Dr B R Ambedkar Konaseema
-
కుట్టిందో మరణమే..
జాగ్రత్తలు అవసరం ● డెంగీ వ్యాధి బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి ● ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు (ప్లేట్లెట్స్) సాధారణంగా 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకూ ఉండాలి. ● తెల్ల రక్త కణాలు నాలుగు వేల నుంచి 11 వేల వరకూ ఉండాలి. ● డెంగీ జ్వరం ద్వారా రక్త కణాలు లక్ష దిగువకు పడిపోతే సత్వరమే వైద్యుడిని సంప్రదించాలి. ● ధీర్ఘకాలం తక్కువ రక్తకణాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ● డెంగీ జ్వరం బారిన పడిన వ్యక్తి సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ● తరచూ పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలమూరు: రాత్రయితే చాలు పిలవని అతిథుల్లా మన ఇంటికి వచ్చి, తెల్లవార్లూ రక్తాన్ని పీల్చేసే దోమలతో పడే బాధలు అందరికీ అనుభవమే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటి బాధితులే. అందుకనే దోమల భారిన పడకుండా నిత్యం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే దోమలు కట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరం అత్యంత ప్రాణాంతకమైంది. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. దోమ కాటుతో.. దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుడితే అతడి రక్తంలో వైరస్ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. డెంగీ జ్వరం సోకిన వెంటనే శరీరంలోని ఎముకల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయి క్రమేపీ రక్త కణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపి అంతిమంగా మరణానికి దారి తీస్తుంది. ఏడిస్ దోమల నుంచి సోకే డెంగీ వైరస్ నాలుగు రకాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తొలి రెండు దశల్లో జ్వర తీవ్రత రోగిపై ఒక మోస్తారు ప్రభావం చూపగా, మూడో దశలో హెమరేజిక్ జ్వరం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తుది దశ అయిన డెంగీ షాక్ సిండ్రోమ్ సోకితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు పగటి సమయంలో మనుషులను కుడతాయి. మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి దోమల వృద్ధికి కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్ఐవీ) పరీక్ష ద్వారా నిర్దారణ చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తికి వివిధ రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. డెంగీ జ్వరం తరచూ వస్తుంటే వైరస్ సంబంధిత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే దోమలు కాటు వేయడం వల్ల్ల ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడిస్ దోమల తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2010 మే 16వ తేదీ నుంచి జాతీయ డెంగీ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఏటా ఆ రోజున దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమలతో అనేక వ్యాధులు డెంగీ అత్యంత ప్రమాదకరం జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం నేడు జాతీయ డెంగీ దినోత్సవం డెంగీ లక్షణాలు ఆకస్మికంగా అధిక జ్వరం సంభవించడం (104 డిగ్రీలు) తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి తీవ్రమైన కండరాల నొప్పి అలసట, వికారం, వాంతులు చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం చిగుళ్ల లేదా ముక్కు నుంచి రక్తస్రావం మూత్రం, మలం, వాంతిలో రక్తం శ్వాస ఆడకపోవడం అలసిపోవడం, చిరాకు అప్రమత్తంగా ఉండాలి దోమకాటు వల్ల సంభవించే డెంగీ జ్వరంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో సైతం వర్షాలు కురుస్తుండటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. జ్వర లక్షణాలు ఉంటే సత్వరమే సమీప వైద్యులను సంప్రదించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. – కె.స్వర్ణలత, వైద్యాధికారి, సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి, ఆలమూరు. -
వర్షంలో సీహెచ్వోల నిరసన
అమలాపురం రూరల్: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు తన సమ్మెలో భాగంగా గురువారం కల్టెరేట్ వద్ద వర్షంలో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ చేస్తున్న ఆందోళనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.మమత జ్యోతి, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు ఏ.సాయి శంకర్, శ్రీరామ్, హిమజ పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్పై హరీష్ కోపం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు. తల్లి ఫిర్యాదుతో.. తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లి ఆ మృతదేహాన్ని గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని సీఐ సునీల్ తెలిపారు. ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
రీజనల్ కోఆర్డినేటర్ బొత్స రాకసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు. 17న చదరంగం పోటీలు అమలాపురం టౌన్: అమలాపురం విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో ఈ నెల 17న జిల్లా స్థాయి అండర్–11 చదరంగం పోటీలు జరుగుతాయని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2014 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. బాలురలో ఇద్దరు, బాలికల్లో ఇద్దరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులు గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరగనున్న పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలవారు 98491 75179 నంబర్కు ఫోన్ చేసి, రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట సురేష్ తెలిపారు. డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి అమలాపురం రూరల్: దోమ కాటు ద్వారా ఆశించే డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవం (మే 16) సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ప్రచార పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆదేశాల మేరకు జాతీయ డెంగీ దినోత్సవం నిర్వహించాలన్నారు. మూడు పద్ధతులను పాటించి ఈ వ్యాధిని ఓడించాలన్నారు. ఇంటి చుట్టుపక్కల దోమల ఉత్పత్తి అయ్యే నీటి నిల్వలను తొలగించాలన్నారు. డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో పాటు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఊడిమూడిలంక వంతెన పనుల పరిశీలన పి.గన్నవరం: ఊడిమూడిలంక – జి.పెదపూడి లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై ఏఐఐబీ నిధులు రూ.49.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెనను పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవీ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. వంతెన నిర్మాణంలో భాగంగా 6వ పిల్లర్ను ఇప్పటికి 37 మీటర్ల మేర లోతు దింపారు. దీనిని ఎస్ఈ పరిశీలించి బాటమ్ ప్లగింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని పీఆర్ ప్రాజెక్ట్స్ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు ఎస్ఈకి వివరించారు. ఇంతవరకూ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోయినా పనులు ఆపకుండా కొనసాగిస్తున్న కాంట్రాక్టు సంస్థ అధినేత పీపీ రాజును ఎస్ఈ శ్రీనివాస్ అభినందించారు. పీఆర్ ఈఈ పులి ప్రభాకర రెడ్డి వంతెన పనులను పరిశీలించి పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఏఈలు కొండలరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఏపీ ఈసెట్లో విద్యార్థుల సత్తా
రాయవరం/రామచంద్రపురం: పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అనంతరం నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పాలిటెక్నికల్ కోర్సు చదివిన వారితో పాటు బీఎస్సీ మేథమెటిక్స్, కెమిస్ట్రీ చదివిన విద్యార్థులు దీనికి (లేటరల్ ఎంట్రీ) అర్హులు. ఈ నేపథ్యంలో జిల్లాలో 625 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు.625 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 607 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 581 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 372 మంది బాలురు (95.14 శాతం), 209 మంది బాలికలు (96.76 శాతం) ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 95.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. లేటరల్ ఎంట్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అగ్రికల్చర్, బయో కెమిస్ట్రీ, సివిల్, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, మెటలర్జీ, సెరామిక్ తదితర 14 కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. కాగా.. రామచంద్రపురానికి చెందిన షేక్ అబ్దుల్ రజాక్ రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, ఐ.పోలవరానికి చెందిన దాట్ల శంకర వర్మ 5వ ర్యాంకు, మామిడికుదురు మండలం మొగలికుదురుకు చెందిన గోగి మోహిని స్పందన 8వ ర్యాంకు సాధించి కోనసీమ సత్తా చాటారు. పారిశ్రామిక వేత్తగా ఎదగాలన్నదే ధ్యేయం జేఎన్టీయూలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, అనంతరం ఎంబీఏ చేసి పారిశ్రామిక వేత్తగా స్థిరపడాలనేది తన ధ్యేయమని ఏపీ ఈసెట్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన షేక్ అబ్దుల్ రజాక్ వివరించారు. రామచంద్రపురానికి ఆ విద్యార్థిది నిరుపేద కుటుంబం. తండ్రి షేక్ యాకూబ్, తల్లి అహ్మద్ వలీ సుహాన్ బీబీ. యాకూబ్ ఒక టైలరింగ్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకూ రజాక్ చదివాడు. విశాఖలోని కంచరపాలెం కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు సంపాదించి కెమికల్ పాలిటెక్నిక్లో చేరాడు. కొడుకు చదువు కోసం యాకూబ్, తల్లి సుహాన్తో సహా విశాఖకు వెళ్లి నివాసం ఉంటూ అక్కడే పనిచేసుకుంటున్నారు. జిల్లాలో 95.72 శాతం ఉత్తీర్ణత బాలికలదే పైచేయి కుటుంబ సభ్యుల సహకారం పాలిటెక్నికల్ చదివిన అనంతరం ఏపీఈసెట్ ప్రవేశ పరీక్షను రాశాను. రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించడం ఆనందానిచ్చింది. నా తండ్రి సీతారామరాజు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకును సాధించాను. ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదవాలని ఉంది. – దాట్ల శంకర వర్మ, ఐ.పోలవరం కంప్యూటర్ ఇంజినీర్ అవుతా ఏపీఈసెట్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాను. బీటెక్ కంప్యూటర్ కోర్సును అభ్యసించి, కంప్యూటర్ ఇంజినీర్గా స్థిరపడాలని ఉంది. కష్టపడి ప్రవేశ పరీక్ష రాశాను. అయితే 8వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. నా భర్త సతీష్ కుమార్, అత్తమామలు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. – గోగి మోహిని స్పందన, మొగలికుదురు -
ఇంత అలక్ష్యమా..
● ధాన్యం.. ధైన్యంసాక్షి,అమలాపురం/ అయినవిల్లి: సాధారణంగా వరి పంటను సాగుచేసే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి, ఎరువుల కొరత, తెగుళ్లు తదితర సమస్యలు రైతులు ఎదుర్కొంటారు. కానీ కూటమి ప్రభుత్వంలో వారికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినా పాలకులు స్పందించక పోవడంతో రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతుల సంక్షేమానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తే.. నేటి కూటమి ప్రభుత్వం వారిన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. కొనుగోలుకూ లక్ష్యం.. రబీ ధాన్యం కొనుగోలు చేయమంటే తమ లక్ష్యం పూర్తయ్యిందని ఆర్బీకే సిబ్బంది చెప్పడంపై అయినవిల్లి మండలం రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లతో నేరుగా ముక్తేశ్వరం సెంటరుకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా తమ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా నలుమూలలలో ఏదో ఒక చోట రైతులు రోడ్డున పడి ధర్నా చేయడం పరిపాటుగా మారింది. రైతుల ఆందోళన రబీ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం ముగిసిందని ధాన్యం కొనుగోళ్లను నిలిపేయడంపై మండలానికి చెందిన రైతులు, రైతు సంఘం నాయకులు గురువారం ముక్తేశ్వరం సెంటర్లో ఆందోళనకు దిగారు. ఇరవై ధాన్యం లోడు ట్రాక్టర్లలతో ముక్తేశ్వరం సెంటర్కు చేరుకుని, నలువైపులా ట్రాఫిక్ నిలిపివేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఒకవైపు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోతున్నామని, మరో పక్క ప్రభుత్వ కేంద్రాల వద్ద లక్ష్యం పూర్తయిందని కొనడం లేదని ఆరోపించారు. కూటమి మోసం ధాన్యం కొనుగోలును అర్థాంతరంగా నిలిపి వేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక పక్కాగా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు అందించలేదన్నారు. తాము పండించిన ధాన్యాన్ని టార్గెట్ పేరుతో కొనుగోలు చేయడం లేదన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఆధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సిందేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రాష్ట్ర ప్రజలను ఆర్థిక మాధ్యంలోకి నెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారన్నారు. జగన్ హయాంలో పూర్తి భరోసా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు రైతు భరోసా అందించి ఆదుకున్నారన్నారు. పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధరను అందించారని, దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపారన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యాన్ని టార్గెట్తో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో రైతు సంఘ నాయకులతో అయినవిల్లి ఎౖస్సై పి. శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది చర్చించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని కోరడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం ధాన్యం లోడు ట్రాక్టర్లతో అమలాపురంలోని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యం ట్రాక్టర్లతో కలెక్టరేట్ను ముట్టడించారు. తమ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీఆర్వోతో రైతులు చర్చలు జరిపారు. వారి వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. రైతుల ఆందోళనకు వైఎస్పార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అయినవిల్లి మండల అధ్యక్షుడు కుడుపూడి విద్యాసాగర్, నేదునూరు సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, నాయకులు మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్ కుమార్, బొంతు శ్రీను, కోనే చంద్రశేఖర్, చేట్ల రామారావు, కమిడి వెంకటేశ్వరరావు, కుసుమ వెంకటరమణ, మేకా బుచ్చిరామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. 40 శాతం ధాన్యం కొంటే ఎలా? మేము పండించిన ధాన్యంలో 40 శాతం మాత్రమే ప్రభుత్వం కొంటే ఎలా?, మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లు ధరలు తగ్గించి కొంటామంటున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం. లక్ష్యం అయిపోయిందని నాలుగు రోజులుగా అధికారులు చెబుతున్నారు. గత్యంతరం లేక కలెక్టరేట్ వద్దకు రావాల్సి వచ్చింది. – గండుబోగుల సత్యనారాయణ మూర్తి, నల్లచెరువు, అయినవిల్లి మండలం రైతుల ఇబ్బందులు రబీలో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతున్నారు. రైతుకు దిక్కుతోచడం లేదు. రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నిలుస్తోంది. – గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ లక్ష్యం పూర్తయ్యిందని ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం రోడ్డెక్కిన రైతులు ట్రాక్టర్లతో కలెక్టరేట్ ముట్టడి ముందుగా ముక్తేశ్వరంలో ఆందోళన -
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
బోట్క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ బస్సు కాళేశ్వరంలో పుణ్యస్నానాలు, మహాకాళ్వేరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం, వరంగల్లు వేయి స్తంభాల మంటపం, భద్రకాళీ దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీనరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం, వేములవాడ క్షేత్ర దర్శనం అనంతరం ఈనెల 18న ఉదయానికి కాకినాడ చేరుకుంటుందన్నారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలం చెల్లిన బీరు బాటిళ్ల ధ్వంసం తాళ్లపూడి: తుపాకులగూడెం పరిధిలోని ఎలియస్ బేవరెజన్ ప్రైవేటు లిమిటెడ్లో కాలం చెల్లిన 9,193 కేసుల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కేవైఎంబీ కుమార్ తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న బీరులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గురువారం అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ బి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. చెక్కు బౌన్స్ కేసులో జరిమానా, జైలు కాకినాడ లీగల్: చెల్లని చెక్కులు ఇచ్చి ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఈ మేరకు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కేబీ ప్రతాప్ కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన దూడల శ్రీనివాసరావు వ్యాపార అవసరాల కోసమని కాకినాడలోని వెంకటరత్నంపురానికి చెందిన వెంట్రాప్రగడ మురళీ వద్ద అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం శ్రీనివాసరావు రూ.1,40,66,666 విలువైన ఒక చెక్కు ఇచ్చారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో చెక్కును మురళీ బ్యాంక్లో వేయగా బౌన్స్ అయ్యింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు విచారణలో శ్రీనివాసరావుపై నేరం రుజువు కావడంతో 18 నెలల జైలు, రూ.1,40,66,666లు పరిహారంగా చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కాగా, ఇదే శ్రీనివాసరావు మురళీకి ఇచ్చిన మరో చెక్కు కూడా బౌన్స్ అయ్యింది. దీనిలో శ్రీనివాసరావుకు 18 నెలల జైలు, రూ.3.60 కోట్లు పరిహారం విధిస్తూ తీర్పు వెలువడింది. -
మున్సిపల్ ఇంజినీర్ వర్కర్ల సమ్మె సైరన్
అమలాపురం టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ ఇంజినీర్ వర్కర్లు గురువారం సమ్మె బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలలో భాగంగా జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీల ఇంజినీర్ వర్కర్లు సమ్మెలోకి దిగారు. అయితే ముమ్మిడివరం నగర పంచాయితీలో ఈ నెల 21 నుంచి సమ్మె చేపట్టనున్నారు. కాగా.. అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపల్ కార్యాయాల ఎదుట ఆయా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీర్ వర్కర్లు శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. అమలాపురంలో 50 మంది, రామచంద్రపురంలో 28 మంది, మండపేటలో 30 మంది, ముమ్మిడివరంలో 18 మంది వర్కర్లు ఉన్నారు. వాల్వ్ ఆపరేటర్లు, పంపు ఆపరేటర్లు, వీధి లైటింగ్ ఆపరేటర్లు తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. డిమాండ్లు ఇవే.. టెక్నికల్, నాన్ టెక్నికల్గా జీతాలు ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, రిటైర్ మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మున్సిపల్ ఇంజినీర్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అమలాపురం ఇంజినీర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం.దుర్గాఅర్జునరావు హెచ్చరించారు. యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దంటేటి షణ్ముఖరావు, యెరుబండి వీరబాబు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ తాము విధులు బహిష్కరించి సమ్మెల్లో ఉంటామని స్పష్టం చేశారు. యూనియన్ ఉపాధ్యక్షుడు నాగరపు శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు చిక్కాల తిరుమల వెంకట కుమార్, ఎం.మధు, డి.కృష్ణ, బోణం రమేష్, గంటి రమేష్ తదితరలు శిబిరంలో నిరసన వ్యక్తం చేశారు. విధుల బహిష్కరణ శిబిరాల్లో నిరసనలు -
ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..
రాయవరం: ఆ కుటుంబంలోని పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితమే ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. అక్క ఫంక్షన్లో చిన్న కుమార్తె ఎంతో సందడి చేసింది. రెండు రోజులు అవకుండానే ఆ బాలికను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యం జరిగిన ఇంటిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ, ఉమా మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఇంట శుభకార్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కాగా.. సత్యనారాయణ వరసకు మేనల్లుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ గురువారం సత్యనారాయణ రెండో కుమార్తె నాగవర్షిణి (11)ని మోటార్ సైకిల్పై ఎక్కించుకుని రాయవరం వచ్చాడు. లొల్ల వైపునకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. నాగవర్షిణిపై నుంచి ట్రాక్టర్ తొట్టె వెనుక చక్రాల వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పవన్ సత్య స్వరూప్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. విలవిల్లాడిన బాలిక ట్రాక్టర్ చక్రాలు ఎక్కేయడంతో తీవ్రంగా గాయపడిన నాగవర్షిణి విలవిలలాడింది. ఆమె వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. సుమారు పావుగంట తర్వాత సమీపంలోని ఫొటో స్టూడియో నిర్వాహకుడు కారంపూడి సత్తిబాబు అక్కడకు వచ్చి బాలిక శరీరంపై క్లాత్ను కప్పాడు. ఆ తర్వాత స్థానికులు వచ్చి సాయమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మండపేటకు తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి రాయవరంలో ఘటన -
ఉపాధి శ్రామికులపై తేనెటీగల దాడి
కపిలేశ్వరపురం: మాచర గ్రామ శివారు శ్రీరామపురం ఏటిగట్టుపై జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా తుప్పలను తొలగిస్తున్న గ్రామీణ వికాస్ శ్రామికులపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. కోరుమిల్లి గ్రామ శివారు చిన్నకోరుమిల్లికి చెందిన కొండమూరి ఏసును తీవ్రంగా కుట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే సహచర శ్రామికులు మోటారు సైకిల్పై కపిలేశ్వరపురం సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి పి.రాజ్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందించారు. ఏసు కోలుకొంటున్నాడని, మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్టు ఎన్ఆర్ఈజీఎస్ ఇన్చార్జి ఏపీఓ రజిత్సింగ్ తెలిపారు. అలాగే తేనెటీగల దాడిలో గంగుమళ్ల కృష్ణ, కోలపల్లి త్రిమూర్తులు స్వల్పంగా గాయపడ్డారు. వాడపల్లి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు జరిపారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం, క్యూలైన్లు, ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాడ వీధులు, అన్నప్రసాద ప్రాంగణాలు, తలనీలాలు సమర్పించే ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వాడపల్లి ఆలయంతో పాటు రావులపాలెం బస్ కాంప్లెక్స్లో తనిఖీలు జరిపినట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. -
రాజుల తూరంగిలో భారీ చోరీ
కాకినాడ రూరల్: రాజుల తూరంగి గ్రామంలోని పురోహితుడు చంద్రమౌళి శ్రీనివాసశర్మ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగలు దోచుకున్నారు. ఇంద్రపాలెం పోలీసులు వివరాలు ప్రకారం.. శ్రీనివాసశర్మ గృహ ప్రవేశం పూజ కోసం రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆయన భార్య పుట్టింటికి వెళ్లడంలో ఇంట్లో ఎవరూ లేదు. ఇది గమనించిన దొంగలు లోపలకు ప్రవేశించి బంగారం, నగదు చోరీ చేశారు. పూజా కార్యక్రమం అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు వచ్చిన శ్రీనివాస శర్మ.. ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. లోపలకు వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. వెంటనే ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్సీ మనీష్ దేవరాజు పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దింపి వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఇంద్రపాలెం అదనపు ఎస్సై సూర్య కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్వారీ లారీ బోల్తా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలే క్వారీ లారీ ఢీకొని గేదే మృతి చెందింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల చిన్నారిని, ఇద్దరు మహిళలకు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఏలూరులో శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. -
జల్జీవన్ మిషన్ పనుల్లో చిన్నారులు
రామచంద్రపురం రూరల్: తోటపేట గ్రామంలో రూ. 79 లక్షల నిధులతో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనుల్లో భాగంగా జరుగుతున్న పైపులైన్ పనుల్లో సుమారు 10, 12 సంవత్సరాల చిన్నారులు పనులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చిన్నారులను ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనుల్లో ఉపయోగించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎస్.రాహుల్ వివరణ కోరగా వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
అన్నవరం.. భక్తజన సంద్రం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి గురువారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. నవ దంపతులు, వారి బంధువులతో కలిసి, రత్నగిరిపై స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించగా, వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుని కల్యాణోత్సవాలు ముగియడంతో మరలా సత్యదేవుడు, అమ్మవార్లకు స్వామివారి నిత్య కల్యాణం,ఆయుష్య హోమం, వనదుర్గ అమ్మవారికి హోమాలు, సహస్ర దీపాలంకారణ, పంచహారతుల సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. దాత మట్టే సత్యప్రసాద్ దంపతులు స్వామి, అమ్మవార్లకు చేయించిన వజ్ర కిరీటాలను సోమ, గురువారాలు మినహ మిగిలిన ఐదు రోజులు అలంకరిస్తున్నారు. గురువారం పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, లింగాకారంలోని శివుడు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం -
రైతులు సహకరించకుంటే చర్యలు
అమలాపురం రూరల్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు సహకరించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు. ఆమె గురువారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై చర్చించారు. వ్యవసాయ అధికారులు, సచివాలయ వ్యవసాయ సహాయకులు పూర్తి సమన్వయం వహించి ప్రభుత్వ టార్గెట్ స్థానిక ఉత్పత్తులలో 49 శాతమే ఉన్నందున బహిరంగ మార్కెట్ను మిల్లర్ల సమన్వయంతో అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందించి గిట్టుబాటు ధరలు కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. -
ప్రాథమిక విద్యకు సర్దుపోటు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందా..? ఇందులో భాగంగానే పాఠశాలల పునర్మిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీసిందా..? ఈ పరిణామం ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందా..? మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి.అంతా అస్తవ్యస్తం..!ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం జీవో 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక జీఓను రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలోనూ ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. ఇందులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజులుగా చేసిన కసరత్తు మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు నష్టం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.యూపీ స్కూళ్ల కొనసాగింపుపాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూపీ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72 అప్పర్ ప్రైమరీ పాఠశాలలున్నాయి. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి.767 పోస్టుల సర్దుబాటుఉపాధ్యాయుల సర్దుబాటుపై గురువులు గుర్రుగా ఉన్నారు. అసంబద్ధ విధానాలతో ప్రక్రియ చేపట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సర్దుబాటు ప్రక్రియ కాస్తా గందరగోళంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల వారీగా మంగళవారం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 767 మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్) పోస్టుల భర్తీ కలగానే మారనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 371 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పోస్టులకు, మోడల్ ప్రైమరీ పాఠశాల్లో సర్దుబాటు చేశారు. 31 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా సర్దుబాటు చేశారు. హెచ్ఓడీ పూల్లో ఉన్న 355 మంది ఉపాధ్యాయులను సైతం వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు.డీఎస్సీని మరిపించేందుకు ఎత్తులుటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది.ఉపాధ్యాయుల నియామకం ఇలా..● ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2 1–2వ తరగతి)1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 విద్యార్థులకు 2 ఎస్జీటీలను నియమించారు.● బేసీక్ ప్రైమరీ స్కూల్ (పీపీ–1, పీపీ2, 1–5వ తరగతి)లో 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను నియమించారు.● మోడల్ ప్రైమరీ స్కూల్స్ (పీపీ1, 2, 1–5వ తరగతి వరకు)59 మంది విద్యార్థులకు ముగ్గురు (హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ) ఉపాధ్యాయులను కేటాయించారు. అంతేగాక 150 మంది విద్యార్థులకు నలుగురిని నియమిస్తారు.● అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 1–10 వరకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 విద్యార్థులుంటే నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. -
కిక్కిరిసిన విఘ్నేశ్వరుని సన్నిధి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 76 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 29 జంటలు, పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు, స్వామివారి గరిక పూజలో ఆరు జంటలు పాల్గొన్నాయి. పది జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో 16 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆరుగురికి తులాభారం, అన్నప్రాశన పది మంది చిన్నారులకు నిర్వహించారు. స్వామికి 12 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 30 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,96,054 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ప్చ్... ఎండు మిర్చి!
కోలుకోవడం కష్టం మిర్చి రైతులు కోలుకోవడం కష్టం. కౌలుదారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. ముదర కాపులు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. పురుగు మందుల ఖర్చు ఎక్కువైంది. ఎన్ని మందులు కొట్టినా పూతలు నిలబడలేదు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. ఎకరా కౌలు రూ.50 వేలు, పెట్టుబడి రూ. లక్ష అయింది. ఆరు ఎకరాల సాగుకు సుమారు రూ.10 లక్షలు ఖర్చుకాగా, వచ్చిన ఆదాయం రూ.5 లక్షలు మాత్రమే. లేత కాపులు ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నాయి. – నూతలపాటి రమేష్, రైతు, పల్లంట్ల, దేవరపల్లి మండలం ●● ధర లేక రైతుల దిగాలు ● కంట కన్నీరు తెప్పిస్తున్న సాగు ● కిలో రూ.600 నుంచి రూ.150కు పతనం ● అందుకున్న లేత కాపులు ● కౌలు రైతులకు కోలుకోని నష్టం ● ఎకరాకు రూ. లక్ష నష్టం ● కళ్లాల్లోనే నిల్వలు దేవరపల్లి: ఎండు మిర్చి ధర పతనమైంది. అయినా మిర్చిని అడిగే నాథుడు కనిపించడంలేదు. అధిక పెట్టుబడులతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాలో రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మిరప తోటలకు పూతదశలో పేను, ఎర్రనల్లి వంటి చీడపీడలు సోకాయి. దీంతో పూతలు దెబ్బతిన్నాయి. రూ.వేలకు వేలు ఖర్చు పెట్టి పూతను కాపాడటానికి రైతులు మందులు పిచికారీ చేశారు. ప్రయోజనం శూన్యం. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అనుకూలిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. సాధారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిర్చి పంటకు ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో కాపులు లేక దిగుబడులు పడిపోయాయి. ముదర కాపులు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దిగుబడులు వచ్చాయి. ఏటా సంక్రాంతికి మిరపతోటలు పూత, పిందెలతో ఉంటాయి. ఈ ఏడాది పూతలు దెబ్బతినడంతో రైతులు ఆశించిన స్థాయిలో పిందె ఏర్పడలేదు. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఎండు మిర్చి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కిలో రూ.600 పలికింది. ఈ ధర ఏప్రిల్ వరకు ఉంది. మే నెల నుంచి ధర పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. 1,250 ఎకరాల్లో మిర్చి సాగు గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో రైతులు వేసవి పంటగా ఎండు మిర్చి సాగు చేస్తున్నారు. మూడు మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, కొత్తగూడెం, దేవరపల్లి గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్నారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో ప్రధాన పంటగా రైతులు మిర్చిని పండిస్తుంటారు. రెండు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారుల అంచనా. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మిరప పంట సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. తుపానులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తోటలు దెబ్బతిని రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. దిగుబడులు ఉంటే పంట లాభదాయకమేనని రైతులు అంటున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. పల్లంట్ల, కురుకూరు ఎండు మిర్చికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉండేది. ఇప్పటికి పల్లంట్ల ఎండు మిర్చికి మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే తోటలకు చీడపీడలు ఎక్కువగా ఆశించడంతో పురుగు మందుల వాడకం ఎక్కువ కావడం, పంట మార్పిడి జరగకపోవడం, భూముల్లో సారం తగ్గడం వంటి కారణాల వల్ల ఇక్కడ కూడా మిర్చి నాణ్యత, కారం ఘాటు తగ్గినట్టు రైతులు తెలిపారు. లేత కాపులు అందుకున్నా ధర లేదు ఎండు మిర్చి సీజన్ ముగియడంతో లేత కాపులకు ధర లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించారు. ఎకరం కౌలు రూ.50 వేల నుంచి 70 వేలు పలికింది. పండిన పంటను అమ్మితే రూ. లక్ష రావడం కష్టంగా ఉందని రైలులు లబోబోదిబోమంటున్నారు. లేతగా వచ్చిన పంటకు ధర లేదని రైతులు వాపోతున్నారు. సీజన్ ముగిసినా కళ్లాలో ఎక్కడ మిర్చి అక్కడే ఉంది. తక్కువ ధరకు కర్ణాటక మిర్చి జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి సీజన్లో వ్యాపారులు ఎండు మిర్చిని దిగుమతి చేసుకుని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక, భద్రాచలం, గుంటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల నుంచి ఈ ఏడాది వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎండు మిర్చిని తీసుకు వచ్చి తక్కువ ధరకు విక్రయాలు జరిపారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో కిలో ధర రూ.600 పలకగా, సైకిల్ వ్యాపారుల వద్ద రూ.200 నుంచి రూ.250కి లభించింది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రజలు తక్కువ ధరకు దొరుకుతున్న మిర్చిని కొనుగోలు చేశారు. -
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ.75 లక్షలు చెల్లిస్తాం
అంబాజీపేట: వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలి మృతిచెందినవారి కుటుంబాలకు రూ.75 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు, కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషరావు కుటుంబ సభ్యులను పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులు పత్తి దత్తుడు, కుంపట్ల శ్రీనివాసరావుకు పార్టీ తరఫున చెరో రూ.2లక్షల నగదును అందజేశారు. జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. పిల్లర్లు లేకుండా 70 అడుగుల పొడవున 18 అడుగుల ఎత్తులో అవినీతి నిర్మాణం చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం డబ్బు కు కక్కుర్తిపడి నాణ్యత లేకుండా నిర్మించిన గోడ వల్లే ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ న్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మృతుల కుటుంబాలకు రూ.75 లక్షలను అందిస్తామని పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, దానిని తప్పకుండా అమలు చేస్తామన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పాముల రాజేశ్వరిదేవి, దొమ్మేటి సత్యమోహన్, పి.కె.రావు, మందపాటి కిరణ్కుమార్, కొర్లపాటి కోటబాబు, జక్కంపూడి వాసు, ఉందుర్తి నాగబాబు, సూదాబత్తుల రాము, మట్టపర్తి హరి, కోట బేబిరాణి పాల్గొన్నారు. సింహాచలం దుర్ఘటన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు అందజేత -
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
విదసం, రాజోలు ప్రదర్శన చైతన్య సమితి డిమాండ్ మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు పప్పులు, నూనెలు, కూరగాయలు, గుడ్లు, మాంసం సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు లేడన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,600 అంగన్వాడీలు ఉంటే దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటికి గుడ్లు, చెక్కీలు, పప్పులు, నూనెల సరఫరాకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.372 కోట్లు కేటాయిస్తే ఆ కాంట్రాక్టులు అన్ని అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హాస్టళ్లు, దళితవాడల్లో అంగన్వాడీలకు సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చని అన్నారు. సబ్ప్లాన్ నిధుల నుంచి పంచాయతీరాజ్కి రూ.1,900 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.1,289 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.1,600 కోట్లు సబ్ ప్లాన్ నిధులతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని ఈ కాంటాక్టులలో కూడా దళితులు ఎవరూ లేరన్నారు. నిరుద్యోగ దళిత యువకులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పాటు చేసి అవసరమైన శిక్షణ ఇచ్చి అభివృద్ధి పనులు అప్పగిస్తే వేల దళిత కుటుంబాలు ఆర్థికంగా పురోగమిస్తాయన్నారు. సభాధ్యక్షుడు నల్లి ప్రసాద్రావు, మందా సత్యనారాయణ మాట్లాడుతూ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణలో లొసుగులు సరిదిద్ది జీ ఓ 596 తిరిగి అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. రేవు తిరుపతిరావు మాట్లాడుతూ ఇంగ్లిషు మీడియం కొనసాగించాలన్నారు. రాజోలు పరిరక్షణ చైతన్య సమితి చింతా సత్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కులగణన పూర్తయ్యే వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కొంకి రాజామణి , ముత్యాల శ్రీనివాస్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, ఉప్పాడ రాము పాల్గొన్నారు. -
చెత్త గుట్టలు.. స్వచ్ఛ గొప్పలు
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ... ఆచరణలో లేదనడానికి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమమే ఉదాహరణగా నిలుస్తోంది. రోజువారీ పారిశుధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మారుస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అదనంగా నయా పైసా కూడా విడుదల చేయకుండానే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం హోరెత్తిస్తోంది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్నాయి. వీటితో పాటు 22 మండలాల పరిధిలో 345 పంచాయతీలున్నాయి. వీటిలో మూడో వంతు మేజర్వి. రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మలికిపురం, అంబాజీపేట, ముక్తేశ్వరం, మురమళ్ల, ద్రాక్షారామ గ్రామాలు పేరుకు పంచాయతీలే అయినప్పటికీ నగర పంచాయతీలకు ఏమాత్రం తీసిపోవు. గడచిన ఐదేళ్ల కాలంలో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త రెట్టింపైంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 100 టన్నులకు పైగా చెత్త, ఇతర వ్యర్థాలను మున్సిపల్, పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సేకరించాల్సి ఉంది. అయితే, దీనికి అవసరమైన సిబ్బందిలో సగం మంది కూడా లేరు. వస్తున్న చెత్తలో 60 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే కావడంతో దీనిని ఏం చేయాలో పారిశుధ్య సిబ్బందికి తెలియడం లేదు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పంట కాలువలు, మురుగునీటి కాలువల ప్రవాహాలకు సైతం అడ్డంకిగా మారుతున్నాయి. రోజువారీ పారిశుధ్య నిర్వహణ మున్సిపాలిటీలకు, పంచాయతీలకు భారంగా మారుతోంది. పైసా విదల్చని సర్కారు పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకంటూ ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు. డంపింగ్ యార్డులకు అవసరమైన భూమి సేకరించడం, చెత్త నుంచి సంపద తయారీ, చెత్త తరలింపునకు అధునాతన వాహనాలు, అవసరమైన పారిశుధ్య సిబ్బంది నియామకం, పారిశుధ్య చర్యలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వంటి బాధ్యతలన్నింటినీ ప్రభుత్వం విస్మరిస్తోంది. వీటికి నయా పైసా కూడా విడుదల చేయకుండానే.. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసి, జోరుగా ప్రచారం చేస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నూతన వాహనాలు సమకూర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ వాహనాలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వీటి మరమ్మతులకు నిధులు కూడా ఇవ్వడం లేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్)లో భాగంగా నియమించిన ఉద్యోగులకు జీతాలు కూడా సవ్యంగా ఇవ్వడం లేదు. ఈ ప్రభావం చెత్త సేకరణపై పడింది. ● అమలాపురం మున్సిపాలిటీలో చెత్త సేకరణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనాలు అందజేసింది. క్లాప్ పరిధిలోని ఉద్యోగులు దగ్గరుండి చెత్త సేకరణ చేయించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు చెత్త సేకరణలో సిబ్బంది ఉత్సాహంగా పని చేయడం లేదు. పట్టణంలో సేకరిస్తున్న చెత్తకు డంపింగ్ యార్డు చాలడం లేదు. దీంతో ఈదరపల్లి – నల్ల వంతెన మధ్య బైపాస్ రోడ్డును ఆనుకుని చెత్త వేస్తున్నారు. పక్కనే ఉన్న బండారులంక మేజర్ పంచాయతీకి అసలు డంపింగ్ యార్డే లేకుండా పోవడంతో ప్రధాన రోడ్లు, ఇళ్ల వద్దనే చెత్తను ఉంచి తగులబెట్టాల్సి వస్తోంది. ● రావులపాలెం మండలం రావులపాడులో ఆర్అండ్బీ రోడ్డు, అమలాపురం పంట కాలువ మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. దీంతో, అందులోని చెత్తంతా పంట కాలువలోకి వెళ్లి, నీరు కలుషితమవుతోంది. ● కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల్లోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో పారిశుధ్య చర్యల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇటీవల కాట్రేనికోన మండలం పల్లంలో హెపటైటిస్–బీ వ్యాధి ప్రబలడానికి అపరిశుభ్రత కూడా ఒక కారణం. సంపద సృష్టించని కేంద్రాలు గ్రామ పంచాయతీల్లో ఒకవైపు కొండలా పేరుకుపోతున్న చెత్తను తగ్గించుకోవడం.. మరోవైపు నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారు చేయడం.. వాటి అమ్మకాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవడం.. ఇలా మూడు లక్ష్యాలతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మొదలు పెట్టారు. వీటి నిర్వహణలో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో పది శాతం పంచాయతీలకు కూడా డంపింగ్ యార్డులు లేకపోవడంతో రోడ్లు, పంట కాలువల చెంతన చెత్త వదిలేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్, టైర్ల వంటి వాటిని కూడా తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం ముప్పు ఏర్పడుతోంది. జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు 268 ఉన్నాయి. వీటిలో 198 పూర్తిగా పని చేస్తున్నాయని, 46 పాక్షికంగా పని చేస్తున్నాయని, 25 కేంద్రాల్లో వానపాముల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవంగా పని చేస్తున్నది పది శాతం కూడా లేవు. ఈ కారణంగా పంచాయతీల్లో అశించిన స్థాయిలో చెత్త సమస్య తీరడం లేదు. ఆదాయం కూడా రావడం లేదు. పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు, సిబ్బందిలో కంపోస్టు తయారీని దాదాపు వదిలేశారు. చాలా పంచాయతీలకు పారిశుధ్య సిబ్బంది లేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా మారింది. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట సర్కారు హడావుడి పల్లెలు, పట్టణాల్లో అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ కనీస సదుపాయాలు మృగ్యం నిధులివ్వని ప్రభుత్వం 10 శాతం కూడా లేని డంపింగ్ యార్డులు -
ప్రజా రవాణా అధికారి కార్యాలయం ముట్టడి
అమలాపురం రూరల్: స్థానిక ఆర్టీసీ డిపోలో 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయూ ఆధ్వర్యాన జిల్లాలోని అన్ని డిపోలకు చెందిన ఆర్డీసీ ఉద్యోగులు మంగళ వారం జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయా న్ని ముట్టడించారు. డ్రైవర్ నారాయణను అన్యా యంగా సస్పెండ్ చేశారని, 78 రోజులుగా ఉద్య మం చేస్తే సస్పెన్షన్ ఎత్తివేశారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కె.పద్మ, కోశాధికారి మోహన్, జిల్లా అధ్యక్షుడు బండి ముత్యాలరావు మాట్లాడుతూ, అక్రమ సస్పెన్షన్లు, తొలగింపులు ఆపాలని, పదో న్నతులు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, సిక్ లీవులకు పూర్తి జీతం చెల్లించాలని, పాత వైద్య విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి.గణపతి మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ నుంచి మినహాయించి, అన్ లిమిటెడ్ రిఫరల్ వైద్యం కల్పించాలని కోరారు. ఆందోళనలో యూనియన్ డిపో కార్యదర్శి కె.రవికుమార్, రామచంద్రపురం డిపో కార్యదర్శి వరలక్ష్మి, రామచంద్రపురం డిపో అధ్యక్షులు నారాయ ణ, బూరమ్మ, అమలాపురం డిపో ప్రచార కార్య దర్శి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి డెల్టా సిస్టం సీఈగా శ్రీరామకృష్ణ ధవళేశ్వరం: గోదావరి డెల్టా సిస్టం సీఈగా ఆర్.శ్రీరామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎస్ఈగా ఉన్న ఆయన ఇప్పటికే గోదావరి డెల్టా సిస్టం సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇప్పుడు పూర్తి స్థాయి సీఈగా నియమితులయ్యారు. -
వెంకన్న సన్నిధిలో జస్టిస్ కిరణ్మయి
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామివారి దర్శనానంతరం పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు, సిబ్బంది, అర్చకులు స్వామివారి చిత్రపటం అందజేశారు.సమగ్ర శిక్షా ఏపీసీగా మమ్మీఅమలాపురం రూరల్: సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్(ఏపీసీ)గా జి.మమ్మీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ డీఈఓ షేక్ సలీం బాషా ఏపీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో మమ్మీని పూర్తి స్థాయి ఏపీసీగా నియమిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మమ్మీ జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఈఓ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. -
స్పోర్ట్స్ కోటాలో ఉన్నత స్థానం సాధిస్తా
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పూర్తి చేశాను. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని గమనించి కోచ్ లక్ష్మణరావు దగ్గర జాయిన్ చేశారు. ఆయన నాకు ముందుగా ధైర్యం చెప్పి బాక్సింగ్లో మెళుకువలు నేర్పించారు. ఇప్పుడు నేను రాష్ట్ర బాక్సర్గా పేరు పొందాను. స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేయడమే నా లక్ష్యం. – కాకాడ హరిణి, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పట్టుదలతో నేర్చుకున్నా
క్రీడల్లో మంచి ప్రతిభ చూపి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉండేది. ఏ ఆటలో నాకు మంచి జరుగుతుందనేది అర్థమయ్యేది కాదు. కాని పిఠాపురంలో బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్న కోచ్ లక్ష్మణరావు వద్దకు వెళ్లి మాట్లాడగా నీవు బాక్సింగ్ బాగా ఆడగలుగుతావు అంటు ప్రోత్సాహించారు. ముందు కొంత భయమేసింది ఇంట్లో వాళ్లు బాక్సింగ్ అంటే చాలా ధైర్యం ఉండాలి.. జాగ్రత్త అన్నారు. కాని మా కోచ్ చాలా ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. పిఠాపురంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. జాతీయ స్థాయిలో మంచి పతకాలు సాధించడమే ధ్యేయం. – అడబాల వైష్ణవి, బాక్సింగ్ క్రీడాకారిణి, మల్లాం, పిఠాపురం మండలం -
తనయుడికి తల్లి తలకొరివి
మామిడికుదురు: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో జరిగిన ఈ సంఘటన పలువురి హృదయాలను కదిలించింది. సాధారణంగా హిందూ ధర్మంలో తల్లితండ్రులకు కొడుకులు దహన సంస్కారాలు నిర్వహించడం పరిపాటి. కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో మంగళవారం కన్నతల్లి కొడుకుకు.. దహన సంస్కారాలు నిర్వహించింది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారతిప్ప సమీపంలో 216 రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కామాని దుర్గాప్రసాద్ (32) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతను తెలంగాణలోని ఖమ్మంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన భార్యాపిల్లలతో అక్కడే ఉంటున్న దుర్గాప్రసాద్ స్నేహితుడి వివాహం కోసం నరసాపురం వచ్చాడు. ఖమ్మం నుంచి వచ్చిన తన మిత్రుని కుటుంబానికి అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయించిన అనంతరం నరసాపురంలో రైలెక్కించాడు. తర్వాత బంధువులను కలిసేందుకు మోరి వెళ్లాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. దుర్గాప్రసాద్ తండ్రి గతంలోనే మరణించడంతో, అతని పిల్లలు కూడా చిన్న వయసు వారు కావడంతో తల్లి ఆదిలక్ష్మి ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఈ ఘటన పలువురికి కంట తడి పెట్టించింది. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. -
ఫలిస్తున్న పంచ్తంత్రం!
మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు. – పి.లక్ష్మణరావు, బాక్సింగ్ కోచ్, పిఠాపురం పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్న్షిప్లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు. రింగ్లోకి దిగితే పతకం రావాల్సిందే సత్తా చాటుతున్న పిఠాపురం మహిళా బాక్సర్లు -
ఒలింపిక్ మెడల్ సాధించడమే ధ్యేయం
నేను ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తండ్రి బ్యాంక్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. నా సరదాను చూసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను మా కోచ్ లక్ష్మణరావు దగ్గర చేరి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర కాలంలోనే అన్ని మెళుకువలు నేర్చుకుని కాకినాడ డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అండర్ 19 స్కూల్ గేమ్స్ బాక్సింగ్కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యాను. పిఠాపురంలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించాను. విశాఖపట్నంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాను. ఒలింపిక్ మెడల్ సాధించడమే నా ధ్యేయం. – జే ఐశ్వర్య సూరి దీపిక, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
ఇసుక లారీ ఢీకొని కౌలు రైతు మృతి
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రమణ (48)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. మంగళవారం కౌలు రైతు అయిన సూరెడ్డి రమణ తుని రైతుబజారులో కూరగాయలు విక్రయించుకుని మోపెడ్పై స్వగ్రామానికి వస్తుండగా వెలంపేట వై.జంక్షన్లో రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రమణను తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతి తుని: రైలు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..తుని–హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు నలుపురంగు ట్రాక్ ధరించి ఉన్నాడు. చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి దగ్గర ఇతర ఏ ఆధారాలూ లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించవచ్చన్నారు. ఏలూరులో కలవచర్ల మహిళ... రాజానగరం: భర్తతో కోపంతో పుట్టింటికి వెళ్లిన మహిళ ఊహించని ప్రమాదానికి గురై అందరికీ దూరమైంది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్న మండలంలోని కలవచర్లకు చెందిన బొమ్మోతు కుమారి (40) ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోవడంతో మృతిచెందింది. ఏలూరు రైల్వే స్టేషను సమీపంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మండలంలోని ముక్కినాడకు చెందిన కుమారికి కలవచర్లకు చెందిన ఏసుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, కుమార్తెకు వివాహం చేశారు. ఈ క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల నడుమ ఏర్పడిన గొడవలతో కుమారి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు మండెల సత్యనారాయణ, పాపలు పనుల కోసం హైదరాబాద్కి పయనమవడంతో వారితోపాటు తాను కూడా గౌతమీ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది. డోరులో నిలబడివున్న ఆమె ఏలూరు సమీపంలోకి వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏసు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి, మృతురాలిని తన భార్యగా నిర్ధారించాడు. కేసును ఏలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతిగోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో శతాధిక వృద్ధురాలు అల్లిమిల్లి చంటమ్మ(109) మంగళవారం మృతి చెందారు. ఆమెకు నలుగురు కుమారులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడుతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరితో పాటు 90 మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు. ఉదయం వరకు ఆర్యోంగా ఉన్న ఆమె టిఫిన్ చేసిన అనంతరం మరణించారు. -
కుక్కలు, పందుల నివారణకు చర్యలు
అమలాపురం టౌన్: మున్సిపల్ రీజనల్ పరిఽధిలోని నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) సీహెచ్ నాగ నరసింహరావు స్పష్టం చేశారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే ఏర్పాట్లు చేశామని ఆర్డీ చెప్పారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలో కుక్కుల కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీలో రూ.15 లక్షలతో కుక్కల ఆపరేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ మున్సిపాలిటీలో పందులను నివారించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పట్టణాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పన్నుల వసూళ్లు నూరు శాతం జరిగేలా రెవెన్యూ విభాగాలు నిమగ్నం కావాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటి సరాఫరా విభాగాలపై ఆయన చర్చించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అమలాపురం కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, మండపేట కమిషనర్ టీవీ రంగారావు, కొవ్వూరు కమిషనర్ నాగేంద్రకుమార్, నిడదవోలు కమిషనర్ కృష్ణవేణి, రామచంద్రపురం డీఈఈ శ్రీకాంత్, ముమ్మిడివరం కమిషనర్ వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవన నిర్మాణం పరిశీలన: స్థానిక 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మితమవుతున్న కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవనాన్ని ఆర్డీ నాగ నరసింహరావు పరిశీలించారు. సమీక్షా సమావేశం అనంతరం పట్టణంలో ఆయన పర్యటించి పలు విభాగాలను సందర్శించారు. డ్రెయిన్లతో పూడిక తీయాల్సిన డీఈఈ నాగ సతీష్తో ఆర్డీ చర్చించారు.మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు -
గడువు ముగిసిన బీరు బాటిళ్లు ధ్వంసం
తాళ్లపూడి: మండలంలోని తుపాకులగూడెం పరిధిలోగల బీరు ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న సుమారు ఆరువేల కేసుల బీర్ను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలోయస్ బ్రావరిజస్కు చెందిన ఫ్యాక్టరీలో బీరు తయారు అవుతుంది. కొంతకాలంగా బీరు తయారీ నిలిచిపోయింది. దీంతో గోడౌన్ ఖాళీ చేయడంలో భాగంగా ఎకై ్సజ్ అధికారుల సమక్షంలో కాలం చెల్లిన బీరు సీసాల స్టాక్ను ధ్వంసం చేస్తున్నారు. సుమారు ఆరువేల కేసులను ధ్వంసం చేయాల్సి ఉండగా సోమవారం సుమారు 1,000 కేసుల బీర్ సీసాలను ధ్వంసం చేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. -
మహిళలకు కూటమి సర్కారు కుచ్చుటోపీ
అమలాపురం టౌన్: బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మహిళలు రోడ్డెక్కారు. కుట్టు మెషీన్లను వెంటబెట్టుకుని మరీ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకుని నిరసన తెలిపారు. గడియారం స్తంభం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. రూ.4,300 విలువైన కుట్టు మెషిన్ను కమీషన్ల కక్కుర్తితో రూ.23,500కు కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో పెంచిందని ధ్వజమెత్తారు.ఇన్నాళ్లూ బీసీ కులగణన లేకే ఇలాంటి స్కామ్లకు అవకాశం ఏర్పడుతోందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. కుట్టు మెషీన్ల పేరుతో రూ.245 కోట్ల మేర మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన కుంభకోణంపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఈ వారంలోనే రిలే నిరాహార దీక్ష, పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి దిగి వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వ కుట్టు మెషీన్ల స్కామ్పై కూడా పోరాటం మొదలు పెట్టామన్నారు.కూటమి ప్రభుత్వం స్కీమ్ల పేరుతో సాగించిన కుంభకోణాల దందాను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు వివరించారు. -
అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు
● కేసును ఛేదించిన పోలీసులు ● కన్నబిడ్డను కడతేర్చింది తల్లి, అమ్మమ్మే! ● కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం ● వివరాలు వెల్లడించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్ పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే కారణంగో కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పసికందును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు వివరాలను పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో చనిపోయిన యశ్విత తల్లి అయిన పసుపులేటి శైలజ నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్ను ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నారు. 2024లో వారికి పాప యశ్విత జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని, తన భర్త కూడా తనతో మునుపటిలా సఖ్యతగా ఉండడం లేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్ను వివాహం చేసుకోవడం ఆమె తల్లి పసుపులేటి అన్నవరానికి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో సతీష్కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చనే ఉద్దేశంతో ఆ తల్లి ఉంది. దీంతో ఇద్దరూ కలిసి పసికందును అడ్డు తొలగించుకోడానికి పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 5 నెలల వయసు గల యశ్వితను వారి ఇంటిలోనే వారిద్దరూ పీక నొక్కి చంపేశారు. అనంతరం పాప మృతదేహాన్ని ఇంటి వెనక గల నీటి బావిలో పడవేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చడానికి పాపకు ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటాడని నమ్మించి కేసును తప్పుదోవ పట్టించడానికి వారి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా కొంతసేపు నిద్ర పోయినట్లు నటించారు. అనంతరం లేచి తమ పాపను ఎవరో ఎత్తుకు పోయారంటు పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించగా వారి ఇంటి పక్కనే ఉన్న బావిలో పాప మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. పాప తల్లి శైలజ, అమ్మమ్మ పసికందును చంపి నూతిలో పడవేసి క్షుద్ర పూజల నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించామన్నారు. పాప తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో నిందితులు ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు ఆయన తెలిపారు. -
జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా బ్యాడ్మింటన్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం కాకినాడలో ఓ హోటల్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్వర్మ, కార్యదర్శిగా ఫణిగోపాల్, కోశాధికారిగా భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చుండ్రుగోవిందరాజు, కర్రి భామిరెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డిని సంఘం ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా ఎమ్.మురళీధర్, పీఎస్ గణేష్కుమార్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమూర్తి, అడ్డాల సత్యనారాయణ, జగన్నాఽథ్, సభ్యులుగా కేవీబీ కృష్ణంరాజు, యు.రామకృష్ణ, కె.నరసింహరావు, వి.శారదాదేవి, కె.శ్రీనివాస్, లక్ష్మణ్కుమార్, రామ్మోహన్రావు ఎన్నికయ్యారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆర్టీసీ బస్ నుంచి ఊడిన డీజిల్ ట్యాంక్ ● డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్ నిలిపివేత సీతానగరం: మండలంలోని వంగలపూడి ఏటిగట్టుపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ ఊడి పోవడంతో గమనించిన డ్రైవర్ బస్ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఫైర్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రమాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఉదయం 9 గంటలకు పురుషోత్తపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లుతున్న ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ వంగలపూడి – సింగవరం మధ్యలో ఊడి అందులోని డీజిల్ బయటకు లీకై ంది. డ్రైవర్కు బస్ నుంచి శబ్ధం రావడంతో ఏటిగట్టుపై బస్ని నిలిపివేశాడు. బస్ను గమనించగా డీజిల్ ట్యాంక్ ఒక వైపు ఊడి రోడ్డుపై రాసుకుంటూ వచ్చింది. బస్ను అలాగే నడిపి ఉంటే రోడ్డుపై ట్యాంక్ రాచుకుని నిప్పు రవ్వలు వచ్చి డీజిల్కు అంటుకుంటే ప్రయాణికుల పరిస్తితి ఏంటని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్ను అభినందించారు. ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్లో పంపించారు. పది కిలోమీటర్ల సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు శిథిలం అవ్వడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గత నెలలో కూటమి నాయకులు రోడ్డుకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టలేదు. రోడ్డు శిథిలమవ్వడంతో ఆర్టీసీ బస్లు తరచు పాడవుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
బడి బస్సుల భద్రత ఎంత?!
ఆన్లైన్లో తేదీల ఖరారు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణాశాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లో నమోదు చేశాక ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్నెస్ తనిఖీ చేస్తారు. వాహన కండిషన్పై సమగ్ర పరిశీలన అనంతరం ఽఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సులు ఏ విధంగా ఉండాలన్న దానిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. ● ఈ నెల 15తో ముగుస్తున్న పాత ఎఫ్సీ గడువు ● కొత్తగా ఎఫ్సీలు జారీచేస్తున్న అధికారులు ● స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు తప్పనిసరి ● జిల్లాలో 835 పాఠశాల, కళాశాల బస్సులు రాయవరం: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సుల వినియోగం పెరిగింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు 580 వరకు ఉన్నాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక శాతం మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. బస్సు సామర్థ్యం సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ఏటా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు బస్సు కండిషన్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈ నెల 14తో ముగియడంతో, ఈ నెల 15 నుంచి కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్నెస్) ఎలా ఉంది? అన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. 835 పాఠశాల బస్సులు కోనసీమ జిల్లాలో 580 వరకు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో 835 ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు ఉన్నాయి. జూన్ 15వ తేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు పొందాల్సి ఉంది. 2017 నుంచి స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిటోమీటర్లు మించి ఉండకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ నిబంధనలివీ.. బస్సు డ్రైవర్కు బీపీ, సుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్ కండిషన్లో ఉండాలి. స్పీడో మీటర్ పనిచేయాలి. స్టీరింగ్, టైర్లు కండిషన్లో ఉండాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం విద్యాశాఖ, ట్రాన్స్పోర్ట్, పోలీస్, సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్ ఉండాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్ ప్లాన్ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం మోటార్ వాహనాల నిబంధనలు పాటించని పాఠశాల, కళాశాలల బస్సులను సీజ్ చేస్తాం. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – డి.శ్రీనివాసరావు, జిల్లా రవాణాశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ద్రాక్షారామలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతి చెందాడు. ద్రాక్షారామ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం హసన్బాదకు చెందిన పిల్లి గోపాలకృష్ణ(27)కు గత నెల 22న వివాహం జరిగింది. గోపాలకృష్ణ కాజులూరు మండలం గొల్లపాలెంలో మోటారు సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సోమవారం అత్తవారి ఊరు కె.గంగవరం మండలం శివల వెళుతూ ఉండగా యానాం వెళుతున్న ఆర్టీసీ బస్సుకు అతడి చొక్కొ తగులుకోవడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలతో ఉన్న అతడిని స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా ఆసుపత్రిలో మృతి చెందాడు. వృద్దాప్యంలో ఉన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులు పిల్లి సూర్యనారాయణ, భూలక్ష్మిలకు కుమారుడు, కుమార్తె ఉండగా గోపాలకృష్ణ పెద్దవాడు. కుమార్తెకు ఇదివరకే వివాహం జరుగగా కొంచెం అమాయకంగా ఉండే గోపాలకృష్ణకు గత నెల 22నే వివాహం జరిగింది. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరితరం కావడం లేదు. దీనిపై ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరి వేసుకుని టీచర్ మృతి
నిడదవోలు రూరల్: కుటుంబ కలహాలు, భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ప్రైవేటు స్కూల్ టీచర్ మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన పంతగాని విమలకుమారి (40) తిమ్మరాజుపాలెంలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట శ్రీను విజయవాడలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 2015లో వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు పలు విషయాల్లో గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బంధువులు ఇంటికి వివాహానికి వెళ్లే సమయంలో వివాదం తలెత్తింది. దీంతో విమలకుమారి ఇంటి పైపోర్షన్లో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు పేర్కొన్నారు. -
నాణ్యతతో అర్జీల పరిష్కారం
అమలాపురం రూరల్: గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చే అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ఎన్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గోదావరి భవన్లో గ్రీవెన్స్ నిర్వహించారు. డీఆర్ఓ, డ్వామా పీడీ మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తి, జీఎస్డబ్ల్యూఎస్ ఇన్చార్జి నోడల్ ఆఫీసర్ ఎస్టీవీ రాజేశ్వరరావు, ఏఓ విశ్వేశ్వరరావు 215 అర్జీలను స్వీకరించారు. డీఆర్ఓ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం లేకుండా ఆయా మండల, డివిజన్ కేంద్రాలలో అర్జీలను సమర్పించి పరిష్కార మార్గాలు పొందొచ్చన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీడీ మమ్మీ, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డీసీహెచ్ఎస్ కార్తీక్, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీపీఓ శాంత లక్ష్మి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టీ.ప్రసాద్, ఎస్ఈ పీఆర్ రామకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 26 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 26 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులను ఆయనకు అందజేసి సమస్యల పరిష్కారాన్ని అభ్యర్థించారు. ఎస్పీ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని సూచించారు. -
తీరంలో కొత్త మొలక!
సాక్షి, అమలాపురం: సముద్ర నాచు (సీ వీడ్) సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ ఈ సాగు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇటీవల కాలంలో గుజరాత్ సముద్ర నాచు తయారీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఈ సాగు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం సాగుతోంది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా ఈ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించడంతో శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారులు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మామిడికుదురు మండలంలో ఒక ఔత్సాహిక రైతు సాగు ప్రారంభించారు. తీరంలో ఈ సాగు విజయవంతం అయితే ఆక్వాకు ప్రత్యామ్నాయ సాగుగా మారడంతోపాటు ఆక్వా వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని తగ్గుతుంది. సముద్రపు నాచు సాగుకు గతంలో ఒకసారి మంచి గుర్తింపు వచ్చింది. అయినా పాత పద్ధతిలో సాగు చేయడం వల్ల అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. ఈ సాగు విజయవంతం అయితే తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు, మహిళలకు, ఆక్వా రైతులకు స్థిరమైన ఆదాయం ఇచ్చేలా మారనుంది. మరీ ముఖ్యంగా కష్టాల వనామీ వంటి పంటలకు ప్రత్యామ్నాయం కానుంది. జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 90 కిలోమీటర్ల తీరం ఉంది. ఏడు మండలాల్లో తీర ప్రాంతం ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా కన్నా కోనసీమలోనే ఆక్వాసాగు అధికం. సముద్ర నాచు సాగు చేపట్టేందుకు అనువైన స్థలం, వాతావరణం ఇక్కడ ఉంది. మామిడికుదురు మండలం గొల్లపల్లి, కరవాకల మధ్య ఈ సాగును ఒకరు మొదలు పెట్టారు. అతి విలువైనది సముద్ర నాచు చాలా విలువైనది. జపాన్, చైనాలో దీనిని ఆహారంగా తీసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనూ దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నాచు పోషకాల నిధిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందులు, ఎరువులు, పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్ కూడా తయారు చేస్తున్నారు. నాచు రకాలు సముద్ర నాచులో గ్రేసిలేరియా, కప్పాఫైకస్, ఉల్వా, సర్గాస్సమ్ అనే రకాలు ముఖ్యమైనవి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, మట్టి రంగుల్లో ఉంటాయి. వీటిలో కప్పాఫైకస్ అల్వారెజీ రకం ఒకటి. దీని ద్వారా కేరాజినన్ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలలో వాడతారు. అలాగే గ్రేసిలేరియా ఎడ్యులిస్ రకం నుంచి అగర్ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది మైక్రో బయాలజీ, ఆహార పరిశ్రమ, ఔషధాల తయారీలో విస్తతంగా ఉపయోగిస్తారు. ఈ రెండు జాతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కానున్నాయి. జిల్లాలో ఈ ప్రాజెక్టులకు గ్రీన్ క్లైమేట్ ఫండ్, నాబార్డ్ నిధులు అందిస్తాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది కోనసీమ అనుకూలం సముద్రపు నాచు సాగు పైలట్ ప్రాజెక్టును కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత మలికిపురం మండలం తూర్పుపాలెంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తరువాత జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం ఉంది. దీనిలో భాగంగా ఇటీవల సముద్రపు నాచు సాగులో నిపుణులు, సీఎస్ఐఆర్, సీఎస్ఎంసీఆర్ఐ, మండపం, తమిళనాడు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బృందం కోనసీమలోని పలు మండలాల్లోని తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లాలో కాట్రేనికోన మండలంలోని కొత్తపాలెం, పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, గచ్చకాయల పోర, ఉప్పలగుప్తం మండలంలోని ఎన్.కొత్తపల్లి, ఎస్.యానం, వాసాలతిప్ప, మామిడికుదురు మండలం గోగన్నమఠం, కరవాక, గొల్లపాలెం, మలికిపురం మండలం తూర్పుపాలెం, సఖినేటిపల్లి మండలంలోని చింతల మోరి, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం, ఓడలరేవు, రెబ్బనపల్లి తదితర గ్రామాలలో సముద్రపు నాచు సాగుకు అనువైన ప్రదేశాలను నిపుణుల బృందం పరిశీలించింది. వనామీకి ప్రత్యామ్నాయం సముద్ర నాచు సాగు విజయవంతం అయితే వనామీ సాగుకు ప్రత్యామ్నాయంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వనామీ సాగులో సంక్షోభం వల్ల పలువురు రైతులు సాగుకు దూరమవుతున్నారు. సముద్ర నాచు నిలకడైన ఆదాయమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సముద్ర నాచు సాగుకు నాలుగు అడుగుల నీరు అవసరం. ఇప్పటికే తీరంలో చెరువులు సిద్ధంగా ఉన్నాయి. పంట దిగుబడి వచ్చేందుకు 45 నుంచి 60 రోజులు పట్టనుంది. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే ఏడాదికి నాలుగైదు పంటలు పండించే అవకాశముంది. ప్రస్తుత మార్కెట్లో కేజీ రూ.25 వరకు ధర ఉండగా, ఎకరాకు రూ.40 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఆక్వా వల్ల తీరానికి కలుగుతున్న నష్టం కూడా ఈ సాగు వల్ల తగ్గనుంది. పైలట్ ప్రాజెక్టుగా.. సముద్ర నాచు సాగుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసిన తర్వాత డీఆర్డీఏ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుల్లో సాగు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, సంప్రదాయ మత్స్యకారులు, యువకులలో ఔత్సాహికులను గుర్తించి వారికి సముద్రపు నాచు సాగులో శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా సాగు విజయవంతం చేస్తాం. – ఆర్.మహేష్కుమార్, కలెక్టర్ సముద్రపు నాచు సాగుకు శ్రీకారం మామిడికుదురు మండలంలో తొలి అడుగు చైనా, జపాన్లో పెరుగుతున్న డిమాండ్ ఆహార ఉత్పత్తిగా గుర్తింపు... బిస్కెట్లు, పాస్తా, న్యూడిల్స్ తయారు నాచుతో పంట పొలాలు.. తోటలకు సేంద్రియ ఎరువు పశుగ్రాసాలు.. చేపల మేతలలో సైతం వినియోగం విజయవంతమైతే జిల్లాకు పర్యావరణంగా మేలు ఆక్వాతో ధ్వంసమవుతున్న తీరం ఆక్వాకు ప్రత్యామ్నాయం కానున్న నాచు ఉత్పత్తి -
కొబ్బరి పరిశోధనా కేంద్రం అధిపతి చలపతిరావు బదిలీ
అంబాజీపేట: రాష్ట్రంలోనే ఏకై క కొబ్బరి పరిశోధనా కేంద్రమైన అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన సోమవారం తెలిపారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్టు హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా నియమించారన్నారు. కర్నూ లు జిల్లా నంద్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, ఉద్యాన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ముత్యాలనాయుడు అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్ర అధిపతిగా బదిలీ అయినట్లు సమాచారం.సమస్యల పరిష్కారానికి కృషిబంగారు, వెండి వర్తకుల రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్కుమార్ అమలాపురం టౌన్: రాష్ట్రంలోని బంగారు, వెండి, డైమండ్ వర్తకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్కుమార్ అన్నారు. అమలాపురంలోని యెండూరి హైట్స్ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర అసోసియేషన్ 3వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విజయకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న జరిగే రాష్ట్ర అసోసియేషన్ 4వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్ జైన్, జిల్లా బులియన్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్కుమార్ను సత్కరించారు. రాష్ట్ర అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ శాంతి లాల్జీ జైన్, రాష్ట్ర కార్యదర్శి బీఎంఆర్ శంకర్, అమలాపురం అసోసియేషన్ అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, కార్యదర్శి రాయుడు నాని, అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు, ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు తొలి రోజు జరిగాయని పేర్కొన్నారు. ఉదయం ప్రథమ సంవత్సరం మొత్తం జనరల్ ఇంటర్మీడియెట్ విద్యార్థులు 2004 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,878 మంది హాజరయ్యారు. ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు 297 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 249 మంది రాశారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం మొత్తం జనరల్ ఇంటర్ విద్యార్థులు 295 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 264 మంది రాశారు. ఒకేషనల్ ఇంటర్ విద్యార్ధులు 135 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 123 మంది రాశారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనతో పాటు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిటింగ్ స్క్వాడ్స్, కస్టోడియన్స్ పర్యవేక్షించారని తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు రావులపాలెం: సరస్వతీ నదీ పుష్కరాలకు సంబంధించి రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ జీజీవీ రమణ సోమవారం తెలిపారు. రావులపాలెం డిపో నుంచి వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల దర్శనాలతో పాటు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసే విధంగా రెండు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఈ నెల 15వ తేదీన రావులపాలెం నుంచి బయలుదేరుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉన్న కారణంగా ఈ నెల 20వ తేదీన మరో రెండు బస్సులు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. పై క్షేత్రాలు దర్శనం అనంతరం మొదటి సర్వీసులు 22వ తేదీ రావులపాలెం చేరుతాయన్నారు. టిక్కెట్ ధర రూ.2,200గా నిర్ణయించామన్నారు. వేసవి సెలవుల సందర్భంగా విహారయాత్రలకు, తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్గో సేవలు కూడా విస్తృతం చేశామని ఒక కేజీ నుండి 10 టన్నుల వరకు మామిడి, అరటి, కొబ్బరికాయలు, లగేజీ తక్కువ చార్జీతో భద్రంగా– హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, సాలూరు, విజయనగరం, బెంగళూరు పట్టణాలకు పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99592 25549, 99893 65239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఏపీ ఫైబర్నెట్ కేబుల్ ఆపరేటర్ల ధర్నా
అమలాపురం రూరల్: ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థ కార్యకలాపాలు దీన స్థితిలో ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేబుల్ ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను కాపాడి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో డీఆర్ఓ రాజకుమారికి సంఘం నాయకులు మాడాలక్ష్మి దుర్గప్రసాద్, లంకలపల్లి తాతాయ్యనాయుడు, ఇళ్ల కృష్ణ, గుమళ్ల పుల్లయ్యనాయుడు, అల్లు నాగేశ్వరరావు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ రోజువారీ అత్యవసర సర్వీసెస్ అయిన ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హెూమ్, డిజిటల్ చెల్లింపులు, స్కిల్ డెవలప్మెంట్, వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందక జనం తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారని అన్నారు. ఉద్యోగులను తొలగించడంతో సాంకేతికంగా ఇబ్బందులు పరిష్కరించే సిబ్బంది లేక కేబుల్ అపరేటర్లు నష్టపోతున్నారని వారు తెలిపారు. -
స్కాములతోనే కూటమి ప్రభుత్వం స్కీమ్లు
● కుట్టుమెషీన్ల పేరుతో రూ.245 కోట్లు దోచేశారు ● వైఎస్సార్ సీపీ నాయకుల నిరసన అమలాపురం టౌన్: స్కాములతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్కీమ్లు అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. చివరకు బీసీ మహిళలకు ఇచ్చే కుట్టుమెషీన్లలో సైతం కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు.వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో కూటమి ప్రభుత్వ కుట్టుమెషీన్ల స్కామ్పై జిల్లా పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నరవం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొని కుట్టుమెషన్ల స్కామ్పై పోరుకు సిద్ధమంటూ ప్రకటించారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష మంది లబ్ధిదారులకు కుట్టుమెషీన్లను అందజేసేందుకు 59 టెండర్లు వస్తే అందులో 56 టెండర్లకు అనర్హత వేటు వేసి కేవలం మూడే మూడు టెండర్లను పరగణనలోకి తీసుకున్నారని చెప్పారు. ఆ మూడింటిలో తమకు ఎక్కువ కమీషన్లు ముట్టజెప్పే టెండరుదారుడికి ఇచ్చారంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వం మహిళలకు, బీసీలకు ఎంత పెద్ద పీట వేసిందో, చంద్రబాబు ప్రభుత్వం ఎంత మోసం చేస్తోందో ప్రజలు గ్రహించాలని బోస్ సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలకు పెట్టింది పేరు. కుట్టుమెషీన్ల విషయంలో కక్కుర్తి పడ్డారంటే ఆశ్చర్యం ఏమి ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ రూ.4,300 విలువ చేసే కుట్టు మెషీన్ను శిక్షణ, పంపిణీ పేరుతో రూ.23,500కి పెంచారని చెప్పారు. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల స్కామ్కు పాల్పడిందని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ కాల్వల మూసివేత తర్వాత టెండర్లు లేకుండా నీటి సంఘాలతో పనులు చేయించడం సరికాదని పేర్కొన్నారు. కనీసం షార్ట్ టెండర్లతోనైనా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వంలో మాదిరిగా మహిళలకు ఇచ్చిన కుట్టుమెషీన్లకు అయ్యే వ్యయాన్ని డీబీటీ ద్వారా మహిళల బ్యాంక్ అకౌంట్లకే వేసి ఉంటే ఈ స్కామ్కు అవకాశం ఉండేది కాదని చెప్పారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీలకు కుట్టుమెషీన్లు, ఇసీ్త్ర పెట్టెలు అందించి బీసీల స్థాయిని దిగదార్చవద్దు. కులగణనతో జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటా రాయితీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ స్కామ్లపై వైఎస్సార్ సీపీ పోరు మొదలైందన్నారు. మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైకి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నటించి లోపల కమీషన్లు దండుకుంటోందని విమర్శించారు. రామచంద్రపురం పార్టీ కో ఆర్డినేటర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ మహిళల దినోత్సవం రోజున కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో మహిళలకు టోకరా వేసిన ప్రభుత్వం ఇదని అన్నారు. అమలాపురం పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కుట్టుమెషీన్ల స్కామ్ను ఇప్పుడు వైఎస్సార్ సీపీ అడ్డుకోకపోతే కూటమి ప్రభుత్వంలో స్కామ్లు పుట్టు గొడుగుల్లా పుట్టుకు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పి.గన్నవరం పార్టీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్కీమ్ల పేరుతో స్కామ్ల చేసే కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటాలతో ప్రజలు కళ్లు తెరిపిస్తామన్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు స్కామ్ల పర్వానికి వైఎస్సార్ సీపీ పోరాటాలతో ముగింపు పలకాలని ఆకాంక్షించారు. కుట్టుమెషీన్ల ముందు వారు నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో దద్దరిల్లిన అమలాపురం స్కామ్పై నిరసన కార్యక్రమం ముగిశాక పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్లు ‘ఇదేమి రాష్ట్రం... దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం... కుట్టు మెషీన్ల పేరుతో కూటమి దోపిడీ నశించాలి’ అంటూ నినదించారు. వారి గొంతులో మిగిలిన పార్టీ నాయకులు కలిపి పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో అమలాపురం గడియారం స్తంభం సెంటరు దద్దరిల్లింది. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు పితాని బాలకృష్ణ, అమలాపురం పట్టణ, రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవి, కొనుకు బాపూజీ, బద్రి బాబ్జి, పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు వంగా గిరిజాకుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, జాన గణేష్, తోరం గౌతమ్ రాజా, సూదా గణపతి పాల్గొన్నారు. -
పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
విద్య.. అస్తవ్యస్తీకరణ!
పదోన్నతుల్లో.. ● ప్రమోషన్ సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. ● బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వేర్వేరుగా చేపట్టాలి. 610 జీవోలో జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీకి రక్షణ కల్పించాలి. ● మున్సిపల్ పాఠశాలల్లో అప్గ్రెడేషన్ ప్రక్రియ సత్వరమే చేపట్టి పదోన్నతులు ఇవ్వాలి.● సమస్యలపై యూటీఎఫ్ పోరుబాట ● డీఈవో కార్యాలయాల ఎదుట నేడు ధర్నా ● 117 జీవో రద్దు.. రీస్ట్రక్చరింగ్పై స్పష్టత కోరుతూ నిరసనకు సమాయత్తం రాయవరం: ఉపాధ్యాయ సమస్యలపై యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) పోరుబాట పట్టింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలల రీ స్ట్రక్చరింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశల వారీ ఆందోళనకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అలాగే బదిలీలు, పదోన్నతులకు అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో స్పష్టమైన జీవోలు లేకుండా రోజుకో విధమైన ఆలోచనతో పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు ఎదురుగా ధర్నాకు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు.. ● జీవో 117 రద్దు చేసి అందులోని లోపాలను సవరిస్తూ ప్రస్తుతం చేపడుతున్న రీ స్ట్రక్చరింగ్ విధానాలను పొందుపరుస్తూ కొత్త జీఓ విడుదల చేయాలి. ● అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలి. ● మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లు నియమించాలి. విద్యార్థుల సంఖ్య 75 మించితే పీఎస్ హెచ్ఎం పోస్టు అదనంగా కేటాయించాలి. అలాగే విద్యార్థుల సంఖ్య 120కి మించితే 6వ ఎస్జీటీ, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ వంతున కేటాయించాలి. ● ఉర్దూ, మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జీటీ/ఎస్ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదు. ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలి. ● అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలి. ● స్కూల్ అసిస్టెంట్లు రెండు కేటాయిస్తే ఒకటి లాంగ్వేజ్, రెండోది నాన్ లాంగ్వేజ్, నాలుగు పోస్టులు కేటాయిస్తే రెండు లాంగ్వేజ్, రెండు నాన్ లాంగ్వేజ్ పోస్టులు కేటాయించాలి. ● స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలి. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంను కొనసాగించాలి. ● ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45కు మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేసి, తదనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలి. ● విద్యార్థుల సంఖ్య 300 దాటిన హైస్కూళ్లలో రెండో పీడీ పోస్టు కేటాయించాలి. బదిలీలకు సంబంధించి.. ● బదిలీల జీవో తక్షణం విడుదల చేసి, వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. ● బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ బోధనకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ● ఎస్జీటీల బదిలీల్లో మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. ● స్కూల్ అసిస్టెంట్ టీచర్లు (స్పెషల్ ఎడ్యుకేషన్)కు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులను ఖాళీలుగా చూపాలి. స్పష్టత ఇవ్వాలి పాఠశాలల రీస్ట్రక్చరింగ్ విధానంలో ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధానంలో లేవనెత్తిన లోపాలను వెంటనే సవరించాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉండాలి. – మేడిచర్ల త్రి వెంకట ఆది సత్య సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
రథోత్సవంపై సూర్య ప్రతాపం
ఘనంగా వన విహారోత్సవం కల్యాణోత్సవాల్లో భాగంగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లకు వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఊరేగింపుగా కొండ దిగువన ఉద్యానవనంలోని మండపం వద్దకు తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. సాయంత్రం 4 గంటలకు పండితులు పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను దేవస్థానం చైర్మన్, ఈఓల తరఫున పండితులు సమర్పించి, వేదాశీస్సులు అందజేశారు. కార్యక్రమాన్ని వేద పండితులు యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, అర్చకుడు గంగాధరభట్ల శ్రీనివాస్, పవన్ తదితరులు నిర్వహించారు. ● జనం రాక కళ తప్పిన ఉత్సవం ● నూతన రథంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపుఅన్నవరం: సత్యదేవుని రథోత్సవంపై సూర్యుడు ప్రతాపం చూపించాడు. నిప్పుల వర్షం కురిసినట్టుగా ఎండ కాయడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఉత్సవం కళ తప్పింది. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతో రథోత్సవం ప్రారంభ సమయానికి గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. గత ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగగా, ఈసారి 4 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకే ముగిసింది. గత ఏడాది రథోత్సవం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. అప్పటికి ఎండ తగ్గడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి ఉత్సవం మొదలయ్యే సమయానికి 35 డిగ్రీల సెల్సియస్కు పైబడి ఉష్ణోగ్రత ఉండటంతో గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. వారితో పోలిస్తే దేవస్థానం సిబ్బంది, పోలీసులు, కళాకారులే అధికంగా కనిపించారు. ప్రారంభ సమయానికి 250 మంది దేవస్థానం సిబ్బంది, 150 మంది పోలీసులు, 200 మంది కళాకారులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి కాస్త ఎండ తగ్గడంతో గ్రామస్తులు వచ్చారు. ఉత్సవం ముగిసే సమయానికి సుమారు 3 వేల మంది మాత్రమే ఉన్నారు. రథోత్సవంలో కోలాటం, కేరళ డప్పులు, విచిత్ర వేషాలు తదితర కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాత్రి అయితే ఎక్కువ మంది భక్తులు వీటిని తిలకించే అవకాశముండేది. విద్యుత్ సరఫరా నిలిపివేత రథోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలోని వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే రథోత్సవం త్వరగా పూర్తి కావడంతో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గత ఏడాది రాత్రి 12 గంటలకు కానీ విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోయారు. రథోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకూ అన్నవరం మెయిన్ రోడ్డులో వాహనాలు నిలిపివేశారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ ఉదయం 9.00 : కొండ దిగువన పంపా నది వద్ద సత్యదేవుడు, అమ్మవారికి చక్రస్నానం సాయంత్రం 4.00 : అనివేటి మండపం వద్ద నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచనం ఉదయం 7.00 – 10.00 వరకూ, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 వరకూ : రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు -
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరికపూజ వంటి విశేష పూజలు జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 34 మంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 15 జంటలు, స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొన్నాయి. రెండు జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ చేశాయి. స్వామి వారి సన్నిధిలో ముగ్గురు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురికి తులాభారం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. స్వామికి ముగ్గురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 16 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2056 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామి వారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,81,835 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
రత్నగిరిపై భక్తజన ప్రవాహం
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం భక్తజన ప్రవాహాన్ని తలపించింది. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఎండ వేడికి అల్లాడుతున్న భక్తులు సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఆదివారం 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్ల కింద సేద తీరారు. విపరీతమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. గతంలో పశ్చిమ రాజగోపురం వద్ద కూడా మజ్జిగ పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందుకనో పంపిణీ చేయడం లేదు. దీంతో భక్తులు శీతలపానీయీలను కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా జిల్లా కలెక్టరేట్ గోదావరిభవన్లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. -
కుట్టు మెషీన్ల అక్రమాలపై నేడు వైఎస్సార్ సీపీ పోరు
అమలాపురం టౌన్: మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న కుట్టు మెషీన్ల పంపిణీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా వైఎస్సార్ సీపీ పోరుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా స్థానిక గడియారం స్తంభం సెంటరులో సోమవారం ఉదయం కుట్టు మెషీన్లు ప్రదర్శించి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీయనుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఆ ఆందోళనకు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జక్కంపూడి విజయలక్ష్మి హాజరు కానున్నారు. ఆమెతో పాటు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, జిల్లాలో నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు హాజరు కానున్నారని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తెలిపారు. వీరితో పాటు జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీకి చెందిన బీసీ నాయకులు ఆ ఆందోళనకు హాజరై విజయవంతం చేయాలని నాగేంద్ర విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రేణులందరూ అమలాపురం గడియారం స్తంభం సెంటర్కు చేరుకోవాలని ఆయన సూచించారు. భక్తిశ్రద్ధలతో నృసింహ జయంతి సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం నృసింహ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వాముల, స్వామివారి దీక్షా విరమణను ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు పర్యవేక్షణలో వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకుడు రాజేష్ నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో స్వాములు గరుడ ముడిని భక్తి శ్రద్ధలతో సమర్పించారు. తొలుత స్వామివారి సన్నిధిలో ప్రధాన అర్చకుడు కిరణ్ విష్వక్సేన పూజతో విశేష కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారికి నక్షత్ర మాలా దీక్షా స్వాములచే ప్రత్యేక అభిషేకం చేయించారు. అలాగే కల్యాణ వేదిక వద్ద భారీ షెడ్డులో హోమం నిర్వహించేందుకు వేదమంత్రాలతో అర్చకులు పుణ్యాహవాచనం, అగ్నిమధనం, అగ్నిప్రతిష్టాపన చేశారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. కాగా ఏప్రిల్ 13, 14 తేదీలలో 27 రోజుల స్వామివారి దీక్ష చేపట్టిన స్వాములు, నృసింహ జయంతి రోజు ఆదివారం దీక్షా విరమణ చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ నేతృత్వంలో ఆలయ సిబ్బంది నృసింహ మాల దీక్ష విరమణకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం దీక్షాధారులకు, సాధారణ భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఏసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది అందజేశారు. మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): మండంలోని దోమ్మేరు శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ట్రాక్టర్ మోటార్ సైకిల్ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడి క్కడే మృతి చెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దోమ్మేరు గ్రామానికి చెందిన చిగురుపల్లి విద్యాసాగర్ (18) కాపవరం వెళ్లి అక్కడ నుంచి మోటార్ సైకిల్పై వస్తుండగా కొవ్వూరు వైపు నుంచి పంగిడికి గడ్డితో వెళుతున్న ట్రాలీ ట్రాక్టర్ ఎదురుగా ఢీకొనడంతో విద్యాసాగర్ దాని చక్రాల కింద పడిపోయాడు. దీంతో అతని తల, ఇతర శరీరభాగాలు నుజ్జయ్యి మృతి చెందాడు. విద్యాసాగర్ కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి అరవింద్ కుమార్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి, చెల్లి జోత్స్న ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో వారి రోదన వర్ణనాతీతమైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. సీఐ విజయబాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని వారికి నచ్చ చెప్పి యువకుడి మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ట్రాక్టర్ న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల బైఠాయింపు సీఐ జోక్యంతో పరిస్థితి ప్రశాంతం -
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
ఆలమూరు: స్థానిక జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి ఆనంద్ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన ఆనంద్ రాజమహేంద్రవరంలోని ఐసీఐసీఐ క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని మీద తన బైక్పై రావులపాలెం వైపు వెళ్తుండగా స్థానిక లాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. దీంతో ఆనంద్కు తలపై బలమైన గాయమై రక్తం పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టంకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా భార్య, ఒక పాప ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని.. పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం మేరకు అల్లూరిసీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మచ్చేపురానికి చెందిన కోడ మోహన్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో చేపల చెరువుల వద్ద పని చేస్తున్నాడు. ఆదివారం చేపల పట్టుబడి ఉండడంతో ఇతర కూలీలకు భోజనాలు తేవడానికి మోటారు సైకిల్పై చేబ్రోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద అత్యంత వేగంగా వచ్చిన ట్రాక్టర్ మోహన్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని.. తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం జంక్షన్ సమీపంలో లారీ ఢీ కొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. ఆదివారం విజయవాడ రాణీపేటకు చెందిన బూరాడ పట్టాభినాయుడు శుభలేఖలు ఇచ్చేందుకు శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. లారీ ఢీ కొనడంతో పట్టాభినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
నర్సింగ్ నైటింగేల్!
కపిలేశ్వరపురం: సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించాలి. రోగభయం లేని సమాజానికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. జనాభా, ఆరోగ్య ప్రమాణాల ప్రాతిపదికన తగినన్ని ఆస్పత్రులను, వైద్యులను, సిబ్బందిని నియమించాలి. వారి పూర్తి సేవలు రోగులకు అందేలా సహకరించాలి. వైద్యం ఎంత ఉన్నతంగా చేసినా సిబ్బంది, నర్సుల సహకారం లేకపోతే అంతా వృథా అయినట్టే. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర ఎంతో కీలకం. ఉమ్మడి జిల్లాలో నర్సులు ఇలా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్సీలు, 22 సీహెచ్సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలున్నారు. 200 మంది ఏఎన్ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్హెచ్పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తున్నారు. నర్సుల డిమాండ్లు వినేవారేరీ! ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనానాకు ముగ్గురు నర్సులు చొప్పున ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన నిర్దేశకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నర్సులపై పనిభారం అధికమవుతోంది. కార్మిక చట్టానికి భిన్నంగా వారు 8 గంటలకు బదులు 11 గంటలు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రత్యేక సదుపాయాలు లేవు. హెల్త్ సెక్రటరీలకు వైద్య సేవలకు తోడు ఇతర ప్రభుత్వ అనుబంధ పనులు సైతం చెప్పడంతో వైద్య సేవల్లో నాణ్యత కొరవడుతోంది. ఉద్యోగ ఉన్నతి ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోవడంతో నర్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జీజీహెచ్లో ఐసీయూ విభాగంలో ఒక్కో బెడ్కు ముగ్గురు చొప్పున నర్సులు ఉండాలన్నది ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సేవలందిస్తు ఆశా కార్యకర్తలు క్షేత్ర స్ధాయిలో వేధింపులకు గురవుతున్నారు. మార్చి 1న నిర్వహించిన ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, 30 ఏళ్ల సర్వీసు ఉంటేనే రూ.1.5 లక్షల గ్రాట్యుటీ ఇస్తామంటూ మెలిక పెట్టింది. 2024 డిసెంబర్లో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారి పోరాటాన్ని వేధింపులు, పోలీస్ చర్యలతో అణచివేసింది. పలు దఫాలుగా నిర్వహించిన నర్సుల ఉద్యమాలు ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. 180 రోజుల ప్రసూతి సెలవులకు అంగీకరించింది. నర్సుల దినోత్సవ నేపథ్యం ఇదీ... 1820, మే 12న ఇటలీలో ధనిక కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజును ప్రపంచ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ 1965లో నర్సింగ్ డేను గుర్తించింది. యుద్ధ సమయంలో గాయాలపాలైన వారికీ, ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారికీ ధైర్య సాహసాలతో వైద్య సేవలందించడంలో నర్సింగ్లో నైటింగేల్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో దోహదం చేశాయి. ఆమె రాసిన రచనలు వైద్యరంగాన్ని మరో మెట్టు ఎక్కించాయి. నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ పేరుతో సంస్థను స్థాపించి ఎందరో నర్సులను తయారు చేశారు. 1910 ఆగస్టు 13న లండన్లో ఆమె మృతి చెందారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆస్పత్రుల ప్రగతి స్వాతంత్య్రం వచ్చాకా రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే, వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నర్సింగ్ కౌన్సిల్తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా రోగుల సేవ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిన ఫ్లోరెన్స్ ఆమె మార్గంలో నేడు ఎందరో పయనం వారి శ్రేయస్సు ప్రభుత్వాల కనీస బాధ్యత మాటే మంత్రం.. మంత్రం లక్షణం.. మనసుపై బలమైన ముద్రవేసి సమస్య పరిష్కరించడం. ఈ లక్షణాన్ని నూరు శాతం కలిగి ఉన్న మన ఊరి మంత్రసాని ఆమె. కాలక్రమంలో నామాంతరం.. రూపాంతరం చెంది నర్సులుగా సమాజ సేవ చేస్తోంది. రోగం ఎంత క్షిష్టమైనదైనా.. రోగి శరీరం.. మనసు ఎంత అవసానంలో ఉన్నా తన అనునయ వాక్యాలతో మనసును ఊరడించి రోగభయాన్ని తగ్గించి మానసికంగా రోగం తగ్గడానికి ఉద్యుక్తుడిని చేసి వైద్యుడు ఇచ్చిన ఔషధం ఒంటబట్టేలా చేస్తుంది. ఎంత పెద్ద ఆస్పత్రి అయినా.. వైద్యుడు ఎంతటి ప్రవీణుడైనా ఆమె మాటల అనుపానం లేకపోతే ఎందరో రోగులు అంత తీవ్రతరమైన రోగం లేకపోయినా మానసిక భయంతో విలువైన ప్రాణాలు కోల్పోయేవారు. ఎంతో దూరం పోనవసరం లేకుండా ఇటీవల కొన్ని వేల మందిని కబళించిన కరోనాయే ఇందుకు సాక్ష్యం. ఆ కష్టకాలంలో ఎందరో రోగులు మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేకే మృతి చెందారన్నది నిర్వివాదాంశం. సరైన వైద్యాన్ని సకాలంలో అందిస్తూ సేవ చేసే మంత్రముగ్ధలైన నర్సులు నిజమైన సమాజ సేవకులు. వారికి ప్రేరణ.. ఆదర్శం ఫ్లోరెన్స్ నైటింగేల్. నిజంగా ఆమె సార్థకనామధేయురాలు. నైటింగేల్ అంటే మధురమైన గానం చేసే పక్షి అని అర్థం. ఆమె మాటల ప్రభావం ఎంతటిదో ప్రపంచం నేడు గుర్తిస్తోంది. ఇటలీలో జన్మించి ఐర్లాండులో నర్సింగ్లో సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత సేవా శిఖరం. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని నర్సుల దినోత్సవం సందర్భంగా కథనం. చాకిరీ మూరెడు... వేతనం బెత్తెడు... నర్సులు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలు పాటు సేవలందిస్తున్నారు. నెలకు వారికి ఇచ్చే వేతనం రూ.15 వేల లోపే. ప్రభుత్వ రంగంలోని నర్సులు సైతం వేతనాలు పెంచాలన్న డిమాండ్ అపరిష్కృతంగానే ఉంది. పీఎంఎంవీవై పథకం ద్వారా గర్భిణులను ప్రతి నెలా 9న ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో నర్సులు భాగస్వాములవుతున్నారు. జిల్లాకు సుమారుగా ఐదు వేల మంది చిన్నారుల చొప్పున ప్రతి నెల బుధ, శనివారాల్లో క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారు. వైద్య, ఆరోగ్య సేవలకు అవకాశం కల్పించాలి పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు చేసేందుకు పూర్తి స్ధాయిలో అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సచివాలయ పరిధిలోని పనుల భారాన్ని మోపడం సరికాదు. హెల్త్ సెక్రటరీలను యాప్ల నిర్వహణకు మినహాయించాలి. ఫీల్డ్ వర్క్లో ఉన్నందున ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – జి.నాగ వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ -
పాడైన గుడ్లే పోషకాహారం!
● గొర్రిపూడి అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ ● ఆందోళన వ్యక్తం చేసిన లబ్ధిదారులు కరప: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లేక అక్కడి చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులకు, గర్భిణులకు పోషకాహారం నిమిత్తం అందించే కోడిగుడ్లపై అంగన్వాడీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలం గొర్రిపూడి మార్కెట్సెంటర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 7వ తేదీన సరఫరా చేసిన కోడిగుడ్లను ఆదివారం లబ్ధిదారులు ఇంటి వద్ద ఉడకబెట్టగా దుర్వాసనతో కుళ్లిపోయాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికీ, ఎండకూ పాడయ్యాయి ఈ విషయమై సెక్టార్ సూపర్వైజర్ విజయలక్ష్మి వివరణ ఇస్తూ కోడిగుడ్లు చెడిపోవడం వాస్తవమేనని, అయితే వాటిని ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. నాలుగు రోజుల క్రితం కోడిగుడ్లు తీసుకు వచ్చే వ్యాన్ డ్రైవర్కు అకస్మాత్తుగా ప్లేట్లెట్లు పడిపోవడంతో కాకినాడ ఆసుపత్రిలో చేరారని, కోడిగుడ్లతో ఉన్న వ్యాన్ను బయట ఉంచేయడంతో వర్షానికి తడిసి, ఎండకు పాడైపోయాయని తెలిపారు. డ్రైవర్ కోలుకున్నాక ఈ విషయం ఏజన్సీ యజమానికి చెప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చి వెళ్లిపోయాడు. ఆదివారం కోడిగుడ్లు పాడైనట్టు గుర్తించిన వెంటనే ఏజన్సీస్కి తెలియజేస్తే, పాడైన గుడ్లను వెనక్కి తీసుకుని, మంచివి ఇచ్చేందుకు అంగీకరించారని, ఇదే విషయాన్ని సీడీపీఓకు కూడా తెలియజేసినట్టు విజయలక్ష్మి తెలిపారు. -
తొలిదశలో గుర్తిస్తే బోన్ క్యాన్సర్ నివారణ
● అమోర్ ఆసుపత్రి ఎండీ, బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిశోర్రెడ్డి ● ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్లపై పీఎంపీలకు అవగాహన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఇక చివరిదశే అని చాలామంది అనుకుంటారు. అది పూర్తి అపోహేనని హైదరాబాద్కు చెందిన అమోర్ ఆస్పత్రి ఎండీ, బోన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్రెడ్డి తెలిపారు. స్థానిక మోడల్కాలనీలో ఉన్న ఎఫ్ కెఫే హోటల్లోని ఫంక్షన్ హాలులో ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని పీఎంపీ వైద్యులకు ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ కిశోర్రెడ్డి ఆదివారం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎముకలకు కండరాలకు సంబంధించిన క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలను వివరించారు. క్యాన్సర్లు వ్యక్తి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ముఖ్యంగా బోన్ క్యాన్సర్లపై అవగాహన అవసరమన్నారు. బోన్ క్యాన్సర్కు గురైన ఎందరికో నేటి ఆధునిక వైద్యంతో నయం చేశామన్నారు. మూడేళ్ల చిన్నారికి సైతం బోన్ క్యాన్సర్ చికిత్స చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ ప్రసాద్, ఎండీ తానీషా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు రహమాన్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.ధనుంజయ్, కార్యదర్శి మట్టా రమేష్లతో పాటు అన్ని మండలాల నాయకులు హాజరయ్యారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ట్రావెల్ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
పెరవలి: మండలం ఖండవల్లి వద్ద మోటార్ సైకిళ్లను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన కపిలేశ్వరపు రామకృష్ణ అతని భార్య ఆదిలక్ష్మి, కుమారుడు హర్షతో కలసి మోటార్ సైకిల్పై పెనుగొండ మండలం రామన్న పాలెం వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టటంతో వారు ముగ్గురు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. మహిళకు ముఖంపై తగలటంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని, మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. వీరు ముగ్గురిని వైద్యం కోసం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు
అమలాపురం రూరల్: మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని మిక్చర్ కాలనీకి చెందిన పూజారి రాజు అనే యువకుడు ఇటీవల జై పాకిస్థాన్ అంటూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ అదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్బాబు అధ్వర్యంలో పోలీసులు రాజు ఇంటికి చేరుకుని తనిఖీ చేశారు. అతడు ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో ఉన్నట్లు అతని తండ్రి ఏసుబాబు పోలీసులకు తెలిపారు. తెలియక ఈ పోస్టు పెట్టినట్లు రాజు చెప్పినట్లు ఎస్సై శేఖర్బాబు తెలిపారు. ఈ కుటుంబం గతంలో మిక్చర్ కాలనీలో ఉండే వారని, సోఫా పనుల కోసం వెళ్లి కుటుంబ మొత్తం విజయనగరం జిల్లా సాలూరులో నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు. ● యువకుడి కోసం పోలీసుల గాలింపు -
భక్తులతో కిక్కిరిసిన బాల తిరుపతి
మామిడికుదురు: బాల తిరుపతిగా భక్తుల పూజలందుకుంటున్న అప్పనపల్లి బాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో జరిగిన శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో భక్తులు పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,06,417 ఆదాయం వచ్చింది. 5,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,200 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,01,381 విరాళాలుగా అందించారన్నారు. ఘనంగా పీవీ రావు జయంతి అమలాపురం టౌన్: మాల మహానాడు వ్యవస్థాపకుడు, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు చేసిన పీవీ రావు జయంతిని శనివారం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా మాల మహానా డు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయ న చిత్ర పటానికి మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ ఎంఏకే భీమారావు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఐఎన్.మల్లేశ్వరరావు, పెయ్యల పరశురాముడు, నాతి శ్రీనివాసరావు, పెనుమాల చిట్టిబాబు, బీవీ వీ సత్యనారాయణ, కాశి వెంకట్రావు, సరెళ్ల రామకృష్ణ, సాపే బాల రవి తదితరుల పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న కాకినాడలో జరగనున్న మాలల మహా రణభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టెన్నిస్ అకాడమీ ప్రారంభం అమలాపురం రూరల్: అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల ప్రాంగణంలో ప్రముఖ కోచ్ గోపీచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ అకాడమీని కళాశాల పాలక మండలి కార్యదర్శి డీఎస్ఎన్ రాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, క్రీడాకారులకు తర్ఫీదునిచ్చేందుకు ఈ అకాడమీని ప్రారంభించామన్నారు. పాలకమండలి అధ్యక్షుడు నడిపల్లి సుబ్బరాజు కళాశాల ప్రాంగణంలో రెండు కోర్టులు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిత్యాన్నదాన పథకానికి విరాళం అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ముంబైకి చెందిన దోనేపూడి జగదీష్ రూ.లక్ష, ఠానేలంకకు చెందిన జగత వెంకట గంగాధర్ రూ.10,116 విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాతలు ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. భీమేశ్వరస్వామి ఆలయంలో.. రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కు విశాఖపట్నానికి చెందిన ఇమంది శ్రీనివాసరావు, పద్మలత దంపతులు శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని చేతికి వారు నగదు అందించారు. స్వామివారి తీర్థ ప్రసా దాలు, జ్ఞాపికలను దాతలకు అందజేశారు. -
శనైశ్చర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లిలోని ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి పర్వదినం కలిసి రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల పూజలు, దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి, అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. ప్రత్యక్షంగా తైలాభిషేకాల టిక్కెట్లు ద్వారా దేవస్థానానికి రూ.9,51,360, ఆన్లైన్, క్యూర్, పరోక్ష పూజల టిక్కెట్ల ద్వారా రూ.11,53,000, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ 67,810తో కలిపి రూ.21,72,170 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. పది పాఠశాలల్లో వేసవి శిక్షణ కేంద్రాలు అమలాపురం టౌన్: జిల్లాలోని పది పాఠశాలల్లో ఉచిత వేసవి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు పలు అంశాలపై నిష్ణాతులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఏపీ గణిత ఒలింపియాడ్ సమకూర్చిన పుస్తకాలను అందజేశారు. జిల్లా విద్యాశాఖ తరఫున రిసోర్స్పర్సన్లకు, విద్యార్థులకు సరిఫికెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు తాగునీరు, స్నాక్స్, పండ్లు అందజేసిన ఫిజిక్స్ ఫోరం, గణిత ఫోరం, తెలుగు ఫోరానికి చెందిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో గణితావధాని, రాష్ట్ర మ్యాథమెటిక్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ టీఎస్వీఎస్ సూర్యనారాయణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎల్ఎన్ శ్రీరామ్, జిల్లా అధ్యక్షుడు బలభద్ర సురేష్, కోశాధికారి పాటి రామకృష్ణ, తెలుగు ఫోరం, ఇంగ్లీషు ఫోరం, సైన్స్ ఫోరం ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ చదరంగం పోటీలకు సాన్వీ
అమలాపురం రూరల్: గుంటూరులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం అండర్ – 7 పోటీల్లో అమలాపురంలోని కామనగరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న బి.సాన్వీ అత్యుత్తమ ప్రతిభ చూపి, 5 బై 6 పాయింట్లు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచి జాతీయ చదరంగ పోటీలకు అర్హత సాధించింది. ఆమెకు కోనేరు హంపి తల్లిదండ్రులైన అశోక్, లత చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో జూన్లో జరిగే జాతీయ పోటీల్లో సాన్వీ పాల్గొంటుందని కోచ్ వి.శ్రీనుబాబు తెలిపారు. సాన్వీని స్కూల్ డైరెక్టర్ నంద్యాల మనువిహార్, ప్రిన్సిపాల్ దేవీదీక్షిత్ శనివారం అభినందించారు. కాలువలో పడి మహిళ మృతి కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పరకాలువలో పడి పితాని రమణమ్మ (57) మృతి చెందింది. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలువకు చెందిన రమణమ్మ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రమణమ్మ ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యు లు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకాల్వ తూటి కాడపై ఆమె మృతదేహం శనివారం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపురం ఇన్చార్జి ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో.. ముమ్మిడివరం: ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొని బైక్పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం కోడూరుపాడు శివారు నక్కల పుంతకు చెందిన సవరపు నాగబాబు (28) శనివారం సాయంత్రం యానాం వెళ్లి తిరిగి వస్తున్నాడు. నగర పంచాయతీలోని కొండాలమ్మ గుడి వద్ద 216 జాతీయ రహదారిపై అమలాపురం నుంచి వస్తున్న వ్యాన్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగబాబుకు భార్య రేణుక, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడ అంతా క్షేమమేనా..
● ఇక్కడ స్థిరపడిన రాజస్థానీయుల ఆవేదన ● తమ వారి యోగక్షేమాలపై ఆరా పిఠాపురం: పాకిస్థాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులోని మన రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు. బ్లాక్ అవుట్లు, సైరన్ల మోతతో ఆ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో స్థిరపడిన రాజస్థానీయులు అక్కడి తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. వీరందరూ వివిధ వ్యాపారాల కోసం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ స్వగ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. అక్కడి వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లోని బార్మీర్, జైసల్మేర్, పోక్రాన్ వంటి ప్రాంతాలకు చెందిన తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత ఆర్మీ తమకు అండగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తున్నారని అక్కడి వారు తమ బంధువులకు సమాచారం ఇస్తున్నారు. -
30 మంది బీసీ ఉద్యోగులకు సత్కారం
అమలాపురం టౌన్: ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 30 మంది బీసీ ఉద్యోగులను శనివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు. జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు గుబ్బల మురళీకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారతీయ పర్యాటకులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల చిత్ర పటానికి జిల్లా సంఘ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చొల్లంగి శ్రీధర్, ఏపీ సెక్రటేరియట్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బత్తుల అప్పారావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు సమైక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న గుత్తల వీరబ్రహ్మం, ఏపీ సెక్రటేరియట్ సంఘ అధ్యక్షుడు అప్పారావు, ఉమ్మడి జిల్లా సంఘం అఽధ్యక్షుడు శ్రీధర్లను జిల్లా సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి కర్రి సుబ్బరాజు, ఆర్థిక కార్యదర్శి దుర్గ ప్రసాద్, ఉపాధ్యక్షులు సరిదే సత్య పల్లంరాజు, కారాడి వెంకట నరసింహరాజు తదితరుల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన 30 మంది బీసీ ఉద్యోగులకు సత్కారాలు జరిగాయి. -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీ ప్రక్రియకు ముందే ప్లస్ 2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టుల ఖాళీలను చూపించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ జీరో సర్వీసుతో న్యాయం బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులందరికీ జీరో సర్వీసు ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు బెనిఫిట్ రెండు నుంచి మూడేళ్లకు పెంచాలి. మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎం పోస్టులు పీఎస్ హెచ్ఎంలతో భర్తీ చేయాలి. పీఎస్ హెచ్ఎంలకు పదోన్నతులు కల్పించాలి. 120కి పైగా ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఒక పీఈటీ పోస్టు ఇవ్వాలి. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ సీనియారిటీ పాయింట్లను సరిచేయాలి డ్రాఫ్ట్స్ రూల్స్లో రూపొందించిన ప్రకారం ఏడాదికి ఒక పాయింట్ వంతున సర్వీస్ పాయింట్లు ఇవ్వాలి. తరచుగా వస్తున్న మార్పులతో రేషనలైజేషన్కు గురవుతున్న టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి న్యాయం చేయాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ -
ప్రతిధ్వనించిన వేదఘోష
● సత్యదేవుని సన్నిధిలో ఘనంగా పండిత సదస్యం ● 150 మంది పండితులకు సత్కారం అన్నవరం: రత్నగిరి వేద ఘోషతో ప్రతిధ్వనించింది. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో శనివారం వేద పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచీ విచ్చేసిన సుమారు 150 మంది వేద, స్మార్త పండితులు స్వామివారి ముందు తమ విద్వత్తును ప్రదర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా స్వామి, అమ్మవార్లను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పండితుల వేద మంత్రఘోషతో మార్మోగిపోయింది. తొలుత పండితులు సత్యదేవుని ముందు చతుర్వేద మంత్రాలు పఠించారు. దేవస్థానం పండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన వారిలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి (రాజమహేంద్రవరం), ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు ఘనపాఠి (తిరుపతి), ఉపాధ్యాయుల లక్ష్మీనృసింహ ఘనపాఠి (విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం), దువ్వూరి ఫణియజ్ఞ ఘనపాఠి, విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి తదితరులున్నారు. రాత్రి పొన్నచెట్టు వాహన సేవ ఘనంగా నిర్వహించారు. -
ప్రతి మహిళా శక్తిగా మారాలి
రాజానగరం: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేస్తోందని, వాటిపై అవగాహన పెంచుకుని ప్రతి మహిళా స్వీయరక్షణతో ఒక శక్తిలా ఉండాలని శక్తి టీమ్ జిల్లా ఇన్చార్జి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ అన్నారు. దివాన్ చెరువులోని షిరిడీసాయి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో శనివారం మహిళా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ స్వీయ రక్షణ చర్యలు, సైబర్ నేరాల అదుపు, సోషల్ మీడియా యాప్స్తో వచ్చే నష్టాలు, పోక్సో చట్టం, శక్తి యాప్లపై అవ గాహన కల్పించారు. మహిళలందరూ శక్తి యాప్ను తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆ యాప్ ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ కె.మంగాదేవి, ఎౖస్సై రామకృష్ణ, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నేడు సత్యదేవుని రథోత్సవం
● భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు ● తొలి పావంచా వద్దప్రారంభం కానున్న రథోత్సవం ● ఏర్పాట్లు పూర్తి అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్వామివారి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. 36 అడుగుల ఎత్తయిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను కొండ దిగువన గల మెయిన్ రోడ్డులో ఊరేగిస్తారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ వైభవంగా ఈ కార్యక్రమం జరపనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమ వివరాలు ఇవే.. ● సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు గల భారీ రథాన్ని తయారు చేశారు. ఇది అంతర్వేది దేవస్థానం రథం కన్నా రెండు అడుగులు మాత్రమే చిన్నది. ● రథాన్ని ఎత్తే జాకీకి 2 హెచ్పీ మోటార్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా రథాన్ని చుట్టూ తిప్పే వీలుంది. బరువంతా ఈ జాకీ మీద పెట్టినా ఏమీ కాదు. ● రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య ఈ రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 2.30 గంటల వరకు పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. 2.30 నుంచి 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు అలంకరణ చేస్తారు. ● నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగి ప్రారంభిస్తారు. ● రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ● రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్కు అంతరాయం కలుగుతుంది. 36 అడుగుల రథానికి విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రథోత్సవం పూర్తయ్యేవరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ● అన్నవరం మెయిన్ రోడ్డులో ఉదయం నుంచి వాహనాలను అనుమతించరు. తుని వైపు నుంచి వచ్చే వాహనాలను మండపం వద్ద గల ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. కాకినాడ, రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంవీఆర్ సెంటర్ ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. ● సుమారు 500 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ బి.సూర్య అప్పారావు, మరో పది మంది ఎస్ఐలు ఈ బందోబస్తులో పాల్గొంటారు. ● రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. -
సర్వాంతర్యామి.. సదా స్మరామి..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే దేవస్థానానికి రూ.47.78 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చ కుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అర్చక స్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అభిషేకార్చన లు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకార ప్రియుడై న స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సా ధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసింది. క్షేత్రపాలకుడికి పూజలు ఆలయ ఆవరణలో క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామి వారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా ఒక్కరోజు దేవస్థానానికి రూ.47,78,296 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. షామియానాల ఏర్పాటు శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షానికి వాడపల్లి క్షేత్రంలో అన్నప్రసాదం తాత్కాలిక షెడ్డు పడిపోయింది. దీంతో శనివారం తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం స్వీకరించడానికి ఇబ్బందులు లేకుండా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన షామియానాలు ఏర్పాటు చేయించారు. -
వ్యర్థానికి కట్టలతో అర్థం
పశువులు ఇష్టంగా తింటున్నాయి వరికోత యంత్రాలతో కోసిన గడ్డిని పశువులు ఇష్టంగా తింటున్నాయి. యంత్రాలతో వరికోతలు అధికంగా ఉండడంతో ఆ గడ్డినే వినియోగిస్తున్నాం. యంత్రాలతో కట్టలు కట్టించి, గడ్డివాములుగా వేస్తున్నాం. – నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, పాడి రైతు, పసలపూడి, రాయవరం మండలం కొరతను అధిగమిస్తున్నారు యంత్రాలతో కోసిన ఎండు గడ్డిని కట్టలుగా కట్టి వాటిని రైతులు పశుగ్రాసంగా ఉపయోగిస్తున్నారు. గడ్డిని కట్టలుగా చుట్టే యంత్రాల వినియోగం పెరగడంతో ఎండు గడ్డి కొరతను అధిగమిస్తున్నారు. గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు రావడంతో ఎండు గడ్డి వృథా తగ్గింది. రవాణా, వినియోగం సులువుగా మారింది. – ఎ.నాగశ్రావణి, మండల పశువైద్యాధికారి, రాయవరం మండలం. ఎండుగడ్డిని ట్రాక్టర్లపై తరలిస్తున్న రైతులు● యంత్రాలతో కోసిన పశుగ్రాసానికి పెరుగుతున్న క్రేజ్ ● ఎండు గడ్డిని కట్టలుగా కట్టి వినియోగిస్తున్న రైతులు రాయవరం: యంత్రాలతో కోసిన వరిగడ్డిని గతంలో చేలల్లోనే వదిలి వేసేవారు. రైతులు వ్యర్థంగా భావించిన గడ్డిని తగులబెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో యంత్రాలతో కోసిన గడ్డిని కట్టలుగా కట్టి పశుగ్రాసంగా వాడుతున్నారు. ఇప్పుడు 98 శాతం మంది రైతులు యంత్రాలతో వరికోతలు కోస్తున్నారు. దీంతో పాడి రైతులు వరికోత యంత్రాలతో కోసిన గడ్డిని కట్టలుగా కట్టి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. సాగులో భూమిని దమ్ము చేయడం నుంచి నాట్లు వేయడం, పురుగుమందుల పిచికారీ, పంట మాసూళ్ల వరకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వరి కోత యంత్రాలతో కోసిన పొలాల్లో ఉన్న గడ్డిని కట్టలు కట్టడానికి సైతం యంత్రాలనే వినియోగిస్తున్నారు. తీరుతున్న ఎండుగడ్డి కొరత దాళ్వా సీజన్లో పంట మాసూళ్లకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. యంత్రంతో పంట మాసూళ్లు చేయడం వల్ల వరి గడ్డి.. ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. గతంలో ముక్కలుగా మారిన గడ్డిని పశువులకు మేతగా వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు గడ్డిని చేలల్లోనే తగులబెట్టేవారు. దీంతో పాడి రైతులు పశువులకు మేతగా ఉపయోగించే ఎండుగడ్డికి కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గడ్డి కొరత కారణంగా ఎకరం గడ్డి సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు వరి కోత యంత్రాలతో మాసూలు చేసిన గడ్డి పశువులకు ఉపయోగంగా ఉంటుందని, ముక్కలైన గడ్డి పశువులు తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుందని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు యంత్రాల ద్వారా మాసూలు చేసిన వరి పంట గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించడాన్ని అలవాటు చేసుకున్నారు. సాధారణ వరికోతలు కోసిన ఎండు గడ్డికి, యంత్రాలతో కోసిన ఎండు గడ్డికి మధ్య పోషకాల్లో ఎటువంటి తేడా ఉండదని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 2.29 లక్షల పశు సంతతి ఉంది. వీటిలో 75,460 ఆవులు, 1,53,542 గేదెలు ఉన్నాయి. పశువులు కూడా ఇష్టంగా తినడంతో వరి కోత యంత్రాల ద్వారా మాసూలు చేసిన వరి గడ్డిని దాణాగా ఉపయోగిస్తున్నారు. గడ్డి కట్టలు కట్టడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న యంత్రాలతో పాటుగా, ఇతర జిల్లాల నుంచి యంత్రాలు మన ప్రాంతానికి వస్తున్నాయి. గడ్డిని ప్రత్యేక యంత్రం ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్లతో గట్టుకు చేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. యంత్రం ద్వారా కట్టలు కట్టడానికి ఒక్కో కట్టకు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికితోడు రవాణా, కూలి ఖర్చులు తోడవుతున్నాయి. దీంతో యంత్రం ద్వారా ఎకరం గడ్డి కట్టలు కట్టించడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. పొలాల్లో కట్టలుగా కట్టిన ఎండుగడ్డి -
ఎన్నేళ్లీ రెడ్ సిగ్నల్?
ఎన్నేళ్లీ రెడ్ సిగ్నల్? నమ్మండి ఇది రైల్వే ప్లాట్ ఫామ్! తుప్పలు... ముళ్ల పొదలు మొలిచిన ఇది రైల్వే ట్రాక్, రైల్వే ప్లాట్ ఫామ్ అంటే నమ్మడం కష్టమే అయినా ఇది నిజం. కాకినాడ – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పరిధిలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు గతంలో నిర్మించిన రైల్వే ట్రాక్ పరిస్థితి ఇది. ట్రాక్ మీద, ప్ల్లాట్ ఫామ్ మీద పిచ్చి మొక్కలు మొలిచాయి. రామచంద్రపురంలో ఉన్న రైల్వే స్టేషన్ ధ్వంసమైంది. గతంలో ఇక్కడ నుంచి రైలు మీద కాకినాడకు, కోటిపల్లికి ప్రయాణికులు వెళ్లేవారు. రూ.కోట్ల విలువైన బియ్యం ఎగుమతి జరిగేది. ఈ స్టేషన్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉండేది. ఇప్పుడు రైల్వే రాకపోకలు లేక స్టేషన్ ఇలా శిథిలావస్థకు చేరింది. సాక్షి, అమలాపురం: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కాకినాడ– నర్సాపురం రైల్వేలైన్. దీని నిర్మాణానికి 2004లో పునాది పడింది. 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పొడవు 102.507 కిలోమీటర్లు కాగా, కోటిపల్లి వరకు 45.30 వరకు పూర్తయ్యింది. బ్రిటిష్ కాలంలో 1928 నుంచి 1940 వరకు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్ ఉండేది. తరువాత నిలిచిపోగా 2004లో తిరిగి మొదలైంది. తొలుత చైన్నె నుంచి కాకినాడ మధ్య తిరిగే సర్కార్ ఎక్స్ప్రెస్ను కాకినాడ – కోటిపల్లి మధ్య ప్యాసింజర్గా తిప్పేవారు. ఇది భారీ నష్టాలు కలుగజేస్తోందని చెప్పి తరువాత రైలు బస్సును ప్రవేశపెట్టారు. ఇది చాలాకాలం సేవలందించింది. ఇది కూడా నష్టదాయకమని దీనిని కూడా నిలిపివేశారు. ఆరు సంవత్సరాలుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కోట్ల రూపాయల లాభా లు తెచ్చిపెట్టిన బియ్యం ఎగుమతులను కూడా నిలిపివేయడం గమనార్హం. కోటిపల్లి నుంచి వ్యాగన్ల ద్వారా ఇసుక కూడా ఎగుమతి అయ్యేది. గతంలో రామచంద్రపురం స్టేషన్ నుంచి బియ్యం ఎగుమతులు జోరుగా సాగేవి. నెలకు రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇతర ప్రాంతాల ఎగుమతిదారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇక్కడకు రైల్వే అధికారులు గూడ్స్ రైలు పంపలేదనే విమర్శలున్నాయి. ట్రాక్ మీద తుప్పలు... శిథిలమైన స్టేషన్లు కాకినాడ– కోటిపల్లి మధ్య ఆరేళ్లుగా రైలు రాకపోకలు నిలిచిపోవడంతో రైల్వేట్రాక్, స్టేషన్లు ధ్వంసమవుతున్నాయి. రైల్వే ట్రాక్పై పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ట్రాక్ మీద వేసిన రాళ్లు చెల్లాచెదురయ్యాయి. రోడ్డు క్రాస్ చేసే చోట ఏర్పాటు చేసిన గేట్లు ఊడిపోయాయి. చిన్న చిన్న ఇనుప, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. స్టేషన్లు సైతం ధ్వంసమయ్యాయి. గుమ్మాలు, ఇతర వస్తువులు తరలించుకుపోయారు. భవనాల కిటికీలు కూడా ఊడిపోయాయి. స్టేషన్, ప్లాట్ ఫామ్ల మీద కూడా పిచ్చి మొక్కలు మొలిచాయి. ఈ రైల్వే లైన్లో అతి పెద్ద స్టేషన్ అయిన రామచంద్రపురం పరిస్థితి మరీ దారుణం. బహిరంగ మరుగుదొడ్లుగా మారిపోయింది. జిల్లా పరిధిలోకి వచ్చే కోటిపల్లి, దంగేరు, ద్రాక్షారామ, రామచంద్రపురం వంటి స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. కాకినాడ– కోటిపల్లి రైల్వేలైన్ విద్యుద్దీకరణకు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదు. మొత్తం రూ.90 కోట్లు అయ్యే ఈ పనులకు 2023–24లో రూ.9 కోట్లు, 2024–25లో రూ.21 కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్లు కేటాయించారు. కాని పనులు మొదలు కాలేదు. పాత రైల్వేలైన్ మరమ్మతులకు రూ.పది కోట్లు కేటాయించినా పనులు చేయడం లేదని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. కనీసం ఉన్న రైల్వేలైన్ను వినియోగంలోకి తీసుకు రావాలని కోరుతున్నారు. కాకినాడ – కోటిపల్లి మధ్య తిరిగిన రైలు బస్సు నిరుపయోగంగా మారిన కోటిపల్లి రైల్వేలైన్ కాకినాడ– కోటిపల్లి లైన్ను పట్టించుకోరా? రైల్వే ట్రాక్ మీదనే పిచ్చిమొక్కలు ధ్వంసమైన రైల్వే స్టేషన్లు గతంలో 45.30 కిమీల పొడవునా ట్రాక్ నిర్మాణం విద్యుద్దీకరణకు రూ.90 కోట్లు రెండు విడతలుగా రూ.30 కోట్ల కేటాయింపు పట్టాలెక్కని పనులు తొలి దశలో కాకినాడ నుంచి కోటిపల్లి ప్యాసింజర్ తరువాత రైల్బస్సు రాకపోకలు గూడ్స్ నిర్వహణతో ఆదాయం ఆరు సంవత్సరాలుగా రాకపోకలు పూర్తిగా నిలిపివేత చిట్టడవిలా కోటిపల్లి రైల్వే స్టేషన్ అడవుల్లో రైల్వే స్టేషన్లను చూడడం కోనసీమ జిల్లా వాసులకు అరుదు. కాని కోటిపల్లి రైల్వే స్టేషన్, దాని పరిసరాలను చూస్తే అడవిలోని రైల్వే స్టేషన్ చూసినట్టు ఉంటోంది. ఒకప్పుడు కొబ్బరి, క్రోటన్ మొక్కలు.. స్టేషన్ను ఆనుకుని పచ్చని వరిచేలతో అందంగా ఉండే ఈ స్టేషన్ చుట్టూ ఏపుగా పెరిగిన వివిధ రకాల పిచ్చి మొక్కలతో ఇప్పుడు చిట్టడవిని తలపిస్తోంది.ఇది రైళ్లు తిరగని రైల్వే ట్రాక్ తుప్పలతో మూసుకుపోయిన ఇది రైళ్లు తిరగని రైల్వే ట్రాక్. కాకినాడ– కోటిపల్లి రైల్వే ట్రాక్ దుస్థితి ఇలా మారింది. ఇది రామచంద్రపురం– ద్రాక్షారామ రైల్వే స్టేషన్ల మధ్య చిన్న తాళ్లపొలం వద్ద రైల్వేగేట్ వద్ద పరిస్థితి. గతంలో రైళ్లు.. తరువాత రైలు బస్సు తిరిగిన ఈ ట్రాక్ మీద గత కొన్నేళ్లుగా రైళ్లు తిరగడం లేదు. దీనితో ఇలా తుప్పలతో నిండిపోయింది. అమలాపురం వరకూ పూర్తి చేయాలి కాకినాడ – నర్సాపురం రైల్వేలైన్లో గౌతమీ వంతెనకు సంబంధించి పియర్ల నిర్మాణం పూర్తయ్యింది. గెడ్డర్లకు టెండర్లు పూర్తి కావడంతో పనులు జరుగుతున్నాయి. వంతెన దాటిన తరువాత పది కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయితే అమలాపురం వరకు రైలు వచ్చే అవకాశముంది. దీనివల్ల రైల్వేకు ప్రయాణికుల ఆదాయం, గూడ్స్ ఆదాయం కూడా పెరుగుతుంది. – బండారు రామ్మోహనరావు,కోనసీమ జేఏసీ కన్వీనర్, అమలాపురం గూడ్స్ రైళ్ల ద్వారా ఆదాయం ప్రయాణికుల కన్నా గూడ్స్ ద్వారా రైల్వేకు ఆదాయం వస్తోంది. ఈ విషయం రైల్వే గుర్తుంచుకోవాల్సి ఉంది. రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి కేరళకు బొండాల రకంతోపాటు పలు రకాల ధాన్యం దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. గూడ్స్ రాకపోకలు మొదలైతే రైల్వే ట్రాక్కు ఇప్పుడున్న దుస్థితి ఉండదు. – కొవ్వూరి త్రినాఽథ్రెడ్డి, రామచంద్రపురం రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు -
వేదాంత పరిశ్రమలో మాక్డ్రిల్
ఉప్పలగుప్తం: భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మండలంలోని ఎస్.యానాం గ్రామంలో ఓఎన్జీసీ అనుబంధ పరిశ్రమ అయిన వేదాంత పరిశ్రమలో పోలీసు, రెవెన్యూ , మైరెన్, వేదాంత కంపెనీ అధికారుల మాక్ డ్రిల్ను నిర్వహించారు. సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్న క్రమంలో ఉద్యోగులు, శ్రామికులు వాటి నుంచి ఏవిధంగా బయట పడాలో శుక్రవారం మాక్ డ్రిల్లో ప్రయెగాత్మకంగా చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలపై పరిసర గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టే చర్యలను వివరించారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్కుమార్, ఓడలరేవు మైరెన్ సీఐ ఎమ్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎస్ఐ సీహెచ్ రాజేష్, రెవెన్యూ, వేదాంత పరిశ్రమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం
● 12 నుంచి 20 వరకూ నిర్వహణ ● జిల్లాలో 14,238 మంది విద్యార్థులు రాయవరం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్ పరీక్షలను 30 పరీక్షా కేంద్రాల్లో . ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 14,238 విద్యార్థులు ఫస్టియర్, సెకండియర్ కలిపి 14,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులు 10,519 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బెటర్మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉంది. సెకండియర్ పరీక్షలకు 3,719 మంది హాజరు కానున్నారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ విద్యార్థులు 12,008 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,230 మంది పరీక్షలు రాయనున్నారు. 12 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, రెండు రెసిడెన్షియల్, 15 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు తప్పిన, బెటర్ మెంట్ కట్టిన విద్యార్థులకు కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లను నియమించారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా, పోలీస్ స్టేషన్లలో భద్రపర్చారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పరీక్షలు 17వ తేదీ వరకు, 19, 20 తేదీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులు నిర్వహిస్తారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు -
ప్రశ్నిస్తే ఎడిటర్కు వేధింపులా?
– సీపీఎం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు అమలాపురం టౌన్: సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి, భూ కుంభకోణాల గురించి జర్నలిజం ద్వారా ప్రశ్నిస్తే పత్రికల ఎడిటర్ను వేధింపులకు గురి చేసేలా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని సీపీఎం జిల్లా కన్వీనర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంటిలో ఏపీ పోలీసులు సోదాలు చేయడాన్ని, వేధింపులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమలాపురంలో వెంకటేశ్వరరావు మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వాటిని ప్రశ్నిస్తున్న పత్రికల గొంతును నొక్కాలనుకోవడం అవివేకమని అన్నారు. పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర బలపడుతున్న తరుణంలో ఇలా జర్నలిస్టులు, ఎడిటర్లపై పోలీసులను ఉసిగొలిపి దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కి, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో విస్తృత తనిఖీలు చేసిన పోలీసులకు ఏమీ దొరకలేదంటేనే ఇది పూర్తిగా కక్ష సాధింపు కోసం చేసిన కుట్రేనని తేటతెల్లమవుతోందన్నారు. పత్రికలు వెలుగులోకి తెచ్చే అక్రమాలు, అవినీతి వార్తలను ప్రభుత్వం సలహాలుగా స్వీకరించాలే తప్ప ఇలా దాడులకు, వేధింపులకు పాల్పడం సరికాదన్నారు. ప్రభుత్వం అంటే ఎన్నికల వరకే పరిమితం కావాలి. అధికారం చేపట్టాక అందర్నీ, అన్ని వర్గాలను సమానంగా చూసినప్పుడే అది ప్రజారంజక ప్రభుత్వం అనే భావన కలుగుతుందన్నారు. జర్నలిజంపై దాడులు, కుట్రలు చేస్తే ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకునేది లేదిన స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆందోళనలు చేపట్టే పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలికారు. -
భవిష్యత్లో చైనా టెక్నాలజీతో విగ్రహాలు
● సెమినార్లో పాల్గొన్న శిల్పి రాజ్కుమార్ ● తయారీలో కొత్త పోకడలపై అధ్యయనం కొత్తపేట: చైనా టెక్నాలజీని భవిష్యత్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ తరహా విగ్రహాలు రూపకల్పనపై దృష్టి సారించనున్నట్టు అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డీ రాజ్కుమార్వుడయార్ తెలిపారు. చైనాలో నూతన టెక్నాలజీతో విగ్రహాల తయారీపై జరిగిన సెమినార్లో రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు. శుక్రవారం ఆ సెమినార్ విశేషాలను వివరించారు. వారం రోజుల పాటు సాగిన సెమినార్లో 250 దేశాల నుంచి వివిధ రకాల విగ్రహాల శిల్పులు పాల్గొన్నారన్నారు. ఇక్కడ సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కాంస్యంతో విగ్రహాలు తయారు చేస్తున్నామని, అక్కడ వీటితో పాటు ఇంకా అనేక రకాల లోహాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారని తెలిపారు. భారీ కాంస్య విగ్రహాలను నిర్మించడంలో చైనా కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. సంప్రదాయ క్యాస్టింగ్ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని కలిపి భారీ స్థాయి విగ్రహాలను చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయని, అత్యంత ఎల్తైన విగ్రహాలు కూడా ఆ దేశం టెక్నాలజీ ద్వారానే తయారవుతున్నాయన్నారు. ముందు చిన్న నమూనా విగ్రహం తయారుచేసి, దానిని 3 డీ స్కానింగ్ చేసి, కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా కోరుకున్న సైజుకు ఇమేజ్ను పెంచుతారని తెలిపారు. ఎత్తైన విగ్రహాల విడి భాగాలను సులభంగా పోత పోసేందుకు ఫౌండ్రీలు ఉన్నాయని తెలిపారు. పెద్ద పెద్ద ఫౌండ్రీల వల్ల తక్కువ సమయంలో విడి భాగాలను తయారుచేసే వీలు ఉంటుందన్నారు. భారీ విగ్రహాలు నెలకొల్పే విషయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలు చైనా కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. విగ్రహాలే కాక పార్కులు, సాంస్కృతిక చిహ్నాలు, వివిధ కళాకృతులు నిర్మిస్తారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాళ్లరేవు: యానాం–ద్రాక్షారామ రహదారిలో సుంకరపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడికి సత్యనారాయణ(69) మృతిచెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు స్థానిక అంబేడ్కర్నగర్కు చెందిన మడికి సత్యపారాయణ రహదారి చెంతన ఉన్న కుళాయి వద్దకు నీరు పట్టుకునేందుకు రాగా ఆ సమయంలో ద్రాక్షారామ నుంచి యానాం వేగంగా వెళుతున్న వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
మన్నికై నవే ఎన్నుకోండి
● ఆటలు ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ● రక్షణ కవచాలు లేకుంటే గాయాల పాలె ● నాసికరం కొన్నారంటే...మూన్నాళ్లే.... నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటలు అంటే అందరికీ ఇష్టమే. ఆరేళ్ల వయస్సు నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వివిధ రకాలైన ఆటలు ఆడడానికి ఉత్సాహం చూపుతారు. ఆసక్తి, అభిరుచి ఉన్న ఆటల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలలు కంటారు. వేసవి సెలవులు ఇవ్వడంతో జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల వేసవి శిక్షణ శిబిరాల్లో చేరేందుకు బాల బాలికలు ఆసక్తి కనపరుస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఆడేటప్పుడు లేదా శిక్షణ పొందే సమయంలో క్రీడాపరికరాలు, దుస్తులు, బూట్లు వినియోగించకపోతే గాయాలపాలై ఒక్కోసారి క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రకాల క్రీడల్లో వినియోగించే వస్తువులు, క్రీడాపరికరాలు, వాటి ధరలపై కథనం బాస్కెట్బాల్ టీ షర్ట్, షాట్, షూ వినియోగిస్తారు. బాస్కెట్బాల్స్ రూ.750 నుంచి రూ.2,500 వరకు, డ్రస్ రూ.900 నుంచి రూ.3,000, షూ రూ.1,500 నుంచి రూ.8,000, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు ఉన్నాయి. హాకీ రూ.650 నుంచి రూ.5,000 వరకు, నెట్ రూ. 25,000, గోల్కీపర్ కిట్ రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉన్నాయి. ఇందులో హెల్మెట్, చెస్ట్ప్యాడ్, బాడీ ప్రొటెక్షన్, గ్లౌజ్, ప్యాడ్, నీగార్డ్స్, ఎల్బోగార్డ్స్ను వినియోగిస్తారు. బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో రిస్ట్బ్యాన్ ్డ్స, నీక్యాప్స్, షూ, టీ షర్ట్, షార్ట్స్ వినియోగిస్తారు. ఫెదర్ కాక్స్ కొరత కారణంగా ఎక్కువ కాలం మన్నిక కోసం నైలాన్ కాక్స్ ఉపయోగిస్తున్నారు. బ్యాట్స్ రూ.650 నుంచి రూ.15,000 వరకు, నెట్స్ రూ.350 నుంచి రూ.3,000 వరకు, కాక్స్ బ్యారర్ రూ.300 నుంచి రూ.4,000 వరకు అమ్ముతున్నారు. హ్యాండ్బాల్ హ్యాండ్బాల్లో టీషర్ట్, షార్ట్, షూ వినియోగిస్తారు. బాల్స్ రూ.700 నుంచి రూ.5,000 వరకు, నెట్స్ రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. త్రోబాల్ బాల్స్ రూ.700 నుంచి రూ.1,500 వరకు, నెట్ రూ.600 నుంచి రూ.2,500 వరకు ఉన్నాయి. ఈ ఆటలో షార్ట్, టీ షర్ట్, షూ వినియోగిస్తారు. స్కేటింగ్ స్కేట్స్, హెడ్గార్డ్, ఎల్బో గార్డ్, నీగార్ట్స్, షూ, స్కేటింగ్ డ్రస్ వినియోగిస్తారు. స్కేటింగ్ షూ రూ.400 నుంచి రూ.10,000, డ్రస్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, ప్రొటెక్షన్ కిట్ రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉన్నాయి. టెన్నిస్ ర్యాకెట్లు రూ.1,500 నుంచి రూ.15,000 వరకు, బాల్స్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. తైక్వాండో.. తైక్వాండో డ్రస్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.60 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. షార్ట్పుట్ 8ఎల్బీ, 16ఎల్బీ, 12ఎల్బీబీ రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. క్రీడా పరికరాల కొనుగోలులో తీసుకోవల్సిన జాగ్రత్తలు క్రీడాపరికరాలు ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలి. నాసిరకం కంపెనీలు, డూప్లికేట్ కంపెనీ వస్తువుల పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. క్రీడాపరికరాలు తయారు చేసి ఎక్కువ సంవత్సరాలు కానివి కొనుగోలు చేయాలి. క్రికెట్, షటిల్, టెన్నిస్ బ్యాట్స్ కొనుగోలులో హ్యాండిల్స్, పగుళ్లు, ఫ్రేమ్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. నెట్ నాణ్యత కలిగినది కొనుగోలు చేయాలి. తక్కువకు వస్తున్నాయని డూప్లికేట్ కంపెనీలు కొనుగోలు చేస్తే మూన్నాళ్లకే మూలకు చేరడం ఖాయం. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. స్విమ్మింగ్ క్యాప్స్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ డ్రస్ వినియోగిస్తారు. స్విమ్ సూట్స్ రూ.100 నుంచి రూ.2,000 వరకు, గాగుల్స్ రూ.150 నుంచి రూ.5,000 వరకు, షాట్స్ రూ.250 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ షూ రూ.600 నుంచి రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. చెస్ చెస్ బోర్డ్స్ రూ.200 నుంచి రూ.2,000 వరకు, పాన్స్ రూ.100 నుంచి రూ.1,000 వరకు, టైమర్ రూ.2,000 నుంచి రూ.10,000, చెస్ మ్యాట్ రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చెస్ బోర్డు, పాన్స్ క్యారమ్స్ క్యారమ్ బోర్ుడ్స చిన్నవి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు, పెద్దవి రూ.1,200 నుంచి రూ.15వేల వరకు, క్వాయిన్స్ రూ.100 నుంచి రూ.500 వరకు, స్టైగర్స్ రూ.50 నుంచి రూ.500 వరకు, స్టాండ్ రూ.2,000, పౌడర్ రూ.40 నుంచి అందుబాటులో ఉన్నాయి. క్రికెట్ క్రికెట్లో హెల్మెట్, గ్లౌజ్, ప్యాడ్స్, ఆర్మ్గార్డ్, థైగార్డ్, క్రికెట్ బ్యాట్స్ వినియోగిస్తారు. క్యాస్ట్ బ్యాట్ రూ.1,800 నుంచి రూ.3,500, ఇంగ్లిష్ బ్యాట్ రూ.3,500 నుంచి రూ.60 వేల వరకు, బాల్స్ రూ.200 నుంచి రూ.250 వరకు, మ్యాచ్ బాల్స్ రూ.450 నుంచి రూ.900 వరకు, డ్రస్ రూ.650 నుంచి రూ.3 వేల వరకు, వికెట్స్, ప్యాడ్స్ రూ.1,200 నుంచి రూ.1,500 వరకు, కిట్ బ్యాగ్ రూ.800 నుంచి రూ.15 వేల వరకు, హెల్మెట్ రూ.1,100 నుంచి రూ.9 వేల వరకు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ టీటీ బ్యాట్స్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.30 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. టీటీ బోర్డ్స్ రూ.25,000 నుంచి రూ.80,000 వేలు వరకు దొరుకుతున్నాయి. ఫుట్బాల్ ఫుట్బాల్లో చిన్గార్డ్స్ వినియోగిస్తారు. బాల్స్ రూ.800 నుంచి రూ.2,500 వరకు, నెట్స్ రూ.500 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. డ్రస్ రూ.800 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉంది. వాలీబాల్ బాల్స్ రూ.600 నుంచి రూ.1,800 వరకు, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, డ్రస్ రూ.800 నుంచి రూ.8,000 వరకు ఉన్నాయి. -
ఒత్తిడిలో విద్యారంగం
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన అమలాపురం రూరల్: ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని, దశాబ్దాల నుంచి అమలులో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలల వ్యవస్థకు విఘాతం ఏర్పడుతోందని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడిమి రామచంద్రం ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో కలెక్టరేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన తెలిపారు. ప్రాథమిక పాఠశాల స్థానంలో ఒకటి, రెండు తరగతులతో వేల సంఖ్యలో ఫౌండేషన్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పథక రచన చేస్తోందన్నారు. ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఒక్కొక్క విధంగా విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తులు ఉండాలని సూచిందన్నారు ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలలలో శాసీ్త్రయమైన రీతిలో సబ్జెక్టు టీచర్లను నియమించాలని కోరారు. ఈ మేరకు డీఆర్ఓ రాజకుమారికి వినతి పత్రం అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి, డీఏలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యంపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మూడు దశల పోరాట కార్యక్రమానికి పిలుపు ఇచ్చిందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ నిరాజ్, జిల్లా నాయకులు నక్కా లల్లీ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళా హాస్టల్ వార్డెన్ మృతి
పెద్దాపురం, గండేపల్లి: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా హాస్టల్ వార్డెన్ నిండుకుండల నాగమల్లి (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రౌతులపూడి మండలం మెరక సోమవరానికి చెందిన ఈమె ఏడాదిగా హాస్టల్ వార్డెన్గా పనిచేస్తోంది. గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లితండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఎదురుగా శుక్రవారం ఉదయం మృతురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి యాజమాన్యం తప్పింద వల్లే ఈ ఘటన జరిగిందని ఆత్మహత్య కాదు హత్యేనంటూ నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయలంటూ డిమాండ్ చేస్తూ మెరక సోమవరం గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఘటనకు చేరుకుని న్యాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేసును సమగ్ర దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని గండేపల్లి ఎసై యువి శివ నాగబాబు తెలిపారు. పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన యాజమాన్యం, మృతిరాలు బందువులతో పోలీసుల చర్చలు -
కిక్ బాక్సర్కు ఎస్పీ అభినందన
కాకినాడ క్రైం: కిక్ బాక్సింగ్లో రాణిస్తున్న కాకినాడ నగరానికి చెందిన యువతి లేఖా నిహారికను ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఖా నిహారిక కేరళలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ శిక్షణలో రాణించి హంగేరియన్ వాకో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
సాక్షిపై కక్ష సాధింపు దారుణం
● ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు అప్రజాస్వామికం ● పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించిన పాత్రికేయులు ● పలుచోట్ల అధికారులకు వినతి పత్రాలు ప్రజాస్వామ్యానికి పాతరేసి.. నిబంధనలకు నీళ్లొదిలి.. నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష సాధింపునకు దిగడం దారుణమని పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం సోదాలకు తెగబడిన పోలీసుల తెంపరితనాన్ని జర్నలిస్టు సంఘాలు ఎండగట్టాయి. ప్రభుత్వ అవినీతిపై వరుసగా సాక్షిలో కథనాలు రావడంతోనే ప్రభుత్వం పత్రిక ఎడిటర్ ఇంటిపై దాడికి దిగిందని, ఇది అమానుషమని పేర్కొంటూ ఈ దుశ్చర్యను కలం వీరులు తీవ్రంగా ఖండించారు. అమలాపురం రూరల్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చాలా దారుణం, అప్రజాస్వామికంమని పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో కక్ష సాధింపుగా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించడం చాలా దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా అమలాపురంలో గురువారం విలేకరులు నిరసన తెలిపారు. అమలాపురం ప్రెస్క్లబ్, ప్రింట్ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్యనారాయణ, ప్రెస్క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఎండీ బషీర్, సాక్షి స్టాప్ రిపోర్టర్ నిమ్మకాయల సతీష్బాబు, ఏపీడబ్ల్యూజే అమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు అరిగెల రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పద్ధతులు మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాలను వెలికితీస్తున్నందుకే పత్రికల గొంతునొక్కేందుకు అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందన్నారు. ఇలాంటివి మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గెద్దాడ శ్రీనివాస్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పరస సుబ్బారావు, కట్టా మురళీకృష్ణ, నల్లా విజయ్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ డే పాటించిన పాత్రికేయులు కొత్తపేట: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణమని కొత్తపేట నియోజకవర్గ విలేకరులు ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి, బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తరఫున పోలీసు చర్యలకు నిరసనగా గురువారం డివిజన్ కేంద్రం కొత్తపేటలో విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి, బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. వరుస భూముల కుంభకోణాలను సాక్షి వెలుగులోకి తీసుకుని వస్తుండటంతో పాటు అమరావతి టెండర్లలో అక్రమాలపై వార్తా కథనాలను ప్రసారం చేస్తుండటంతో ప్రభుత్వం సాక్షి గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అందులో భాగంగా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు సోదాల పేరుతో అక్రమంగా ప్రవేశించి విచారణ పేరుతో వేధింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో కక్ష సాధింపుగా సాక్షి పత్రికను టార్గెట్ చేయడం, ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తగవన్నారు. ఇలాంటివి మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ఆర్డీఓ పీ శ్రీకర్కు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ విలేకరులు జగతా రాంబాబు, నామాల ఏసురాజు, కొవ్వూరి ఆదినారాయణరెడ్డి, వులుసు వీవీఎస్ సుబ్బారావు, శ్రీఘాకోళ్లపు బాబి పాల్గొన్నారు. ఇది అప్రజాస్వామికం కపిలేశ్వరపురం: సాక్షి దినపత్రికపై అక్కసు కక్కుతూ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం అప్రజాస్వామికమని కపిలేశ్వరపురం మండలానికి చెందిన సీనియర్ రిపోర్టర్లు ఖండించారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి వెళ్లడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కోశెట్టి దేవసహాయం, సీనియర్ రిపోర్టర్లు పెద్దింశెట్టి లెనిన్బాబు, శేఖర్, చిట్టికుమార్ అన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తూ వారు కపిలేశ్వరపురంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన పత్రిక ఎడిటర్ పట్ల పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. అమానుషం రామచంద్రపురం: ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ నిజాలను వెలికి తీస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం అమానుషం అని ఏపీజేడబ్ల్యూ జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాటే భీమశంకరం, ఏపీజేడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ప్రెస్ క్లబ్ కార్యదర్శి బోడపాటి ప్రసాద్ అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేయటాన్ని నియోజకవర్గ ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డీ అఖిలకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. పత్రికా పరంగా ఏదైనా తప్పు జరిగితే న్యాయపరంగా ఎదుర్కోవాలని, అంతేకాని ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఇలా జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేయటం తగదని వారు అన్నారు. నియోజకవర్గ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నరాల రాధాకృష్ణ, జర్నలిస్టులు బాషా, కొప్పిశెట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు. రాయవరంలో నిరసన రాయవరం: ‘సాక్షి’ సంపాదకుడు ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేయడంపై మండలంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. పి.సుబ్బరాజు, సత్యనారాయణరెడ్డి, చందు, వంశీ పాల్గొన్నారు. పోలీసుల దాడి అనైతికం అమలాపురం టౌన్: ఎలాంటి నోటీసు లేకుండా విజయవాడలోని సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేసిన ఏపీ పోలీసుల తీరు అనైతిక చర్యని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు వ్యవహరించిన తీరు ఎంత మాత్రం సహేతుకంగా లేదని పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉన్నత న్యాయ స్థానాల దృష్టికి తీసుకుని వెళ్లాలని జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్లు నిర్ణయించాయన్నారు. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళుతున్న కారణంగా జర్నలిస్ట్లను భయపెట్టి అదుపులో పెట్టుకోవాలన్న ఏకై క లక్ష్యంతో ఏపీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ తనిఖీల్లో ఏమీ లభించలేదు. కేవలం రాజకీయ కక్ష పూరిత కుట్రలో భాగంగా ధనుంజయరెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో ఈ తనిఖీలు చేసి, వేధింపులకు పాల్పడుతున్నారని ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లేనని తెలిపారు. -
నైపుణ్యంతో మెరుగైన సేవలు
కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు నాణ్యతకు పెద్దపీట వేస్తూ నైపుణ్యతతో మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రెండు నెలలుగా రెవెన్యూ, సర్వే ఉద్యోగులకు ప్రభుత్వ పనితీరు సామర్థ్యాలను పెంపొందించే దిశగా నిర్వహిస్తున్న క్విజ్ పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ లాప్టాప్లు, ప్రింటర్లు బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో మండపేట, ద్వితీయ స్థానంలో రావులపాలెం, తృతీయ స్థానంలో రాజోలు, నాలుగో స్థానంలో ఆత్రేయపురం, ఐదో స్థానంలో అమలాపురం తహసీల్దార్ బృందాలకు బహుమతులు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 22 మండలాల పరిధిలో రెవెన్యూ సర్వే ఉద్యోగులు 1,000 మంది నాణ్యతా పరమైన సేవలను అందించే దిశగా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి నేతృత్వంలోని బృందం చేస్తున్న కృషిని అభినందించారు. డీఆర్వో రాజకుమారి ఆర్డీవో కే మాధవి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు, తహసీల్దార్లు తేజేశ్వరరావు, ముక్తేశ్వరరావు, అశోక్ ప్రసాద్, రాజేశ్వరరావు పాల్గొన్నారు. 12న అప్రెంటిస్ మేళా రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 12న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.వేణుగోపాలవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఐటీఐ ఉత్తీర్ణత పొందిన వారికి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలకు చెందిన మేనేజ్మెంట్ స్టాఫ్ వచ్చి వారికి కావాల్సిన అప్రెంటిస్ ట్రైనీస్ను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారని తెలిపారు. వివిధ ట్రేడ్ల్లో ట్రైనింగ్ పూర్తి చేసి, ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు మేళాలో పాల్గొనాలని కోరారు. వివరాలకు 86392 30775 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
జేఎల్ఎంలకు పాత సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి
మలికిపురం: 2019లో నియమితులైన జూనియర్ లైన్మన్ గ్రేడ్–2 ఉద్యోగులకు పాత ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ ప్రకారమే ప్రమోషన్లు, ఇతర సౌకర్యాలూ కల్పించాలని జిల్లా జేఎల్ఎం సంఘ సమావేశం కోరింది. గురువారం మలికిపురంలో జరిగిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక సచివాలయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఐదేళ్లు గడుస్తున్నా ఎనర్జీ అసిస్టెంట్ విషయంలో ఇంతవరకు ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. కమిటీలు వేస్తూ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెబుతూ కాలం నెట్టుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో ఎనర్జీ అసిస్టెంట్స్ అందరూ సమ్మెకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజల రక్షణకు మాక్ డ్రిల్ అమలాపురం రూరల్: భారత్, పాకిస్తాన్ మధ్య అసాధారణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కొనసీమ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో మాక్ డ్రిల్ను నిర్వహించారు. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణలో అమలాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ మాక్డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. మాక్ డ్రిల్లో హాస్పిటల్ సిబ్బంది, రోగులు ప్రజలు భాగస్వామ్యమై భవనం నుంచి సురక్షితంగా బయటపడే పద్ధతులు, అగ్నిప్రమాద సమయంలో అనుసరించవలసిన జాగ్రత్తలు, అత్యవసర మార్గాల వినియోగం వంటి అంశాలపై డెమో ఇచ్చారు. ఇలాంటి డ్రిల్లులు ప్రజల్లో అప్రమత్తతను పెంచడమే కాకుండా, విపత్తు సమయంలో వేగవంతమైన స్పందనకు తోడ్పడతాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఫైర్మన్ మట్టపర్తి, బాలరామ్, అమలాపురం, ముమ్మిడివరం అగ్నిమాపక సిబ్బంది, కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
కార్పొరేట్ లాభాల కోసమే లేబర్ కోడ్లు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు కాకినాడ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం యూటీఎఫ్ హోంలో జరిగిన జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. మోదీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. స్వతంత్రానికి ముందుగానీ, తర్వాత గానీ వచ్చిన కార్మిక చట్టాలు ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నవని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలతో రైతులను, నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షాభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోదీ మతోన్మాద ఎజెండాను అమలు పరిచేందుకు, కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటోందని విమర్శించారు. సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నాయని, ప్రభుత్వ పథకాలలో పని చేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు కూడా సమ్మెను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్కుమార్, కాళ్ల నాగేశ్వరరావు, షేక్ పద్మ, మలకా రమణ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, వేణి, వెంకటలక్ష్మి, గుబ్బల ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ప్రతిష్టాత్మకంగా సాహితీ సంబరాల ఈవెంట్
సఖినేటిపల్లి: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో ఏలూరులో రెండు వేల మంది కవులు, కళాకారులతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఏర్పాటు చేసినట్టు వేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ అన్నారు. గురువారం సఖినేటిపల్లిలో ఈ మేరకు ఆయన ఈవెంట్లో ప్రదర్శించే వివిధ కళల ప్రదర్శనల బ్రోచర్ విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాహితీ సంబరాలలో ఏ విధమైన ఫీజులు లేకుండా పాల్గొనే కవులు, కళాకారులు అందరినీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్టు వెల్లడించారు. కాగా సాహితీ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమంగా రూపొందించిన ఈ ఈవెంట్ను కన్వీనర్లు కొల్లి రమావతి, డాక్టర్ పార్థసారధి, జి.ఈశ్వరీ భూషణం పర్యవేక్షిస్తారన్నారు. ఈవెంట్లో తెలుగు కవితోత్సవం, తెలుగు సాహిత్య సదస్సు, పుస్తకావిష్కరణలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు ప్రతాప్ పేర్కొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
రాయవరం: చెడు వ్యసనాలకు బానిసై..ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి రహదారి పక్కన పుల్లల లోడుతో ఆపి ఉన్న ట్రాక్టర్ విత్ ట్రైలర్ను అపహరించుకు పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాయవరం పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని పసలపూడిలోని గోదావరి రైసు మిల్లు సమీపంలో అదే గ్రామానికి చెందిన పిల్లి జానకిరామయ్య గత నెల 10న పుల్లల లోడుతో ఉన్న ట్రైలర్తో కూడిన ట్రాక్టర్ను నిలిపి ఉంచాడు. ఉదయం చూసుకునే సరికి ట్రైలర్తో కూడిన ట్రాక్టర్ అక్కడ లేకపోవడంతో దొంగతనానికి గురైనట్లుగా భావించిన జానకిరామయ్య రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సురేష్బాబు దర్యాప్తు చేపట్టారు. వెదురుపాక గీతామందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కొంకుదురు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబు, హెచ్సీ సత్యకుమార్, పీసీలు వీరేంద్రను ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
కావాలనే కడ తేర్చారా?
పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే, కావాలనే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పసికందు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఒక పథకం ప్రకారం కొందరు వ్యక్తులు పసికందును హత్య చేసి దానిని తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజల నాటకం ఆడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దిశలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హత్య కేసు చిక్కుముడి విడదీసిన పోలీసులు హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఎలా చేశారు? అనే విషయాలపై దృష్టి సారించి వాటికి సంబంధించిన క్లూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారనే బలమైన ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోడానికి మరొకరితో బంధాన్ని కలుపుకోడానికి పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసినట్లు పోలీసుల దర్యాప్తు తేటతెల్లమైనట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు చెబుతున్నారు. గుట్టువిప్పిన పసుపు కుంకుమ పసికందును హత్య చేసిన ఇంట్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుత సమాజంలో ఎక్కడా లేని క్షుద్రపూజలు పిఠాపురం పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే జగ్గయ్య చెరువులో కలకలం సృష్టించాయి. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అసలు క్షుద్ర పూజలు జరిగాయా అన్న విషయంపై ఆరా తీయగా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిసింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పరిశీలించిన పోలీసులు వాటి శాంపిల్ సేకరించి సంఘటన జరిగిన ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమతో పోల్చి చూడగా రెండు ఒకటేనని తేలినట్లు సమాచారం. క్షుద్రపూజలు జరిగినట్టు జనాన్ని, పోలీసులను నమ్మించాలని నిందితులు ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ హత్య కేసు చిక్కుముడిని విప్పినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులే ఇవి ఏర్పాటు చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వినికిడి. సాంకేతికత ఆధారంగా వాటిని ల్యాబ్కు పంపి నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. అవి క్షుద్ర పూజలు కాదు పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలిక హత్య జరిగిన ఇంట్లో క్షుద్ర పూజలు, చేతబడులు జరగలేదని అది కేవలం ఒక నాటకమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పోలీసు స్టేషన్కు వచ్చి తన మనుమరాలు అయిన ఐదు నెలల పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పట్టణ ఎస్సై మణికుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గాలింపులో ఒక నూతిలో ఐదు నెలల పాప పడి చనిపోయి ఉండడాన్ని గమనించి బయటకు తీశారన్నారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో వెంటనే కేసు నమోదు చేసి, నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్రపూజల నాటక మాడినట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించామన్నారు. త్వరలోనే పసికందును హతమార్చిన వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రాంతంలో ఎప్పుడూ క్షుద్ర పూజలు, చేతబడులు వంటివి లేవని, ఇవి కేవలం కల్పితమే కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హత్య కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం పసికందు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు -
డైట్కు నూతన అధ్యాపకులు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 16 మంది ఎంపిక రాయవరం: ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించబోయే వారికి శిక్షణనిచ్చే డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(డైట్) సంస్థకు నూతనంగా అధ్యాపకులు నియామకం చేపట్టారు. డైట్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించకుండా వారి స్థానంలో ప్రభుత్వ/జెడ్పీ/మున్సిపల్ తదితర యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్స్ నుంచి అర్హత ఉన్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్పై నియమిస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితికి నియమించిన అధ్యాపకులను ఇటీవల విధుల నుంచి విడుదల చేసి పంపించడంతో వారి స్థానంలో అవసరమైన సబ్జెక్టులకు కొత్త అధ్యాపకుల నియామక ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా గత నెల ఒకటో తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గత నెల 10వ తేది వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కాకినాడలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించి, వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహించి, మెరిట్ కమ్ సెలక్షన్ జాబితాను సిద్ధం చేశారు. దాని ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మంది అధ్యాపకులను వివిద సబ్జెక్టులకు ఎంపిక చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం ఎంపికై న అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాల్లో విధుల నుంచి విడుదలై డైట్లో విధుల్లో చేరాల్సి ఉంది. డైట్కు ఎంపికై న అధ్యాపకుల స్థానాలను బదిలీలు/పదోన్నతులతో భర్తీ చేసే అవకాశముంది. బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అమలాపురం రూరల్: మండలంలో కామనగరువు బైపాస్ రోడ్డులో ఆమని ఆటోమొబైల్స్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను ప్రమాదవశాత్తూ మరణించాడా లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఇతను. చనిపోయి మూడు రోజులు అయ్యి ఉంటుందని రూరల్ సీఐ ప్రశాంత్ తెలిపారు. -
ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ
అగ్ని ప్రమాదాల బారిన పడితే.. గ్రామాల్లో ముఖ్యంగా పశువులు పాకలు అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఆ సమయంలో పశువుల పాకల్లో ఉన్న గేదెలు, ఆవులు ప్రమాదంలో చిక్కుకుని కాలిపోతాయి. పశువుల కొట్టాం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ముందుగా పలుపుతాళ్లు కోసి పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాలిన గాయాలపై తరచు చన్నీళ్లు పోయాలి. వీలైతే పశువును చెరువులోనికి దింపి శరీరం పూర్తిగా తడిసేలా చేయాలి. పశువులను అరటి ఆకులపై పడుకొనేలా చూడాలి. పశువులకు అయిన గాయాలపై వరిపిండిలో ఏక్రిఫ్లేవిన్ పౌడర్ను వరిపిండి, కొబ్బరినూనె కలిపి పూయాలి. నడవలేని స్థితిలో ఉంటే పశువెద్యుడిని ఘటనా స్థలికి తీసుకుని వచ్చి వైద్యం చేయించాలి. రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు తోటలు, పొలాల్లోకి మేతకు వెళ్తుంటాయి. చెట్టుచేమల్లో గడ్డిని మేసే సమయంలో ఒక్కొక్కసారి విష పురుగులు, విద్యుత్ ప్రమాదాల బారిన పడుతుంటాయి. పశువులు ప్రమాదాల్లో చిక్కుకున్న సమయంలో పాడిరైతులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే పశువులను ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చునంటున్నారు రాయవరం మండల పశువైద్యాధికారి ఎ.నాగశ్రావణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. పాముకాటుకు గురైతే.. పశువులు పాముకాటుకు గురైతే విషం రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాపించి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పశువులు వెంటనే మరణించే అవకాశం ఉంది. పాముకాటు వేసినచోట ఎర్రగా మారి వాపు వస్తుంది. రెండు గాట్లు వెంబడి రక్తం వస్తుంది. పశువులు కింద పడిపోవడం, నోటి నుంచి చొంగ రావడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చికిత్స ఇలా.. అటువంటి సమయంలో పాముకాటు గుర్తించిన చోట రక్తం బయటకు వచ్చేలా గట్టిగా నొక్కాలి. అందుబాటులో టించర్ అయోడిన్ ఉంటే పాముకాటు వేసిన చోట పూయాలి. విషం పశువు శరీరంలోనికి ప్రవేశించకుండా పై భాగంలో తాడు/గుడ్డతో గట్టిగా కట్టాలి. ఆ తర్వాత పశువైద్యుడిని సంప్రదించి యాంటివీనమ్ టీకా వేయించాలి. పశువులను బాగా గాలి సోకే ప్రదేశంలో ఉంచాలి. శ్వాస బాగా ఆడేలా చూసుకోవాలి. విద్యుదాఘాతానికి గురైతే.. పశువులు విద్యుదాఘాతానికి గురైతే కొన్నిసార్లు వెంటనే మరణిస్తాయి. ఓల్టేజీ తక్కువగా ఉండి షాక్కు గురైతే శరీరంపై కాలిన మచ్చలు వస్తాయి. విద్యుదాఘాతానికి గురైన సమయంలో గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా గురవుతాయి. ముట్టుకుంటే అతిగా స్పందిస్తాయి. ఇలాంటి సమయంలో పశువులను నేరుగా తాకరాదు. విద్యుత్ నిలిపివేసిన తర్వాతనే పశువును ముట్టుకోవాలి. ప్రాణం ఉందని గుర్తించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. విషాహారం తింటే.. పంటను ఆశించే చీడపీడల నివారణకు రైతులు విషపూరితమైన రసాయనిక ఎరువులను పిచికారీ చేస్తారు. అనుకోకుండా పశువులు వాటిని తినడం వలన శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది. దీనివల్ల కళ్లు తేలేయడం, నోటి వెంట చొంగ కారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో పశువుకు కలప బొగ్గుపొడి కలిపిన నీటిని తాగించాలి. అది విష పదార్థాలను కొంత వరకు పీల్చుకుని పశువుకు హాని కలగకుండా చేస్తుంది. అలాగే వంట నూనె అరలీటరు, పది కోడిగుడ్ల తెల్లసొనను పశువులకు తాగించాలి. అనంతరం మెరుగైన వైద్యం కోసం పశువైద్యుడిని సంప్రదించాలి. పశువులు ప్రమాదంలో చిక్కుకుంటే ఆందోళన చెందవద్దు ప్రథమ చికిత్స అందించి వైద్యులను సంప్రదించాలి -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం మండలం కామనగరువు గ్రామానికి చెందిన కామన భార్గవ్ (24) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామనగరువు గ్రామానికి చెందిన భార్గవ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మోటార్ సైకిల్ని బోడసకుర్రు బ్రిడ్జిపై పార్కు చేసి నదిలోకి దూకేశాడని తెలిపారు. భార్గవ్ నదిలోకి దూకడంతో తన తమ్ముడిని రక్షించేందుకు అన్న రాజేష్ కుడా నదిలోకి దూకాడు. అయితే రాజేష్కు భార్గవ్ దక్కకపోవడంతో తన ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి, చాలా లోతుగా ఉండడంతో రాజేష్ ప్రాణాపాయ స్థితిలోకి చేరాడు. ఇంతలో బ్రిడ్జిపై నుంచి లారీ డ్రైవర్ పగ్గాన్ని రాజేష్కు అందించడంతో తాడుని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంతలో స్థానికంగా ఉన్న మత్స్యకారులు పడవలో వెళ్లి రాజేష్ని కాపాడి ఒడ్డుకి చేర్చారని పోలీసులు తెలిపారు. అయితే నదిలోకి దూకిన భార్గవ్ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అయితే సాయంత్రానికి భార్గవ్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకి చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తమ్ముడిని కాపాడేందుకు నదిలోకి దూకిన అన్నయ్య నీటి ప్రవాహంలో చిక్కుకున్న మృతుడి అన్నను కాపాడిన స్థానికులు -
టీచర్ లక్ష్మీ రంగమ్మకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం
రామచంద్రపురం రూరల్: మండలం వెలంపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి లక్ష్మీ రంగమ్మ గురుకుల పాఠశాలకు సంబంధించి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె బోధించే హిస్టరీ సబ్జెక్టులో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడంతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జిల్లా చొల్లంగిపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. 2025 పదో తరగతి పరీక్షల్లోను, ఇంటర్మీడియెట్లోను నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులవడమే కాకుండా, ఈ పాఠశాలకు చెందిన ఎ.దివ్య ఇంటర్లో వెయ్యి మార్కులకు 949 మార్కులు సాధించి గురుకుల పాఠశాలల్లో జిల్లా మొదటి స్థానం సాధించింది. ఆమె కూడా బెస్ట్ స్టూడెంట్గా ఎంపికకావడంపై ప్రిన్సిపాల్ పద్మావతి, సహచర అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ డీఐఈవో సోమశేఖరరావు అమలాపురం టౌన్: ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు జరుగుతాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ పరీక్షల్లో విధులు నిర్వర్తించే పరీక్షల కమిటీ సభ్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సమీక్షలో సిబ్బందికి ఆయన పలు సూచనలిచ్చారు. ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రధమ సంవత్సరం పరీక్ష ఉంటుందన్నారు. అదే ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో డీఆర్వో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై వివిధ శాఖలను సమన్వయం చేస్తూ సమీక్షించారని డీఐఈవో తెలిపారు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు యాళ్ల లక్ష్మణరావు, దేవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లిలో అంతా వారిష్టం!
కొత్తపేట: జిల్లాలోని వాడపల్లి క్షేత్రంలో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలు, ప్లైఓవర్స్, క్యూలైన్లకు సంబంధించి ప్రతి పనిలో అధికారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గం నియామకం కాకపోయినా పాలకుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పుకొంటున్న ఒక నాయకుడు అనధికార చైర్మన్గా పెత్తనం సాగిస్తున్నాడు. అంతా తన కనుసన్నల్లోనే జరగాలన్నట్టు వ్యవహరిస్తున్నారని, దీంతో అధికారులు సిబ్బంది ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నారని స్వయంగా అధికార పార్టీ వారితో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన సుమారు 8 ఎకరాల విస్తీర్ణాన్ని ఎలాంటి అనుమతులు, టెండర్లు లేకుండానే రూ.కోట్ల వ్యయంతో మెరగ చేయిస్తున్నారు. ఫ్లై ఓవర్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించి నిర్మాణాల్లో నిబందనలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతవరకూ పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించి తమ అనుయాయులను పలు పోస్టుల్లో నియమించుకుని ఇష్టానుసారం వేతనాలు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాల మాటున స్వలాభం వాడపల్లి వెంకన్న క్షేత్రంలో నిబంధనలకు తిలోదకాలు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు వర్షాలు వస్తే వాహనాలు దిగబడకుండా వాహనాల పార్కింగ్ స్థలాన్ని నాలుగు అడుగుల మేర మెరక చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తాం. వర్షాకాలం సమీపిస్తుండడంతో వాహనాలు దిగబడిపోకుండా గోతులు పూడ్చాలని మండలంలోని ఇసుక ర్యాంపుల వారిని కోరాము. వారు మట్టిని ఉచితంగానే తోలి మెరకకు సాయం చేస్తున్నారు. రెండు ఫ్లైఓవర్లలో ఒకటి డోనర్ ఇచ్చిన రూ.ఐదు లక్షలతో నిర్మించగా మరొకటి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ మేరకు రూ.6 లక్షలతో నిర్మించినట్టు తెలిపారు. వాడపల్లి క్షేత్రంలో అన్ని పనులు నిబంధనలకు అనుగుణంగానే చేస్తున్నట్టు తెలిపారు. – నల్లం సూర్య చక్రధరరావు, ఈవో -
ఉత్కంఠగా అండర్–7 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా అండర్–7 చెస్ పోటీలు స్థానిక విక్టరీ అకాడమిలో బుధవారం ఉత్కంఠగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఏడేళ్ల లోపు క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్, విక్టరీ అకాడమి ఇన్చార్జి తాడి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన బాలుర, బాలికల విభాగంలో ఐదుగురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్–7 చెస్ చాంపియన్షిప్ పోటీల్లో వారు తలపడనున్నారు. బాలుర విభాగంలో రామచంద్రపురం రూరల్ మండలం ద్రాక్షారామకు చెందిన పాయసం వికాస్ (ప్రథమ), కాట్రేనికోనకు చెందిన విత్తనాల కుశాల్ (ద్వితీయ), అమలాపురానికి చెందిన యతిరాజుల రిషిత్ (తృతీయ) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి (ప్రథమ), రావులపాలేనికి చెందిన బి.హిమబిందు (ద్వితీయ) స్థానాలను కై వసం చేసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులతో జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు -
చమురు సంస్థలు మాక్డ్రిల్ నిర్వహించాలి
అమలాపురం రూరల్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పొంచియున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోని చమురు, సహజ వాయు నిక్షేపాలు వెలికితీస్తున్న బేస్ కాంప్లెక్స్, చమురు గ్యాస్ నిల్వలు, గ్యాస్ పైప్లైన్ల భద్రత కోసం పరిసర గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఓఎన్జీసీ వేదాంత, గెయిల్ పైప్లైన్లు, భద్రత, రక్షణ చర్యలకు సంబంధించి మాక్డ్రిల్ నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. వైమానిక దాడులు, బాంబు బెదిరింపులు ఎదుర్కొనే దిశగా అత్యవసర సేవలను సిద్ధం చేయాలని తెలిపారు. చమురు, సహజ వాయువుల కార్యకలాపాలు నిర్వహిస్తున్న బేస్ కాంప్లెక్స్ల వద్ద తప్పని సరిగా ఐదు కిలోమీటర్లు పరిధిలో ప్రజలకు భద్రతా చర్యలపై అప్రమత్తం చేయాలని సూచించారు. కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ తాటిపాక, ఓడల రేవు, బోడసకుర్రు ఎస్.యానం తదితర బేస్ కాంప్లెక్స్లలో సైబర్ సెక్యూరిటీ, ఐడీ కార్డులు సీసీ కెమెరాల నిఘాలో రాకపోకలు నిర్వహిస్తున్నామని, బేస్ కాంప్లెక్స్ ప్రాంతాలలో నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ల నిషేధిత ప్రాంతాలుగా ఆంక్షలు విధించామని, ప్రతి కదలికను తెలుసుకునేలా ఆన్లైన్ నెట్వర్క్ను అమర్చామని తెలిపారు. పైపులైన్ల స్థితిగతులపై తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ బి.కృష్ణారావు, ఆర్డీవోలు పి.శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి మధుసూదన్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ పీకేపీ ప్రసాద్ చమురు సంస్థల బేస్ కాంప్లెక్స్ ఇంజినీర్లు, సెక్యూరిటీ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తాటిపాక జీసీఎస్ వద్ద మాక్ డ్రిల్ మామిడికుదురు: దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలపై నగరం గ్రామంలోని తాటిపాక జీసీఎస్ వద్ద బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిస్థితులు జటిలంగా మారిన సమయంలో సైరన్ మోగించడం జరుగుతుందని అటువంటి సందర్భాల్లో ఎవరూ బయటకు రాకుండా సురక్షిత ప్రదేశంలోనే ఉండాలని సూచించారు. మళ్లీ సురక్షతమైన సైరన్ మోగించే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలోని జీసీఎస్, గెయిల్ టెర్మినల్, రిఫైనరీ వంటి చమురు ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ముందస్తుగా మాక్ డ్రిల్ చేపట్టి అటు ఉద్యోగులను, ప్రజల్ని అప్రమత్తం చేశారు. మలికిపురం ఎస్సై సురేష్, ఎమ్మార్వో శరణ్య, ఆర్ఐ ఇబ్రహీం, రెవెన్యూ, ఓఎన్జీసీసీ ఉద్యోగులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం -
నాటి శ్రద్ధ నేడు ఏదీ?
దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు రైతు సమస్యలపై మనసు పెట్టి స్పందించిన తీరు నేటి కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్కల్యాణ్కు ఎంత మాత్రం లేదు. ఈ రబీలో దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు పండితే అధికారులు కేవలం 5.8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండిందని లెక్కలు కట్టారు. దానిలో రెండు లక్షల మెట్రిక్ టన్నులు కొంటామనడం సరికాదు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫలమైంది. లాభసాటి ధర ఎలాగూ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం రైతుకు బీమా చేసి ఆదుకుంది. ఈ ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై పెట్టి బీమా చేస్తేనే పంట రాయితీ అని మెలిక పెడుతోంది. దీని వెనుక అన్నదాతపై వీరికున్న ప్రేమ ఏపాటిదో అర్ధమవుతోంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్తో కుమ్మకై ్క రైతుల నుంచి ధాన్యాన్ని అయినకాడికి దోచుకుంటోంది. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు -
ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవినీతి అమరావతిపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలపై లేదు. రబీ ధాన్యం అమ్ముకునే దిక్కులేక రైతులు పడుతున్న అవస్థలను చూసైనా ఆయన మొద్దు నిద్ర వీడాలి. లేకుంటే వైఎస్సార్ సీపీ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తుంది. అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తానని చెప్పుకొనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో పత్తా లేకుండా పోయారు. పవన్కళ్యాణ్ను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని జన సైనికుల అంటున్న క్రమంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించేలా లేరు. – చిర్ల జగ్గిరెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
అన్నదాతకు దన్నుగా కదం..
అమలాపురం టౌన్/ఉప్పలగుప్తం: ‘ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు దిగుబడి ఆశాజనంగా వచ్చినా అమ్ముకునే దారిలేక నష్టపోవడంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కన్నెర్రజేసింది. కూటమి ప్రభుత్వ రైతు వ్యతరేక విధానాలపై కదం తొక్కింది. అన్నదాతకు అండగా ఉంటామని, ప్రతి ధాన్యపు గింజా కొనకపోతే ఉద్యమానికి సిద్ధమని’ హెచ్చరించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలో బుధవారం వైఎస్సార్ సీపీ రైతు రిలే దీక్ష చేపట్టింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రైతు విభాగం నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు ఈ రిలే దీక్షకు మద్దతుగా తరలి వచ్చారు. వారి రాకతో కోటిపల్లి–నర్సాపురం (కేఎన్ఎఫ్) రోడ్డు పార్టీ శ్రేణులు, రైతులతో కిటకిటలాడింది. రైతుల వద్ద కొనుగోలు చేయని ధాన్యం రాశిని, ధాన్యం బస్తాలను శిబిరం వద్ద ఉంచి నిరసన తెలిపారు. ధాన్యానికి లాభసాటి ధర ఇప్పించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు వీడాలని ప్ల కార్డులతో రైతులు, పార్టీ శ్రేణులు నిరనస తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దీక్షా ప్రాంగణంలో ఉంచి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. రైతుల అనుకూల నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిలే దీక్షా శిబిరం జిల్లా వ్యాప్తంగా వచ్చిన పార్టీ శ్రేణులు, రైతులతో దద్దరిల్లింది. ఈ రిలే దీక్షలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చింతా అనూరాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మున్సిపల్ చైర్మన్లు రెడ్డి సత్య నాగేంద్రమణి, పతివాడ నూక దుర్గారాణి, గాదంశెట్టి శ్రీదేవి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ మాజీ సభ్యుడు జిన్నూరి బాబి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు జిల్లెళ్ల రమేష్, జిల్లా పార్టీ పలు విభాగాల అధ్యక్షులు వంగా గిరిజాకుమారి, సాకా ప్రసన్నకుమార్, షేక్ అబ్దుల్ ఖాదర్, మిండగుదటి శిరీష్, తోరం గౌతమ్ రాజా, నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్ పాటి శివకుమార్, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చీకట్ల కిశోర్, కటకంశెట్టి ఆదిత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం దిగి రావాల్సిందే ధాన్యం అమ్ముకోవడంలో అన్నదాతలు పడుతున్న కష్టాలపై జిల్లా వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుకు కూటమి ప్రభుత్వం దిగి రావాల్సిందే. రైతులకు అండగా నిలచి తాము చేపడుతున్న ఆందోళన ద్వారా ప్రభుత్వం మెడలు వంచుతాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చేస్తాం. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ తడిసిన ధాన్యాన్ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది జిల్లా అంతటా కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని అన్నదాతలు ఎక్కడికక్కడ రోడ్లపై ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు చేస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఈ దయనీయ దృశ్యాలు చూసైనా ప్రభుత్వంలో స్పందన రాకపోవడం విచారకరం. ఇప్పటికై నా రైతుల విషయంలో నటిస్తున్న మొద్దు నిద్ర నుంచి ప్రభుత్వం మేలుకోవాలి. ప్రభుత్వానికి సిగ్గూ శరం ఉంటే రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలి. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ రైతు నష్టాలను ప్రభుత్వమే పూడ్చాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఖరీఫ్ సాగు ముంపుతో, రబీ సాగు ఆరంభం నుంచి వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తీరా పంట చేతికొచ్చే సరికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి దళారుల చేతిలో పెత్తనం పెట్టింది. పండించిన ధాన్యాన్ని ఏమి చేయాలో తెలీక మరో పక్క అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. – పొన్నాడ వెంకట సతీష్కుమార్, పార్టీ కో ఆర్డినేటర్, ముమ్మిడివరం నియోజకవర్గం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది కూటమి ప్రభుత్వం చెప్పే పనులకు, చేతలకు సంబంధం లేదు. ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,725 ప్రకటించినప్పటికీ రూ.1,500 చేసి కొంటున్నారు. ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తునట్లు స్పష్టం అవుతోంది. గ్రామ సచివాలయాల సిబ్బంది రైతును నేరుగా మిల్లర్ల వద్దకు వెళ్లి ఽరేటు మాట్లాడుకోవాలని, అప్పుడే ఆన్లైన్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. వారితో ఒప్పందం చేసుకుంటూనే కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ చేస్తామని చెప్పడం వెనుక మర్మమేమిటో ప్రభుత్వానికే తెలియాలి. – డాక్టర్ పినిపే శ్రీకాంత్, పార్టీ కో ఆర్డినేటర్, అమలాపురం నియోజకవర్గం జగన్ ప్రభుత్వంలో మాదిరి కొనుగోళ్లు జరగాలి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో అకాల వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసినట్లే ఈ ప్రభుత్వంలోనూ కొనాలి. కూటమి ప్రభుత్వం నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా టార్గెట్ పేరుతో ఆంక్షలు విధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే వ్యవసాయం దండగని చెప్పిన మాటలను ఇప్పుడు నిజం చేస్తూ రైతులను చిన్న చూపు చూస్తోంది. జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించేది. ఈ ప్రభుత్వంలో అలాంటి రాయితీలన్నీ గాలికి వదిలేశారు. – పిల్లి సూర్య ప్రకాష్, పార్టీ కో ఆర్డినేటర్, రామచంద్రపురం నియోజకవర్గం రైతు పక్షాన వైఎస్సార్ సీపీ పోరు ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం నిరసిస్తూ కలక్టరేట్ వద్ద రిలే దీక్ష జిల్లా వ్యాప్తంగా కదలిన శ్రేణులు మద్దతు తెలిపిన రైతు సంఘాలు రైతులంటే ఇంత చిన్న చూపా చంద్రబాబు ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు అనే విషయం ధాన్యం కొనుగోళ్లలో తెలుస్తోంది. లాభసాటి ధరకు అమ్ముకునే పరిస్థితి అన్నదాతకు లేదు. రూ.1,725 మద్దతు ధర ప్రటించినా రూ.వెయ్యి నుంచి మొదలుపెట్టి రూ.1500 వరకు రైతుల నుంచి కొంటూ దళారులు దోచుకుంటున్నారు. – గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ కో ఆర్డినేటర్, పి.గన్నవరం నియోజకవర్గం -
కల్యాణ వేదిక ముస్తాబు
గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి రామాలయం పక్కన గల కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వెనుక వైపు నుంచి కూడా కల్యాణం తిలకించేలా స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. సుగంధ భరిత పుష్పాలతో ఆలయ ప్రాంగణం, అనివేటి మండపం, స్వామివారి కల్యాణ వేదిక, వేదిక ముందు గల విశ్రాంతి మండపాన్ని అలంకరిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణతో శోభిల్లుతున్న రత్నగిరి (ఫైల్) ● నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు ● వారం రోజుల పాటు వేడుక ● ఘనంగా ఏర్పాట్లు అన్నవరం: శ్రీ సత్యదేవుని పెళ్లి ఉత్సవాలు వైశాఖ శుద్ధ దశమి, బుధవారం శ్రీకారం చుట్టుకుంటున్న శుభవేళ రత్నగిరి కల్యాణ శోభతో కళకళ లాడుతోంది. కల్యాణ మహోత్సవాలు బుధవారం ప్రారంభమవుతున్నాయి. గురువారం రాత్రి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్యకల్యాణం జరగనుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో రోజుకొక వేడుకతో భక్తులకు కనువిందు కలుగనుంది. ఈ నెల 13వ మంగళవారం రాత్రి జరిగే శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కుమార్తెలను చేస్తారు. రత్నగిరిపై అనివేటి మండపంలో పండితుల మంత్రోచ్ఛాటన మధ్య జరిగే ఈ కార్యక్రమంలో ముత్తయిదువులు పసుపు దంచుతారు. రాత్రి ఏడు గంటలకు రాజా రామరాయ కళావేదిక మీద స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. రూ.కోటి వ్యయంతో ఏర్పాట్లు శ్రీసత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణకు రూ.25 లక్షలు, మిగిలిన మొత్తాన్ని రంగులు, పుష్పాలంకరణ, స్వామి, అమ్మవారి అలంకరణకు , భద్రతాచర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, వైదిక కార్యక్రమాలకు కేటాయించారు. ఏర్పాట్లు పరిశీలించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు సత్యదేవుని కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు మంగళవారం పరిశీలించారు. ప్రధానంగా కల్యాణం జరిగే వేదిక, దాని ముందు కల్యాణం తిలకించేందుకు విచ్చేసే వీఐపీలు, భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లు డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తదితరులున్నారు. కల్యాణ ఉత్సవాల షెడ్యూల్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని వధూవరులను చేసే కార్యక్రమం. రాత్రి తొమ్మిది గంటలకు కొండదిగువన ఆంజనేయ వాహనంపై సీతారాముల ఊరేగింపు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, రుత్విక్కుల దీక్షా వస్త్రధారణ, రాత్రి ఏడు గంటలకు కొండదిగువన స్వామివారు వెండి గరుడ వాహనం మీద, అమ్మవారు వెండి గజ వాహనం మీద, సీతారాములు వెండి పల్లకీ మీద ఊరేగింపు రాత్రి తొమ్మిది గంటల నుంచి కల్యాణం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు : అరుంధతి నక్షత్ర దర్శనం, తొమ్మిది గంటలకు కొండ దిగువన రావణబ్రహ్మ వాహనం మీద స్వామి, అమ్మవార్ల ఊరేగింపు శనివారం మధ్యాహ్నం 2–30 గంటలకు: అనివేటి మండపంలో వేద పండిత సదస్యం. రాత్రి తొమ్మిది గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని పొన్న వాహనంపై ఊరేగింపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మ వార్ల వన విహారోత్సవం, ఐదు గంటలకు నూత నరథంపై సత్యదేవుడు, అమ్మవార్ల గ్రామోత్సవం సోమవారం ఉదయం 9–00 గంటలకు పంపా సరోవరంలో స్వామి, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, సాయంత్రం నాలుగు గంటలకు నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజాఅవరోహణ, కంకణ విమోచన మంగళవారం రాత్రి 7–30 గంటలకు నిత్యకల్యాణ మండపంలో శ్రీపుష్పయాగం -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కపిలేశ్వరపురం: గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు జారిపడి మృతిచెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. మండపేట పట్టణం శ్రీనగర్కు చెందిన అవివాహితుడు దాసరి సాయిరాం (28), పట్టణంలోని గాంధీనగర్కు చెందిన వివాహితుడు మొండెం రాంబాబు, మంగళవారం కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని ధనమ్మమర్రికి దైవ దర్శనానికి వెళ్లారు. వారితో పాటు మరో ఇద్దరు కూడా వెళ్లారు. దర్శనం అనంతరం గోదావరి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ పరిశీలించారు. శవపంచనామా అనంతరం మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు సీఐ దొరరాజు తెలిపారు. నెలక్రితం ఇదే విధంగా.. ఒకసారి ప్రమాదం జరిగిందంటే మరోసారి జరక్కుండా ఉండేలా ఎవరికి వారు జాగ్రత్త పడతారు. అదే బాధ్యత ప్రభుత్వానికీ ఉండాలి. ఏప్రిల్ 5న కపిలేశ్వరపురం మండలం కేదారిలంకలో గోదావరిలో యువకుడు స్నానానికి దిగి మృతిచెందాడు. దుర్ఘటన జరిగిన నెలరోజులకే అదే గ్రామంలో మరో ప్రమాదం మంగళవారం జరిగింది. ఏప్రిల్లో జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత మరో ప్రమాదం జరక్కుండా తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేదారిలంక వద్ద గోదావరిలో ఇద్దరు గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం ధనమ్మమర్రి సందర్శనకు వచ్చిన యువకులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఏటిగట్లకు రక్షణ పనులు
● వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం ● ఎస్ఈ గోపీనాఽథ్ ధవళేశ్వరం: బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించామని, తాత్కాలికంగా అక్కడ పటిష్ట పనులు చేపడతామని వరదల అనంతరం శాశ్వత నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాఽథ్ పేర్కొన్నారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఇరిగేషన్ అధికారులు, సిబ్బందితో ఆయన వరదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కూళ్ళ, సుందరపల్లి, కుండలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఏట్టిగట్లు బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని, అక్కడ తాత్కాలిక రక్షణ చర్యలు చేపడతామన్నారు. కాజా ఈస్ట్ కొక్కిలేరు, కడలి తదితర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఔట్ఫాల్ స్లూయిజ్ స్థానంలో కొత్తవి నిర్మించడానికి 9.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా పటిష్టం చేసి వరదల అనంతరం నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. వరదల్లో 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినా తట్టుకునే విధంగా ఏటిగట్లు ఉన్నాయని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని వరదలను ఎదుర్కోవాలని సూచించారు. డిప్యూటీ ఎస్ఈ జీ కనకేష్, హెడ్వర్క్స్ ఈఈ కాశీ విశేశ్వరరావు, తూర్పు డెల్టా ఈఈ వి.రామకృష్ణ, మధ్య డెల్టా ఈఈ బి శ్రీనివాస్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంకొవ్వూరు: పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న మద్దుల వెంకట రామకృష్ణ ఈ నెల ఐదో తేదీ నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఆర్.సాంబమూర్తి మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈయనకు ముగ్గురు సంతానం ఉన్నారని, చేసిన అప్పులు తీర్చడం భారంగా మారడంతో సోమవారం ఇంటి నుంచి బయటి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని రామకృష్ణ తండ్రి శ్రీహరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
పెట్టుబడులకు సొమ్ములు లేక..
ఈసారి రబీ సాగులో రైతులకు అతి పెద్ద కష్టం పెట్టుబడికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి రావడం. కోతల సమయంలో ఖరీఫ్ పంట వర్షాల బారిన పడింది. దీనికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల మేర పెట్టుబడి సాయం ఇస్తామని గొప్పగా చెప్పారు. కానీ, నయాపైసా ఇవ్వలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధి రూ.6 వేలతో కలిపి ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా అందించేది. ఈసారి పీఎం సమ్మాన్ నిధి రూ.6 వేలు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ఇస్తాన్న రూ.14 వేలు అందించలేదు. దీంతో పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. రైతుకు ఆర్థిక సాయం చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో రూపొందించిన చిత్రం -
కుమార్తె కళ్ల ఎదుటే...
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ధవళేశ్వరం: అల్లారుముద్దుగా పెంచిన కన్న తండ్రి కళ్ల ఎదుటే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువాత పడటంతో ఆ కుమార్తె రోదన వర్ణనాతీతం. రోజూ ఉద్యోగం కోసం వెళ్లే తనను బస్సు ఎక్కించేందుకు తీసుకువెళ్లే తండ్రి తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆ కుమార్తె రోదనలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి. తండ్రితో బైక్పై ఆమె వెళుతున్న ప్రయాణం అదే ఆఖరని ఆమె ఊహించి ఉండకపోవచ్చు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై యూనియన్ బ్యాంక్ సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బత్తిన వెంకటరమణ (56) మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి... బొబ్బిల్లంకకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బత్తిన వెంకటరమణ కుటుంబంతో కలిసి కొంతమూరులో నివాసం ఉంటున్నారు. మృతుడు వెంకటరమణ పెద్ద కుమార్తె మనీష ముక్తేశ్వరం యూనియన్ బ్యాంక్లో పీవోగా పనిచేస్తున్నారు. రోజూ కుమార్తెను రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కించి వెంకటరమణ విధులకు వెళ్లేవారు. వేమగిరి చెక్పోస్టు వద్ద మంగళవారం విధులు నిర్వర్తించేందుకు వెళుతున్న వెంకటరమణ కుమార్తెను ధవళేశ్వరంలో బస్సు ఎక్కించేందుకు బైక్పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకటరమణ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్ళడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వెంకరమణ కుమార్తె మనీష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన తెలుసుకున్న ధవళేశ్వరం సీఐ టి గణేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీసు సిబ్బందిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. జిల్లా ఎస్పీ టి.నరసింహకిశోర్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటరమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధవళేశ్వరం ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధాన్యం కొనుగోలుకు అనుమతి
అమలాపురం రూరల్: రైతు సేవా కొనుగోలు కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా జిల్లాలో మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రబీ దిగుబడి అంచనాల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల (34 శాతం) కొనుగోలకు మాత్రమే ప్రభుత్వం తొలుత లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. జిల్లా యంత్రాంగం, మిల్లర్ల అభ్యర్థన మేరకు మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆమోదించారని తెలిపారు. ఇందులో 40 వేల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్, 60 వేల మెట్రిక్ టన్నులు రా రైస్ సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో లక్షా 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 24 గంటల్లోగా రైతు ఖాతాకు సొమ్ము జమ చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూముకు 83094 32487, 94416 92275 నంబర్లలో సంప్రదించాలని జేసీ సూచించారు. తేమ శాతం 17 ఉంటే కనీస గిట్టుబాటు ధర చెల్లిస్తారని, 18 శాతం ఉంటే ఒక కేజీ, 19 శాతం ఉంటే 2 కేజీలు, 20 శాతం ఉంటే 3 కేజీలు, 21 శాతం ఉంటే 4 కేజీలు, 22 శాతం ఉంటే 5 కేజీలు, అంతకంటే ఎక్కువ ఉంటే 5 కేజీల మేర తరుగు విధించాల్సిందిగా మిల్లర్లను ఆదేశించామన్నారు. దీపం–2 పథకం కింద ప్రభుత్వం 4 నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం దీపం–2 రెండో దశ కొనసాగుతోందని, రెండో సిలిండర్ పొందేందుకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని జేసీ నిషాంతి సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.ఉదయ భాస్కర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.బాలసరస్వతి, అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల u -
పోలీసు బందోబస్తుతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు
మామిడికుదురు: పాశర్లపూడి గ్రామంలోని కై కాలపేటలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 216వ నంబర్ జాతీయ రహదారి వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎన్హెచ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నించారు. దీన్ని నిర్వాసితులు అడుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. తమకు సెంట్ల రూపేణా పరిహారం ఇస్తామంటున్నారని అలా కాకుండా గజాల లెక్కన, ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎంతోకాలం నుంచి పోరాటం చేస్తున్నా తమకు న్యాయం చేయడం లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. నిర్వాసితులైన మహిళలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్హెచ్ ఏఈఈ వెంకటరమణ, ఎమ్మార్వో శరణ్య నిర్వాసితులతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు పనులు జరగనిచ్చేది లేదంటూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని గెడ్డం గంగాధర్, చొల్లంగి ధర్మరాజు, గెడ్డం లెనిన్, పెచ్చెట్టి చంద్రరావు వాపోయారు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించారు. పాశర్లపూడి గ్రామంలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి 66 మంది రైతులకు చెందిన ఏడెకరాల భూమికి సంబంధించి సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీనిలో 10 మంది రైతులు నష్ట పరిహారం తీసుకున్నారన్నారు. మిగిలినవారు పరిహారం తీసుకోలేదని చెప్పారు. ఇందులో 16 మంది రైతులకు సంబంధించి 1.32 ఎకరాల భూమిని ఇచ్చేందుకు నిర్వాసితులు నిరాకరించడంతో ఇంత కాలం బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టామని చెప్పారు. పాశర్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత పోలీసుల అదుపులో నిర్వాసితులు -
రైతులకు అండగా నేడు వైఎస్సార్ సీపీ రిలే దీక్ష
కొత్తపేట: కూటమి ప్రభుత్వ విధానాలతో రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అమలాపురంలో బుధవారం ‘రైతులకు అండగా వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు జగ్గిరెడ్డి కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర అందకపోవటంతో రైతుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జగ్గిరెడ్డి అధ్యక్షతన ఈ రిలే దీక్ష నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్ సమీపాన పార్టీ నాయకుడు వంటెద్దు వెంకన్న నాయుడు కాంప్లెక్స్ వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి, రిలే దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కుట్టు మెషీన్ల పేరుతో భారీ అవినీతి ఉప్పలగుప్తం: కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి, బీసీలకు కుట్టు మెషీన్ల అందజేత పేరుతో రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి ఆరోపించారు. సన్నవిల్లి గ్రామంలోని తన నివాసంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎీస్టీ, బీసీ మహిళల ఖాతాల్లో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు జమ చేశారని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్సే ధ్యేయంగా మహిళలకు ఎటువంటి సంక్షేమం అందించకుండా బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చిందని అన్నారు. ఒక్కో మహిళకు రూ.23 వేలు కేటాయించగా.. ఇందులో కుట్టు మెషీన్ ఖరీదు రూ.4,300, శిక్షణ కాంట్రాక్టర్కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7,300 అవుతోందన్నారు. మిగిలిన రూ.15,700 ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. లక్ష మంది లబ్ధిదారులకు ప్రభుత్వానికయ్యే ఖర్చు రూ.73 కోట్లు అవుతుండగా.. టెండర్లో రూ.230 కోట్లు అని ప్రకటించడంలో మతలబు ఏమిటని గిరిజా కుమారి అన్నారు. పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ అమలాపురం రూరల్: ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) బీఎన్ఎల్ రాజకుమారి ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 30 కేంద్రాల్లో జరుగుతాయన్నారు. అలాగే, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 17 కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్ సప్లిమెంటరీకి 10,519 మంది, సెకండియర్కు 3,719 మంది కలిపి మొత్తం 14,238 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. పరీక్ష సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలని, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు. పరీక్ష కేంద్రాల రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని డీఆర్ఓ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వనుము సోమశేఖరరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుర్గారావుదొర తదితరులు పాల్గొన్నారు. ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అమలాపురంలో నిర్వహణ ఫ రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపు -
చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్
సాక్షి, తూర్పుగోదావరి: విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా? అంటూ చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. ‘‘విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు?. చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.మంగళవారం.. మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రెండు రూపాయల 49 పైసలకు ఏడు వేల మెగా వాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనన్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.‘‘ఈ ఒప్పందంతో సంవత్సరానికి రూ. 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకపోవడం దారుణం. ఇప్పటివరకు బషీర్ బాగ్ ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఓ వైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడలాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి చేస్తుంది. టీటీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కోసం భక్తులు ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వ తప్పులు మీద తప్పులు చేస్తుంది’’ అని మార్గాని భరత్ మండిపడ్డారు.విద్యులు తగ్గించకపోతే వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. సింహాచలం ఘటనలో మంత్రులకు బాధ్యత లేదా?. పర్యవేక్షణ అంటే ఏసీ రూములో కూర్చుని కాఫీలు తాగడమా?’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. -
స్వామి సంబరానికి.. వాహనాల ముస్తాబు
● రేపటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు ● ఊపందుకున్న ఏర్పాట్లు ● ఉత్సవ వాహనాలకు తుది మెరుగులు అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. కాస్త ఆలస్యంగా మొదలైన ఏర్పాట్లు నెమ్మదిగా ఊపందుకున్నాయి. కల్యాణోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్న వేళ రత్నగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ముఖ్యంగా రత్నగిరి రామాలయం పక్కన ఉన్న సత్యదేవుని వార్షిక కల్యాణ వేదిక అలవకరణ పనులు మొదలయ్యాయి. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లను ఊరేగించే ఉత్సవ వాహనాలను దాదాపు సిద్ధం చేశారు. వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆ వాహనాలు నూతన శోభతో తళతళా మెరుస్తున్నాయి. కాకినాడకు చెందిన పీవీఎల్ మూర్తి తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా తాను ఉత్సవ వాహనాలతో పాటు, వెండి సింహాసనాలు, వెండి మకర తోరణం వంటి వాటికి మెరుగు పెట్టిస్తానని ఆయన తెలిపారు. అలాగే, కొండ దిగువన ఉన్న రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా దేవస్థానం అధికారులు రంగులు వేయించి ముస్తాబు చేయించారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్కు గత శనివారం సత్యదేవుని కల్యాణోత్సవ శుభలేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 11న జరిగే రథోత్సవం పకడ్బందీగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ఈఓ వీర్ల సుబ్బారావుకు కమిషనర్ సూచించారు. రథోత్సవం సందర్భంగా గత ఏడాది తాను అప్పటి ఈఓగా తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. కాగా, రథోత్సవం నాడు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ కూడా ఇప్పటికే ఈఓను ఆదేశించారు. సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో ప్రారంభమైన అలంకరణ -
కలెక్టరేట్ వద్ద రైతుల రిలే దీక్షలు రేపు
● ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం అమలాపురం రూరల్: రబీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మిల్లర్లు, దళారులతో కుమ్మకై ్కందని, ఇందుకు నిరసనగా బుధవారం కలెక్టరేట్ వద్ద రైతులతో రిలే నిరాహార దీక్ష చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 369 కేంద్రాలు ఉండగా జిల్లాలో ఏ ఒక్కచోట కొనుగోలు చేయడం లేదన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. బుధవారం ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి 100 మంది రైతులు, నాయకులుతో భారీ ఎత్తున నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తే కేవలం 98 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి, ధాన్యం సేకరణ నిలిపివేశారని అన్నారు. టార్గెట్ పేరుతో 24శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో రైతుల కన్నా మిల్లర్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. వాతావరణంలో మార్పులతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఉందని, వారినిని పట్టించుకునే నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే ప్రశ్నించి రైతులకు అండగా ఉండాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో కూర్చుని ఫిడేల్ వాయిస్తున్నారని అన్నారు. ఆయన కేవలం అమరావతికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతు కష్టాల్లో ఉంటే కూటమి నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారని అన్నారు. జిల్లాలో రైతుల కష్టాలను వివరిస్తూ కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం అందించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి సూర్యప్రకాష్రావు, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్, కాశీ బాలమునికుమారి, ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కంఠంశెట్టి ఆదిత్యకుమార్, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని శాంతియుతంగా వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందిని మాత్రమే లోనికి పంపుతామని పోలీసులు చెప్పడంతో వైఎస్సార్ సీపీ నాయకులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి జోక్యం చేసుకొని నియోజవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులను లోనికి పంపాలని కోరారు. శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని ఆయన చెప్పడంతో ముఖ్య నాయకులను పోలీసులు కలెక్టరేట్ లోపలకు పంపించారు. -
నేటి నుంచి ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2025 ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ ఎన్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం, బుధవారం జరిగే ఈ పరీక్షలకు సన్నద్ధతపై అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్షించారు. పాలిటెక్నిక్ డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులు ఈ కామన్ ప్రవేశ పరీక్షకు అర్హులని అన్నారు. జిల్లాలో సుమారు 800 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారన్నారు. అర్హత సాధించినవారు నేరుగా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చునన్నారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు రెండు పరీక్షా కేంద్రాలను కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ, అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి 5 గంటల వరకు రెండు బ్యాచ్లుగా నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మి ఛ, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామకృష్ణరాజు, ఏ కుమార్ జేఎన్టీయూ తరఫున పరిశీలకురాలు విజయ కుమారి పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి సోమవారం కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 30 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,400 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరులు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమిచ్చారు. -
పారదర్శకంగా కార్యకలాపాలు
– అముడా ఉపాధ్యక్షురాలు, జేసీ నిషాంతి అమలాపురం టౌన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అముడా) చేపట్టే కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని అముడా ఉపాధ్యక్షురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) టి.నిషాంతి సూచించారు. ఇందుకోసం ఆముడాకు నియమితులైన బోర్డు కమిటీ సభ్యులు కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక అముడా కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో సోమవారం జరిగిన తొలి సమావేశంలో నిషాంతి మాట్లాడారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం బోర్డు కమిటీ సభ్యులు చేసిన పలు ప్రతిపాదనలపై చర్చించింది. పలు తీర్మానాలను ఆమోదించింది. అముడా పరిధిలోని భవన నిర్మాణ అనుమతులు, ఫీజుల నిర్ణయం, లే అవుట్ల అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. పంచాయతీల నుంచి డెవలప్మెంట్ చార్జీలు, 300 గజాలు పైబడిన అనుమతులన్నింటినీ అముడా పరిధిలోనే ఇచ్చేందుకు సాఫ్ట్వేర్ రూకకల్పన వంటి అంశాలపై జేసీ సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో 300 గజాల లోపు స్థలాల్లో అనుమతులను ఆయా పట్టణ ప్రణాళిక విభాగాల ద్వారా ఇస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అముడా పరిధిలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన ప్రాంతాలు రుడా (రాజమహేంద్రవరం) కుడా (కాకినాడ) పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. జిల్లా అంతటిని ఒక యూనిట్గా పరిగణించి అముడాను విస్తరించేందుకు సమావేశంలో బోర్డు కమిటీ ప్రతిపాదించింది. 2024–25 ఖర్చుల నివేదికను జేసీ ఆమోదించారు. అముడా బోర్డు కమిటీ సభ్యులు జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ ఎస్.రాజబాబు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకరరావు, జిల్లా ఆర్ అండ్ బీ ఎస్ఈ బి.రాము, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, జిల్లా ప్లానింగ్ అధికారి సత్యమూర్తి పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
డీఎం అండ్ హెచ్వో డాక్టర్ దుర్గారావు దొర అమలాపురం టౌన్: జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర సూచించారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటరులో వైద్యాధికార్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు తదితర విభాగాల సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో డాక్టర్ దుర్గారావు దొర మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మాతా శిశు సేవలను విస్తృతం చేసి ఆ వెంటనే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, ప్రసవాల సంఖ్య నమోదు, టీకాల కార్యక్రమం, ఎన్సీడీసీడీ వంటి కార్యక్రమాల ప్రగతిపై డీఎం అండ్ హెచ్వో సమీక్షించారు. ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యనగేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఎం. మణిదీప్, డాక్టర్ శ్రీపూజ, డాక్టర్ బి.శిరీష, హెల్త్ సూపర్వైజర్లు ఎ.లక్ష్మి, సంపూర్ణ, అనూరాధ, డివిజనల్ సూపర్వైజర్ రాధా నరసింహం పాల్గొన్నారు. అర్జీలను పరిష్కరించాలి అమలాపురం రూరల్: అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా జవాబుదారీ తనంతో పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులకు సూచించారు కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు మధుసూదన్, జయచంద్ర గాంధీ, ఎస్డీసీ కృష్ణమూర్తి, డీఎల్డీ ఓ రాజేశ్వరరావు అర్జీదారుల నుంచి సుమారు 200 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 24 వినతులు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఆ వేదికకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ అక్కడికక్కడే విచారించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు తక్షణమే స్పందించడమే కాకండా వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎప్పీ ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యాక ఆ నివేదికను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంఽధించిన ఫిర్యాదులపై ఎస్పీ అర్జీదారులతో చర్చించారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సోమవారం ఆమె సందర్శించారు. జైలులో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎవరైనా ఖైదీలు న్యాయ సహాయం కావాలని అనుకుంటే సంస్థ నియమించిన పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు. ముద్దాయిలు, ఖైదీల కోసం పని చేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని శ్రీలక్ష్మి అన్నారు. -
సార్వత్రిక సమ్మెలో మేము సైతం
వాల్పోస్టర్ ఆవిష్కరణ రాజమహేంద్రవరం రూరల్: దేఽశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన చేయబోయే సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసీ క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగులు 50వేలమంది భాగస్వామ్యం అవుతున్నారని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమహేంద్రవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ తెలిపారు. సోమవారం మోరంపూడి ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన, యూనియన్ అధ్యక్షుడు ఎస్ఆర్జే మాథ్యూస్, నాయకులు ఆవిష్కరించారు. కోదండరామ్, మాథ్యూస్ మాట్లాడుతూ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్ఐసీలో అతి పెద్ద సంఘం అయిన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ సమ్మెలో పాల్గొంటుందన్నారు. ఈ సమ్మెలో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ పాల్గొంటున్నామన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్ 3, 4 ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని, నూతన పెన్షన్ పథకం రద్దు చేసి, ఎల్ఐసీలో ఉన్న ఉద్యోగులు అందరికీ 1995 పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను ఒకే కంపెనీగా చేయాలని, కనీస వేతనం రూ.26,000 అందరికీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. మహిళా కన్వీనర్ శిరీష, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి సమ్మతం గనెయ్య, ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రైతులకు అండగా ఉండండి
అధికారులతో మంత్రి మనోహర్ కాకినాడ సిటీ: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లు, అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్లో మంత్రి కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని వివరించారు. కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రగతిని జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా వివరించినప్పుడు ట్రాన్స్పోర్టు కోసం ఉపయోగించే ట్రైలర్ల సర్టిఫికేషన్కు తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యేలు తెలిపారు. రవాణాశాఖ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. బొండాలు రకం బాయిల్డ్రైస్ సేకరణకు ఎఫ్సీఐ అనుమతి కోరామన్నారు. అనుమతి వచ్చే లోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌరసరఫరా సంస్థ ఎండీ మనజీర్ జిలానిసామూల్ మిల్లర్లను కోరారు. ఎఫ్సీఐలో మాన్యుయల్ గ్రెయిన్ ఎనాలసిస్ వల్ల రిజెక్షన్ ఎక్కువగా ఉంటున్నందున ఆటోమేటిక్ అనాలసిస్ అమలు చేసేలా చూడాలని కోరారు. కోనసీమ జిల్లా సమీక్షలో వివిధ మండలాల్లో పంట కోతల సమయాల్లో తేడాలు ఉన్నందున రైతు సేవా కేంద్రాల టార్గెట్లను అడ్జస్ట్ చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరగా గతంలో ఉమ్మడి జిల్లాలో కొనుగోలు నిర్వహించిన డ్వాక్రా సంఘాలకు పెండింగ్ ఉన్న సుమారు. రూ.16.75 లక్షల కమీషన్ చెల్లింపునకు సంబంధించి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. గోకవరం మండలంలో రైస్ మిల్లులు లేవని, కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం నెమ్ము 22 శాతం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఇకపై బ్యాంకు గ్యారంటీని ప్రామాణికంగా 1:2 నిష్పత్తిగా అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు. మూడు జిల్లాల్లో సీఎంఆర్ టార్గెట్ను పెంచామని చెప్పారు. కాకినాడ జిల్లాకు 50 వేల టన్నులు బొండాల రకం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు లక్ష టన్నులు, తూర్పుగోదావరి జిల్లాకు ఇప్పటికే పెంచిన 30 వేలకు అదనంగా మరో 50వేల టన్నులు టార్గెట్ను పెంచుతున్నామని మంత్రి వివరించారు. -
రూ.10 కోట్ల విలువైన భూమిని కాపాడండి
● ఒకటో డివిజన్లో ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి ● కలెక్టర్కు మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కార్పొరేషన్ పరిధి లో లాలాచెరువు వద్దగల సాయిదుర్గానగర్లో దాదాపు రూ.10కోట్ల విలువైన 1,300 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి కాజేస్తున్నందున ప్రభుత్వం దృష్టి సారించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఆయన ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 186–1, ఏరియాలో ప్లాట్లుగా విభజించిన సమీప డోర్ నంబర్ 72–16–1/2 వద్ద ప్లాటు నంబర్ 30లో 524 చదరపు గజాల ప్లాటు, నంబర్ 9లో 406 చదరపు గజాల ప్లాటు, నంబర్ 10లో 387 చదరపు గజాలు మొత్తం 1317 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించారని భరత్ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఇది కార్పొరేషన్కి వదిలిన పార్కుకు సంబంధించిన స్థలం అని అయితే కొందరు వ్యక్తులు దీనికి సంబంధించిన దస్తావేజు నకళ్లను తీసి దానికి వారసులుగా విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, రామవరంలో ఓ మహిళకి గిఫ్ట్ వచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్ పుట్టించి విజయనగరం జిల్లాలో రిజిస్టర్ చేయించారని ఆయన వివరించారు. కానీ ఈ నంబర్లు రాజమహేంద్రవరం రిజిస్టర్ ఆఫీసులో నమోదు కాలేదని, మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీ స్థలం పన్ను కూడా వేయించారని భరత్ పేర్కొన్నారు. పదికోట్ల రూపాయల విలువైన భూమిని కాజెయ్యడానికి మాఫీయా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. పక్కాగా ఉన్న ఆధారాలన్నీ పూర్తిగా పరిశీలించి, ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పార్కు సలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖాళీస్థలాలు, ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు భూ మాఫియా పేట్రేగిపోతోందని విమర్శించారు. -
గోకులంలో బెల్ట్షాపు!
పిఠాపురం: కిళ్లీ కొట్టు, కిరాణా కొట్టు అది ఇదీ అని కాదు ఎక్కడ చూసినా బ్రాందీ బెల్టుషాపులే. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతున్నదనడానికి ప్రతీ గ్రామంలోను ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చివరకు గోవులను సంరక్షించడానికి ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోకులంను సైతం వదలలేదు కూటమి నేతలు. పిఠాపురం మండలం రాపర్తిలో గోవుల కోసం నిర్మించిన గోకులంలో బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం చూసిన స్థానికులు మరీ ఇంత దారుణమా? మూగజీవాలు ఉండాల్సిన చోట మద్యం షాపు ఏమిటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రాందీషాపు అంటూ బోర్డు పెట్టి మరీ విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నప్పటికీ అది లైసెన్సు ఉన్న బ్రాందీ షాపు కాకుండా బెల్టుషాపు కావడం కొసమెరుపు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో 8 మందికి రెండు రోజుల చొప్పున జైలు, 9 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో 17 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
మీ నిర్లక్ష్యంతో 400 మందికి నష్టం
● కోర్టు సాకుతో తప్పించుకోవద్దు ● స్పందనలో సచివాలయ ఏఎన్ఎంల ఆవేదన కాకినాడ క్రైం: అర్హులైన తమకు ఎంపీహెచ్ఏఎఫ్ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్)గా పదోన్నతి కల్పించడంలో ఉద్దేశ పూర్వక జాప్యం తగదని సచివాలయ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురి కోసం నాలుగొందల మంది భవితకు చేటు చేయవద్దని అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు సోమవారం కాకినాడ కలెక్టరేట్కు వచ్చి స్పందన కార్యక్రమంలో తమ ఆవేదనను వెళ్లగక్కారు. డీఆర్వో వెంకట్రావుకు వినతి సమర్పించారు. గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కావస్తుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కనీసం ప్రారంభం కాలేదని వెల్లడించారు. పదోన్నతుల కోసం ధ్రువపత్రాల పరిశీలన గత నెల 26 నుంచి 29 తేదీల మధ్య జరిగిందని, తదనంతరం సీనియారిటీ జాబితా నేటికీ ప్రచురించి ప్రదర్శించలేదని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై డీఆర్వో డీఎంహెచ్వోను ప్రశ్నించగా, మార్కుల వెయిటేజ్, ఎస్సీ చట్టంలో క్లాసిఫికేషన్ అంశాల ప్రాతిపదకన కోర్టులో కేసు వేయడం వల్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించకుండా నిలిపామని సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏఎన్ఎంలు ఇతర జిల్లాల్లో జీవోల ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేస్తుంటే మీకు మాత్రమే వచ్చిన అడ్డంకి ఏంటని ప్రశ్నించారు. కోర్టు సాకుతో పదోన్నతుల ప్రక్రియ చేపట్టకుండా తప్పించుకోవడం సబబు కాదని, మీ నిర్లక్ష్యం 400 మంది భవితకి నష్టమని తమ ఆవేదనను వెళ్లగక్కారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సత్యదేవుని కల్యాణానికి ఏర్పాట్లు
● టేకు రథం ట్రయల్ రన్ విజయవంతం ● 13 వరకు పలు వైదిక కార్యక్రమాల నిలుపుదల అన్నవరం: వైశాఖ శుద్ధ దశమి బుధవారం నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన రత్నగిరిపై ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మే ఎనిమిదో తేదీ, వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుని దివ్య కల్యాణం జరుగుతుందని తెలిపారు. టేకు రథం ట్రయల్ రన్ విజయవంతం సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు మే 11న నిర్వహించనున్న సత్యదేవుని రథోత్సవంలో ఉపయోగించే టేకు రథం ట్రయల్ రన్ సోమవారం నిర్వహించారు. రథానికి ముందు ట్రాక్టర్ కట్టి కొద్ది దూరం నడిపించారు. పెద్దాపురం ఆర్డీఓ రమణి సోమవారం రత్నగిరికి విచ్చేసి స్వామివారి కల్యాణ ఏర్పాట్ల గురించి ఈఓతో మాట్లాడారు. కల్యాణమహోత్సవాల సందర్భంగా మే ఏడు నుంచి 13వ తేదీ వరకు స్వామివారి నిత్యకల్యాణం, ఆయుష్య హోమం, సహస్ర దీపాలంకారసేవ, పంచ హారతుల సేవ, ప్రతీ శుక్రవారం వనదుర్గ అమ్మవారికి జరిగే చండీహోమం, పౌర్ణిమ నాడు జరిగే ప్రత్యంగిర హోమం, రాత్రి వేళల్లో జరిగే పవళింపు సేవ నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు. స్వామివారి వ్రతాలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. -
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,34,020 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
● కేంద్రాలను పునఃప్రారంభించి లక్ష్యాలను పెంచాలి ● కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో ఉద్యమం ● చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు.. ● ప్రశ్నించని పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ధ్వజం అమలాపురం టౌన్: రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులేత్తేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. తక్షణమే మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్, పార్టీ ఎమ్మెల్సీలు, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం అమ్మలేక అవస్థల పడుతున్న రైతులకు మద్దతుగా ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళారులతో కుమ్మకై ్క లక్ష్యాలు పూర్తయ్యాయని కొనుగోళ్లు ఆపేయడంపై జగ్గిరెడ్డి నిలదీశారు. జిల్లా అధికార యంత్రాగం తీరు ఇలా ఉంటే, అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు పడుతున్న యాతన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు లక్ష్యం పెట్టుకోవడంపై బాధాకరమని ఆయన అన్నారు. మిగిలిన దాన్యాన్ని దళారులకు అమ్ముకోమని ప్రభుత్వం చెప్పకనే చెప్తోందని జగ్గిరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వంపై రెండు మూడు రోజుల్లో పార్టీ తరఫున ఉద్యమించనున్నామని, త్వరలో ఓ తేదీ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ జిల్లాల వారీగా ధాన్యం దిగుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు నుంచి పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదన్నారు. సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోళ్లపై ముందు నుంచీ మోసపూరిత ప్రకటనలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిసారీ ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని ఎదురు ప్రశ్న వేశారు. అమరావతి పనుల పునఃప్రారంభం కాదు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే పునః ప్రారంభించాలని ఆయ డిమాండ్ చేశారు. అవినీతి అమరావతి కోసం సీఎం చంద్రబాబు, లోకేష్లు చూపతున్న ఆసక్తి రైతు కష్ట నష్టాలపై, ధాన్యం కొనుగోళ్లపై చూపాలని జగ్గిరెడ్డి అన్నారు. శాసించే రైతులు నేడు యాచించే స్థాయికి చేరుకోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులపై అటు ప్రభుత్వం పగ పట్టినట్లే ప్రకృతి కూడా అకాల వర్షాల పేరుతో పగపట్టిందని ఆదేదన వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి నాయకత్వంలో రైతుల నుంచి ప్రతీ ధాన్యం గింజా కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని వారు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, అమలాపురం, అల్లవరం ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, గెడ్డం సంపతరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, అమలాపురం పట్టణం, రూరల్,అల్లవరం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవి, కొనుకు బాపూజీ, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరజా కుమారి, తోరం గౌతమ్ రాజా, మిండగుదటి శిరీష్, కాశి మునికుమారి, సూదా గణపతి పాల్గొన్నారు. -
అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 17 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో నలుగురు దంపతులు పూజలు చేశారు. స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొంది. ఐదు జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ చేశారు. స్వామి వారి సన్నిధిలో 13 మంది చిన్నారులకు అక్షరభ్యాసం, నలుగురికి తులాభారం, ఒకరికి నామకరణ, ఏడుగురు చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 37 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.1,98,976 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కోరారు. కాకినాడ జేఎన్టీయూలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో బలమైన శక్తిగా ఏపీయూడబ్ల్యూజే ఉందన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ముగిసిందని, దీనిపై ఈ నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ, పోరాటాలకు పురిటి గడ్డగా ఉమ్మడి జిల్లా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఏపీయూడబ్ల్యూజే తరఫున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు నూతన కమిటీలు నియమించామని చెప్పారు. సమావేశంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్ కూడా ప్రసంగించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షునిగా డి.అంజిబాబు, కార్యదర్శిగా అర్జున్లతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూనియన్ రాష్ట్ర ప్రతినిధి శ్రీరామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా దురాని వ్యవహరించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన విధంగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఈ విషయం పేదలందరికీ తెలిసేలా విస్త్తృత ప్రచారం చేయాలని, పత్రికల్లో వచ్చిన వార్తలను వాట్సాప్, స్కూలు, ఇతర గ్రూపుల్లో దపదఫాలుగా షేర్ చేయాలని ఎంఈఓలకు సూచించారు. అన్ని సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి, ఫొటోలు షేర్ చేయాలన్నారు. సోమవారం నుంచి వీలైనంత ఎక్కువ మందితో తమ మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కంకి మీద కునుకు మాయం!
● భయపెడుతున్న వర్షం.. హెచ్చరికలు ● పలుచోట్ల నిలచిన రబీ మాసూళ్లు ● పనల మీద చేలు.. కోతలకు విఘాతం ● ధాన్యం రాశులు తడిసి రైతుల ఆందోళన ● నీట మునిగిన రోడ్లు.. ● తెగిపడిన విద్యుత్ వైర్లు..కూలిన స్తంభాలు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం సాక్షి, అమలాపురం: జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. పలు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. వర్షం వల్ల మండే ఎండల నుంచి సామాన్యులకు ఉపశమనం దక్కినా రైతులను దెబ్బతీసింది. చేలకు నేరుగా కలిగే నష్టం ఇప్పటికిప్పుడు పెద్దగా లేకున్నా పనల మీద ఉన్న చేలు.. నీట మునిగిన రాశులు రైతులను నష్టాలపాలు చేయనుంది. జోరుగా సాగుతున్న రబీ కోతలకు అంతరాయం కలిగించింది. మరో రెండు, మూడు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం నియోకవర్గాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి ఈదురుగాలలు వీచాయి. కొత్తపేట, మండపేటలలో ఒక మోస్తరు వర్షం కురిసింది. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో సుమారు 70 వేల ఎకరాల్లో వరిసాగు జరిగిందని అంచనా. ఇక్కడ సగటున 50 శాతం వరి కోతలు జరిగాయి. రబీకి వర్షం వల్ల చేలకు కొంత మేర నష్టం కలిగించింది. ఈ ప్రాంతాలలో రబీ వరి కోతలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ నాలుగు నియోజకవర్గాలలో మధ్య డెల్టాలలో శివారు ప్రాంతాలు అధికం. ఇక్కడ కోతలు ఏప్రిల్ మూడో వారం నుంచి మొదలయ్యాయి. ఇప్పడిప్పుడే కోతలు జోందుకుంటున్న సమయంలో భారీ వర్షం కురవడం రైతులకు ఇబ్బందిగా మారింది. కోతలు జరగని వరి చేలకు ఈ వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఉప్పలగుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. మండుటెండలు కాస్తుండడంతో బరకాల కప్పకుండా రైతులు వదిలేయడంతో అవి తడిసిపోయాయి. దీనితో వీటిని ఒబ్బిడి చేసేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. అలాగే ఈ ప్రాంతాలలో సుమారు సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉందని అంచనా. ఇలా పనల మీద ఉన్న చోట్ల వర్షానికి పది శాతం ధాన్యం రాలిపోతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతానికి ఇంతకుమించి వర్షం లేకున్నా మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో పనలు ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు హైరానా పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఎండ కాయడంతో రైతులకు కొంత వరకు ఊరట నిచ్చింది. తడిచిన ధాన్యం ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరంలో సగటున 50 శాతం కోతలు జరిగాయి. ఉప్పలగుప్తం, అమలాపురంలో 60 శాతం, అల్లవరంలో 45 శాతం వరకు కోతలు జరిగినట్టు అంచనా. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకున్నాయి. వర్షం వల్ల రెండు, మూడు రోజుల పాటు యంత్రం మీద కోతలకు అంతరాయం ఏర్పడింది. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో సుమారు 70 శాతం కోతలు జరిగాయి. ఇక్కడ యంత్రాలతో కోతలు అధికం కావడం వల్ల వరికి పెద్దగా నష్టం లేదు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కె.గంగవరంలో వర్షం వల్ల వరి పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. రామచంద్రపురం, కాజులూరు మండలాల్లో సైతం వరి పనలు, ధాన్యం రాశులు వర్షం బారిన పడ్డాయి. రైతులు ముందుగా రాశులపై బరకాలు కప్పడంతో నష్టం తీవ్రత చాలా వరకు తగ్గింది. మండపేట, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో ఒక మోస్తరు వర్షం పడింది. ఉదయం గంటపాటు చెదురుమదురుగా జల్లులు కురిసాయి. ఈ ప్రాంతంలో రబీ వరి కోతలు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక్కడ వరికి పెద్దగా నష్టం కలగలేదు. నీట మునిగిన రహదారులు భారీ వర్షానికి అమలాపురం పట్టణం తడిసి ముద్దయ్యింది. రెండు గంటల పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు చేరింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదరపల్లి రహదారితో పాటు అశోక్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, సావరం వంటి ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ వర్షానికి తోడు గాలి తీవ్రతకు విద్యుత్ వైర్లు తెగిపడడం, ట్రాన్స్ఫార్మర్లలో సాంకేతిక లోపం వంటి కారణాలతో జిల్లాలో అమలాపురం, అంబాజీపేట, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో పలు ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సఖినేటిపల్లి మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్, ఉప్పలగుప్తంలో మూడు విద్యుత్ స్తంభాలు, ఐ.పోలవరంలో ఒక స్తంభం, పి.గన్నవరం, రాజోలులో ఐదు స్తంభాల చొప్పున నేలకొరిగాయి. అల్లవరం మండలం గోడితిప్పలో విద్యుత్ తీగలపై కొబ్బరి చెట్టు విరిగిపడడంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. -
ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష
ఆకస్మికంగా విడుదల ప్రత్యేక తరగతుల షెడ్యూల్ను అకస్మాత్తుగా విడుదల చేశారు. మిడ్ సమ్మర్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉత్వర్వులు ఇవ్వడం సమంజసం కాదు. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలిఅంగీకారం తెలిపిన ఉపాధ్యాయులతో మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వారికి కచ్చితంగా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు వేసవి సెలవులకు దూరప్రాంతాలకు వెళ్లారు. వారిని బలవంతంగా రప్పించడం సరికాదు. – పోతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ● విద్యాశాఖ ఉత్తర్వులపై అసంతృప్తి ● ఇది సరికాదంటున్న సంఘాల నేతలు రాయవరం: వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం ఎంతవరకూ సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా సాధారణంగా మార్చి 15 నుంచి పాఠశాలలను ఒంటి పూట నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులకు మే నెలలో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు తీసుకుంటున్న టీచర్లను వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణిస్తారు. పది పరీక్షలకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణిస్తూ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 3వ తేదీన ఉత్తర్వులు పది ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నెల 2న ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉత్తర్వులు 3వ తేదీన ఉపాధ్యాయ, వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో ఉపాధ్యాయులు మండు వేసవిలో ఇదెక్కడి న్యాయమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానరాని ఈఎల్ ప్రస్తావన విద్యాశాఖ ఉత్తర్వుల్లో ఎక్కడా ఆర్జిత సెలవుల ప్రస్తావన లేకపోవడం, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాలని, ఆదివారం, సెలవు దినాల్లో కూడా పనిచేయాలని పేర్కొనడం ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి రగిలించింది. పరీక్షలకు ముందు వంద రోజుల ప్రణాళిక, దసరా, సంక్రాంతి సెలవుల్లో పనిచేసిన వారికి సీసీఎల్ మంజూరు చేస్తామని నేటికీ ఇవ్వకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయ సంఘాలు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పునరాలోంచించాలి ప్రత్యేక తరగతుల ఉత్తర్వులపై విద్యాశాఖ డైరెక్టర్ పునరాలోచించాలి. ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుంది. – దీపాటి సురేష్బాబు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీసీఎల్స్ మంజూరు చేయాలి పది పరీక్షలకు ముందు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేశాం. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవు దినాల్లో పనిచేసిన వారికి సీసీఎల్స్ మంజూరు చేయాలి. ఈఎల్స్ ఇవ్వకుంటే బహిష్కరణకు పిలుపునిస్తాం. – పెచ్చెట్టి నరేష్బాబు, ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
‘అలాంటిదే.. మరో స్కాం బయటకొచ్చింది: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీం రచించినా దాని వెనుక స్కాం తప్పకుండా ఉంటుందని.. దానికి చరిత్రలో ఎన్నోవందల ఉదాహరణలున్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలాంటిదే కొత్తగా మరో స్కాం బయటకొచ్చిందని.. బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పకుంటూ ఆయన ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటాడు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థంకాని పెద్ద శేష ప్రశ్న. కుట్టుమిషన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు. ఒక్కో లబ్ధిదారు పేరుతో రూ. 16 వేలు దోపిడీరూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్లోదాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం రూ. 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టుమిషన్కి రూ. 4300, ఒక్కో మహిళకు శిక్షణ కోసం రూ. 3 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు రూ. 75.06 కోట్లే. మిగిలిన రూ. 154 కోట్లకు మాత్రం లెక్కలే లేవు. ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపు రూ. 16 వేల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో రూ. 25 కోట్లుశిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. టెండర్ నిబంధనల ప్రకారం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నీకింత.. నాకింత రూల్ ప్రకారం ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి బీసీ మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకి 45 రోజులపాటు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే, కేవలం 135 గంటల మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. లబ్ధిదారులకు ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వడం లేదు.పేరున్న శిక్షణ సంస్థలను కాదని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్ను చేపట్టి భారీ స్కామ్కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ స్కీమ్ రచనలో కీలకపాత్ర పోషించిన ఒక రిటైర్డ్ అధికారికి తగిన ప్రోత్సాహకం ఇచ్చారని నాకు సమాచారం ఉంది.టెండర్లలోనూ మాయాజాలందోచుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సిద్ధం చేసిన చంద్రబాబు, టెండర్ల దశ నుంచే చక్రం తిప్పడం మొదలైంది. ప్రి బిడ్లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండటం విచిత్రం టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థను కాదని అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు.మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందే. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. ఎల్2, ఎల్3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు.గతంలోనూ ఆదరణ పేరుతో మిషన్ పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలను వంచించారు. వైయస్ జగన్ హయాంలో మహిళలను తలెత్తుకుని జీవించేలా పథకాలను రూపొందించడం జరిగింది. ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. బీసీల జీవితాల్లో వెలుగులు నింపితే, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడుతోంది. -
బావి నీరు వల్లే కవలలు
మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలం కోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలం -
జాతీయ స్కేటింగ్ పోటీల్లో శ్రీధర్కు ఆరో ర్యాంక్
అమలాపురం టౌన్: ఢిల్లీలోని జీఆర్ ఇంటర్నేషనల్ స్కూలు స్కేటింగ్ రింక్లో జరుగుతున్న జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో అమలాపురం పట్టణం సూర్యనారాయణపేటకు చెందిన కోటుం కుమార్ చందు శ్రీధర్ ప్రతిభ కనబరిచాడు. అతడు ఆరో ర్యాంక్ సాధించినట్లు కోచ్ కిల్లా రాము తెలిపారు. గత నెల 30 నుంచి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన జరుగుతున్న ఈ పోటీల్లో శ్రీధర్ అండర్–14 విభాగంలో తలపడ్డాడని వివరించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలోని స్కేటింగ్ రింక్లో శిక్షణ పొందిన శ్రీధర్.. గత ఏడాది కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో తన కుమారుడు విజేతగా నిలిచాడని శ్రీధర్ తండ్రి కేఎన్ మూర్తి తెలిపారు. వెంకన్న క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభితంకొత్తపేట: వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో శోభిల్లింది. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. సాధారణ భక్తులతో పాటు ఏడు వారాల నోము ఆచరిస్తున్న వారు కూడా వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతటా గోవింద నామస్మరణ మార్మోగింది. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఇతర విరాళాలు, ఆన్లైన్ ద్వారా సుమారు రూ.47,59,517 ఆదాయం సమకూరిందని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కళాకారులు రాత్రి ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం వారి భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. వెంటేశ్వర వైభవం తదితర నృత్య రూపకాలను ప్రదర్శించిన కళాకారిణులను చక్రధరరావు, పలువురు ప్రముఖులు అభినందించారు. -
వెబ్సైట్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు
నేటి సాయంత్రం వరకూ అభ్యంతరాల స్వీకరణ రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఆదివారం సాయంత్రంలోగా స్వీకరిస్తారు. పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ జి.నాగమణి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితాను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టిస్) ఆధారంగా రూపొందించి, గత నెల 22 వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చారు. అప్పటి జాబితాపై వచ్చిన అభ్యంతరాల ప్రకారం తయారు చేసిన జాబితాను కాకినాడ ఆర్జేడీ కార్యాలయం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జేడీఎస్ఈకేకేడీ.ఓఆర్జీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యా శాఖ వెబ్సైట్తో పాటు, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచారు. తాజాగా సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఆదివారం సాయంత్రంలోగా సంబంధిత ఉపాధ్యాయులు ఉమ్మడి జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చు. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, క్యాడర్ సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడుందో స్పష్టంగా తెలియజేయాలి. సంబంధిత ఉంటే జత చేయాలి. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు. బాల తిరుపతి క్షేత్రంలో భక్తజన కోలాహలం మామిడికుదురు: బాల తిరుపతి క్షేత్రంగా పూజలందుకుంటున్న అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. సుప్రభాత సేవ, తొలి హారతి పూజలను అర్చకులు వైభవంగా జరిపించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగే శ్రీలక్ష్మీ నారాయణ హోమాన్ని భక్తులు దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి గోపూజలు చేశారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పాత ఆలయంలో అభిషేకాలు చేయించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,075 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.66,990 ఆదాయం రాగా, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.82,526 విరాళాలు సమర్పించారన్నారు. స్వామి వారిని 5,500 మంది భక్తులు దర్శించుకున్నారని, స్వామి వారి అన్న ప్రసాదం మూడు వేల మంది స్వీకరించారని ఈఓ వివరించారు. ఉత్కంఠగా జిల్లా స్థాయి చెస్ పోటీలుఅమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్–9 చెస్ పోటీలు స్థానిక విక్టరీ అకాడమీలో శనివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలతో పాటు జిల్లా ఎంపికలు కూడా ఇదే వేదికపై జరిగాయి. మొత్తం నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 45 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో పడాల శ్రీయాన్రెడ్డి (ప్రథమ), తాడి చేతన్ హర్ష (ద్వితీయ) బహుమతులు సాధించారు. బాలికల విభాగంలో బొడ్డు సాన్వి (ప్రథమ), ఉచ్చుల లియాన (ద్వితీయ) స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ నలుగురు విజేతలు త్వరలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారని సురేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న చెస్ క్రీడాకారులందరికీ బహుమతులు అందజేశామని చెప్పారు. -
ఊరి బావిలో.. నమ్మకాల ఊట
విజయమే లక్ష్యంగా కబడ్డీ కూత కాకినాడ సాగర తీరాన జరుగుతున్న రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. విజయమే లక్ష్యంగా క్రీడాకారులు తలపడుతున్నారు.ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025● ఓ బావి నీటితో కోర్కెలు తీరుతాయని విశ్వాసం ● మరో బావి నీటితో కవలలు! ● కొన్ని బావుల్లో నిత్యం జలకళలు ● నూతినూతికో కథ పిఠాపురం: ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. గొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు. కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.లోII -
పర్యాటకాభివృద్ధికి పెట్టుబడుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లాలో ఆలయ, బీచ్ పర్యాటక రంగ అభివృద్ధి, నిర్వహణకు వివిధ రిసార్ట్స్, హోటల్, రెస్టారెంట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కాకినాడకు చెందిన అగామి ఫుడ్స్, హైదరాబాద్కు చెందిన హోటల్స్, రిసార్ట్స్ ఏఆర్ఆర్బీఐ గ్రూప్ ప్రతినిధులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో.. జిల్లా పర్యాటకాధికారి వెంకటాచలం పర్యాటక రంగ అభివృద్ధి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వదేశీ దర్శన్ స్కీమ్లో వైనతేయ నదికి దగ్గరగా పాసర్లపూడి, ఆదుర్రు (బౌద్ధ స్తూపం), సముద్ర ముఖ ద్వారం వద్ద రిసార్ట్స్, రెస్టారెంట్లు, బోటింగ్ వంటి అవకాశాలున్నాయని తెలిపారు. ఎస్.యానాం సముద్ర తీరంలో రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటికి మూడెకరాల భూములున్నాయన్నారు. కోటిపల్లి వద్ద గోదావరి తీరంలో ఇప్పటికే ఉన్న రిసార్ట్స్ను వినియోగంలో తెచ్చేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. వీటిపై ఆయా సంస్థల ప్రతినిధులు అధ్యయనం చేసి, అభివృద్ధికి యోచన చేయాలని సూచించారు. ద్రాక్షారామ, కోటిపల్లి. అంతర్వేది, ర్యాలి, వాడపల్లి వంటి 20 పెద్ద దేవాలయాలతో పాటు 17 బీచ్లను సందర్శించేలా ఆలయ, బీచ్ సర్క్యూట్ టూరిజానికి అవకాశాలున్నాయని వివరించారు. ఆత్రేయపురం మండలం పేరవరంలో పిచ్చుకలంక, చింతలమోరి బీచ్, లొల్ల లాకుల పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయన్నారు. తీర ప్రాంతం వెంబడి టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ జరుగుతోందన్నారు. వారికి సంప్రదాయకంగా రిసార్ట్స్, హోటల్స్, స్టే హోమ్స్ నిర్మిస్తే మరింత అభివృద్ధికి అవకాశాలు వస్తాయని కలెక్టర్ చెప్పారు. సమావేశం అనంతరం పర్యాటక అధికారులతో కలసి ఆయా సంస్థల ప్రతినిధులు బీచ్, ఆలయాల సందర్శనకు వెళ్లారు. సమావేశంలో జిల్లా పర్యాటక ప్రాంతీయ సంచాలకులు సీహెచ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఎన్డీఏ రాక్షస పాలన
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడి దారుణంరాజమహేంద్రవరం సిటీ: తమ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం దారుణమని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. పెదపూడి మండలం దోమాడలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను పరామర్శించి, వారికి బియ్యం పంపిణీ చేసి తిరిగి వస్తుండగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డిపై టీడీపీకి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుల పక్షాన నిలబడి, ధైర్యం చెప్పి తిరిగి వస్తున్న క్రమంలో టీడీపీ గూండాలు ఒక పథకం ప్రకారమే ఈ దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందన్నారు. హైదరాబాద్లో ఉన్న డాక్టర్ గూడూరి అక్కడి నుంచి డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని ఫోనులో పరామర్శించారు.పెదపూడి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టి, ఎన్డీఏ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై పెదపూడిలో గురువారం రాత్రి టీడీపీ, ఎన్డీఏ కూటమి మూకలు దాడికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్సార్ సీపీ కీలక నేతలు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అనపర్తి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతిని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఎండగడుతున్నారని, దీనిని తట్టుకోలేక దాడికి ప్రయత్నంచడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. దీనిపై ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, శాంతికి మారుపేరుగా, మంచితనానికి మచ్చుతునకగా, నలుగురికీ చేతనైన సాయం చేస్తూ సౌమ్యంగా, గాంధీలా ఉండే డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని అల్లూరిగా మార్చి తప్పు చేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టాక నియోజకవర్గంలో జరుగుతున్న ఒక్కో సంఘటనతో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి రోజురోజుకూ రాటుదేలుతున్నారని అన్నారు. ఇక ఆయనను తట్టుకోవడం ఎమ్మెల్యే నల్లమిల్లి వల్ల కాదని అన్నారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డిపై జరిగిన దాడి ఘటనను వదిలిపెట్టేదే లేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర స్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజం ఎల్లకాలం చెల్లదన్నారు. వైఎస్సార్ సీపీ రౌడీయిజం చేయాలనుకుంటే నియోజకవర్గ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తిరగనియ్యరని రాజా హెచ్చరించారు. మాజీ హోం మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీవ్ర దౌర్జన్యకాండకు పాల్పడుతోందని, దీనికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు కూడా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలు అండగా ఉండగా ఏమీ చేయలేవు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండగా తనను ఎమ్మెల్యే నల్లమిల్లి ఏమీ చేయలేర ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయనరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై అనేక దాడులు చేశారని చెప్పారు. దీని ద్వారా ఎమ్మెల్యే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో నేరుగా తనను అంతమొందించేందుకు పెదపూడి గ్రామంలో దాడి చేయించారని ఆరోపించారు. కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తే బెదిరిపోయే పని కాదని భావించి, ఏకంగా తనను అంతమొందించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రయత్నించారని అన్నారు. తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, ఏమాత్రం వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి క్షణం ఎమ్మెల్యే అక్రమాలు, తప్పులను ఎండగడుతూనే ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన ప్రతి వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడూ రెట్టింపు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలోనే ఉందని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారు ధైర్యంగా ముందుకు వస్తే అన్ని విధాలా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు లంక చంద్రన్న, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ ఆర్టనైజింగ్ కార్యదర్శి తాడి సూరారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి భీమేష్, జిలా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లభశెట్టి సతీష్, నియోజకవర్గ వీవర్స్ విభాగం అధ్యక్షుడు పప్పు సింహాచలం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాంబత్తుల చంటి, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, ఎంపీటీసీ సభ్యుడు సమ్మంగి దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు, అనపర్తి గ్రామ పార్టీ కన్వీనర్ మురళీబాలకృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు సత్తి హరిప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే బుద్ధి చెబుతాం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి పార్టీ నేతల సంఘీభావం -
ఢీసీసీబీపై సోషల్ వార్
బీసీ సామాజికవర్గం నుంచి.. ఈ సామాజికవర్గానికి దీటుగా బీసీ సామాజికవర్గం గట్టి పోటీగా నిలుస్తోంది. ఈ వర్గం నుంచి జనసేన కోసం కాకినాడ రూరల్ సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం తగ్గేదే లేదని గట్టి పట్టుబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరం జనసేన కోసం శక్తివంచన లేకుండా పని చేశామని, ఇప్పుడు సాకులు చెప్పి, చైర్మన్ పదవి దక్కనీయకుండా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సత్తిబాబు వర్గం పార్టీ నేతల వద్ద బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీసీసీబీ చైర్మన్గిరీనీ ఒక సామాజికవర్గానికే ఎక్కడైనా రాసిచ్చేశారా? బీసీలకు ఇవ్వకూడదా? అని ఆ వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. సంప్రదాయమనే ముసుగేసి చైర్మన్గిరీకి దూరం చేద్దామనుకుంటే తాడోపేడో తేల్చుకుంటామని సవాల్ చేస్తోంది. చరిత్రను తిరగరాసి ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని ఆ సామాజికవర్గం పట్టుబడుతోంది. ఇలా పార్టీలోని రెండు సామాజిక వర్గాలు సై అంటే సై అంటూ కయ్యానికి దిగుతూండటం టీడీపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం.. అనే చందంగా పరిస్థితి తయారైందని అంటున్నారు.సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పీఠం కోసం కూటమిలో ‘సోషల్’ వార్ తారస్థాయికి చేరింది. ఈ చైర్మన్గిరీ కోసం కూటమిలోని టీడీపీ, జనసేనలు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయి. పార్టీల వారీగానే కాకుండా సామాజిక వర్గాలుగా కూడా నేతలు విడిపోయి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఇంతలోనే చైర్మన్ పీఠం జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్కు ఖాయమైపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంతో కాకినాడ కేంద్రంగా ఉన్న డీసీసీబీ చైర్మన్గిరీ నియామకం కాస్తా రసకందాయంలో పడింది. ఆ ముగ్గురు.. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని రెండు బలమైన సామాజిక వర్గాలు పోటీ పడుతున్నాయి. బ్యాంక్ చరిత్రను తిరగేస్తే అధికారంలో ఏ పార్టీ ఉన్నా చైర్మన్గిరీ తమకే దక్కుతోందని ఒక సామాజికవర్గం బలమైన వాదన వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో చైర్మన్లుగా పని చేసిన వారి జాబితాను టీడీపీ అగ్రనేతల ముందుంచారని తెలిసింది. టీడీపీలోని ఒక సామాజికవర్గం నుంచి మెట్ల రమణబాబు, జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో కోనసీమ నుంచి చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కుమారుడు రమణబాబుకు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు చేస్తున్న డిమాండ్ను మెట్ట ప్రాంత నేతలు తోసిపుచ్చుతున్నారని చెబుతున్నారు. రమణబాబు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారంటూ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చను వారు కారణంగా చూపిస్తున్నారని అంటున్నారు. తండ్రి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా కూడా ఉండటంతో అదే కుటుంబం నుంచి నవీన్ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన వైరి వర్గం వ్యతిరేకిస్తోంది. ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన తనకే ప్రాధాన్యం ఇవ్వాలని కటకంశెట్టి బాబీ లాబీయింగ్ చేస్తున్నారు. ఇలా టీడీపీలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు. సీన్లోకి ‘గ్లాస్’మేట్స్ డీసీసీబీ చైర్మన్ గిరీ కోసం టీడీపీలో రెండు బలమైన సామాజికవర్గాలు తలపడుతుండగా.. మూడో పక్షంగా జనసేన సీన్లోకి వచ్చింది. ఈ పదవిని ఆ పార్టీ ఎగరేసుకుపోయే ప్రయత్నాలు చివరికొచ్చేశాయని అంటున్నారు. టీడీపీలో తలపడుతున్న రెండు వర్గాలకు చెక్ చెప్పేందుకు మధ్యే మార్గంగా డీసీసీబీని జనసేన కోటాగా ప్రకటించేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఒక అంగీకారం కూడా కుదిరిందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి డీసీసీబీని జనసేనకు ఇవ్వాలనేది కూటమి ఒప్పందంగా చెబుతున్నారు. అయితే ఇటీవల ఆ జిల్లా టీడీపీ నేతలు డీసీసీబీ కోసం గట్టిగా పట్టుబట్టారు. దీంతో, అక్కడి డీసీసీబీని టీడీపీకి జనసేన వదిలేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిపై తాజా నిర్ణయం వెనుక పవన్ కల్యాణ్పై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు లాబీయింగ్ పని చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను తొక్కేసే వ్యూహంలో భాగంగా నాగబాబు.. జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్కు డీసీసీబీ చైర్మన్గిరీని కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. తమ నాయకుడిని పవన్ కల్యాణ్ పొగడ్తలతో ముంచెత్తుతూండగా.. ఆయన సోదరుడు నాగబాబు పరోక్షంలో తెగడుతూ, నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని వర్మ అనుచర వర్గం గుర్రుగా ఉంది. ఇటీవల నాగబాబు పిఠాపురంలో జరిపిన అధికారిక కార్యక్రమాల్లో వర్మ వర్గం నిరసనలతో ఈ విషయం తేటతెల్లమైందని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. మరోవైపు బంధుప్రీతితోనే మర్రెడ్డి పేరును సిఫారసు చేశారంటూ పవన్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన జనసేన నేతలు నాగబాబుపై మండిపడుతున్నారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయం చైర్మన్ గిరీపై కూటమిలో కుమ్ములాటలు జనసేన పట్టు.. తగ్గేదే లేదంటున్న టీడీపీ పవన్ సోదరుడు నాగబాబు లాబీయింగ్ పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి వైపు మొగ్గు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న టీడీపీ బీసీలు పోటీలో పలువురు మరోవైపు పొత్తులో భాగంగా కోనసీమ నుంచి కొత్తపేట సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు డీసీసీబీ పదవికి సరిపోరా అని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. కొత్తపేట నుంచి బరిలోకి దిగేందుకు అన్నీ సిద్ధ చేసుకున్న శ్రీనివాసరావు చివరి నిమిషంలో పొత్తు ధర్మం, సోదరుడు మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు కోసం కట్టుబడి పని చేస్తే కనీసం డీసీసీబీ పదవికై నా పరిశీలనలోకి తీసుకోక పోతే పార్టీపై కేడర్లో విశ్వాసం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు కాకినాడ సిటీలో ముత్తా శశిధర్, సంగిశెట్టి అశోక్, జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్ వంటి నేతలు జనసేన కోసం పని చేయలేదా అని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. వీరందరినీ కాదని కేవలం పిఠాపురంలో బంధువైన మర్రెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వాలని, వర్మకు ముకుతాడు వేయాలనే అజెండాతోనే నాగబాబు లాబీయింగ్ చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీని ద్వారా పార్టీ శ్రేణులకు ఏరకమైన సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ వాడీ వేడిగా జరుగుతోంది. చివరకు డీసీసీబీ పీఠంపై ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే. -
విశ్వరూప్ను కలిసిన జగ్గిరెడ్డి
కొత్తపేట: వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ లు అమలు చేయకుండా దగా చేయడం, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం, ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు.కులగణనకు శ్రీకారం చుట్టింది జగన్ మాత్రమే అమలాపురం టౌన్: గతంలో కులగణనకు శ్రీకారం చుట్టిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. స్థానిక హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన సమగ్ర కుల గణన సర్వేకు కమిటీ వేసింది అప్పటి సీఎం వైఎస్ జగనేనని గుర్తు చేశారు. కులగణనను వైఎస్సార్ సీపీ స్వాగతిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహణకు రూ.575 కోట్ల కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయని ఎమ్మెల్సీ పెదవి విరిచారు. రూ.లక్ష కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 75 సంవత్సరాల చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి జగన్ 60 కార్పొరేషన్లను బీసీలకు ఏర్పాటు చేశారని, సంచార జాతులతో సహ సామాజిక న్యాయం చేశారని గుర్తు చేశారు. కులగణనతో బీసీలకు, సంచార జాతులకు రాజ్యాంగబద్ధంగా న్యాయం జరుగుతుందని సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. సమావేశంలో బీసీ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథ్, దండుమేను రూపేష్, ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6న రాజోలులో మెగా జాబ్ మేళా అమలాపురం రూరల్: వికాస సంస్థ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, రాజోలు ఏ1 సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. మేళా వాల్పోస్టర్ను కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ మేళాలో 1,547 పోస్టుల భర్తీకి సుమారు 37 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ మాట్లాడుతూ, పదో తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్హత కలిగిన 35 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరిశేషు పాల్గొన్నారు. 1.74 లక్షల మందికి ‘ఉపాధి’ రాయవరం: గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1.74 లక్షల మందికి పని కల్పించామని ఉపాధి హామీ పథకం ఏఓ ఐ.స్వరూప్ తెలిపారు. పసలపూడి, నదురుబాద గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా జిల్లాలోని 385 పంచాయతీల పరిధిలో వివిధ పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 57 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 56.80 లక్షలు సాధించామని చెప్పారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. మొత్తం 12,045 కుటుంబాలు 100 రోజుల పని కల్పించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 9,653 కాలువల్లో 7,400 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేపట్టి, రూ.132 కోట్ల వేతనాలు చెల్లించామని వివరించారు. అలాగే 56 చెరువుల పూడికతీత, పునరుద్ధరణ పనుల ద్వారా రూ.3 కోట్ల మేర వేతనాలు చెల్లించామన్నారు. కొబ్బరి తోటల్లో 2,707 ఎకరాల్లో రింగ్ ట్రెంచెస్ పనులు చేపట్టడం ద్వారా రూ.16 కోట్ల వేతనాలు చెల్లించామన్నారు. మొత్తంగా జిల్లాలో గడచిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు వేతనాలుగా రూ.165.43 కోట్లు చెల్లించామని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా మే, జూన్ నెలల్లో 3,415 కిలోమీటర్ల మేర కాలువల్లోను, 59 చెరువుల్లోను పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ రెండు నెలల్లో 41 లక్షల పనిదినాలు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని స్వరూప్ తెలిపారు. -
మోదీది విభజించి, పాలించు విధానం
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం ఘటన దురదృష్టకరమని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమరావతి సభ కోసం రాష్ట్రానికి మహారాజు వస్తున్నట్లుగా చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని రాష్ట్రానికి ఎలాంటి నిధులూ ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అవమానించారని అన్నారు. అందుకే తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా తాము నిరసన తెలుపుతామని ప్రకటించారు. మోదీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని నారాయణ విమర్శించారు. పహల్గాం ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం ఏర్పాటు చేసిన ఆయన.. ఆ సమావేశానికి రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని అన్నారు. అక్కడి సహజ వనరులను, గనులను అదానీకి అప్పగించేందుకే కగార్ డ్రామా ఆడుతున్నారని నారాయణ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఫ్యాక్షనిస్టులా మారిపోయారని, టైం ప్రకటించి మరీ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దేశ రక్షణ కంటే మావోయిస్టుల నిర్మూలన పైనే కేంద్ర హోం మంత్రి దృష్టి పెట్టారన్నారు. అందుకే పహల్గాం ఘటన జరిగిందన్నారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ తొలిసారి ప్రధాని మోదీకి అండగా నిలిచాయని, కానీ ఈ ఘటనను బీహార్, యూపీ ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనకు ఆమోదం తెలపడం మంచి పరిణామమని చెప్పారు. అయితే, నిర్దిష్ట కాలపరిమితితో కులగణనను ప్రకటించకపోవడం కేంద్రం చేస్తున్న మరో మోసమని విమర్శించారు. దేశంలో కార్మికుల సాధించుకున్న హక్కులను పాలకవర్గాలు కాలరాస్తున్నాయని, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మిక హక్కులు హరించుకుపోయాయని, వంద మంది ఉంటేనే సంఘం కట్టే పరిస్థితి నెలకొందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఇండియా కూటమి మరింత బలపడాల్సిన అవసరముందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాడిద చాకిరీ చేస్తూ బానిసల్లా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిదని నారాయణ అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. ఫ కగార్ పేరుతో గిరిజనుల జీవితాలు నాశనం చేయొద్దు ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ -
విమానాశ్రయం కాదు.. రైల్వే లైన్ సంగతి చూడండి
వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గౌతమ్రాజా అమలాపరం టౌన్: కోనసీమకు త్వరలో విమానాశ్రయం కూడా రానున్నదని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్రాజా గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోనసీమకు ఇప్పుడు కావాల్సింది విమానాశ్రయం కాదని, ఏళ్ల తరబడి నత్తనడక నడుస్తున్న కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం అత్యవసరంగా పూర్తి చేయడమని స్పష్టం చేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూసేకరణలో నెలకొన్న అడ్డంకులను తొలగించేలా ఎంపీ, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే లైన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చెప్పకుండా అదిగో ఇదిగో అంటూ విమానాశ్రయం గురించి మాట్లాడడం అసందర్భంగా ఉందని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కోనసీమకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి, దాదాపు 30 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కళాశాల పనులను నిలిపేసిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని గౌతమ్రాజా విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ జోడీకి అభినందనలు అమలాపురం టౌన్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అత్యుత్తమ క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోవడం పట్ల కోనసీమకు చెందిన పలువురు అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి చేతుల మీదుగా వారు ఢిల్లీలో గురువారం అవార్డు అందుకోవడంపై కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు, కార్యదర్శి తిక్కిరెడ్డి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. అమలాపురానికి చెందిన సాత్విక్ ధ్యాన్చంద్ అవార్డుకు ఎంపికై నప్పుడు ఆయన తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ ఎంతో సంతోషించారు. కాశీ విశ్వనాథ్ ఇటీవల మృతి చెందడంతో ఈ అవార్డు స్వీకరణలో కొంత జాప్యం అనివార్యమైంది. సాత్విక్ తన తల్లి రంగమణితో కలిసి వెళ్లి అవార్డు అందుకున్నారని శరత్బాబు తెలిపారు. బాలికల భవితకు కిశోరి వికాసం కాకినాడ సిటీ: బాలికల రక్షణ, వారి అభివృద్ధి కిశోరి వికాసం కార్యక్రమ ముఖ్య లక్ష్యాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. ఈ కార్యక్రమం పోస్టర్ను కలెక్టరేట్లో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కింద జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ నెల 2 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ బాలికలకు 12 అంశాలపై అవగాహన కల్పించనున్నారని చెప్పారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలను, డ్రాపౌట్లను గుర్తించి, గ్రూపులుగా తయారు చేసి, శిక్షణ ఇవ్వనున్నారన్నారు. రుతుక్రమ పరిశుభ్రత, నిర్వహణ, లైంగిక విద్య, బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం, బాలల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం, కౌమార దశలో ఐరన్ లోపం, రక్తహీనత, లింగ అసమానత, విద్య, కెరీర్, మార్గదర్శకత్వం, నైపుణ్యాల ప్రాధాన్యం, సైబర్ మోసాలు, ఆన్లైన్ భద్రత, సమస్యలు, ఆర్థిక నిర్వహణ, కౌమార బాలికల నాయకత్వం, సాధికారిత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. కేఎస్పీఎల్ భూములకు పరిహారం పెంచాలి తొండంగి: కాకినాడ సీపోర్టు లిమిటెడ్(కేఎస్పీఎల్)కు తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు కోరారు. ఈ భూముల పరిహారంపై రైతులతో తొండంగి తహసీల్దార్ కార్యాలయంలో జేసీ రాహుల్ మీనా చర్చించారు. మొత్తం సుమారు 597 ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షలు ప్రకటించిందని తహసీల్దార్ మురార్జీ వివరించారు. ఈ మొత్తానికి అంగీకరించని 781 మంది రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ భూములకు మార్కెట్లో ఎక్కువ ధర ఉందని, రెట్టింపు పరిహారం ఇవ్వాలని 52 మంది రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. -
మహిళల రక్షణకు వన్ స్టాప్ సెంటర్
అమలాపురం రూరల్: వేధింపులు, వివక్ష నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కలెక్టరేట్లో ఇటీవల ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 13 పోస్టులు నింపేందుకు గురువారం ఆమె ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈ సెంటర్లో నియమించే సిబ్బంది ప్రధానంగా గృహహింస, పని చేసే ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ పీడీ, సీడీపీఓ, ఇతర అధికారుల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అమలు చేస్తారన్నారు. ఇంటర్వ్యూల్లో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ శాంతికుమారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావుదొర, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, సీడీపీఓలు పాల్గొన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలి జిల్లావ్యాప్తంగా రబీలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇందులో ప్రభుత్వ పరంగా కొనుగోలుకు నిర్దేశించిన 34 శాతం లక్ష్యం సరిపోలేదని, అందువలన బహిరంగ మార్కెట్లో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ నిషాంతి కోరారు. రైస్ మిల్లర్ల ప్రతినిధులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించామని అన్నారు. మిల్లర్ల ప్రతినిధులు కూడా ఈ మేరకు కోరాలని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.బాలసరస్వతి, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేయవచ్చు
ప్రైవేటు యాజమాన్యంలో ప్రారంభించే ప్రతి పాఠశాలకూ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలుంటే జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాఠశాలలు ప్రారంభిస్తే పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి. ప్రభుత్వ గుర్తింపును తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, పరమేశ్వరుడు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరి వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. -
చెట్టు కూలి వ్యక్తి మృతి
కొవ్వూరు: పట్టణంలో వేములూరు–దీప్తీ స్కూలు రోడ్డు మార్గంలో ఈదురుగాలుల ప్రభావానికి చెట్టు కూలి మోటారు సైకిలిస్టుపై పడడంతో వేములూరు గ్రామానికి చెందిన చిన్న రవి కుమార్ (49) మృతిచెందారు. బుధవారం రాత్రి స్నేహితుడు అత్తిలి చంద్రరావుతో కలిసి మోటారుసైకిల్పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో బలమైన ఈదురుగాలులు వీచి రవికుమార్ నడుపుతున్న మోటారు సైకిల్పై చెట్టు పడింది. బలమైన గాయాలు కావడంతో రవికుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వెనుక కూర్చోన్న చంద్రరావుకి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఆర్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు అవంతీ ఫీడ్స్ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తున్నారు. రవికుమార్కి భార్య, కుమారుడు ఉన్నారు. బెల్ట్షాపు నిర్వాహకులపై కేసులు కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా ఎకై ్సజ్ పరిధిలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు కాకినాడ అర్బన్, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, పెద్దాపురంలో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. -
ముద్దులొలికే పొట్టిదూడ
కొత్తపేట: పుంగనూరు జాతి ఆవుకు దూడ జన్మించడంతో ఆ రైతు కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొట్టిగా ముద్దులొలికే పొట్టి దూడ ఆ పెరట్లోనే కాకుండా వారి ఇంట్లో చెంగు చెంగుమని తిరుగుతుంటే ఆ ఇంట్లో వారి ఆనందం అంతా ఇంతా కాదు. కొత్తపేట గ్రామ దేవత బంగారమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన రైతు అద్దంకి చంటిబాబుకు ఒంగోలు జాతికి చెందిన ఆవు ఉండేది. దానికి పుంగనూరు జాతి బ్రీడు క్రాసింగ్ చేయించగా అప్పట్లో పుంగనూరు జాతి దూడే పుట్టింది కానీ ఒంగోలు జాతిని పోలి ఉంది. ఆ ఆవు పెద్దదయ్యాక దానికి తొలిచూరిగా పుంగనూరు బ్రీడు క్రాసింగ్ చేయించారు. నెలలు నిండాక పుంగనూరు దూడ పొట్టిగా (అడుగున్నర ఎత్తు) పెయ్య దూడ పుట్టింది. తెలుపు, కపిలవర్ణ రంగులో విశేషంగా ఆకర్షిస్తోంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సాగర తీరాన క్రీడా సంబరం
కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరం క్రీడా సంబరానికి వేదిక అయ్యింది. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్స్ కబడ్డీ పోటీలు రూరల్ మండలం సూర్యారావుపేట న్యూ ఎన్జీఆర్ బీచ్లో శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కబడ్డీ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఇందుకు కోసం నాలుగు కోర్టులను ఏర్పాటు చేశారు. లీగ్ కమ్ నాకౌట్ దశలో జరగనున్న కబడ్డీ పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. పోటీలు మూడురోజులు జరుగుతాయి. రోజుకు 15నుంచి సుమారు 20మ్యాచ్లు వరకు జరగనున్నాయి. ఒక్కో జట్టులో నలుగురేసి క్రీడాకారులు తలపడనున్నారు. పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన క్రీడా జట్లు పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తుండడంతో 13జిల్లాల నుంచి 13పురుషుల జట్లు, 13మహిళల జట్లు హాజరవుతున్నాయి. పురుషుల జట్లుకు సూర్యారావుపేట జెడ్పీ హైస్కూల్, మహిళలకు వాకలపూడి హైస్కూల్లో వసతి, భోజన సదుపాయం కల్పించారు. నేటి నుంచి మూడు రోజులపాటు బీచ్ కబడ్డీ పోటీలు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక సీనియర్ మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు -
రూ.12.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం
ముగ్గురు దొంగల అరెస్టు మామిడికుదురు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగల ముఠాను నగరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12.50 లక్షల విలువైన 133 గ్రాముల బంగారం, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నగరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఈ చోరీలకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఆలమూరు మండలం ఖండ్రిగపేటకు చెందిన వాసంశెట్టి వీరబాబు, గువ్వల చంద్రశేఖర్, పెదపళ్లకు చెందిన కుడుపూడి నాగరాజులను అరెస్టు చేశామన్నారు. ఈ చోరీ కేసుల్లో మరో నిందితుడు గుత్తుల సుభాష్ పరారీలో ఉన్నాడని చెప్పారు. వీరిపై నగరం, తాడేపల్లిగూడెం, తడికలపూడి, ద్వారకా తిరుమల, దేవరపల్లి, దెందులూరు, పెరవలి, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. వీరు చైన్ స్నాచింగ్లతో పాటు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడతారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంగారం అమ్మేందుకు వెళ్తుండగా వీరిపై అనుమానం వచ్చి నగరం ఎస్సై చైతన్యకుమార్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీ నేరాల గుట్టు రట్టు అయ్యిందన్నారు. దొంగలను పట్టుకోవడంతో చాకచక్యంగా పనిచేసిన సీఐలు భీమరాజు, గజేంద్ర (సీసీఎస్), ఎస్సైలు చైతన్యకుమార్, పరదేశి, కానిస్టేబుళ్లు కృష్ణసాయి, శ్రీను, దుర్గాప్రసాద్, అర్జునరావు, సుభాకర్, బ్లెస్సన్ను ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
రాయవరం/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమవుతుంది. ఇదే ఉద్దేశంతో సాంకేతిక విద్యాశాఖ, పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లు ఏర్పాటయ్యాయి. ఐటీఐ కోర్సు పూర్తి కాగానే విద్యార్థులు అప్రెంటిస్ చేస్తున్నారు. ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఐటీఐలు, వాటిలో ఉన్న సీట్లు, ట్రేడ్స్ తదితర విషయాలతో ‘సాక్షి’ కథనం. అధిక శాతం ఇంటర్లో.. పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అంటూ ఆలోచన చేస్తారు. అధిక శాతం మంది ఇంటర్మీడియెట్లో చేరుతారు. సాంకేతిక విద్య ద్వారా త్వరగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే వారు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐలు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐకి ప్రాధాన్యమిస్తున్నారు. 18 ఏళ్లు దాటగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఐటీఐ పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ దోహదపడుతుంది. ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెగ్యులర్ కోర్సులు ఐటీల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఇనుస్ట్రుమెంటేషన్ మెకానికల్ వంటి కోర్సులు ఉంటాయి. ఏడాది కాలపరిమితితో డీజిల్ మెకానిక్, వెల్డర్, కటింగ్ అండ్ సూయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులు ఏ ఏ ఐటీఐల్లో ఉన్నాయో వెళ్లి పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేస్తారు. రెండేళ్ల కాల పరిమితి కోర్సులు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, ఆర్అండ్సె టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్ ఏడాది కాల పరిమితి కోర్సులు మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో డ్రోన్ టెక్నాలజీపై స్వల్పకాలిక కోర్సు గతేడాది కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో డ్రోన్ టెక్నాలజీపై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ప్రారంభించారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్ డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాలిటెక్నిక్లోనూ చేరవచ్చు.. ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్లోనూ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐటీఐ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసినవారు బీటెక్లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటరల్ ఎంట్రీని పొంది. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 10వ తరగతి అర్హతతో ప్రవేశాలు వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువు పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలు లేవు. కాకినాడ జిల్లాలో మాత్రమే రెండు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో ప్రైవేటు యాజమాన్యంలో 15 ఐటీఐలు ఉండగా, వీటిలో ఏడాది, రెండేళ్ల కాల పరిమితితో 2,564 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 12 ప్రైవేట్ యాజమాన్యంలో 1,704 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 728 సీట్లు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీ ఐల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు 4,998 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఐటీఐల్లో ప్రవేశాలకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సును పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను దరఖాస్తుదారుల వెమొబైల్ నంబరుకు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. –ఎంవీజీ వర్మ, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, కాకినాడ -
అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ
ఐ.పోలవరం: నిత్య కళ్యాణ కాంతుడైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి అయిదు రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మానందాన్ని ఇవ్వనున్నాయి. తమ గోత్ర నామాలతో స్వామి ముందు కూర్చుని కల్యాణాలు చేయించుకుంటూ ధన్యమయ్యే భక్తులు మురమళ్ల పుణ్య క్షేత్రంలో కన్నుల పండువగా జరగనున్న స్వామి బ్రహ్మత్సవాల్లో పాల్గొననున్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందుకు నాందిగా గ్రామంలోని మహిళలు ఆలయ ఆవరణలో పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి బ్రహ్మోత్సవాలకు శుభాన్ని అద్దారు. శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులను చేసే కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి వారికి, అమ్మవారికి స్నానాలు చేయించారు. బ్రహ్మోత్సవ కల్యాణ మూర్తులకు జంపన రామకృష్ణంరాజు దంపతులు అర్చకస్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, స్వామి వారిని, అమ్మవారిని భద్రపీఠంపై ఉంచి ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవాన్ని కన్నుల వైకుంఠంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరేశ్వరుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవంలో ఎదురు సన్నాహం, ద్వాదశ ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మినారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరేశ్వరస్వామి ఆలయంలో ఆరంభమైన బ్రహ్మోత్సవాలు అయిదు రోజులపాటు అలరించనున్న ఆధ్యాత్మిక సంబరాలు -
టీడీపీ నేతల కవ్వింపు చర్యలు
● మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడికి యత్నం ● పెదపూడిలో కారును అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు పెదపూడి: గ్రామంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి దోమాడ గ్రామం నుంచి అనపర్తి వెళుతున్న వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారును టీడీపీ నాయకులు అడ్డగించి దాడికి ప్రయత్నించారు. కొంతమంది కారు ముందు కూర్చుని కారును కదలనివ్వలేదు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు రావడంతో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. దీంతో కొంత సమయం తరువాత తీవ్ర ఉద్రిక్తతల నడుమ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడి అనపర్తి బయలు దేరారు. ఈలోపుగా మాజీ ఎమ్మెల్యేను అడ్డగించడానికి పెదపూడి మార్కెట్ సెంటర్లో టీడీపీ నాయకులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కారులో వస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే మాజీ ఎమ్మెల్యే కారులోంచి కిందకు దిగాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దోమాడ గ్రామంలో గృహాలు కోల్పోయిన బాధిత మహిళలు, నాయకులు, ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్కెట్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యేకు దళిత, ప్రజా సంఘాల నాయకులు, దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ‘రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు భయపడను’ ‘ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు నేను భయపడను’ అని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమాడ గ్రామంలో బాధితులకు సాయం చేసి వస్తే నీ టీడీపీ గూండాలు, రౌడీలను పంపించావా అని దుయ్యబట్టారు. ఖబడ్దార్ రామకృష్ణారెడ్డి.. ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా నీ అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉంటాను. నీ అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. నాకు అండగా, రక్షణగా నిలిచిన దళిత ప్రజా సంఘాల నాయకులు కొండబాబు, ఆదినారాయణ, ఏనుగుపల్లి కృష్ణ, దోమాడ బాధితులు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పెదపూడిలో మాజీ ఎమ్మెల్యే కారును దౌర్జన్యంగా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు -
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలోని పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ ఆకస్మికంగా చనిపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను జెడ్పీ చైర్మనన్ విప్పర్తి వేణుగోపాలరావు గురువారం నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను, ఒకరికి ఆఫీసు సబార్డినేట్, చాలాకాలంగా రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిలో ఒక డ్రైవరికి జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మనన్ విప్పర్తి మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు, ముగ్గురికి పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. జీఎస్ రాంగోపాల్, ఏపీ పంచాయతీరాజ్ మంత్రిత్వ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్, పరిపాలనాధికారి వీహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు. -
● రెండు డజన్ల అడుగుల ఎత్తు.. ఈ అరటి చెట్టు
మలికిపురం: రెండు డజన్లు.. అరటి పండ్లు కావు.. అన్ని అడుగుల ఎత్తున పెరిగిన అరటి చెట్టు ఇది. మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో రైతు మట్టా శ్రీనివాసరావు ఇంటి పెరట్లో వేసిన అరటి చెట్టు అమాంతం అంత ఎత్తున ఎదిగింది. సాధారణంగా అరటి చెట్లు 15 అడుగులకు మించి పెరగవు. ఈ చెట్టు ఏకంగా 24 అడుగుల ఎత్తు ఎదగడంతో చూపరులు విస్తుపోతున్నారు. ఈ అరటి విత్తనం పేరు బూడిత పక్కీస్ అంటారని, విజయనగరంలోని స్నేహితుల ఇంటి నుంచి తెచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీని పండ్లు కూడా సాధారణ చక్కెర కేళీ కంటే భారీ సైజులో ఉంటాయన్నారు. ఈ మొక్క వేసిన చోట చుట్టుపక్కల ఇతర మొక్కలను ఎదగనీయదు. మొత్తం నేల ధాతువులను వినియోగించుకోవడమే ఇలా ఎత్తుగా ఎదగడానికి కారణం. గొల్లపాలెంలో 24 అడుగుల అరటి చెట్టు వద్ద శ్రీనివాసరావు -
చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..
అంబాజీపేట: రెండు కుటుంబాల్లో వారు చేతికి అందివచ్చిన కొడుకులు. విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. సింహాచలం ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలిసి అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం చిమ్మింది. ఈ ఘటనలో కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (26), పత్తి దుర్గా స్వామినాయుడు(33) దుర్మరణం పాలయ్యారు. వంట మేసీ్త్రగా కుటుంబాన్ని పోషిస్తున్న కుంపట్ల శ్రీనివాసరావు పెద కుమారుడు మణికంఠ ఈశ్వర శేషారావు, రైతు నాయకుడు పత్తి దత్తుడు రెండో కుమారుడు దుర్గా స్వామినాయుడు ఈ ప్రమాదంలో మృతి చెందారని తెలియగానే ఆయా కుటుంబాల్లోనే కాకుండా, అంబాజీపేటలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకులు శాశ్వతంగా దూరం కావడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మంగళవారం రాత్రి మృతులిద్దరూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, రేపు చందనోత్సవం సందర్భంగా అప్పన్న దర్శనానికి వెళుతున్నామంటూ, ఎప్పటిలాగే కబుర్లాడుకున్నారు. తెల్లారేసరికి కొడుకులు దుర్మరణం పాలయ్యారన్న సమాచారం విని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇద్దరు యువకులకు పెళ్లిళ్లు కాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ సమయంలో చేదు వార్తను వినాల్సి వచ్చిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. విశాఖపట్నంలో ఉద్యోగాలు కాగా, కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషారావు (శివ) ఏడాది నుంచి విశాఖపట్నంలో మెట్రోకెమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి, సోదరుడు ఉన్నారు. తండ్రి, అతని సోదరుడు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సెలవు దినాల్లో అంబాజీపేట వచ్చినప్పుడు తండ్రి చేసే కేటరింగ్ వృత్తిలో సాయం చేసేవాడు. ఉద్యోగం చేస్తూ అతడు తన కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఈశ్వర శేషారావు మృత్యువాత పడటంతో ఆ కుటుంబానికి కీలకాధారం లేకుండా పోయింది. ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదిస్తున్నారు. మరో మృతుడు పత్తి దుర్గా స్వామినాయుడు(33) విశాఖపట్నంలో ఇంటీరియర్ డెకరేషన్ వర్కు చేస్తున్నారు. సుమారు 30 మందికి పనులు కల్పిస్తున్నాడు. అతడికి తండ్రి దత్తుడు, తల్లి వెంకటరమణ, సోదరుడు, సోదరి ఉన్నారు. ఇటీవల కాలంలోనే సోదరి వివాహాన్ని దుర్గా స్వామినాయుడు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. సంవత్సరాది పండగ నాడు కొర్లపటివారిపాలెం గ్రామ దేవత వనువులమ్మ జాతరకు ఏటా దుర్గా స్వామినాయుడు అమ్మవారి ఫొటోలతో క్యాలెండర్లను ముద్రించి, ఇంటింటికీ స్వయంగా పంచిపెట్టేవాడు. అతని మరణ వార్త విని కొర్లపాటివారిపాలెంలో విషాదం నెలకొంది. ఇంటీరియర్ వర్కుతో అందరి మన్ననలు పొందడమే కాకుండా, పలు అవార్డులను గెలుచుకున్నాడు. తండ్రి రైతు నాయకుడిగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. తన కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంలో దుర్గా స్వామినాయుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొర్లపాటివారిపాలెంలోని మృతుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్బాబు సంతాపం ప్రకటించి, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు వెన్నుదన్నుగా యువకులు సింహాచలం ఘటనలో ఇద్దరి దుర్మరణం మృతుల కుటుంబాల్లో చిమ్మిన విషాదం మూడోసారి జంట మరణాలు కొర్లపాటివారిపాలెంలో జంట యువకులు మృత్యుఒడికి చేరడం ఇది మూడోసారి. 2001లో పి.గన్నవరం శివకోడు ప్రధాన పంట కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. 2008లో పుణ్య దినాలను పురస్కరించుకుని పి.గన్నవరం వైనతేయి గోదావరి నదిలో స్నానమాచరిస్తున్న ఇద్దరు యువకులు సుడిగుండంలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లి ఈ ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.