breaking news
Dr B R Ambedkar Konaseema
-
బాస్కెట్బాల్ పోటీల్లో విజేత రామచంద్రపురం
రామచంద్రపురం: స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో గత నెల 31 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ పోటీలు జరిగాయి. ఇందులో మహిళల విభాగంలో రామచంద్రపురం ప్రథమ, పిఠాపురం ద్వితీయ, కాకినాడ డీఎస్ఏ తృతీయ, రాజమహేంద్రవరం సీబీసీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. పురుషుల విభాగంలో రామచంద్రపురం ప్రథమ, కాకినాడ ద్వితీయ, రాజమహేంద్రవరం సీబీసీ తృతీయ, జి.మామిడాడ నాలుగో స్థానాలు సాధించాయి. అనంతరం ఉమ్మడి జిల్లా పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.చక్రవర్తి ప్రకటించారు. కాగా ఎంపికై న జట్లు ఈ నెల 7 నుంచి 10 వరకూ విశాఖలో జరిగే 11వ అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటాయని అన్నారు. విజేత జట్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏంఎసీ చైర్మన్ రిష్వంత్రాయ్ తదితరులు అభినందించారు. -
మల్లవరం శివాలయంలో చోరీ
గోకవరం: మల్లవరం గ్రామంలో ఉమామల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో చోరీ జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం.. కార్తిక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటల వరకూ మల్లవరం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం తాళాలు వేశారు. సోమవారం తెల్లవారుజామున 3.30 సమయంలో ఆలయ అర్చకుడు సాయిశర్మ తాళాలు తెరిచి చూడగా ఆలయ ప్రాంగణంలో హుండీలు చోరీకి గురైనట్టు గుర్తించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా నాలుగు హుండీలను పగులగొట్టి నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా కోరుకొండ సీఐ సత్యకిశోర్, గోకవరం ఎస్సై పవన్కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ఆలయ సమీపంలో రెండు హుండీలను గుర్తించారు. -
కక్ష సాధింపుతోనే జోగి రమేష్ అరెస్ట్
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావుఅమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. 1992లో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి కౌల్ పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకూడదన్న ఉత్తర్వులు ఇచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సోమవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఓ వ్యక్తిని నేరస్తుడిగా పరిగణించినప్పుడు అతను పోలీస్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తే అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. నకిలీ మద్యం కేసు సృష్టించి జోగి రమేష్ను అరెస్ట్ చేసి పోలీసులు తప్పు చేశారన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో సిట్ పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం అక్రమ, నకిలీ మద్యం ఏరులై పారుతుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకినాడ పోర్టులో విదేశాల నుంచి నకిలీ మద్యం, గంజాయి దిగుమతి అవుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో నకిలీ మద్యం తయారవుతున్నా నిందితులపై ఎకై ్సజ్, పోలీసు అధికారులు కనీసం కేసులు పెట్టడం లేదన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు కనిపించడం లేదా..? అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృత్యువాత పడడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఎమ్మెల్సీ ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం వల్లే ఆ ఆలయం వద్ద భక్తులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఉద్యోగులు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
సామర్లకోట: ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించవచ్చని విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక ఈటీసీలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని డిప్యూటీ ఎంపీడీఓలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు సాంకేతిక, నైపుణ్యతను పెంపొందించుకుంటే పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు త్వరగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించడానికి సుస్థిరాభివృద్ధి అంశాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అదే విధంగా ఎంపీడీఓ, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు ఆరు రోజుల పాటు నిర్వహించే ప్రాథమిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, డీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఫ్యాకల్టీ కె.సుశీల శిక్షణ తరగతులు నిర్వహించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
తాళ్లపూడి: వృద్ధురాలి మెడలో బంగారు మంగళ సూత్రాల తాడు తెంచుకుని పరారైన కేసులో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి రూ.2.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. గత నెల 8న తాళ్లపూడి మండలం గజ్జరంలో గన్నిన నరసమాంబ (70) తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. టీవీ పని చేయడం లేదని ఫిర్యాదు వచ్చిందని, దానిని బాగు చేయడానికి వచ్చామని ఆమెకు చెప్పారు. టీవీ బాగానే పని చేస్తుందని నరసమాంబ చెప్పగా, అయితే టీవీ పక్కన నిలబడితే ఫొటో తీసుకుంటామని చెప్పి, ఆమెను బెదిరించి మెడలోని బంగారు మంగళ సూత్రాల తాడును లాక్కొని బయటకు వచ్చేశారు. అప్పటికే బయట బైక్పై ఉన్న మూడో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం బల్లిపాడు గోదావరి ర్యాంపు వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షేక్ సుభానీ జానీ, దేశగిరి గంగరాజు, వడ్డి శరణ్రాజులను పట్టుకుని, చోరీ సొత్తుతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు. -
మృత్యు శకటం.. వేస్తారా కళ్లెం!
ఫ గాలి వేగంతో దూసుకెళ్తున్న టిప్పర్లు ఫ భారీగా ఇసుక, గ్రావెల్ తరలింపు ఫ ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు ఫ రంగారెడ్డి జిల్లా ఘటన నేపథ్యంలో అప్రమత్తత అవసరం అమలాపురం టౌన్: అడ్డూ అదుపూ ఉండదు.. వేగానికి కళ్లెం అసలే లేదు.. అధికారుల పర్యవేక్షణ కానరాదు.. రోడ్డెక్కితే ఆగమేఘాల మీద దూసుకుపోతున్నా, ఎందరో ప్రాణాలు తీస్తున్నా ఎవరికీ పట్టదు.. టిప్పర్ల జోరుకు అడ్డూ అదుపు కనిపించదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు రోడ్లపై రయ్రయ్మంటూ దూసుకుపోతున్నాయి. వీటిపై మైనింగ్, ట్రాన్స్పోర్టు, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల నియంత్రణ లేకపోవడం, సరైన నిఘా ఉండక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వెళ్లే ప్రజల ప్రాణాలు ఒక్కోసారి గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. టిప్పర్ వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి అంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉంది. టిప్పర్ల అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30కి పైగా ఇసుక ర్యాంపులు, 26 వరకూ క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు రెండు వేల టిప్పర్లు నిత్యం ఇసుక, గ్రావెల్తో రోడ్లపై రయ్రయ్ మంటూ అతి వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఈ వేగమే ఒక్కోసారి అనర్థమై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా నదీ పాయలు ఉండడంతో ఇసుక ర్యాంపుల నుంచి ఈ టిప్పర్లు అధిక లోడుతో ఇసుకను వేగంగా రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్ రోజుకు మూడు లేదా నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరం, ఐ.పంగిడి పరిసర గ్రామాల్లో ఎక్కువగా ర్యాంపులు, క్వారీల నుంచి కూడా టిప్పర్లు గ్రావెల్ లోడుతో అతివేగంగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. ఈ టిప్పర్లకు రోజుకు ఇన్ని ట్రిప్పులని లక్ష్యాన్ని నిర్దేశించడంతో కొందరు డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు అధికం కావడంతో టిప్పర్ల ద్వారా ఇసుక, గ్రావెల్, ఇటుక వంటి మెటీరియల్ ఎక్కువగా ఎగుమతి, దిగుమతులు అవుతున్నాయి. మైన్స్ శాఖ అధికారులు తమ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నా అతి వేగాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ట్రాన్స్పోర్టు, పోలీస్ శాఖల అధికారులు టిప్పర్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడం, సరైన నిఘా పెట్టకపోవడంతో వాటి వేగాన్ని ఎవరూ నియంత్రించక చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా టిప్పర్ల వేగంపై నియంత్రణ కరవై రోడ్డు ప్రమాదాలు, మరణాలు అనివార్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం చేవళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం స్థాయి ఉమ్మడి జిల్లాలో ఇప్ప టి దాకా జరగకపోవడం మంచి పరిణామమే గాని పొంచి ఉన్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని జిల్లా ప్రజలు ఊహించుకుని బెంబేలెత్తుతున్నారు. టిప్పర్లు ఇసుక లేదా గ్రావెల్ తరలిస్తున్నప్పుడు విధిగా ఆ లోడుపై బరకం కప్పాలి. బరకం వినియోగించకపోవడం వల్ల ఇసుక లేదా గ్రావెల్ వెనుక వచ్చే వాహనచోదకుల కళ్లలో పడి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయని వాహనచోదకులు అంటున్నారు. 124 కేసుల నమోదు టిప్పర్ల అతివేగాన్ని జిల్లా రవాణా శాఖ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. టిప్పర్లపై ఇసుక, గ్రావెల్ తరలిస్తున్నప్పుడు బరకాలు కప్పకపోవడం, ఇరుకు రోడ్లలో సైతం అతి వేగంగా వెళ్లడం, టిప్పన్ కండీషన్ సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలపై తరచూ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేరాలపై జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 124 కేసులు నమోదు చేశాం. –డి.శ్రీనివాస్, జిల్లా రవాణాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
‘నన్నయ’లో రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రెజ్లింగ్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కం యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉమెన్ ఫ్రీ స్టైల్ 50 నుంచి 70 కిలోల కేటగిరీ, మెన్ ఫ్రీ స్టైల్ 57 నుంచి 125 కిలోల కేటగిరీలో పోటీలు జరిగాయి. అలాగే రెజ్లింగ్ గ్రీకో రోమన్ విధానంలో 55 నుంచి 130 కిలోల కేటగిరీ వరకూ నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చాటిన వారిని యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేసి, పంజాబ్లోని చండీఘర్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్టార్, స్పోర్ట్సు బోర్డు సెక్రటరీ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. ఈ పోటీలకు ఆర్గనైజింగ్ చైర్మన్గా ఆచార్య డి.జ్యోతిర్మయి, పరిశీలకులుగా డాక్టర్ బీవీ నరసింహరాజు వ్యవహరించగా, కె.కనకదుర్గ, ఎ.ధర్మేంద్రలు సెలక్షన్ కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు. -
వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: అమలాపురం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు తప్పదని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో వైద్యాధికారులు, వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగం ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో నెలకు సుమారు 120 ప్రసవాలు మాత్రమే నిర్వహించడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశా రు. నెలకు 1,500 ప్రసవాలు జరిగేలా ప్రసూతి వైద్య సేవలను బలోపేతం చేయాలని ఆదేశించారు. సరైన వసతులు లేక పేదలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. జేసీ టి.నిషాంతి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ సీహెచ్ రతన్రాజు, డీఈ ఎం.చక్రవర్తి డీఎంహెచ్ఓ ఎం.దుర్గారావు దొర, డీసీహెచ్ ఎస్.కార్తిక్ పాల్గొన్నారు. ఫ గ్రామీణ దూర ప్రాంతాల ప్రజలకు హెచ్ఐవీ ఎయిడ్స్ సేవలందించడానికి మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ – టెస్టింగ్ సెంటర్ ఐసీటీసీ వాహన సేవలు మరింత కీలకం కానున్నాయని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్ వద్ద హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణకు కొత్త సంచార ఐసీటీసీ సేవా వాహనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంచార వాహనం ఇంటింటికి వెళ్లి కౌన్సెలింగ్, టెస్టింగ్ తదితర సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, అదనపు డీఎంహెచ్ఓ భరత్ లకి్ష్మ్ పాల్గొన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: జిల్లాలోని తీర ప్రాంతంలో భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను నేపథ్యంలో అంకితభావంతో సేవలు అందించిన వివిధ క్యాడర్లకు చెందిన 185 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించినట్లు తెలిపారు. -
ముక్కంటి.. శరణంటి
రామచంద్రపురం రూరల్: కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఐ.పోలవరం మండలం మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ద్రాక్షారామ క్షేత్రంలో వేంచేసి ఉన్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో స్నానమాచరించిన భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాణిక్యాంబా అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మీరూ ముంచేస్తారా.. బాబూ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెనుగాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడిన మోంథా తుపాను ఇప్పటికే రైతులను నిండా ముంచేసింది. ఈ పరిస్థితుల్లో వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కొండంత ధైర్యాన్నివ్వాలి. పంట నష్టపోయిన రైతులకు బీమాతో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలి. దీంతో పాటు మిగిలిన పంటను కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) ద్వారా కొనుగోలు చేసి, వారిని ఒడ్డున పడేయాలి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను మరింతగా ముంచేసేలా ఉన్నాయని రైతులు కలత చెందుతున్నారు. విపత్తులతో పంట ముంపునకు గురైతే క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలన జరిపి, జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందిస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వమే బాధిత రైతులకు పరిహారం అందిస్తుంది. కానీ, కూటమి సర్కారు నష్టపరిహారాన్ని తగ్గించేందుకు, వీలైనంతగా ఎగ్గొట్టేందుకు సాంకేతిక కారణాలతో కొర్రీలు వేస్తోందని, నష్టం అంచనాలు రూపొందించే ప్రక్రియకు రైతులను దూరం పెట్టే ఆలోచనలు చేస్తోందని, పండించిన పంట కొనుగోలు చేయకుండా గతంలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతోందని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. సీఎంఆర్కు నో! తుపానుతో నష్టపరిహారం అందుకునే రైతులు పండించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్ఆర్) ద్వారా కొనుగోలు చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు జిల్లాలకు ఉత్తర్వులు వచ్చినట్టు రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్న రైతుల వద్ద ముంపులో ఉన్న పంటను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ మేరకు మండల స్థాయిలో టాంటాంలు కూడా వేయించింది. రెండు రోజుల క్రితం కరప తదితర మండలాల్లో ఈ విధంగా టాంటాంలు వేయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వలన రైతులు భయపడి, తమకు పంట నష్టం జరిగినట్లు దరఖాస్తు చేయకుండా వెనక్కు తగ్గుతారనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ప్రకటించింది. ఇదే తరహాలో ఇక్కడ కూడా ప్రకటిస్తే.. ఆ మేరకు పరిహారం అందుకునే రైతుల సంఖ్యలో కోత పెట్టేందుకే కూటమి సర్కారు ఇటువంటి నిబంధన తెచ్చిందని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తుపానుకు పోయిన పంట ఎలాగూ పోయింది.. మిగిలినదైనా కస్టమ్ మిల్లింగ్లో అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వం ఆ అవకాశం కూడా లేకుండా చేస్తోందని, తద్వారా ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. మానవత్వం మరచి.. రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన ఓ రైతు అంతా సవ్యంగా సాగితే 90 నుంచి 120 బస్తాల (75 కేజీలు) దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. తీరా చూస్తే పంటంతా తుపానుతో మునిగిపోయింది. ఇప్పుడు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తే గొప్పేననే పరిస్థితి. ఈ లెక్కన రెండున్నర ఎకరాలకు 40 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే తుపానుతో ఆ రైతు సగటున 60 బస్తాలు పైనే కోల్పోతున్న పరిస్థితి. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.5 వేలు వస్తుందని లెక్క వేసినా రెండున్నర ఎకరాలకు రూ.12,500కు మించి ఒక్క పైసా కూడా రాదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యమంటున్న రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పలాయన మంత్రం పఠిస్తోందని రైతు ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. నష్టపరిహారం పొందితే సీఎంఆర్ ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించే అవకాశం లేకుండా చేయడం అన్యాయమంటూ రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు వచ్చే ధాన్యంలో తేమ, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో మద్దతు ధర ఇవ్వడానికి మిల్లర్లు ముందుకు రారు. అటు ప్రభుత్వం ఎంఎస్పీకి కొనదు. దీంతో, మిల్లర్లు, దళారులు చెప్పిందే రేటు అనే పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే ప్రతి బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకూ నష్టం తప్పదని వాపోతున్నారు. మిల్లర్లకు పరోక్షంగా అయాచిత లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ జగన్ అండ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విపత్తులతో పంట నష్టం జరిగిన అన్ని సందర్భాల్లోనూ ప్రతి రైతుకూ సీజన్ ముగియకుండానే పరిహారం నేరుగా అందించింది. రైతుల విజ్ఞాపన మేరకు తేమ శాతం నిబంధనను 20 నుంచి 22 శాతం వరకూ పెంచి, కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది. ఇది అన్యాయం నష్ట పరిహారానికి, ధాన్యం కొనుగోలుకు ముడి పెట్టడం అన్యాయం. తుపానుతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి ఇలాంటి నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. నష్టపరిహారం పొందిన రైతుల నుంచి సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని అంటే ఏమైపోవాలి? ఈ మాట చాలా వింతగా ఉంది. ఇది సరైన విధానం కాదు. ముంపుతో పోయిన ధాన్యం ఎలానూ పోయింది. కనీసం మిగిలిన ధాన్యాన్నయినా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనుకుంటే ఇప్పుడు ఇలా చెప్పడం అన్యాయం. ప్రభుత్వం పరోక్షంగా దళారులను ప్రోత్సహించినట్టే. ఈ విధానాన్ని విరమించుకోవాలి. – బదిరెడ్డి వీర ప్రకాశరావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం మోంథా తుపానుతో కోనసీమ జిల్లాలో వరికి నష్టమిలా.. సాగు విస్తీర్ణం 1.63 లక్షల ఎకరాలు పంట నష్టం 77,560 ఎకరాలు నష్టపోయిన రైతులు 55,000 దిగుబడి అంచనా 4.48 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం 4.48 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే ముంచేసిన ‘మోంథా’ రైతులకు పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు ఎత్తులు ఆ సాయం చేస్తే ధాన్యం కొనబోమని మెలిక మరోవైపు కస్టమ్ మిల్లింగ్కూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం ఇటు పరిహారం రాదు.. అటు బీమా అందదు ఇప్పుడు ధాన్యం కొనుగోలుకూ ససేమిరా తుపాను బాధిత రైతులపై సర్కారు నిర్దయ -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
అమలాపురం రూరల్: అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి సుమారు 270 అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్వో కె.మాధవి, డీపీఓ శాంతలక్ష్మి, డీఎల్డీఓలు రాజేశ్వరరావు, వేణుగోపాల్, డీఈఓ సలీం బాషా, డీఎస్ఓ అడపా ఉదయభాస్కర్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 40 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎీస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్లు వేర్వేరుగా తమ చాంబర్లలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి ఎస్పీ, ఏఎస్పీలకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి చర్చించి అర్జీల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉండడంతో వారు బాధితులతో కౌన్సెలింగ్ మాదిరిగా మాట్లాడి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక రాయవరం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడని హెచ్ఎం వీఎస్ సునీత సోమవారం విలేకరులకు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థి చెన్నూరి మహేష్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడన్నారు. అథ్లెటిక్స్ 4/100 రిలే విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని వివరించారు. ఈ నెల 7న శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థికి తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు చిక్కాల అజ్జిబాబు, కె.శ్రీనివాస్, మహేష్లను హెచ్ఎం సునీతతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. వివాహానికి పార్కింగ్ స్థలం ● అద్దెకిచ్చిన అన్నవరం దేవస్థానం సీఆర్ఓ అధికారులు ● పెళ్లి సెట్టింగ్ను అడ్డుకున్న ఇంజినీరింగ్ అధికారులు ● చైర్మన్ ఆగ్రహం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (సీఆర్ఓ) విభాగం అధికారుల నిర్వాకానికిదో మచ్చుతునక. వివరాలివీ.. కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారి వాహనాల పార్కింగ్కు సత్యగిరిపై హరిహర సదన్ సత్రం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అయితే, ఇదే స్థలాన్ని సీఆర్ఓ అధికారులు ఈ నెల 8న జరిగే వివాహానికి అద్దెకివ్వడం వివాదాస్పదమైంది. ఆ పెళ్లి బృందం వారు ఆ స్థలంలో ఐదు రోజుల ముందు నుంచే వివాహ సెట్టింగ్ వేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన దేవస్థానం ఇంజినీరింగ్ ఈఈ రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. ఆ స్థలాన్ని తాము ముందుగానే రిజర్వ్ చేసుకున్నామని ఆ పెళ్లి బృందం వారు చెప్పడంతో విషయాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఆర్ఓ అధికారులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేలాదిగా భక్తులు తరలి వస్తారని, వారి వాహనాలను అక్కడే నిలపాల్సి వస్తుందని, అలాగే, ఎనిమిదో తేదీ శనివారం కూడా రద్దీ ఉంటుందని, ఇవేమీ చూసుకోకుండా ఆ స్థలాన్ని పెళ్లికి రిజర్వ్ చేశారని ప్రశ్నించారు. భక్తుల వాహనాలు నిలిపే స్థలాలను కార్తిక మాసం పూర్తయ్యేంత వరకూ వివాహాలకు ఇవ్వవద్దని ఆదేశించారు. -
తూడుచిపెట్టిన నిర్లక్ష్యం
ఫ ప్రధాన డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క ఫ నిధులున్నా పనులు చేయని ప్రాజెక్టు కమిటీ ఫ అంతా మునిగాక ఇప్పుడు చేపట్టిన వైనం ఫ మండిపడుతున్న ఆయకట్టు రైతులు సాక్షి, అమలాపురం: రైతులకు మేలు చేసేందుకు ఏర్పడిన నీటి సంఘాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి.. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో చేయక పంటలు నీట మునిగి దెబ్బతినే పరిస్థితులు తెచ్చాయి.. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు ముంపునకు కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో దొడ్డిదారిన ఏర్పడిన గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ నిర్లక్ష్యమే కారణమైంది. జిల్లాలో కీలకమైన పది మేజర్ డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు కేటాయించింది. కూనవరం, లోయర్ కౌశిక, అప్పర కౌశిక, సాకుర్రు, వృద్ధ గౌతమీ, అమలాపురం, దసరా బుల్లోడు కోడు, వాసాలతిప్ప వంటి డ్రెయిన్లలో పనులకు ప్రభుత్వం నిర్వహణ నిధులు కేటాయించింది. ఈ పనులను వర్షాలు రాక ముందే చేపట్టాల్సి ఉంది. కానీ నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టిన ప్రాజెక్టు కమిటీ తూడు, గుర్రపు డెక్క తొలగించిన పాపాన పోలేదు. ఈ ఏడాది నైరుతిలో లోటు వర్షం కలిసి వచ్చింది. అయినా అరకొరగా పనులు చేసి వదిలేసింది. నాల్గో వంతు కూడా పనులు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. సీజన్ పూర్తయిన తరువాత మొత్తం బిల్లులు చేసుకునే పనిలో ఉంది. కానీ గత నెల మూడో వారంలో అల్పపీడనం ప్రభావం వల్ల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో చేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ముంపు తగ్గుతున్న సమయంలో బంగాళాఖాతంలో మోంథా తుపాను వల్ల మళ్లీ వర్షాలు కురిశాయి. ఈ రెండు సార్లు వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. పది మేజర్ డ్రెయిన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. సకాలంలో తూడు, గుర్రపుడెక్క తొలగించపోవడంతో చేల నుంచి ముంపునీరు వీడడం లేదు. దీనివల్ల పంట పెద్ద ఎత్తున కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రాజెక్టు కమిటీదే ముంపు పాపం అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో ప్రవహిస్తున్న పది ప్రధాన మురుగునీటి కాలువల్లో గుర్రపుడెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. తమ చేల ముంపునకు ప్రాజెక్టు కమిటీదే పాపమని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ ద్వారా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనూ ఇదే విధంగా చేసేవారు. అప్పుట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి గోదావరి ప్రాజెక్టు కమిటీ (ఇప్పుడు దీనిని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలుగా విడదీశారు) ఈ పనులు నిర్వహించేది. ఇప్పుడు మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ ఈ పనులు చేసింది. పేరుకు ప్రాజెక్టు కమిటీ పనులు చేయాల్సి ఉన్నా ఈ పనులను తమ పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ), వాటర్ యూజర్స్ అసోసియేషన్ (డబ్ల్యూయూఏ)లకు అప్పగించి పనులు చేసేవి. ఐదారు గ్రామాల పరిధిలో ఉండే డబ్ల్యూయూఏ, రెండు, మూడు మండలాల పరిధిలో ఉండే డీసీలు ఎంతోకొంత జవాబుదారీతనం కోసమైనా పనులు చేసేవి. పైగా నీటి సంఘాలను ఎన్నికల ద్వారా నిర్ణయించేవారు. కూటమి ప్రభుత్వంలో ఈ ఎంపికలను మమ అనిపించారు. గతంలో ప్రాజెక్టు కమిటీలో చేసిన అనుభవం ఉన్నవారిని పక్కనబెట్టి తమ రాజకీయ అవసరాల మేరకు కూటమి ఎమ్మెల్యేలు అనుభవం లేని వారిని ఎంపిక చేశారు. ఇదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. దీనికితోడు ప్రాజెక్టు కమిటీలోని కీలక వ్యక్తి పనులు చేపట్టి వాటిని చేయకుండా ఇప్పుడు ముంపునకు కారణం కావడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలిన తరువాతచేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన జరగాల్సిన నష్టం జరిగిన తరువాత జిల్లా యంత్రాంగం నిద్ర లేచింది. ప్రాజెక్టు కమిటీ నిర్వాకంపై ఇటీవల వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆధ్వర్యంలో రైతు సంఘం ప్రతినిధులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికప్పుడు పనులు చేపట్టారు. అది కూడా వేగంగా చేస్తున్న దాఖలాలు లేవు. అరకొరగా పనులు చేపడుతున్నారు. కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పూర్తయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ముంపునీరు దిగక వరి చేలు కుళ్లిపోవడం, మొలకలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల జిల్లాలో పంట నష్టం మరింత పెరగనుంది. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. బ్యాడ్మింటన్ సింగిల్లో విజేతగా నందకిషోర్, డబుల్స్లో మొదటి స్థానంలో ఆదిత్య రామ్, గౌతమ్కుమార్, అదేవిధంగా బాక్సింగ్ అండర్ 63.5–67 కిలోల విభాగంలో ఓఏ దిలీప్ ద్వితీయ, అండర్ 67–71 కిలోల విభాగంలో ఆర్.మోహన్రాజ్ ప్రథమ స్థానం సాధించారన్నారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు, బాస్కెట్ బాల్ కోచ్ ఐ.భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల భద్రత గాలికి
మలికిపురం: భక్తులు అధికంగా వచ్చే ఆలయాల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మలికిపురంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం తరఫున సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఆ ఆలయం దేవదాయ శాఖ పరిధిలో లేదని, ఇటువంటి ఘటనలు అలా జరుగుతూ ఉంటాయని బాధ్యత లేకుండా మాట్లాడటం తగదన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి, సింహాచలం ఆలయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా భక్తుల మరణాలు సంభవించాయన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు సుస్పష్టంగా ప్రజలకు అర్థం అవుతున్న సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందన్నారు. కాశీబుగ్గ ఉదంతంతో ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ను ఆయనకు సంబంధంలేని నకిలీ మద్యం కేసులో అరెస్టు చేశారన్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జరిగిన తప్పుని హుందాగా ఒప్పుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పాల్సిన ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. హిందూ దేవాలయాలకు వెళ్తున్న భక్తుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు, భగవంతుడు ఈ ప్రభుత్వానికి శిక్ష వేస్తారని శివకుమార్ అన్నారు. -
వైభవంగా వాడపల్లి వెంకన్న జల విహారం
కొత్తపేట: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గౌతమి గోదావరిలో పుష్పాలతో అలంకరించిన పడవపై స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జల విహారం చేశారు. కే్ష్త్రానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచీ క్యూ లో బారులు తీరారు. గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణం కార్యక్రమాలతో పాటు వేంకటేశ్వరస్వామి వారికి ద్వాదశి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. నేత్రపర్వంగా నరసన్న తెప్పోత్సవం : ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు సఖినేటిపల్లి: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం పల్లిపాలెంలో స్థానిక అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ ప్రతినిధుల నేతృత్వంలో వశిష్ట గోదావరి నదిలో అంతర్వేది లక్ష్మీనృసింహుని తెప్పో త్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో పల్లిపాలెం పుష్కరరేవు వద్ద పంటును హంస వాహనంగా రూపొందించి దానిపై స్వామి, అమ్మవార్లను కొ లువుదీర్చి ఈ ఉత్సవాన్ని కనుల పండువగా చేశారు. తొలుత అంతర్వేది ఆలయం నుంచి గరుడ పుష్పక వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను కొలువు దీర్చిన అర్చకులు, మంగళ వాయిద్యాలతో పల్లిపాలెం పుష్కరరేవు వద్దకు అగ్నికుల క్షత్రియులతో కలిసి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చక స్వాములు వేద మంత్రాలతో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఆసీనులను చేశారు. ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్వామివారికి పూజలు చేశారు. బాణసంచా కాల్పులతో పల్లిపాలెం పుష్కర రేవు వద్ద నుంచి గొంది సరిహద్దు వరకూ గోదావరిలో విహరింపచేశారు. అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను పుష్కర రేవుకు తిరిగి తీసుకువచ్చి, మంగళ వాయిద్యాలతో తిరిగి ఆలయానికి చేర్చారు. సర్పంచ్ ఒడుగు శ్రీను, ఎంపీటీసీలు బైర నాగరాజు, పోతాబత్తుల భాస్కరరావు, మాజీ సర్పంచ్ వనమాలి మూలాస్వామి పాల్గొన్నారు. -
రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడాలి
ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూ రంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హితవు పలికారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు అధికారులు ఆదివారం కౌన్సెలింగ్లు ఇచ్చారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్ల గురించి వివరించారు. జిల్లాలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచామన్నారు. ఇక ముందు ఏ రౌడీషీటరైనా చట్టాన్ని ఉల్లంఘించినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. రౌడీ షీటర్లలో మార్పు ఆశిస్తూ ఈ కౌన్సెలింగ్లు జరిగాయని వివరించారు. అయినవిల్లి ఆలయం కిటకిట అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 237 మంది పాల్గొన్నారు. ఏడుగురికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వహించారు. ఒకరికి నామకరణ చేయగా శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 21 జంటలు పాల్గొన్నాయి. స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 4,860 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,78,641 లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అవార్డు నిరాకరించిన విద్యుత్ శాఖ ఏఈ మలికిపురం: ఉత్తమ సేవలకు అవార్డు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా స్వీకరిస్తారు. అది అరుదుగా లభించే అవకాశం. అయితే అలా ఉత్తమ సేవలకు అవార్డుకు ఎంపిక అయిన మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యుత్ శాఖ ఏఈ బొలిశెట్టి ప్రసాద్ అవార్డు స్వీకరణకు నిరాకరించారు. ఇటీవల సంభవించిన పెను తుపానులో విశేష సేవలు అందించిన ప్రసాద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి అవార్డు స్వీకరణకు ఆహ్వానం వచ్చింది. శనివారం వెళ్లాలి. అయితే తుపానుకు దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులలో సఖినేటిపల్లి మండలంలో విద్యుత్శాఖ ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మనస్థాపానికి గురైన ప్రసాద్ తనకు ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు. హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్సీల పరామర్శ అమలాపురం టౌన్: హత్యకు గురైన అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫోన్లో ఆదివారం పరామర్శించారు. మృతుడు శ్రీనివాస్ భార్య దేవితో ఆయన మాట్లాడారు. ఇంత దారుణంగా హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసి, మేమంతా మీకు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. తాను ప్రస్తుతం మాలలో ఉన్నానని, త్వరలోనే మీ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. తన భర్తను అతి కిరాతంగా చంపారని శ్రీనివాస్ భార్య దేవి ఎమ్మెల్సీకి వివరించారు. కాగా శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు వేర్వేరుగా వారింటికి వెళ్లి పరామర్శించారు. హత్య చేసిన అయిదుగురు నిందితులను పోలీస్లు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ సోదరుడు అంజితో ఎమ్మెల్సీలు మాట్లాడి మీ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూదా గణపతి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గుమ్మళ్ల సురేష్, చదలవాడ రాజారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
ఇక అక్రమాలకు చెక్
రాయవరం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. జాబ్కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు ఆధారంగా ఈకేవైసీ చేసుకుంటేనే నవంబర్ నుంచి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం ఎన్ఆర్ ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కూలీ ఆధార్, ఉపాధి కార్డు వివరాలను నమోదు చేసి కూలీ ఫేస్ (ముఖం)ను గుర్తింపు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు జాబ్కార్డు ఉన్న వారికి ఈకేవైసీ నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. అయితే ఉపాధి కూలీలు ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకుని ఉండాలి. ముఖ గుర్తింపు జరగకుంటే ఆధార్ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఇక నుంచి ఉపాధి పనులు చేసే అవకాశం కోల్పోతారు. ‘ఉపాధి’ హామీలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈకేవైసీ తప్పనిసరి లేకుంటే పనిచేసే అవకాశం కోల్పోనున్న కూలీలు నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో రోజూ హాజరు నమోదు హాజరు పడకుంటే పనికి వెళ్లినా కూలి సొమ్ము జమ కాదు -
జోగి రమేష్ అరెస్ట్ దుర్మార్గం
● కాశీబుగ్గ దుర్ఘటన నుంచి దృష్టి మళ్లించే కుట్ర ● చిత్తశుద్ధి ఉంటే జోగి రమేష్ చాలెంజ్ను స్వీకరించాలి ● అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చు ● సిట్ కాదు సీబీఐ దర్యాప్తు చేయించుకోండి ● కూటమి పాలకులను ప్రజలు ఛీకొడుతున్నారు ● విలేకరులతో ఎమ్మెల్సీ తోట కపిలేశ్వరపురం (మండపేట): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్ను సిట్ దర్యాప్తు పేరుతో అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఖండించారు. కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగా రమేష్ను అరెస్ట్ చేశారని అభిప్రాయపడ్డారు. మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలనను గాలికి వదలి విపక్ష నేతలపై కుట్రలు పన్నేందుకే కూటమి ప్రభుత్వాధినేతలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. కల్తీ మద్యం తయారీ కేసులో కీలక వ్యక్తి జనార్ధన్కు ప్రభుత్వాధినేతలే భరోసానిస్తూ విపక్ష నేతల పేర్లను అతనితో చెప్పిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనార్ధన్, తదితరులపై పారదర్శకతతో దర్యాప్తు చేయాలన్నారు. కేసులో నిందితుడు జనార్ధన్ వ్యవహార శైలిని పరిశీలించిన వారెవరికై నా ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా కనిపిస్తుందన్నారు. జనార్ధన్ ద్వారా జోగి రమేష్ కల్తీ మద్యం తయారీకి ప్రధాన కారణమంటూ పేరును చెప్పించారని ఆరోపించారు. అదే వాస్తవమని కూటమి ప్రభుత్వాధినేతలు భావిస్తే ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ అనేకసార్లు చెప్పినా ఉద్దేశ పూర్వకంగా కేసులో ఇరికిస్తున్నారన్నారు. అవసరమైతే తనపై సీబీఐ దర్యాపు చేయించాలని చేసిన చాలెంజ్ను ఎందుకు స్వీకరించడం లేదని ఎమ్మెల్సీ తోట ప్రశ్నించారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అండే స్టాండ్ అనే సిట్తో దర్యాప్తు చేయిస్తున్నారన్నారు. తనకు, లోకేష్, చంద్రబాబులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించమని జోగి రమేష్ చాలెంజ్ చేశారని గుర్తు చేశారు. పరిపాలించడం చేతకాక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చతికిలపడిందన్నారు. ప్రజల దృష్టి మళ్లించే క్రమంలో విపక్ష నేతలపై కుట్రలు పన్నుతున్నారన్నారు. దుర్మార్గాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని, వడ్డీతో సహా చెల్లించుకునే రోజులు వస్తాయన్నారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులివ్వడమే కాకుండా బెల్ట్ షాపుల ద్వారా నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళాలోకానికి అన్యాయం చేస్తున్నది కూటమి ప్రభుత్వమే అన్నారు. జోగి రమేష్ను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రభుత్వ అసమర్థతను ఎలా సమర్థించుకోవాలో తెలియక జోగి రమేష్ను ఇరికించే దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రగుంట అయ్యప్ప, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, నియోజకవర్గ ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, నాయకులు సలాది వీరబాబు, కోళ్ళ శ్రీను పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్య అల్లవరం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికే మాజీ మంత్రి జోగి రమేష్ని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో అరెస్టు చేసిందని మాజీ ఎంపీ, సీఈసీ సభ్యులు చింతా అనురాధ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారు అనడానికి ఈ అరెస్టే నిదర్శనమని తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్కు సంబంధం లేకపోయినా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కూటమి సర్కారు లక్ష్యంగా చేసుకుందని అనురాధ విమర్శించారు. ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు జోగి రమేష్ నిరూపించారు. అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలో నకిలీ మద్యం, లిక్కర్ మాఫియా వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. పట్టుబడ్డవారిలో టీడీపీకి చెందిన నేతలు, అభ్యర్థులు, మంత్రులు, లోకేష్కు సన్నిహితులు ఉన్నప్పటికీ, వారిపై ఏ చర్యలూ తీసుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని లిక్కర్ స్కామ్లను సృష్టించి తప్పుడు విచారణలు జరిపి, వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ విధానంగా మారిందని ఆమె పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆరోపించారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఐ.పోలవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో ఎటువంటి సంబంధం లేకపోయినా జోగి రమేష్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కూటమి పార్టీకి చెందినవారే కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వెలుగులోకి రావడంతో ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నాయకులపై నెడుతున్నారని ఆరోపించారు. ఈ తీరు మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ఇంతకు పది రెట్లు ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్య మంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని పొన్నాడ అన్నారు. పార్టీ ఎస్ఈసీ సభ్యు డు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కేసుతో తన ప్రమేయం లేదని ఇటీవల జోగి రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు, కూటమి నేతలు ఇలా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్ఈసీ సభ్యురాలు కాశి మునికుమారి, ఎంపీపీ మోర్తా రాణి మరియం జ్యోతి, దొరబాబు, ఎం.శివ, పి.వెంకటేశ్వరరావు, కె.ప్రసాద్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం ● కాశీబుగ్గ మృతుల ఆత్మశాంతికి కొవ్వొత్తుల ర్యాలీ అమలాపురం టౌన్: రాష్టంలో ఆలయాలకు వెళ్లే భక్తులకు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టలేక చేతులెత్తేస్తోందని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, నియోజక వర్గాల వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్లు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 9 మంది భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అమలాపరంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్సీలతోపాటు ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం నియోజక వర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతి సారీ తొక్కిసలాటలు అనివార్యమై పదుల సంఖ్యలో భక్తుల మృత్యు వాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పుష్కరాలకు రాజమహేంద్రవరంలో 30 మంది భక్తులు చనిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గలో తొక్కిసలాటలు సంభవించి భక్తుల చనిపోయారని గుర్తుచేశారు. కొవ్వొత్తుల ర్యాలీ హైస్కూలు సెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ సాగింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, పితాని బాలకృష్ణ , మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతనిధి కాశి మునికుమారి ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, అమలాపురం పట్టణం, పలు మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవరావు, బద్రి బాబ్జీ, కొనుకు బాపూజీ, నేతలు మట్టపర్తి నాగేంద్ర, గొల్లపల్లి డేవిడ్, మిండగుదటి శిరీష్, సూదా గణపతి, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి కోనాల రాజు పాల్గొన్నారు. -
రత్నగిరిపై ప్రభంజనం
సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు● సత్యదేవుని దర్శించిన 80 వేల మంది ● 8 వేల వ్రతాలు.. రూ.80 లక్షల ఆదాయం అన్నవరం: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సుమారు 80 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 8 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టు దర్శనానికి గంట సమయం పట్టింది. ఉదయం 9 గంటల వరకూ మాత్రమే రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆ తరువాత రద్దీ అధికంగా ఉండడంతో అంతరాలయ దర్శనం నిలిపివేసి, ఆ భక్తులను కూడా వెలుపలి నుంచే అనుమతించారు. వ్రత మండపాలతో బాటు సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో కూడా స్వామివారి రూ.300 వ్రతాలు నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణాన్ని పాత కల్యాణ మండపంలో జరిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయ ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్వామివారి ఆలయం వద్ద దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్న భక్తులకు అభిముఖంగా కొంతమంది భక్తులను ఆలయానికి తీసుకువస్తూండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కమాండ్ కంట్రోల్ రూములో సీసీ కెమెరాల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. నేడు సత్యదేవుని తెప్పోత్సవం క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం పంపా సరోవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లను సాయంత్రం 5 గంటలకు రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరానికి తీసుకువస్తారు. అక్కడి పూజా మండపంలో 5.30 గంటలకు తులసీధాత్రి పూజ నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంపా సరోవరంలో హంస వాహనంగా అలంకరించిన పంటు మీద ఉన్న రుద్రాక్ష మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేయించి, పూజలు చేస్తారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణలు, కళ్లు మిరుమిట్లు కొలిపే బాణసంచా కాల్పుల నడుమ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు సాయంత్రం 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో మూడుసార్లు విహరించనున్నారు. దేవస్థానంలో స్వామివారి కల్యాణం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వేడుకను కన్నులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. తెప్పోత్సవ నిర్వహణపై వారు అధికారులతో సమీక్షించారు. భక్తులందరూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా పంపా తీరంలో బారికేడ్లు నిర్మించామన్నారు. తెప్పోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. తెప్పోత్సవం నిర్వహించే పవర్ హౌస్ వద్ద పంపా తీరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్ రోడ్ ముఖద్వారం నుంచి పవర్ హౌస్ వరకూ రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. తెప్ప మీదకు 33 మందిని మాత్రమే అనుమతిస్తారు. వీరందరూ విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలి. తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను ఆహ్వానించారు. వీరి కోసం పంపా తీరంలో వీఐపీ లాంజ్ ఏర్పాటు చేశారు. తెప్పోత్సవానికి 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పంపాలో గజ ఈతగాళ్లు, రెండు మోటార్ బోట్లను, అగ్నిమాపక శకటాన్ని కూడా ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. మోటార్ బోట్లతో కూడా పంపాలో ట్రయల్ రన్ నిర్వహించారు. -
అన్నవరం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో వచ్చే భక్తులు కార్తిక మాసంలో లక్షలకు పెరుగుతారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో భక్తుల భద్రతకు మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోని 3, 10, 17వ తేదీల్లో కార్తిక సోమవారాల సందర్భంగా అనేక మంది విచ్చేస్తారు. ఈ నెల ఐదో కార్తిక పౌర్ణిమ అత్యంత కీలకం. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సత్యదేవుని గిరిప్రదక్షణ జరగనుంది. గతేడాది ఆ కార్యక్రమంలో రెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాగా..దేవస్థానంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఆలయానికి వచ్చేటప్పటికి వారిలో సహనం తగ్గుతోంది. ఆలయంలో సిబ్బంది కదలండి అని తోస్తుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను క్యూలైన్ల కంపార్ట్మెంట్లలో కొద్దిసేపు కూర్చునేలా చేయాలి. ఆ సమయంలో వారికి మజ్జిగ, ఫలహారాలు, చిన్నారులకు బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తే కొంత సేద తీరే అవకాశం ఉంటుంది. రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు వెలిగించేందుకు వెళ్లే మార్గం చాలా చిన్నదిగా ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కొంత మేర తొలగించి విశాలంగా చేయాలి. దేవస్థానంలో చాలా చోట్ల భక్తులను కంట్రోల్ చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి తాళాలు వేశారు. ఇది మంచిదే అయినా అత్యవసరమైనప్పుడు ఆ తాళాలు తీయడానికి సిబ్బంది అక్కడ ఉండడం లేదు. ఏదైనా తొక్కిసలాట జరిగినపుడు ఇది చాలా ఇబ్బందిగా మారింది. కార్తిక మాసం పర్వదినాలలో 108 అంబులెన్స్ రత్నగిరి మీదనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం కొండదిగువన ఉంది. -
భక్తులకేదీ అభయం!
● ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయాలు ● పోటెత్తుతున్న భక్తులు ● వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ ● కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో అలెర్ట్ ● పూర్తిస్థాయిలో లేని భద్రత అంతర్వేది రథయాత్రలో కిక్కిరిసిన భక్తులు (ఫైల్) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచీ అనేక మంది భక్తులు తరలివస్తారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ ఆలయాలకు ప్రత్యేక మైన రోజుల్లో ఇసుకస్తే రాలనంతగా పోటెత్తుతారు. అయితే ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతకు ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారు. ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి.అంతర్వేది సఖినేటిపల్లి: అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ఎంతో ప్రముఖమైంది. ఏటా ఫిబ్రవరిలో (మాఘమాసం) స్వామివారికి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి కల్యాణం, స్వామివారి రథోత్సవం, చక్రవారీ (పౌర్ణమి సముద్ర స్నానం)లకు సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివస్తారు. రథోత్సవంలోనే సుమారు 2 లక్షల మంది పాల్గొంటారు. వీరందరికీ యాత్ర పొడవునా ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఉత్సవాల్లో పౌర్ణమి స్నానాలు అనంతరం స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చే అసంఖ్యాకమైన భక్తులు ప్రాంగణంలో కిక్కిరిసి ఉంటారు. వీరందరికీ అరకొరగా భద్రత కల్పిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్తిక మాసంలో కూడా ఆలయానికి అయ్యప్ప భక్తులు, సాధారణ భక్తులు పోటెత్తుతారు. ఈ నెలలో సుమారు 2 లక్షల మంది దర్శించుకుంటారు. -
వాడపల్లి
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా పేరుపొందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల (పెద్ద తిరుపతి), ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) తర్వాత ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్య ఫలం అనే నానుడితో భక్తుల విశ్వాసం చూరగొంది. ఈ క్షేత్రానికి ప్రతి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 70 వేల నుంచి 90 వేల మంది భక్తులు వస్తారు. ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయం చుట్టూ గల మాడ వీధులు, స్వామి దర్శనానికి ఏర్పాటు చేసిన అన్ని క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో సౌకర్యాలు మెరుగుపర్చారు. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ పోలీసు బందోబస్తు తక్కువనే చెప్పాలి. ప్రైవేట్ సిబ్బందిపైనే దేవస్థానం ఆధారపడింది. 190 మంది ప్రైవేట్ సిబ్బంది 2 షిప్టులుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది 40 మంది వరకు ఉంటారు. అయితే ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడల్లా తొక్కిసలాట తదితర కారణాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. ఆయన అమలాపురంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆలయానికి భక్తులు పోటెత్తినా ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడడం జరిగిందన్నారు. ఆ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆరుగురు, సింహాచలంలో నలుగురు, రాజమహేంద్రవరంలో గత పుష్కరాలకు దాదాపు 30 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ సంఘటలన్నీ చంద్రబాబు ప్రభుత్వ భద్రతా వైఫల్యంతోనే జరిగాయని ఆరోపించారు. బాల బాలాజీకి రూ.4.07 లక్షల ఆదాయం మామిడికుదురు: కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4.07 లక్షల ఆదాయం వచ్చిందని, స్వామివా రి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,996 విరాళాలుగా అందించారన్నారు. ఆరు వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. అమలాపురానికి చెందిన బొంతు వెంకట సుబ్బారావు, మంగాదేవి దంపతులు నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11,111, పొదలాడకు చెందిన ఉండ్రు మంగాదేవి రూ.10,116 విరాళంగా అందించారన్నారు. దాతలకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసినట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావుకొత్తపేట: వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు నియమితులయ్యారు. వివిధ విభాగాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇప్పటికే అనేక మంది నాయకులకు పదవులు ప్రకటించింది. తాజాగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఎంతో నమ్మకంతో తనను బీసీ రాష్ట్ర కమిటీలో నియమించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అల్లవరం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై మాజీ ఎంపీ, సీఈసీ సభ్యులు చింతా అనురాధ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా, ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో చోట ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నా యన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులుపెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు. సుమారు 28 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,69,700, అన్నదాన విరాళాలు రూ.1,09,339, కేశఖండన ద్వారా రూ.6,480, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.26,665 కలిపి మొత్తం రూ.4,12,774 ఆదాయం వచ్చిందని వివరించారు. -
కూటమి కోతలు
పంటంతా నీటిపాలు మామిడికుదురు మండలం నగరంలో తుపాను వల్ల వీచిన ఈదురు గాలులకు పెద్ద ఎత్తున చేలు నేలనంటాయి. దీనికి వర్షం తోడు కావడంతో విరిగిన కంకులు నీట నానుతున్నాయి. అంతకు ముందు అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలకు, తుపాను వర్షం తోడు కావడంతో ముంపు అధికంగా ఉంది. గ్రామానికి చెందిన పితాని మోహన్, బల్ల చంటి, గుత్తుల వెంకటేశ్వరరావు కౌలు రైతులు. వీరు సుమారు ఏడు ఎకరాలను సాగు చేశారు. ఒక్కొక్కరూ ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ముంపు నీరు దిగే అవకాశం లేక పంట కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు రాక ఒకరికి ఒకరు సాయంగా పంటను ఒబ్బిడి చేసుకుంటున్నారు. పడిపోయిన వరి కంకులను రక్షించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చేనేత సాగక... మోంథా తుపానుకు కురిసిన వర్షాలతో మగ్గం వద్ద కాళ్లు పెట్టుకునే గోతుల్లోకి నీరు చేరింది. దీంతో నేత నేయడానికి వీలు కుదరడం లేదు. చీరల తయారీకి ఉపయోగించే ముడి సరుకు తడిసి ముద్దయ్యింది. బూజు కూడా పట్టింది. వీటి విలువ రూ.ఐదు వేల వరకు ఉంది. గతంలో అల్పపీడనం వల్ల వారం రోజులు, ఇప్పుడు మరో ఐదు రోజుల పాటు పనులు లేకపోవడంతో పస్తులుంటున్నాం. మళ్లీ ముడి సరకు తెద్దామన్నా సొమ్ములు లేవు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. – తమ్మిశెట్టి వెంకట రామకృష్ణారావు, చేనేత కార్మికుడు, తూర్పుపాలెం, మలికిపురం మండలం -
హత్య ఘటనలో నిందితులను అరెస్టు చేయరా?
● మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆవేదన ● జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన అమలాపురం టౌన్: అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య జరిగి ఐదు రోజులు కావస్తున్నా నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ మృతుడి కుటుంబీకులు, స్థానికులు శనివారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కొంకాపల్లిలోని మృతుడి శ్రీనివాస్ ఇంటి వద్ద ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ తన సోదరుడు శ్రీనివాస్ తల నీలాలు, కనుబొమ్మలు, కళ్లు తొలగించి, నాలుక కోసి అతి దారుణంగా, కిరాతంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదన్నారు. 24 గంటల్లోపు నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా.. ధర్నా ప్రాంతానికి అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సైలు చేరుకున్నారు. మృతుడి కుటుంబీకులు, స్థానికులు, కొంకాపల్లి పెద్దలతో డీఎస్పీ ప్రసాద్ చర్చించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని, కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు. కొంకాపల్లిలో ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడి భార్య దేవి, పిల్లలు, అతడి సోదరుడు అంజి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
ఐ.పోలవరం: బాలికకు చాక్లెట్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన బాణాపురానికి చెందిన రాయపరెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. తినుబండారాలు ఇచ్చి బాలికను బలాత్కారం చేసినట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో అంగీకరించాడన్నారు. బాలిక ఇంటికి అక్టోబర్ 25న వెళ్లి చాక్లెట్లు ఇవ్వటం ఇస్తుండగా తల్లి గమనించిందని, దీనిపై బాలికను నిలదీయగా నిందితుడి ఘాతుకాన్ని బాలిక తన తల్లికి చెప్పిందన్నారు. దీనిపై ఆమె తన కుటుంబ సభ్యులతో చర్చించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందని, ఆ మేరకు ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. గతంలోనూ పలు కేసులు రాయపురెడ్డి బాబీపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అతనిపై 2001, 2002 సంవత్సరాలలో ఐ.పోలవరం పోలీస్ స్టేషన్లో రెండు మోటార్ సైకిల్ దొంగతనం కేసులు, రాజానగరం పోలీస్ స్టేషన్లో 2005లో ఒక దొంగనోట్ల మార్పిడి కేసు, గతంలో సస్పెక్టెడ్ షీట్గా ఉన్నాయని తెలిపారు. -
వాడపల్లి వాసా.. శ్రీవేంకటేశా..
● వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే రూ. 63 లక్షల ఆదాయం కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసింది. కార్తిక మాసంలో శనివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం ఘనంగా జరిపారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ మార్గాల ద్వారా దేవస్థానికి శనివారం ఒక్కరోజే రూ.62,53,527 ఆదాయం వచ్చినట్టు డీసీ, చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. వాడపల్లి క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తున్న భక్తజనం -
కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య
గోకవరం: మండలంలోని తంటికొండ, గాదెలపాలెం గ్రామాల మధ్య ఉన్న పోలవరం కాలువలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్పభగవాన్ (22) శుక్రవారం రాత్రి పోలవరం కాలువలో దూకాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాలువలో గాలించగా శనివారం ఉదయం విగతజీవిగా తేలాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతుడు ఫార్మసీలో డిప్లమో చేస్తున్నాడని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 800 సెల్ఫోన్ల రికవరీ కాకినాడ క్రైం: దొంగిలించబడిన, పోగొట్టుకున్న 800 సెల్ఫోన్లను వాటి యజమానులకు పోలీసులు అప్పగించారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ ఆ వివరాలు వెల్లడించారు. సాంకేతికతను వినియోగించి సెల్ఫోన్లను గుర్తించామన్నారు. దీనిలో పోలీస్ ఐటీ కోర్ విభాగం కీలకంగా వ్యవహరించిందన్నారు. రికవరీ చేసి అప్పగించిన 800 సెల్ఫోన్ల విలువ సుమారు రూ.1.36 కోట్లని తెలిపారు. 4న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 4న అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీమ్ బాషా శనివారం ఈ విషయం తెలి పారు. అండర్ 14 బాలురు, అండర్ 17 బాలికల జట్లను ఎంపిక చేస్తామన్నారు. పాల్గొనే విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటల లోపు రిపోర్టు చేయాలన్నారు. ఇతర వివరాలకు ఎస్జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు 93469 20718, ఏఎస్ఎస్ రమాదేవి 94400 94984లను సంప్రదించాలన్నారు. -
నా ఇల్లు కూలిపోయింది
నదిని ఆనుకుని ఉన్న నా ఇల్లు తుపానుకు కూలిపోయింది. గా లులకు తోడు నది నుంచి నీరొచ్చి ముంచేసింది. నేను దివ్యాంగుడిని. నాకున్న ఇబ్బంది వల్ల మా వాళ్లు పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కోసం మా దగ్గర ఎటువంటి వివరాలూ నమోదు చేసుకోలేదు. కేవలం కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే సొమ్ములిస్తామంటున్నారు. మాకు అన్యాయం చేయవద్దు. మాకు కూడా పరిహారం ఇవ్వాలి. – వనమాలి పెద్దిరాజు, అంతర్వేది పల్లిపాలెం, సఖినేటిపల్లి మండలం పది రోజులుగా వేట లేదు తుపాను వస్తోందంటూ ఈ నెల 22 నుంచి మమ్మల్ని వేటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పది రోజుల నుంచీ ఇంటి వద్దనే ఉంటున్నాం. వేట లేదు. తుపాను గాలులు, వర్షాల వల్ల మా వలలు దెబ్బతిన్నాయి. వేటకు పోతేనే మా కుటుంబం గడిచేది. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందించలేదు. ప్రస్తుతం పూట గడవడం లేదు. – ఎరుపల్లి ఏసురాజు, అంతర్వేది పల్లిపాలెం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో కూలిపోయిన ఇంటి వద్ద వస్తువులను సర్దుకుంటున్న పెద్దిరాజు కుటుంబ సభ్యులు అంతర్వేది పల్లిపాలెంలో దెబ్బతిన్న వలలను సరిచేసుకుంటున్న మత్స్యకారులు -
డీఐఈవోగా విజయశ్రీ బాధ్యతల స్వీకరణ
అమలాపురం టౌన్: జిల్లా ఇన్చార్జి ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈవో)గా డి.విజయశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని డీఐఈవో కార్యాలయంలో ఆమె చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీఐఈవోగా పనిచేసిన వనుము సోమశేఖరరావు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ మేరకు విజయశ్రీని నియమిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. విజయశ్రీ తూర్పుగోదావరి జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి (డీవీఈవో)గా పనిచేస్తున్నారు. ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఐఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
కోరుకొండ
కోరుకొండ: గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. కార్తిక మాసం కావడంతో సాధారణ భక్తులతో పాటు, అయ్యప్ప మాలధారులు అధికంగా తరలివస్తున్నారు. ముఖ్యంగా కొండపైన ఆలయానికి వెళ్లేందుకు సుమారు 630 మెట్లు ఎక్కాలి. ఆ మార్గం ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొండపై ఆలయంలో విద్యుత్, తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా మెట్లు ఎక్కే భక్తులపై కోతులు దాడి చేస్తున్నాయి. వాటి నుంచి రక్షణకు చర్యలు చేపట్టాలి. స్వామివారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, స్నానాలగదులు నిర్మించాలి. -
జనసేన నేత సత్య వెంకటకృష్ణ అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జనసేన నాయకుడు సత్య వెంకట కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా పరారీ లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై నిందితుడు ఆరు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో పాటు మరికొందరిపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.బాలిక తల్లి తప్ప.. ఫిర్యాదు చేయడానికి మిగిలిన బాధితులు ముందుకు రావడం లేదు. అత్యాచార ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. మోటారు సైకిళ్ల దొంగతనం, దొంగ నోట్ల మార్పిడి కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో సత్య కృష్ణపై సస్పెక్ట్ షీట్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐ.పోలవరం హైస్కూల్లో విద్యా కమిటీ కో-ఆప్షన్ సభ్యుడిగా కొనసాగుతున్న సత్య కృష్ణ.. దుర్మార్గానికి ఒడికట్టాడు. నేరం రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు పడుతుందని డీఎస్పీ తెలిపారు. -
కోనసీమలో దారుణం.. బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం
సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరం మండలంలో దారుణం జరిగింది. బాలికపై జనసేన నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ(బాబీ)పై జిల్లా ఎస్పీకి బాధితురాలి తల్లి ఫిర్యాదుర చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లను చంపేయాలంటూని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
భక్తిశ్రద్ధలతో గోతులాభారం
బిక్కవోలు: ఇల్లపల్లి గ్రామంలోని 108 స్తంభాల శివాలయం (సత్యరామ రసలింగేశ్వరస్వామి ఆలయం)లో బుధవారం గోతులాభారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తిక మాసంలో బియ్యంతో ఆవుకు తులాభారం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు, ఆలయ నిర్వాహకుడు ముప్పిడి బాలచంద్ర గంగాధర తిలక్ దంపతులు ఏకాదశ రుద్రాభిషేకం, అష్టలక్ష్మి కుంకుమార్చన, పూజలు చేశారు. రాజీవ్ జమిందార్ దంపతులు చేతుల మీదుగా ఆవుకు తులాభారం నిర్వహించగా, 320 కిలోల బరువు తూగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని తమ తోచిన విధంగా బియ్యం వేశారు. ఆ బియ్యాన్ని దేవస్థానం నిర్వహించే అన్నదాన కార్యక్రమాల్లో వినియోగిస్తారు. -
ముప్పు తప్పినా..
సాక్షి, అమలాపురం: మోంథా తుపాను పెను విపత్తు నుంచి జిల్లా బయటపడింది. తీరాన్ని చేరే వరకూ అత్యంత తీవ్రంగా వచ్చిన మోంథా.. తీరం చేరే సరికీ బలహీనపడింది. అయితే స్వల్పంగా వీచిన గాలులు, కొద్దిపాటి వర్షం అన్నదాత వెన్ను విరిచింది. కొబ్బరి రైతులకు ఊరట నిచ్చినా, వరి, అరటి రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. దీనితోపాటు రోడ్లు, విద్యుత్ శాఖకు నష్టం కలిగింది. తగ్గిన గాలుల వేగం మోంథా తుపాను బుధవారం తెల్లవారు జాము ఒంటి గంటకు జిల్లాకు సమీపంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్న ఈదురు గాలులు.. అదృష్టవశాత్తూ 50 కిలోమీటర్ల వేగానికే పరిమితమయ్యాయి. 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్పగా, కేవలం 14.9 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. కూలిన చెట్లు తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో ఈదురుగాలులు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్ర వరకు సముద్ర తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో వీచాయి. వాటి ధాటికి తీరంలో కొబ్బరి చెట్లు ఊగిపోయాయి. సముద్ర తీరంలో ఇసుక తుపాను తలపించింది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మునిగిన వరి వరి రైతులను మోంథా తుపాను ఎక్కువగా దెబ్బ తీసింది. భారీ వర్షాలు లేకున్నా రెండు రోజులుగా బలమైన ఈదురు గాలుల కారణంగా వెన్ను విరిగి నేలనంటాయి. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, 55,115 ఎకరాల్లో చేలు నేలకొరగా, 21,594 ఎకరాల్లో చేలు నీటమునిగాయి. మొత్తం 76,709 ఎకరాల్లో పంటపై తుపాను ప్రభావం చూపింది. గత అల్పపీడన వర్షాలకు తోడు, తుపాను కారణంగా మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునీరు చేలల్లో నిలిచిపోయింది. నీట మునిగిన చేలల్లో సగం చేలల్లో ఈ వారం, పది రోజులలో కోతలు మొదలు కావాల్సి ఉంది. తీర ప్రాంత మండలాలను ఆనుకుని ఉన్న అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో నీట నానుతున్న ధాన్యం రంగు మారడం, తప్పలు రావడం, మొలక రావడం జరుగుతుందని, దిగుబడి గణనీయంగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. అరటికి అధిక నష్టం అంబాజీపేట, పి.గన్నవరం, కొత్తపేట, ఆలమూరు, రావులపాలెంలో మండలాల్లో అరటికి అధికంగా నష్టం జరిగింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అరటి చెట్లు విరిగి పడ్డాయి. జిల్లాలో 4,667 మంది రైతులకు చెందిన 3,953.31 ఎకరాల ఉద్యాన పంటలు దెబ్బతినగా, 3,960 మంది రైతులకు చెందిన 3,379.90 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. గెలలు కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోట నేలనంటడం వల్ల ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. 558 మంది రైతులకు చెందిన 450.71 ఎకరాల్లో కూరగాయలు, 45 మంది రైతులకు చెందిన 43.48 ఎకరాలలో బొప్పాయి, 62 మంది రైతులకు చెందిన 39.53 ఎకరాలలో పువ్వులు, 32 మంది రైతులకు చెందిన 19.76 ఎకరాల్లో పసుపు, పది మంది రైతులకు చెందిన 7.90 ఎకరాలలో తమలపాకు పంటలకు నష్టం వాటిల్లింది. ముంచిన ఉప్పునీరు సముద్రం చొచ్చుకు రావడంతో వశిష్ట నదీపాయ ద్వారా పోటెత్తి, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఏడవ వార్డును ముంచెత్తుతోంది. ఇక్కడ సుమారు 20 కుటుంబాలు ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం పర్ర భూముల ద్వారా సముద్రపు నీరు వాసాలతిప్పలో మత్స్యకారుల ఇళ్లను తాకింది. వాసాలతిప్పతో పాటు ఎస్.యానాం బీచ్ రోడ్లను సముద్రపు నీరు నేరుగా ముంచుతోంది. కాట్రేనికోన మండలం పల్లం, బలుసుతిప్ప, మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, కేశనపల్లిలోకి శంకరగుప్తం డ్రెయిన్ ద్వారా ముంపునీరు లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. ఊపిరి పీల్చుకున్న కొబ్బరి రైతులు 1996 తుపాను వల్ల సుమారు 20 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగిన చేదు అనుభవాలతో కొబ్బరి రైతులు ఎక్కువగా భయపడ్డారు. గాలుల తీవ్రత 50 కిలోమీటర్ల లోపు ఉండడంతో చెట్లు విరిగిపోవడం తక్కువగా ఉంది. జిల్లాలో కేవలం 669 మంది రైతులకు చెందిన 950 చెట్లు విరిగి పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతమైన అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసిన ఆయన ఓడలరేవులో దిగి బాధితులను పరామర్శించడంతో పాటు బెండమూర్లంకలో దెబ్బతిన్న వరి చేలను పరిశీలించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష జరిపారు. తుపాను ప్రత్యేకాధికారి విజయ రామరాజు, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎంపీ హరీష్ మాధుర్, ఎస్పీ రాహుల్ మీనా, జేసీ టి.నిషాంతి పాల్గొన్నారు.జలదిగ్బంధంలో పల్లం గ్రామం నష్టం మిగిల్చిన మోంథా తీరంలో తగ్గని అలజడి వరికి అంతులేని నష్టం నేలనంటిన అరటి కొబ్బరి తోటలకు ఊరట పర్రభూముల్లోకి చొచ్చుకు వచ్చిన సముద్రం నీట మునిగిన మత్స్యకారుల ఇళ్లుసగం పంట దెబ్బతింది ఆలమూరు మండలం పినపళ్లలో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సగానికి పైగా పంట దెబ్బతింది. దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చేలల్లో ముంపునీరు వెంటనే తీయకుంటే నష్టం మరింత పెరుగుతుంది. – అన్యం చంద్రరావు, కౌలురైతు -
లోకాన్ని వీడినా వెలుగులు పంచి..
● రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్ ● అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన యువకుడు అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన జి.మహేష్ (23) ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ అచ్చంపేట జంక్షన్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మహేష్ను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో బ్రెయిన్ డెడ్ చెందినట్టు మరుసటి రోజు వైద్యులు ప్రకటించారు. మహేష్ అవయవాలను దానం చేయడానికి అతడి తల్లిదండ్రులు సమ్మతించారు. దీంతో మెడికవర్ అస్పత్రిలో అవయవ సేకరణ నిర్వహించారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు ఫి.ఫణికిరణ్ పర్యవేక్షణలో డాక్టర్లు కళ్యాణ్ బాబు, రాజా అమరేంద్ర, కిశోర్ బాబు, అరవింద్, మెడికవర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ సమన్వయంతో రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు, రెండు కిడ్నీలను కాకినాడ నగరం, రూరల్లోని రెండు ఆస్పత్రిలో రోగులకు అమర్చేందుకు గ్రీన్ చానల్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి తరలించారు. ఈ సందర్భంగా అవయదాన్ ప్రతినిధి కె.రాంబాబు మాట్లాడుతూ అవయవదానం అనేది జీవితానికి పరమార్థం లాంటిదని, ఒకరి జీవిత ప్రయాణం ముగిసినా అవయవాలు మరెందరికో కొత్త శ్వాసగా మారుతాయన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన మహేష్ కుటుంబ సభ్యులు అభినందనీయులన్నారు. -
పంట రుణాలు మాఫీ చేయాలి
అల్లవరం: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వారి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు చింతా అనురాధ డిమాండ్ చేశారు. ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం గ్రామాల్లో తుపాను బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాధితులతో మాట్లాడి, సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాల్లో వరి, అరటి, బొప్పాయి, కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు, రూ.5 వేలు ఏ పాటికి సరిపోవన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ కొనుకు గౌతమి, సర్పంచ్ రాకాప విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకుడు మాల్లాడి ఉమా మహేశ్వరరావు తదితరులు ఉన్నారు. నేటి నుంచి కళాశాలల ప్రారంభం అమలాపురం టౌన్: తుపాను ప్రభావం తగ్గడంతో గురువారం నుంచి జిల్లాలోని జూనియర్ కళాశాలలు, హైస్కూలు ప్లస్ విద్యా సంస్థలు యథాతథంగా తెరుచుకోనున్నాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. తుపాన్ కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని జూనియర్ కళాశాలలు, హైస్కూలు ప్లస్ విద్యా సంస్థలకు సోమ, మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించామన్నారు. కొత్తపేట, మండపేట, అయినవిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తుపాన్ బాధితుల కోసం పునరాస కేంద్రాలుగా ఇచ్చామన్నారు. పంట అంచనాలు తక్షణమే రూపొందించాలి అమలాపురం టౌన్: మోంథా తుపాను కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలను తక్షణమే రూపొందించి, ప్రకటించాలని రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కె.సత్తిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడి అంచనాల ప్రకారం 20 వేల ఎకరాల్లో పంట నష్ట పోయిందని ప్రకటించారని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు సాగు చేస్తున్న రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. వాటిపై నివేదిక తయారు చేసి, నష్టపరిహారం అందించాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
సైనిక పాఠశాలల స్వాగతం
● ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● నేడే ఆఖరి గడువు ● వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష రాయవరం: సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దాన్ని సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సైనిక్ పాఠశాలలు పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఏటా నోటిఫికేషన్ను సైనిక్ స్కూల్ సొసైటీ జారీ చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీటీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా డిసెంబర్లో విడుదలయ్యే నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ రెండోవారంలోనే వచ్చింది. విద్యార్థులకు అవకాశం సైనిక్ పాఠశాలలో సీటు సాధిస్తే గుణాత్మకమైన విద్యతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి. ఆరో తరగతిలో బాలురతో పాటు బాలికలు ప్రవేశం పొందవచ్చు. 9వ తరగతిలో ప్రవేశాలకు బాలురు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షల్లో విజయం సాధించాలి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకునే అవకాశముంది. వయో పరిమితి ఆరో తరగతిలో చేరే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు (01 ఏప్రిల్ 2014 నుంచి 31 మార్చి 2016), 9వ తరగతిలో చేరే విద్యార్థులు 13 నుంచి 15 ఏళ్లు (01 ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చి 2013 మధ్య జన్మించాలి) ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానం 2026 జనవరి నెలలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఐఎస్ఎస్ఈఈ.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో, సంతకాలను అప్లోడ్ చేయాలి. జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.700, ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే రిజిస్టర్ చేసుకున్న సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల : 10.10.2025 దరఖాస్తుకు చివరి తేది: 30.10.2025 తప్పుల సవరణకు: నవంబరు 2 నుంచి 4 వరకు అడ్మిట్ కార్డు (హాల్ టికెట్) జారీ: 2026 జనవరి మొదటి వారం ప్రవేశ పరీక్ష: 2026 జనవరి రెండో వారం -
ఫ్రిడ్జి పేలుడుతో కలకలం
అనపర్తి: కొత్తూరు జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో బుధవారం ఫ్రిడ్జి పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుక్కల దుర్గాభవాని అనపర్తిలోని బ్యాంకు పని చేస్తుంటారు. ఆమె బుధవారం యథావిధిగా విధులకు వెళ్లారు. ఇద్దరు ఆడపిల్లలూ ఆడుకోవడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లోని ఫ్రిడ్జి పెద్దశబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇన్వర్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే రెండు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష విలువైన గృహోపకరణాలు పాడైపోయాయని ఎస్ఎఫ్వో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా.. వర్షంతో పాటు కాలనీలోని రోడ్లు పూర్తిగా ఛిద్రం కావడంతో అగ్నిమాపక వాహనం ప్రమాద స్థలానికి రాలేకపోయింది. దీంతో సిబ్బంది అతి కష్టంతో పాత్రికేయుల ద్విచక్ర వాహనాలపై అగ్ని నిరోధక పరికరాలు తీసుకుని వచ్చి మంటలను అదుపు చేశారు. -
ఏమైందో ఏమో..
● కారు డ్రైవర్ ఘటన విషాదాంతం ● ఆర్.ఏనుగుపల్లిలో శవమై కనిపించిన శ్రీనివాస్ అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ (37) ఘటన విషాదాంతమైంది. గత శనివారం అదృశ్యమైన అతడు బుధవారం పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి గ్రామంలోని వైనతేయ నదీ పాయలో శవమై కనిపించాడు. అతడి సోదరుడు అంజి పుట్టు మచ్చల ఆధారంగా శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించాడు. ఈ కేసును అమలాపురం పట్టణం, పి.గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతి చెంది దాదాపు ఐదు రోజులు అవుతుందని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణాలు తెలుస్తాయని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ భార్య దేవి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్కు వచ్చారు. తన భర్త అదృశ్యం కేసు ఎంత వరకూ వచ్చిందని ఆరా తీశారు. ఇదే విషయాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ముందు విలేకరులకు తెలిపారు. ఆర్.ఏనుగపల్లిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలిసి ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ మృతదేహం తన భర్తదే అని నిర్ధారణ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. గత శనివారం శ్రీనివాస్ ఇంట్లో తాను రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి స్కూటీపై బయలు దేరాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు. దర్శకుడు సుకుమార్ టాటూ ఆర్.ఏనుగపల్లిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనప్పుడు అక్కడి పోలీసులు అతడి శరీరంపై సినీ దర్శకుడు సుకుమార్ చిత్రంతో పాటు పలు పేర్లను టాటూలుగా వేయించుకున్న విషయాన్ని గుర్తించారు. అతడి కుడి చేతిపై దేవి, రిషి, వినీత్ అనే పేర్లు ఇంగ్లిషులో ఉన్నాయి. నీలి రంగు ప్యాంట్ ఊడిపోయి అతని కాళ్ల వద్ద వేలాడుతోంది. బహిర్భూమికి వెళ్లి.. అంబాజీపేట: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుకపూడి శివారు తురకలదొడ్డికి చెందిన గుబ్బల నాగరాజు (35) ఈ నెల 28 ఉదయం ఇంటి నుంచి సైకిల్పై బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పలుచోట్ల వెతికారు. అయితే గ్రామానికి సమీపంలో ఉన్న మురుగు కాలువలో బుధవారం శవమై కనిపించాడు. మృతుడి భార్య లక్ష్మీనాగప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్తను కాసుబాబే చంపాడు తన భర్తను పట్టణానికి చెందిన గంగుమళ్ల కాసుబాబు, అతడి అనుచరులు చంపినట్టు తనకు అనుమానంగా ఉందని మృతుడి శ్రీనివాస్ భార్య దేవి స్థానిక విలేకర్లకు తెలిపింది. తన భర్తపై కాసుబాబు కక్ష పెంచుకుని ఇదంతా చేశాడని ఆరోపించింది. కాసుబాబుతో పాటు శంకర్, సలాది అప్పన్న, కారు డ్రైవర్ కలిపి తన భర్తను చంపారన్న అనుమానం ఉందని తెలిపింది. పట్టణ పోలీసులు ఈ నలుగురి కదలికలపై నిఘా పెట్టారు. తాము కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. -
తుపాను బాధితులకు ‘వాడపల్లి’ భోజనం
కొత్తపేట: ఆత్రేయపురం మండల పరిధిలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులకు వాడపల్లి శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి అన్న ప్రసాదం (భోజన సదుపాయం) వితరణ చేస్తున్నారు. మోంథా తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కూడా అండగా నిలిచింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఈ నెల 27 నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలను పునరావాస కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ కేంద్రాల్లో సుమారు వెయ్యి మందికి అందిస్తున్నారు. ఈదురు గాలులకు టెంట్లు ధ్వంసం తుపాను కారణంగా వీచిన ఈదురు గాలులు, కురిసిన భారీ వర్షాలకు వాడపల్లి దేవస్థానానికి ఒక మోస్తరు నష్టం వాటిల్లింది. ఏడు వారాలు ప్రదక్షిణలు చేసే మాడ వీధుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఐరన్ పైపుల క్లాత్ టెంట్లు ధ్వంసమ య్యాయి. వాటిని డీసీ, ఈఓ చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్ధరించాలని సిబ్బందికి ఆదేశించారు. -
తుపానుతో నిలిచిన ఆర్టీసీ బస్సులు
అమలాపురం రూరల్: మోంథా తుపాను ప్రభావం కారణంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు ఆర్టీసీ డీపోల పరిధిలో బస్సు సర్వీసులను నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం ఆర్టీసీ డీపోలో పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సులు నిలిపివేసినట్లు జిల్లా ప్రజా రవాణా ఎస్టీపీ అధికారి రాఘవకుమార్ చెప్పారు. జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో 327 బస్సులకు గాను 170 సర్వీసులను రద్దు చేశామన్నారు. అమలాపురం డిపో పరిధిలో 138 బస్సు సర్వీసులు ఉండగా ఉదయం నుంచి కొన్ని రూట్లలో 52 సర్వీసులు మాత్రమే నడిపినట్లు తెలిపారు. 86 బస్సు సర్వీసులను రద్దు చేశారు. హైదారాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం రూట్లతో పాటు పల్లెవెలుగు సర్వీసులు రద్దు చేశారు. రాజోలు డిపో పరిధిలో 57 బస్సు సర్వీసులు ఉండగా 38 సర్వీసులు మాత్రమే నడిపారు. రావులపాలెంలో డిపో పరిధిలో 69 బస్సు సర్వీసులు ఉండగా 37 మాత్రమే నడిపారు. రామచంద్రపురం డిపో పరిధిలో 63 బస్సు సర్వీసులు ఉండగా 30 సర్వీసులు మాత్రమే నడిపారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్కి రావద్దని తెలిపారు. తుపాను పరిస్థితిని బట్టి బుధవారం బస్సులు నడుపుతామని తెలిపారు. రోజూ జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో రూ.80 లక్షల ఆదాయం వస్తుందన్నారు. -
పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
కొత్తపేట: మోంథా పెను తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, పలు గ్రామాలను మంగళవారం జెడ్పీ చైర్మన్ సందర్శించారు. అక్కడ ఉన్నవారి వివరాలు, వసతి సౌకర్యాలు, కేంద్రంలో వారికి అందిస్తున్న సేవల గురించి సెంటర్ పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. వారికి పాలు, ఆహారం, అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచ్, సచివాలయం, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్లైన్ల కింద, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, షెడ్లు, పూరిపాకల్లో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడి వైర్లు తెగినా ప్రమాదం జరగకముందే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు -
రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి
అమలాపురం: మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు వద్ద దేశికోడు డ్రైయిన్ను రైతు విభాగ సభ్యులతో కలసి తుపాను నేపథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గోదావరి డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్లో తూడు, చెత్త, చెదారం భారీ స్థాయిలో పేరుకుపోయాయని తెలిపారు. ప్రధాన డ్రెయిన్లో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయిందని, ముంపు నీరు స్తంభించిపోయినా ప్రభుత్వం, డ్రెయిన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా వరి చేలు ఈనిక, పూత దశలో ఉన్నాయని, భారీ వర్షాలకు ముంపు నీరు స్తంభిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్లో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులు వెదురు బొంగులతో వందలాది వలకట్లు ఏర్పాటు చేసి, ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని బాబీ తెలిపారు. అల్లవరం మండలంలో లోయర్ కౌశిక, దేశికోడు, వాసాలతిప్ప, కూనవరం స్ట్రెయిట్ కట్లో పదుల సంఖ్యలో వలకట్లు ప్రవాహాన్ని అడ్డుకుని ముంపు నీటిని స్తంభింపజేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్లో వలకట్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. వలకట్లు తొలగిస్తే ముంపు తీవ్రత కొంత మేర తగ్గుతుందన్నారు. డ్రెయిన్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వలకట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. వాసాలతిప్ప డ్రెయిన్ లో లెవెల్లో ఉండగా, ఎన్.రామేశ్వరం మొగ రెండడుగుల మేర మెరకగా ఉందని, దీనివల్ల ముంపు నీరు స్తంభించిపోతోందని తెలిపారు. ఎన్.రామేశ్వరం బ్రిడ్జి నుంచి మొగ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల పొడవున పర్ర భూమిలో డ్రెడ్జింగ్ చేసి, పూడిక తొలగించాల్సి ఉందన్నారు. సెంట్రల్ డెల్టా డ్రెయిన్లో తూడు తొలగింపు పనుల నిర్వహణకు ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాసరావుకు రూ.2 కోట్లు ఇచ్చారని, ఆయన రోజుకు కేవలం పది మందితో తూడు తొలగింపు పనులు చేపడితే ఎప్పటికి పూర్తి చేస్తారని బాబీ ప్రశ్నించారు. ఒక్కరికే కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించడం ద్వారా నిధులు స్వాహా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తుపాను నేపథ్యంలో ఇప్పుడు పనులు ప్రారంభిస్తే ఎప్పటికి పూర్తి చేస్తారో డ్రెయిన్ అధికారులే సమాధానం చెప్పాలన్నారు. తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, శరవేగంగా పూర్తి చేస్తే ముంపు సమస్యను కొంత మేర పరిష్కరించవచ్చని సూచించారు. డ్రైనేజీ సమస్యపై బాబీ కలెక్టర్ మహేష్ కుమార్ను అమలాపురంలో మంగళవారం కలిసి మాట్లాడారు. వలకట్లు తక్షణమే తొలగించాలని, ఖరీఫ్లో వీటిని పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రాజెక్టు కంపెనీ చైర్మన్కు అప్పగించిన తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, చేపడితే పంటలు కాపాడుకోవచ్చని, తద్వారా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని బాబీ కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కాండ్రేగుల జవహర్, ఇందుకూరి సత్యనారాయణరాజు, రైతు నాయకులు పాల్గొన్నారు.ఫ ప్రధాన డ్రైన్లో నిబంధనలకు విరుద్ధంగా వలకట్లు ఫ శరవేగంగా తూడు తొలగింపు పనులు చేపట్టాలి ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడి డిమాండ్ -
తుపాను బాధితులకు జీవన భృతి ఇవ్వాలి
సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ అమలాపురం టౌన్: జిల్లాలోని తుపాను బాధితులకు జీవన భృతి, నష్ట పరిహారం తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. తుపాను బాధిత ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున జీవన భృతి ఇవ్వాలని సూచించింది. స్థానిక గొల్లగూడెంలో గల జిల్లా సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుపాను బాధితులకు జీవన భృతిని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పార్టీ నాయకుడు జి.దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పంటల నష్టాన్ని అంచనా వేయాలని సూచించింది. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.కృష్ణవేణి, టి.నాగవరలక్ష్మి, నూకల బలరామ్, డీవీరావు, డి.లక్ష్మి పాల్గొన్నారు. పునరావాస కేంద్రాల్లోకి తరలించాలి తాళ్లరేవు: తుపాను బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాల్లోకి చేర్చే బాధ్యత స్థానిక నాయకులు తీసుకోవాలని కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కోరారు. మంగళవారం గాడిమొగ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబుతో కలిసి సందర్శించారు. కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం వారు తుపాను బాధితులకు భోజనాలను వడ్డించారు. వారు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో పలువురు పునరావాస కేంద్రాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారన్నారు. తుపాను తీవ్రత పెరిగినందున గ్రామాల్లో ఉండడం సురక్షితం కాదని, వారందరినీ పునరావాస కేంద్రానికి వచ్చేలా స్థానిక నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. తుపాను పట్ల భయపడాల్సిన పనిలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడండిమంత్రి అచ్చెన్నాయుడుసాక్షి, అమలాపురం: మోంథా తుపాను వల్ల ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో తుపానుపై సమీక్ష జరిపారు. తుపాను తీవ్రత, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల నిర్వహణ, రోడ్లు, రాకపోకలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేకాధికారి విజయరామరాజు, కలెక్టర్ ఆర్.మహేష్కుమార్తో కలిసి సమీక్షించారు. సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో నివాసముంటున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎంపీ జి.హరీష్ మాధుర్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, ఎస్పీ రాహుల్ మీనా, జేసీ నిశాంతి, డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. ఏలేరుకు వరద నీరు ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్లోనికి వరద నీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 5,175 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 85.39 మీటర్లకు చేరింది. -
హోర్డింగ్ల తొలగింపు
● డ్రోన్లతో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ ● ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: తుపాను ప్రభావంతో బలంగా వీస్తున్న గాలులకు భవనాలపై, కూడళ్లలో ఉన్న హోర్డింగ్లను తొలగించే ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు హోర్డింగ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికో డీఎస్పీని, మండలానికో సీఐని నియమించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, 22 మండలాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల పర్యవేక్షణ 24 గంటలూ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కి లేదా సమీపంలో గల పోలీస్ అధికారులకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
లారీ ఢీ కొని బాలుడి మృతి
రాజానగరం: మండలంలోని శ్రీకృష్ణపట్నం – పాత తుంగపాడు మధ్య మంగళవారం జరిగిన ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలా వున్నాయి. పాత తుంగపాడుకు చెందిన నాగులాపల్లి జాన్వె వెస్లీ (14), తన స్నేహితుడు బోయిడి దుర్గాప్రసాద్తో కలిసి బైకుపై శ్రీకృష్ణపట్నం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టిన వెంటనే బైకుపై వెనుక కూర్చున జాన్వెస్లీ కింద పడిపోవడంతోపాటు లారీ కొంతదూరం లాక్కుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవ్ చేస్తున్న దుర్గాప్రసాద్కి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు ద్వారపూడిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
అయోధ్యకు పంచలోహ శివలింగం తరలింపు
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలోని సహస్ర రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తిగా ప్రతిష్ఠించేందుకు 1,027 సూక్ష్మ లింగాలతో రూపొందిన పంచలోహ మహా శివలింగం సోమవారం మండపేట నుంచి అయోధ్యకు తరలించారు. దాత ఆర్డరుపై మండపేట పట్టణానికి చెందిన పంచలోహ విగ్రహాల తయారీ శిల్పి వాసా శ్రీనివాస్ ఈ శివలింగాన్ని తయారు చేశారు. మహాశివలింగంలో 1,027 సూక్ష్మ శివలింగాలను అమర్చిన తీరు కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. కార్తిక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయోధ్యకు తరలించారు. ఆరు అంగుళాల ఎత్తు, 5 అంగుళాల వెడల్పు, 4.5 కిలోల బరువుతో ఈ మహా శివలింగాన్ని తనతోపాటు ఆరుగురు శిల్పులు 20 రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. తాటిచెట్టు పడి యువకుడికి తీవ్ర గాయాలుమామిడికుదురు/కాకినాడ క్రైం : ఇంటి వద్ద ఆడుకుంటున్న నగరం గ్రామానికి చెందిన పదిహేనేళ్ల మందపాటి ప్రవీణ్పై మంగళవారం తాడిచెట్టు పడి తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు, స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ప్రవీణ్కు ప్రాథమిక చికిత్స అందించి రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్న ఈదురు గాలుల తాకిడికి తాడిచెట్టు పడిపోయి యువకుడు గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. జీజీహెచ్ వైద్యులు పరీక్షించి చెట్టు నడుంపై పడటంతో యువకుడి కుడివైపు కిడ్ని పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు. వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తాడిచెట్టు పడి మహిళ మృతి మామిడికుదురు: అనారోగ్యంతో ఉన్న బంధువును పలకరించేందుకు వచ్చిన మహిళపై తాడిచెట్టు పడి మృతి చెందిన విషాద ఘటన మాకనపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో మాకనపాలెం గ్రామానికి చెందిన గూడపల్లి వీరవేణు (49) మృతి చెందింది. కొడుకు జానకీరామ్తో కలిసి ఆమె స్కూటర్పై అదే గ్రామంలో ఉన్న ఆడపడుచు అండలూరి ఆదిలక్ష్మి ఇంటికి వచ్చింది. ఆడపడుచు మనవడు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నాడు. అతడిని పలకరించింది. వారు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు అంత సురక్షితం కాదని భావించి వారిని తుపాను పునరావాస కేంద్రానికి రావాలని చెప్పి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా తుపాను వల్ల వీస్తున్న బలమైన ఈదురు గాలుల ప్రభావంతో ఇంటి పక్కనే ఉన్న తాడిచెట్టు ఒక్కసారిగా పడిపోయింది. స్కూటర్పై తల్లి కోసం వేచి చూస్తున్న కొడుకు జానకీరామ్ చెట్టుపడిపోతోందంటూ తల్లిని హెచ్చరిస్తూ ముందుకు వెళ్లడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. కానీ తల్లి వీరవేణు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది. చెట్టు ఆమైపె పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు ఫిర్యాదుపై నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేశారు. పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వీరవేణు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నేతలు వీరవేణు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబానికి సహాయం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
మత్స్యకార యువకుడి గల్లంతు
కాకినాడ క్రైం: మోంథా తుపాను కారణంగా సముద్ర అలల ఉధృతికి కాకినాడకు చెందిన ఓ మత్స్యకార యువకుడు గల్లంతయ్యాడు. వివరాలలోకెళితే కాకినాడ దుమ్ములపేటకు చెందిన 21 ఏళ్ల జి.సాయిరాం తన బోట్ను కాకినాడలోని కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉంచాడు. సముద్రలోని అలల ఉధృతితో లంగర్ తెగి బోట్ సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని గ్రహించి ఏటిమొగ కల్వర్టు వద్దకు తన బోట్ను తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉన్న బోట్పైకి ఎక్కి లంగర్ తాడును లాగబోతూ ప్రమాదవశాత్తూ సముద్రంలోకి జారిపడి గల్లంతయ్యాడు. సహ మత్స్యకారులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. -
కన్నీరు రాకుండా..
ఫ ముంపు పంటలను కాపాడుకుందాం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం ఫ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నందకిశోర్ ఐ.పోలవరం: వర్షం.. పుడమి పుత్రులకు కన్నీరు తెచ్చింది.. కష్టాన్ని నీట నాన్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పడుతున్న వర్షాలకు వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కన్వీనర్ డాక్టర్ ఎం.నంద కిశోర్ వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం పంట పూత, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలలో ఉంది. ముఖ్యంగా ఎంటీయూ– 1318, స్వర్ణ, సంపద స్వర్ణ మొదలైన రకాలు పూత దశలో వర్షాలు కురిసినప్పుడు సంపర్కం జరగకపోవడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. ఎంటీయూ– 1318 రకాలు గొలుసు కట్టు దగ్గరగా ఉండటం వల్ల గింజ రంగు మారడం, మాని పండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నిరంతర వర్షాలతో గింజలో నిద్రావస్థ తొలిగి మొలక వచ్చే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు మాగుడు తెగులు వ్యాపించే ప్రమాదముంది. పాలు పోసుకునే దశలో ఉన్న రకాలు (స్వర్ణ, సంపద స్వర్ణ, మొదలైనవి) వర్షాల వల్ల పడిపోతే పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటోంది. ఎక్కువగా నీరు నిలిచిన చోట పెద్ద కాలువలు చేసి మోటార్ల ద్వారా తొలగించాలి. కోత సమయం ఉంటే.. ఫ గింజ తోడుకొని లేదా గట్టి పడే దశలో లేదా కోత దశలో అకాల వర్షాలతో మొక్క పడిపోయి నేలకొరిగే అవకాశం ఉంది. దీనితోపాటు పడిపోయిన చేనుల నుంచి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ రావచ్చు. కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలవలు ఏర్పాటు చేసుకోవాలి. ఫ గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. నిద్రావస్థ లేనటువంటి సాంబ మసూరి వంటి రకాలు మరియు నిద్రావస్థ ఉన్న రకాలలో వారం రోజుల పాటు చేను పడిపోయి నీట మునిగినప్పుడు మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి చేనుకు సమతుల్యంగా ఎరువులు వేయాలి. ఫ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు పొటాష్ వేయడం, వెదజల్లిన పద్ధతిలో ఎక్కువ విత్తనం వేయకుండా ఉండటం, అవసరానికి మించి నీరు పెట్టకుండా ఉంటే చేసు పడటాన్ని తగ్గించవచ్చు. వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలక వచ్చే అవకాశం ఉంది. ఇలా చేద్దాం.. ఫ గింజలు రంగు మారడం, మాగుడు, మానిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికోనాజోల్ మందును పిచికారీ చేయాలి. ఫ గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు ముంపు బారిన ఉంటే అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఫ నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు స్ఫటిక ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగు మార్పును తగ్గిస్తుంది. తెగుళ్ల నియంత్రణ ఇలా.. ప్రస్తుతం బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిస్ ఒక మిల్లీలీటరును లీటరు నీటిలో కలపాలి, అలాగే కొసైడ్ (కాపర్ ఆక్సి క్లోరైడ్) 2 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనాజోల్ 400 మి.లీ/ఎకరాకు లేదా ప్రోపికోనాజోల్ 200 మి.లీ/ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతోంది. -
కాశీలో కోనసీమ గరగనృత్య కళా ప్రదర్శన
కొత్తపేట: కోనసీమ గరగనృత్య కళాకారులు వారణాశి (కాశీ)లో గరగనృత్య ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేశారు. కాశీలో కాశీ విశ్వనాథ్ మందిర ప్రాంగణంలోని శ్రీత్య్రంబకేశ్వర్ హాలులో ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు యజ్ఞోవైవిష్ణు పేరిట ఆదిత్య వైభవం, భారతీయ రుషి వైభవం, తెలుగు వైభవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేద పండితుడు జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు వేయి మంది వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం కోనసీమ కళాకారుల గరగనృత్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కళాకారుల టీమ్ లీడర్ కొమారిపాటి ఏసువెంకటప్రసాద్ ఆధ్వర్యంలో 15 మంది గరగనృత్యం ప్రదర్శించారు. కాశీ క్షేత్రంలో సోనాల్పుర నుంచి విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వరకు వేద పఠనంతో ఊరేగింపు నడుమ గరగనృత్య ప్రదర్శన నిర్వహించారు. రాత్రి జరిగిన అభినందన కార్యక్రమంలో టీమ్ లీడర్ ప్రసాద్ను నిర్వాహకులు సత్కరించారు. కళాకారులను అభినందించారు. -
స్వీట్ స్టాల్ పొయ్యిపై పడిన కొబ్బరి చెట్టు
● చెలరేగిన మంటలు ● తప్పిన ప్రమాదం పి.గన్నవరం: మండలంలోని నరేంద్రపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం స్వీట్స్ తయారీ షెడ్డుపై ఈదురు గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న నలుగురు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్రపురం గ్రామంలో పప్పుల వెంకటేష్ స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. అతని షాపు వెనుక భాగంలోని షెడ్డులో స్వీట్, హాట్ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం స్వీట్స్ తయారు చేస్తుండగా ఈదురు గాలులకు పక్కనే ఉన్న కొబ్బరిచెట్టు పెళ, పెళమని శబ్దం చేస్తూ విరిగి తయారీ కేంద్రంపై పడిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ శబ్దాలను గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు కళాయిల్లో మరుగుతూ ఉన్న నూనె కూడా చెల్లాచెదురుగా పడిపోయింది. స్థానికులు మంటలు అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వీట్ స్టాల్ యజమానికి నష్టం వాటిల్లింది. -
తుపాన్ అయినా.. షాపు మూసేదిలే!
నల్లజర్ల: ఒక పక్క మోంథా తుపాను పెను ముప్పుగా దూసుకువస్తోంది. ఈ కారణంగా నల్లజర్ల మండలంలో భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటంతో వివిధ గ్రామాల్లో ప్రజల్ని పోలీసు శాఖ అప్రమత్తం చేసి ఇళ్లకు వెళ్లేలా అప్రమత్తం చేసింది. హోటళ్లు, షాపులను మూసి వేయించారు. కానీ, మద్యం షాపులు, దాబాల జోలికి పోలీసులు వెళ్లలేదని, వాటికి తుపాను ప్రమాదం ఉండదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ మాత్రం అన్ని షాపులు, వ్యాపార సంస్థలు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినా.. మద్యం షాపులు, దాబాలు రాత్రి 8 దాటినా యథావిధిగా కొనసాగుతున్నాయి. -
యథావిధిగా జీతాలు ఆలస్యం!
● అన్నవరం దేవస్థానం శానిటరీ ఉద్యోగులకు తప్పని వేతన వ్యథ ● అక్టోబర్ 28 వచ్చినా 349 మందికి అందని వైనం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి అక్టోబర్ 28వ తేదీ వచ్చినా ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వీరికి రూ.52 లక్షలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు ఆలస్యం కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యమైంది. అయితే సాక్షి దినపత్రికలో వార్తలు ప్రచురితమయ్యాక అధికారులు చర్యలు తీసుకొని జీతాలు చెల్లించారు. అయితే జీతాల చెల్లింపులో ఆలస్యానికి కారణం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ అని చెప్పేవారు. పాత కాంట్రాక్ట్ చివరి నెలలో కూడా తప్పని ఇబ్బంది హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఫిబ్రవరితో ఈ సంస్థ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త టెండర్ ఖరారయ్యే వరకు మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఏడు ప్రముఖ దేవస్థానాల శానిటరీ టెండర్ తిరుపతికి చెందిన పద్మావతి హాస్పటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. దాంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. కనకదుర్గా శానిటరీ కాంట్రాక్టర్ కింద పనిచేసిన 349 మంది సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 28వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించలేదు. జీతాల బిల్లు ఆడిట్కు పంపించాం శానిటరీ సిబ్బంది సెప్టెంబర్ నెల జీతాల బిల్లు ఆడిట్కు పంపించాం. ఆడిటర్ సెలవులో ఉన్నా రు. ఆయన రెండు మూడు రోజు ల్లో వచ్చేస్తారు. ఆయన బిల్లు క్లియర్ చేసి పంపించిన వెంటనే జీతాలు చెల్లిస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానంఈసారి ఆలస్యానికి కారణం దేవస్థానం అధికారులే.. కనకదుర్గా ఏజెన్సీ ఈ నెల నాలుగో తేదీనే సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని ముందుగా బ్యాంకులో జమ చేసి ఆ చలానాలు దేవస్థానానికి అందజేసింది. ఆ చలానాలు పరిశీలించి వెంటనే జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. వారం రోజుల వ్యవధిలోనే జీతాల మొత్తాన్ని కాంట్రాక్టర్ అకౌంట్కు జమ చేయాలి. అలా జమ చేసిన గంటలోపు సిబ్బంది ఖాతాలకు జీతం జమ అవుతుంది. అయితే కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ పీఎఫ్ చెల్లించి 24 రోజులు గడచినా సిబ్బందికి జీతాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించాలి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
TDP Leader: డబ్బుల కోసం.. నా భర్త రోజూ నన్ను
కోనసీమ జిల్లా: భర్త తనను వేధిస్తూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య రాజోలు (Razole) పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె భర్త దొమ్మేటి సునీల్పై రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. చదువుకునే రోజుల్లో సహ విద్యార్థి అయిన సునీల్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని దీంతో పెద్దల సమక్షంలో 2009 మార్చి 4న తమకు వివాహమైందని, అప్పటి నుంచీ భర్త సునీల్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు అమూల్య ఫిర్యాదు చేశారు. తనపై రెండు పర్యాయాలు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని, కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అవుట్ ఫాల్ స్లూయిజ్లు తెరచి ఉంచాలి
● తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ● ఎంపీడీవోలతో జెడ్పీ చైర్మన్ విప్పర్తి టెలి కాన్ఫరెన్స్ సాక్షి, అమలాపురం: ‘గోదావరి నదీలో వరద సాధారణ స్థితికి వచ్చింది. ఇన్ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు వరద వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు నదులకు అనుబంధంగా ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్లను తెరచి ఉంచాలి. భారీ వర్షాలు కురిస్తే చేల నుంచి డ్రెయిన్లు, అక్కడ నుంచి అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా నదీ పాయలలోకి ముంపు నీరు దిగిపోతుంది’ అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఈ విషయంపై ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. మోంథా తుపాను నేపథ్యంలో సోమవారం ఆయన ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా పరిధిలో పలు డ్రెయిన్ల నుంచి ముంపునీరు నదీపాయాల్లో కలుస్తుందని, ఇప్పుడు వరద లేనందున వాటిని తెరచి ఉంచాలని సూచించారు. రెండు డెల్టాల పరిధిలో వరి కోతలకు సిద్ధమవుతున్నందున ముంపుబారిన పడి ఎక్కువ రోజులు ఉంటే దెబ్బతినే అవకాశముందని, సాధ్యమైనంత త్వరగా ముంపునీరు బయటకు వెళ్లే చర్యలు చేపట్టాలన్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, జెడ్పీ అనుబంధ విభాగాలకు చెందిన సిబ్బందితో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను ఎదుర్కొనేందుకు ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు ఆహారంతోపాటు చిన్న పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలకు చెందిన ఎంపీడీవోలు చురుగ్గా ఉండాలని, అక్కడే తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సూచించారు. -
కూరగాయల ధరలకు మోంథా రెక్కలు!
● ఒకే రోజు సెంచరీకి చేరువ చేసిన వ్యాపారులు ● వినియోగదారుల జేబుకు చిల్లు ఆలమూరు: మోంథా తుపాను ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వ్యాపారులు ఒకరోజు వ్యవధిలోనే రెండు నుంచి మూడు రెట్లు ధరలు పెంచేయడంపై వినియోగదారులు తీవ్ర ఆసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తుపాను ప్రభావం, మరోపక్క కూరగాయ ధరలకు రెక్కలు రావడంతో సగటు జీవి జీవనం సాగించడం పెనుభారంగా మారింది. ఇప్పటి వరకూ కిలో రూ.30 లోపు ఉన్న కూరగాయాల ధరలు సోమవారం సెంచరీకి చేరుకున్నాయి. కూరగాయ ధరలు అంతగా పెంచినా రైతుకు మాత్రం హోల్సేల్ మార్కెట్లో ఏవిధమైన గిట్టుబాటు ధర లభించడం లేదు. రిటైల్ మార్కెట్లో దళారులు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ మొంథా తుపాను వరంగా మారింది. కూరగాయల ధరల మాదిరిగానే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర తదితర ఆకుకూరల ధరలను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. కృత్రిమ ఽకొరతను, ధరలను నియంత్రించవలసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని రైతుబజార్లలో పట్టిక మీద ఉన్న ధరలకు వ్యాపారుల విక్రయించే ధరలకు పొంతన లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.కూరగాయలు రిటైల్ రిటైల్ మార్కెట్ మార్కెట్ పాతధర ప్రస్తుత ధర కేజీ కేజీ (రూ.లలో) (రూ.లలో) ఉల్లి 20 30 మిరపకాయ 40 60 అల్లం 100 150 బంగాళాదుంప 30 60 వంకాయ 40 100 బెండకాయ 50 90 బీట్ రూట్ 30 60 కాలీఫ్లవర్ 20 50 చిక్కుడు 100 120 అరటి కాయ 10 20 దొండకాయ 50 80 టమోటా 30 60 బీరకాయ 60 100 గోరుచిక్కుళ్లు 50 80 ఆనపకాయ 10 25 కాకరకాయ 40 70 కంద 45 70 పెండ్లం 60 90 బీన్స్ 60 90 కీర దోస 30 60 క్యాబేజీ 40 85 ములక్కాడ 08 20 కొత్తిమీర 90 150 -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి
అల్లవరం: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పండించిన పంట పాడవకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లోని రైతు విభాగం అధ్యక్షులు రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపాను కారణంగా రైతులు నష్టపోతే వారికి సకాలంలో పరిహారం అందేలా రైతు విభాగాల సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. నష్టానికి సంబంధించిన ఫొటోలు, పూర్తి ఆధారాలు సేకరించాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతాంగ విభాగం ఆధ్వర్యాన క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, నష్టాల అంచనాలతో పత్రికా ప్రకటనలు ఇవ్వాలని, మీడియా సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగానికి రామారావు సూచించారు. -
పునరావాసాలకు తరలింపులో అలసత్వం వద్దు
– కలెక్టర్ మహేష్కుమార్ మలికిపురం: మోంథా తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అలసత్వం వద్దని కలెక్టర్ ఆర్.మహేశ్కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం ఆయన రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో పర్యటించి తుపాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ప్రత్యేకాధికారి విజయ రామరాజు తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఆహారం తయారీ, వసతి, ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రాథమిక వైద్య శిబిరంలో ఔషధాల పంపిణీని పరిశీలించారు. మంగళవారం తీవ్ర తుపానుగా మారి రాత్రికి తీరాన్ని దాటే అవకాశముందన్నారు. సుమారు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని ఎవరూ అశ్రద్ధగా ఉండవద్దన్నారు. ప్రత్యేకాధికారి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందించేందుకు సంసిద్ధంగా ఉందని అత్యవసర పరిస్థితులలో వీరి సహకారం పొందాలన్నారు. కోస్తా తీరం వెంబడి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ సచివాలయాల వరకు 24/7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తూ కమ్యూనికేషన్ వ్యవస్థ నిరంతరాయంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కే ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్లో మణికంఠకు కాంస్య పతకం
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో గంగలకుర్రు అగ్రహారం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న బొక్కా సత్యశివశ్రీసాయి మణికంఠ తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం సాధించాడని హెచ్ఎం అక్కిరాజు శేషసాయి, పీడీ ఆసు వెంకట సూర్యమథు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 19 విభాగంలో మణికంఠ తృతీయ స్థానం సాధించాడన్నారు. తనతో పాటు అండర్ – 17లో చొల్లంగి జాహ్నవిశివదుర్గ, అండర్ –17, 19 విభాగాల్లో పంటపాటి నాగశ్రీదుర్గ, సాదా నిఖితదేవి పాల్గొన్నారన్నారు. -
కర్నూలు బస్సు ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
రావులపాలెం: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రైవేటు బస్సు ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బస్సులో మంటలు చెలరేగి సుమారు 19 మంది చనిపోగా అందులోరావులపాలేనికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్రెడ్డి ఉన్నారని చెప్పారు. అతను హైదరాబాదులో క్రేన్ ఆపరేటింగ్ వర్క్ చేస్తూ, పని నిమిత్తం బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత రావులపాలెంలోని శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారికి రూ.ఐదు లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుందని, కుటుంబానికి రూ 25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రైవేట్ బస్సుల యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, రాత్రి ఒంటిగంట వరకు బెల్ట్ షాపులు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఇటువంటి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పుతారని జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలు అప్రమత్తం కావాలి కొత్తపేట: మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో మోంథా తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా వాసులు అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు వారి పొలాల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, వైర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పాఠశాలలకు సెలవుల కారణంగా పిల్లలు ప్రమాదకరమైన ప్రదేశాలకు, బయటకు వెళ్లకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని, పూరి గుడిసెల్లో ఉన్న నివాసితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తం కావాలని సూచించారు. 1996 నవంబర్లో సంభవించిన తుపాను అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన కంట్రోల్ రూము నంబరును దగ్గర ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 5 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్పై తుపాన్ హెచ్చరికలు, ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం పడింది. అందుకే కేవలం ఐదు అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తమ ఫిర్యాదు, సమస్య తీవ్రతను బట్టి అయిదుగురు అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ రాహుల్ మీనాకు తమ సమస్యలను తెలుపుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పెంపు అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ చదువుతూ గతంలో పరీక్షలు తప్పిన ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించే గడువును పెంచినట్లు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ నెల 31వ తేదీ వరకూ గడువు పొడిగించిందని పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి 6వ తేదీ వరకూ రూ.వేయి అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విఘ్నేశ్వరునికి పంచ హారతి సమర్పణ అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి రాయచూరుకు చెందిన కరుటూరీ వెంకట రామకృష్ణ సోమవారం వెండి పంచ హారతి సమర్పించారు. దీని బరువు ఒక కేజీ 421గ్రాములు ఉంటుందని, దీని విలువ రూ. లక్ష తొంభై వేలని ఆలయ సిబ్బంది తెలిపారు. పంచ హారతిని ఆలయ ప్రధానార్చకుల మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను ఆలయ వేద పండితులు, అర్చకులు వేదాశ్వీర్వాదం పలికి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. పీహెచ్సీల్లో నిరంతర వైద్య సేవలుఅమలాపురం రూరల్: మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా పరిధిలోని 47 పీహెచ్సీలు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లలో 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గరావు దొర సోమవారం ప్రకటనలో తెలిపారు. 92 తుఫాన్ షెల్లర్లు ఏర్పాటు చేసి అత్యవసర మందులు, పాముకాటుకు వ్యాక్సిన్లు, అందుబాటులో ఉంచామన్నారు. కాన్పు తేదీ దగ్గరగా ఉన్న గర్భిణులను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,577 మందితో 432 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
మోంథాకిడి
సాక్షి, అమలాపురం: మోంథా తుపాను దూసుకొస్తోంది. తీరానికి చేరే కొద్దీ బలపడుతోంది. వాయుగుండం ఇప్పటికే తుపానుగా మారగా మంగళవారం సాయంత్రానికి పెను తుపానుగా మారి తీరాన్ని దాట నుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుపాను ప్రభావం కోనసీమపై పడింది. సోమవారం ఉదయం సన్నగా మొదలైన వర్షం రాత్రి సమయానికి ఒక మోస్తరుగా మారింది. ఇది మరింతగా పెరిగి అతి భారీగా మారనుంది. మధ్యాహ్నం నుంచి తీరంలో మొదలైన ఈదురుగాలులు సాయంత్రానికి జిల్లా అంతా విస్తరించాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈదురు గాలులు.. అతి భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అర్ధరాత్రి మోంథా తుపానుగా మారింది. ఇది మంగళవారం రాత్రికి అతి తుపానుగా మారి ప్రళయంలా కోనసీమపై విరుచుపడనుంది. తుపాను ప్రస్తుతానికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీయనున్నాయి. సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా. మంగళవారం తెల్లవారు జాము నుంచి గురువారం సాయంత్రం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావం జిల్లాలోని తీర ప్రాంతం మండలాల్లో కనిపిస్తోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు రెండు,మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. అల్లకల్లోలంగా మారిన సముద్రాన్ని చూసి తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది, శంకరగుప్తం, ఓడలరేవు, కొమరగిరిపట్నం, చిర్రయానం వంటి ప్రాంతాలలో సముద్ర అలల ఉధృతి, కోత తీవ్రత పెరిగింది. ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు 18.5 మిల్లీమీటర్ల వరకు వర్షం కురవగా, అత్యధికంగా ఉప్పలగుప్తం మండలంలో 40 మిల్లీమీటర్ల వర్షం పడింది. వేట బంద్ తుపాను ప్రభావానికి సముద్ర వేట నిలిచిపోయింది. ఓడలరేవు, చిర్రయానాం, ఎస్.యానాం, నక్కా రామేశ్వరం, వాసాలతిప్ప, కరవాక, అంతర్వేది వంటి ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉన్నారు. వేట బోట్లను గట్ల మీదకు చేర్చి కొట్టుకుపోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. మరో వైపు తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులను తరలిస్తున్నారు. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప నుంచి స్థానిక మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు తమ పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. ఏర్పాట్లపై ప్రత్యేకాధికారి పరిశీలన తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల గురించి తుపాను సహాయక చర్యల ప్రత్యేకాధికారి వి.విజయ రామరాజు సోమవారం అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మలికిపురం మండలం కేశనపల్లి సైక్లోన్ సెంటర్ను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబునాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు కలెక్టర్ మహేష్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఉదయం నుంచీ ప్రభావం జిల్లాలో పలుచోట్ల వర్షం తీర ప్రాంత మండలాల్లో ఈదురు గాలులు ఒడ్డుకు చేరుకున్న మత్స్యకార బోట్లు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న జనం మత్స్యకార గ్రామాలపైనే జిల్లా యంత్రాంగం దృష్టి ప్రకృతి వైపరీత్యానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం డ్రైన్ల నుంచి ముంపు నీరు దిగే అవకాశం శూన్యం భారీ వర్షాలు కురిస్తే పంటను వదిలేసుకోవాలంటున్న రైతులు అన్నదాత చి‘వరి’ ఆశలపై నీళ్లు అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు చల్లింది. భారీ వర్షంతో వరి చేలల్లో ముంపు మరింత పెరిగింది. జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరిగిన విషయం తెలిసిందే. పంట చేలు పాలు పోసుకుని గింజ గట్టి పడుతున్న దశలో ఉన్నాయి. గత వారం అల్పపీడన ప్రభావం వల్ల మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరిచేలల్లో ముంపునీరు చేరింది. తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. తీరం దాటే సమయంలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదే జరిగితే సాగు మీద ఆశలు వదిలేసుకున్నట్టేనని రైతులు ఆందోళనతో ఉన్నారు. -
ఆర్టీసీ కండక్టర్పై దాడి
రామచంద్రపురం రూరల్: బస్సు కండక్టర్పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టిన నిందితులపై ఐదు రోజులైనా చర్యల్లేకపోవడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడ్డాయి. సోమవారం రామచంద్రపురం డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపాయి. బాధిత కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుకు న్యాయం చేయాలని డిమాండ్చేశాయి. బాధితుడి కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న మంగేశ్వరరావు ఈ నెల 23న కోరుమిల్లి– రాజమండ్రి సరీ్వసులో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కోరుమిల్లికి చెందిన తుట్టపు అన్నపూర్ణ బస్సు ఎక్కి మాచవరం వెళ్లాలని చెప్పారు. అయితే ఆమె సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో చార్జీ చెల్లించాలని మంగేశ్వరరావు స్పష్టం చేశారు.దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్పై దౌర్జన్యం చేసింది. దీంతో కండక్టర్, డ్రైవర్ అన్నపూర్ణను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాలని భావించారు. అయితే తోటి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వివాదాన్ని అంతటితో ముగించారు. బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి కోరుమిల్లి చేరుకున్న సమయంలో అన్నపూర్ణ కుమారుడు భూషణం, అతడి స్నేహితుడు అడ్డాల ఆదినారాయణ బస్సు నుంచి దిగుతున్న కండక్టర్ మంగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కాలు విరగ్గొట్టారు. స్థానికులు, డ్రైవర్.. కండక్టర్ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. దీనిపై అంగర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావ డంతో పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. పైగా, మంగేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకులు జేఏసీగా ఏర్పడి సోమవారం గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపారు. బాధిత కండక్టర్ కాలుకు తక్షణం శస్త్రచికిత్స చేయించాలని, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కోలుకునేవరకు ఆన్డ్యూటీగా పరిగణించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కారి్మకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేఎస్సీ రావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఎల్.నారాయణ, నేషనల్ యూనిటీ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జీఎస్ రాజు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పాల్గొన్నారు. -
ఐఈఆర్పీలకు నేడు సర్టిఫికెట్ వెరిఫికేషన్
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐఈఆర్పీలకు సోమవారం ఉదయం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. కాకినాడలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి కోనసీమ, ఏఎస్ఆర్ జిల్లాల్లో పనిచేస్తున్న ఐఈఆర్పీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా విద్యా శాఖాధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఐఈఆర్పీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో భాగంగా గెజిటెడ్ అటెస్టేషన్తో ఉన్న మూడు సెట్ల జెరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఆయా జిల్లాల ఐఈఆర్పీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని, ఎవరికీ మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. చెక్ లిస్ట్ రెండు కాపీలు తీసుకురావాలని తెలిపారు. అన్న ప్రసాద పథకానికి విరాళాలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిత్య అన్న ప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరానికి చెందిన భూపతిరాజు సాయిశరత్వర్మ, వారి కుటుంబ సభ్యులు రూ.36,500, రామచంద్రపురం గణపవరం గ్రామానికి చెందిన కొండేటి వెంకటరత్నం, వారి కుటుంబ సభ్యులు రూ.30,116 విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ–ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. విఘ్నేశ్వరాలయానికి భక్తుల తాకిడి అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారుజామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ తదితర విశేష పూజలు నిర్వహించారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 213 మంది పాల్గొన్నారు. 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఐదుగురికి తులాభారం వేశారు. ఒకరికి నామకరణ, నలుగురికి అన్నప్రాశన జరిపారు. లక్ష్మీగణపతి హోమంలో 19 జంటలు పాల్గొన్నాయి. 61 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,620 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి వివిధ రకాలుగా రూ.3,57,654 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ, ఏసీ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. విద్యుత్ యంత్రాంగం సిద్ధం అమలాపురం రూరల్: మోంథా పెను తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు కోనసీమ విద్యుత్ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సిద్ధంగా ఉన్నారని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ బి.రాజే శ్వరి ఆదివారం తెలిపారు. తుపాను ప్రభావం విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లపై అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను వల్ల విద్యుత్ లైన్లు కూలిపోయి, సరఫరాకు ఆటంకం కలగవచ్చన్నారు. పెను గాలుల తాకిడికి పడిన తీగలు, స్తంభాలను ప్రజలు గమనించిన వెంటనే సమీపంలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. తడిసిన స్తంభాలు, తీగల వద్ద ఉన్న చెట్ల కొమ్మలు, తడిసిన స్విచ్ బోర్డులు ప్రజలు తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమీపంలోని ఆఫీసు సిబ్బందికి, ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి తమ అసౌకర్యాన్ని తెలపాలన్నారు. సబ్స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912, జిల్లా స్థాయి కంట్రోల్ నంబర్ 94409 04477కు సమస్యలను తెలపాలన్నారు. -
వాడపల్లి క్షేత్రంలో భక్తుల కిటకిట
వెంకన్నకు రూ.10.12 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రాగా, కార్తిక మాసం తొలి ఆదివారం కారణంగా ఈ వారం మరింత ఎక్కువగా తరలివచ్చారు. అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామితో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఒక్కరోజు దేవస్థానానికి రూ.10,11,540 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
రత్నగిరిపై భక్తజన ప్రవాహం
● కొనసాగుతున్న రద్దీ ● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 50 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు ఐదు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. నిత్యాన్నదాన పథకం వద్ద భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లను పరిశీలించారు. నేడు కూడా కిటకిట! కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సత్యదేవుని ఆలయానికి నేడు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాల నిర్వహణకు, దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేలకు పైగా వ్రతాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తులకు తీరని కష్టాలు ● కార్తిక మాసంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. ● పడమటి రాజగోపురం లోపల ఉన్న క్యూల నుంచి, అక్కడ నిర్మించిన కంపార్ట్మెంట్లలోకి భక్తులను పంపిస్తున్నారు. అక్కడ భక్తులకు మంచినీరు అందించడం లేదు. కేవలం క్యూలలోనే మంచినీరు సరఫరా చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● వ్రత మండపాలకు ఎలా వెళ్లాలి, రూ.300, రూ.వెయ్యి, రూ.1,500 వ్రత మండపాలకు ఎలా వెళ్లాలో తెలిపే సైన్ బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అలాగే, ప్రసాదం కౌంటర్లు తెలిపే బోర్డులు కూడా లేవు. వీటిని తూర్పు, పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేయాలి. దర్శనం టికెట్లు, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ● డిజిటల్ చెల్లింపులు చేయవచ్చనే ఉద్దేశంతో చాలామంది భక్తులు నగదు తక్కువ తెచ్చుకుంటున్నారు. కానీ, రత్నగిరిపై సెల్ఫోన్ సిగ్నల్స్ లేక, డిజిటల్ చెల్లింపులు జరగక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో, గత ఏప్రిల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి వచ్చేసింది. ● దేవస్థానంలోని ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలలో చాలినంత నగదు ఉండక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● భక్తులు రథం పాత్లోకి రాకుండా తూర్పు రాజగోపురం దిగువన ఉన్న మెట్ల ద్వారా సర్కులర్ మండపం వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సన్ డయల్ ఎదురుగా బారికేడ్లు కట్టి, భక్తులు వెనక్కి రాకుండా చేశారు. -
వామ్మోంథా
సాక్షి, అమలాపురం: అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి జిల్లావాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కాస్తూ.. వాతావరణం అహ్లాదంగా ఉంది. కానీ.. ఇది తుపానుకు ముందు ప్రశాంతత అనే భయం జిల్లావాసులను వెంటాడుతోంది. మోంథా తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ జిల్లావాసుల గుండెల్లో అలజడి రేగుతోంది. తీవ్ర తుపానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 1996 పెను తుపాను నాటి విషాదఛాయలను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, పెను తుపాను గా రూపాంతరం చెంది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముంది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, కనీసం 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో సోమ వారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకూ జిల్లాలో 90 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తుపాను నేపథ్యంలో సహాయ పునరావసం కల్పించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయరామరాజును జిల్లా ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం సిద్ధం తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీరాన్ని ఆనుకుని ఏడు మండలాల్లో 34 ఆవాస ప్రాంతాలుండగా, సుమారు ఆరు వేల మంది జీవనం సాగిస్తున్నారు. భారీ గాలులు, అధిక వర్షంతో పాటు, సముద్ర అలలు ఎగిసిపడే ప్రమాదముంది. మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో తీరాన్ని ఆనుకుని అనకాపల్లి జిల్లాకు చెందిన వలస మత్స్యకారులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. తుపాను తొలి ప్రభావం వీరిపైనే ఉంటుంది. 1996 తుపాను వల్ల కోనసీమకు కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందస్తు చర్యలు ఇప్పటికే వేటకు వెళ్లిన జిల్లా పరిధిలోని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం వెనక్కు రప్పిస్తోంది. తీరంలో పూరిపాకల్లో ఉన్న వారిని తుపాను పునారావస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి ఉండగా, మరో ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరుకోనుంది. పర్యాటక బీచ్ను మూసివేశారు. 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులిచ్చారు. వర్షం తీవ్రతను బట్టి 27వ తేదీ కూడా విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీర ప్రాంత మండలాలను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, డీఆర్వో కె.మాధవి సందర్శించారు. తుపాను షెలర్టు, వాటి వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతుల్లో అలజడి తుపాను వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే ప్రకటన ఖరీఫ్ వరి రైతుల్లో అలజడి రేపుతోంది. అల్పపీడన ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 16,815 ఎకరాల్లో వరిచేలు నీట మునిగి, నేలనంటిన విషయం తెలిసిందే. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే పంటలపై ఆశలు వదులు కోవాల్సిందేనని భయపడుతున్నారు.సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2025తుపాను పేరు వింటేనే కోనసీమ వాసుల్లో వణుకు పుడుతోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం 1996 నవంబర్ ఆరున ఓ పెను తుపాను కోనసీమ గుండెకు చేసిన.. మానని గాయమది. మృత్యువు చేయి చాచినట్టుగా భీకర ఈదురు గాలులు.. తాటిచెట్లను దాటి ఎగసిపడిన రాకాసి అలలు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయిన దయనీయ దృశ్యాలు.. చెట్టూ.. పుట్టా.. ఇల్లూ.. వాకిలీ.. మనుషులనే కాదు.. పశుపక్ష్యాదులనూ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసిన కాళరాత్రి అది. ఉమ్మడి జిల్లాను తాకనున్న తాజా పెను తుపాను ‘మోంథా’ తీవ్రతను తలచుకుని.. అప్పటి విషాద జ్ఞాపకాలు కోనసీమ వాసులను కలవరపెడుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలను గుణపాఠంగా తీసుకుని.. ప్రస్తుత జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలన్న సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కలవరపెడుతున్న పెను తుపాను జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరిక తీరాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు వేట నుంచి సురక్షితంగా చేరుకున్న మత్స్యకారులు అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లా ప్రత్యేకాధికారిగా విజయరామరాజు అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్ మహేష్కుమార్ మోంథా తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సముద్ర తీరం వెంబడి ఉన్న తుపాను పునరావాస కేంద్రాల వద్ద భోజన, వసతిని కల్పిస్తామన్నారు. తుపాను హెచ్చరికలకు అనుగుణంగా తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తీరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఇన్చార్జిని నియమిస్తున్నామని వెల్లడించారు. వీరు మైరెన్ పోలీసుల సమన్వయంతో పని చేస్తారన్నారు. జిల్లా కేంద్రం, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో 08856–293104 నంబర్లో సంప్రదించి, సహాయక చర్యలు పొందవచ్చన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఇప్పటికే మూడు వేల విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచిందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. వణికిస్తున్న ‘ఉప్పెన’ జ్ఞాపకాలు కోనసీమలో 1996 నవంబర్ ఆరున పెను తుపాను కోనసీమను చిన్నాభిన్నం చేసింది. ఇది కోనసీమకు చీకటి అధ్యాయం. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. 39 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీరంలో అలలు ఎగసిపడి ఉప్పెన వచ్చింది. అప్పుడు కూడా తుపాను కాకినాడ–పుదిచ్చేరి యానాం మధ్య తీరం దాటింది. దీనివల్ల కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో తీరంలోని మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప ఆనవాళ్లు లేకుండా పోయాయి. సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోనందున ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఏర్పడింది. తుపాను ముందు హెచ్చరించడం కానీ, కనీస జాగ్రత్తలు కానీ తీసుకోలేదు. పునరావాస కేంద్రాలు ముందుగా ఏర్పాటు చేయలేదు. ఆ పెను తుపానులో అధికారికంగా 1,077 మంది మృత్యువాత పడ్డారు. 6.47 లక్షల ఇళ్లు ధ్వంసం కాగా, వీటిలో 40 వేల ఇళ్లు నేటమట్టమయ్యాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలడం, మొవ్వులు విరిగి చనిపోయాయి. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ వాసులకు దశాబ్ద కాలం పట్టిందంటే తుపాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. తుపాను వచ్చి దగ్గర దగ్గరగా 30 ఏళ్లవుతున్నా బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలంటే ఈ ప్రాంతవాసులకు నాటి విషాదం కళ్ల ముందు కదలాడుతుంది. -
మోంథా తుపాను ఎఫెక్ట్: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు
సాక్షి, విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎసిగిపడనున్నాయని.. తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.సఖినేటిపల్లి-నర్సాపురం రాకపోకలు నిలిపివేతఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సఖినేటిపల్లి -నర్సాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు నుండి తుపాను ఉధృతి తగ్గే వరకు రేవులో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తీర ప్రాంతాల్లో అలర్ట్..మొంథా తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిపలీట్నంలోని మంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద హంసల దీవి బీచ్లను మూసివేశారు. మంగినపూడి బీచ్లో జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంటిపూడి సాయిరామ్చౌదరి – పుష్పావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116, రావులపాలేనికి చెందిన కూసుమంచి గంగాధరరావు, కామేశ్వ రి కావేరిలు రూ.38,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ నిడదవోలు మండలం శంకరాపురంలో ఈ నెల 6న కోలా నాగేశ్వరరావుకు చెందిన బంగారు ఉంగరం, 22న కాయల మంగకు చెందిన బంగారపు బొందును ఓ వ్యక్తి చోరీ చేశాడు. వీరిని బెదిరించి బంగారం దోచుకుపోయాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావును నిందితుడిగా గుర్తించామని ఎస్సై తెలిపారు. గోపవరం వద్ద అప్పారావును అరెస్ట్ చేసి మూడు బంగారు ఉంగరాలు, రెండు కాసుల బొందు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 పాత కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, ట్రైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, రాంబాబు, ధనుంజయ్లను ఎస్పీ డి.నరసింహకిశోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అభినందించారు. -
వనం.. అందులో మనం
ఫ వన సమారాధనలకు వేళాయె ఫ నేడు కార్తికమాస తొలి ఆదివారం ఫ సందర్శకులతో కిటకిటలాడనున్న పర్యాటక ప్రాంతాలు కొత్తపేట: కార్తిక మాసం వచ్చింది.. ఊరూవాడా సందడి తెచ్చింది.. ఐక్యతను చాటే వన మహోత్సవాలకు వేళయ్యింది.. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, స్నేహితులు, వివిధ కుల, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వన సమారాధనల జోరు అందుకోనుంది. కార్తిక వన సమారాధనల్లో అంతా ఐక్యంగా ఉసిరి చెట్టు ఉన్న పచ్చని కొబ్బరి, మామిడి తదితర తోటల్లో చేరి, ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసి, మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేయడం ఆచారంగా వస్తుంది. ఇది సమాజంలో మానవ సంబంధాలు, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఉద్దేశించబడింది. ఇది పిక్నిక్ లాంటిదే కాకుండా, ఉసిరి చెట్టు వద్ద మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆ చెట్టు ద్వారా వీచే గాలి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించడం ముఖ్యోద్దేశం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఆటవిడుపుగా, మానసికంగా ఉపశమనాన్ని కలిగించే కార్యక్రమంగా ఇది దోహదపడుతుంది. ఈ నెల 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో కార్తిక ఆదివారాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కడికక్కడ వన సమారాధనల సందడి కొనసాగనుంది. ఆనందంగా విహరిద్దాం కార్తిక మాసంలో ఎక్కువగా ఆదివారాల్లో వన విహారాలు, వన సమారాధనలకు ఏర్పాటు చేసుకుంటారు. కార్తిక మొదటి ఆదివారం (నేడు) కావడంతో పలు వర్గాల వారు వన సమారాధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందుకు అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాకినాడ బీచ్, కాకినాడ – తాళ్లరేవు మధ్య కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రంప, మారుడుమిల్లి అటవీ ప్రాంతాలు, జలపాతాలు, అఖండ గోదావరి నడుమ పాపికొండలు, కొత్తపేట సమీపాన కపిలేశ్వరపురం మండలం వీధివారిలంకలో ధనమ్మతల్లి కొలువైన ధనమ్మమర్రి ప్రాంతం, మందపల్లి – రావులపాలెం మధ్య కాశీరాజుగారి తోట, రాజోలు నియోజకవర్గంలో దిండి రిసార్ట్స్, పి.గన్నవరం అక్విడెక్ట్, బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక తదితర ప్రాంతాల్లో వన సమారాధనలు జరుపుకొంటారు. భక్తి నింపుతూ.. కార్తిక మాసంలో పంచారామాలను దర్శించుకోవడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, పిఠాపురం కుక్కటేశ్వరస్వామి, కొత్తపేట మండలం పలివెల కొప్పేశ్వరస్వామి, ముక్తేశ్వరం క్షణముక్తేశ్వస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, పట్టిసీమ వీరభద్రస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, ఆలమూరు మండలం జొన్నాడలో విశ్వేశ్వరస్వామి, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరస్వామి తదితర ఆలయాలున్నాయి. ఈ కార్తికంలో ముఖ్యంగా సోమవారాల్లో ఆయా ఆలయాలను సందర్శిస్తారు. నవంబరు 21 తేదీ మార్గశిర శుద్ధ పాఢ్యమి పుణ్యస్నానాలు, ఆకాశ దీపారాధనతో కార్తికమాసం ముగియనుంది. పచ్చనిసీమ.. చూద్దామా గౌతమి – వశిష్ట గోదావరి నడుమ కోనసీమలో పచ్చని పంటలు, కాలువలతో ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలు ఉన్నాయి. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు పర్యాటక కేంద్రంగా ఖ్యాతికెక్కింది. పరవళ్లు తొక్కుతూ లొల్ల లాకుల నుంచి విడుదలవుతున్న సాగునీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ ప్రాంతం కార్తిక మాసంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు కోనసీమలో సాగునీటి వ్యవస్థ నిర్వహణకు లాకులను నిర్మించారు. లాకుల గేట్లు ఎత్తే సమయాల్లో వాటి నుంచి ఎగసిపడుతూ ప్రవహించే నీటి కెరటాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లొల్ల లాకుల వరకు ప్రవహించే ప్రధాన పంట కాలువ లొల్ల లాకుల వద్ద ముక్తేశ్వరం, అమలాపురం, పి.గన్నవరం కాలువలుగా విడిపోతుంది. ఆ మూడు కాలువలకు నీరు వెళ్లే దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి లొల్ల లాకుల వద్ద కార్తిక సమారాధనలు జరుపుకొనేందుకు తరలివస్తుంటారు. అప్రమత్తంగా ఉండండి గౌతమి, వశిష్ట నదులు, సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, వన సమారాధనల సందర్భంగా స్నేహితులతో సరదాగా స్నానాలకు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ నిర్లక్ష్యం వహిస్తే రెప్పపాటులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలి. సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట -
రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహం
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కాకినాడ రైల్వే ఎస్సై వాసంశెట్టి సతీష్ కథనం ప్రకారం.. రైల్వే ట్రాక్మాన్ సమాచారం మేరకు ఉండూరు రైల్వే గేటు సమీపంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై నీలం రంగు జీన్ ఫ్యాంట్, గ్రే, నలుపు రంగు టీ షర్టు ఉంది. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94949 02914 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. వచ్చే నెలలో అథ్లెటిక్స్ పోటీలు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్ పోటీలు నవంబర్ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను శనివారం విడుదల చేశారు. ఈ అథ్లెటిక్స్లో 26 రకాల క్రీడా పోటీలు ఉంటాయని, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ ఎంవీఎస్ఎన్ మూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రరావు, ఆర్గనైజింగ్ మెంబర్లు ఎం.ప్రసాద్, పీవీవీ లక్ష్మి, టి.విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి
ఫ వాడపల్లి క్షేత్రంలో భక్తజన సంద్రం ఫ ఒక్కరోజే రూ...... లక్షల ఆదాయం కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి – గంటల వరకూ దేవస్థానానికి రూ. – లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. -
వైఎస్సార్ సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మౌనిక
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పి.గన్నవరానికి అసెంబ్లీకి చెందిన దాసరి మౌనికను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మౌనికను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన ఫైనాన్స్లో రూ.1.44 లక్షల గోల్మాల్ అమలాపురం టౌన్: అమలాపురం ఎర్ర వంతెన వద్ద ఉన్న స్పందన ఫైనాన్స్ లిమిటెడ్లో ఆరుగురు లోన్ ఆఫీసర్లు రూ. 1.44 లక్షల మేర గోల్మాల్ చేశారు. వారిపై కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన స్పందన ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజర్ పలివెల వినోద్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. స్పందన ఫైనాన్స్లో లోన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న కాసా కార్తీక్, గెడ్డం కుమార్, దాసరి సిద్ధూప్రకాష్, కోసూరి గోపి, ఉసురుకుర్తి ప్రేమ్కుమార్, పెనుమర్తి చిన్నారావులపై కేసు నమోదు చేశామన్నారు. రూ.1.44 లక్షల నిధుల గోల్మాల్ 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్య జరిగిందన్నారు. అమలాపురం స్పందన ఫైనాన్స్లో ఆడిటర్లు శనివారం నిర్వహించిన ఆడిట్లో ఈ అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో ఫైనాన్స్ మేనేజర్ వినోద్బాబు ఆ ఆరుగురి లోన్ ఆఫీసర్లే సొమ్ము గోల్మాల్కు కారకులని గుర్తించి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై బి.భావన్నారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు అమలాపురం రూరల్: కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోయిన సంఘటనతో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 27 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ. 97,600 అపరాధ రుసుం విధించామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని మార్నింగ్ ట్రావెల్స్కు చెందిన బస్సును సీజ్ చేసి, ఆ బస్ ఫిట్నెస్ రద్దు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 499 బస్సులపై కేసులు పెట్టి, రూ.20,94,850 అపరాధ రుసుం వసూలు చేశామని తెలిపారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనను ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, జ్యోతిసురేష్, ఓలేటి శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీశ్రీదేవి, షణ్ముఖ శ్రీనివాస్ కౌశిక్ పాల్గొన్నారు. రసాయన కిట్లతో రేషన్ బియ్యం గుర్తించొచ్చు అమలాపురం రూరల్: రేషన్ బియాన్ని రసాయన కిట్లతో గుర్తించవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. బియ్యం ఎక్కడైనా పట్టుబడితే ప్రజా పంపిణీ వ్యవస్థదా, లేక ప్రైవేట్ మార్కెట్లోదా అనే విషయం గుర్తించేందుకు కొత్త రసాయన కిట్లను ప్రభుత్వం అందించిందన్నారు. అధికారుల అంచనాల ప్రకారం 60 శాతం మంది కార్డుదారులు బియ్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారన్నారు. ఇంకా 20 శాతం మంది వలస కూలీలు, తాము పనిచేసే ప్రాంతాల్లోనే బియ్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. జిల్లాలోని 8 మంది పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఈ కొత్త రసాయన కిట్లు అందించినట్లు తెలిపారు. మరో కిట్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు. బియ్యాన్ని ఈ కిట్లలోని రెండు రసాయనాలతో పరీక్షిస్తే రేషన్ బియ్యం ఎరుపు రంగులోకి మారుతుందన్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓ శరత్, అసిస్టెంట్ మేనేజర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు అన్ని వసతులూ కల్పించాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్ధానానికి కార్తికమాసంలో విచ్చేసే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం దేవస్థానంలో వివిధ విభాగాలను పరిశీలించారు. కార్తిక మాసంలోని ఏకాదశి, పౌర్ణిమ వంటి పర్వదినాలలో అధిక సంఖ్య భక్తులు వస్తారని, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కనిపించడం లేదన్నారు. ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని, అభిప్రాయ భేదాలను పక్కన సమన్వయంతో పనిచేయాలన్నారు. శానిటేషన్ విభాగంలో అదనపు సిబ్బందిని ఇంకా నియమించలేదని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ చెప్పడంతో ఆ విషయంపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుసదన్ సత్రం ఆవరణలో ఫ్లోరింగ్ అపరిశుభ్రంగా ఉందన్నారు. విష్ణుసత్రంలో వివాహాలు చేసుకున్నాక కల్యాణ మండపాలను అలాగే వదిలేయకూడదని, సంబంధిత కాంట్రాక్టర్తో చెప్పి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. సిబ్బందితో సమావేశం దేవస్థానంలో పరిశీలన అనంతరం సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్తికమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాలలో తెల్లవారుజాము ఒంటి గంట నుంచి, ఇతర రోజుల్లో తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, భక్తులకు దర్శనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నవంబర్ 2న జరిగే సత్యదేవుని తెప్పోత్సవం, ఐదున జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షణకు భారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు కృష్ణారావు, ఎల్ శ్రీనివాస్ భాస్కర్ పాల్గొన్నారు. సత్యదేవుని దర్శించిన 40 వేల మంది కార్తికమాసంలోని తొలి శనివారం సందర్భంగా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. -
టెట్ నోటిఫికేషన్ జారీ
రాయవరం: నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతో పాటు ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) రాసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షను ఈ ఏడాది డిసెంబరు 10న నిర్వహించనున్నారు. జిల్లాలో 2011కి ముందు నియమితులై ఉద్యోగాలు చేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 23 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ మూడు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 150 మార్కుల వంతున రెండు పేపర్లు (టెట్ 1ఏ, టెట్ 2ఏ)ను రాయవచ్చు. కొందరు ఒకటే రాయవచ్చు. డిసెంబర్ 10న ఉదయం 9.30 గంటల నుంచి తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2న టెట్ కీ విడుదల చేయనున్నారు. తుది కీ జనవరి 13న ప్రకటించిన అనంతరం 19న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే టెట్ అర్హత లేని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్లో క్వాలిఫై కావాల్సి ఉంది. త్వరలో డీఎస్సీ ప్రకటిస్తామని విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతో పాటు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 వేల మంది వరకూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ను రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. చట్టం అమలు నుంచి.. విద్యాహక్కు చట్టం 2009లో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2012, 2014, 2018, 2025 డీఎస్సీకి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులంతా టెట్ పరీక్షలైన పేపర్–1, పేపర్–2లో క్వాలిఫై అయిన వారు మాత్రమే డీఎస్సీలో ఎంపికయ్యారు. 2011 డీఎస్సీకి ముందు జరిగిన డీఎస్సీల్లో ఎంపికై న ఉపాధ్యాయులంతా ఉద్యోగంలో కొనసాగడానికి ఇప్పుడు టెట్ను ఎదుర్కోవాల్సి ఉంది. ఇది ఒక విధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. 2030 ఆగస్టు 31వ తేదీ లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్ఎం తదితర క్యాడర్ల ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరు కానవసరం లేదు. అయితే పదోన్నతి పొందాలంటే మాత్రం పేపర్–2 పరీక్ష క్వాలిఫై కావాలి. వారిలో అయోమయం టెట్ ప్రకటనపై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షను ఏ విధంగా ఎదుర్కోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు. 1994, 1996, 1998, 2000, 2001, 2002, 2003, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాలి. 2009 విద్యాహక్కు చట్టం ఏర్పడడానికి ముందే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న తాము ఏ విధంగా ఇప్పుడు టెట్ను రాయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షను ఎదుర్కోవడం పెద్ద సవాల్గా భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఉపాధ్యాయుల తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 2009 విద్యాహక్కు చట్టంలో మార్పు తీసుకు వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని అంటున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన నేపథ్యంలో టెట్ను రాయాలా? లేదా? అనే మీమాంసలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఫ డిసెంబరు 10న పరీక్ష ఫ వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు ఫ ఇన్ సర్వీస్ టీచర్ల పరీక్షపై తొలగని అనిశ్చితి -
జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో టెంపుల్, బీచ్ టూరిజాలకు పర్యాటక హోమ్ స్టే నమూనాలను సేకరించి పైలెట్ ప్రాజెక్టుగా ఒక హోమ్ స్టేను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలన్నారు. ఐదు ప్రముఖ దేవాలయాలతో టెంపుల్ సర్క్యూట్ టూరిజం నిర్వహణకు ప్యాకేజీ సిద్ధం చేయాలన్నారు. లొల్ల లాకుల వద్ద జనవరి 10, 11 తేదీలలో బోటింగ్ ఫెస్టివల్కు ప్రభుత్వ పరంగా రంగం సిద్ధం చేయాలన్నారు. లొల్ల లాకుల వద్ద ఇరిగేషన్ స్థలం, వాడపల్లి దేవాలయం వద్ద ఉన్న దేవదాయ ధర్మదాయ శాఖ స్థలాలను టూరిజం అభివృద్ధికి అప్పగించాలన్నారు. డీఆర్వో మాధవి, ఆర్డీఓ పి.శ్రీకర్, టూరిజం ఆర్డీ పవన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్ పాల్గొన్నారు. ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయండి జొన్నాడ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ పనులపై కలెక్టరేట్లో జాతీయ రహదారుల అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఫ్లైఓవర్ ఫిల్లింగ్ కోసం సరైన మట్టి లభించక తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కాంట్రాక్టర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి అనువైన ఫ్లై యాస్ లక్ష మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ఒప్పందం కుదిరిందని, త్వరలో మట్టి ఫిల్లింగ్ పనులు చేపట్టనున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. -
కమీషన్ పెంచకపోతే షాపులు మూసేస్తాం
అమలాపురం టౌన్: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన మద్యం షాపులకు మొదట్లో గెజిట్లో పేర్కొన్నట్లు 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మద్యం షాపుల యజమానులు డిమాండ్ చేశారు. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే వ్యాపారాలు చేయలేమని వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్లో డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ అపార్ట్మెంట్స్లో మద్యం షాపుల యజమానులు శనివారం సమావేశమయ్యారు. తమకు కమీషన్ పెంచకపోతే షాపులను మూసివేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమీషన్ ఎంత మాత్రం సరిపోవడం లేదని తెగేసి చెప్పారు. జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యవర సమావేశానికి దాదాపు 150 మంది మద్యం షాపుల యజమానులు పాల్గొని ప్రభుత్వానికి తమ అసహనాన్ని, నిరసనను తెలియజేశారు. 2024–26 మద్యం పాటదారులైన లైసెన్స్ షాపుల యజమానులు మూకుమ్మడిగా తమ గళాన్ని అటు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి వినిపించారు. అలాగే గెజిట్లో లేని పర్మిట్ రూమ్ల కోసం వసూలు చేస్తున్న రూ.7.5 లక్షలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రానున్న 15 రోజుల్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందించారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, మద్యం షాపుల లైసెన్స్దారులు తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు, మామిడి గురవయ్య నాయుడు, ఎస్.సుబ్బారెడ్డి, పర్వతనేని బాలయ్య చౌదరి, అప్పారి శ్రీరామమూర్తి, సంసాని గంగాధర్, తాటిపాక అబ్బు, అబ్బిరెడ్డి శ్రీకాంత్, మిద్దె ఆదినారాయణ, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మద్యం షాపుల నిర్వాహకుల అల్టిమేటం -
AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను
ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలుఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విజయవాడ: మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లుజిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుకలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులువిద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులుగుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాస్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఅధికారులను అప్రమత్తం చేసాంలోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాంప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారుతుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయిగుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారుప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాంవ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాంఅత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలికాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాంప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండినగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాంప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా:ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం..ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశంజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు 27, 28 తేదీలలో సెలవువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులుగోదావరి నదిలోనికి పర్యాటక లాంచీలను నిలిపివేతజిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుఏలూరు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విపశ్చిమ గోదావరి జిల్లామోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358కాకినాడ:మోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేతకాకినాడలో బీచ్లు మూసివేత విశాఖ:విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవుసోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవుబాపట్లమోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాన్ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్లు మూసివేతయాత్రికులు, భక్తులు బీచ్లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలువిశాఖ:మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే జోన్ హై అలెర్ట్రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘాఅత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులుట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలువిశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుతుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్ఎమ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మోంథా తుఫాన్.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. -
ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయంలో అపశృతి
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కార్తీక మాసం పురస్కరించుకుని సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆలయంలో పనిచేసే ద్రాక్షారామకు చెందిన దొంగ భీమన్న శనివారం గడ్డి మిషన్తో గడ్డిని కోస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనై మృతి చెందాడు. గుర్తించిన ఆలయ సిబ్బంది ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్రాక్షారామ ఎస్ఐ ఎం లక్ష్మణ్ ప్రాథమిక అంచనా కోసం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు. మహా నివేదన అనంతరం స్వామివారికి మూడు గంటల నుంచి భక్తులను దర్శించుకోవచ్చు అని ఆలయ అర్చకులు తెలిపారు. -
సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో ఏపీ ఈపీడీసీఎల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకు ప్రతినిధులు మున్సిపల్ అధికారులు, సోలార్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు విధి విధానాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పురపాలక సంఘాల భవనాలు, వీధి దీపాలు, నీటి పంపులు, శానిటేషన్ ప్లాంట్లు తదితర చోట్ల ఎక్కువగా విద్యుత్ వినియోగించే అవకాశం ఉందన్నారు. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయవచ్చని అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ బి.రాజేశ్వరి, లీడ్ బ్యాంకు ఎల్డీఎం ఎం.కేశవవర్మ తదితరులు పాల్గొన్నారు. ఫ విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణకు సమయపాలన కల్పించాలని మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో కోనసీమ క్రీడోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ క్రీడా కమిటీలను వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రతినిధులను కలిపి ఏర్పాటు చేయాలన్నారు. జేసీ టి.నిషాంతి, డీఈఓ సలీం బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ఈశ్వరరావు రమాదేవి పాల్గొన్నారు. పశువుల పెంపకంపై అవగాహన పాడి పశువుల పెంపకంపై గ్రామ సచివాలయాల పశు సంవర్ధక సహాయకులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈదరపల్లిలోని పశుసంవర్ధక శాఖ శిక్షణ కార్యాలయంలో గురువారం నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఏహెచ్ఏల శిక్షణను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ఫ జిల్లాలో పాడి పశువుల ఉత్తమ పోషణ ద్వారా పాల దిగుబడి పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పాడి రైతులు, వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (ఫ్యాక్స్) అధ్యక్షులు, కార్యదర్శులు, పశుగ్రాస దాణా ఉత్పత్తిదారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశువుల సంతతి మెరుగుదల, గర్భధారణ, పాల దిగుబడి పెంచేలా టోటల్ మిక్సర్ దాణా తక్కువ ధరకు అందించే చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మహేష్ కుమార్ -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
ప్రభుత్వ విధానాలు ఎండగడదాం..కొత్తపేట: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం’ పేరిట ఈ నెల 28న నిరసన కార్యక్రమం చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో వాడపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండ సమావేశానికి జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, దుర్మార్గ చర్యలపై ప్రజల పక్షాన ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం’ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. సంపద సృష్టిస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అధికారం చేపట్టిన చంద్రబాబు దానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ పాలకుల తరహాలోనే నేటి కూటమి పాలకులు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సాగుతున్నారన్నారు. పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే, నేటి సీఎం చంద్రబాబు తన బినామీలకు ఒక్కో కళాశాలను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికే కోటి సంతకాల సేకరణకు జగన్ పిలుపునిచ్చారని అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, అనారోగ్యానికి గురైన పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా ఉన్నత వైద్యం పొండానికి ఆరోగ్యశ్రీ అమలు చేయగా దేశ, విదేశాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు పేరుతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారన్నారు. పేద విద్యార్థుల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకు వచ్చారన్నారు. ఆ తండ్రీ, కొడుకుల ఆశయాలను, ప్రజాస్వామ్యాన్ని నేటి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం రైతులు, దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కుతూ దాడులు చేయిస్తున్నారని అన్నారు. అనంతరం ప్రజా ఉద్యమం పోస్టర్లను జగ్గిరెడ్డి, విజయలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీలు కుండ అన్నపూర్ణ, మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బూత్ విభాగం కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు కనుమూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని విద్యార్థులు ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో శిరీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి గురువారం శ్రీకారం చుట్టారు. శిరీష్తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి లోవరాజు, జిల్లా కార్యదర్శి సుజిత్ తదితరులు అమలాపురంలోని పలు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి విద్యార్థుల నుంచి సంతకాలను సేకరించారు. శిరీష్ మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల భావితరాలకు జరిగే నష్టాలను వివరించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అవగాహన కల్పించారు. ఫ 28న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి -
నీట ముంచేలా..
సాక్షి, అమలాపురం: చినుకు వణుకు పుట్టిస్తోంది.. అన్నదాతను నిండా ముంచుతోంది.. ఖరీఫ్ ఆరంభంలో వానలు లేక ఇబ్బంది పడిన రైతులకు సాగు చివరిలో కురుస్తున్న వాన కలవరానికి గురిచేస్తుంది. నైరుతిలో ముఖం చాటేసిన వర్షం, ఈశాన్య రుతుపవనాల్లో ప్రభావం చూపుతుండటంతో పుడమిపుత్రులకు శోకాన్ని మిగుల్చుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వరుసగా మూడో రోజు కూడా వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. అప్పుడప్పుడు భారీగా, తరువాత చినుకులు పడుతూ... తిరిగి భారీ వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సగటున 64.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 112 మిల్లీమీటర్లు, మండపేట మండలంలో అత్యల్పంగా 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ 43 మిల్లీమీటర్లు కురవగా, తరువాత 21.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, రోడ్డు వెంబడి ఉన్న వృక్షాలు నేలకొరిగాయి. అత్యధికంగా వర్షం కురిసిన కాట్రేనికోన మండలం వేట్లపాలెంలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు కొత్తపేట, రావులపాలెంలో రోడ్లపై నీరు తిష్ట వేసింది. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రావులపాలెం బస్టాండ్ జల దిగ్బంధనంలో చిక్కుకుంది. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ఇళ్ల మధ్య వర్షం నీరు చేరి జనం పాట్లు పడుతున్నారు. రాత్రి దాటిన తరువాత కూడా వర్షం పడడంతో మరింత ముంపునకు గురవుతాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో కల‘వరి’పాట్లు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా పడిన వర్షానికి తోడు ఈదురుగాలులతో ఖరీఫ్ వరి చేలు నేలనంటుతున్నాయి. కె.గంగవరం, రామచంద్రపురం, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, అంబాజీపేట మండలాల్లో వరి చేలు ఒరిగిపోయాయి. జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిన విషయం తెలిసిందే. సాగు ఆరంభంలో నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో శివారు రైతులు సాగునీరందక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కీలకమైన సమయంలో వర్షాలు పడక రైతులు పూర్తిగా పంట కాలువలు, మోటార్ల నీటిపై ఆధారపడ్డారు. తీరా పంట చేలు పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న దశలో కురుస్తున్న వర్షాలకు చేలు నేలనంటడంతో అన్నదాతల్లో గుబులు రేపుతోంది. దీనికితోడు ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, మలికిపురం, మామిడికుదురు మండల్లాలోని తీర ప్రాంతాల్లో వరి చేలు ముంపు బారిన పడుతున్నాయి. వర్షాలు మరో రెండు రోజులు ఇదే విధంగా కురిస్తే చేలు ముంపులో చిక్కుకుని నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షంతో చేలకు తక్షణం కలిగే నష్టం లేకున్నా ముంపు నీరు దిగేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. కాట్రేనికోన మండలం వేట్లపాలెంలో రోడ్డుపై ఒరిగిన విద్యుత్ స్తంభంకందికుప్ప సొసైటీ కార్యాలయం వద్ద పడిపోయిన చెట్లు అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోకి చేరిన ముంపునీరు ఫ అన్నదాత గుండెల్లో ‘అల్పపీడనం’ ఫ జిల్లాలో మూడో రోజూ ఆగని వర్షం ఫ 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఫ నేలకొరుగుతున్న వరి పంట ఫ లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన ముంపునీరు జిల్లాలో వర్షపాతం ఇలా.. జిల్లాలో ఉప్పలగుప్తంలో 110 మిల్లీమీటర్లు, కొత్తపేటలో 97.8, అయినవిల్లిలో 91, ఐ.పోలవరంలో 92.4, ముమ్మిడివరంలో 84, మలికిపురం, కె.గంగవరంలో 79.2, రావులపాలెంలో 77, అమలాపురంలో 74.6, కపిలేశ్వరపురంలో 74.4, ఆలమూరు, సఖినేటిపల్లిలో 62.6, అంబాజీపేటలో 51, పి.గన్నవరంలో 50, ఆత్రేయపురంలో 44.6, రాజోలులో 44.4, అల్లవరంలో 40, మామిడికుదురులో 37.2, రాయవరంలో 20.4, రామచంద్రపురంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పేదలకు వైద్య విద్య దూరం
అమలాపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట వైద్య పోరాట ధర్నా నిర్వహించారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గెడ్డం సంపదరావు, కొల్లాబత్తుల సత్యం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటుందన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైద్య విద్యను దూరం చేస్తుందన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు పట్నాల విజయకుమార్, మాత సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్చార్జి కుసుమ వెంకటేశ్వరరావు, అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు, ఉపాధ్యక్షుడు జిత్తుక సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అయినపర్తి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
కావాలనే వేధిస్తున్నారు
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను ప్రచురిస్తున్నందుకు ఎడిటర్తో పాటు విలేకర్లపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇవ్వాలి. అంతే కానీ ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో పత్రిక ఎడిటర్ను, విలేకర్లను వేధించడం సరికాదు. – తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ కక్ష సాధింపు తగదు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి తగదు. ఆ పత్రిక విలేకర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం ఖండనీయం. ప్రతిపక్షంపై బాబు వైఖరి, మీడియాతో వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న ‘సాక్షి’ మీడియాను అణచి వేయడం ఆమోదం యోగ్యం కాదు. ఇలాంటి అరాచక పాలనకు బాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ -
మంత్రిగారి ‘డాడీ’ సేవలో..
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అధికారులు మంత్రిగారి ‘డాడీ’ సేవలో తరిస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. అధికారులతో సమీక్షలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకూ చాలావరకూ ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. దీనికి పరాకాష్టగా బుధవారం జరిగిన ఆయన జన్మదిన వేడుకలు నిలుస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. యూనిఫాంతో పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు..సరిగ్గా ఏడాది క్రితం ఇదే కార్తీక మాసంలో మంత్రి తండ్రి సత్యం ఆధ్వర్యాన జరిగిన వనభోజనాల్లో అప్పటి రామచంద్రపురం సీఐ యూనిఫాంతో పాల్గొని కులం గురించి స్పీచ్ ఇవ్వడంతో సస్పెన్షన్కు గురయ్యారు. మళ్లీ ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతోందనగా జరిగిన సత్యం పుట్టిన రోజు వేడుకల్లో పోలీసు అధికారులందరూ యూనిఫాంలో పాల్గొని ప్రభుభక్తి చాటుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసు శాఖతో పాటు పలు శాఖల అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడాన్ని చూసి అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. -
కక్ష సాధింపే..
‘సాక్షి’ దిన పత్రిక, ఎడిటర్, విలేకర్లను పోలీసులు కక్ష సాధింపుతోనే వేధిస్తున్నారు. నకిలీ మద్యం వార్తలను జీర్ణించుకోలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ‘సాక్షి’ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే ఖండనలు లేదా వివరణలు ఇచ్చుకోవాలే తప్ప ఇలా పత్రిక ప్రధాన కార్యాలయానికి పోలీసులను పంపించి వేధించడం సబబు కాదు. ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని, ఆయన స్థాయి, విలువను గుర్తించకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం దారుణం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’పై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. – పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం పైశాచికత్వానికి పరాకాష్ట ‘సాక్షి’ దినపత్రికపై దాడి ప్రభుత్వ పైచాచికత్వానికి పరాకాష్ట. ‘సాక్షి’ పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కూటమి ప్రభుత్వం, దాని తరఫున పోలీసు అధికారులు దాడులు, బెదిరింపులకు దిగడం వాస్తవాలపై, ప్రజలపై దాడి చేయడమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ సంస్కృతి సరి కాదు. ప్రజాస్వామ్యవాదులు అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమన నీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు -
వన భోజనాల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: కార్తిక మాసం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, నదీ తీరాలు, వన సమారాధనలు జరిగే ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక సోమవారాలు, పౌర్ణమి రోజున ముఖ్యంగా శివాలయాలు, నదీ స్నాన ఘట్టాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో ఉంటారని, అక్కడ పకడ్బందీ భద్రతా చర్యలు ఉండాలన్నారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా పార్కింగ్ స్థలాలను ముందే గుర్తించాలని, వాటి సమాచారాన్ని భక్తులకు తెలియజేయాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్ నిఘా పెంచాలని ఆదేశించారు. వన భోజనాలు, దీపారాధనలు చేసే చోట్ల అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లపై దుష్ప్రచారం తగదు
అమలాపురం టౌన్: అమలాపురంలోని కొన్ని మాంసాహార హోటళ్లపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోందని అమలాపురం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్, పట్టణ హోటళ్ల అసోసియేషన్ వ్యాపార ప్రతినిధులు అన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లోని ఓ హోటల్లో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధులు నల్లా పవన్ కుమార్, కోకా రాంబాబు మాట్లాడారు. ఇటీవల అమలాపురంలోని ఓ మాంసాహార హోటల్లో తేలు ఉన్న పలావు తిని ఒక యువకుడు చనిపోయాడని సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్త హల్చల్ చేసిందన్నారు. ఆ యువకుడు అనారోగ్య కారణంతోనే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారన్నారు. కానీ సోషల్ మీడియాలో హోటళ్లపై విష ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, చాంబర్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి వెంకటాచల ప్రసాద్, పలు హోటళ్ల నిర్వాహకులు గారపాటి వంశీ, చిక్కం గణేష్, డి.నాయుడు, బాలు, సురేష్ నాయుడు పాల్గొన్నారు. -
ఇజ్రాయిల్లో కోనసీమ వాసి మృతి
సాక్షి, అమలాపురం: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన కోనసీమ వాసి అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సెప్టెంబరు 30 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అతడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే.. రావులపాలేనికి చెందిన వానపల్లి ప్రసాద్ (35) ఇజ్రాయిల్ దేశంలో కార్మికుడిగా పనిచేసేందుకు 2024 మే నెలలో వెళ్లాడు. అదే ఏడాది జూన్ నెలలో అషూద్ పట్టణంలోని ఒక సిమెంట్ కంపెనీలో చేరాడు. పరిశ్రమలో మెషీన్ను శుభ్రం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. గమనించిన సిబ్బంది అతడిని రక్షించేందుకు చేసిన యత్నాలు ఫలితమివ్వలేదు. మృతదేహం తీసుకువచ్చేందుకు.. మృతుడు ప్రసాద్ తండ్రి వానపల్లి సత్తిరాజు రావులపాలెం కొత్త కాలనీలో నివాసముంటున్నాడు. కంపెనీ యాజమాన్యం ప్రసాద్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీనితో వారు కంగారుపడి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును సంప్రదించగా, ఆయన కలెక్టర్కు పరిస్థితి వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను సంప్రదించి ప్రసాద్ మృతదేహాన్ని రా వులపాలెం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారన్నారు. కోనసీమ మైగ్రేషన్ బృందం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఆర్థిక సాయం మృతుడు తండ్రి సత్తిరాజు బుధవారం కలెక్టరేట్కు వచ్చి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు సహకరించాల్సిందిగా మరోసారి అధికారులను కోరారు. కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయ అధికారుల తోపాటు ఇజ్రాయిల్ కన్స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్తో కూడా బృందం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ప్రసాద్ తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందినవారని తెలిసి ఇజ్రాయిల్ కన్స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్న్ పంపిన రూ.2.07 లక్షల ఆర్థిక సాయాన్ని సత్తిరాజుకు కలెక్టర్ అందించారు. బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ అందిస్తామని, కంపెనీ ద్వారా అందవలసిన ఇన్సూరెన్సులు ఉంటే వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి జి. రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, సత్తిబాబు, దుర్గ పాల్గొన్నారు. నూతన వరి వంగడాలను సాగు చేయించాలిఅమలాపురం రూరల్: రానున్న రబీ సీజన్లో నూతన వరి వంగడాలు, ఎగుమతికి ఉపయోగపడే సన్న రకాలను రైతులతో సాగు చేయించాలని వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో రబీ సీజన్ సన్నద్ధతపై సమీక్షించారు. బొండాలు 3626 రకాలకు బదులు 1232, 1239 సన్న రకాలు వినియోగించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలని ఆదేశించారు. శాస్త్రవేత్త శ్రీనివాసన్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వేసే సందర్భంలో నేలలో భౌతిక పరిస్థితి, నీటి సరఫరా, పంట అవశేషాల నిర్వహణ తప్పనిసరి అన్నారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి బుధవారం బుధవారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. -
కంటి తుడుపు సాయం సరికాదు
కపిలేశ్వరపురం (మండపేట): రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.15 లక్షలు మాత్రమే ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్యలా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆ సాయాన్ని కనీసం రూ.25 లక్షలకై నా పెంచాలని డిమాండ్ చేశారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయమందించిన విషయాన్ని గుర్తు చేశారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. అనంతరం వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ తరహా ఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర సెపక్ తక్రా జట్టు కోచ్గా కానిస్టేబుల్ గౌతమ్ అమలాపురం రూరల్: గోవాలో ఈ నెల 23 నుంచి 27 వరకూ జరిగే 35వ జాతీయ స్థాయి సీనియర్ పురుష, మహిళల సెపక్ తక్రా పోటీలకు రాష్ట్ర జట్టు పురుషల కోచ్గా అమలాపురానికి చెందిన కానిస్టేబుల్ యాండ్రా గౌతమ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాతబాబు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సెపక్ తక్రా అసోసియేషన్ కార్యదర్శి ఎ.శ్రీనివాసులు నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. కార్తిక మాసంలో ప్రత్యేక బస్సులు అమలాపురం రూరల్: M>Ç¢MýS Ð]l*çÜ… çÜ…§ýl-Æý‡Â…V> AÐ]l$-Ìê-ç³#Æý‡… yìl´ù ¯]l$…_ ç³…^é-Æ>Ð]l$ „óS{™éË$, ÔèæºÇÐ]l$-ÌSMýS$ {ç³™ólÅMýS BÈtïÜ çÜÈ-Ó-çÜ$Ë$ ¯]lyìl-õ³…-§ýl$MýS$ HÆ>µr$Ï ^ólíÜ-¯]lr$t hÌêÏ {ç³gê Æý‡Ðé-×ê A«¨M>Ç G‹Ü-yîlï³ Æ>çœ$Ð]l MýS$Ð]l*ÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ {ç³^éÆý‡ ´ùçÜt-Æý‡Ï¯]l$ BÑçÙP-Ç…-^éÆý‡$. ç³…^é-Æ>Ð]l$ „óS{™éÌS ºçÜ$ÞË$ AMøt-ºÆŠ‡ 26, ¯]lÐ]l…ºÆŠ‡ 2, 9, 16 ™ól©ÌZÏ AÐ]l$-Ìê-ç³#Æý‡…ÌZ Æ>{† 8 VýS…rÌSMýS$ ºÄ¶æ$-Ë$-§ólÆý‡-™é-Ķæ$-¯é²Æý‡$. AÐ]l$-Æ>-Ð]l-†, ÁÐ]l$Ð]l-Æý‡…, ´ëÌS-MöË$Ï, {§é„>Æ>Ð]l$, ÝëÐ]l$-Æý‡Ï-Mø-rÌZ §ýlÆý‡Ø¯]l… ç³NÆý‡¢-Ƈ$$¯]l ™èlÆý‡$-Ðé™èl Ð]l$Æý‡$-çÜsìæ Æøk Æ>{† 8 VýS…r-ÌSMýS$ ^ólÆý‡$MýS$…-sê-Ķæ$-¯é²Æý‡$. ºçÜ$ÞMýS$ çÜÇç³yé ¿ýæMýS$¢Ë$ E…sôæ MøÇ¯]l {ç³§ólÔèæ… ¯]l$…_ ¯]lyýl$-ç³#-™éÐ]l$° ™ðlÍ´ëÆý‡$. Ôèæº-ÇÐ]l$ÌS ÐðlâôæÏ AĶæ$Åç³µ ¿ýæMýS$¢-ÌSMýS$ ÐéÆý‡$ MøÆý‡$MýS$¯]l² ^ør ¯]l$…_ MøÆý‡$-MýS$¯]l² „óS{™é-ÌSMýS$ ¡çÜ$-MðSâôæÏ…-§ýl$MýS$ 6 ÆøkË$, 7 ÆøkÌS r*ÆŠ‡ ´ëÅMóS-gŒæÌZÏ òܵçÙÌŒæ ºçÜ$ÞË$ CÝë¢-Ð]l$-¯é²Æý‡$. ç³…^é-Æ>-Ð]l*Ë$, Ôèæº-ÇÐ]l$ÌS ºçÜ$ÞÌS MøçÜ… 99592 25550, Çf-Æó‡Ó-çÙ¯]lÏMýS$ 99592 25576, 70138 68687, 73829 09620 ¯]l…ºÆý‡Ï¯]l$ çÜ…{ç³-¨…^é-ÌS¯é²Æý‡$.˘ Òyýl° Ð]lÆý‡Û… ˘ ఐ.పోలవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా కురుస్తూనే ఉంది. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, రాజోలులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్ల మీద నీరు చేరింది. వాయుగుండం ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో ఖరీఫ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూడొంతుల వరిచేలు ఈనిక దశలో ఉన్న విషయం తెలిసిందే. ● పేలుడు బాధితులకు రూ.25 లక్షలైనా ఇవ్వాలి ● గతంలో రూ.కోటి ఇచ్చిన జగన్ ప్రభుత్వం ● విలేకరులతో ఎమ్మెల్సీ త్రిమూర్తులు -
సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులు కీలకం
● ఘనంగా అమర వీరుల దినోత్సవం ● నివాళుర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అమలాపురం టౌన్: సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయిబత్తుల ఆనందరావు హాజరై పోలీసుల త్యాగాలను ప్రసంగించారు. తొలుత మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అమర వీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సాయుధ పోలీసులు కవాతు నిర్వహించి అమర వీరులకు వందనం చేశారు. పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి జిల్లా పోలీస్ శాఖ తరపున జ్ఞాపికలు, ఆర్థిక సహాయం అందించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ పోలీసులు తమ వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ సమాజ భద్రతకు పునరంకింతం కావాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ పోలీసుల అమర వీరుల సంస్మరణ దినం ఉద్దేశాన్ని వివరించారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ అమరులైన పోలీసులకు జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను వివరించారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికలతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు ఈ ఏడాది విధి నిర్వహణలో దేశ వ్యాప్తంగా 191 మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు అమరులయ్యారని తెలిపారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీ మోహన్, రఘువీర్, ఎస్పీ కార్యాలయ ఎస్బీ సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సీమ
● కార్తిక మాసం ప్రారంభం ● ముస్తాబైన శైవ క్షేత్రాలు, విష్ణు ఆలయాలు ● ఎక్కడ చూసినా భక్తుల సందడి ● జిల్లాలో సప్త నదీపాయల వెంబడిప్రసిద్ధి శివాలయాలు సాక్షి, అమలాపురం: సప్త గోదావరి నదీ పాయల పరవళ్లతో పుణ్యభూమిగా మారిన కోనసీమ కార్తిక శోభను సంతరించుకుంది. నదీ పాయల వెంబడి వెలసిన పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలతో ఆధ్యాత్మికత నెలకొంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలతో ఆలయాలు, అలాగే అయ్యప్ప, శివ, ఆంజనేయస్వామి మాలధారణ చేసిన భక్తులతో ఈ నెల రోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి కనిపించనుంది. శివకేశవులకు..శివ కేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసం విష్ణుమూర్తికి, కార్తిక మాసం శివ కేశవులకు ప్రీతిపాత్రమని పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే శివాలయాలకు వెళ్లే భక్తులే అధికంగా ఉంటారు. నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, మాస శివరాత్రి, కార్తిక పౌర్ణమి వంటి ముఖ్య పర్వదినాలతో పాటు ఈ మాసంలో వచ్చే నాలుగు సోమ వారాలు, రెండు ఏకాదశుల పర్వదినాలు శివ భక్తులు ఎంతో పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. కార్తిక మాసం మొదలవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు విష్ణు ఆలయాలు, ఇతర ప్రముఖ ఆలయాలను కూడా దేదీప్యమైన కాంతులతో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ ఆలయాల వివరాలు తెలుసుకుందాం. కోటిపల్లి ఛాయా సోమేశ్వరస్వామి కె.గంగవరం: గౌతమీ గోదావరి చెంతనే ఉన్న కోటిపల్లి రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వర స్వామిని దర్శిస్తే కోటి ఫలితాలు అందుతాయని భక్తుల విశ్వాసం. కోటి కన్యాదానాల ఫలం, నూరు అశ్వమేధ యాగాల ఫలం, కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం. భక్తులు పక్కనే ఉన్న గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తికంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముక్తేశ్వరుడు అయినవిల్లి: వృద్ధ గౌతమీ నదీ పాయను ఆనుకుని ఉన్న క్షణ ముక్తేశ్వరస్వామిని దర్శి స్తే తక్షణం ముక్తిని పొందుతారని భక్తుల విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయంగా ముక్తికాంత క్షణ ముక్తేశ్వరస్వామి ఆలయాన్ని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే క్షణంలో ముక్తిని ప్రసాదిస్తారని నమ్మకం. కోటిపల్లికి వచ్చే భక్తులు ముక్తేశ్వరం రేవు దాటి ఇక్కడ ఆలయానికి వస్తుంటారు. పలివెల ఉమా కొప్పేశ్వర క్షేత్రం కొత్తపేట: మండల పరిధి పలివెలలో గౌతమీ, వశిష్ట నదీ పాయల మధ్య వెలసిన ఉమా కొప్పేశ్వర స్వామి క్షేత్రం పురాణ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పూర్వం అగస్త్య మహాముని తపస్సు ఫలితంగా శివపార్వతులు ఏకపీఠంపై కొలువు తీరినట్లు స్థల పురాణంలో పేర్కొన్నారు. ఆలయంలో పరమ నిష్టాగరిష్టుడైన పూజారి ప్రాణాలు నిలిపేందుకు పరమశివుడు కొప్పును ధరించినట్లు చెబుతారు. అందుకే ఇక్కడ శివలింగానికి ముందు భాగంలో కొప్పు ఉంటుంది. ఆలయాన్ని దేవతలు నిర్మించాలని ప్రతీతి. ● శుభ ఫలితాలు కార్తిక మాసానికి సమానమైన మాసం లేదని స్కాంద పురాణం పేర్కొంది. శివ కేశవులకు ఈ మాసం ఎంతో ప్రీతికరం. శివ కేశవుల ఆలయాలను దర్శించినా, పుణ్య స్నానాలు ఆచరించినా, దీపారాధన, దీప దానం చేసినా, ఉపవాసం ఉన్నా శుభ ఫలితాలు కలుగుతాయి. – రవి శర్మ నాగాభట్ల, మురమళ్ల వీరేశ్వర స్వామి దేవస్థానం పురోహితులు కుండలేశ్వరస్వామి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి రామచంద్రపురం రూరల్ : ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా, పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఇది గౌతమీ తీరం సమీపంలో తూర్పున ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కార్తిక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారికేడ్ల నిర్మాణం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరీ నదిలో స్నానమాచరించి భీమేశ్వరస్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మాణిక్యాంబా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మురమళ్ల వీరేశ్వరస్వామి ఐ.పోలవరం: వృద్ధ గౌతమీ నదీపాయను ఆనుకుని ఉన్న ఐ.పోలవరం మండలం మురమళ్లలోని వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారికి కల్యాణం నిర్వహిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. పర్వదినాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. కార్తిక మాసంలో ఇక్కడకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కుండలేశ్వరుడు కాట్రేనికోన: మండల శివారు కుండలేశ్వరంలోని శివలింగం కుండలం (చెవి కుండలం)ఆకారంలో ఉంటుంది. సముద్రుడు (వర్ణుడికి సూర్యుడు, సముద్రుడికి వర్ణుడు) బహుమతిగా ఇచ్చిన రెండు కుండలాలను గౌతముడు.. వృద్ధ గౌతమికి బహుమతిగా అందించారు. వృద్ధ గౌతమీ నదీ తీరాన్ని ఆనుకుని ఈ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి కుండలేశ్వరుని దర్శించుకున్న వారిలో నారదుడు, మార్కండేయుడు, శంకరాచార్యులు, శ్రీనాథుడు తదితరులు ఉన్నారని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శిస్తే అనంత కుండలాల ఫలం వస్తుందని బ్రహ్మ పురాణంలో నారద మహామునికి బ్రహ్మదేవుడు చెప్పాడని నానుడి. -
పోలీస్ అమర వీరులకు నివాళి
● 31 వరకూ వారోత్సవాలు ● షెడ్యూల్ వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: పోలీస్ అమర వీరుల వారోత్సవాలను ఈ నెల 31వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయం నుంచి ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అమర వీరుల వారోత్సవాల సందర్భంగా రోజు వారీ షెడ్యూల్ను వివరించారు. దీనిలో భాగంగా తొలి రోజు మంగళవారం అమలాపురంలోని పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద సంస్మరణ దినం, నివాళులు అర్పించారు. అమర వీరుల కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ● బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ అమర వీరుల గ్రామాలకు, పట్టణాలకు పోలీసులు వెళతారు. అమర వీరులు చదివిన పాఠశాలల్లో వారి ఫొటోలు ఏర్పాటు చేస్తారు. ఏదైనా రోడ్డు, అభివృద్ధి పనులకు అమర వీరుడి పేరు పెట్టేలా సూచిస్తారు. ● ఈ నెల 24 నుంచి 27 వరకూ వివిధ విద్యా సంస్థల్లో చర్చా వేదికలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. పోలీసుల పిల్లలను జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిలిచి, వారికి పర్యావరణ పరిరక్షణలో పోలీసుల పాత్రపై చర్చా వేదికలు నిర్వహిస్తారు. ● 26న పోలీసుల త్యాగాలు, పరాక్రమాలను తెలియజేసే చిత్రాలను ప్రదర్శిస్తారు. అదే రోజు పోలీసు కథాంశాలతో సందేశాత్మక సినిమాలను థియేటర్లు, కేబుల్ టీవీల్లో ప్రదర్శిస్తారు. ● 26, 27 తేదీల్లో జిల్లా పోలీస్ కేంద్రం, పోలీస్ సబ్ డివిజన్ కేంద్రాలు, పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్లు నిర్వహిస్తారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాలు, పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ● 28న జిల్లా వ్యాప్తంగా పోలీసుల వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. రక్తదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. 29న పోలీస్ త్యాగాలపై సెమినార్లు, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ● 30న పోలీసు అమర వీరుల కుటుంబాల్లో ప్రత్యేక సాధకులకు సన్మానాలు చేస్తారు. 31న సమైక్యత దినాన్ని పాటిస్తారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు యూనిట్ రన్, కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహిస్తారు. -
విద్యా ప్రగతిలో కీలక ముందడుగు
● కలెక్టర్ మహేష్ కుమార్ ● టెన్త్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ల విడుదల అమలాపురం రూరల్: విద్యా అభివృద్ధి దిశలో మరో కీలక ముందడుగు పడిందని కలెక్టర్ ఆర్. మహేష్కుమార్ అన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్లను కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలోని విద్యా ప్రమాణాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తాయని అన్నారు. విద్యార్థుల విద్యా ప్రగతికి ఈ ప్రణాళిక మరింత బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. డీఈవో షేక్ సలీం బాషా మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో బోధన, పునశ్చరణ, మాక్ టెస్టులు, పాఠ్య ప్రగతి విశ్లేషణ, సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన అంశాలు సమగ్రంగా పొందుపర్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ సెక్రటరీ బి.హనుమంతరావు, సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ పాల్గొన్నారు. ● పీఎం ఆదర్శ గ్రామ యోజన పథకంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో అవసరం లేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు మళ్లించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై డీఎల్డీఓలు, ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. 40 శాతం పైబడి ఎస్సీలు ఉన్న గ్రామాలలో సామాజిక ఆర్థిక మానవాభివృద్ధికి ఈ పథకం కీలక భూమిక పోషిస్తుందన్నారు. ● ధవళేశ్వరం వద్ద మంజూరైన వాటర్ గ్రిడ్ పథకం పైపులైన్ నిర్మాణం వల్ల కలిగే డ్యామేజీలకు ఇంజినీర్లు 15 రోజులలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనాలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా డ్యామేజీలను గుర్తించడం వల్ల ఆయా పనుల నిర్వహణకు నిధులు కేటాయింపునకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. -
ఫారెస్ట్ రిజర్వ్గా మధ్యలంక
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలోని మధ్యలంకను గ్రామ పంచాయతీ అనుమతితో ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంగా ప్రకటిస్తామని జిల్లా ఫారెస్టు అధికారి ఎంవీ ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం బోటులో సిబ్బందితో వెళ్లి మధ్యలంకలో నివాసం ఉంటున్న పక్షులను పరిశీలించారు. ఆగ్నేయాసియా నుంచి వలస వచ్చిన ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులు గత మూడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. వలస వచ్చిన పక్షులు నత్తలను ఆహారంగా తింటాయన్నారు. మధ్యలంకలో సుమారుగా 10 వేల వరకు పక్షులు ఉంటాయని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం ఆ ప్రాంతాన్ని రిజర్వు ప్రాంతంగా ప్రకటించేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. -
కాకినాడ జిల్లా: దీపావళీ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట బ్రౌన్ పేటలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద బాణాసంచా కాలుస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టారు. బాణాసంచా కాల్పులను చూసేందుకు వచ్చిన అక్షయ్ కుమార్ గాయపడ్డాడు.ఆ యువకుడిని సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సతీష్ కుమార్.. అక్షయ్ కుమార్ మెడపై లాఠీతో కొట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద దళిత సంఘాలు అందోళన చేపట్టాయి. పోలీసు వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకున్నారు. -
కార్తికం.. భక్త్యుత్సవం
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవీ ఏర్పాట్లుకార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు. ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి. ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్ ద్వారా పంపిస్తారు. ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు. ఫ విద్యుత్ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు. ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫార్మాస్యూటికల్స్ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. -
ప్రజారోగ్యాన్ని పట్టించుకోని కూటమి సర్కారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి అంబాజీపేట: ప్రజారోగ్యాన్ని కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అంబాజీపేటలో ఫుడ్ పాయిజన్కు గురైన 13 మంది బాధితులను ఆదివారం జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అటు నాయకులు, ఇటు అధికారులకు ప్రజారోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. ఇటీవల రాయవరంలో బాణసంచా పేలుడు, అమలాపురం, అంబాజీపేటలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాడేరులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నీటి కాలుష్యం తదితర ఘటనలు వెలుగు చూశాయన్నారు. నిబంధనలకు అనుగుణంగా అధికారులు హోటళ్లను, ఇతర వ్యాపార సంస్థలను తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఇందుకు ప్రధానంగా మంత్రులకు వారి శాఖలపై సరైన అవగాహన, పట్టు లేకపోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ బాధితులంతా పేదలు కావడం, కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో కార్పొరేట్ వైద్యానికి దూరమయ్యారన్నారు. ఇలాంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగకుండా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ముందుగా దాడులు నిర్వహించి, వ్యాపారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. నాణయతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకుడు పీకే రావు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి హరి, ఎంపీటీసీ మట్టా పార్వతి, కొర్లపాటి కోటబాబు, కుసుమే శ్రీను, గోసంగి కుమారస్వామి, ఉందుర్తి నాగబాబు, మట్టా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పేలని పటాస్..
సాక్షి, అమలాపురం: ఒకవైపు పెరిగిన బాణసంచా ధరలు.. మరోవైపు రాయవరం ఘటనతో బాణసంచా దుకాణాలపై పెరిగిన నిఘా.. ఇంకోవైపు అనుమతుల పేరుతో అడ్డుగోలు దోపిడీకి తెరదీసిన వివిధ శాఖలు.. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో దీపావళి టపాస్ పేలడం లేదు. పండగ వచ్చినా సందడి కానరావడం లేదు. జనం వద్ద కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు, పెరిగిన ధరలు కావచ్చు.. ఏదేమైనా బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో దీపావళి సందడి కనిపించడం లేదు. ఖరీఫ్ సాగు ఉత్సాహంగా లేదు. ఆక్వా, పౌల్ట్రీ ఆశాజనకంగా లేదు. గోదావరి వరదలతో ఉద్యాన సాగు లాభసాటిగా లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తి కానరావడం లేదు. ఈ ప్రభావం పండగలపై పడింది. దీపావళిపై ఇది స్పష్టంగా కనబడుతోంది. పండగ చేసుకునే ఉత్సాహం జనంలో బాగా తగ్గింది. దీనికితోడు టపాసుల ధరల మోత మోగుతుంది. గత ఏడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం మేర పెరగడంతో వినియోగదారులను బేజారెత్తిపోతున్నారు. ముడి సరకుల ధర పెరగడం, స్థానికంగా తయారీ తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. బొగ్గు, గంధకం, సూరేకారం, బేరియం, పొటాష్, నైట్రేట్ వంటి ముడి సరకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల బాణసంచా ఆకాశాన్నంటడంతో అధికంగా టపాసులు కొనేందుకు వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. వర్షం కారణంగా వెలవెలబోతున్న అమలాపురం బాలయోగి స్టేడియంలో బాణసంచా దుకాణాలు ఆంక్షలు.. లంచాలుబాణసంచా దుకాణదారులకు ఈ ఏడాది కలిసి రాలేదు. జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు 22 మండలాల్లో 18 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, 15 హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. 455 తాత్కాలిక దుకాణాలకు అనుమతి మంజూరు చేశారు. స్థానిక వ్యాపారులు పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని కొత్తపేట, జిల్లాను ఆనుకుని ఉన్న యానాం నుంచి పెద్ద ఎత్తున బాణసంచా కొనుగోలు చేసి నిల్వ చేశారు. దీనితోపాటు తమిళనాడులోని శివకాశి వంటి ప్రాంతాల నుంచి బాణసంచా తెచ్చుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మకాలు మొదలు కాగా, ఈ రెండు రోజులు కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనా. ఈ నెల ఆరంభంలోనే బాణసంచా వ్యాపారులకు ఎదురు దెబ్బలు తగిలాయి. రాయవరంలో జరిగిన పెను విస్ఫోటంలో పది మంది మృత్యువాత పడ్డారు. అంతకు ముందు అయినవిల్లి మండలం విలసలో నిల్వ ఉంచిన బాణసంచా పేలి భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటనలు వ్యాపారుల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. దీనితో అధికారులు నిల్వల తనిఖీ పేరుతో గత ఏడాది అమ్మకాలు చేయగా మిగిలిపోయిన బాణసంచాను స్వాఽధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో నిల్వ పేరుతో పోలీస్, రెవెన్యూ పెద్ద ఎత్తున సొమ్ములు కూడా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనితో తాత్కాలికంగా వ్యాపారాలు చేసుకునే రిటైల్ వ్యాపారులు ముందుగా కొనుగోలు చేయలేకపోయారు. ఇది కూడా వ్యాపారం తగ్గడానికి ఒక కారణమైంది. దీనికితోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఆదివారం తెల్లవారు జాము నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం కొంత తెరపి ఇవ్వడంతో కాస్త వ్యాపారం సాగింది. మరో నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ధరలు ఇలా.. (రూ.లలో): బాణసంచా రకం గతేడాది ఈ ఏడాది (సుమారు) అగ్గిపెట్టెలు (10 బాకు్ుస్ల) 550 750 మతాబులు (12) 96 120 కాకర పువ్వొత్తులు 600 750 (10 బాక్సు చిన్నవి) విష్ణుచక్రాలు (10) 100 180 చిచ్చుబుడ్లు (డజను) 180 260 చిచ్చుబుడ్లు 240 360 (డిస్కో బుడ్డి 12) తారాజువ్వలు (100) 250 350 భూ చక్రాలు (10) 100 180 టపాకాయలు (25) 25 40 పేలుడు జువ్వ (100) 1,000 1,600 డిస్కో చిచ్చుబుడ్లు (12) 260 380 ఫ జిల్లాలో బాణసంచా ధరల మోత ఫ 20 నుంచి 40 శాతం వరకూ పెరుగుదల ఫ పండగ ముందే దెబ్బతీసిన ‘రాయవరం’ ఘటన ఫ దుకాణాల అనుమతులకు రూ.వేలల్లో లంచాలు వసూళ్ల పర్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కీలక శాఖలకు కాసుల పంట పండిస్తోంది. దుకాణాల ఏర్పాటుకు చెల్లించే ఫీజు కాకుండా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల ఇలా అన్ని శాఖలకు కలిపి దుకాణానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వసూలు చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మామూళ్ల సొమ్ములు రెట్టింపయ్యాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. సొమ్ము ఇవ్వకుంటే ఏదో వంకతో దుకాణాలకు అనుమతులు మంజూరు చేయకపోవడంతో అధికారులు అడిగినంతా ఇస్తున్నారు. ఇటీవల అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో పట్టుబడిన సుమారు రూ.5.80 లక్షలు బాణసంచా దుకాణాల అనుమతుల కోసం వసూలు చేసిన సొమ్ములేననే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
జిల్లాలో వర్షాలు
ఐ.పోలవరం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా నాలుగు రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ అడపాదడపా వాన పడుతూనే ఉంది. అత్యధికంగా కపిలేశ్వరపురం 29.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా 2.2 మిల్లీమీటర్లు పడింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. కపిలేశ్వరపురం 29.6, కె.గంగవరం 28.8, సఖినేటిపల్లి 26.8, అయినవిల్లి 25.6, రావులపాలెం 19.2, ఆత్రేయపురం 18.8, ఆలమూరు 16.2, ముమ్మిడివరం 14.2, అమలాపురం 12.8, ఐ.పోలవరం 10.8, రామచంద్రపురం 9.2, పి.గన్నవరం 9.2, మండపేట 7.4, రాజోలు 7, మలికిపురం 6.6, ఉప్పలగుప్తం 5.8, కొత్తపేట 5.4, కాట్రేనికోన 5, రాయవరం 3.2, అల్లవరం 2,8, మామిడికుదురు 2.2 మిల్లీమీటర్ల చొప్పున వాన కురిసింది. -
అనుమతులు తప్పనిసరి
బాణసంచా తయారీ, హోల్సేల్, రిటైల్ విక్రయదారులు కచ్చితంగా నిర్దేశిత అనుమతులు పొందాలి. అక్రమంగా మందుగుండు సామగ్రి కలిగి ఉన్నా, అమ్మకాలు చేపట్టినా చర్యలు తప్పవు. సమస్యలు తలెత్తితే తక్షణమే పోలీసు, సమీపంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలి. –పి.శ్రీకర్, ఆర్డీఓ, కొత్తపేట చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల మేర మాత్రమే క్రాకర్స్ విక్రయాలు చేపట్టాలి. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి. –సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట వెంటనే సమాచారం అందించాలి దీపావళి బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పూరిళ్లు, గడ్డివామిలు ఉండేచోట వాటిని నీటితో తడపడం, నీటిని సమీపంలో ఉంచుకోవడం మేలు. అలాగే బాణసంచా అమ్మేవారు కూడా అగ్నిమాపక నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం జరిగితే తక్షణమే 100, 101కు లేదా సమీపంలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. –ఎన్.పార్థసారధి, జిల్లా అగ్నిమాపక అధికారి, అమలాపురం -
తప్పాసులు జాగ్రత్త
ఫ కాల్చేటప్పుడు అప్రమత్తత అవసరం ఫ పిల్లలను ఓ కంట కనిపెట్టాలి ఫ ఈ నెల 20న దీపావళి పర్వదినం కొత్తపేట: మతాబుల మమతలు పూయ.. చిచ్చుబుడ్లు కాంతులనీయ.. తారాజువ్వలు గాలిలో ఎగరేయ.. వెన్నముద్దలు వెలుగులనీయ.. అందాల తారలు వాకిట్లో వాలినట్లు టపాసులతో సందడి చేయ.. వెలుగుల పండగను ఆనందాల రవళిలా జరుపుకొందాం. ఈ నెల 20న దీపావళి సందర్భంగా టపాసుల మోతతో ఊరూవాడా దద్దరిల్లనుంది. అయితే వాటిని కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి వారే గ్రహించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి రోజున పాటించాల్సిన జాగ్రత్తలు కొత్త కాకపోయినా మరోసారి గుర్తు చేసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. టపాసులు కాల్చే చిన్నారులను దగ్గరుండి చూసుకోవాలని, వారి విషయంలో తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ బాణసంచా తయారీలో యాజమాన్యం, సిబ్బంది విశ్రమించకుండా పనిలో నిమగ్నమవుతారు. చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఏటా జిల్లాలో ఒకటో, రెండో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ ఏడాది తాజాగా రాయవరంలో భారీ విస్ఫోటం సంభవించి పది మంది, అయినవిల్లి మండలం విలసలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటనలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇకపై ఏ చిన్న ప్రమాదం జరగకుండా దీపావళిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. పండుగ రోజున ఇలా చేద్దాం.. ఫ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివామిలు, పూరి గుడిసెలు ఉండే ప్రదేశాల్లో రాకెట్లు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు వంటి టపాసులు కాల్చరాదు. ఫ టపాసుల పనితీరు, వెలిగించాల్సిన విధానం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఫ పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే క్రాకర్స్ కాల్చాలి. ఫ ఇరుకై న ప్రదేశాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట టపాసులు కాల్చరాదు. ఫ బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. జిల్లాలో బాణసంచా షాపులు తయారీ కేంద్రాలు 18 హోల్సేల్ షాపులు 15 రిటైల్ షాపులు సుమారు 455 (తాత్కాలిక లైసెన్స్ షాపులు) అగ్నిమాపక కేంద్రాల ఫోన్, ఎస్ఎఫ్ఓల ఫోన్ నంబర్లు అమలాపురం–9963727665– 8856 231101 కొత్తపేట – 9963728051 – 08855 243299 మండపేట – 9963727741–08855 232101 రామచంద్రపురం–9440149394–08857 242401 రాజోలు– 9603727995 – 08862 221101 ముమ్మిడివరం–7989956542–08856271101 పర్యావరణాన్ని పరిరక్షించేలా.. దీపావళి రోజున పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అన్నివర్గాల ప్రజలు చైతన్యవంతులు కావాలి. క్రాకర్స్ ఎంత తక్కువ వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. దీపావళి అంటేనే వెలుగుల పండగ. అందుకే ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకుని పండగ జరుపుకోవాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. వ్యాపారులూ అప్రమత్తత అవసరం జనసంచారం లేని, ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రమాదాలు జరగకుండా తగిన అగ్ని ప్రమాద నియంత్రణ సామగ్రి ఉంచుకోవాలి. బాణసంచా అమ్మే చోట ఇసుక, నీరు, కార్బన్ డై ఆకై ్సడ్ను అందుబాటులో ఉంచాలి. దుకాణాల వద్ద పొగ, మద్యం తాగరాదు. ప్రతి దుకాణానికి మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే విక్రయ కేంద్రాల వద్ద విద్యుత్ వైరింగ్ సరిగ్గా చూసుకోవాలి. ప్రతి షాపు వద్ద క్రాకర్స్ ధరల పట్టిక, అగ్నిమాపక కార్యాలయం ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి. -
ఫుడ్ పాయిజన్ మూలాలు తెలుసుకుంటాం
డీఎం హెచ్ఓ దుర్గారావు దొర అంబాజీపేట: అంబాజీపేటలో ఫుడ్ పాయిజిన్ జరిగి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.దుర్గారావు దొర శనివారం ఉదయం పరామర్శించి బాధితులకు మనోధైర్యం కల్పించారు. ఈ నెల 15వ తేదీన మాచవరానికి చెందిన 22 మంది స్థానిక హొటల్ నుంచి తీసుకువచ్చిన టిఫిన్ తిని అస్వస్థతతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో 18 మంది అంబాజీపేట, మరో నలుగురు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలు పరిశీలిస్తున్నామని, ఇప్పటికే నమూనాలు సేకరించామని, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైద్యులకు, ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశించారు. పరామర్శించిన వారిలో తహసీల్దార్ బి.చినబాబు, డిప్యూటీ ఎంపీడీఓ కె.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
తండ్రిని సాగనంపి.. తనయుడూ ఆ వెనకే..
● అంతిమ సంస్కారం చేసివచ్చి కుప్పకూలిన తనయుడు ● తండ్రి మరణం జీర్ణించుకోలేక మృతి ప్రత్తిపాడు రూరల్: తండ్రి తహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తనయుడు అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని ఉత్తరకంచిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కందా నరసింహమూర్తి (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు కందా రాజా (45) తండ్రికి దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజా ఆరోగ్యం సహకరించకపోవడానికి తోడు, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు రాజాను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్కు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆయన అతంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కన్నీరు పెట్టించింది. రాజా పంచాయతీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. రాజా కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. -
కాకినాడలో గోల్డ్కప్ హాకీ ఇండియా పోటీలు
● ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ● ఘనంగా ఫెన్సింగ్ పోటీల ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో మొదటి సారిగా గోల్డ్కప్ హాకీ ఇండియా చాంపియన్షిప్ 2026 పోటీలు జరుగుతాయని క్లబ్ ఫౌండర్ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు పోటీల బ్రోచర్ను శనివారం కలెక్టర్ షణ్మోహన్కు అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో 12 పురుషుల జట్లు, ఆరు మహిళా జట్లు పాల్గొంటాయన్నారు. హాకీ ఇండియా పోటీల బ్రోచర్ను కలెక్టర్కు అందజేస్తున్న క్లబ్ సభ్యులు క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ రూరల్ మండలం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో అండర్–14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్స్ విభాగంలో నిర్వహించే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల పల్లి రామస్వామి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సుగుణారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి కృష్ణమోహన్, మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బొహ్రా పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● అతడి భార్యకు తీవ్రగాయాలు ● విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వెళ్తుండగా ఘటన ప్రత్తిపాడు: మండలం ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయ పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దిపుట్టి గ్రామానికి చెందిన పిట్టా వసంతకుమార్ (32) విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామం వెళ్లేందుకు తన భార్య సంధ్యతో కలిసి బైక్పై బయలుదేరాడు. అరకు లోయ వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకువెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకై స్థానిక సీహెచ్సీ తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 1,800 స్వామివారి వ్రతాలు జరిగాయి. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణలు చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఇలాఉండగా, ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోఛ్చాటన మధ్య మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతిలో పోటెత్తిన భక్తులు పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు పది వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,47,150, అన్నదాన విరాళాలుగా రూ.54,035, కేశ ఖండన ద్వారా రూ.4,240, తులాభారం ద్వారా రూ.50, ప్రసాద విక్రయం ద్వారా రూ.16,845, స్వామివారికి కానుకగా రూ.101తో మొత్తం రూ.2,22,421 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,500 మంది భక్తులు మధ్యాహ్నం అన్నప్రసాదం స్వీకరించారు, -
గతం కంటే తగ్గింది
గతంలో దీపావళి సీజన్లో 20 వేల వరకు ప్రమిదలను విక్రయించేవారు. సంప్రదాయ ప్రమిదలపై నేటి తరం ఆసక్తి చూపడం లేదు. నేడు ఐదు వేల ప్రమిదలు కూడా విక్రయించడం లేదు. హోల్సేల్గా రూ.1.50 నుంచి రూ.2కు విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో ఇది రూ.15 నుంచి రూ.20 చేసి విక్రయిస్తున్నారు. తయారీదారులకు ఈ మొత్తం గిట్టుబాటు కావడం లేదు. – కాపవరపు మల్లేశ్వరరావు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం వైరెటీ ప్రమిదలకు ఆదరణ దీపావళి పండుగ సందర్భంగా వైరెటీ ప్రమిదల వ్యాపారం చేస్తున్నా. కోనసీమలో కుమ్మరి తయారుచేసే ప్రమిదల కంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమిదలకు ఆదరణ పెరిగింది. అమలాపురంలో హోల్సేల్ వ్యాపారి వద్ద తెచ్చి వీటిని అమ్ముతున్నాం. ఎక్కువమంది వీటినే కొంటున్నారు. డజను ప్రమిదలు రూ. 30 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నాం.– చింతలపూడి ప్రశాంత్ కుమార్, ఫ్యాన్సీ వ్యాపారి, అమలాపురం -
‘చెకుముకి’ పరీక్షలు ప్రారంభం
ముమ్మిడివరం: విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి అవగాహన పెంపొందేలా జన విజ్ఞాన వేదిక ఏటా జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందని జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బీర హనుమంతరావు పేర్కొన్నారు. ముమ్మిడివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం చెకుముకి పాఠశాల స్థాయి పరీక్షలను ఆయనతో పాటు జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు జనిపెల్ల సత్యనారాయణ, కన్వీనర్ ఎన్.అబ్బులు ప్రారంభించారు. హనుమంతరావు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన శాస్త్ర విజ్ఞాన దృక్పథాన్ని ప్రజల్లోనూ, విద్యార్థులలోనూ పెంపొందించడానికి ఈ వేదిక కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 26 యూనిట్ల నుంచి 372 పాఠశాలల్లో మొత్తం 26,850 మంది 8, 9, 10 తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారన్నారు. మండల స్థాయిలో నవంబరు 1 నుంచి, నవంబరు 23నుంచి జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం రూరల్: ఆగ్నేయ బంగాళాఖాతం చుట్టూ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో మంగళవారం నుంచి చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు దక్షిణ అరేబియా సముద్రం మధ్య భాగంలో, బుధవారం నైరుతి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం అల్లకల్లోలంగా దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోకి మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల వద్దని సూచించారు. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణించి 48 గంటల్లో దక్షిణ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ–మధ్య బంగాళాఖాతం మధ్య వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా వైకుంఠరావు అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు కొత్తగా డీఎస్వోగా వైకుంఠరావు రుద్ర బాధ్యతలు చేపట్టారు. ఆయన కలెక్టర్ను శనివారం మర్యాదపూర్వరంగా కలిశారు. ఇటీవల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా వైకుంఠరావు పదోన్నతి పొందారు. వైకుంఠరావు 2009లో కాకినాడలో బాస్కెట్బాల్ కోచ్గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన అనేక మంది ఆటగాళ్లను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. -
విజా్ఞన కౌశలం
● కౌశల్ క్విజ్ పోటీలకు వేళాయె ● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకం ● సైన్స్పై ఆసక్తిని పెంచడమే లక్ష్యం రాయవరం: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూంటాయి. వాటిలో భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ పోటీలు ఒకటి. వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. ఇటీవల కౌశల్ సైన్స్ 2025 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థుల వివరాలు పంపించేందుకు ఈ నెల 24 తేదీని గడువుగా నిర్ణయించారు. వీరందరూ అర్హులే.. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ కౌశల్ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే. సదరు విద్యార్థులు ప్రత్యేకంగా క్విజ్ టీమ్గా ఏర్పాటు కావాలి. తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ సబ్జెక్టుల టీచర్ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలి. తద్వారా ఈ పోటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 8, 9, 10 తరగతుల్లోని సైన్స్, గణితం సబ్జెక్టులపై కౌశల్ క్విజ్ పోటీ ఉంటుంది. అదే విధంగా ‘విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి’ అనే అంశంపై సేకరించిన మెటీరియల్ను విద్యార్థులు అధ్యయనం చేయాలి. బహుమతులు విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.7,500, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4,500, కన్సొలేషన్ బహుమతుల కింద రూ.3 వేలు అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీకి పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో కన్సొలేషన్ బహుమతులుగా రూ.6 వేల వంతున ఎంపిక చేసిన కొందరికి ప్రదానం చేస్తారు. ఈ నెల 24 తుది గడువు ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను పాఠశాలల కో ఆర్డినేటర్లు ఈ నెల 24వ తేదీ లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏపీ.ఓఆర్జీలో రిజిస్ట్రేషన్ చేయాలి. 8వ తరగతి విద్యార్థులకు ‘వికసిత భారత్ కొరకు సుస్థిర మరియు హరిత ఇంధన వనరులు’, 9వ తరగతి విద్యార్థులకు ‘సత్యేంద్రనాఽథ్ బోస్ జీవితం మరియు ఆయన చేసిన కృషి’ థీమ్తో పోస్టర్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని 8, 9 తరగతుల నుంచి ఇద్దరు వంతున ఎంపిక చేసిన విద్యార్థులతో పోస్టర్ కాంపిటీషన్ జరుగుతుంది. పరీక్ష షెడ్యూల్ కౌశల్ సైన్స్ క్విజ్ ప్రాథమిక స్థాయి ఆన్లైన్ పరీక్షను నవంబర్ 1న 8వ తరగతికి, 3న తొమ్మిదో తరగతికి, 4న 10వ తరగతికి నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27న, 10వ తరగతికి 28న జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల తేదీని తర్వాత ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కో ఆర్డినేటర్ ఎంఎన్ సూర్యనారాయణ 99086 67536 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. క్విజ్ టీమ్ కోసం పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల నుంచి కనీసం ఒక్కరు, గరిష్టంగా 10 మంది వరకు ఈ ప్రాథమిక పరీక్ష రాయవచ్చు. మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్, డెస్క్టాప్ ద్వారా రాయవచ్చు. తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థి పాఠశాల క్విజ్ టీమ్ సభ్యుడిగా ఎంపిక చేయబడతాడు. ఈ మూడు తరగతుల విద్యార్థుల మార్కులను కలిపి పాఠశాల మార్కు నిర్ణయిస్తారు. తరగతి వారీగా పరీక్ష నిర్వహిస్తారు. ఇలా జిల్లాలో మొదటి 36 స్థానాల్లో ఉన్న పాఠశాలలు జిల్లా స్థాయి ఆఫ్లైన్ క్విజ్కు అర్హత పొందుతాయి.పోటీతత్వం పెరుగుతుంది కౌశల్ సైన్స్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే విధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి మరింత పెరుగుతుంది. వారిలో పోటీతత్వం అలవడుతుంది. – షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చేలా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కౌశల్ క్విజ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని కోసం విద్యార్థులను సిద్ధం చేయాలి. – జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
రోడ్డుపై కూలిన భారీ వృక్షం
స్తంభించిన ట్రాఫిక్ కరప: కాకినాడ – రామచంద్రపురం ప్రధాన రహదారిలో కరప మండలం వాకాడ బస్టాప్ సమీపంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షం రోడ్డుపై నేలకూలింది. దీంతో ట్రాఫిక్ మూడు గంటల పాటు స్తంభించింది. వాతావరణం మారి, ఈదురు గాలులు వీస్తుండటంతో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ వృక్షం కూలిపోయి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కాకినాడ నగరానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారితో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరప పోలీసులు, అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన వృక్షాన్ని మూడు గంటల్లో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. -
నాణ్యమైన బోధనే లక్ష్యం కావాలి
అమలాపురం రూరల్: నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా కొత్త ఉపాధ్యాయులు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో కొత్త ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి పరిచయం కార్యక్రమం డీఈఓ సలీం బాషా అధ్యక్షతన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాను విద్యా రంగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అంతా కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచన జ్ఞానాన్ని అలవర్చాలన్నారు. స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ టూల్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను వినియోగిస్తూ మెరికల్లాంటి భావిభారత పౌరులను తీర్చిదిద్దాలన్నారు. ఆర్డీఓ కె.మాధవి మాట్లాడుతూ తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల విద్యాభ్యాస పురోగతిపై పరస్పర చర్చలు సాగించాలన్నారు. సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు స్ఫూర్తి కలిగించే మార్గదర్శిగా ఉండాలన్నారు. టెక్నాలజీ పట్ల అవగాహన, దానిని సమర్థంగా వినియోగించే సామర్థ్యం బోధకులకు అవసరమన్నారు సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి జి.సూర్యప్రకాశం పాల్గొన్నారు. కడలిలోకి 2.08 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 2,08,519 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు డెల్టాకు 2,700, మధ్య డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలంలో 18, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగుల నీటిమట్టం ఉంది. -
గళమెత్తిన కలం వీరులు
● ‘సాక్షి’పై వేధింపులు అప్రజాస్వామికం ● జిల్లాలో పాత్రికేయుల నిరసనలు ● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు ● మద్దతు తెలిపిన ఏపీయూడబ్ల్యూజే, ప్రజా సంఘాలు సాక్షి, అమలాపురం: పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటారా.. అక్రమ కేసులతో భయపెట్టాలనుకుంటారా.. ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కాలనుకుంటారా.. ఇలాంటి కుట్ర రాజకీయాలు వీడండంటూ జిల్లా వ్యాప్తంగా కలం వీరులు గళమెత్తారు. రాజ్యాంగ హక్కులు... పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ ‘సాక్షి’ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు తూర్పారబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న నకిలీ మద్యం వ్యవహారంలో నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న ‘సాక్షి’పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శలు, ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతులు అందజేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితం కావడం కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. పత్రికా స్వేచ్ఛ, భావన ప్రకటన హక్కును కాలరాస్తూ ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా నెల్లూరు ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు రోజుల తరబడి రావడం, సోర్స్ చెప్పాలని ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన కూటమి తీరును నిరసిస్తూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వివిధ పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. ‘సాక్షి’ కార్యాలయంలో సోదాలను ప్రజా సంఘాలు తప్పబట్టాయి. మీడియాపై దాడులు ఆపాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై నిర్బంధాలను అరికట్టాలని నినాదాలు చేశాయి. ‘సాక్షి’పై దాడులు అప్రజాస్వామికమని, ఎడిటర్పై కేసులు వెంటనే ఎత్తివేయాలని అన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి డీఆర్వో కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎంఎన్వీ ప్రసాద్, సీనియర్ పాత్రికేయుడు టీకే విశ్వనాథం మాట్లాడుతూ పత్రికలలో ప్రతికూల వార్తలు వస్తే ప్రభుత్వం విచారణ జరిపి దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలే కానీ, ఆ వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ‘సాక్షి’ పత్రిక, ఎడిటర్పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు, ‘సాక్షి’ స్టాఫ్ రిపోర్టర్ నిమ్మకాయల సతీష్బాబు, ఐజేసీ సభ్యుడు పరసా సుబ్బారావు, అరిగెల రుద్ర శ్రీనివాస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉండ్రు కృష్ణప్రసాద్, దొమ్మేటి వెంకట్, మాకే శ్రీనివాసరావు, పొట్టుపోతు నాగు తదితరులు పాల్గొన్నారు. ● కొత్తపేట ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాల వద్ద పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ‘సాక్షి’పై దాడులు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఆర్డీఓ పి.శ్రీకర్కు, డీఎస్పీ కార్యాలయంలో ఎస్ఐ జి.సురేంద్రలకు వినతిపత్రాలు అందజేశారు. సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి, కె.ఆదినారాయణ రెడ్డి, అడపా ప్రసాద్, రాయుడు జయదేవ్, బొరుసు జానకి రామయ్య, బొరుసు సాయి రంగనాథ్బాబు, శ్రీకాకుళపు బాబీ తదితరులు పాల్గొన్నారు. ● మామిడికుదురులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పి.గన్నవరం నియోజవర్గానికి చెందిన విలేకరులు నిరసన తెలిపారు. అనంతరం ‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ తహసీల్దార్ పి.సునీల్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టపర్తి శ్రీనివాస్, మామిడికుదురు మండల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎన్ఎస్డీ ప్రసాద్, యేడిద బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ● మండపేట నియోజకవర్గం పరిధి కపిలేశ్వరపురానికి చెందిన పాత్రికేయులు ‘సాక్షి’పై పోలీసుల దా డులను నిరసించారు. ఎంపీడీఓ భానూజీకి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాలకు చెందిన పి.లెనిన్బాబు, చిట్టి కుమార్, శేఖర్, ఎంపీటీసీ సభ్యులు జిత్తుగ వెంకటలక్ష్మి, వార్డు సభ్యుడు బొక్కా రాంబాబు, దళిత సంఘాల నాయకుడు నక్కా సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ● ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జి.ధనుంజయరావు, పోలిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ● రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహసీల్దార్ సీహెచ్ భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సభ్యుడు సురేంద్ర, జిల్లా సభ్యుడు చింతా మధు, సీనియర్ పాత్రికేయుడు వీవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు మీడియా గొంతు నొక్కేలా పోలీసుల ద్వారా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం, కార్యాలయంలో సోదాలు చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఇటువంటి చర్యలు విడనాడాలి. – కె.వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు పత్రికా స్వేచ్ఛను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీడియాపై పోలీసు దాడులను తక్షణం నిలిపివేయాలి. నాలుగైదు రోజులుగా ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు వెళ్లడం పద్ధతి కాదు. – పొలమూరి మోహన్బాబు, బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి, అమలాపురం -
గోవిందా.. హరి గోవిందా
ఫ కొనసాగిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ఫ కల్కి అలంకరణలో శ్రీవారు విహారం కొత్తపేట: బ్రహ్మోత్సవ వేళ బ్రహ్మాండ నాయకుడిని దర్శించిన వారిది కదా భాగ్యము.. ఆనందంతో దేవదేవుని కనులారా కాంచిన వారిది కదా జన్మ ధన్యము.. వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం శ్రీవారు కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజనుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన, ప్రధాన హోమాలు, శోభాయాత్రగా ‘గోదావరి నదీ జల సంగ్రహణం’ మహాస్నపనం, దిగ్దేవతా బలిహరణ, లక్ష కుంకుమార్చన, స్వామివారికి ఉభయ దేవేరులతో ‘కల్పవృక్ష వాహన సేవ’, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు స్వామివారిని ఆ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగం చివరిలో ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన విష్ణువు చివరి అవతారం కల్కి. గుర్రంపై స్వారీ చేసే అలంకరణ. బ్రహ్మోత్సవాల్లో ఇది ముఖ్యమైన ఘట్టం. కలియుగంలో దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించడం ఈ అవతారం ముఖ్య ఉద్దేశాన్ని ఈ సేవ తెలియచేస్తుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు వాడపల్లి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజు నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం చక్రస్నానం, ధ్వజావరోహణం, మహాదాశీర్వచనం, ఏకాంతసేవ, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఫుడ్ పాయిజన్
● 20 మందికి అస్వస్థత● అంబాజీపేటలో కలకలం అంబాజీపేట: వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న కూలీలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. బుధవారం ఆ కూలీలు అంబాజీపేటలోని ఓ హోటల్ నుంచి తీసుకు వచ్చిన టిఫిన్లు తిని అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్నారు. గురువారం స్థానిక వైద్యులతో చికిత్స చేయించుకున్నా వారికి స్వస్థత చేకూరకపోవడంతో అంబాజీపేట, అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. కాగా శుక్రవారం రాత్రి అంబాజీపేటలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాచవరానికి చెందిన 12 మంది బాధితులు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో కుసుమే యమున కుమారి, అరిగెల నాగలక్ష్మి, యలమంచిలి సత్యనారాయణ, యలమంచలి తాతారావు, కుసుమ శ్రీఆకాష్, నేలపూడి విజయకుమారి, కుసుమ భవాని, సరెళ్ల నాగలక్ష్మి, యలమంచలి నాగరత్నం, కుసుమ విమలకుమారి తదితరులు ఉన్నారు. వీరే కాకుండా మరో 8 మంది అమలాపురంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై భిన్న వాదనలు ఈ ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఓ వైపు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, దీనిపై భిన్న వాదనలు వినపడుతున్నాయి. హోటల్ నుంచి తెచ్చిన టిఫిన్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని కొందరు బాధితులు ఆరోపిస్తుంటే, మరి కొంత మంది మాచవరంలో తయారు చేస్తున్న బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయివుల వల్ల ఫుడ్ పాయిజన్కు గురయ్యారని చెబుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న బాధితుల నుంచి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సైలు కె.చిరంజీవి, బి.శివకృష్ణ వివరాలు సేకరించారు. -
నారావారి సారా ఏరులై పారుతోంది
● నకిలీ మద్యంతో తాళిబొట్లు తెంచుతున్న చంద్రబాబు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం: రాష్ట్రంలో నారావారి సారా ఏరులై పారుతోందని, ఆ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గురువారం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, పాటి శివకుమార్, చెల్లుబోయిన శ్రీనివాసరావు హాజరయ్యారు. నకిలీ మద్యం బాటిళ్లు, కల్తీ మద్యంపై వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్లను వారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల తాళిబొట్లు తెంచేలా చంద్రబాబు నకిలీ మద్యం విక్రయాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో మద్యం దుకాణంలో రూ.190కు దొరికే మద్యం, బండారు వారి బెల్ట్ షాపులో రూ. 230కు విక్రయిస్తున్నారని విమర్శించారు. అలాగే నియోజకవర్గంలో యూరియా దొరకదు కానీ, నకిలీ మద్యం మాత్రం పుష్కలంగా లభ్యమవుతుందన్నారు. మద్యంలో స్థానిక కూటమి నాయకుడి అవినీతి గుర్రం పరుగెత్తుతుందని అన్నారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలసి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయన్నారు. మద్యంపై లైవ్ డిటెక్టర్ టెస్ట్కు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నారని, మరి చంద్రబాబు, లోకేష్ కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఎన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరు ఇచ్చిందో తెలియదు గాని, ప్రతి గ్రామానికి చీఫ్ లిక్కర్ మాత్రం బాగా అందిస్తుందని వైఎస్సార్ ీసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఇటువంటి పాలనపై స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు సిగ్గుపడాలని విమర్శించారు. ఎన్నికల ముందు కన్న తండ్రిలా పరిపాలిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కసాయి తండ్రిలా మారారని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, జెడ్పీటీసీ సభ్యులు గూడపాటి రమాదేవి, బోణం సాయిబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ నాయకుడు కప్పల శ్రీధర్, ఆత్రేయపురం పార్టీ మండల కన్వీనర్ ముదునూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
సత్యదీక్షలకు నేడు శ్రీకారం
అన్నవరం: ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రత్నగిరిపై ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా కార్తికానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు ప్రారంభమయ్యే సత్యదీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు తెల్లవారుజామున పంచామృతాభిషేకం చేస్తారు. అనంతరం సత్యదీక్షలు ప్రారంభమవుతాయి. స్వామి సన్నిధిలోనే అర్చకులతో మాలలు వేయించుకుని, భక్తులు ఈ దీక్షలు చేపడతారు. అలా వీలు కాకపోతే ఏదైనా దేవాలయంలో అర్చకుల ద్వారా, ఇంట్లో తల్లి ద్వారా మాల ధరించి ఈ దీక్ష చేపట్టే వీలుంది. 27 రోజుల అనంతరం నవంబర్ 13న స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు సత్యదేవుని సన్నిధిలో ఇరుముడి సమర్పించి, దీక్ష విరమణ చేయాలి. అనంతరం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామిని దర్శించడంతో దీక్ష పూర్తవుతుంది. 18 రోజులు, 9 రోజులు చేపట్టే అవకాశం కాగా, 27 రోజుల దీక్ష చేపట్టే అవకాశం లేని వారు 18 రోజులు, 9 రోజులు కూడా చేపట్టవచ్చు. అయితే దీక్ష విరమణ మాత్రం నవంబర్ 13న మాత్రమే చేయాలి. 18 రోజుల దీక్షను ఈ నెల 26న, 9 రోజుల దీక్షను నవంబర్ 4న స్వీకరించవచ్చు. నవంబర్ 12వ తేదీ రాత్రి రత్నగిరిపై సత్యదీక్ష స్వాములతో సత్యదేవుని పడిపూజ నిర్వహిస్తారు. ప్రచార లోపం ఏటా సత్యదీక్షల గురించి కనీసం 15 రోజుల ముందే సత్యరథం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేవారు. అలాగే, ఏజెన్సీలో సత్యదీక్ష చేపట్టే గిరిజన స్వాములకు దీక్షా వస్త్రాలు పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందువల్లనో కానీ సత్యదీక్షలపై పెద్దగా ప్రచారం చేయలేదు. వారం రోజులు ముందు మాత్రమే సత్యరథంతో ప్రచారం చేయించారు. దీక్షా వస్త్రాల పంపిణీ కూడా ఆలస్యంగానే ప్రారంభించారు. దీనిపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దీక్షలు చేపట్టే వారికి దేవస్థానం తగు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
హోటళ్లపై ఆకస్మిక దాడులు
అమలాపురం టౌన్: అమలాపురంలోని మాంసాహార హోటళ్లపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై మున్సిపాలిటీతో పాటు ఫుడ్సేఫ్టీ అధికారులు స్పందించారు. పట్టణంలోని ప్రధాన హోటళ్లయిన విష్ణుశ్రీ, జీకే గ్రాండ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారి వై.రామయ్య, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్ తమ సిబ్బందితో గురువారం ఆకస్మికంగా దాడులు చేశారు. విష్ణుశ్రీ హోటల్లో పారిశుధ్య నిర్వహణ బాగోలేదని రామయ్య అన్నారు. దీనిపై ఆ హోటల్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసి, రూ.5 వేల జరిమానా విధించారు. జీకే గ్రాండ్లో కొన్ని లోపాలపై ఆ హోటల్ యాజమాన్యానికి సూచనలు చేశారు. ఇటీవల పలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతోపాటు పలువురు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు అమలాపురంలోని ఓ హోటల్ పలావు ప్యాకెట్లో మండ్ర కప్ప అవశేషాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో బుధవారం ప్రచారం జరగడంతో ఈ దాడులు చేసినట్లు సమాచారం. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ వెంకటేష్, వార్డు సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు వంకాయల సతీష్, కె.ఈశ్వరరావు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సాయం చేసే చేతులేవీ..?
చితికిపోయినా..పట్టాలు ఇచ్చారు.. భూమి చూపలేదు బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఇచ్చిన పట్టాలకు నేటికీ భూమిని చూపించలేదు. అక్టోబర్ పదో తేదీ 2014లో వాకతిప్పలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది అక్కడకక్కడే మృతి చెందారు. వారిలో నా భార్య మసకపల్లి పుష్పావతి, మరదలు మసకపల్లి కుమారి ఉన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్ల భూమి ఇస్తానని బీ పట్టాలు ఇచ్చింది. ఆ భూమి చూపించాలని తహసీల్దార్ కార్యాలయం, స్పందనకు కాళ్లు అరిగేలా తిరుగుతూ వచ్చాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ పట్టాలకు సంబంధించిన భూమిని గతంలో వేరే వారికి ఇచ్చారు. వారి దగ్గర పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇస్తానన్న 50 సెంట్ల భూమిని ఇవ్వాలి. – మసకపల్లి నాగేశ్వరరావు, వాగతిప్ప సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేకుండా పోతోంది. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో సంభవించిన బాణసంచా విస్ఫోటంలో ప్రాణాలు కోల్పోయిన పది మందిలో బాణసంచా తయారీ దుకాణం యజమాని తప్ప మిగిలిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. ఈ పెను విషాదం జరిగి వారం రోజులు గడిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లడమే తప్ప తక్షణ సాయం అందించే దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎప్పుడో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అదే ఉదారత రాయవరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై లేకపోవడం ఏంటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగి అధికారులను నిలదీశాయి. ఈ దుర్ఘటనలో బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన బాణసంచా యూనిట్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మినహాయిస్తే మిగిలిన వారంతా పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వచ్చిన వారే. కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, చిట్టూరి యామిని, అనపర్తి సావరానికి చెందిన కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, కొమరిపాలెం, పెదపూడి మండలం వేండ్రకు చెందిన లింగం వెంకటకృష్ణ, ఒడిశాకు చెందిన కె.సదానందం మృతులు. యజమాని మినహా మిగిలిన వారంతా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. తమ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అగ్రాసనం వేస్తుందని గొప్పగా చెప్పుకొనే సర్కార్ కనీసం వారిని ఆదుకోవాలని ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఘటన జరిగిన రోజు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెళ్లారే తప్ప ఎటువంటి సాయం ప్రకటించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాదని సాయం కోసం ప్రశ్నిస్తే ఇచ్చే సాయం ఇవ్వరేమోననే భయం వారిని మాట్లాడనీయలేదు. వారిని పక్కనబెడితే కూటమి నేతలైన మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పలకరించి ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేసింది. అసలు సంఘటన జరిగిన రోజు వచ్చిన సందర్భంలోనే మంత్రులు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలా కాకుండా ఈ ఘటనపై సమీక్షించిన తరువాత అయినా ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జ్యుడీషియల్, ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరుగుతోంది, పరిహారం ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలయాపనపై ప్రజా సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తనంతట తానుగా మంగళవారం కేసు నమోదుచేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు కారణాలను ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. బాఽధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా అనే విషయాన్ని కూడా రెండు వారాల్లో అందించే నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన వాకతిప్ప బాణసంచా పేలుడు 2014 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. ఆ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఒక్కో కుటుంబానికి రూ.50 వేల సొంత నిధులు అందించి ఆదుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ తొలుత లక్షన్నర పరిహారం ప్రకటించింది. జగన్ వచ్చి వెళ్లాక ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలు చేసింది. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. సామర్లకోట మండలం జి. మేడపాడులో 2019 అక్టోబర్లో బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సుమారు రూ.15 లక్షల సాయం అందించింది. రంపచోడవరం మన్యం ప్రాంతంలో కచ్చులూరు వద్ద 2019లో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన సంఘటనలో 48 మంది మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించింది. అలాగే తాళ్లరేవు మండలం జి.వేమవరంలో బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. వెంటనే కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని, క్షతగాత్రులకు రూ.3 లక్షలు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విస్మయం పది మంది ప్రాణాలు పోయినా పరిహారానికి మీనమేషాలు ఎదురుతెన్నులు చూస్తున్న బాధిత కుటుంబాలు సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జగన్ హయాంలో 24 గంటల్లోనే సాయం సత్వరం పరిహారం అందించాలి రాయవరం బాణసంచా ప్రమాద మృతులకు సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రమాదం జరిగి అప్పుడే వారం రోజులు గడచిపోయాయి. ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించక పోవడం విచారకరం. బాధిత కుటుంబాలు కూడా ఆందోళనలో ఉన్నారు. తక్షణం ప్రభుత్వం పరిహారం అందించాలి. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నేడు ఉన్నత స్థాయి కమిటీ రాక రాయవరం: బాణసంచా ప్రమాద ఘటనపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం రాయవరం రానుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ బీవీ భాస్కర్ తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రానున్నట్లు తెలిసింది. వీరి వెంట జిల్లా అధికారులు ఉంటారు. ప్రమాద ఘటన తీరుతెన్నులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించే అవకాశముంది. అలాగే బాధిత కుటుంబాలతో మాట్లాడిన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన నా కుమారుడు లింగం వెంకటకృష్ణ (22) చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్లో 12న చనిపోయాడు. ప్రభుత్వం మా కుటుంబానికి పరిహారం ప్రకటించి ఆదుకోవాలి. చేతికి అందివచ్చిన కొడుకు కళ్ల ముందు చనిపోవడం చూసి, తట్టుకోలేపోతున్నాం. – లింగం రాము, వేండ్ర, పెదపూడి మండలం ప్రభుత్వం ఆదుకోవాలి నా తల్లి విజయలక్ష్మిని కోల్పోయాను. ఇంతకాలం మా కుటుంబాన్ని నెట్టుకు వచ్చింది. ఈ ప్రమాదంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. – దుర్గాదేవి, సోమేశ్వరం, రాయవరం -
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలి
అమలాపురం రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో విపాసన జ్ఞాన సాధన చేపట్టి క్రమశిక్షణ, చదువుల పట్ల ఆసక్తి పెంచుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్లో సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. మూడు నెలల విపాసన జ్ఞాన సాధన కార్యక్రమాల ఆనా పానా పురోగతిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు ధ్యానం చేయాలన్నారు. విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు జ్ఞాన ధ్యానం చేయాలన్నారు. విపాసన ఆచార్య నిపుణుడు ప్రహ్లాద మాట్లాడుతూ విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడం ద్వారా జీవితంలో మెరుగైన స్థాయికి ఎదుగుతారన్నారు. జేసీ టి.నిశాంతి, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి చాటాలి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి చాటేలా కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ మొదటి వారంలో ప్రాథమిక స్థాయి క్రీడా పోటీలను మండల స్థాయిలోనే పూర్తి చేయాలని, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ క్రీడా పోటీలను జిల్లా స్థాయిలో నవంబరు 12, 13 ,14 తేదీల్లో స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించాలని ఆదేశించారు. 6, 7, 8 తరగతులు జూనియర్స్గా, పది, ఇంటర్ తరగతులు సీనియర్స్ బ్యాచ్గా విభజించామన్నారు. అండర్– 14, 17 కేటగిరీల్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వెయిట్, పవర్ లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాశరావు, సీఎంఓ బీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సమర్థవంతంగా భూముల రీసర్వే చేపట్టండి
తాళ్లరేవు: ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీసర్వే ప్రక్రియను రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కె.సూర్యారావు తెలిపారు. గురువారం తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీలో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ భూముల రీసర్వేకు సంబంధించి మూడు రోజుల ముందు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతుల సమక్షంలో వారి సరిహద్దులను పరిశీలించి, ఎటువంటి వివాదాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా ల్యాండ్ సర్వే ఆఫీసర్ కె.శ్రీనివాస్, డీఐఓఎస్ రవిశంకర్, గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, మండల సర్వేయర్ సీహెచ్ నిరంజన్రావు, రీసర్వే డీటీ కె.వీరబాబు, డీటీ టి.సూరిబాబు, సర్పంచ్ పంపన రామకృష్ణ పాల్గొన్నారు. నేడు నూతన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం అమలాపురం రూరల్: జిల్లాలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవనంలో నిర్వహిస్తున్నట్లు డీఈఓ సలీమ్ బాషా తెలిపారు. జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ మహేష్ కుమార్ మార్గదర్శక ప్రసంగం అందిస్తారన్నారు. విద్యా రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, విద్యార్థుల అభ్యాసన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్రపై కలెక్టర్ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా స్థాయిలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సర్వశిక్ష అభియాన్ తదితర శాఖల ప్రధానాధికారులను ఆహ్వానించారు. అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు పి.గన్నవరం: జిల్లాలో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యక్తులపై ఇప్పటి వరకూ 50 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులతో పాటు వివిధ అంశాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అమలాపురం సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. 216 నేషనల్ హైవేలో భట్నవిల్లి నుంచి చించినాడ వరకూ పలు కూడళ్లలో ప్రమాదాల నియంత్రణకు హైవే అధికారులతో చర్చించి రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎస్సై బి.శివకృష్ణ ఉన్నారు. జిల్లా ఫొటోగ్రాఫర్లకు సేఫ్టీ ఐడీ అమలాపురం టౌన్: జిల్లా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వృత్తి నిపుణుల భద్రత కోసం సేఫ్టీ ఐడీ స్టిక్కర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ సేఫ్టీ ఐడీ స్టిక్కర్ క్యూఆర్ కోడ్ లింక్ను స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గురువారం ప్రారంభించారు. ఈ క్యూఆర్ కోడ్ను జిల్లాలోని ఫొటో, వీడియో గ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ క్యూఆర్ కోడ్ను ఫొటోగ్రాఫర్లు తమ వాహనం (బైక్ లేదా కారు)పై అతికించుకోవాలని జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ అన్నారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గెడ్డం సురేష్కుమార్, కార్యదర్శి దొరబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి గీత రమణ పాల్గొన్నారు. -
వచ్చే నెల 22న అమలాపురం జెడ్పీ స్కూల్ వార్షికోత్సవం
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవాన్ని వచ్చే నెల 22న పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు వెల్లడించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ గురువారం మీడియాతో మాట్లాడారు. వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకన్నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివి నేడు ఉన్నత పదవులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించామన్నారు. నవంబర్ 22న సాయంత్రం నుంచి పాఠశాల వార్షికోత్సవ వేదికపై ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావుల ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పలు సాంస్కృతి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఓ పండుగలా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరికై నా ఆహ్వానం అందకపోతే కార్యక్రమం మనదన్న భావనతో పూర్వ విద్యార్థులంతా హాజరు కావాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కోనసీమ జిల్లా: వివాహం జరిగి ఏడాది పూర్తి కాకుండానే భర్తతో పాటు అత్తింటి వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.జగన్మోహన్రావు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన గొర్లి శిరీష (23), ఏనుగుతల ప్రదీప్కుమార్కు సుమారు ఐదు నెలల కిందట వివాహం జరిగింది. కాగా ప్రదీప్కుమార్ ఒంటిమామిడిలో దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గోపాలపట్నంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కాగా బుధవారం సాయంత్రం ప్రదీప్కుమార్ ఉద్యోగానికి వెళ్లిన అనంతరం అత్తింటివారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. వివాహిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. -
తాండవ నదిలో మునిగి వ్యక్తి మృతి
కోటనందూరు: తాండవ నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్లిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపూడి ఎస్సీ పేటకు చెందిన వడ్లమూరి శ్రీను (36) బుధవారం స్నానం చేసేందుకు సమీపంలోని తాండవ నదిలోకి దిగగా, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అప్పటి నుంచి శ్రీను ఆచూకీ కోసం స్థానికులు గాలించగా, గురువారం ఉదయం అతని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వడ్లమూరి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామృకృష్ణ తెలిపారు. -
సదా వేంకటేశం.. స్మరామి స్మరామి
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● అశేషంగా తరలివచ్చిన భక్తజనం కొత్తపేట: సదా వేంకటేశం.. స్మరామి స్మరామి.. అంటూ శ్రీవారిని కొలుస్తూ సాగుతున్న బ్రహ్మోత్సవాలు ఆబాలగోపాలాన్ని మురిపిస్తున్నాయి. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అశేష సంఖ్య భక్తజనం తరలివచ్చి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలను తిలకించి తన్మయత్వం చెందారు. రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై ఊరేగిన శ్రీవారిని వీక్షించి పరవశించిపోయారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, హోమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పూజాదికాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని, స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి పుణ్యాహవచనం, అష్ట కలశారాధన, లక్ష తులసిపూజ, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారిని రాజాధిరాజ అలంకరణలో గజవాహన సేవ అద్భుతంగా సాగింది. శ్రీవారిని గజ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేద పండితుల వ్యాఖ్యోపన్యాసంతో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. రాజాధిరాజ అలంకరణ అనేది ఒక దేవతామూర్తిని ‘రాజులకు రాజుగా’ (రాజాధిరాజ), చక్రవర్తిగా అలంకరించే అత్యంత వైభవమైన అలంకారం. ఇది దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. దేవుని గజ (ఏనుగు) వాహనంపై ఊరేగిస్తారు. వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహన సేవ నిర్వహించారు. దైవత్వం యొక్క సర్వోన్నత అధికారాన్ని, వైభవాన్ని కీర్తించడం ఈ సేవ ఉద్దేశం. ఈ సేవ భక్తుల కోలాహలం నడుమ విశేషంగా సాగింది. పలువురు ప్రముఖులు, నాయకులు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాడపల్లిలో గజ వాహనంపై స్వామివారికి ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో శక్తివేషాల ప్రదర్శన -
ఆ రూ.5.88 లక్షలు ఎక్కడివి?
విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులుఅమలాపురం రూరల్: తీగ లాగితే డొంక కదిలినట్లు అమలాపురం తహసీల్దార్ అవినీతిపై ఏసీబీ అధికారులకు మరిన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి స్థలం సర్వే విషయంలో తహసీల్దార్ పి.అశోక్ప్రసాద్ రూ.లక్ష లంచం డిమాండ్ చేయడం, కార్యాలయ డేటా ఆపరేటర్, జనుపల్లి వీఆర్ఏ పుప్పాల రాము మధ్యవర్తిత్వంలో రూ.50 వేల బేరం కుదరడం, తర్వాత ఆ భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, ఏసీబీ ట్రాప్లో తహసీల్దార్, డేట్ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరిణామాలు తెలిసిందే. తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగినప్పుడు లంచం తీసుకుంటున్న రూ.50 వేలతో పాటు అక్కడ రూ.5.88 లక్షలు దొరకడం గమనార్హం. అక్కడ అనధికారికంగా ఉన్న రూ.5.88 లక్షలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అసలు ఈ నగదు ఎక్కడిది..? ఎలా వచ్చింది...? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్ను అరెస్ట్ చేసిన తర్వాత బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో ఉన్న తహసీల్దార్ ల్యాప్టాప్ను అధికారులు సీజ్ చేశారు. అలాగే అధికారులు అమలాపురం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడా పలువురిని విచారించారు. తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ను తొలుత రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకు వెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రూ.5.88 లక్షల నగదు దీపావళి దుకాణాల ఏర్పాటు గురించి లంచంగా వసూలు చేసిన సొమ్మని తెలిసింది. ఏసీబీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
వైభవంగా తిరుమంజన సేవ
మామిడికుదురు: దోషాల పరిహారార్థం చేపట్టిన పవిత్రోత్సవాలు అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో రెండో రోజు గురువారం ఘనంగా జరిగాయి. చతుస్థానార్చనలతో ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో అగ్ని ప్రతిష్ఠాపన, పవిత్రారోహణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాల బాలాజీ స్వామితో పాటు పద్మావతీదేవి, ఆండాళ్తాయార్ అమ్మవార్లకు 27 కలశాలతో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, 11 రకాల పండ్ల రసాలు, ఉద్గ జలాలతో నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ ఆద్యంతం ఆకట్టుకుంది. వేద మంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఈ కార్యక్రమం సాగింది. వీటితో పాటు ప్రాయశ్చిత హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి, చతుస్థానార్చనలు, నివేదన, మంగళా శాసనం పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం, గుడివాడకు చెందిన చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. -
ఎస్బీఐ బ్రాంచ్ను ముట్టడించిన డ్వాక్రా మహిళలు
కరప: డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహా చేసిన బ్యాంక్ సీసీపై చర్యలు తీసుకోకపోవడంపై వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచ్ను గురువారం కూరాడ గ్రామ డ్వాక్రా మహిళలు ముట్టడించారు. తమ సంఘాల నుంచి దోచుకున్న రూ.95 లక్షలను రికవరీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ సీసీపై, ఇందుకు సహకరించిన యానిమేటర్లపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలు ఉన్నాయి. వీరి నుంచి ముగ్గురు యానిమేటర్లు సంఘాల పొదుపు, రుణాల వాయిదా సొమ్మును వసూలు చేసేవారు. వేళంగి ఎస్బీఐ బ్రాంచ్ కూరాడలో బీసీ పాయింట్ ఏర్పాటు చేసి, కరస్పాండెంట్గా చిన్నం ప్రియభారతిని నియమించారు. ముగ్గురు యానిమేటర్లలో ఒకరు చిన్నం మంగ బ్యాంక్ సీసీ భారతి తల్లి కావడం, ఆమెకు మిగిలిన ఇద్దరు యానిమేటర్లు ఆలపాటి బేబీ, ఆచంట మాధవి సహకరించడంతో డ్వాక్రా సొమ్మును కాజేశారు. బ్యాంక్ సీసీ, యానిమేటర్లు ముగ్గురు ఏకమై పొదుపు, వాయిదాల సొమ్మును బ్యాంక్కు చెల్లించకుండా పక్కదారి పట్టించి, సొంతానికి వాడుకున్నారు. ఇది గత నెలలోనే బయటపడినా ఇంతవరకూ అధికారుల నుంచి స్పందన కరవైందని మహిళలు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచ్ను ముట్టడించారు. కరప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారే కానీ ఇంతవరకూ ఎవరూ తమ గ్రామానికి విచారణకు రాలేదన్నారు. డీఆర్డీఏ పీడీ వచ్చాక చర్యలు తీసుకుంటారని ఏపీఎం ఎంఎస్బీ దేవి చెప్పారని, ఆయన వచ్చారో, లేదో తెలియడం లేదని మహిళలు వాపోయారు. అవినీతికి పాల్పడిన బ్యాంక్ సీసీ భారతిని విధుల నుంచి తొలగించాలని, స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి డ్వాక్రా గ్రూపులకు చెల్లించాలని అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఫాల్గుణరావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పడంలో డ్వాక్రా మహిళలు వెనుతిరిగారు. స్వాహా చేసిన రూ.95 లక్షల రికవరీకి డిమాండ్ -
పాలనపై పేదవి విరుపు
ప్రచారానికే ప్రాధాన్యం ఆధునిక సమాజంలో పేదల పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రభుత్వం వ్యవస్థాపరమైన కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పాడి పరిశ్రమ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో పటిష్టమైన కార్యాచరణ లేదు. ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. –ఎం.గౌరవ్, పిఠాపురం, సామాజిక కార్యకర్త కపిలేశ్వరపురం: జీవితం పూలపాన్పు కాకపోయినా పట్టెడన్నానికి లోటు లేకుండా సాగిపోతే చాలనుకునే వారెందరో.. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుత ‘కూటమి’ పాలనలో పేదల బతుకులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. సంపద సృష్టిస్తానంటూ కబుర్లు చెప్పిన కూటమి అగ్రనేతలు అధికారంలోకి వచ్చాక పేదలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఉమ్మడి జిల్లాలో అన్నం పెట్టే వరి సాగు భూమి ఎక్కువగానే ఉంది. పండ్లు, కూరగాయల తదితర ఉద్యాన పంటలు పండే లంక, మెట్ట ప్రాంతమూ అధికమే. గౌతమి, వశిష్ట గోదావరి నదుల నుంచి పుష్కలమైన సాగునీరు లభ్యత ఇక్కడి ప్రత్యేకత. పారిశ్రామిక ప్రగతికి ప్రాథమిక భూమిక ఉమ్మడి జిల్లా.. ఇంత ప్రాధాన్యం ఉన్నా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పేదల జీవితాలు తీసికట్టుగా మారాయి. తమ ప్రభుత్వం రాగానే సంపద సృష్టిస్తామని, ఇంటికో ఉద్యోగమిస్తామని ప్రజలను కూటమి నేతలు నమ్మించారు. 15 నెలల వారి పాలనలో కీలకమైన హామీలు ఆచరణకు నోచుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కల్పించిన ఉపాధి అవకాశాలను సైతం కనుమరుగు చేశారు. కాకినాడ జిల్లాలో 445 గ్రామ సచివాలయాల పరిధిలో 9,015 మంది, 175 వార్డు సచివాలయాల పరిధిలో 3,257 మంది మొత్తం 620 సచివాలయాల పరిధిలో 12,272 మంది వలంటీర్లు ఉండేవారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 119 వార్డు, 393 గ్రామ మొత్తం 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లు సేవలందించే వారు. వారందరికీ రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నమ్మబలికి అధికారంలోకి వచ్చాక తొలగించింది. ఇంటింటికీ రేషన్ సరకులు అందజేసేందుకు ఉద్దేశించిన వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లను తీసేసింది. ఇలా ఆయా కుటుంబాలకు ఉపాధిని దూరం చేసింది. గతమెంతో ఘనం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో వ్యవస్థాపరమైన కార్యాచరణ చేసింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పటిష్ట చర్యలు తీసుకుంది. ప్రతి కుటుంబానికీ ఏదొక ప్రభుత్వ పథకం ద్వారా క్రమం తప్పకుండా ఆర్థిక లబ్ధి చేకూర్చింది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి వ్యవస్థాపరమైన సంక్షేమాన్ని, ఉద్యోగ కల్పనకు కృషి చేసింది. మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి ఉపాధి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచింది. పేద అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందజేసే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను అందించింది. సాయం అందక వలసలు కూటమి వచ్చాక ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు చాలా వరకూ నిలిచిపోయాయి. తొలి ఏడాదిలో రైతులకు అన్నదాతా సుఖీభవ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. చేనేత కార్మికుల కుటుంబానికి ఇస్తామన్న రూ.25 వేలు ఇవ్వనేలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ పేదలు పట్టణ ప్రాంతాలకు, ఇతర వృత్తులకు వలస పోతున్నారు. మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని చేనేత కార్మికులు ఇతర వృత్తుల్లోకి మళ్లిపోవడం ఉదాహరణ. కొనలేం.. తినలేం ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు ఒకొక్కటిగా పెరిగిపోతున్నాయి. ఎండుమిర్చి రూ.180 నుంచి రూ. 220, వెల్లుల్లి రూ. 240 నుంచి రూ.350 ధరలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ దుకాణాల్లో ఫిబ్రవరి నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. అంగరలో చేనేత పనిలో మహిళ వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి వద్దే రేషన్ సరకులు అందుకుంటున్న లబ్ధిదారులు (ఫైల్) చదువుకు సాయం కరవు ఉమ్మడి జిల్లాలో వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 608 పాఠశాలలు, 70 కళాశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 635 పాఠశాలలు, 115 కళాశాలలు, కాకినాడ జిల్లాలో 300 పాఠశాలలు, 80 కళాశాలలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్లు చెల్లించక ఇంజినీరింగ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని ఆపేసింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం గాలికి సంపద కాదు సమస్యలు సృష్టిస్తున్న వైనం ఉపాధి కోసం వలసలు వెళ్తున్న బడుగులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సుస్థిరాభివృద్ధి నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం -
చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
అమలాపురం టౌన్: స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి బంగారు నగలు, కొంత నగదు కాజేసిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం అప్పారావు పేటకు చెందిన జడ్డు ముత్యవతిని పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 66.270 గ్రాముల బంగారు నగలు రికవరీ చేసినట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. ఈ నెల 4న అమలాపురం ఆర్టీసీ బస్ స్టేషన్లో ముమ్మిడివరానికి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్న వెలిగంటి లీలావతి హ్యాండ్ బ్యాగ్ను ముత్యవతి చాకచక్యంగా దొంగిలించిందని ఎస్సై అన్నారు. బ్యాగ్లో దాదాపు రూ.5.50 లక్షల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. తన హ్యాండ్ బ్యాగ్ను, అందులోని బంగారు నగలు, కొంత నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారని బాధితురాలు లీలావతి అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు చేశారు. నిందితురాలు ముత్యవతిని అరెస్ట్ చేసి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. ఆమెను అమలాపురం ఏజేఎఫ్సీఎం కోర్టులో గురువారం హాజరుపరిచామన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్ (11), గౌతమ్ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ కారణంగా మస్కట్లో చిక్కుకుపోయిన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన పిప్పర శ్రీలతను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. శ్రీలత గత జూన్లో మస్కట్ వెళ్లింది. అక్కడ సరైన పని దొరక్కపోవడం, యజమాని వేధింపులు, మూడు ఇళ్లలో పనికి చేరినా లాభం లేక తీవ్ర ఇబ్బందులు పడింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలతో భారత రాయబార కార్యాలయానికి వచ్చేసింది. ఆమె సమాచారం మేరకు తండ్రి మల్లవరపు వెంకటేశ్వర్లు.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. తన కుమార్తెను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని కలెక్టర్కు అర్జీ అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడి భారత రాయబారి ఇంటి రాజ్యలక్ష్మితో సంప్రదింపులు జరిపి, భారత విదేశీ రాయభార మంత్రిత్వ శాఖ సహకారంతో స్వదేశానికి సురక్షితంగా చేర్చినట్టు నోడల్ అధికారి, డీఆర్ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ బుధవారం తెలిపారు. -
రూ.72.23 లక్షలకు కొబ్బరి చెక్కల వేలం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల కొట్టిన కొబ్బరి చెక్కలను పోగుచేసుకునే వేలం రూ.72,23,499కు ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ ఏడాది పాటు కొబ్బరి చెక్కలు తీసుకునేందుకు బుధవారం అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ – టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా పాట జరిగింది. తొండంగి మండలం సీతారామపురానికి చెందిన గింజాల నాగ వెంకట సత్తిబాబు రూ.72,23,499కు పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.45 లక్షలకు వెళ్లి వేలం ఈ సారి మరింత పెరిగిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఇంటికి చేరిన బాలుడు
కాజులూరు: గొల్లపాలెంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరాడు. తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని చీకట్లవారిపేటకు చెందిన నాగ దినేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం మిత్రులతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తమ బంధువులు, అతడి స్నేహితులందరినీ విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా నాగ దినేష్ బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. పాఠశాల పూర్తయిన తర్వాత ఇంటికి రాకుండా స్నేహితులతో తిరుగుతున్నావంటూ తల్లి మందలించడంతో బాలుడు అలిగి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు వెళ్లిపోయిన నాగ దినేష్కు ఇంటిపై బెంగరావడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహకారంతో తిరిగి ఇంటికి చేరాడు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్కుమార్ ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
సొమ్ముసిల్లిపోయేలా..
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోలు లక్ష్యం, దిగుబడి అంచనాలు, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే ధాన్యం సొమ్ములు 48 గంటల్లో రైతులు ఖాతాలో జమ చేస్తామని చెబుతుంది. గత రబీలో ఇలా చెప్పి కొందరు రైతులకు కొన్న రెండు నెలల వరకు సొమ్ములు జమ చేయకుండా ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లా పరిధిలో.. జిల్లాలోని తూర్పు డెల్టా పరిధిలో ఆలమూరు, రామచంద్రపురం, మధ్య డెల్టా పరిధిలో కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు కొన్నిచోట్ల పొట్ట పోసుకుని దశలో, మరికొన్ని చోట్ల గింజగట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో శివారు ప్రాంతాల్లో మాత్రం గింజలు పాలు తోడుకునే దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ 1.63 లక్షల ఎకరాల్లో జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కేవలం 1.56 లక్షల ఎకరాలలో మాత్రమే వరి సాగు జరిగింది. 221 కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఈ ఖరీఫ్లో 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగబడి వస్తుందని, రైతు అవసరాలకు పోను 3.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా యంత్రాంగం గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 221 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలకు 141 రైస్ మిల్లులను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సమీక్షలు జరిపారు. గందరగోళం ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోలు విషయంలో సైతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లుల వారీగా లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు చేశారు. టార్గెట్లు దాటిన తర్వాత స్థానికంగా ఉన్న మిల్లులు కొనుగోలు చేయకపోవడంతో దూరంగా ఉన్న మిల్లులకు తోలుకోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● ఈ ఏడాది ఆరంభంలో రబీ ధాన్యం కొనుగోలు విషయంలోనూ ఇంతే. 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మరో లక్ష మెట్రిక్ టన్నులు కొంటామన్నా రైతులు అప్పటికే అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. ● బొండాల రకం (ఎంటీయూ–2636, టాటా రకం, ఒడిశా రకానికి చెందిన బొండాలు). ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేయకున్నా మిల్లర్లు చేత కొనిపించేవారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొనేవారు లేక కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.225 చొప్పున తగ్గించి రూ.1,500లు చేసి కొనడంతో రైతులు నష్టపోయారు. 24 గంటలలో ఇస్తామని.. రబీ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో వారి ఖాతాలలో ధాన్యం సొమ్ములు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ రెండో దశ సొమ్ములు వేయడానికి రెండు నెలలు పట్టింది. గత రబీలో జూన్ 15 నాటికి జిల్లాలో 499.840 మెట్రిక్ టన్నులు గ్రేడ్– ఏ రకం, 2,68,875.520 మెట్రిక్ టన్నులు సాధారణ రకం ధాన్యం కొనుగోలు చేశారు. అప్పటికి మొత్తం ధాన్యం విలువ రూ.613.08 కోట్లు కాగా, రైతులకు రూ.364.43 కోట్లు మే 8వ తేదీ నాటికి చెల్లించారు. తరువాత జూన్ నెలాఖరు వరకు రూ.248.65 కోట్లు చెల్లించలేదు. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు రోడ్డున పడి ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం, రోడ్డు మీద ధాన్యం పోసి నిరసనలు జరపడం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధాన్యం సొమ్ములు ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేశారు. అప్పుడు గానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఇప్పుడు 24 గంటల సమయాన్ని 48 గంటలకు పెంచింది. కొనుగోలు చేసే లక్ష్యం కూడా పెంచామంటున్నారు. దీని వల్ల 48 గంటల్లో ధాన్యం సొమ్ములు ఇస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఖరీఫ్లో సకాలంలో సొమ్ములు చెల్లించకుంటే రబీలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని రైతులు భయపడుతున్నారు. ఖరీఫ్ వరిచేను రైతుల ను వేధిస్తున్న కూటమి గతంలో సకాలంలో ధాన్యం సొమ్ములు జమచేయని వైనం రోడ్డుపై ధర్నాలు చేసిన అన్నదాతలు ఇప్పుడు ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సర్కారు సన్నాహాలు 48 గంటల్లో డబ్బులు ఇస్తామని ప్రచారం ఈసారి ఏమవుతుందోనని ఆందోళనకె.గంగవరం మండలం కోటిపల్లిలో కళ్లాల్లోనే ఉన్న బొండాల రకం ధాన్యం (ఫైల్) -
రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..
ఆలమూరు: బంధువులే రాబంధువులు అయ్యారు. అయిన వాళ్లే గద్దల్లా అనునిత్యం పొడుచుకుతిన్నారు. కేసులు పెట్టి హింసించి జైలుకు పంపించారు. సూటిపోటి మాటలతో వ్యక్తిత్వాన్ని కించపరచేవారు. దీంతో సమాజంలో తాను బతకలేనని అతడు భావించాడు. తాను చనిపోతే బిడ్డలు అనాథలైపోతారని భావించి, ముక్కుపచ్చలారని వారికి పురుగు మందు పట్టించి హత్య చేశాడు. తాను కూడా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచార సంఘటన ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇవీ.. స్థానిక శ్రీషిర్డీసాయి ఆలయం సమీపంలో నివసిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) గతంలో గ్రామ వలంటీర్గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో, తన కులవృత్తి అయిన సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం చంటి భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి చంటే కారణమంటూ అత్తింటి వైపు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఆలమూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంతో చంటి జైలు శిక్షకు గురయ్యాడు. ఇటీవల భార్య నాగదేవి ఆత్మహత్య కేసుపై రాజీ కుదరడంతో బయటపడ్డాడు. కానీ బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. క్లూస్ టీం రాక బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడు చంటి సెల్ఫీ వీడియోలోని ఆరోపించిన విధంగా ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీటి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని ఆప్యాయంగా పలుకరించే తన కుమారుడు చంటి, బుడిబుడి అడుగులతో అల్లరితో సందడి చేసే ఇద్దరు మనవలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులను చంపి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డావంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని ఆ పసి బాలుర మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య ముగ్గురి వేధింపులే కారణమని సెల్ఫీ ఆలమూరు మండలం మడికిలో విషాదం కారణం ఆ ముగ్గురే.. తన సమీప బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రొలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసరావు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చంటి ఆరోపించాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను రూపొందించి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇటీవల ఆ ముగ్గురూ తనను చంపేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. తాను చనిపోతే తన కుమారులు అనాథలై పోతారని ఆందోళన చెందాడు. తన మాదిరిగా బిడ్డల ఆలన పాలన ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన చెందాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు, ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి సన్నిధిలో మూడు రోజులు జరిగే పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారిలో విశేషమైన తేజస్సు కోసం నిర్వహించే ఈ పవిత్రోత్సవాలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తెలిసీ, తెలియక చేసే తప్పులు, దోషాల నుంచి పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నవ కలశ, పంచామృత సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. జలాలతో ముందుగా ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఉత్సవ మూర్తులను, పవిత్రాలను, పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకు వచ్చి పవిత్రోత్సవాలను జరిపించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవంబర్ 17న వాకర్స్ కన్వెన్షన్ అమలాపురం టౌన్: అమలాపురం శ్రీకళా గ్రాండ్లో నవంబర్ 17న నిర్వహించనున్న జిల్లా వాకర్స్ కన్వెన్షన్ కార్యక్రమానికి జిల్లా వాకర్స్ క్లబ్ల ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ వాకర్స్ నుంచి పలువురి హాజరవుతున్నారని జిల్లా గవర్నర్ సప్పా నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ, జిల్లా వాకర్స్ ముఖ్య ప్రతినిధులు పాల్గొనే ఈ కన్వెన్షన్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక శ్రీకళా గ్రాండ్లో గవర్నర్తో పాటు అంతర్జాతీయ వాకర్స్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ శర్మ తదితరులు చర్చించారు. వాకర్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు బుధవారం సమావేశమై కన్వెన్షన్ నిర్వహణపై మాట్లాడారు. ఈ కన్వెన్షన్కు జిల్లా నుంచి దాదాపు 100 మంది వాకర్స్ క్లబ్ల ప్రతినిధులు, అంతర్జాతీయ వాకర్స్ నుంచి సుమారు 30 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ తెలిపారు. బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలి ఉప్పలగుప్తం: సంక్రాతిని పురస్కరించుకుని ఎస్.యానాం సముద్ర తీర ప్రాంతంలో జరిగే బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కోనసీమ బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అధికారులతో కలసి బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కోనసీమ ప్రాంతం ఎంతో అనువైనదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, డ్వామా పీడీ మధుసూదన్, ఏపీడీ డి.రాంబాబు, పీఆర్ ఈఈ పి.రామకృష్ణారెడ్డి, డీఈఈ పి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచారామాలకు ప్రత్యేక బస్సులు తుని: కార్తికమాసం సందర్భంగా తుని డిపో నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ జీజీవీ రమణ తెలిపారు. బుధవారం ఆ మేరకు స్థానిక డిపోలో కరపత్రాలను విడుదల చేశారు. డిపో మేనేజర్ రమణ మాట్లాడుతూ ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో (ఆదివారాలు) బస్సు తునిలో బయలుదేరి దర్శనానంతరం సోమవారం సాయంత్రం తిరిగి తుని చేరుతుందన్నారు. ఈ బస్సు టికెట్టు ధర రూ.1250 నిర్ణయించామన్నారు. వివరాలకు 73829 13216, 90633 66433, 73829 13016 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. -
‘ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’
పత్రికలు, వాటిలో పనిచేసే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయ్యినా ఇప్పటికీ బ్రిటీష్ పాలన మాదిరిగా పత్రికలపై దాడులకు దిగడం నీతి బాహ్యమైన చర్యే. విజయవాడ, హైదరాబాద్ సాక్షి కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం ద్వారా పత్రిక రోజువారీ దినచర్యలకు ఆటంకం కలిగించడం సహేతుకం కాదు. పత్రికల స్వేచ్చకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే... – రెడ్డిపల్లి రాజేష్, అధ్యక్షుడు, సిటీ ప్రెస్క్లబ్,కాకినాడ రాజకీయ కక్షలు కార్పణ్యాలతోనే... రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ మీడియా సంస్థపై దాడికి దిగడం సరైన విధానం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోకూడదు. అది కూడా సమయం సందర్భం లేకుండా తరచు సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, కార్యాలయంలో పోలీసుల హల్చల్, సంపాదకుడు ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రజాస్వామ్యవాదులు ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిందే. – నదీముల్లాఖాన్ దురాని, మాజీ ఉపాధ్యక్షుడు ఏపీడబ్ల్యూజే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా -
భీమేశ్వరస్వామికి రూ.26.37 లక్షల ఆదాయం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.26,36,734 వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ ఏడాది జూలై 5 నుంచి అక్టోబర్ 15 వరకు 102 రోజులకు హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించామన్నారు. హుండీల్లో రూ.24,72,056, అన్నదానం హుండీల్లో రూ.1,64,675, 2.200 గ్రాముల బంగారం, 99 గ్రాములు వెండి వచ్చిందన్నారు. దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఇన్స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణ, వెల్ల గ్రూపు టెంపుల్స్ ఈఓ వైవీవీ సత్యనారాయణ, ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది, స్థానిక పెద్దలు పెంకే సాంబశివరావు, ఆళ్ల బుజ్జి, దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ నవీన్ పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తులకు గడువు పెంపు రాయవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) 2025 పరీక్షకు దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. గతంలో ఈ నెల 15 చివరి తేదీగా నిర్ణయించగా, ఈ గడువును ఈ నెల 25 వరకు పొడిగించారన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 27, దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీలన్నారు. -
3 నుంచి పారిశుధ్య కార్మికుల సమ్మె
అమలాపురం టౌన్: మున్సిపల్ శాఖలో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు నవంబర్ 3 నుంచి అమలాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ యూనియన్ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వి.నిర్మల్ కుమార్కు బుధవారం ఉదయం సమ్మె నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు నవంబర్ 3 నుంచి చేపట్టే సమ్మె సమాచారాన్ని నోటీసు ద్వారా తమ యూనియన్ తెలియజేసిందని కమిషనర్కు వివరించారు. సత్తిబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో కార్మికుడు మృతి చెందితే అతడి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని ప్రకటించాలని, 30 శాతం తాత్కాలిక భృతి చెల్లించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కమిషనర్కు సమ్మె నోటీసు అందించిన వారిలో కార్మిక నేతలు వాసంశెట్టి సత్తిరాజు, కొప్పుల బాబీ, పారిశుధ్య కార్మిక నాయకులు ఎం.సత్యనారాయణ, అమలదాసు గోవిందమ్మ, ఆర్.సుబ్బలక్ష్మి, కె.వెంకట్రావు ఉన్నారు.


