ప్రేమ్కుమార్ ఎం. భాను, బి.నాని, నక్కా సురేష్, గుమ్మడి రాజు, ఎం.డేవిడ్ వి. పవన్ కుమార్, వి. కళ్యాణ్, జాన్, పుల్లారావు పాల్గొన్నారు. -
రోగి నుంచి వివరాల సేకరణ
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడుకు చెందిన గరగ నాగ ఆంజనేయ దుర్గారావును వైద్య, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది కలిసి అతనికి ఉన్న అనారోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. శ్రీసాక్షిశ్రీలో మంగళవారం ప్రచురించిన శ్రీసాయమందించి ప్రాణభిక్ష పెట్టండిశ్రీ కథనానికి స్పందించారు. గండేపల్లి పీహెచ్సీ వైద్యాధికారి కేవీ నరేష్, సీహెచ్ఓ శర్మ, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది నాగేశ్వరరావు, ఏఎన్ఎం రామలక్ష్మి, ఆశ లక్ష్మి మంగళవారం దుర్గారావు ఇంటికి వెళ్లి వ్యాధి వివరాలు అడిగి తెలుసుకుని ఇందుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించి తగు సూచనలు, సలహాలు అందజేశారు. -
సాధనతో దైవ బలం
శ్రీ పీఠంలో రెండో ప్రసంగంలో పరిపూర్ణానంద స్వామి కాకినాడ రూరల్: సాధనతోనే దైవబలం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ బలంతోనే అమ్మ అనుగ్రహం పొందుతారని పరిపూర్ణానంద స్వామి అభిభాషించారు. మహాశక్తి యాగం కార్యక్రమంగా రమణయ్యపేటలోని శ్రీ పీఠంలో రెండో రోజు మంగళవారం వేలాది మంది మహిళలు దీక్షా వస్త్రాలను ధరించి రూ.వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం అర్గల స్తోత్ర ఐశ్వర్యాంబిక హోమం, సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు రెండో శ్రీ హరిద్రా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కుంకుమార్చనలలో భాగంగా మూడు సార్లు లలితా సహస్ర నామార్చనలను పరిపూర్ణనంద స్వామి భక్తులతో పఠింపజేసి కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీజం(విత్తనం) మొలకెత్తాలంటే ఐదు కారణాలు ఉంటాయని వాటిలో ఐదవది దైవమన్నారు. మొట్ట మొదటిది భూమి గర్భంలో ఉన్న జలధారలని, రెండవది సారవంతమైన భూమి, 3వ కారణం విత్తనంలోని శక్తి అని, 4వ కారణం నైసర్గిక సహకారం అన్నారు. ఇవన్నీ ఉన్నా దైవ అనుగ్రహం ఉండాలన్నారు. మనిషి అమ్మవారిని తమలో శక్తిగా నిలుపుకోగలిగే అంత సాధన పొందాలన్నారు. మనం మూలాలను తెలుసుకోగలిగితేనే ముందుకు వెళ్లగలుగుతామన్నారు. ఇందుకోసం చాలా వాటిని త్యాగించాలన్నారు. నీ సంతానంగా భావించి నన్ను నడిపించు అని అమ్మవారిని వేడుకోవాలన్నారు. నవరాత్రుల్లో తొలి రోజు ఐశ్వర్యాంబిక అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా చూసుకున్నామని, అమ్మవారికి అర్చన చేసిన లక్ష అంకురాలను అన్న ప్రసాదంలో వినియోగించామన్నారు. -
ఆగని మరణ మృదంగం
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. దీంతో పాడి రైతులు విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన గెడ్డం మణికంఠకు చెందిన పాడి గేదె కొద్ది రోజులుగా వ్యాధిభారిన పడి మంగళవారం మృతి చెందింది. మందులు వాడినా, వ్యాక్సిన్లు వేసినా ప్రయోజనం లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జమ్ముల శ్రీనుకు చెందిన పాడి గేదె కూడా మృతి చెందింది. మృతి చెందిన గేదెలను బయటకు తరలించడానికి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 23 మంది రైతులకు చెందిన 33 గేదెలు అంతు చిక్కని వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాయని రైతులు చెబుతున్నారు. -
భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లిలో భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై కె.గంగవరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కె.గంగవరం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోహమాటి అశ్విని, రామచంద్రపురం పట్టణానికి చెందిన దత్త వీర వెంకట శివకుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల శివకుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ నేపథ్యంలో అశ్విని కోటిపల్లిలో అమ్మగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఇదే క్రమంలో సోమవారం రాత్రి శివకుమార్ దళిత కాలనీలో ఉన్న అశ్విని వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆమెను కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై భార్య అశ్విని ఫిర్యాదు చేయగా కె.గంగవరం ఎస్సై జానీ బాషా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై రామచంద్రపురం ఇన్చార్జి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శివకుమార్ను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.