breaking news
Dr B R Ambedkar Konaseema
-
కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయించాలి
అంబాజీపేట: కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సామాజిక వేత్త, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్బాబు సెంట్రల్ జీఎస్టీ అదనపు చీఫ్ కమిషనర్ ప్రశాంత్కుమార్ కాకర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి ప్రశాంత్ కుమార్ ఇటీవల ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్బాబు ఆయనకు విశాఖపట్నంలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ సుభిక్షమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఎంతో ఖ్యాతి గాంచిందని, ఇటీవల కోనసీమ తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అనంతపురం కంటే తక్కువగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారని వివరించారు. జీఎస్టీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆయనకు వివరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారని స్టాలిన్ బాబు తెలియజేశారు. -
రేపు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ సమావేశం
విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పిలుపు అమలాపురం రూరల్: ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు నిర్వహించే సమావేశ వేదికై న అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ఎ–కన్వెన్షన్ హాలును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో పాటు పార్టీ నేతల బృందం సోమవారం పరిశీలించింది. ఆ రోజు కార్యక్రమానికి పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ని ప్రారంభిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి తెలిపారు. ఆ రోజు జరిగే జిల్లా స్థాయి పార్టీ సమావేశానికి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశ వేదికై న ఎ– కన్వెన్షన్ ఫంక్షన్ హాలును జగ్గిరెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదటి శిరీష్, పార్టీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్రాజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, రూరల్ మండల అధ్యక్షుడు గుత్తుల చిరంజీవి, సెంట్రల్ డెల్టా బోర్డు మాజీ చైర్మన్ కుడుపూడి బాబు, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కొల్లాటి దుర్గాబాయి, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, దూడల ఫణి, కల్వకొలను ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ ● ఇతర దేవతా విగ్రహాలు కూడా.. ● తరలిరానున్న ప్రముఖులు నాయనార్లు ఎవరంటే.. తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. : నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వా మివారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికే య శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతి ష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజే శ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వా మీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. విజయవంతం చేయాలి ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి. – స్వామి రామానంద, శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి -
ప్రైవేటు ఫీజులుం
● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యథేచ్ఛగా దోపిడీ ● ఒకటో తరగతికే కనీస ఫీజు రూ.25 వేలు ● బస్సుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ● యూనిఫామ్, నోట్ బుక్స్కు అదనపు భారం సాక్షి, అమలాపురం: ‘కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన రోగి విషయంలో వైద్యులు చెప్పిందే వేదం.. చేయించిందే పరీక్షలు.. కట్టమన్నదే ఫీజు.. మారు మాట్లాడకుండా అన్నీ వినాల్సిందే. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే జరుగుతోంది. వారు చెప్పినంతే ఫీజు.. పుస్తకాలకు, యూనిఫామ్ వంటి వాటికి ఎంతంటే అంతే.. నోరు మెదపకుండా చెల్లించాల్సిందే’ అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో అంటున్న మాటలు ఇవి. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థులకు పెనుభారంగా మారాయి. వేలకు వేలు ఫీజులకు తోడు యూనిఫామ్, టై, బెల్టు, బూట్లు, పాఠ్య, రాత పుస్తకాలు.. ఇలా అన్నీ తాము చెప్పిన చోటే తాము చెప్పిన ధరకే కొనాలంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న ఆంక్షలు తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విద్యా విధానంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 454 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిపై విద్యాశాఖ నియంత్రణ రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారుల చేతులు కట్టేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందో కనీసం అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఒకటో తరగతి ఫీజు రూ.25 వేల పైనే.. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో అయితే రూ.50 వేల కూడా ఉంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఫీజులు పెరుగుదల 30 శాతం దాటిందని అంచనా. ఇది మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీనికితోడు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్కు అదనం. బస్సు ఫీజులు అయితే మరింత భారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కిలోమీటరుకు విద్యార్థుల నుంచి బస్సు ఫీజు రూ.1.30 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఏడాదికి బస్సుకు రూ.10 వేలు మొదలు రూ.15 వేల వరకూ వసూలు చేస్తుండడం గమనార్హం. దీంతో ఒకటో తరగతి విద్యార్థికే మొత్తం అన్నీ కలిపి రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకూ ఖర్చు అవుతోంది. పర్యవేక్షణ కమిటీలు ఎక్కడో? ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న నిబంధనల అమలుకు కనీసం కమిటీలు ఎక్కడా కనిపించడం లేదు. త్రీ మెన్ కమిటీ రూపంలో మండల విద్యాశాఖ అధికారి, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఒక క్లస్టర్ స్కూల్ హెడ్యాస్టర్లతో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, అవి అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా విద్యార్థులు ఉండాలంటే అందుకు తగ్గ వాతావరణం కల్పించాలి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకంతోపాటు ఆట స్థలం కూడా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏమీ కానరావు. బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నా అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాస్తవ రూపంలో అవి అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పరిశీలిస్తామని చెప్పడం తప్ప అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి. అలాగే ఫీజులు కూడా వసూలు చేయాలి. విద్యా శాఖ కూడా ఫీజుల వసూలుపై నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు తీసుకోకుండా చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ఫీజులు తగ్గించపోతే ఉద్యమం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రతి స్కూల్ వద్ద నియమ నిబంధనలతో నోటీసు బోర్డు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫీజులు తగ్గించకపోతే ఉద్యమం చేస్తాం. అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న విద్యా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. –రేవు తిరుపతిరావు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గత ప్రభుత్వంలో నిరంతర నిఘాగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై నిరంతరం నిఘా కొనసాగేది. ఫీజులకు సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించే వారు. దీంతో యాజమాన్యాలు వెనకాడే పరిస్థితి ఉండేది. 2020 విద్యా విధానం ప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి మూడు రకాల ఫీజులు ప్రకటించింది. ఈ ఫీజులన్నీ కూడా 2023–24 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి. దాని ప్రకారం నర్సరీ మొదలు పదో తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అయితే రూ.10 వేల మొదలు రూ.12 వేల వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకూ, కార్పొరేషన్ ప్రాంతాల్లో రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేయాలని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ‘కూటమి’ కొనసాగించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నర్సరీ విద్యార్థికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఫీజులు వేస్తున్నారు. ఇవి కాకుండా యూనిఫాం పాఠశాలలలో, లేదా యాజమాన్యం సూచించిన షాపులో కొనుగోలు చేయాలనే ఆంక్షలతో పాటు, టై, బెల్టులు పాఠశాలలోనే కొనుగోలు చేయాలని అంటున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు మాత్రమే వినియోగించాలని నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు. ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి వాటిని విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు తమ దృష్టికి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప, తాము ఎన్ని పాఠశాలలు తనిఖీ చేసింది.. ఏ ఏ పాఠశాలల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి.. వాటి నియంత్రణకు యాజమాన్యాలకు చేసిన సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ప్రకటించలేక పోతుండడం గమనార్హం. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. వైద్యం ప్రారంభించే సమయంలోనే రోగి లేదా వారి బంధువులకు సేవల వివరాలు, ధరలను స్పష్టంగా వివరించాలన్నారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతి అర్జీని పరిష్కరించండి: కలెక్టర్
అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న ప్రతి అర్జీని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్ వద్ద ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సుమారు 250 అర్జీలను కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, ఎస్డీఎస్ కృష్ణమూర్తి, డీఎల్డీఓ రవీంద్ర స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి అర్జీని సంబంధిత జిల్లా అధికారులకు అందించి, నిర్దేశిత గడువు లోగా పరిష్కరించేలా చూస్తున్నామన్నారు. వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, రెవెన్యూ అంశాలపై అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ ఎస్.కార్తీక్, డీపీఓ శాంతలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్ఈలు కృష్ణారెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, డీఎస్ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. అర్జీదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి వారితో కొద్దిసేపు మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎస్పీ చొరవ చూపారు. అదృశ్యమైన తన తమ్ముడి అచూకీ తెలపాలని, రెండు నెలల కిందట అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుంకర సత్యనారాయణ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి కొద్దిసేపు నేలపైనే బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. పోలీసులు తక్షణమే అతడిని అక్కడి నుంచి లేవదీసి ఏమైనా సమస్య ఉన్నా, ఫిర్యాదు ఉన్నా నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి చెప్పాలని సూచించారు. దీంతో బాధితుడు సత్యనారాయణ జిల్లా ఎస్పీని కలసి తన సమస్యపై ఏకరవు పెట్టాడు. తన చిన్నాన్న కొడుకు సుంకర ఈశ్వరరావు 15 ఏళ్లుగా అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో ఉంటున్నాడని, కొబ్బరి ఒలుపు పనిచేసుకుంటూ జీవించే తన తమ్ముడు గత మార్చి 14 నుంచి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని పేర్కొన్నాడు. ఈ అదృశ్యం కేసును త్వరితగతిన విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలి అమలాపురానికి చెందిన మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ (టీడీపీ)పై, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణానికి చెందిన తోలేటి ఓం ప్రకాష్ ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. బాకీ నిమిత్తం తనను వేధిస్తున్నాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రజా వైద్యానికి వైఎస్ జగన్ పెద్దపీట
అమలాపురం టౌన్: కరోనా కష్ట కాలంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సేవలను ప్రజల దరిచేర్చారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ గుర్తు చేశారు. అంతలా వైద్య సేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సోమవారం అమలాపురంలో ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజారోగ్య వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందని, మంత్రి సత్యకుమార్ ఈ వాస్తవాలను గ్రహించి మాట్లాడితే బాగుంటుందని కిషోర్ సలహా ఇచ్చారు. కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి ఓ రక్షణ కవచంలా ఉండి ప్రతి కరోనా రోగికి ప్రభుత్వ వైద్యం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. కొన్ని వేల కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు– నేడు పథకం ద్వారా సకల సౌకర్యాలు అంటే సీటీ స్కాన్, ఎమ్మారై మెషీన్లు, డయాలసిస్ యూనిట్లు తదితరాలను కల్పించారని స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆస్పత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజా వైద్యం పట్ల అంత ప్రేమ ఉంటే నాడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. నేటి నుంచి డెంగీ నివారణ మాసోత్సవాలు అమలాపురం టౌన్: జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణలో భాగంగా మంగళవారం నుంచి జాతీయ డెంగీ మాసోత్సవాలు–2025 నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర వెల్లడించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో డెంగీపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన బ్యానర్లను సోమవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా దుర్గారావు దొర మాట్లాడుతూ డెంగీ, మలేరియా, ఫైలేరియా నివారణకు పలు జాగ్రత్తలు, సూచనలతో వైద్య శాఖ గోడ పత్రికలు, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించిందన్నారు. డెంగీ కారణంగా తీవ్రమైన జ్వరం లేదా అంతకంటే ఎక్కువ తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, బలహీనత, అలసట వంటి రుగ్మతలు అనివార్యమవుతాయని ఆయన చెప్పారు. ఇంట్లో పరిసరాల శుభ్రత పాటించి, నిల్వ నీరు లేకుండా చూడాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ కాగానే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలని సూచించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కార్తీక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్రావు, జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి సత్యకుమార్ ఆలోచించి మాట్లాడాలి ఫ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్ -
అయినవిల్లిలో భక్తజన సందోహం
స్వామివారికి రూ.2.21 లక్షల ఆదాయం అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 48 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇరుగురు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 18 జంటలు, పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు పాల్గొన్నాయి. స్వామి వారి సన్నిధిలో ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురు చిన్నారులకు తులాభారం, ఒక చిన్నారికి అన్నప్రాశన నిర్వహించారు. స్వామికి ముగ్గురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 31 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3100 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.2,20,638 ఆదాయం లభించినట్లు ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గ భవాని తెలిపారు. వాడపల్లిలో వసతి గదులకు రూ.9.9 లక్షల విరాళంకొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వసతి గదుల నిర్మాణానికి ఓ కుటుంబం రూ.9.9 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ క్షేత్రానికి శనివారం వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారికి వసతి గదుల నిర్మాణానికి, వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం విశాఖపట్నం కేఆర్ఎం కాలనీకి చెందిన కీర్తిశేషులు బలభద్రుని వెంకటనాగ సత్యసాయి సిరి అంజన తల్లిదండ్రులు విజయలక్ష్మి – మాధవరావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు పై మొత్తాన్ని సమర్పించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.7,81,206 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. -
అన్నదాతపై అధికార జులుం!
● తన పొలంలో పంటను అన్యాయంగా కోసి విక్రయించడంపై ఆగ్రహం ● జెండాలు పాతి ఊరిలో పరువు తీశారు ● వెల్ల సోమేశ్వరస్వామి ఆలయ ఈఓపై కౌలు రైతు ఫిర్యాదు రామచంద్రపురం: కంచే చేను మేసిన చందంగా దేవదాయశాఖ వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల అండదండలతో ఖర్చుల పేరిట స్వామివారి సొమ్ములు మింగేస్తున్నారని మండలంలోని వెల్ల సోమేశ్వరస్వామి వారి దేవస్థానం ఈఓ సీహెచ్ శ్రీనివాస్పై ఓ రైతు ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే స్వామి వారికి సుమారు 104 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయ సేవలకు 40 ఎకరాలు పోగా మిగిలిన 48 ఎకరాలను గ్రామానికి చెందిన రైతులకు బహిరంగ వేలంలో మూడేళ్లకోసారి కౌలుకు ఇస్తుంటారు. మిగిలిన 16 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోకపోగా సదరు ఆక్రమణదారులపై ఎకరానికి ఇంత అని సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 48 ఎకరాల నుంచి ఆలయానికి ఏటా సుమారు రూ.27 లక్షల ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇదిలా ఉండగా ఈఓ కూటమి నేతల ప్రోద్బలంతో ఇంకా గడువు ఉండగానే కౌలు చేస్తున్న రైతులను వెళ్లగొట్టి తమ అనుయాయులకు ఆ భూములు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే వెల్లలోని దేవదాయ శాఖ అధికారి కార్యాలయం ఎప్పుడూ తాళం వేసి ఉండడం చర్చనీయాంశమవుతోంది. కౌలు చేస్తున్న 12 మందిలో సుమారు 5 నుంచి ఆరుగురికి బకాయిలు కట్టాల్సి ఉంది. వీరిలో గ్రామానికి చెందిన పట్నాల గణపతి మూడేళ్లుగా 3 ఎకరాలు సాగు చేస్తూ ఆఖరి సంవత్సరంలో రెండో పంట పండిన తరువాత శిస్తు కట్టి తదనంతరం తిరిగి నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏప్రిల్ 23న సదరు భూమిలో ఈవో ఎర్రజెండాలు వేయించారు. ఆ సమాచారాన్ని కూడా గణపతికి ఇవ్వలేదు. కూటమి నేతల ఒత్తిడితో 3 ఎకరాల్లోని పంటను మే 17న కోయించి మాసూళ్లు చేయించి కొనుగోలుదారునితో కుమ్మకై ్క ధాన్యాన్ని విక్రయించారని ఆ రైతు ఆరోపిస్తున్నారు. దీనిపై సదరు రైతు రాజకీయ ఒత్తిళ్లతో దౌర్జన్యం చేసి తన పంటను మాసూలు చేసి, జమా ఖర్చులు చెప్పకుండా ధాన్యాన్ని విక్రయించారని, ఈ మేరకు ఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులకు గణపతి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఈఓ శ్రీనివాస్ వెల్లతో పాటు, మరో 12 ఆలయాలకు ఇన్చార్జి ఏఓగా కూడా ఉన్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఈఓ నిరాకరించారు. నా పరువుకు నష్టం కలిగించారు రెండో పంట చేతికి వచ్చే సమయంలో ఎటుంటి నోటీసులు ఇవ్వకుండా చేలో జెండాలు వేసి గ్రామంలో నా పరువు తీసేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈఓ శ్రీనివాస్ నా పంటను కోసేసి జమా ఖర్చులు చెప్పలేదు. కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. ఆయన చేసిన దౌర్జన్యంపై పోలీసులను ఆశ్రయించాను. దీనిపై కోర్టులో పరువునష్టం దావా కూడా వేస్తాను. – పట్నాల గణపతి, దేవస్థానం భూమి కౌలు రైతు -
చిరు ప్రాణానికి చిటుక గండం
● నిర్లక్ష్యమే ప్రమాద హేతువు ● అప్రమత్తతతో ముందుగా మేలుకోవాలి ● టీకాతో ప్రాణానికి తప్పనున్న ముప్పు రాయవరం: తొలకరి పలకరించింది. భూమిపై గడ్డి మొలుస్తోంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు గడ్డి మొలిచే ప్రాంతాల్లో నిద్రావస్థలో ఉన్న క్రిములు బలపడి జీవాలు తినే పచ్చగడ్డి ద్వారా పశువుల పొట్టలోకి వెళ్తాయి. ఈ క్రిములు పశువుల్లోని చిటుకు వ్యాధికి కారణమవుతాయి. గొర్రెలు, మేకల్లాంటి జీవులు చిటుకు రోగం బారిన పడితే నిమిషాల్లోనే చనిపోతాయి. ఆవులకు, గేదెలకు జబ్బవాపు, గొంతువాపు టీకాల మాదిరిగానే చిటుకు రోగానికి గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తారు. అందుకే ‘చిటుకు’ రోగంపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో గొర్రెలు, మేకలు సుమారు 48 వేల పైబడి ఉన్నాయి. వీటికి ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. అలాగే తొలకరికి ముందుగా గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు ప్రతి పశువైద్య కేంద్రం ద్వారా ఆవులకు, గేదెలకు టీకాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులు వ్యాధి ఎప్పుడు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ పద్ధతులపై పెంపకందారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యాపించేది ఇలా గొర్రెలు, మేకలకు గాలికుంటు, మసూచి, పీపీఆర్, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు త్వరగా సోకుతాయి. ఒక మంద నుంచి మరో మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స బదులు నివారణే ముఖ్యమైందని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముదే ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిటుకు వ్యాధి మేకలకన్నా గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. నివారణ చర్యలు ఇవీ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. అకాల వర్షాలు, తొలకరి వర్షాలకు పెరిగిన గడ్డిని పశువులు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వరి కోసిన తర్వాత మిగిలిన కర్రలను ఎక్కువగా మేపకూడదు. గొర్రెలు, మేకలకు మూడు నెలలకోసారి నట్టల నివారణ మందు వేయాలి. 30 రోజుల వయసు కలిగిన గొర్రెలు, మేక పిల్లలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వ్యాధికారక బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు, విషపదార్థం విడుదల కావడంతో ఈ వ్యాధి సోకుంది. వ్యాధి సోకిన గొర్రె గిర్రున గాలిలో ఎగిరి కింద పడి మరణిస్తుంది. చిటికెలో జీవాలు చనిపోతాయి కనుకనే చిటుక వ్యాధిగా పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాలు రాత్రి బాగా ఉండి తెల్లవారే సరికల్లా ఎక్కువ సంఖ్యల్లో జీవాలు మత్యువాత పడుతుంటాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా కళ్ల ముందే హఠాత్తుగా గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. జ్వరం, పళ్లు కొరకడం, వణకడం, బిగుసుకుని పోవడం, కాళ్లతో పొట్టను తన్నుకోవడం, చెట్లకు గట్టిగా తలను ఆనించి ఉండడం, కాళ్లు బిగిసి పట్టి నడవడం, శ్వాస కష్టమవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత దశలో అధిక విరేచనాలు, కడుపు నొప్పి, మందకొడిగా ఉండడం, సరిగ్గా మేయకపోవడం వంటి లక్షణాలుంటాయి. ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం చిటుకు వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. వ్యాధి సోకకముందే నిరోధక టీకాలు వేయిస్తే జీవాల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జిల్లాలో టీకాలు వేయడం ప్రారంభించాం. అన్ని పశువైద్యశాలలు, ఆర్బీకేల్లో తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. గొర్రెలు, మేకల యజమానులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వెంకట్రావు, జేడీ, పశు సంవర్ధక శాఖ, అమలాపురం -
లక్ష్మీ నృసింహుని సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలమ్ సాహ్ని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద కమిషనర్ సాహ్నికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలికారు. వారికి స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ అందజేశారు. తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, మండల ఆర్ఐ వి.రామరాజు, వీఆర్వో ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారి ఆదాయం రూ.2,25,339 ఆలయంలో స్వామివారి లడ్డు ప్రసాదం విక్రయాలు, ప్రత్యేక దర్శనములు, వివిధ సేవల టికెట్లు ద్వారా రూ.1,12,272, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తుల విరాళాలు ద్వారా రూ.1,13,067 కలిపి మొత్తం రూ.2,25,339 ఆదాయం వచ్చినట్టు ఏసీ ప్రసాద్ తెలిపారు. -
ఆ ఎమ్మెల్యేలు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగడం.. ఆ ఫలితాల్లో కొంత మంది పాసవడం, మరికొందరు ఫెయిలవడం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే రీతిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు కూడా వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యారు. ఇలా చెబుతున్నది ప్రతిపక్షమో, గిట్టనివారో అయితే కొట్టిపారేయొచ్చు. కానీ, ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనినే ఎమ్మెల్యేలకు వార్షిక పరీక్షగా భావిస్తే.. ఆయా నియోజకవర్గాల్లోని మెజారిటీ ప్రజలు వారికి పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు. వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎక్కువ మందిపై ప్రజా వ్యతిరేకతకూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పరిపాలన తీరు, కార్యకలాపాలపై ఈ నెల 18న రైజ్ అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో సమగ్ర సర్వే నిర్వహించింది. పనితీరు ఆధారంగా ఆయా ప్రజాప్రతినిధులకు గ్రేడ్లు (జోన్లు) ప్రకటించింది. అత్యంత అవినీతి, పాలనా వైఫల్యం, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను రెడ్ జోన్లో చేర్చింది. ఆ తరువాత కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదన్నట్టుగా ప్రజాభిప్రాయం వ్యక్తమైన ఎమ్మెల్యేలను ఆరెంజ్ జోన్లో.. బాగున్నారనే వారిని గ్రీన్ జోన్లో పేర్కొంది. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలోని మూడు వంతుల మందికి పైగా ఎమ్మెల్యేలకు మొదటి రెండు గ్రేడ్లే దక్కాయి. రైజ్ సంస్థ సర్వే నివేదిక ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అధికార కూటమి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.వీరు రెడ్ జోన్లో..ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైజ్ నివేదిక రెడ్ జోన్లో చూపించింది. ఈ జాబితాలో కాకినాడ సిటీ (వనమాడి వెంకటేశ్వరరావు), కాకినాడ రూరల్ (పంతం నానాజీ), రాజానగరం (బత్తుల బలరామకృష్ణ), కొవ్వూరు (ముప్పిడి వెంకటేశ్వరరావు), రామచంద్రపురం (మంత్రి వాసంశెట్టి సుభాష్), రాజోలు (దేవ వరప్రసాద్), పి.గన్నవరం (గిడ్డి సత్యనారాయణ) ఉన్నట్లు వెల్లడించింది. అవినీతి, అక్రమ కార్యకలాపాలు, లిక్కర్ పర్సంటేజీలు, ఇసుక, మట్టి మాఫియాలకు ఈ నియోజకవర్గాలు కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని సర్వే నివేదిక తేల్చింది. టీడీపీతో పోలిస్తే జనసేనకు చెందిన ఎమ్మెల్యేలే రెడ్ జోన్లో ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఏడుగురు రెడ్ జోన్ ఎమ్మెల్యేలకు గాను నలుగురు ఆ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో తమకు ఆదరణ ఉందని జనసేన నేతలు గొప్పగా చెప్పుకొంటారు. కానీ, ఈ జిల్లాలోనే ఏడాది తిరగకుండానే ఆ పార్టీ ప్రతిష్ట, ఆ పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ అడ్డంగా పడిపోయింది.రాష్ట్ర మంత్రుల్లో 10 మంది పనితీరు బాగోలేదని రైజ్ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు చివరి స్థానం దక్కింది. ఆయన పైన, ఆయన అనుచరగణం పైన ఏడాదిగా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో వివిధ పత్రికల్లో పతాక శీర్షికల్లో తరచుగా కథనాలు వచ్చేవి. ఇటువంటి ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో కూడా అనేకం వైరల్ అయ్యాయి.ఆరెంజ్ జోన్లో 9 మంది..రెడ్ జోన్లో ఉన్న ఏడుగురిని మినహాయిస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో తొమ్మిది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీరిలో జనసేన నుంచి నిడదవోలులో గెలిచి, పర్యాటక శాఖా మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఉన్నారని రైజ్ సంస్థ పేర్కొంది. ఆయనతో పాటు ప్రత్తిపాడు (వరుపుల సత్యప్రభ), అనపర్తి (నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–బీజేపీ), జగ్గంపేట (జ్యోతుల నెహ్రూ), కొత్తపేట (బండారు సత్యానందరావు), ముమ్మిడివరం (దాట్ల బుచ్చిరాజు – ప్రభుత్వ విప్), పెద్దాపురం (నిమ్మకాయల చినరాజప్ప), రాజమహేంద్రవరం సిటీ (ఆదిరెడ్డి వాసు), తుని (యనమల దివ్య) కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఈ తొమ్మిది మంది పనితీరు అంతంత మాత్రంగానే ఉందని రైజ్ సంస్థ రూపొందించిన నివేదిక పేర్కొంది.ఇవీ కారణాలుఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి రైజ్ సంస్థ అనేక కారణాలను పేర్కొంది. ప్రధానంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం.. చెలరేగిపోతున్న ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియా.. భూ దందాలు.. బదిలీలకు చేయి తడపందే కదలని ఫైళ్లు.. పైసలివ్వందే దక్కని పోస్టింగ్లు.. నచ్చని వారిపై వేధింపులు, కక్ష సాధింపు చర్యలతో కూటమి నేతలు, వారి అనుచరగణాలు అడ్డూ అదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడుతూండటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని తెలిపింది. దీనికి ఇంటింటికీ రేషన్ సరఫరా నిలిపివేత, సెటిల్మెంట్ల వంటివి కూడా తోడయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో పలువురు ఎమ్మెల్యేలు ఏడాది తిరగకుండానే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. తమ ఎమ్మెల్యేలపై ఇంత తక్కువ కాలంలోనే ప్రజల నుంచి ఇంతలా వ్యతిరేక వస్తుందనే విషయం ఊహించలేదని కూటమి పార్టీల సీనియర్లే తలలు పట్టుకుంటున్నారు. -
టచ్ చేసి చూడు!
సఖినేటిపల్లి: తూర్పు తీరంలో జెల్లీ షిష్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో హైడ్రోజోవా తరగతికి చెందిన విష పురుగులు పెద్దఎత్తున తీరానికి చేరుకుంటున్నాయి. జెల్లీ ఫిష్లలో ఒక వర్గానికి చెందిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంతర్వేది బీచ్లో అధికంగా సంచరిస్తున్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిని ‘అగ్గిబాటా’లని పిలుస్తున్నారు.పొరపాటు గానీ.. అందంగా ఉన్నాయని మక్కువతో వీటిని తాకితే అంతే సంగతులు. వాటిని తాకుతున్న వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో భారీ గాలులకు, సముద్రం ఆటుపోట్ల సమయాల్లో ఇవి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని తప్పించుకునేందుకు స్వచ్ఛమైన సముద్ర తీరానికి సైతం వస్తుంటాయి. ఇవి సమూహంగా జీవిస్తూ.. నీటిపై తేలియాడుతూ సమూహంగానే ఒడ్డుకు వస్తుంటాయి. బ్లూ డ్రాగన్ జెల్లీ విషపూరితమే అంతర్వేది బీచ్లో గుర్తించిన బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ మాత్రం పూర్తిగా విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్ అట్లాంటికస్. ఇది బ్లూ బటన్ జెల్లీ ఫిష్లను ఆహారంగా తీసుకుంటుంది. బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్లో ఈకల వంటి నీలిరంగు పువ్వులను తలపించే భాగాన్ని తాకితే అంతే సంగతి. వాటిల్లో విషం ఉంటుంది. ఈ ఫిష్ వెనుక భాగంలో గాలి బుడగ మాదిరి నిర్మాణం ఉంటుంది. అందువల్ల ఇవి కూడా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ వంటి సమస్యలకు లోనవుతారు.తాకితే ఇబ్బందులేచేపలు కాకపోయినా వీటి పేరు చివర ఫిష్ అని ఉండటం వల్ల వీటిని కూడా కొందరు జలపుష్పాలుగా భ్రమించే అవకాశం ఉంది. నిజానికి ఇవి ఒక రకమైన సముద్ర జీవులు. వీటిని ఎవరైనా తాకితే కుడతాయి. తద్వారా అలెర్జీ వచ్చి శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుడతాయి. అంతర్వేది తీరంలో గుర్తించిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్ విషపూరితం కాదని మత్స్యకారులు చెబుతున్నారు. బటన్ వంటి ఆకారాన్ని పోలి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామం పోర్పిటా పోరి్పటా. దీని శరీర భాగంలో ఫోటో అనే గ్యాస్ నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఉండే స్పర్శకాల(టెంటకిల్స్)లో నెమటోసిస్ట్ అనే కణాలుంటాయి. మనుషులు లేదా ఏదైనా జీవి వీటిని తాకితే తమను తాము రక్షించుకోవడానికి ఈ జెల్లీ ఫిష్లు టెంటకిల్స్తో కుడతాయి. ఇవి కుట్టడం ప్రాణాంతకం కాదని సైన్స్ నిపుణులు అంటున్నారు.ప్రాణాంతకం కాదు కానీ..వీటి స్పర్శకాలలో నిమటోసిస్ట్ అనే విషపదార్థం ఉంటుంది. ఇవి వలలో పడితే బాక్స్ (పెట్టె) ఆకారంలో శరీరాన్ని పట్టుకుని తీయాలి తప్ప స్పర్శకాలను తాకకూడదు. ఇవి కుడితే ప్రాణాంతకం కాదు. కానీ.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తుంటాయి. పొరపాటున వీటివల్ల ఏదైనా అపాయం జరిగితే ఎసిటిక్ యాసిడ్(వెనిగర్)లో గుడ్డను లేదా దూదిని ముంచి శరీరంపై పెట్టాలి. ఆ తర్వాత తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్సీ -
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్టాప్ బాక్స్లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన యంత్ర పరికరాలు -
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. – కె.గంగమణి, విద్యార్థిని సాగు విధానాలు తెలుస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది. – పి.ఝాన్సీ, విద్యార్థిని క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. – ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా -
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు ● రైతుల ద్వారా సాగుపై అవగాహన ● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు అంకితమయ్యేలా శిక్షణ ● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం అంటున్న అధికారులు పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు ● రూ.65 లక్షల విలువైన బంగారంగా స్వాధీనం కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని బెదిరించి దోచుకోవడంతో కేసు ● పోలీసుల అదుపులో నలుగురు ● పరారీలో ఇద్దరు రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారని సీఐ వివరించారు. -
అనుమానంతో స్నేహితునిపై కత్తితో దాడి
కొత్తపేట: తన భార్య విషయంలో స్నేహితుడిపై అనుమానంతో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. వానపల్లి గ్రామానికి చెందిన మానుపాటి రాజేష్ మోడేకుర్రు గ్రామానికి చెందిన పితాని సతీష్ను కత్తితో గాయపర్చిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై జి. సురేంద్ర తెలిపిన వివరాల మేరకు రాజేష్, సతీష్ కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలసి చదువుకున్నారు. రాజేష్ వానపల్లి మాలకొండయ్యనగర్ వద్ద చికెన్ వ్యాపారం చేసుకుంటుండగా, సతీష్ కులాంతర వివాహం చేసుకుని మందపల్లిలో నివసిస్తున్నాడు. కాగా సతీష్ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ముమ్మిడివరం వెళ్తూ వానపల్లిలో రాజేష్ దుకాణం వద్ద ఆగాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా రాజేష్ తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిన విషయాన్ని చెప్పగా, సతీష్ తాను నచ్చచెప్పి తీసుకువస్తానని ఊరడించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని అనుమానించిన రాజేష్ చికెన్ కోసే కత్తితో సతీష్ మెడపై దాడి చేశాడు. పదునుగా ఉన్న కత్తి వేటుకు అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాల్సి ఉందని ఎస్సై సురేంద్ర తెలిపారు. -
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి
అమలాపురం రూరల్: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కొత్తపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త కాలాడి అచ్చిబాబు, అతని కుటుంబ సభ్యులు మొల్లేటిమొగ గ్రామంలో తమపై దాడి చేసి తాటాకు ఇంటిని కూల్చేసి డబ్బు, బంగారం దోచుకున్నారని బాధితులు కాలాడి రామలక్ష్మి, సూరిబాబు దంపతులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నకళ్లను శనివారం స్థానిక విలేకరులకు వారు అందజేశారు. గత నెల 26న తన భర్త చేపల చెరువు పట్టుబడికి వెళ్లిన సమయంలో అచ్చిబాబు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు 30 మంది వచ్చి తమపై దాడిచేసి ఇంటి కూల్చేసి తమను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తమ పాకను కూల్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మించారని, కుమార్తె పెళ్లి కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.6.5 లక్షలు, ఐదు కాసులు బంగారాన్ని దోచుకున్నారని రామలక్ష్మి తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. మొల్లేటిమోగలో 30 ఏళ్లుగా ఉంటున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ లేక సామాన్లు రోడ్డుపై ఉన్నాయని, కొన్ని సామాన్లు కాలువలో పడేశారని, తానూ, తమ కుమార్తెలు బట్టలు మార్చుకునే స్థలం లేకుండా చేశారని రామలక్ష్మి అవేదన వ్యక్తం చేశారు. గుడిసె కూల్చి నిరాశ్రయులను చేశారు బంగారం, రూ.6.5 లక్షలు దోచేశారు కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు -
కొబ్బరి @ రూ.22 వేలు
● చరిత్రలో తొలిసారి రికార్డు ధర ● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.8 లక్షల ఎకరాల్లో సాగు ● ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిన దిగుబడి ● ఉత్తరాదికి దిక్కయిన ఆంధ్రా కొబ్బరి సాక్షి, అమలాపురం: జాతీయ మార్కెట్లో ఆంధ్రా కొబ్బరి రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి కాయ దిగుబడి తగ్గడం ఆంధ్రా రైతులకు వరంగా మారింది. కొబ్బరి చరిత్రలో తొలిసారి అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22 వేలు పలికింది. లంక గ్రామాల్లో కొబ్బరి కాయ రూ.23 వేల వరకూ ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వ కాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. గత మే నెలలో ఒకానొక సమయంలో రూ.12 వేల వరకూ ఉండగా తరువాత నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మే చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఈ నెల మొదటి వారంలో కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం రూ.20 వేల వరకు పెరగగా, శనివారం మార్కెట్లో ఏకంగా రూ.22 వేలు పలికింది. మరో వారం రోజుల్లో ధర మరింత పెరగవచ్చని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి పండే దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గగా కేరళలో దిగుబడి మరింత పతనమైంది. ఇక్కడ చెట్టుకు సగటు దిగుబడి 50 కాయలు కాగా ఇప్పుడు 15 కాయలకు పడిపోవడంతో ఉత్తరాది అవసరాలు మొత్తాన్ని రాష్ట్రంలో కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. దీనికితోడు గత ఏడాది కాలంగా దిగుబడిగా వచ్చిన కొబ్బరి ఇటు రైతుల వద్ద కానీ, వ్యాపారుల వద్ద కానీ నిల్వ ఉండటం లేదు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల వద్ద నుంచి, వ్యాపారుల వద్ద నుంచి వారం రోజుల వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్రం నుంచి ఉత్తరాదిలోని గుజరాత్, హర్యానా, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తర ప్రదేశ్లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. ధర పెరిగినా రైతులు ఆచితూచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధర కొబ్బరి రైతుల్లో జోష్ నింపింది. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 11 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.2,50,681 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ వివరించారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సాధారణంగా ఆషాఢ మాసంలో సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. అటువంటిది శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగించనున్నారు. -
ఉత్తరం..దక్షిణ ఉంటేనే..
● బదిలీల సిఫార్సుకోరుకున్న చోటు ఇష్టారాజ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ కూడా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,271 ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా.. ఐదేళ్లు పూర్తయి బదిలీకి అర్హత పొందిన వారు 1,113. వీటిలో 904 రిక్వెస్ట్లు ఉన్నాయి. వీరి బదిలీలు అంతర్ జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నా కౌన్సెలింగ్ మాత్రం ఆయా జిల్లాల పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి చెందిన ఇద్దరు గిరిజన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సొంత ప్రాంతాలైన ఏజెన్సీకి బదిలీ కోరుకున్నారు. అసలు ఏజెన్సీకి వెళ్లడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితులున్నా.. వీరికి అవకాశం ఇవ్వకుండా సిఫారసు లేఖ తప్పనిసరి అని చెప్పారు. దీంతో, వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్పై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మెరిట్కు పాతరేస్తున్నారు. కూటమి నేతల సిఫారసు లేఖలకే పెద్దపీట వేస్తున్నారు. ఎవరైనా కోరుకున్న చోటు దక్కించుకోవాలనుకుంటే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి ఎడాపెడా లేఖలు ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నేతల సిఫారసులు ఆధారంగా బదిలీలకు తెర తీయడంతో సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో జరిగిన బదిలీని కూటమి నేతల సిఫారసుతో నిలుపు చేయించుకున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ బాగోతం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను కూడా స్వయంగా కూటమి నేతలనే ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితిలోకి ఆయన జారిపోయారు. బదిలీకి అర్హులు 616 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్, ఇంజినీరింగ్ తదితర అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై, ఆదివారం వరకూ జరగనుంది. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించిన విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల బదిలీలకు కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చైర్మన్గా ఉన్న కమిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 684 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో ఐదేళ్లు పూర్తి చేసిన 616 మంది బదిలీలకు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం 1 నుంచి 205 వరకూ సీరియల్ నంబర్లు ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం 206 నుంచి 410 నంబర్ వరకూ, ఆదివారం 411 నుంచి 616 నంబర్ వరకూ బదిలీలు చేపట్టాలి. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలున్న వారికే బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల జాబితా ప్రకారమే.. ఏజెన్సీలో సర్వీసు, దివ్యాంగులు, భార్యాభర్తల వంటి అంశాలకు బదిలీల కౌన్సెలింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలను బుట్టదాఖలు చేసి, నేతల సిఫారసు లేఖలున్న వారికి మాత్రమే కోరుకున్న చోటు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు పంపించిన సిఫారసు లేఖల్లో పేర్కొన్న జాబితాను అనుసరించే బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఏ సచివాలయంలో ఏ పోస్టుకు ఎవరిని బదిలీ చేయాలో ముందుగానే జాబితా రూపొందించి, సిఫారసు లేఖలు జత చేసి మరీ పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితా ప్రామాణికంగానే బదిలీలు చేస్తున్నారని కౌన్సెలింగ్లో పాల్గొని బయటకు వస్తున్న అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ జాబితాలో ఉన్నవారు 1, 2, 3 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని హోల్డ్లో పెడుతున్నట్లు చెబుతున్నారు. మెరిట్ జాబితా టాప్–10లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనబెడుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు విలేజ్ అసిస్టెంట్లు సిద్ధపడుతున్నారు. సొమ్ములిస్తేనే సిఫారసు లేఖలు కోరుకున్న సచివాలయానికి బదిలీ కావలంటే మొదట గ్రామ టీడీపీ కమిటీ సభ్యుల ఆశీస్సులుండాలి. వారు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ఈవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు నిర్ణయించి, కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈవిధంగా వీలునుబట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ముడుపులు గుంజారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం; కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్; తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతలు వసూళ్ల పర్వాన్ని అడ్డగోలుగా కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.35 వేల జీతంతో పని చేసే చిరుద్యోగులని కూడా చూడకుండా ముక్కుపిండి మరీ వసూలు చేశారని అంటున్నారు. కూటమి ఏలుబడిలో బది‘లీలలు’ మెరిట్కు పాతర సిఫారసు లేఖకు రేటు ఫిక్స్ చేసిన ప్రజాప్రతినిధులు ఆ తరువాతే కావాల్సిన చోటుకు బదిలీ కౌన్సెలింగ్లో అధికారులు లేఖలు అడుగుతున్నారని సచివాలయ అసిస్టెంట్ల ఆరోపణ ఇవిగో ఉదాహరణలు కోనసీమ జిల్లా రాజోలు దీవికి చెందిన మెరిట్ ఉన్న ఒక అసిస్టెంట్ శుక్రవారం నాటి కౌన్సెలింగ్లో తాను కోరుకున్న మండలం కోసం అభ్యర్థించగా.. అక్కడి ప్రజాప్రతినిధి లేఖ ఉందా అని కౌన్సెలింగ్లోనే నేరుగా అడగడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి రాజోలు సబ్ డివిజన్లో 9, పి.గన్నవరం సబ్ డివిజన్లో 20 పోస్టులు ఉన్నాయి. మెరిట్లో ముందు వరుసలో ఉన్నా సిఫారసు లేఖ అవసరమేమిటని ప్రశ్నించిన పాపానికి ఆ పోస్టును హోల్డ్లో పెట్టేశారు. పైగా, అతడిని ఏజెన్సీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా అని అడిగారంటున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి స్పౌజ్ కోటాలో భార్యాభర్తలు స్థానికంగా ఏదైనా మండలంలో అవకాశం ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకున్నారు. వారిలో భర్తకు స్థానికంగా అవకాశం కల్పించి, భార్యను మాత్రం దూరంగా వేరే మండలానికి ఖాయం చేశారని తెలియవచ్చింది. 80 శాతం దివ్యాంగుడైన ఒక అసిస్టెంట్ను కూడా సిఫారసు లేఖ లేకుండా ఏమీ చేయలేమని చెప్పారంటే కౌన్సెలింగ్ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలున్నారు.. స్థానికంగా అవకాశం కల్పించాలని, పిల్లలకు స్కూళ్లలో ఫీజులు చెల్లించేశామని రాజోలు ప్రాంతంలో ఆప్షన్ పెట్టుకున్న వారికి ఎక్కడో దూరంగా ఉన్న ఐ.పోలవరం మండలం వెళ్లాల్సిందిగా సూచించారని తెలియవచ్చింది. రంపచోడవరం ఏజెన్సీలో మూడేళ్లు దాటి పని చేస్తున్న ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్కు కాకినాడ జిల్లా శంఖవరం లేదా రౌతులపూడి మండలాల్లో ఆప్షన్ ఇచ్చారు. అయితే అక్కడకు నేతలు వేరే వారికి సిఫారసు చేయడంతో ఈయనను హోల్డ్లో పెట్టారని అంటున్నారు. ఏజెన్సీలో అంత కాలం పని చేసినా సిఫారసు లేఖ లేదనే కాారణంతో అవకాశం కల్పించకుంటే ఇక కౌన్సెలింగ్కు అర్థమేముంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తొండంగి మండలంలో ఆప్షన్ పెట్టుకున్న మరో అసిస్టెంట్ను కూడా నేతల సిఫారసు లేఖ లేదనే కారణంతో పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. కాకినాడకు చెందిన ఒక మహిళా అగ్రికల్చరల్ అసిస్టెంట్ దగ్గర్లో ఉన్న కాకినాడ రూరల్ లేదా కరప మండలాలకు ఆప్షన్ పెట్టుకున్నారు. కాకినాడ రూరల్ నుంచి సిఫారసు లేఖ లేదనే కారణంతో తుని నియోజకవర్గానికి పంపించేశారు. -
ఇల వైకుంఠంగా వాడపల్లి
● భక్తులతో కిక్కిరిసిన ఆలయం ● స్వామికి రూ.55.94 లక్షల ఆదాయం కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వేకువ జాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము పట్టిన భక్తులు మాడ వీదుల్లో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి వచ్చిన భక్తుల ద్వారా రూ.55,94,479 ఆదాయం వచ్చినట్టు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ, ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ట్రాఫిక్ నియంత్రించి ఆలయ ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ధర్మపథంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాల కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, అమలాపురం: జిల్లాలో రూరల్ 75, అర్బన్ నాలుగు ప్రాంతాల్లో 79 మంది ఆశా కార్యకర్తల నియామకానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.దుర్గారావు దొర శనివారం తెలిపారు. జూన్ 30వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పీహెచ్సీలు, అర్బన్ ఆరోగ్యకేంద్రాలలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవలసిందిగా కోరారు. కార్యకర్తల నియామకం గ్రామీణ, పట్టణ ఆరోగ్య పారిశుధ్య, పౌష్టికాహార కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిభ కలిగిన మూడు దరఖాస్తులను జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకం జరుగుతుందని దుర్గారావు దొర తెలిపారు. ఈవీఎం గోడౌన్లకు పటిష్ట భద్రతకలెక్టర్ మహేష్కుమార్ ముమ్మిడివరం: ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల మూడో అంతస్తులో గోదాములను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్థితిగతులను పరిశీలించి భద్రతకు తీసుకుంటున్న చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గొడౌన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. దోమల నియంత్రణతో మలేరియా, డెంగీ అదుపు డీఎంహెచ్వో డాక్టర్ దుర్గారావు దొర అమలాపురం టౌన్: దోమల నియంత్రణతోనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులను అరికట్టవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన నూరు శాతం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధుల నియంత్రణపై వైద్యశాఖ ప్రచురించిన వాల్ పోస్టర్ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆయన శనివారం ఆవిష్కరించి దోమల నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, ఉప యూనిట్ అధికారి ఆదినారాయణ, సూపర్వైజర్ కె.మేరీ జ్యోతి, జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ వీవీవీ త్రిమూర్తులు పాల్గొన్నారు. -
అధికార లాంఛనాల బ్లెస్సన్ అంత్యక్రియలు
ఆలమూరు: విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన కానిస్టేబుల్ ఎస్.బ్లెస్సన్ జీవన్ (32)కు పోలీసు శాఖ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఆలమూరులోని ఆయన నివాసం నుంచి ప్రజల అశృనయనాల మధ్య పోలీసు బందోబస్తుతో మృతదేహాన్ని ఆలమూరులోని ఏటిగట్టు పక్కన ఉన్న శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. బ్లెస్సన్ అమర్ రహే అంటూ క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, రావులపాలెం సీఐ కె.శేఖర్బాబు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించి 12 రౌండ్లు గాలిలో పేల్చి గౌరవ వందనం చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు గురువారం రాత్రి బ్లెస్సన్ నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. పోలీసుశాఖలో అంకితభావంతో పనిచేసే అత్యుత్తమ కానిస్టేబుల్ను కోల్పోయిందనని ఆయన ఆవేదన చెందారు. బ్లెస్సన్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్రైమ్ సీఐ గజేంద్ర, ఆత్రేయపురం ఎస్సై టి.రాము, ట్రైనీ ఎస్సై బాలకృష్ణ, సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పంట కాలువల ఆక్రమణల తొలగింపునకు చర్యలు
జల వనరులశాఖ ఇంజినీర్లకు జేసీ ఆదేశం అమలాపురం రూరల్: జిల్లాలో పంట కాలువల వెంబడి ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగింపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ టి.నిశాంతి జలవనరుల శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, జలవనరులశాఖ ఇంజనీర్లు, మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులతో ఆమె సమీక్షించారు. జల వనరులశాఖ పరిధిలో ఉన్న ఆక్రమణల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సత్వరం వాటిని తొలగించాలని సూచించారు. ఆర్డీవోలు జలవనరుల శాఖ ఇంజినీర్ల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాజకుమారి కె.మాధవి, పి.శ్రీకర్, బి.అఖిల, జలవనరుల శాఖ ఇంజినీర్లు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరం ఘటన మృతులకు నివాళి మామిడికుదురు: గెయిల్ హామీల అమలుకు అవసరమైతే పోరాడేందుకు సిద్ధమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. నగరం గ్రామంలో గెయిల్ విస్ఫోటం జరిగి 11 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నాటి ఘటనలోని మృతుల చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీ వద్ద వారికి నివాళులర్పించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్ర మాదం జరిగిందన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ ల్లో 11 హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. వాటిని సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని, దీనిపై జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని, అవసరమైతే బాధితుల తరఫున పోరాడతానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, బీజేపీ జి ల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, నియోజకవర్గ మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 4న జేఎన్టీయూకే స్నాతకోత్సవం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ–కాకినాడ 11వ స్నాతకోత్సవం వచ్చే నెల ఇన నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ముఖ్య అతిథిగా వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ముఖ్య అతిథి బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రమ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వివరించారు. స్నాతకోత్సవంలో భాగంగా 2023–24కు సంబంధించి బీటెక్ 41,258, బీ–ఫార్మసీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఫార్మా–డి 274, బీఆర్క్ 83, పీహెడ్డీ 100, బంగారు పతకాలు 40 ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు మాజీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితుడు ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు బాలు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో 20 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. -
జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు
సింగరాజుపాలెం ప్రజల అభ్యంతరం దేవరపల్లి: జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ప్రజలు అభ్యంతరం తెలిపారు. టవర్ నిర్మిస్తున్న స్థలం వద్ద పలువురు గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ నిర్మాణం వల్ల ప్రమాదాలతో పాటు అనారోగ్యాలకు గురవుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారున టవర్ నిర్మిస్తే ఇబ్బంది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు నివశిస్తున్న కాలనీలో ఓ వ్యక్తికి చెందిన స్థలంలో గురువారం అర్ధరాత్రి టవర్ నిర్మాణానికి గోతులు తవ్వడం ప్రారంభించారని, ఈ విషయం తెలుసుకున్న పలువురు అక్కడకు చేరుకుని పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2018లో ఇదే ప్రాంతంలో సెల్టవర్ నిర్మాణ పనులు చేపట్టగా అప్పటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నిలుపుదల చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా మళ్లీ అర్ధరాత్రి పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శేషు, గద్దే శ్రీనివాస్, వామిశెట్టి వెంకటేశ్వరరావు, అయినపర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు. -
22ఎ భూముల జాబితా పబ్లిష్ చేయాలి
ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ రామచంద్రపురం రూరల్: 22ఎ భూముల విషయంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. రామచంద్రపురం మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన చర్చలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఆఖరికి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి కూడా రైతుల భూములు 22ఏలో పెట్టేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. దీనివల్ల చాలా మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే గ్రామ స్థాయిలో 22 ఏ భూముల జాబితాను పబ్లిష్ చేయాలని ఆయన సూచించారు. -
శుభకార్యాలకు శూన్యం!
కొత్తపేట: తెలుగు మాసాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నది ఆషాడం. హిందూ పురాణాల ప్రకారం ఈ మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 24తో ఈ నెల ముగుస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. వివాహాది శుభకార్యాలు ఏమీ ఈ నెలలో తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలున్నాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధనలకు ముఖ్యమైంది. దీనినే తొలి ఏకాదశి అని అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలోనే గురు పూర్ణిమ, దేవశయన ఏకాదశి, వారాహి నవరాత్రి పూజలు ఈ మాసం తొలిరోజు నుంచే ప్రారంభమవుతాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు, ఒడిశా రాష్ట్రం పూరీలో జగన్నాథుని రథయాత్ర వంటి ముఖ్యమైన కార్యక్రమాలు, ఉపవాస పండుగలు నిర్వహిస్తారు. చాతుర్మాసోత్సవాలు సైతం ఈ నెలలోనే ప్రారంభమౌతాయి. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని, అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారని చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దుర్గామాత ఆరాధన శక్తినిస్తుందని చెబుతారు. ఈ మాసంలో దుర్గాదేవిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యం గల మాసమని, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందంటారు. ఆషాఢ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించడం ద్వారా వారి అనుగ్రహం లభిస్తుందంటారు. గోరింటాకు ప్రత్యేకం ఈ కాలంలో గ్రామీణులు గోరింటాకు పెట్టుకుంటారు. దీనితో సైన్స్ ముడిపడి ఉంది. వర్షాలు కురవడం వల్ల క్రిమికీటకాలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయి. చర్మవ్యాధుల నివారణకు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలు ఎక్కువగా గోరింటాకు అలంకరణగా భావిస్తారు. పెళ్లి ఈడుకొచ్చిన యువతులకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు. వధూవరులకు తప్పని విరహం ముఖ్యంగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చేది కొత్తగా పెళ్లెన దంపతులు కలవకూడదనే ఆచారం. ఇది పూర్వం నుంచీ వస్తోంది. దీనిలో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. దీని వెనుక శాసీ్త్రయ కారణాలు ఉన్నాయని పెద్దలు, పండితులు చెబుతారు. అత్త, మామలు దాటిన గుమ్మం అల్లుడు దాటకూడదని, అత్తా, కోడలు ఒక ఇంటిలో ఉండకూడదని రకరకాల కధనాలతో పాటు ఈ మాసం నుంచే వర్షాకాలం ప్రారంభమౌతుంది. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభిస్తారు. కొత్తగా పెళ్లైన యువకుడు వ్యవసాయ పనులకు డుమ్మా కొట్టి అత్తవారింట్లోనే గడుపుతాడు.. ఇక్కడ పనులు సాగవనే కారణంతో ఈ నెల రోజులు నూతన దంపతులు కలవకూడదనే నియమం పెట్టారంటారు. ఆషాఢానికి ఎన్నో ప్రత్యేకతలు వర్షాలతో సాగు పనులకు శ్రీకారం వైష్ణవ ఆరాధనలకు ప్రాశస్త్యం -
ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే చర్యలు
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: షెడ్యూల్ కులాలు, తెగల వారిపై అన్యాయంగా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 2025 రెండో త్రైమాసానికి సంబంధించి ఆయన అధ్యక్షతన కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి పౌర హక్కుల రక్షణ ఎస్సీ ఎస్టీ దురాగతాల నివారణ చట్టం అమలుపై ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సత్వర విచారణకు అవసరమైన ధ్రువ పత్రాలు ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నారు. ఆయా వర్గాల హక్కులు, రక్షణ కోసం ఏర్పాటైన చట్టాల పటిష్ట అమలుకు పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గత సమావేశపు తీర్మానాలపై తీసుకున్న చర్యలను సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి. జ్యోతిలక్ష్మీదేవి వివరించారు. బాధితులకు పరిహారం, ఉపాధి కల్పన విషయంలో జాప్యం జరగకుండా పటిష్టంగా అమలు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 66 కేసులు నమోదు కాగా, 47 ప్రాథమిక విచారణ దశలో, 20 కేసులు చార్జిషీట్ దశలో ఉన్నాయన్నారు బాధితులకు రూ.41.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే బాధితులకు అందజేస్తామని ఆయన తెలిపారు. లక్షిత వర్గాల సంక్షేమానికి వసతి గృహాలలో గెయిల్ సీఎస్సార్ నిధులతో కిచెన్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ టి.నిశాంతి, డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, ఏఎస్పీ ప్రసాద్, డీఎస్పీలు ప్రసాద్ , మరళీమోహన్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరి
వరిసాగులో వ్యవసాయశాఖ సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో రైతులు కేవలం వరినాటు పద్ధతిని మాత్రమే అవలంబించేవారు. ప్రసుత్తం వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల వెదజల్లు విధానంలోను రైతులు అధికంగా సాగు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం స్థానికంగా కూలీల కొరతను ఎదుర్కొనేందుకు బెంగాలీ కూలీలను వినియోగించుకోవడం అహ్వానించదగ్గ పరిణామం. – కె.నాగేశ్వరరావు, డివిజనల్ వ్యవసాయాధికారి, అలమూరు బెంగాలీ కూలీలతో నాట్లు వేగవంతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్ పనులు త్వరగా ప్రారంభించాం. కొన్నేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నాను. బెంగాలీ కూలీలతో వరినాట్లు వేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాం. వారు ఊడ్పు యంత్రం తరహాలో నాట్లు వేశారు. దీనివల్ల ఖర్చు తగ్గింది. చీడపీడల బెడద తగ్గింది. ఎకరానికి ఐదు బస్తాల ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను. – కొత్తూరు సాయి రామకృష్ణ, రైతు, పినపళ్ల -
సాగు.. బెంగ తీరేలా..!
పెదపళ్లలో వరినాట్లు వేస్తున్న బెంగాలీ కూలీలుచింతలూరులో బెంగాలీ కూలీల ఆకుతీత పనులు● బెంగాలీ కూలీల వైపు రైతుల చూపు ● అక్కడి పద్ధతిలో చురుగ్గా నాట్లు ● సమయం..పెట్టుబడి ఆదా ● అధిక దిగుబడులకూ అవకాశం ఆలమూరు: పొరుగు రాష్ట్రం కార్మికులు లేనిదే మన రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో వరి సాగయ్యే అవకాశం లేదు. ఇప్పటికే సాగులో ఆధునిక యంత్రాలతో పాటు వరినాట్లు వేసే డ్రమ్ము సీడర్ యంత్రం అందుబాటులోకి వచ్చినా కూలీల కొరత మాత్రం తగ్గడం లేదు. ఖరీఫ్, రబీ సీజన్లలో వరినాట్లు వేసేందుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. వారి కొరతను ఎదుర్కొనేందుకు వలస కూలీలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో పశ్చిమ బంగాల్లో అమలవుతున్న వరిసాగు పద్ధతులు స్థానిక రైతులను ఆకర్షిస్తున్నాయి. అక్కడి విధానాలతో అధిక దిగుబడుల సాధనతో పాటు కూలీల కొరతను ఇక్కడి రైతులు అధిగమిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు స్థానిక రైతులకు వరమనే చెప్పాలి. గతంలో వరినాట్లు సమయంలో ఆకుతీతకు మగవారిని, వరినాట్లకు ఆడ కూలీలను వినియోగించుకునే వారు. అయితే బెంగాలీ కూలీల రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత పదేళ్ల నుంచి బెంగాలీ కూలీలు చక్కని నేర్పిరితనంతో సమయాన్ని, పెట్టుబడిని ఆదా చేస్తూ ఆకుతీత నుంచి వరినాట్ల వరకూ పనులు చేస్తుండటంతో ఏటా వారి విధానాలకు అకర్షితులయ్యే రైతుల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.64 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.06 లక్షల మంది రైతులు సాగులో నిమగ్నమయ్యారు. ధవళేశ్వరం వద్ద తూర్పు, మధ్య డెల్టాకు సాగునీటిను విడుదల చేయడంతో పాటు వర్షాలు కురుస్తున్నందున ఆకుతీత, వరినాట్లు సీజన్ చురుగ్గా సాగుతోంది. బెంగాలీ విధానంలో నాట్లు వరినాట్లు వేసే సమయంలో బెంగాలీ కూలీలు స్థానిక కూలీలకు భిన్నమైన శైలిని అవలంబిస్తారు. ఈ కార్మికులు రోజంతా పనిచేయకుండా కేవలం తెల్లవారుజామున పనులు ప్రారంభించి వాయు వేగంతో పనిచేసి మధ్యాహ్నానికే పని ముగించుకుంటారు. అప్పటి నుంచి సాయంకాలం వరకూ విశ్రాంతి తీసుకుని రాత్రికి స్వయంగా నచ్చిన వంటకాలు చేసుకుని హాయిగా జీవనం సాగిస్తుంటారు. వారి పద్ధతిలో వరినాట్లు సులభతరం కావడంతో ఏటా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే కూలీల సంఖ్య పెరుగుతుంది. దీంతో జిల్లాలో ప్రస్తుతం సుమారు 70 శాతం మేర నారుమడులకు వారినే వినియోగిస్తున్నారు. వారి విధానంలో వేసే నాట్ల వల్ల పంటకు తెగుళ్ల బెడద తగ్గడంతో పెట్టుబడులు కూడా ఆదా అవుతుండటంతో రైతులు వారి పని విధానంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వరినాట్లు వేసేందుకు వచ్చే బెంగాలీ కూలీలకు స్థానిక రైతులు స్థావరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక వసతులు సమకూరుస్తున్నారు. పెట్టుబడి ఆదా స్థానిక వ్యవసాయ కూలీల కన్నా భిన్నంగా బెంగాలీలు వరినాట్లు వేగంగా వేయడంతో పాటు సమదూరంలో వరినాట్లు వేయడం వల్ల వరి నారు ఆదా అవుతుంది. దీనివల్ల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆశాజనకమైన దిగుబడులు రావడంతో రైతులు వారిపై మక్కువ చూపుతున్నారు. వరిసాగులో తక్కువ నారును ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలన్న ప్రచారానికి తగ్గట్టుగా బెంగాలీలు నాట్లు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరిసాగులో గతంలో రైతులు ఎకరానికి 25 కిలోల విత్తనాలు నారు వినియోగించేవారు. బెంగాలీ కూలీల రాకతో ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. స్థానిక కూలీలు 30 రోజుల వయసు గల నారును మాత్రమే వినియోగిస్తారు. స్థానిక కూలీలు వేసిన నాట్లు మూనలుగా తిరిగేందుకు సుమారు పది రోజులు పడుతుంటే బెంగాలీ కూలీలు వేసే నాట్లు నాలుగు రోజుల తరువాత మూనలు కడుతున్నాయి. స్థానిక కూలీలు ఎకరాకు సుమారు 45 పోగులకు పైగా వినియోగిస్తుంటే అదే విస్తీర్ణానికి బెంగాలీలు కేవలం 15 నుంచి 20 పోగులు వాడుతున్నారు. ఎకరాకు నలుగురు కూలీలే.. ఎకరా పొలానికి వరినాట్లు వేసేందుకు సాధారణంగా ఆరుగురు కూలీలు అవసరం కాగా బెంగాలీ విధానంలో నలుగురు మాత్రమే ఉండి అనుకున్న గడువు మేరకు పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. అలాగే వారి వద్ద ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా తాము చేసిన పనిని సెంట్లతో సహా కొలతలు చేసి కచ్చితంగా కొలుచుకుంటారు. అలాగే ఒప్పందానికి అనుగుణంగా కూలీ సొమ్మును తీసుకుంటారు. దిగుబడుల్లో సైతం భారీ వ్యత్యాసం కనపడుతుండడంతో స్థానిక రైతుల పంట పండినట్టు అవుతోంది. సాధారణంగా స్థానిక కూలీల చేత పూర్తి చేసిన ఆకుమడులు అందుబాటులోకి వచ్చాక ఆకుతీత, వరినాట్లు వేసేందుకు ఎకరాకు రూ.పది వేలు ఖర్చవుతుంది. అయితే బెంగాలీ కూలీలు మాత్రం ఎకరాకు రూ.నాలుగు వేలు మాత్రమే తీసుకుంటున్నారు. బెంగాలీ కూలీల చేత చేయించుకున్న పనుల వల్ల ఎకరానికి ఐదు బస్తాల వరకూ దిగుబడులు అదనంగా వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. వరిసాగు ఖర్చు సుమారు రూ.ఆరు వేల వరకు తగ్గుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాను సారా రహితం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమ నిర్వహణకు అధికారులు కృషి చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సారా నిర్మూలనకు అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకూ చేసిన కృషిపై సమీక్షించారు. సారా ముద్దాయిలను బైండోవర్ చేయాలని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులపై గట్టి నిఘా ఉంచాలని, వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. సారా నిర్మూలనపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. పలు కేసులలో ముద్దాయిల ప్రవర్తన పరిశీలించి, ఇంకా సారా వ్యాపారం చేస్తూంటే పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎం.కృష్ణకుమారి, ఏఈఎస్ కె.మౌనిక, జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని.. హమీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రిజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.బొత్స మాట్లాడుతూ.. ‘‘నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తాం. ఇదిగో చంద్రబాబు.. ఇదిగో పవన్ అంటూ మీ మ్యానిఫెస్టో.. బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు...అక్రమ కేసులు పెట్టి.. చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైఎస్సార్సీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడింది. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్సీ రెండు సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కురసాల కన్నబాబుమాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తుంది...క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని కన్నబాబు మండిపడ్డారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామీ పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలో హమీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ -
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు
● ఆర్జేసీ త్రినాథరావు ● వాడపల్లి వెంకన్న క్షేత్రం సందర్శన ● క్యూ లైన్లు, శానిటేషన్ పరిశీలన కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో భక్తులు మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని, అన్న ప్రసాదం స్వీకరించి, నూరు శాతం సంతృప్తి చెందేలా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ నల్లం సూర్యచక్రధరరావు క్షేత్రంలో భక్తులకు అమలు చేస్తున్న సౌకర్యాలు, చేయాల్సిన పనులను ఆర్జేసీకి వివరించారు. అనంతరం ఆర్జేసీ విలేకరులతో మాట్లాడుతూ వాడపల్లి, అన్నవరం, సింహాచలం ఆలయాలలో క్యూ లైన్లు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, అవసరం మేరకు అభివృద్ధికి చర్యలు తసుకుంటున్నట్టు తెలిపారు. అంతకు ముందు త్రినాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈఓతో పాటు వేదపండితులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. రూ.1.45 కోట్ల ఆదాయం కాగా స్వామివారికి హుండీల ద్వారా రూ.1,45,16,599 ఆదాయం వచ్చినట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం గురువారం వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,22,85,766, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.22,30,833తో మొత్తం రూ. 1,45,16,599 ఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 37 గ్రాములు, వెండి 890 గ్రాములు, పలు దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా జిల్లా దేవదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానం ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావు, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్–3 ఈఓ బీ కిరణ్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగేనా!
● శివారుల్లో సాగుపై అనుమానాలు ● జూన్ 1న విడుదల చేసిన నీరు 20వ తేదీ నాటికీ చేరని వైనం ● వర్షాలు కురుస్తున్నా మందకొడిగా నారుమడులు ● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా ● 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో.. సాక్షి, అమలాపురం: ఆశల సాగు ఖరీఫ్ జిల్లాలో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. శివారుల్లో ముంపు భయం.. ఆలస్యంగా వదలిన సాగునీరు.. విడుదల కాని ధాన్యం సొమ్ములు... ప్రభుత్వం అందించని అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం... ఇలా చెప్పుకుంటూ పోతే ఖరీఫ్కు అడుగడుగునా అవాంతరాలే. దీనితో శివారుల్లో ముందస్తు సాగు అటుంచి ఆలస్యంగానైనా సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ముందస్తు సాగు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్ ఆలస్యమవుతోంది. తొలకరి సాగుకు వేగంగా నారుమడులు పడే జూన్ నెలలోనే ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 12,640 ఎకరాలకు సరిపడా అకుమడులు పడ్డాయి. అలాగే మరో 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో విత్తనాలు చల్లారు. మొత్తంగా ఇప్పటి వరకు 13,489 ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైనట్టు అంచనా. అంటే ఇప్పటి వరకు పది శాతం కూడా నారుమడులు పడలేదు. జిల్లాలో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం పడుతుండడంతో రైతులు నారు మడులు, వెదజల్లు దుక్కులకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ వారం రోజులలో కొంతమేర నారుమడులు వేగం అందుకుంటున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అడుగడుగునా ఆటంకాలు జిల్లాలో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. సాగు చేసేందుకు సన్నాహాలు చేసుకుందామనుకున్న రైతులకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముందస్తు సాగు చేద్దామంటే జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేసినా 20 తరువాత కాని చేలకు చేరలేదు. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అలాగే శివారుల్లో ముంపు భయం వీడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పంట నష్టపోతే పరిహారం వస్తుందనే భరోసా లేకుండా పోయింది. ఈ కారణాలతో రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు రాలేదు. ముందస్తు లేకుండా చేశారు ముందస్తు సాగు చేయడం ద్వారా కోనసీమ (మధ్య డెల్టా)లో ఖరీఫ్ పంటను ముంపు నుంచి కాపాడుకునే అవకాశముంది. లేకుంటే అక్టోబరు 15 నుంచి నవంబరు 15 మధ్య ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రైతులు పంట నష్టపోతున్నారు. ముందస్తు సాగు వల్ల పంట ముంపు నుంచి బయట పడుతుందని రైతుల అంచనా. దీనిని గుర్తించి గత ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది. కూటమి ప్రభుత్వం మాత్రం జూన్ 1న ధవళేశ్వరం, బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ల ద్వారా సాగునీరు వదిలినట్టే వదిలి తూర్పు డెల్టా కాలువలపై వేమగిరి వద్ద 15 తేదీ వరకు, మధ్య డెల్టా కాలువపై లొల్ల లాకుల వద్ద 20వ తేదీ వరకు నీరు నిలిపివేశారు. దీనితో శివారు ప్రాంతాలకు నీటి విడుదల ఆలస్యమైంది. ఈ సమయంలో నారు వేస్తే జూలై మొదటి వారంలో వర్షాలకు దెబ్బతింటుందని, ఆలస్యం వేస్తే మంచిదనే ఉద్దేశంతో ఉన్నారు. దీని వల్ల కూడా నారుమడులు ఆలస్యం కానున్నాయి. -
జిల్లాలో సగటు వర్షపాతం 18.2 మిల్లీ మీటర్లు
అమలాపురం రూరల్: బంగాళాతంలో ఏర్పాడిన అల్పపీడనం వల్ల కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం ఉదయం వరకు పడుతూ పలు చోట్ల భారీగా కురిసింది. 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 18 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కొత్తపేట మండలంలో అత్యధికంగా 46.1 మిల్లీ మీటర్లు, అంబాజీపేటలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. అయినవిల్లి 36.2, ముమ్మిడివరం 30.4, కె.గంగవరం 30.2, పి.గన్నవరం 29.4, కపిలేశ్వరపురం 20.2, రామచంద్రపురం 21, ఆత్రేయపురం, మండపేటలలో 14.6, కాట్రేనికోన 14.4, అమలాపురం, ఆలమూరు, అల్లవరం, ఉప్పలగుప్తం 13.2 చొప్పున, రావులపాలెం 12.2, మామిడికుదురు, ఐ.పోలవరంలలో 12.4 చొప్పున, మలికిపురం 10.6, సఖినేటిపల్లి 10.4, రాజోలులో 10.2, రాయవరం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం అమలాపురం రూరల్: ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని, అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తి భవిష్యత్తును కుంగదీసే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అనే నినాదంతో ‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకుం దాం’ అనే నినాదంతో గురువారం కొంకాపల్లి సత్తెమ్మతల్లి గుడి నుంచి పేరూరు జంక్షన్ వరకు విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జేసీ నిశాంతి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ పాకిందన్నారు. ఆర్డీఓ కె.మాధవి విద్యార్థులతో డ్రగ్స్ తీసుకోబోమని ప్రమాణం చేయించారు. డీఎస్పీ టీ.ఎస్ఆర్ కె.ప్రసాద్, డీఈవో షేక్ సలీం బాషా, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, ఐడీసీఎస్ పీడీ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపేట విద్యార్థులను తరలించం
● డీఈఓ సలీం బాషా ● పలు పాఠశాలల తనిఖీ ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానంలోని పెద్దపేట పాఠశాల విద్యార్థులను ఎక్కడికీ తరలించబోమని ఆ పాఠశాలలోనే కొనసాగేలా చర్యలు తీసుకున్నట్టు డీఈఓ సలీం బాషా ఆ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మండలంలోని భీమనపల్లి, గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలను, ఎస్.యానంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో డీఈవో సలీం బాషా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యామిత్ర కిట్లను ఆయన పరిశీలించారు. అలాగే ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఓ పాఠ్యాంశాన్ని బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ను విజయవంతం చేయాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఒకటో తరగతిలో 19,335 మంది విద్యార్థులను చేర్చాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 14.894 మందిని చేర్చినట్టు తెలిపారు. ఈ నెలాఖరు లోగా మిగిలిన వారిని చేర్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎస్.యానం గ్రామంలో పెద్దపేట పాఠశాలలో మోడల్ స్కూల్ పేరుతో తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపబోమని డీఈఓ పేర్కొన్నారు. విద్యార్థులతో తల్లిదండ్రులు నిరసన చేపట్టడంతో ఆ పాఠశాలను డీఈఓ సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్థానిక పాఠశాలలోనే తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆయన వెంట ఎంఈవోలు కె.కిరణ్బాబు, ఎస్.సత్యకృష్ణ తదితరులున్నారు. -
సిరుల సీమలో మందుపాతర
నిక్షేపాల వెతికితీత ప్రారంభం నుంచే ప్రమాదాలు ● 1990లో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్. ● 1994లో అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లో అవుట్ . ● 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్ ● 2011లో రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైప్లైన్ పేలుడు. ● 2012లో రాజోలు మండలంలో కాట్రేనిపాడులంక బావి బ్లో అవుట్ కొద్దిపాటిలో తప్పింది. (రాత్రంతా కష్టపడి అరికట్టారు.) ● 2014లో నగరం గెయిల్ పైప్లైన్ విస్ఫోటం. ● 2014లో గొల్లపాలెం – కరవాకలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్. ● 2015లో కేశవదాసుపాలెం జీసీఎస్లో ఆయిల్ పైప్లైన్ పేలుడు. ● 2016లో అడవిపాలెం వద్ద నగరం మాదిరి గ్యాస్ పైప్లైన్ పేలినా నిప్పు అంటుకోక పోవడంతో ఒక కాలనీకి త్రుటిలో తప్పిన ముప్పు. ● గ్రామాల్లో ఏటా రెండు నెలలకోసారి తరచూ గ్యాస్ లీకేజీలు.2014 నగరంలో గెయిల్ గ్యాస్ ట్రంక్ లైన్ పేలుడు ● బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం ● కేజీ బేసిన్లో బతుకు దుర్భరం ● నిర్లక్ష్యంగా పైప్లైన్లు, ట్రంక్లైన్ల నిర్వహణ ● బావుల కనెక్టింగ్ పాయింట్ల వద్ద లీకేజీలు ● నగరం విస్ఫోటానికి 11 ఏళ్లు మలికిపురం: నగరం ఆయిల్ రిఫైనరీ సమీపంలోని నివాస ప్రాంతాల మధ్య 11 ఏళ్ల కిందట సంభవించిన భారీ విస్ఫోటం ఎంతో మంది జీవితాలను కకావికలం చేసింది. నాటి ఘటన నేటికీ వారి కళ్ల ముందు మెదులుతూ, కాళరాత్రిని తలపిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. నాటి దుర్ఘటన ఆయిల్, గ్యాస్ వ్యాపార సంస్థలకు ఏమాత్రం గుణపాఠం నేర్పలేదని తరచూ సంభవిస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. 2024 జూన్ 27 తెల్లవారుజామున సంభవించిన ఈ దుర్ఘటన 20 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇటువంటి ఘటనలు జరుతాయని ముందే గ్రహించిన కొందరు మేధావులు కేజీ బేసిన్కు 40 ఏళ్ల క్రితం పెట్టిన పేరు ‘మందుపాతర’. భూగర్భంలోని చమురు నిక్షేపాలను బయటకు తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా చమురు సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ ఘటనకు ముందూ వెనుకా కూడా అనేక లీకేజీలు, బ్లో అవుట్ ఘటనలకు కోనసీమ జిల్లా నిలయమవుతోంది. సమాచారం బదలాయింపు లేదు నగరం పేలుడు అనంతరం కేజీ బేసిన్లో పైప్లైన్ల మార్పులు జరిగాయి. కోనసీమలో ఉప్పునీటి ప్రభావం అధికమైంది. ఈ నేపథ్యంలో పైప్లైన్లు దెబ్బ తింటున్నాయనే వాదన ఉంది. కేజీ బేసిన్లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్)కు మొత్తం 900 కిలోమీటర్లు మేర గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. అలాగే కెయిర్న్, రిలయన్స్ సంస్థలకు చెందిన గ్యాస్ పైప్లైన్లూ ఉన్నాయి. గెయిల్ పైప్ లైన్లను కోనసీమతో పాటు ఇక్కడి నుంచి కొవ్వూరు, విజ్జేశ్వరం, వేమగిరి, కాకినాడ, విజయవాడ, కొండపల్లి, హైదరాబాద్ వరకూ ఏర్పాటు చేశారు. నగరంలో గెయిల్ పైప్లైన్ పేలుడు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలతో పైప్లైన్ల నాణ్యతపై పరిశీలన జరిపించారు. అనంతరం 2014లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కేజీ బేసిన్లో గెయిల్ గ్యాస్ పైప్లైన్లన్నీ అప్పటికే సుమారు 25 ఏళ్ల క్రితం వేసినవని, వీటిలో సుమారు 700 కిలోమీటర్ల లైన్లు మార్చాలని ఆయా సంస్థలకు సూచించారు. అప్పట్లో దూర ప్రాంతాలకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ లైన్ల మార్పు జరిగింది. ఈ పనులు కూడా జరిగి 11 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఈ లైన్ల నాణ్యతపై ఓఎన్జీసీ – రెవెన్యూ అధికారుల మధ్య సమాచారం బదలాయింపు లేదు. ప్రమాదం జరిగితే తప్ప వీటిపై దృష్టి పెట్టడం లేదు. పరిశీలన అంతకంటే లేదు. ఆయిల్ పైప్లైన్లు కూడా అంతే.. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు వందకు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్లైన్ల ద్వారా ఆయిల్ కం గ్యాస్ తరలిస్తారు. మరో వంద బావుల నుంచి కేశనపల్లి, అడవిపాలెం, కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల(జీసీఎస్)కు కూడా 4 అంగుళాల పైప్ లైన్లతో గ్యాస్, ఆయిల్ తరలిస్తారు. ఇవి ఓఎన్జీసీ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాల మధ్య ఉన్నాయి. ఈ లైన్లు సుమారు 5 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ఇవి కూడా శిథిలమై తరచూ పేలిపోతున్నాయి. అలాగే, బావుల వద్ద కూడా తరచూ లీకేజీలు వెలుగు చూస్తున్నాయి. బావుల్లోకి వేసిన పైప్లు, వెల్ క్యాప్లు శిథిలమయ్యాయి. పొగమంచు చూసినా భీతిల్లుతున్న ప్రజలు పొగమంచును చూసినా గ్యాస్ అని స్థానికులు భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఆయిల్ బావుల వద్ద, గ్యాస్లైన్లు వెళ్లిన ప్రాంతాల్లోనూ పొగమంచు కనపడినా ప్రజలు భయపడిపోతున్నారు. లీకైన గ్యాస్ పొగమంచు మాదిరి అలముకోవడమే కారణం. ఇది నిప్పు తగిలితే అంటుకుంటుంది. దీంతో, తెల్లవారుజామున పొయ్యి వెలిగిద్దామన్నా కూడా ఆందోళన చెందాల్సిన దుస్థితి అక్కడి ప్రజలది. నాణ్యత లోపం కూడా.. పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఓఎన్జీసీ, గెయిల్ అంటే ఆడిట్ లేని పద్దులు ఉంటాయని, ఇష్టానుసారం దోచుకోవచ్చనే విమర్శ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ సంస్థల కాంట్రాక్టు పనులూ జరుగుతున్నాయి.అడవిపాలెంలో గ్యాస్ లీక్ (ఫైల్) -
పవన్ అన్నా.. కాపాడు అన్నా!
సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ఫోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్ఫోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలకూ అవకాశం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. నిబంధనలు ఇవే.. ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు. జిల్లాలో పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి గత విద్యా సంవత్సరంలో 1,468 ప్రాజెక్టులు నమోదు కాగా, 115 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణమని చెబుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 42 ప్రాథమికోన్నత, 228 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 170 ప్రాథమికోన్నత, 157 ఉన్నత పాఠశాలలున్నాయి. సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు పంపే వీలు బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం హెచ్ఎంలు చొరవ చూపాలి విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చూడాలి. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి జాతీయ స్థాయిలో నిలిచేలా.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి -
సత్యదేవునికి సిరుల వృష్టి
అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి. 602 గ్రాముల బంగారం.. హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు. హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్ 55, సింగపూర్ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్ రియల్స్ ఒకటి, యూఏఈ దీరామ్స్ 40, యూరోలు 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 600 లభించాయి. పోటెత్తిన భక్తులు సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడం, భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదా యం సమకూరినట్టు అధికారులు చెబుతున్నారు. -
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: వర్షాల నేపథ్యంలో గోదావరికి వరదలు సంభవిస్తే, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విపత్తుల సహాయక చర్యలపై ప్రతి శాఖ సమాయత్తం కావాలని, గోదావరి తీరం వెంబడి ఉన్న మండలాలకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. కావాల్సిన అవసరాలపై జూలై మొదటి వారంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్నచోట్ల సైనింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తూ గట్ల పటిష్టతకు ఇసుక సంచులను సిద్ధం చేసుకోవాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. పశువులకు పునరావాసం కల్పించి టోటల్ మిక్సర్ రేషన్ (టీఎంఆర్) పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని ఆ శాఖ అధికారుకు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి.కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సహాయ చర్యలకు సన్నద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రశంసాపత్రాల అందజేత యోగాంధ్రలో భాగంగా ఈ నెల మూడో తేదీన బీచ్, దేవాలయ యోగాసనాల కార్యక్రమంలో అంతర్వేది సముద్ర తీరంలో మూడు వేల మందితో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహార యోగాసనలో జిల్లాకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయోత్సవాన్ని గోదావరి భవన్లో అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా యోగేంద్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ నిషాంతి సారథ్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లాస్థాయి అధికారులను ప్రశంసా పత్రాలు అందించి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు డీఆర్ఓ రాజకుమారి ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు. భూ పరిపాలన అంశాలపై ప్రత్యేక దృష్టి భూ పరిపాలన అంశాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అమరావతి నుంచి బుధవారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, అందరికీ ఇళ్లు, నూతన కోర్టు భవనాలు తదితర వాటిపై సమక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఆన్లైన్, పెండింగ్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అందిన దరఖాస్తులను విచారించి అర్హతల మేరకు క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులతో సమీక్ష -
వాడపల్లికి 96 ఆర్టీసీ బస్సులు
అమలాపురం రూరల్: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో కొలువైన వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రతి శనివారం 96 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి 22 ప్రత్యేక బస్సు సర్వీసులతో పాటు రావులపాలెం నుంచి వాడపల్లికి 8 బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాటితో కలిపి సుమారుగా 96 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ మహేష్ కుమార్, డీడీవో డి.శ్రీనివాసరావు సూచనల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం నుంచి వాడపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.జిల్లాలో 7.1 మిల్లీమీటర్ల వర్షపాతంఅమలాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకూ పడుతూనే ఉంది. చినుకులతో మొదలై, ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సగటు 7.1 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్రేయపురం, రామచంద్రపురం మండలాల్లో 17.1 మిమీ, అత్యల్పంగా మండపేటలో 1.4 మిమీ కురిసింది. మండలాల వారీగా కొత్తపేటలో 11.4, ఆలమూరు 10, అయినవిల్లి 9.8, రావులపాలెం 8.6, మలికిపురం 8.4, సఖినేటిపల్లి 8.4, కపిలేశ్వరపురం 6.4, కె.గంగవరం 6.2, పి.గన్నవరం 5.8, అమలాపురం 4.2, రాజోలు 5.4 ముమ్మిడివరం 5.4, అల్లవరం 4.6, కాట్రేనికోన 4.6, మామిడికుదురు 3.8, ఉప్పలగుప్తం 3.6, ఐ.పోలవరం 4.6, అంబాజీపేట 1.8, రాయవరం 1.2 మిల్లీమీటర్లు చొప్పున నమోదైంది.ఏపీ పీజీ సెట్లో అధ్యాపకుడికి మొదటి ర్యాంకుఅమలాపురం రూరల్: ఏపీ పీజీ సెట్లో 2025 (అసెట్) ఫలితాలలో అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఫిజిక్స్ అధ్యాపకుడు కేవీవీఎస్ మనోహర్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఫిజికల్ సైన్స్ విభాగంలో 91/100 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంఈటీలలో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో 13 యూనివర్సీటీలు కలిపి ఈ సెట్ నిర్వహించాయి. ఆయనతో పాటు ఆ కళాశాల విద్యార్థులైన ఎ.సతీష్ 220, సీహెచ్ ప్రసాద్ 320 ర్యాంకులు సాధించారు. కాగా.. మనోహర్ను కరస్పాండెంట్ కేవీఆర్ నరసింహారావు, చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ ప్రవీణ్, సీనియర్ అధ్యాపకుడు వరప్రసాద్ అభినందించారు.రేపు జాబ్మేళాబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధికల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మెడిప్లస్, జేవీఎస్ టెక్నాలజీ, శ్రీభవానీ కాస్టింగ్, ఇన్నోసోర్స్ సర్వీస్ లిమిటెడ్, పేటీఏం సంస్థలు 615 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి అపై విద్యార్హతల గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదింవచ్చన్నారు.ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలికాకినాడ క్రైం: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, అందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలలపై చోటు చేసుకుంటున్న నేరాలను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుటుంబ కలహాల్లో పరస్పర దాడులు జరగకుండా చూడాలన్నారు. ఆస్తుల చోరీల్లో రికవరీలు పెంచాలన్నారు. డ్రోన్ల సాయంతో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి నిందితులను గుర్తించి నేరాల బాట పట్టకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. -
మట్టి, ఇసుక అక్రమ దందా
పి.గన్నవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గ నేతల అండదండలతో మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా లంక భూముల్లో పెద్ద ఎత్తున మట్టి, ఇసుక తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల మేర దోచుకుంటున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఊడిమూడి, వైవీ పాలెం, పెదకందాలపాలెం, మానేపల్లి ర్యాంపుల్లో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పెదకందాలపాలెంలో 7 లారీలు, 2 జేసీబీల స్వాధీనం పెదకందాలపాలెం ర్యాంపులో పెద్ద ఎత్తున మట్టి, ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా తరలించి విక్రయిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడి చేసి ర్యాంపునకు సమీపంలోని 6 ఖాళీ టిప్పర్లు, ఒక లోడు లారీని, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ వి.వర్మ లోడు లారీని పి.గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. లారీలు వెళ్లకుండా రోడ్డుపై వీఆర్వోను కాపలాగా ఉంచారు. అధికారుల కళ్లుగప్పి డ్రైవర్ల పరారీ లారీల స్వాధీనం అనంతరం కిలోమీటరు దూరంలో జేసీబీల కోసం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్పై వెళ్లారు. అప్పటికే అందిన సమాచారంతో రెండు జేసీబీలను తుప్పల చాటున దాచారు. వాటిని స్వాధీనం చేసుకుని, వెనక్కి వచ్చే సరికి ఇక్కడ ర్యాంపులోని ఆరు ఖాళీ టిప్పర్లతో డ్రైవర్లు పలాయనం చిత్తగించారు. తరలించిన టిప్పర్ల నెంబర్లతో పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకుంటామని ఆర్ఐ చెప్పారు. అక్రమ తవ్వకాలపై కూటమి నేతల ఫిర్యాదు పి.గన్నవరం అక్విడెక్టుకు దిగువన డీఎస్ పాలెం ర్యాంపులో కూటమి నేతల ఆధ్వర్యంలో గతంలో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరిగాయి. కొన్ని నెలలపాటు మూతబడిన ఈ ర్యాంపును సోమవారం మళ్లీ ప్రారంభించారు. ఇదే అదనుగా ఎటువంటి అనుమతులూ లేకుండా ట్రాక్టర్లపై మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మంగళవారం టీడీపీ, జనసేనలకు చెందిన కొందరు నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. డీఎస్పాలెం ర్యాంపు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టి, ఇసుకను తరలించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించిన వారిలో కూటమి నేతలు పడాల వెంకటేశ్వరరావు, నేరేడిమిల్లి రఘు, సీహెచ్.ప్రసన్నకుమార్, కోట రాజేంద్రప్రసాద్ ఉన్నారు. అడ్డూ, అదుపూ లేకుండా తవ్వకాలు రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు -
రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
కలెక్టర్ మహేష్కుమార్ సాక్షి, అమలాపురం: ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ప్రవేశ పెట్టామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.3,706 కోట్లు అదనంగా ప్రతిపాదించినట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సమన్వయంతో గేదెలు, ఆవుల నిర్వహణకు సమృద్ధిగా రుణాలు అందించాలని కోరారు. వారి ఆర్థిక అవసరాలకు స్వయం సహాయక సంఘాల డిపాజిట్ నిధులు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. టిడ్కో రుణాలు పూర్తిస్థాయిలో అందించాలని, సిడ్బీ ద్వారా స్వయం ఉపాధికి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు రుణాల కల్పించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్య రంగానికి రూ.15,472 కోట్లు, మిగిలిన రంగాలకు రూ.2,523 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.17,994 కోట్ల వార్షిక ప్రణాళిక లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.11,934 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.2,871 కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగుళ్ల వేగేశ్వరరావు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రూ.14.60 లక్షల డ్వాక్రా నిధుల దుర్వినియోగంపై ఆరా తీయగా సంబంధిత ఎస్బీఐ అధికారులు సమాధానం ఇస్తూ 16 డ్వాక్రా సంఘాలకు నిధులు మంజూరు సందర్భంలో బీమా సౌకర్యం కల్పించామని, మూడు నెలల్లో వాటిని సంఘాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోనసీమ జిల్లా 2025–26 పొటెన్షియల్ వార్షిక క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవవర్మ, ఆర్బీఐ జోనల్ అధికారి గిరిధర్, యూబీఐ ఆర్ఎం రంగయ్య నాయుడు, జిల్లా అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు. అన్నదాన భవనానికి రూ.లక్ష విరాళం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు కొటికలపూడి నాగ రవీంద్రకుమార్, విజయవాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ 1,11,116 విరాళంగా సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం వారికి దేవస్థానం సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. స్వామివారికి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులకు అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.3,53,341 ఆదాయం వచ్చినట్టు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. -
ఆషాఢం.. అదుర్స్!
అన్నవరం: సాధారణంగా ఆషాఢ మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆదివారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఇదే సమయంలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. తుని సమీపంలోని లోవ దేవస్థానంలో కొలువు తీరిన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తూంటారు. ఉమ్మడి జిల్లాలోని కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి లోవకు వెళ్లే భక్తులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగు ప్రయాణమవుతూంటారు. వీరు మార్గం మధ్యలో అన్నవరంలో ఆగి, సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూంటారు. దీంతో, ఈ ప్రసాదం విక్రయాలు ఈ మాసంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతూంటాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్కు అనుగుణంగా సత్యదేవుని ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ఫ ఆషాఢ మాసంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు లోవ దేవస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారిలో అధిక శాతం మంది తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని కొత్త, పాత నమూనా ఆలయాల వద్ద, తొలి పావంచా వద్ద ప్రసాద విక్రయ స్టాల్స్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ సాధారణ రోజుల్లో 60 వేలు, ఆదివారం నాడు పాత, కొత్త నమూనా ఆలయాల కౌంటర్లలో చెరో 20 వేలు, తొలి పావంచా కౌంటర్ వద్ద 30 వేలు, రత్నగిరిపై ఉన్న కౌంటర్ల వద్ద 30 వేలు, కలిపి మొత్తం లక్ష ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ల వద్ద అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. రూ.1.50 కోట్ల ఆదాయం! మొత్తం మీద ఆషాఢ మాసంలో కొండ దిగువన ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా అన్నవరం దేవస్థానానికి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష ప్రసాదాల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయి. ఒక్కో ప్రసాదం ప్యాకెట్ ఖరీదు రూ.20. దీని ప్రకారం ఆషాఢ మాసం నాలుగు ఆదివారాల్లోనే సుమారు రూ.80 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రసాద విక్రయాల ద్వారా మరో రూ.70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు పూటలా తయారీ రత్నగిరిపై ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రసాదం తయారు చేసి భక్తులకు వేడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఒక్క కార్తికం మినహాయిస్తే మిగిలిన మాసాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే స్వామివారి గోధుమ నూక ప్రసాదం తయారు చేసేవారు. దానిని మర్నాడు ఉదయం వరకూ విక్రయించేవారు. అయితే ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండో షిఫ్ట్లో ప్రసాదాలు తయారు చేసి, కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఫ తలుపులమ్మ లోవకు భక్తుల తాకిడి ఫ జోరందుకోనున్న సత్యదేవుని ప్రసాద విక్రయాలు ఫ అన్నవరంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు -
పర్యాటంకాలెన్నో!
మరమ్మతులకు గురైన బోట్లు ఇక దిండి పర్యాటక కేంద్రంలో 12 ఏళ్ల క్రితం ఒక్కొక్కటీ రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన హౌస్బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటి జెట్టీలు కూడా శిథిలమయ్యాయి. జెట్టితో పాటు బోటు మరమ్మతులకు రూ.30 లక్షల చొప్పున ప్రతిపాదనలు పంపారు. కాగా వీటి జీవిత కాలం 15 ఏళ్లు కావడంతో మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లు వాటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే నిరుపయోగంగా వదిలేస్తే మరొక మూడేళ్లలో వాటికవే పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఫాంటూన్ బోట్ల ఇంజిన్ల కోసం అంచనాలు వేసి పంపారు. ఇక హౌస్బోట్ల విభాగంలో సింగిల్ హౌస్ బోట్లను ప్రవేశపెట్టి దిండి నుంచి నేరుగా గోదావరిలో అంతర్వేది పర్యటనకు ప్రతిపాదించిన ప్రాజెక్టు కూడా అటక్కెక్కింది. మలికిపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వసతుల కల్పన జరగడం లేదు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన దిండి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి కూటమి సర్కారు చేపట్టిన చర్యలు లేకపోగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులలో కూడా భారీగా కోత పెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్ దిండి టూరిజం ప్రాజెక్టుకు జనవరిలో రూ.7 కోట్లు మంజూరు చేశారు. పనులను సైతం ప్రారంభించారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల విడుదలను నిలిపివేసింది. అనంతరం కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు రూ.2 కోట్లు విడుదల చేసింది. దీంతో మూడవ అంతస్తు నిర్మాణానికి అప్పటికే కూలగొట్టిన రెండో అంతస్తును మరమ్మతులతో పాటు గదులను, రెస్టారెంట్ను, బార్ను రీమోడల్ చేసి సరి పెట్టారు. ఇలా దిండి టూరిజం మాత్రమే కాదు.. జిల్లాలో అంతర్వేది, ఓడలరేవు, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో అధునిక వసతుల కల్పనకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు సైతం కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఇదే సమయంలో స్థానిక ప్రైవేటు టూరిజం మరిన్ని వసతులు కల్పించి పర్యాటకులతో కళకళలాడుతూ ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటోంది. ఏకంగా రూ.30 కోట్లతో నూతన భవనాలు నిర్మించింది. ఇక్కడి సరోవర్ పోర్టికో ఇప్పటికే రూ.కోట్లతో వసతులను ఏర్పాటు చేయడంతో దీనిని మహీంద్ర సంస్థ టేకోవర్ చేసింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సైతం దిండి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అలాగే రాజమహేంద్రవరంలో ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ వంటి ప్రాజెక్టును దిండిలో కూడా ప్రతిపాదించినప్పటికీ ఏ కారణం చేతనో అది అటకెక్కింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల నిధులతో రాజమహేంద్రవరంలోనే పుష్కర ఘాట్ అభివృద్ధి పనులతో పాటు హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధికి రూ.97.40 కోట్లతో చేపట్టిన పనులు తప్ప పర్యాటకాభివృద్ధికి ఎటువంటి నిధులూ ఇవ్వలేదు. అమలుకు నోచని పవన్ ప్రకటనలు ఇక జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు గోదావరి పాయలలో పర్యాటకం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నో ఎన్నికల హామీలు గుప్పించేశారు. కానీ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. సరికదా గత ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పర్యాటక కేంద్రాలలో కనీసం నిర్వహణ నిధులు కూడా రాకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. అంతర్వేది నుంచి ద్రాక్షారామ వరకూ టూరిజం హబ్ చేస్తానన్న ఆయన హామీలు ఏడాది దాటినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.దిండిలో చురుగ్గా నిర్మిస్తున్న ప్రైవేటు టూరిజం భవనాలుప్రతిపాదనలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో పర్యాటకాభివృద్ధి, ఆధునిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు చేశాం. అఖండ గోదావరి ప్రాజెక్టులో రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లను అభివృద్ధికి ప్రతిపాదించాం. ఇందులో హేవలాక్ బ్రిడ్జి మాత్రమే ఉంది. మిగిలిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం. – పవన్, ఏపీ టూరిజం ఆర్డీ, రాజమహేంద్రవరం వసతుల కల్పనలో ఉదాసీనత పవన్ కల్యాణ్ హామీలు గాలికి.. టూరిజం హబ్కు చర్యలు శూన్యం అఖండ గోదావరి ప్రాజెక్టులోనూ నిధులు విదల్చని ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లోనూ భారీగా కోత దయనీయంగా దిండి పర్యాటకం రూ.కోట్లతో ప్రైవేటు ప్రాజెక్టులు -
గెయిల్ పైప్లైన్లపై నిరంతర పర్యవేక్షణ
జీఎం ముఖర్జీ మామిడికుదురు: గెయిల్ పైప్లైన్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎన్.ముఖర్జీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్రకుమార్ నేతృత్వంలో బృందం మంగళవారం నగరం గ్రామంలోని గెయిల్ టెర్మినల్ను సందర్శించింది. భద్రతా పరమైన చర్యలను టెర్మినల్ అధికారులు బృందానికి వివరించారు. ఏదైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో వాటిని ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. పైప్లైన్లను నిత్యం తనిఖీ చేసే వ్యవస్థ తమకు అందుబాటులో ఉందన్నారు. పైప్లైన్ల నాణ్యతను బట్టి ప్రతి 20 నుంచి 25 ఏళ్లకు ఒకసారి కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా లీకేజీలు, ప్రమాదాలు జరిగిన వెంటనే అది ఎక్కడ జరిగిందో క్షణాల్లో తమకు తెలిసేలా నగరం టెర్మినల్లోని అధునాతన వ్యవస్థ ద్వారా తమకు సమాచారం అందుతుందన్నారు. ఏదైనా ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు తమకు సమాచారం అందించేలా ఎక్కడికక్కడ 15101 టోల్ ఫ్రీ నంబర్లను ప్రదర్శించినట్టు తెలిపారు. ఏదైనా సంఘటనలు జరిగిన సందర్భంలో తమ నుంచి ఏవిధమైన సహకారం కావాలో చెప్పాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్రసింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పి.సునీల్కుమార్, గెయిల్ జీఎం పి.పోతయ్య, డీజీఎం బి.మహంతి, సీనియర్ మేనేజర్లు ఎస్.సుధీర్కుమార్, ఎస్.రామకృష్ణ, ఆర్ఐ ఇబ్రహీం, వీఆర్వోలు ఉన్నారు. -
ఏసీ బ్లాక్ నకిలీ మద్యం గుట్టు రట్టు
● కొమరిగిరిపట్నం అడ్డాగా దందా ● ఎనిమిది మందిని అరెస్టు చేసిన ఎకై ్సజ్ ఏసీ రేణుక బృందం ● హైదరాబాద్, పాలకొల్లుకు చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు ● 1065 నకిలీ మద్యం సీసాలు, ఇతర సామగ్రి స్వాధీనం అమలాపురం టౌన్: అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలోని ఓ ఇంటిలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టును ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక బృందం బహిర్గతం చేసింది. కొమరిగిరిపట్నం గ్రామ శివారు ఆకుల వారి వీధిలోని ఓ ఇంటిపై ఎకై ్సజ్ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి నకిలీ మద్యం బాటిలింగ్ మినీ యూనిట్ను, నిర్వాహకులను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో పట్టుబడ్డ నకిలీ మద్యం సీసాలు, ఇతర సామగ్రిని ఎకై ్సజ్ అసెస్టింట్ కమిషనర్ రేణుక, సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్, సీఐలు, ఎస్సైలు అమలాపురంలోని ఎకై ్సజ్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. తయారీ ఇలా ఈ నకిలీ మద్యం ముఠా హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతాల నుంచి కేరామిల్ లిక్విడ్, స్పిరిట్ను ముడి సరకుగా దిగుమతి చేసుకుంటోంది. మద్యం రంగు కోసం స్పిరిట్లో కేరామిల్ లిక్విడ్ కలుపుతారు. ఏపీ బేవరీస్ లిమిటెడ్ తయారీ చేసి సరఫరా చేసే డ్యూటీ పెయిడ్ మద్యంలానే నకిలీ మద్యం సీసా తయారు చేసి ఆకర్షణీయమైన లేబుల్తో రూపొందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఏసీ బ్లాక్ పేరుతో ఉన్న లేబుల్ బాటిల్పై అంటించి దానిలో వారు తయారు చేసిన మద్యాన్ని నింపుతున్నట్టు అధికారుల బృందం ప్రత్యక్షంగా గమనించింది. దాడి సమయంలో అక్కడి నుంచి మద్యం తయారీ మెషీన్, అప్పటికే తయారు చేసిన 1065 మద్యం సీసాలు, ఆరు వేల ఖాళీ సీసాలు, కేరామిల్ లిక్విడ్ డబ్బాలు, ఏసీ బ్లాక్ పేరుతో ఉన్న లేబుల్ బండిల్ తదితర సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిల్వ చేసిన గొడౌన్ను, మద్యం సరఫరాకు వినియోగించే ఆటోను వారు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో.. రామానుజ తేజ అనే ఓ ఎకై ్సజ్ అధికారి సేకరించిన సమాచారంతో ఈ దాడి చేశామన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, సీఐ వీరాబాబు తదితరులు కూడా ఈ ఆకస్మిక దాడిలో పాల్గొన్నారని తెలిపారు. పాలకొల్లులో కూడా అక్కడి ఎకై ్సజ్ అధికారుల బృందం దాడి చేసి 130 లీటర్ల స్పిరిట్ను పట్టుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యాన్ని ప్రభుత్వ ఎనాలిసిస్ ల్యాబ్కు పంపి పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ నకిలీ మద్యం రాకెట్లో మరికొందరు నిందితులు ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని రేణుక తెలిపారు. 8 మంది అరెస్టు ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వివరించారు. అమలాపురం మండలం పేరూరుకు చెందిన చింతపల్లి సోమశేఖర, చవ్వాకుల ప్రేమ్కుమార్, ఇదే మండలం చిందాడగరువు గ్రామానికి చెందిన నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లా శ్రీనివాస్, కాజులూరు మండలం దిద్దుకూరుకు చెందిన నురుకుర్తి శ్రీనివాసరావు, అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన బొర్రా సత్య అప్పారావు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన పితాని వెంకట దుర్గ సింహాద్రి, తిరుమనాధం దుర్గారావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. వీరికి హైదరాబాద్, పాలకొల్లు నుంచి స్పిరిట్, కేరామిల్ లిక్విడ్ సరఫరా చేస్తున్న ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఒరిజినల్ మద్యం బాటిల్ రూ.160 ఉంటే వీరు తయారు చేసే నకిలీ మద్యం బాటిల్ను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నట్టు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
డ్రైన్లో ఆవు మూగ వేదన
అతి కష్టంపై తీసిన అగ్నిమాపక సిబ్బంది అమలాపురం టౌన్: స్థానిక విత్తనాల వారి కాల్వ ప్రాంతంలో ఓ ఆవు రోడ్డు పక్క డ్రైన్లో ప్రమాద వశాత్తు పడిపోయి బయటకు వచ్చేందుకు నరక యాతన పడింది. డ్రైన్లో పడి ఇరుక్కుపోయిన ఆవు అవస్థ చూసిన స్థానికులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ కార్యకర్తలు స్పందించి అగ్ని మాపక దళానికి సమాచారం అందించారు. ఆ సిబ్బంది తాళ్లు, చెక్క బల్లలతో ఆవును తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మరో ప్రయత్నంగా డ్రైన్ను కొంచెం పగలగొట్టి ఆవును బయటకు తీశారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి కూడా అక్కడకు చేరుకుని ఆవును ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆవు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పోల్ పడితే పతకమే!
● పోల్వాల్ట్లో రాణిస్తున్న పిఠాపురం క్రీడాకారుడు రవి ● కొద్దిపాటి వసతులతోనే కఠోర శిక్షణ ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు పిఠాపురం: అతడు పోల్ పట్టాడంటే పతకం రావాల్సిందే. ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఉన్న కొద్దిపాటి వసతులతో దృఢ సంకల్పం, పట్టుదలతో శిక్షణ తీసుకుని తొలి ప్రయత్నాలలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలను కొల్లగొడుతున్నాడు. తక్కువ కాలంలో ఏకంగా 15 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలు సాధించిన ఘనత అతడి సొంతం. పిఠాపురం విద్యార్థి పోల్వాల్ట్లో ఉత్తమ క్రీడాకారుడిగా ప్రతిభ చూపుతున్నాడు. డిగ్రీ చదువు పూర్తిచేసి ఉన్నత విద్య కోసం సాగుతూనే పోల్వాల్ట్లో ప్రతిభ చూపుతున్నాడు సాలా రవి. పతకాల వేటలో పోటీలేదు.. తొమ్మిదో తరగతి నుంచి పోల్వాల్ట్లో పట్టు సాధించిన రవి జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున హైదరాబాద్, చైన్నె, కేరళ, కరీంనగర్, బెంగళూరు, పూణే, పంజాబ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్, గుంటూరు, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం పోల్వాల్ట్లో అంతర్జాతీయ పోటీల్లో గెలవాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా కోచ్ ఎలిపే సునీల్ దేశాయ్. తమలో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం వల్లే ఇన్ని పతకాలు సాధించాను. చిన్నప్పుడు తమ పాఠశాలలో సీనియర్లు పోల్వాల్ట్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. కోచ్ సునీల్ దేశాయ్కు ఆ క్రీడపై ఆసక్తిని వివరించాను. దీంతో ఆయన తనను ప్రోత్సహించి క్రీడలో మెళకువలు నేర్పించారు. సరైన సౌకర్యాలు లేకపోయినా మంచి ఫలితాలను సాధించేలా శిక్షణ ఇచ్చారు. – సాలా రవి, పోల్వాల్ట్ క్రీడాకారుడు, పిఠాపురం -
ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పతకాలు
ఆటలు నేర్పడం కాదు. ఏ ఆటలో ఎవరు నిష్ణాతులు కాగలరో గుర్తించి శిక్షణ ఇవ్వాలి. అంతే కాకుండా వారిని ప్రోత్సహించి విద్యార్థిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీస్తే జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడాసక్తిని వెలుగులోకి తేవడం ద్వారా వారిని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతైనా అవసరం. ప్రభుత్వం పోల్వాల్ట్ క్రీడకు మంచి ప్రాధాన్యం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది క్రీడాకారులు తయారై రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తారు. పోల్వాల్ట్లో రవి మంచి ప్రతిభ చూపుతున్నాడు. ప్రతి పోటీలోను తన సత్తా చాటుతూ పతకాలను సాధిస్తున్నాడు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా కృషి చేస్తున్నాడు. – ఎలిపే సునీల్ దేశాయ్, కోచ్, పిఠాపురం -
వచ్చే నెల 9న దేశవ్యాప్త సమ్మె
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు వచ్చేనెల 9న నిర్వహించనున్న ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ ఎల్ఐసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మోరంపూడిలోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఎల్ఐసీ క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగుల నిరసన ప్రదర్శన చేశారు. కోదండరామ్ మాట్లాడుతూ బీమా భారంగా మారిన తరుణంలో జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ బీమా, బ్యాంకులను కాపాడాలని కోరారు. కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లను రద్దు చేసి, ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్–3, 4 ఉద్యోగుల నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని కోదండరామ్ డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు మాఽథ్యూస్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు, సత్యదేవ, పిఎస్ఎన్ రాజు, ఈశ్వరరావు, పట్నాయక్, ఇమ్రాన్, శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్, ఎస్పీలకు ప్రపంచ బుక్ రికార్డు
ప్రపంచ రికార్డ్ అందుకున్న కలెక్టర్, ఎస్పీ అమలాపురం రూరల్: అంతర్వేది బీచ్లో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం, యోగాంధ్ర నిర్వహణలకు జిల్లా అధికారులు పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ను అందుకున్నారు. అంతర్వేది బీచ్లో నిర్వహించిన యోగాంధ్రలో భాగంగా వృక్షాసనం, భారీ మానవహారాలకు వారు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు. -
యోగాంధ్ర పేరిట అధికారుల కాలక్షేపం
● నెల రోజుల పాటు పనులకు దూరం ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం అమలాపురం టౌన్: యోగాంధ్ర పేరిట అధికారులు నెల రోజుల పాటు పనులు చేయకుండా కాలక్షేపం చేశారని, ఆహార భద్రతను గాలికి వదిలేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని హైస్కూల్ సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు లక్షలాది మంది గుండె జబ్బులు, లివర్, కిడ్నీ వంటి వ్యాధులకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. నేటి యువతలో అనేక మంది పాన్ పరాగ్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పంట కాల్వల్లోకి సెప్టీక్లీన్ వ్యర్థాలను గొట్టాల ద్వారా తరలిసూ కలుషితం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నా యోగాంధ్ర పేరుతో అధికారుల హడావుడి తప్ప వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎక్కడా తనిఖీలు లేవని ధ్వజమెత్తారు. యోగాంధ్ర పేరుతో ప్రచారం తప్ప ఎక్కడా కార్యాచరణ లేదని ఆరోపించారు. పాఠశాలల్లో పిల్లలకు వ్యాయామం తప్పనిసరి చేసి రోజూ ఓ గంట సేపు చేయించాలని. ఒక్క రోజు, లేదా కొన్ని రోజుల యోగా శిక్షణలతో ఆరోగ్య సమాజం సిద్ధించదని, అది నిరంతర ప్రక్రియ అని, శిక్షణ అయినప్పుడే దాని వల్ల ప్రయోజనాలు సార్థకం అవుతాయని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. -
గాడాలలో ఎద్దుల బలప్రదర్శన
కోరుకొండ: మండలంలోని గాడాలలో మంగళవారం ఎద్దుల బలప్రదర్శన పోటీ జరిగింది. పోటీల్లో రాజానగరం నియోజకవర్గంలోని 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి ఎద్దుల బండితో చేరుకున్న ఎద్దులకు బహుమతులు అందజేశారు. చక్రద్వారబంధానికి చెందిన శ్రీను ఎద్దులకు ప్రధమ బహుమతి రూ.10 వేలు, ట్రోఫీ, మురముండకు చెందిన సురేష్ గౌడ ఎద్దులకు రూ.8 వేలు, తోకలంక ఎద్దులకు రూ.7 వేలు, సీతానగరానికి చెందిన ఎద్దులకు రూ.6 వేలు, గాడాలకు చెందిన శ్రీను ఎద్దులకు రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. పాల్గొన్న ఎద్దుల యజమానులందరికీ రూ.వెయ్యి చొప్పున అందజేశారు. స్థానికనాయకులు, రైతులు పాల్గొన్నారు. -
48 గంటల్లోగా ధాన్యం సొమ్ము ఇవ్వాలి
సాక్షి, అమలాపురం/పిఠాపురం: ‘రైతులను పట్టించుకోండి. పండించిన పంటకు ఇవ్వాల్సిన సొమ్మును 48 గంటల్లో ఇవ్వడి. రైతు పరిస్థితి అస్సలు బాలేదు. పురుగుల మందు తాగి చావాల్సిన దుస్థితి వచ్చింది. మీరే మమల్ని చంపేస్తున్నారు’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన రైతు వర్రే నాగబాబు రెండు చేతులూ జోడిస్తూ వేడుకున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు వేలాదిగా ఉన్నారు. మే 9 నుంచి ధాన్యం బకాయిల చెల్లింపులు ఒకపైసా కూడా ఇవ్వలేదు. రబీ రైతులకు ఇంకా రూ.248.65కోట్ల వరకూ ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రబీ ధాన్యం అమ్మినా కూటమి ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ధాన్యం సొమ్ము వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము ఖరీఫ్ సాగు చేయలేమని, సాగు సమ్మె చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(పాడా) కార్యాలయం వద్ద కూడా ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు ధర్నా చేశారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిబ్బంది తీసుకోలేదు. సమస్యను వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు
సామర్లకోట: విశాఖపట్నానికి చెందిన దంపతులు సామర్లకోటలో పొగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు సోమవారం బాధితురాలికి అందజేశారు. కలిపిరెడ్డి నారాయణమ్మ, జగన్మోహన్రావు ఆదివారం విశాఖపట్నం నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక స్టేషన్ సెంటర్లో ఒక హోటల్లో అల్పాహారం చేశారు. అనంతరం ఆ దంపతులు రోడ్డుపై పర్సు జాడ విరుచుకున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లిన తరువాత చూసుకొంటే పర్సు కనిపించక పోవడంతో స్థానిక అవుట్ పోస్టులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడు తూలాల బరువైన రూ. మూడు లక్షల విలువ కలిగిన బంగారు గొలుసు పోవడంతో ఎస్సీ ఈ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు అవుట్ పోస్టు పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఒక బిచ్చగాడు రోడ్డుపై పడిపోయిన పర్సు తీసుకొని జేబులో పెట్టుకోవడాన్ని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు బిచ్చగాని కోసం గాలింపు చేసి గుర్తించి అతని వద్ద నుంచి పర్సును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పర్సులో బంగారు గొలుసు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బంగారు గొలుసు అందజేశారు. -
సుదర్శన హోమానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
● పురుషులు పంచె, కండువా.. ● మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్ చున్నీతో.. సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులను తప్పనిసరిగా ధరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీతో పాల్గొనాలన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం దైవ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం గురించి ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు వివరించారు. దేవాలయానికి వెళ్లిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకూ మన దృష్టి దేవుని మీదనే ఉండాలి. అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే ఆచారాన్ని పెట్టారని వివరించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
కాకినాడ సిటీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృది పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డిపీఆర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ కాకినాడలో ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ లింగ సమానత్వమే లక్ష్యంగా అనేక విధానాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలు రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నిధులు, విధులు, భావ వ్యక్తీకీకరణ నైపుణ్యం, ప్రజాస్వామ్య విధుల సులభతరం వంటి అంశాలపై ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి రావులపాలెం: రాష్ట్రంలో రైతులకు 48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బు వారి ఖాతాల్లో వేస్తామని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం 48 రోజులు గడిచినా చెల్లించకుండా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. జిల్లాలో తాము చేసిన నిరసన కార్యక్రమం ఫలితంగా ప్రభుత్వం జిల్లాలో రెండు లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. దానికి గాను రూ.613 కోట్లు ఖర్చు అయిందన్నారు. దీనిలో ఇంకా రూ.248 కోట్లు రైతులకు బాకీ తీర్చాల్సి ఉందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తొలుత రెంటపాళ్ల జగన్ టూర్లో మృతిచెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్య మృతికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జగన్పై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఏ–1గా, హోం మంత్రిపై ఏ–2గాను, డీజీపీ పై ఏ–3 గా కేసులు పెట్టాలన్నారు. జగన్మోహన్రెడ్డికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం కోసం ఆయనకు ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదన్నారు. పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుపై ఎటువంటి కేసులు పెట్టాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా సాయగా రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి ఇచ్చామన్నారు. రైతుకు పెట్టుబడి సొమ్ము వెంటనే అందేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగా దినోత్సవానికి రూ.300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. గతంలో విజయవాడలో వరదలు వస్తే రూ.23 కోట్లు అగ్గిపెట్టెలకు ఖర్చు చేశారని, విపత్తును కూడా ప్రచారానికి, ఆదాయానికి అనుకూలంగా మార్చుకునే చంద్రబాబు లాంటి సీఎం రాష్ట్రానికి ఉండటం దురదృష్టం అన్నారు. లోకేష్ను జాకీతో లేపి రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందన్నారు. మంత్రి పదవి ఇస్తారని జగన్పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పక్కన పెట్టిన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, దేవరపల్లి సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకుడు కప్పల శ్రీధర్, వార్డు సభ్యుడు సఖినేటి వాకుల్ రాజు పాల్గొన్నారు. -
హోరెత్తిన పోరు
యువతను పాతాళంలోకి తొక్కేస్తున్నారు చంద్రబాబు యువతను, విద్యార్థులను పాతాళంలోకి తొక్కేస్తున్నారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తొలి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేసినట్టుగా యువతను, విద్యార్థులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, కోఆర్డినేటర్ రాజోలు నియోజకవర్గం యువగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ఏమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగభృతి అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానం ఏమైంది. – పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ యువతే దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక యువత స్వయంకృషితో చదువుకుని ముందుకు వెళ్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకగా నిలుస్తుంది. 2004 తరువాత దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతీ విద్యార్ధి చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంటును తీసుకొచ్చి విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఆ పథకాలను రెట్టింపు చేసి విద్యార్థులను అన్ని విధాలా ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యస్థను నిర్వీర్యం చేస్తోంది. – మిండగుదిటి శిరీష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ● కదం తొక్కిన విద్యార్థులు, యువత ● అమలాపురం నల్లవంతెన నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ● జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ క్యాడర్ ● మద్దతు తెలిపిన విద్యార్థి, యువజన సంఘాలు ● ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన కలెక్టరేట్ ● మూడుచోట్ల అడ్డుకున్న పోలీసులు ● వారిని నెట్టుకుని మరీ ముందుకు.. ● ప్రభుత్వ మోసంపై ధ్వజమెత్తిన నేతలుసాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్/ ఉప్పలగుప్తం: టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి... ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారా సభల్లో ఊదరగొట్టిన ఉద్యోగల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కదం తొక్కింది. ఏడాది కాలంగా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా వైఎస్సార్ సీపీ సోమవారం నిర్వహించిన యువత పోరుతో జిల్లా కేంద్రం అమలాపురం హోరెత్తింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురం నల్ల వంతెన వద్ద ఉన్న వంటెద్దు వెంకన్నాయుడు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో మోసాలను ఎండగట్టారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల కల్పన ఎప్పుడని నిలదీశారు. ఉన్న ఉద్యోగాలను తొలగించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి అందించాలని నినదించారు. అనంతరం ఈ మేరకు డీఆర్వో ఎస్.రాజకుమారికి పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ నారాయణల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. శాసనమండలి సభ్యుడు బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే పాములు రాజేశ్వరిదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ, విద్యార్థి విభాగం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ జిల్లెల్ల రమేష్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి నేతల నాని, ఆయా విభాగాల జిల్లా అధ్యక్షులు మిండగుదుటి శిరీష్, షేక్ అబ్దుల్ ఖాదర్, దొమ్మేటి సత్యమోహన్, జిన్నూరు వెంకటేశ్వరరావు, జాన గణేష్, తోరం గౌతమ్ రాజా, వంగా గిరిజాకుమారి, చీకట్ల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధులు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, సుధా గణపతి, కుడిపూడి భరత భూషణ్, కాశి బాలముని కుమారి, మందపాటి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పోలీసుల అవాంతరాలు అమలాపురంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన విద్యార్థి.. యువత పోరుకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని నిరసనను భగ్నం చేయాలని చూసింది. కలెక్టరేట్కు శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని రోప్ వేలు, బారికేడ్లు పెట్టి నిలిపివేయాలని చూసింది. మూడుచోట్ల పోలీసు జులుం ప్రదర్శించారు. తొలుత ర్యాలీ ప్రారంభమైన చోట, మరోసారి కలెక్టరేట్కు సమీపంలోను, మూడవసారి కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కార్యకర్తలకు అడ్డంకులు సృష్టించారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలో బారికేడ్లు, రోప్ పార్టీలతో కార్యకర్తలను, నాయకులను నిలువరించారు. ముందుకు వస్తున్న వారిని పోలీసులు వెనక్కు నెట్టివేశారు. ఈ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళలను సైతం పోలీసులు వెనక్కు నెట్టివేశారు. దీనిపై ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను నెట్టుకుని కార్యకర్తలు ముందుకు వచ్చారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేసిన పోలీసులు వాటి ముందు బారికేడ్లు పెట్టి మరోసారి రోప్ పార్టీతో అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నా ఎందుకు ఇంతమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీనితో అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ కొంతమందికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి వారిని కలెక్టరేట్లోకి పంపించారు. యువతను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను, విద్యార్థులను రోడ్డుపై పడేశారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించక రాష్ట్రంలో ఉన్న వేల మంది విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఒత్తిళ్లకు ఫీజులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ మోసపూరిత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.60లక్షల మంది వలంటీర్లు, 18వేల మంది ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను కలిపి 4 లక్షల ఉద్యోగాలను తొలగించి యువతకు తీవ్రమైన అన్యాయం చేసింది. సంవత్సర కాలంలో బకాయిల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును ప్రభుత్వం తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి. – పిల్లి సూర్యప్రకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువత, విద్యార్థులను మోసం చేసింది. విద్యార్థులకు చెల్లించవలసి ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు బారిన పడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్లు అధికారంతో వచ్చిన వెంటనే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ తల్లికి వందనం పథకం కోత పెట్టారు ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో అందరికీ ఇవ్వకుండా కోత పెట్టారు. పేద వర్గాలతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు నిలిపివేసి అన్యాయం చేశారు. – గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ -
కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు
అమలాపురం రూరల్: వేతనాలు పెంచాలని కోరుతూ కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లాడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ వద్ద అందోళన చేశారు. సూమారు గంటపాటు అందోళన చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణవేణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశించారని కానీ వేతనాలు పెంచకపోగా పని భారాన్ని తీవ్రంగా పెంచి రకరకాల యాప్ల పేరుతో ప్రీస్కూల్ని అటకెక్కించారని అన్నారు. పదివేల రూపాయలు వేతనం దాటింది అనే పేరుతో మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు నిలుపుదల చేశారని ప్రభుత్వ ఉద్యోగం అని ఆన్లైన్లో చూపిస్తోందని, సంక్షేమ పథకాలు రావని సచివాలయాల దగ్గర చెప్తున్నారని అన్నారు. అంగన్వాడీ హెల్పర్లు, మినీ వర్కర్లు ఏం పాపం చేశారని సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని అన్నారు. రూ.11,500తో ఎట్లా బతకాలని, ఎంతోమంది ఒంటరి మహిళలు ఈ జీతం మీదే ఆధారపడి బతుకుతుంటే వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి మాట్లాడుతూ రెండు నెలలుగా అంగన్వీడీలకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు 20వ తేదీలోపు బిల్లు పెట్టకపోవడం దారుణమని అన్నారు. సీఐటీయూ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఎన్ బలరాం, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు పి.అమూల్యకే, పి రత్నకుమారి, మహేశ్వరి, సుజాత పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: స్పోర్ట్స్ ఫర్ యూనిటీ నినాదంతో జిల్లాలో ఒలింపిక్ డే ఉత్సవాలతోపాటు రన్లు కూడా సోమవారం ఉదయం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లు ఏకకాలంలో సాగాయి. అమలాపురం పట్టణంలో జరిగిన ఒలింపిక్ డే వేడుకలు ఉత్సవంగా స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జరిగాయి. ఈ క్లబ్ భవనం నుంచే ఒలింపిక్ రన్ మొదలైంది. ఈ వేడుకల్లో అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ శరత్బాబు, పప్పుల శ్రీరామచంద్రమూర్తి పర్యవేక్షణలో రన్ సాగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ ఒలింపిక్స్ గేమ్స్ అంటే ఐక్యతకు చిహ్నమని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా అమలాపురంలో ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తున్న జిల్లా అసోసియేషన్ను అభినందించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ స్ఫూర్తితో జిల్లాకు చెందిన క్రీడాకారులు అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సాత్విక్ సాయిరాజ్ను ఆదర్శంగా తీసుకుని సత్తా చాటాలని ఆకాంక్షించారు. నాలుగు కిలోమీటర్లు సాగిన ఒలింపిక్ రన్ స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ వద్ద ఒలింపిక్ డే ఉత్సవాలు జరిగిన తర్వాత రన్ను అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, డీఎస్పీ ప్రసాద్లు ఒలింపిక్ టార్చ్ పట్టుకుని ప్రారంభించారు. రన్ ముమ్మిడివరం గేటు సెంటర్ మీదుగా గడియారం స్తంభం సెంటరు, ముస్లిం వీధి, గాంధీబజార్, రవణం వీధి, గారపాటి వీధి, గండువీధి మీదుగా తిరిగి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సాగి ఆఫీసర్స్ క్లబ్కు చేరుకుంది. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, వాకర్స్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మునగాల మన్యం రన్లో పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర సాగిన పరుగు ప్రారంభించిన అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, డీఎస్పీ ప్రసాద్ జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో నిర్వహణ -
భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రిపుల్ ఐటీకి జిల్లా నుంచి 130 మంది విద్యార్థుల ఎంపిక రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీకి మొదటి దశలో 130 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 32, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 19, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 28, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి 3.22 శాతం మంది విద్యార్థులు నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారికి ఈ నెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు ఎంపిక చేసిన క్యాంపస్ల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నూజివీడు క్యాంపస్కు ఎంపికై న వారికి ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో ఏలూరు జిల్లాలోని నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీకి ఎంపికై న వారికి ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 2, 3 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో, జూలై 4, 5 తేదీల్లో ఒంగోలు క్యాంపస్కు ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసనాలకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగంఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవ హారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్డీసీ పి కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డీ. శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. అర్జీదారుల సమస్యలకు పరిష్కారాలు అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లోనిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్య క్రమంలో 242 అర్జీలను డీఆర్ఓ రాజకుమారి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సర్వే ఏడీ కె. ప్రభాకర్ డీఎండీఓ రాజేశ్వరరావు స్వీకరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 21 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్ కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వ చ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీచిప్స్ టు సిస్టమ్స్శ్రీ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరయ్యాయి. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
అమ్మ ఓడి..పోయింది
● కన్న కొడుకును చూసి కన్నుమూయాలని చివరి క్షణం వరకు తల్లి ఆవేదన ● 20 ఏళ్ల క్రితం విడిచిపోయిన కొడుకు ● తల్లి చావుబతుకుల్లో ఉందంటే చూసేందుకై నా రాని కాఠిన్యం ● అధికారుల వార్నింగ్తో అంతిమ సంస్కారాలకు హాజరు కాకినాడ క్రైం: చివరి రోజుల్లో.. చిట్టచివరి క్షణాల్లో.. కొడుకు కంటి చూపు, స్పర్శ కోసం పరితపించిన ఓ తల్లి వ్యథ ఇది. కాటికేగే వేళ కన్నబిడ్డను కళ్లారా చూసుకుంటే చాలనుకున్న ఓ వ్యథార్థ మాతృమూర్తి యథార్థ గాథ ఇది. అంతిమ ఘడియల్లో అన్నీ తెలిసి కొడుకు కావాలనే రాలేదన్న గుండె పగిలే చేదు నిజాన్ని తాళలేక ఆ కన్నీటి వ్యథతోనే కన్ను మూసిన ఓ అమ్మ కథ ఇది. అనగనగా ఓ తల్లి... బొమ్మని చేసి, ప్రాణం పోసింది. తన రక్త మాంఽసాలను పంచి ఇచ్చి, ప్రసవ వేళ ప్రాణాన్నే పణంగా పెట్టి ఓ కొడుకుని కన్నది. ఊపిరంతా ఉయ్యాల చేసి లాలపాడింది, జోలపుచ్చింది. మాతృత్వపు మాధుర్యంతో తనివి తీరా తరించిపోయింది. కొడుకుని పెంచి పోషించి ప్రయోజకుడ్ని చేసింది. అమ్మ త్యాగంతో కొడుకు పెద్దోడయ్యాడు. ఎంత పెద్దోడంటే చనిపోతున్నాను చూసెళ్లమంటే తనకు తీరికి లేదనేంత... అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం వదిలిపోయావనీ, నాటి నుంచి కంటికి కానరాలేదనీ, చిట్టచివరిగా ఒక్కసారి కనిపించి వెళ్లపో నాయనా అంటూ తల్లి అచేతన స్థితిలో వీడియో పంపి మరీ వేడుకున్నా ఆ కొడుకు మనసు కరగలేదు. చివరికి అమ్మ ఆక్రందనే ఓడిపోయింది. పుత్రరత్నం తాను ఉన్న హైదరాబాద్ నుంచి తల్లి ఉన్న కాకినాడకి తీరిక చూసుకొని చేరేసరికి ఆయువు పోసిన అమ్మ ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. తుది మలుపులో కొడుకుని కళ్లారా చూసుకోలేకపోయిన ఆ అమాయకపు తల్లి రాజేశ్వరి అయితే, కాఠిన్యం నిండిన ఆ కొడుకు పేరు జోష్యబట్ల రాజశేఖర్. తనువు చాలించే వేళ బిడ్డను చూస్తే చాలనుకుంది. పున్నామ నరకం నుంచి తప్పించడమే ఎక్కువనుకొని చిట్ట చివరి వేళ కట్టె గుట్టకి నిప్పంటించి నిష్క్రమించాడా కొడుకు. బిడ్డ కోసం పరితపించి ప్రాణం విడిచిన ఆ మాతృమూర్తి దీనావస్థ మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిపోయింది. కన్నపేగు మమకారాన్ని చిదిమేసిన ఈ హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు కోసమే యావత్ జీవితం కాకినాడ దేవాలయం వీధి వినుకొండ వారి వీధికి చెందిన జోష్యబట్ల రాజేశ్వరి(70) తన ఒక్కగానొక్క కుమారుడి కోసం తన యావత్ జీవితాన్ని అర్పించింది. ఈమెకి 45 ఏళ్ల కుమారుడు రాజశేఖర్ ఉన్నాడు. బిడ్డను కని భర్త వదిలి పోయినా టైలరింగ్ చేస్తూ కుమారుడిని చదివించింది. పదవ తరగతి అనంతరం విడిచిపోయిన తండ్రి పిలుపుతో రాజశేఖర్ కేరళ వెళ్లాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి వద్దకు వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లి.. కొడుకు బాధను అర్థం చేసుకొని తెలిసిన వారి సాయంతో కాకినాడలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం వేయించింది. అదే సమయంలో, అంటే సుమారు 20 ఏళ్ల క్రితం తల్లిని పిలవకుండానే స్థానిక కల్యాణ మండపంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి తన భార్యను చూపించి, నాటి నుంచి తల్లిని వదిలిపోయాడు. కార్పొరేటర్ చొరవతో.. అనాథాశ్రమంలో రాజేశ్వరి పరిస్థితి దయనీయంగా మారింది. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్వయంగా తమ సేవలు తాము చేసుకునేవారికే అక్కడ స్థానం ఉంటుంది. నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితితో రాజేశ్వరి మంచానికి పరిమితం అయింది. ఆశ్రమ యాజమాన్యం రాజేశ్వరిని చేర్చిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు విషయం చెప్పడంతో ఆమె రాజేశ్వరిని కాకినాడ జీజీహెచ్లో చేర్చి సేవలు చేశారు. నివాసాన్ని కోరుతూ కలెక్టర్ షణ్మోహన్కు లక్ష్మీప్రసన్న ఈ ఏడాది మే 12వ తేదీన లేఖ రాశారు. తక్షణమే స్పందించిన ఆయన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, రాజేశ్వరి బాగోగులు పరిశీలించి తగిన నివాస సదుపాయం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రంగనాథం శైలజ రాజేశ్వరి బాగోగుల బాధ్యతలు చూసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, పెద్దాపురంలో బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమన ఇల్లుశ్రీ వసతి గృహానికి రాజేశ్వరిని తరలించారు. కొడుకా అని కలవరిస్తూ... నాటి నుంచి రాజేశ్వరి తన కుమారుడి పేరును కలవరిస్తూనే ఉంది. వసతి గృహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, బృందం ఆమెకి సపర్యలు చేసేది. రాజేశ్వరి చివరి కోరికను తెలుసుకున్న సత్యనారాయణ విషయాన్ని శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రాజేశ్వరి కుమారుడు రాజశేఖర్ను సంప్రదించి తల్లి దీనావస్థను వివరిస్తే రావడానికి తనకు తీరిక లేదని ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సత్యనారాయణ, ఆయన బృందం రాజశేఖర్తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తాను సంగీత దర్శకత్వం చేస్తుంటానని, చాలా బిజీగా ఉంటానని తనకు మాటి మాటికీ ఫోన్లు చేయవద్దని విసుక్కున్నాడు. అప్పటికే రాజేశ్వరి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తిండి మానేసింది, మందులు తీసుకోవడానికి శరీరం కూడా సహకరించడం లేదు. అటువంటి నిస్సత్తువలో కూడా కొడుకు కోసమే పరితపించేది. కొడుకా కొడుకా అంటూ కలవరించేది. పోలీసుల వార్నింగ్ రాజశేఖర్ తన తల్లి స్థితిని కళ్లకు కట్టేలా వీడియోలు పంపి వివరించినా ఏ మాత్రం చలించలేదు. పైగా చెబుతున్న వారందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు సూచనలతో పోలీసులు రాజశేఖర్కి కాల్స్ చేశారు. వచ్చి తల్లికి కనిపించి వెళ్లకపోతే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్–2019 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మరో మార్గం లేక రాజశేఖర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఈ నెల 10వ తేదీన ఉదయం వచ్చాడు. అయితే కొడుకు రాకకోసం పరితపించి అతడు రావడానికి కొద్ది గంటల ముందే ప్రాణాలు విడిచింది. అత్యంత దయనీయం రాజేశ్వరి పరిస్థితి అత్యంత దయనీయం. కుమారుడు రాజశేఖర్ వ్యవహరించిన విధానం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. టూ టౌన్ పోలీసులు, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న చొరవ, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో చివరి రోజుల్లో కనీసం కూడు, గూడు అందాయి. పీడీ విజయకుమారి ఆధ్వర్యంలో వన్ స్టాప్ బృందం, బాధ్యత ఫౌండేషన్ సత్యనారాయణ బృందం రాజేశ్వరి చివరి క్షణాల వరకు కంటికి రెప్పలా కాచుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ కుమారుడు రాలేదు. – రంగనాథం శైలజ, అడ్మినిస్ట్రేటర్, వన్ స్టాప్ సెంటర్ తల్లి తనకేం ఇవ్వలేకపోయిందనే... తన తల్లి మెషీన్ కుడుతూ సంపాదించినది బంధువులకి పెట్టేస్తుందన్న భ్రమలో రాజశేఖర్ ఉండేవాడని నేను కార్పొరేటర్గా ఉన్న 36వ వార్డుకు చెందిన ప్రజల ద్వారా తెలిసింది. అంత డబ్బే ఆమె సంపాదిస్తే, అనాథలా కన్నుమూసేది కాదన్నది స్థానికుల అభిప్రాయం. కుమారుడిని చూడాలన్న ఆమె ఆఖరి కోరిక తీర్చేందుకు ఎంతో శ్రమించాం. ఎన్నోసార్లు కాల్ చేసి ఒక్కసారి వచ్చిపొమ్మని బతిమాలాం. ఆమె మరణించినా తర్వాత కార్యక్రమాలన్నీ మేమే చూసుకుంటామని చెప్పాం అయినా వినలేదు. – సాలగ్రామ లక్ష్మీప్రసన్న, మాజీ కార్పొరేటర్, 36వ వార్డు, కాకినాడ అంతిమ సంస్కారాలు మీరే చెయ్యండి రాజశేఖర్ వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి మండిపడ్డాడు. ఇంత మాత్రానికే తనను ఎందుకు ఇబ్బంది పెట్టారని విసుక్కున్నాడు. అంతిమ సంస్కారాలు కూడా మీరే చేసేయండని ఎంత కావాలన్నా ఇచ్చేస్తానని బేరాలాడాడు. శైలజ ఆమె బృందం చొరవ తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె చూడాలన్న ఆఖరి కోరిక ఎలాగో తీర్చలేదు, కనీసం తలకొరివి అయినా పెట్టమని అడిగారు. సఖి వన్స్టాప్ సెంటర్, బాధ్యత ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు రాజశేఖర్ మాతృమూర్తి మృతదేహానికి తలకొరివి పెట్టాడు. అంతిమ సంస్కారాలు బలవంతంగా చేయించిన అధికారులు, ఫౌండేషన్ సభ్యులపై విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వదిలిపోయి 20 ఏళ్లు 20 ఏళ్ల క్రితం తల్లిని వదిలిపోయిన రాజశేఖర్ మళ్లీ తల్లిని ఒక్క రోజైనా చూడలేదు. రాజేశ్వరి కొడుకు వస్తాడని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో టైలరింగ్ చేసుకుంటూ తనని తాను పోషించుకునేది. వచ్చిన ఆ కొద్దిపాటి సంపాదన మందుల కోసం వెచ్చించేది. ఐదేళ్ల క్రితం అంటే ఆమె వయసు 65కి చేరాక అనారోగ్యానికి వయోభారం తోడవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరి రోజుల కొద్ది ఆహారం, ఔషధాలు లేక శుష్కించిపోయింది. ఆమె దయనీయ స్థితిని చూసి పొరుగు వారు చలించిపోయారు. వారంతా విషయాన్ని అప్పటి కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ చొరవ తీసుకొని వలసపాకలలో ఉన్న రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో రాజేశ్వరిని చేర్చారు. అక్కడికి వెళ్లాక కూడు,గూడులోటు లేకున్నా కొడుకు కోసం పరితపిస్తున్న మనోవేదన మాత్రం ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. తోటి వృద్ధులతో కొడుకు ఉండీ ఇలా అనాథలా బతుకుతున్నానని చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యేది. అలా అని ఎవరినీ తన కొడుకుని ఒక్క మాట కూడా అననిచ్చేది కాదు. 20 ఏళ్లుగా వదిలేశాడంటే వాడి పరిస్థితి పాపం ఎలా ఉందో అంటూ కొడుకు ఎన్నో కష్టాల్లో ఉన్నాడనే భ్రమలో ఆ మాతృమూర్తి బతుకీడ్చేది. -
రత్నగిరి జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2500 వ్రతాల నిర్వహణ ● ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేలాదిగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం కేటాయించవలసి వచ్చింది. స్వామివారి దర్శనానంతరం అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. వ్రతమండపాలు, ఆలయప్రాకారం మధ్యాహ్నం వరకు భక్తుల తో నిండిపోయాయి. స్వామివారిని 50 వేల మంది దర్శించగా, 2,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదా యం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తు లు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు ఆలయంలో ఉల్లాసంగా గడిపారు. ఘనంగా సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రాకారసేవ ప్రారంభించి రథసేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సూర్యనమస్కారాలు నిర్వహించారు. -
ఏడాదిలో యువెత
ఫ కూటమి ప్రభుత్వంలో నిండా మోసం ఫ విద్యార్థులకు అందని రీయింబర్స్మెంట్ ఫ నిరుద్యోగికి ఉపాధి లేదు.. భృతి అందదు ఫ నేడు వైఎస్సార్ సీపీ విద్యార్థి.. యువత పోరు ఫ అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా సాక్షి, అమలాపురం: చంద్రబాబు అంటే అంతే. నమ్మిన వారిని నిలువునా ముంచేస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే హామీలను మరిచిపోతారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కూడా అంతే.. చేసేది మూరెడు.. ప్రచారం బారెడు అన్నట్టు సాగిపోతోంది. ఏడాదిగా ఇటు విద్యార్థులు, అటు నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఇచ్చిన శ్రీతల్లికి వందనంశ్రీలో అర్హులకు కోత పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెన ఊసేలేదు. పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఇక నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగ, ఉపాధి కల్పించలేదు. పరిశ్రమల ఏర్పాటు.. కార్పొరేషన్ రుణాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ యువతను ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. ఏడాది పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసగించడంతో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం పూరించింది. సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద విద్యార్థి.. యువత పోరుకు సిద్ధమైంది. ఎక్కడి పనులు అక్కడే.. ఫ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి పూర్తి కావాల్సిన మనబడి మన భవిష్యత్తు రెండో దశ పనులు అక్కడివి అక్కడే అన్నట్లు ఉన్నాయి. మనబడి మన భవిష్యత్తు రెండో దశలో పాఠశాలల్లో నిరంతరం నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి సరఫరా, ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్, భవనాల మరమ్మతులు, గ్రీన్చాక్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశ పనుల్లో భాగంగా 772 పాఠశాలలను రూ.257 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలా చోట్ల సిమెంట్, ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయి. ఫ తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది లబ్ధిదారులకు భారీగా కోత పెట్టింది. జిల్లాలో 2.40 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, 1,70869 మందికి మాత్రమే తల్లికి వందనం పడింది. ఇంకా 63,191 మందికి సొమ్ము పడాలి. పలు నిబంధనల పేరుతో ఈ పథకాన్ని దూరం చేసింది. ఫ జిల్లాలో నాడు – నేడు రెండో దశలో 761 పాఠశాలలను అభివృద్ధి చేయాలి. ఇందుకు రూ.249 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, రూ.86 కోట్లు రివాల్వింగ్ ఫండ్, రూ.61 కోట్లు సీపీఎం (సెంట్రల్లీ ప్రొక్యూర్డ్ మెటీరియల్)కు మంజూరయ్యాయి. మొత్తం రూ.147 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రివాల్వింగ్ ఫండ్, సీపీఎం రూపేణా రూ.102 కోట్లు విడుదల కావాలి. 267 అదనపు తరగతి గదులకు 223 పనులు వివిధ దశల్లో ఉండగా, 25 ఏసీఆర్లు ప్రారంభించ లేదు. 19 ఏసీఆర్లు పూర్తయ్యాయి. అధిక సంఖ్యలో పాఠశాలలకు సిమెంట్ రావాల్సి ఉంది. ఫ పాఠశాలల్లో కొత్తగా 546 టాయిలెట్స్ నిర్మిస్తుండగా 278 వివిధ దశల్లో ఉన్నాయి. 267 చోట్ల పూర్తయ్యాయి. అలాగే 403 కిచెన్ షెడ్లు మంజూరు కాగా, 235 వివిధ దశల్లో ఉండగా, 167 పూర్తయ్యాయి. మేజర్, మైనర్ మరమ్మతులకు 1,012 పనులు మంజూరు కాగా 576 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 548 పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు మంజూరు చేయగా, 162 పాఠశాలల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఫ గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన కింద 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్)గా మార్చి 2024–25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. అలాగే వసతి దీవెన పథకం పేరును మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఎంటీఎఫ్)గా మార్చి రూ.1.39 కోట్లు మంజూరు చేశారు. తరువాత నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీనిపై ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఉన్న ఉద్యోగాలే పీకేశారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. రీయింబర్స్మెంట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా అందించలేదు. యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఈ ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలు పీకేశారు. వీటిపై నిరసన తెలిపేందుకు సోమవారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థి, యువత పోరు నిర్వహిస్తున్నాం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేస్తున్న ఈ ఆందోళనలో విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలి. –పిల్లి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు 22ఎఎంపీ05: అప్పులు చేసి ఫీజులు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన సొమ్ము సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పులు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి 2004కు ముందు చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టు వసతి, విద్యా దీవెన క్రమం తప్పకుండా అందించాలి. –మిండగుదిటి శిరీష్ నారాయణస్వామి, వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అన్నింటా దగా.. ఫ నిరుద్యోగ భృతిని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే అప్పట్లో ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ సూపర్ సిక్స్ పథకంలో దీనిని మళ్లీ ఓ హామీగా చేర్చింది. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం రెండోసారి మోసం చేసింది. జిల్లాలో సుమారు 20 వేల మంది నిరుద్యోగ యువత ఉంటోందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదిలో రూ.36 వేలు వేయాల్సి ఉంది. మొత్తం మీద ఏడాదిలో సుమారు రూ.72 కోట్లకు ఎగనామం పెట్టింది. ఫ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసివేసి పలువురిని నిరుద్యోగులుగా మార్చింది. వలంటీర్ వ్యవస్థను మొత్తం ఎత్తేసింది. జిల్లాలో పట్టణ, గ్రామ స్థాయిలో సుమారు 9,900 మందిని తొలగించింది. ఇంటింటా రేషన్ అందించే ఎండీయూ వ్యవస్థను నిలిపివేసింది. జిల్లాలో 370 వాహనాలు నిలిపివేయడంతో 740 మంది ఉపాధికి గండి కొట్టింది. ఫ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తొలి సంతకాల్లో ఒకటి మెగా డీఎస్పీ. తొలి సంతకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టింది. పరీక్షలైతే జరిగాయి. వెంటనే కొలువులు ఇస్తారనే నమ్మకం అభ్యర్థులకు కలగడం లేదు. ఫ జిల్లాలో ఎస్సీ, బీసీ, కాపు, ఇతర సామాజిక వర్గాలకు అడిగిన వారికి అడిగిన అన్ని రుణాలిస్తామన్నారు. దీని ద్వారా లబ్ధి పొందేది ఎక్కువగా యువతే. కూటమి నేతల మాటలు నమ్మి, స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి అన్ని కార్పొరేషన్ల నుంచి 120 యూనిట్లు కేటాయించారు. వీటి కోసం 1,500 నుంచి 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. -
ఉపాధ్యాయుల సర్దుపాట్లు
ఖాళీలను పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇలా.. అడ్డతీగల మండలంలో 19, అయినవిల్లి 10, అల్లవరం 19, అమలాపురం 1, అంబాజీపేట 6, అనపర్తి 1, ఆత్రేయపురం 11, బిక్కవోలు 4, చింతూరు 36, దేవీపట్నం 11, గండేపల్లి 24, గంగవరం 7, గొల్లప్రోలు 1, ఐ.పోలవరం 48, జగ్గంపేట 47, కె.గంగవరం 21, కాజులూరు 7, కపిలేశ్వరపురం 20, కాట్రేనికోన 101, కిర్లంపూడి 38, కొత్తపేట 28, కూనవరం 36, మలికిపురం 8, మామిడికుదురు 10, మండపేట 3, మారేడుమిల్లి 17, ముమ్మిడివరం 23, నెల్లిపాక 52, పి.గన్నవరం 38, పెద్దాపురం 1, ప్రత్తిపాడు 46, రాజవొమ్మంగి 5, రంపచోడవరం 22, రంగంపేట 22, రావులపాలెం 10, రాజోలు 1, రౌతులపూడి 9, సఖినేటిపల్లి 10, శంఖవరం 21, సీతానగరం 6, తాళ్లరేవు 4, తొండంగి 18, ఉప్పలగుప్తం 34, వీఆర్ పురం 42, వై.రామవరం 16, ఏలేశ్వరం మండలంలో 16 ఖాళీలు ఉన్నాయి. ఫ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా ఫ దూర ప్రాంతాలకు వెళ్లేది లేదని నిరసన రాయవరం: ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల (ఎంటీఎస్)తో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం కాకినాడలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించింది. అయితే తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 410 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ 199 మంది, 1998 డీఎస్సీ బ్యాచ్ 211 మంది ఉన్నారు. వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అక్కడ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లోనే ఖాళీలు ఏర్పడాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలకు దూరంగా 100 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని వారు వ్యతిరేకిస్తున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 70 శాతం మంది ఉపాధ్యాయులు రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వారి డిమాండ్లు ఇవీ.. కేవలం రూ.32 వేలతో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేయాలి. ప్రతి మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలి. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాసాలకు 200 కి.మీ దూరంలో ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఏ, డీఏ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు క్రియేట్ చేసి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాఠశాలల్లో వేకెన్సీలను కూడా చూపించాలి. 15 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. గతంలో విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నియర్ బై రెసిడెన్స్ అవకాశం కల్పించాలి. ● ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి జరగాల్సి ఉండగా, వీరి ఆందోళన, చర్చల నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు మొదలైంది. ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. -
అయినవిల్లి... భక్తులతో శోభిల్లి
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో శోభిల్లింది. తొలుత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 43 మంది, లక్ష్మీగణపతి హోమంలో 32 జంటలు, పంచామృతాభిషేకాల్లో ముగ్గురు జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఎనిమిది మందికి తులాభారం, ముగ్గురికి అన్నప్రాసన జరిగాయి. 33 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,51,790 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకటదుర్గ భవాని తెలిపారు. -
భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
అమలాపురం రూరల్: స్కూల్ పిల్లలతో ప్రయాణించే ఆటోలు కచ్చితంగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆటోల్లో స్కూల్ పిల్లలను అధికంగా ఎక్కించినా, లగేజీ పెట్టే స్థానంలో పిల్లలు, ప్రయాణికులను కూర్చోబెట్టినా మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపే సమయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ అంశాలపై త్వరలో పోలీస్, విద్యా శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రండి... ఒలింపిక్ రన్కు..
అమలాపురం టౌన్: అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రండి కలసి పరుగెడదామనే నినాదంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం ఒలింపిక్ రన్లు నిర్వహిస్తోంది. దీనిపై స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన తండ్రి దివంగత, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లను నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ఏడాది తన తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ జిల్లా ఒలింపిక్ రన్ స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటలకు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నుంచి రన్ను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒలింపిక్ టార్చ్ను వెలిగించి ప్రారంభిస్తారన్నారు. ఈ రన్ల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఽధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రన్లో అందజేయనున్న ఒలింపిక్ టీషర్టులను సాయిరాజ్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కట్టా పురుషోత్తం, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో కర్రంటోళ్లు...
అయోమయం.. గందరగోళం లోడ్ వెరిఫికేషన్తో ఆన్లైన్లో ఇలాంటి తాకీదులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది వినియోగదారులకు వస్తూండటంతో విషయం అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. జిల్లాలో గత మార్చి నుంచి ఈ నెల వరకూ దాదాపు 4,250 గృహ సర్వీసులకు అడిషనల్ లోడ్ పేరుతో వీడీఎస్ అమలు చేసినట్లు తెలిసింది. ఈ 4,250 సర్వీసుల నుంచి అదనపు లోడ్ చార్జీల కింద రూ.78 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. విద్యుత్ అధికారులు మాత్రం అడిషనల్ లోడ్కు చార్జీలు చెల్లించడం వల్ల వినియోగదారుకే మేలని చెప్పుకొస్తున్నారు. విద్యుత్ వినియోగం వివరాలను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు లోడ్పై విద్యుత్ కార్యాలయాల నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ డ్రైవ్లతో ఇళ్లకు వెళ్లి అదనపు లోడ్ చార్జీలు చెల్లించకపోతే ఫ్యూజ్ తొలగించాల్సి వస్తుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరి కొంతమంది వినియోగదారులకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే నేరుగా ఇళ్లకు వెళ్లి ఫ్యూజులు తొలగిస్తున్నారు. అమలాపురం టౌన్: నిత్య జీవితంలో విద్యుత్ ఓ భాగమైంది.. ఏ పనికై నా ఇది అత్యవసరమైంది.. అలాంటి విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజల నడ్డివిరిస్తోంది.. ప్రతి నెలా బిల్లులు చూసి షాక్కు గురవుతున్న కొంతమంది వినియోగదారులను అదనపు లోడ్ పేరుతో విద్యుత్ శాఖ బాదేస్తోంది. పలు గృహ సర్వీసులకు వలంటరీ డిస్కొజర్ స్కీమ్ (వీడీఎస్) అంటూ మళ్లీ వడ్డిస్తోంది. లోడ్ వెరిఫికేషన్ పేరుతో ఆన్లైన్ ద్వారా నమోదవుతున్న కేసుల్లో పెరిగిన విద్యుత్ లోడ్ ఆధారంగా కిలో వాట్కు ఇంత అని చార్జీల మోత మోగిస్తుంది. ఇప్పటికే లోడ్ పెరిగితే కొందరు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుని, విద్యుత్ శాఖ విధించే వీడీఎస్ను విధి లేక చెల్లిస్తున్నారు. ఇది కాకుండా స్పెషల్ డ్రైవ్ పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అదనపు లోడ్లపై విద్యుత్ శాఖ దాడులు నిర్వహిస్తుంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇంటి కనెక్షన్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పెరిగిన విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పుడు అదనపు లోడ్ పేరిట స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, కనెక్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో ఓ ఇంటి విద్యుత్ కనెక్షన్ను సిబ్బంది గత గురువారం తొలగించారు. విద్యుత్ వాడకానికి కిలోవాట్ల కేటగిరీల వారీగా అడిషనల్ లోడ్ చార్జీ విధిస్తున్నారు. ఇలా కిలో వాట్కు రూ.1,250 చెల్లించాల్సి వస్తోంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.600 వసూలు చేస్తున్నారు. ఇలా కిలోవాట్ల వారీగా చార్జీల భారం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జరిమానా లాంటిదే. దీనికే వీడీఎస్ అని పేరు పెట్టి ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే లోడ్ వెరిఫికేషన్లో ఏ వినియోగదారుడైనా కిలోవాట్ల గీత దాటితే వీడీఎస్ కింద రూ.1,250 చొప్పున చెల్లించాలని తాకీదు వస్తోంది. ఉదాహరణకు పి.గన్నవరం మండలానికి చెందిన ఓ వినియోగదారుడికి వీడీఎస్ కింద రూ.2,500 చెల్లించాలని తాకీదు ఇచ్చారు. సాయంత్రంలోగా రూ.2,500 చెల్లించకుంటే మర్నాడు సాయంత్రానికి రూ.4,500 చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదనపు లోడ్ పేరుతో బాదుడు వీడీఎస్ ద్వారా రూ.వేలల్లో చార్జీలు కిలోవాట్ల వారీగా విద్యుత్ శాఖ వడ్డింపు ఇబ్బంది పెట్టడం సరికాదు స్పెషల్ డ్రైవ్ పేరుతో విద్యుత్ సిబ్బంది ఒకేసారి ఇంటికి వచ్చి హడావుడి చేస్తున్నారు. దీంతో, ఇంట్లోని వారు అదేదో దాడిలా కంగారు పడుతున్నారు. నా ఇంటికి అదనపు లోడ్ వినియోగించామంటూ సిబ్బంది వచ్చి ఉన్నపళంగా విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఇది సరికాదు. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. కరెంట్ లేక రాత్రంతా ఇబ్బంది పడ్డాం. అడిషనల్ చార్జీల వసూళ్లకు ముందుగా నోటీసులిస్తే బాగుంటుంది. ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. – దూనబోయిన వెంకటేశ్వరరావు, వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం వసూలు చేసే పద్ధతి ఇది కాదు అదనపు లోడ్ చార్జీల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు అనుసరిస్తున్న విధానం సరికాదు. నోటీసులివ్వకుండా కనెక్షన్లు తొలగించడం, స్పెషల్ డ్రైవ్ల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, గడువులోగా చెల్లించకపోతే రూ.వేలల్లో జరిమానాల మాదిరిగా విధించి, ముక్కుపిండి మరీ వసూలు చేయడం వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. తొలుత హెచ్చరికలతో చెప్పాలి. అంతకీ మాట వినకపోతే చివరిగా నోటీసు ఇచ్చి కనెక్షన్ తొలగించాలి. – జీవీఎల్ఎన్ శర్మ, అధ్యక్షుడు, పట్టణ వినియోగదారుల సంఘం, అమలాపురం -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోరుకొండ/సీతానగరం: సీతానగరం మండలం రఘుదేవపురం పరిధిలోనిరొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన పేట్ల సుబ్రహ్మణ్యం (27) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సీతానగరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ కథనం ప్రకారం.. కోటి గ్రామానికి దగ్గరలోని రఘుదేవపురం పరిధిలో సురవరపు వెంకట అప్పారావు రొయ్యల చెరువు వద్ద పేట్ల సుబ్రహ్మణ్యం కొంతకాలంగా కూలీ నిమిత్తం పనిచేస్తున్నాడు. ఆదివారం చెరువు వద్ద బోరుకు విద్యుత్ సరఫరా రాకపోవడంతో అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద జంపర్ కట్టి, ఎడ్జీ ఫ్యూజ్ వేసే సందర్భంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. సహచరులు గమనించి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి నుంచి చెరువు వద్దకు వెళ్లిన సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు రోదిస్తున్నారు. మృతుడి తండ్రి శ్రీను వ్యవసాయ కూలీ. తండ్రికి చేదోడుగా ఉంటున్న సుబ్రహ్మణ్యం మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలి ● తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రాజమహేంద్రవరం రూరల్: ఆరోగ్యాంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్న తిరుమలరావు మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త ఉపశమనాన్ని పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేడు ఎంతోమంది యోగా చేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. యోగా టీచర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలను వేయించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి.. బస్సు కింద పడి
ఫ యువకుడి బలవన్మరణం కాకినాడ క్రైం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత పురుగు మందు తాగి, ఆపై బస్సు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ మహాలక్ష్మి నగర్లోని రణదీప్నగర్కు చెందిన కుప్పాల కోదండ రామచంద్రమూర్తి (30) బీచ్ రోడ్లో ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి వేట్లపాలేనికి చెందిన సిరితో రెండు నెలల కిందట వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రామచంద్రమూర్తి ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మార్గ మధ్యంలో పురుగు మందు కొని తాగాడు. టూ టౌన్ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనాన్ని ఉంచి తర్వాత బ్రిడ్జిపైకి వచ్చాడు. తర్వాత బస్టాండ్ నుంచి కోటిపల్లి వెళ్తున్న బస్సు కిందకు దూకాడు. బస్సు కొంతమేర లాక్కెళ్లిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని స్థానికులు కాకినాడ జీజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. -
సమాజానికి ఉపయోగపడేలా చదవాలి
● యండమూరి వీరేంద్రనాథ్ బోట్క్లబ్ (కాకినాడ): చదువుకోవడం గొప్పకాదని, అది సమాజం, పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. స్థానిక ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో కై ట్ కళాశాల ఆధ్వర్యంలో ఏపీ ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది ఇంజినీరింగ్ చదువుతున్నారని, ఉద్యోగం వచ్చిన మరుసటి రోజు నుంచి తల్లిదండ్రులను మరిచిపోయేలా వారి ప్రవర్తన ఉంటుందన్నారు. దీనివల్ల చదివిన చదువుకు అర్థం ఉండదని, రేపొద్దున్న ఇదే పరిస్థితి మనకూ వస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు సమాజ మిత్రులని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కై ట్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పోతుల విశ్వం అభినందనలు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
పిఠాపురం: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు బాల, బాలికలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీలో ఆదివారం ఎంపిక చేసినట్లు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. మొత్తం 100 మంది రాగా, ఇందులో 12 మంది బాలురు, 12 మంది బాలికలను పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 28, 29 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. తొలుత ఈ ఎంపిక పోటీలను ఉమ్మడి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ వియ్యపు రమణరాజు, సభ్యులు ఎమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, సోము గోవిందరాజు ప్రారంభించారు. న్యాయ నిర్ణేతలుగా సతీష్, పీడీ శేషుకుమారి, కె.నాగలింగేశ్వరరావు, సురేష్, కె.చిన్నబ్బాయి, పవన్ వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొరబాబు అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జాతీయ తైక్వాండో పోటీలకు తూర్పు క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరాఖండ్లో ఈ నెల 23 నుంచి 25 వరకూ జరిగే జాతీయ తైక్వాండో పోటీలకు 18 మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు పయనమయ్యారని తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు ఆదివారం తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో జరిగే పోటీలకు 11 మంది బాలికలు, ఏడుగురు బాలురు హాజరవుతున్నారన్నారు. వీరంతా ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారన్నారు. జాతీయస్థాయి పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులను డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, తైక్వాండో సంఘ కార్యదర్శి అర్జునరావు, కోచ్లు డీఎన్ సత్యనారాయణ, కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు అభినందించి, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
వాడపల్లికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకువద్దాం
● సిబ్బందికి ఈఓ చక్రధరరావు దిశానిర్దేశంకొత్తపేట: కోనసీమ తిరుపతిగా, రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలనే లక్ష్యానికి సిబ్బంది సహకారం అవసరమని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ఆదివారం దేవస్థానం కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. భక్తులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై సమీక్షించారు. ఈ విషయాల్లో సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. భక్తులు పూర్తి సంతృప్తిగా స్వామి దర్శనం చేసుకుని వెళ్లేలా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అందరూ చిత్తశుద్ధితో పనిచేద్దామని ఆయన అన్నారు. ఫ వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం వాస్తవ్యులు భీమా శ్రీధర్, శ్రీవల్లి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు. ఆలయంలో నిత్య పూజల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చన పూజలు జరిగాయి. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ తదితర సేవల దేవస్థానానికి రూ.6,58,733 ఆదాయం వచ్చింది. -
ఇదిగో సహకారం
● సంఘాల ప్రతినిధులకు నేటితో ముగియనున్న శిక్షణ ● జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ రాజానగరం: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు సాగు రుణాలను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్నాయి.. అయితే వివిధ రకాల పంటలకు కాలానుగుణంగా ఏ రకమైన ఎరువులను వాడాలనే పరిజ్ఞానం ఎరువులు పంపిణీ చేసే సిబ్బందికి అంతగా ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి, రైతులకు అందించే ఎరువులపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ప్రతినిధులకు ‘సమగ్ర పోషక యాజమాన్యం’పై రాజానగరం మండలం దివాన్చెరువులోని జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో 14 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది సోమవారంతో ముగియనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 15 వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చెందిన 30 మంది ప్రతినిధులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఏ ఏ అంశాలంటే.. సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్సులో భాగంగా 15 రోజులపాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నేలలు – రకాలు, వాటిని సారవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, సమస్యాత్మక భూముల సవరణ, మట్టి నమూనాల సేకరణ, పరీక్షలు, జీవన ఎరువులు, ఎరువుల వాడకం, స్థూల, సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడం, పంటలో పోషక లోపంతో కలిగే నష్టాలు, వాటిని గుర్తించే విధానం – నివారణ, భూసారం పెంపునకు సమర్థ ఎరువుల వినియోగంపై వివరిస్తున్నారు. అలాగే సూక్ష్మజీవులకు సంబంధించిన జీవన ఎరువులు – విశిష్టత, పంట మార్పిడితో ప్రయోజనాలు, వంటి వివిధ అంశాలపై ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చల్లా వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పీవీ రమేష్లతోపాటు రాజమహేంద్రవరంలోని వ్యవసాయ కళాశాలలోని వివిధ విభాగాల అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి, వివిధ రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. -
అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కలశం పార్కు వద్ద ఓ అనాథ మృతి చెందాడు. దీనిపై స్థానికులు స్పందించి పట్టణ పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి మృతి చెందిన ఆ అనాథ మృతదేహాన్ని శనివారం ఉదయం అక్కడి నుంచి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. స్థానిక శ్మశాన వాటికలో ఆ మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ నాయకుడు దొంగ చిన్నా, జనసేన నాయకురాలు కొప్పుల నాగమానస స్పందించి సమాచారాన్ని పోలీసులు, మున్సిపాలిటీకి అందించారు. వ్యక్తి దుర్మరణంమామిడికుదురు: మాకనపాలెం గ్రామంలోని ఆర్అండ్బీ రహదారిపై శనివారం ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మామిడికుదురు శివారు గాలిదేవరపాలేనికి చెందిన బొడ్డపల్లి సత్యనారాయణ (45) సైకిల్పై ఈదరాడ వైపు వెళ్తుండగా, అదే మార్గంలో వెళ్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో సత్యనారాయణ మృత్యువాడ పడ్డాడు. సత్యనారాయణ వికలాంగుడు, అతను అవివాహితుడు. మృతుడి అన్నయ్య వీరాస్వామి ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
కొత్తపేట: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శనివారంతో పాటు ఏకాదశి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈఓ చక్రధరరావు క్యూలైన్లో భక్తులతో సాధారణ భక్తునిలా కలసిపోయి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. భక్తులతో పాటే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.60,17,180 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మైనింగ్ లీజులు రద్దు చేయాలి తుని: ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్కు ఇచ్చిన లీజులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు జక్కంపూడి రాజు డిమాండ్ చేశారు. శనివారం తునిలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని, శంఖవరం మండలం పెదమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ● భక్తజనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం ● ఒక్క రోజే రూ.60.17 లక్షల ఆదాయం -
మీ వ్యర్థాలు మీ ముందే..
మామిడికుదురు: గోగన్నమఠం గ్రామ ప్రధాన రహదారి పక్కన కోళ్ల వ్యర్థాలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. మగటపల్లి నుంచి గోగన్నమఠం వెళ్లాలంటే ఇక్కడ ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలోని కోళ్ల మాంసం దుకాణం యజమాని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కోళ్ల వ్యర్థాలు వేయవద్దని చెబుతున్నా వినకపోవడంతో శనివారం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అల్లు విజయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై వేసిన కోళ్ల వ్యర్థాలను మూటలు కట్టి పంచాయతీ రిక్షాపై చికెన్ షాపు వద్దకు తీసుకు వెళ్లారు. ఆ వ్యర్థాలన్నీ ఆ షాపు ముందే వేశారు. ఇక ముందు రోడ్డుపై కోళ్ల వ్యర్థాలు వేస్తే ఇదే పరిస్థితి పునరావృత్తం అవుతుందని గట్టిగా హెచ్చరించారు. చివరికి ఆ షాపు యజమాని దిగొచ్చి వ్యర్థాలను జనసంచారం లేని ప్రాంతంలో వేసేందుకు అంగీకరించడంతో సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది.● కోళ్ల వ్యర్థాలు తీసుకెళ్లి ఆ షాపు ముందే వేసి హెచ్చరిక ● అధికారుల వినూత్న నిర్ణయం -
లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి
బిక్కవోలు: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన పందలపాక శివారులో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడ భానుగుడి శ్రీరామ్నగర్ ప్రాంతానికి చెందిన గొల్ల మహంతి బాల వెంకటేష్ (29) పందలపాక సచివాలయం–2లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చారు. అక్కడ గ్రామస్తులతో కలసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిక్కవోలులో ఇంజినీరింగ్ కార్యాలయానికి బయలు దేరారు. తాను పనిచేస్తున్న సచివాలయం నుంచి కనీసం 400 మీటర్ల దూరంలో పందలపాక – ఊలపల్లి రోడ్డు వద్ద బిక్కవోలు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా కుడివైపు తిప్పి అతని బైక్ను కొట్టడంతో వెంకటేష్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆ లారీ వెంటనే అతని తలపై నుంచి వెళ్లిపోయింది. వెంకటేష్ తలకు హెల్మెట్ ఉన్నా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థలానికి భారీఎత్తున గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. ప్రమాద తీరును ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ పరిశీలించారు. మృతిదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించారు. మృతుడి భార్య కావ్యసత్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పందలపాకలో విషాదం ఐదేళ్లుగా సచివాలయ ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతూ, అందరితో సరదా ఉండే ఉద్యోగి ఇలా మృతి చెందడంతో స్థానికులు మదనపడుతున్నారు. తమ్ముడు అనే పిలిచే వ్యక్తి ఇలా అకాలంగా మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ బైక్ నడిపినా హెల్మెట్ వాడేవాడని, అందరినీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేవాడని, అలాంటి వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు, గ్రామస్తులు, మిత్రులు తమ్ముడు ఇక రాడంటూ ఆవేదన చెందుతున్నారు. తల్లిదండ్రులకు ఇతనే ఒక్కగానొక్క కుమారుడు. రెండేళ్ల కిందట దగ్గర బంధువని కావ్యసత్యశ్రీతో వివాహం జరిపించారు. కుటుంబానికి ఆసరా ఉంటాడని అనుకున్న కొడుకు ఇక లేకపోవడంతో తల్లిదండ్రులు, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన భర్త ఇకలేడని తెలిసి భార్య కావ్యసత్యశ్రీ బోరున విలపిస్తున్నారు. -
లక్ష్మీనరసింహస్వామి హుండీల ఆదాయం రూ.44,20,491
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామివారి దేవస్థానంలో శుక్రవారం అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులో స్వామివారికి రూ.44,20,491 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకూ 87 రోజులకు గాను పై ఆదాయం సమకూరింది. జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీల లెక్కింపు చేపట్టారు. మెయిన్ హుండీల ద్వారా రూ.42,44,077, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.19,824, అన్నదానం హుండీల ద్వారా రూ.1,56,590 ఆదాయం లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి ● లేదంటే రాజమహేంద్రవరంలో తిరగలేరు ● మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు ● మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని నరుకుతామంటూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోరు పారేసుకోవడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బుచ్చయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోరుకొండ మండలం కణుపూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన బుచ్చయ్యను మహిళలు తరిమేసిన ఘటనను గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెచ్చరిల్లుతున్న హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో దయనీయమైన స్థితిలోకి జారిపోయిందన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దాడులు, కేసులు, అరెస్టులతో భౌతికంగా వేధిస్తోందని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు కలసి గెలవడం పెద్ద విషయం కాదన్నారు. వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, జగన్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ప్రజలను భయపెట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ పర్యటనలకు తరలి వస్తున్న జనసమూహాన్ని టీడీపీ నాయకులు ఆపలేరన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబు ఆలోచనా విధానాన్నే కూటమి ఎమ్మెల్యేలు, నాయకు లు అనుసరించడం శోచనీయమన్నారు. సీనియర్ ఎ మ్మెల్యేగా చెప్పుకొంటున్న గోరంట్ల బుచ్చ య్య చౌదరి ఇంగితజ్ఞానం మరచి, మాజీ సీఎం జగన్పై అన్న తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజమహేం ద్రవరంలో తిరగలేరని రాజా హెచ్చరించారు. జగన్ను భూస్థాపితం చేయడం ఎవ్వరి తరమూ కాదు కాకినాడ రూరల్: ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూస్థాపితం చేయడం ఎవ్వరి తరమూ కాదని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తాము అభిమానించే నాయకుడిని కలుసుకోవడం కూడా తప్పే అన్నట్లు చిత్రీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిచారు. జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు, తల నరికేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదంటూ గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల ద్వారానే ఎన్టీఆర్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నించారని, అది సాధ్యం కాదని గ్రహించి, నేడు అధికారం కాపాడుకునేందుకు ఆయన విగ్రహాలను పూజిస్తున్నారని అన్నారు. నాయకుడిగా ఎదగకూడదనే దురుద్దేశంతో వంగవీటి మోహన్రంగాను భూస్థాపితం చేశారని ఆరోపించారు. గోరంట్ల, అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించి, తమ నాయకుడు జగన్కు రక్షణ కల్పించాలని నాగమణి విజ్ఞప్తి చేశారు. -
యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు
అమలాపురం రూరల్: విశాఖపట్నంలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమం కోసం ఆర్టీసీ బస్సులను తరలించడంతో కోనసీమలో నాలుగు ఆర్టీసీ డిపోల పరిధిలోని బస్టాండుల్లో బస్సులు లేక శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను దాదాపుగా రద్దు చేశారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడక తప్పలేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమానికి కోనసీమ జిల్లా నుంచి 160 ఆర్టీసి బస్సులు విశాఖకు తరలి వెళ్లాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ఈ బస్సులు వెళ్లాయి. అమలాపురం డిపో నుంచి 58, రావులపాలెం నుంచి 41, రామచంద్రపురం నుంచి 40, రాజోలు నుంచి 20 బస్సులు పంపించినట్లు జిల్లా రవాణా అధికారి రాఘవకుమార్ తెలిపారు. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. 58 బస్సులు యోగాంధ్ర వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజమహేంద్రవరం, కాకినాడ రూట్లలో 15 నిమషాలకు ఒక బస్సు తిరిగేది. బస్సులు తగ్గించడంతో 45 నిమిషాలకు ఒకటి చొప్పున నడపడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ, విశాఖపట్నం రూట్లు, పల్లె వెలుగు బస్సులు కొన్ని రూట్లలో రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయివేట్ వాహనాల్లో వెళ్లారు. పాఠశాలు, కళాశాలలకు సెలవు ఆర్టీసీ బస్సులతో పాటు జిల్లాల్లో జిల్లాలో సమారు 300 ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులు యోగాంధ్రకు వినియోగించడంతో పాఠశాలలు, కళాశాలలకు గురువారం నుంచి మూడురోజులు సెలవులు ప్రకటించారు. యోగా పేరుతో సెలవు ఇవ్వడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పు పడుతున్నారు. -
ఆధ్యాత్మికతకు ధర్మ పరిక్రమణ యాత్ర
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులుఆలమూరు: హిందూ ధర్మ పరిరక్షణ, మత వ్యాప్తి కోసం ధర్మ పరిక్రమణ యాత్రను చేపట్టి గ్రామీణ, తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు తీవ్రంగా కృషి చేస్తోందని ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి విద్వాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ఆలమూరు మండలంలోని జొన్నాడలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీపురంధరదాసు సంకీర్తనల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేద ఉపనిషత్ పురాణాల సారాంశాన్ని రంగరించి సుమారు 4.70 లక్షల శ్రీపురంధరదాసు సంకీర్తనలను రచించామన్నారు. ఈ కీర్తనలన్నీ కన్నడ భాషలో ఉండడం వల్ల అందులో ఉన్న సారాన్ని తెలుగు వారికి అర్థమయ్యే విధంగా తర్జమా చేయించామన్నారు. ఆ కీర్తనలు ఆలపించే విధానాన్ని భజన మండలి సభ్యులకు నేర్పడానికి ఏటా మహిళ భక్త బృంద సభ్యులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లో భాగంగా కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం 4,862 భజన మండళ్లు ఉండగా అందులో 8,694 మంది మహిళా సభ్యులు ఉన్నారన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లోనున్న హరే శ్రీనివాస భక్తభజన మండళ్ల సభ్యులందరూ సంకీర్తన యజ్ఞంతో పాటు కోలాటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. దాస సాహిత్య ప్రాజెక్టు విస్తరణకు, నిర్వహణకు టీటీడీ రూ.2.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. హిందుత్వం వైపు ఆకర్షితులను చేస్తాం గిరిజనులు, దళితులు దాస సాహిత్య ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబర్చి హిందూత్వం వైపు అకర్షించేలా ఈ ధర్మ పరిక్రమణ యాత్ర దోహదపడుతుందన్నారు. మత మార్పిడుల నివారణకు టీటీడీ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. హిందుత్వానికి ఉన్న వైభవాన్ని వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15వ తేదీన ధర్మ పరిక్రమణ యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో హరే శ్రీనివాస భజన మండళ్ల ఏర్పాటులో, నిర్వహణలో ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్వాహకులు ముకుంద స్వామి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. -
ఆస్ట్రోనాట్ జాహ్నవికి సత్కారం
అమలాపురం టౌన్: త్వరలో అంతరిక్షంలోకి వెళ్లబోతున్న ఆస్ట్రోనాట్ దంగేట జాహ్నవి శుక్రవారం అమలాపురం వచ్చింది. గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఆమె పట్టణానికి వచ్చి ఇక్కడి మేధావులు, విద్యావేత్తలతో కొద్దిసేపు మాట్లాడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జహ్నవి దేశం తరఫున తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న మహిళగా చరిత్రకెక్కనుందని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ అన్నారు. జాహ్నవి మాట్లాడుతూ తాను 2029 ఆస్టోనాట్ టైటాన్స్ స్పేస్ ఇనాగ్యురల్ ఆర్బిటాల్ మిషన్కు ఎంపికయ్యాయని చెప్పింది. అనంతరం ట్రస్ట్ తరఫున జాహ్నవిని సత్కరించారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త గారపాటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన గైడెన్స్లో చదివిన జాహ్నవి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత స్పేస్ శాస్త్రవేత్త పెద్దిరెడ్డి సత్యనారాయణ, కుడుపూడి శాంతి భూషణ్ పాల్గొన్నారు. -
భృతివిద్యాకోర్సులు!
●● ఉపాధికి భరోసా.. భవితపై ఆశ ● ఆర్థిక స్తోమత లేనివారిని ఆదుకుంటున్న వైనం ● ఈ నెల 30 వరకూ తొలి దశ ఆడ్మిషన్లకు గడువు కొత్తపేట: పదో తరగతి తరువాత ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ చదవాలని ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఆ కోర్సులలో చేరాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్తోమత, కుటుంబ నేపథ్యం వంటి కారణాలతో సతమతమవుతుంటారు. అటువంటి విద్యార్థుల కోసం 1985లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్లో ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు ప్రవేశపెట్టింది. ఇవి పూర్తిచేసిన విద్యార్థులకు వివిధ జాబ్మేళాలు, అప్రెంటిస్ మేళాల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తొందరగా లభిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జనరల్ సబ్జెక్టులతో పాటు ఈ కోర్సులను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఒకేషనల్ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్ ఇస్తున్నారు. గేమ్స్, ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్కు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు సర్టిఫికెట్తో పాటు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫికెట్ ఇస్తుంది. జూనియర్ కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఇంటర్లో చేరేందుకు మొదటి దశ ప్రవేశాలకు ఈ నెల 30 వరకూ అవకాశం ఉంది. ఇంకా ఔత్సాహికులు ఉన్నా ఆ తరువాత కూడా జాయిన్ చేసుకుంటారు. ఏ కోర్సుతో ఏ ప్రయోజనాలంటే.. ఏ అండ్ టీ (అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్) అక్కౌంట్స్, ఆదాయ పన్ను సంబంధిత అంశాల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవగాహన పెంచుకోవచ్చు. దీనివల్ల సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. విద్యార్థి స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది. సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కోర్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. కంప్యూటర్కు సంబంధించిన అన్ని అవసరాలనూ తీర్చేలా విద్యార్థి తన కా ళ్లపై తాను నిలబడేలా తోడ్పడుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి కూడా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్) విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాథమిక, మాధ్యమిక అవగాహన అందిస్తారు. ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానికంగా గృహ, వాణిజ్య పరమైన నిర్మాణాల్లో వైరింగ్ వర్క్లో రాణిస్తూ జీవితంలో స్థిరపడవచ్చు. ఎం అండ్ ఏఎంటీ (మెకానికల్ అండ్ ఆటోమొబైల్ టెక్నీషియన్) వాహనాలు, యంత్రాల పని విధానంపై అవగాహన కల్పిస్తారు. ఇది చదివిన వారు స్వయం ఉపాధి పొందవచ్చు. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య చదవవచ్చు. వివిధ ఆటోమొబైల్ కంపెనీల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) వివిధ రకాల రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలనూ అందిస్తారు. పెద్దాసుపత్రులు, మెడికల్ ల్యాబొరేటరీలలో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. లేదా సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. ఎంపీహెచ్ఎబ్ల్యూ–ఎఫ్ (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు) ఈ కోర్సు అనంతరం ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా ఉద్యోగాలు పాందవచ్చు. ఇవికాక ఆఫీస్ అసిస్టెంట్ షిప్ (ఓఏ), సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ (సీఈటీ), లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ (ఎల్ఎంఅండ్ డీ), క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ (సీపీఅండ్ఎం), ఫిజియోథెరపీ (పీటీ), కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సీజీఏ) తదితర వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి వృత్తి విద్యా కోర్సుకు 40 సీట్లు ఉంటాయి. విద్యార్థులు ఆసక్తి చూపితే సీట్ల సంఖ్యను 60 వరకూ పెంచే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 38 ప్రైవేటు కాలేజీల్లో 5,500 ఒకేషనల్ సీట్లు ఉన్నాయి. ప్రతి కళాశాలలో పారామెడికల్ కోర్సుకు 30, ఇతర కోర్సులకు 40 చొప్పున సీట్లు కేటాయించారు. జిల్లాలో ఇలా.. కళాశాల కోర్సుల సంఖ్య సీట్లు కొత్తపేట 6 240 రావులపాలెం 2 80 రామచంద్రపురం 4 160 మండపేట 1 40 అమలాపురం 1 40 మలికిపురం (ఎయిడెడ్) 2 120 మొత్తం 680ఆర్థిక భారం లేకుండా.. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ (ఇంగ్లిషు, తెలుగు మీడి యం) హెచ్ఈసీ (తెలుగు మీడియం) జనరల్ కోర్సులతో పాటు ఆరు ఒకేషనల్ కోర్సులు అందు బాటులో ఉన్నాయి. ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. – యాళ్ల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట పేద విద్యార్థులకు వరం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సులు ఒక వరం. రెండేళ్లు కష్టపడి చదివితే ఉపాధి పొందే మార్గాలు అనేకం లభిస్తాయి. పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి, చదువుకోలేని విద్యార్థులు ఈ కోర్సులు అభ్యసించి, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు. – తనికెళ్ల వీఆర్ఎస్కేఎస్ శాస్త్రి, అధ్యాపకుడు, సీఎస్ఈ విభాగం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట -
ఇసుకాయస్వాహా!
సాక్షి, అమలాపురం: గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. వర్షాలు, వరదల సీజన్ మొదలు కావడంతో అధికారిక ఇసుక ర్యాంపులలో తవ్వకాలు నిలిపివేయడం, స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక లభ్యత తక్కువగా ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. వర్షాలు లేకపోవడంతో ఇసుకకు నెలకొన్న డిమాండ్కు తోడు.. ర్యాంపులోకి వెళ్లే దారులకు ఇబ్బందులు లేకపోవడంతో అక్రమార్కులు బరి తెగించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి నదీపాయల్లో ఇసుక దందా జోరందుకుంది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీపాయాల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలో ర్యాంపులు ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఇసుక దందా ఆగలేదు. ఇప్పుడు ర్యాంపులు మూతపడడంతో మరింత చెలరేగిపోతున్నారు. అనువుగా ఉన్నచోట గుర్తించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు పడితే మట్టి తవ్వకాలు జరిగే అవకాశం లేదు. పైగా ర్యాంపులు వేసి ఇసుక, మట్టి తవ్వకాలు చేయలేరు. వర్షాలు లేక వాతావరణం కలిసి రావడం అక్రమార్కులకు వరంగా మారింది. పి.గన్నవరంలో మరింత దోపిడీ పి.గన్నవరం మండలంలో ఈ దోపిడీ మరింత పెరిగింది. కీలక ప్రజాప్రతినిధుల వత్తాసుతో అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక, మట్టి వంటి సహజ వనరుల దోపిడీ నిర్విఘ్నంగా సాగిపోతోంది. మండల పరిధిలోని ఊడిమూడి, మానేపల్లి, కందాలపాలెం ప్రాంతంలో లంక మట్టి, ఇసుక, తువ్వ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది సిండికేటుగా మారి ఇక్కడ అక్రమ దందా చేస్తున్నారు. అపరాధ రుసుము చెల్లించాలని వీరికి అధికారులు నోటీసులు జారీ చేసినా దందా మాత్రం ఆగడం లేదు. మండలంలో పెద కందాలపాలెం, ఎల్.గన్నవరం పరిధిలో యర్రంశెట్టివారిపాలెం లంక, ఊడిమూడిలంక, మానేపల్లిలో ఇసుక, మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బెల్లంపూడిలంకలో ఒక వారం రోజులు తవ్వకాలు చేశారు. స్థానికుల నుంచి ఒత్తిడి రావడంతో నిలిపివేశారు. నదీ గర్భంలో లోతుగా.. అక్రమ దందాకు తోడు నిబంధనలు తోసిరాజని నదీ గర్భంలో లోతున తవ్వకాలు చేయడం గమనార్హం. మీటరు నుంచి రెండు మీటర్ల లోతున తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల సమీప గ్రామాల ఉనికే ప్రమాదభరితంగా మారింది. వై.వి.పాలెం ఏటిగట్టు దిగువన, ఊడిమూడి తదితర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షాలు వస్తే సాధ్యం కాదన్న ఉద్దేశంతో తవ్వకాల్లో జోరు పెంచారు. ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తప్పదన్నట్టుగా అప్పుడప్పుడూ దాడులు చేసి జేసీబీలు, లారీలను సీజ్ చేస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. చీకటి పడితే చాలు అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వారు లెక్క చేయడం లేదు. దోపిడీ మరింత వేగంగా సాగిపోతోంది. అపరాధ రుసుము అంటూ అధికారుల హంగామా పి.గన్నవరంలో సాగుతున్న ఈ అక్రమ ఇసుక దందా సిండికేటుగా మారింది. ఒక మహిళా సర్పంచ్ భర్త, ఒక మండల స్థాయి నేత కుమారుడు, కూటమి పార్టీకి చెందిన నాయకులు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని ఇప్పుడు గుర్తించిన అధికారులు తవ్వకాలు చేస్తున్నవారి వద్ద నుంచి అపరాధ రుసుము రూ.2.31 కోట్లు వసూలు చేస్తామని చెబుతున్నారు. అయితే గనుల శాఖకు చెందిన అధికారులు గతంలోనూ ఇదే విధంగా అపరాధ రుసుము అంటూ హడావుడి చేసినా అక్రమార్కులు చెల్లించిన పాపాన పోలేదు. రాజోలుకు పాకింది గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఇప్పుడు పి.గన్నవరం నియోజకవర్గం దాటి రాజోలు నియోజకవర్గంలోనూ విస్తరించాయి. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం దిండిలో తవ్వకాలు మొదలయ్యాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. బ్యాక్ వాటర్ కారణంగా ఇక్కడ పడవల మీద ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న ఇసుక స్థానికంగా కన్నా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. పి.గన్నవరం మండలం బెల్లంపూడిలంక వద్ద మట్టి తవ్వకాలు (ఫైల్) మళ్లీ జోరందుకున్న దందా అధికారిక ర్యాంపుల్లో నిలిచిన తవ్వకాలు ఇదే అదనుగా అనధికార ర్యాంపులు పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో అక్రమ తవ్వకాలు అదనంగా రాజోలు, అయినవిల్లిలో కూడా.. ఒకవైపు అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ పరిశీలన... మరోవైపు ఆగని తవ్వకాలు -
రెవెన్యూ శాఖ తల్లి లాంటిది
అమలాపురం రూరల్: ప్రభుత్వ శాఖలన్నింటికీ రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని, దీనికి 45 రకాల ప్రభుత్వ శాఖలతో నిత్యం అనుబంధం ఉంటుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ దినోత్సవం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, 238 ఏళ్ల తర్వా త ఏపీలో రెవెన్యూ డే ప్రకటించారన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. విశిష్ట సేవలందించిన 44 మంది ఉద్యోగులకు, కమాండేషన్ ఽధ్రువపత్రాలు మెమెంటోలు అందజేశారు. 18 మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను సత్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి మాట్లాడుతూ రెవెన్యూ కేర్ పేరిట ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎస్డీజీ మమ్మీ, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, తహసీల్దార్లు, వికాస జిల్లా మేనేజర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా 68 కేసుల పరిష్కారం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా ఇప్పటి వరకు 68 కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కార్యాలయ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఉద్యోగ సంబంధిత కేసులు 16 , పాస్పోర్ట్ సంబంధిత కేసులు 3, విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడినవారి కేసులు 7 పరిష్కరించామన్నారు. నోడల్ అధికారి డీఆర్వో రాజకుమారి, కోఆర్డినేటర్ జి. రమేస్ పాల్గొన్నారు. -
గడువు దాటితే ముప్పు
● వంట గ్యాస్ సిలిండర్కు కాలపరిమితి ● గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి అంబాజీపేట: గ్యాస్ సిలిండర్తో పంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో... సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సిలిండర్కు కాల పరిమితి ఉంటుందని, దానిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడవు తేదీ ముగిసిన సిలిండర్ను వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతీ సిలిండర్పై గడువు తేదీ, కోడ్ విధానంలో మెటల్ ప్లేటుపై ముద్రిస్తాయి. సిలిండర్ను మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించాలి. ఇలా గుర్తించాలి.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఏ–25, బీ–25 అని ఉంటే ఆ సిలిండర్ 2025 మార్చి–జూన్కి గడువు ముగుస్తుందని అర్థం. 25 అంటే 2025 సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ‘ఏ’ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు ‘బి’ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ‘సీ’ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ‘డీ’ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాల్సి ఉంటుంది. సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేటుపై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని. గడువు తేదీ నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్పై ఉంటే దానిని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. సిలిండర్కు 10 ఏళ్ల గడువు.. సిలిండర్ తయారైనప్పటి నుంచి 10 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. వినియోగదారుల హక్కులు.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. -
‘దీవెన’ బకాయిలు విడుదల చేయండి
అమలాపురం రూరల్: ప్రైవేటు కళాశాల విద్యార్థులకు బకాయి పడిన వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జేసీ నిశాంతిలకు వారు వినతి పత్రాలు అందజేశారు. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి సంబంధించి మూడేసి టెర్మ్ల ఫీజులను ఇంతవరకు కళాశాలలకు జమ చేయలేదన్నారు. దీని వల్ల విద్యా సంస్థల మనుగడ కష్టంగా మారిందని వారు అవేదన వ్యక్తం చేశారు. కళాశాలల గుర్తింపు రెన్యువల్ విధానాన్ని ఐదేళ్లకు ఓసారి పెట్టాలని, సీట్ల భర్తీ విషయంలో మేనేజ్ మెంట్ కోటా తొలగించి కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదికవి నన్నయ్య యూనివర్సిటీ కళాశాల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కరాటం వీఆర్ఎన్ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఆకుల బాపన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మున్సిపల్ కమిషనర్పై బదిలీ వేటు కొవ్వూరు: స్థానిక మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న టి నాగేంద్ర కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గతంలో కమిషనర్పై ఓ మహిళ విషయంలో పలు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్కు బాధితులు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. -
కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు
పి.గన్నవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తాము తిరగబడితే తట్టుకోలేరని పీఏసీ సభ్యురాలు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ నూతన కార్యాలయ ముఖ ద్వారాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కార్యాలయ గదిని విజయలక్ష్మి, సమావేశ మందిరాన్ని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు బుధవారం ప్రారంభించారు. పార్టీ పతాకాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నవరపు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై నిత్యం వేధింపులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. 300 యూనిట్ల విద్యుత్ పేరుతో తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారని విజయలక్ష్మి, జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం: తోట ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తామని అన్నారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్పై అభిమానం తగ్గలేదన్నారు. నాయకులను జైలులో పెట్టగలరేమోగానీ ప్రజల గొంతు నొక్కలేరని అన్నారు. కోవిడ్లో రాష్ట ప్రజలకు జగన్ అందించిన సేవలను దేశమంతా ప్రశంసిందని తోట గుర్తు చేశారు. జగన్కు లభిస్తున్న ప్రజాభిమానికి భయపడిన కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనలకు అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. జగన్ను అధికారంలోకి తీసుకురావాలి: ఎమ్మెల్సీలు బొమ్మి, కుడుపూడి వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. రెడ్బుక్ రాజ్యాగంతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేస్తే.. కూటమి ప్రభుత్వానికి కోర్టులు అక్షింతలు వేశాయన్నారు. దేశంలో కులగణన జరగాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. బీసీ కులగణనపై మండల స్థాయిలో వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కుడుపూడి వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యాలయానికి షెడ్డు నిర్మించి ఇచ్చిన పార్టీ నాయకుడు యన్నాబత్తుల అనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఆయనను సత్కరించారు. రామచంద్రపురం, అమలాపురం కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకుడు పి.కె.రావు, మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, కుడుపూడి విద్యాసాగర్, విత్తనాల ఇంద్రశేఖర్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు కశిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, గూడపాటి రమాదేవి, మట్టా శైలజ, రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీకాంత్, మందపాటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు జగ్డిరెడ్డి హెచ్చరిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభం -
సబ్ ప్లాన్ నిధులు ఏంచేస్తున్నారు
మలికిపురం: కూటమి ప్రభుత్వం దళితులను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ను శాలువాతో సన్మానించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే 30 శాతం సబ్ప్లాన్ నిధులను దళితుల ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితుల ఓట్లు తమకు అక్కర్లేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రూ.26 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. అంతేకాక దళితులు, దళిత నాయకులుతో పాటు రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పలు నేరాలకు పాల్పడిన వ్యక్తులకు కూటమి ప్రభుత్వం నజరానాలు ఇస్తోందని. విజయనగరంలో రాముని విగ్రహం తల విరగ్గొట్టిన వ్యక్తికి ప్రభుత్వం సాయం చేయడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏడాది వ్యవధిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని గొల్లపల్లి పేర్కొన్నారు. పార్టీ నాయకులు పాటి శివకుమార్, కుసుమ చంద్రశేఖర్, తాడి సహదేవ్, నేత నాని, గుర్రం వెంకట నాగరాజు, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధిగా ‘తెన్నేటి’ రాజోలు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధిగా రాజోలుకు చెందిన తెన్నేటి కిశోర్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కిశోర్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎంతో బలంగా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయకత్వంలో రాబోయే కాలంలో పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు. హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తనను రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి సూర్యారావు -
23న ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ రన్లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ల ప్రతినిధులు, ఎంఎస్డీవోలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటా రని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు తెలిపారు. పట్టణంలోని దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ నుంచి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రన్ను ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు పర్యవేక్షణలో సంఘం ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ల సహకారంతో ఈ రన్ సాగనుంది. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్లకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. సమయం దగ్గర పడటంతో కళాశాలల యాజమాన్యాలు మరింత స్పీడ్ పెంచాయి. తమ కళాశాలల్లో చేరండంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నారు. కొంచెం పేరున్న కళాశాలల్లో చాలా వరకూ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచ్లలో సీట్లు లేవని తెలుస్తోంది. సీట్లు పొందడానికి సిఫారసులు సైతం చేసుకునే పనిలో విద్యార్థులు ఉన్నారు. మొత్తం మీద ఇంజినీరింగ్ ప్రవేశాలకు అప్పుడే విద్యార్థులు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 950 సీట్లతో పాటు 26 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 14,500 సీట్లు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఎంసెట్–2025 ఫలితాల్లో కాకినాడ జిల్లాలో 6,343, కోనసీమ జిల్లాలో 2,866, తూర్పుగోదావరి జిల్లాలో 6,011 మంది ఉత్తీర్ణత సాధించారు. దీన్ని బట్టి కౌన్సెలింగ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి అడ్మిషన్ లభిస్తుంది. సీట్లు దొరకవనే ప్రచారం ఎంసెట్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చనే ప్రచారం అప్పుడే జరుగుతోంది. సీటు విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని, ముందస్తుగా కొంత అడ్వాన్స్ ముట్టజెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి. మంచి కళాశాలలో సీట్లు దొరకవనే ప్రచారంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్ చేస్తుండడంతో చాలా వరకూ సీఎస్ఈ, దానికి అనుబంధంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్లకు డిమాండ్ ఏర్పడింది. కాకినాడ జిల్లాలో బాగా పేరొందిన ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సీటుకు డొనేషన్ రూ.10 లక్షల వరకూ ఇవ్వడానికి వెనకాడటం లేదంటే ఎంత డిమాండ్ ఉందో అర్థమౌతుంది. ఓ మోస్తరు కళాశాల అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తామని, సీటు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమై కోరుకున్న కళాశాలలో సీటు రాకపోతే.. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదని, ముందుగా యాజమాన్యాలతో మాట్లాడి ర్యాంకు వస్తే ఆ కోటాలో సీటు ఖరారు చేసుకోవచ్చని, లేకపోతే దాన్ని మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్నారై కోటాకు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి యాజమాన్యాలు ప్రస్తుతం సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. కన్వీనర్ కోటాకే ప్రభుత్వ సహాయం కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. బీటెక్లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ కోర్సు ఎంచుకుని కన్వీనర్ కోటాలో చేరవచ్చు. జేఎన్టీయూకే పరిధిలో 160 కళాశాలల్లో దాదాపు 25 నుంచి 30వేల సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కౌన్సెలింగ్లో పాల్గొనాలి. – డాక్టర్ వీవీ సుబ్బారావు, ఏపీ ఎంసెట్ కన్వీనర్ బీటెక్ సీట్లకు బేరసారాలు కౌన్సెలింగ్కు ముందే భర్తీకి చర్యలు కంప్యూటర్ సైన్స్కు విపరీతమైన డిమాండ్ కన్వీనర్ కోటా మేలంటున్న విద్యానిపుణులు -
కూనవరమే శాపం!
సాక్షి, అమలాపురం: కోనసీమ తీర ప్రాంతంలోని వరి ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సాగుకు మరో అవాంతరం ఏర్పడింది. ఏటా ముంపునకు భయపడి ఇక్కడి రైతులు సాగు వదిలేస్తున్న విషయం తెలిసిందే. కాని ఈసారి మరింత మంది సాగుకు దూరమయ్యే పరిస్థితిని సాగు, మురుగునీటి పారుదల శాఖ అధికారులు కల్పిస్తున్నారు. కాలువపై మరమ్మతులు, నిర్మాణాల పేరుతో నీరు ఆలస్యంగా వదలడం ద్వారా సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు సాగుకు అటంకాలు సృష్టిచారు. సముద్ర నీరు డ్రైన్లలోకి పారేలా చేసి మురుగు నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు తొలకరి సాగు అంటేనే భయపడేలా చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో కూనవరం, వాసాలతిప్ప, శంకరగుప్తం డ్రెయిన్ల నుంచి సముద్ర మొగ ద్వారా ముంపునీరు దిగాల్సి ఉంది. ఇదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. భారీ వర్షాల సమయంలో ఇవి మూసుకుపోవడం... తెరిస్తే ఉప్పునీరు పోటెత్తి చేలను, తోటలను ముంచెత్తడం పరిపాటిగా మారింది. కూనవరం మొగ సైతం ఇదే విధంగా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ముమ్మిడివరం, అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ మొగ ద్వారా సముద్రంలోకి దిగాలి. ఇప్పుడు వరి ఆయకట్టు తగ్గినా ఇంకా 25 వేల ఎకరాల సాగవుతోంది. మొగ తరచూ మూసుకు పోతున్న విషయం తెలిసిందే. దానికి ఇరువైపులా ఉన్న ఉప్పలగుప్తం, చిర్రయానాం, అల్లిపర్రల ద్వారా ముంపునీరు దిగేందుకు అక్రమ ఆక్వా చెరువులు సాగు అడ్డంకిగా మారింది. వందల ఎకరాలు ఏటా ముంపుబారిన పడి రైతులు నష్టపోతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో ఏటా ఖరీఫ్లో మూడు వేల ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాల్లో వరిసాగు వదిలేస్తున్నారు. ఇసుక తవ్వకాలతో తెరుచుకున్న మొగ కూనవరం మొగ ద్వారా ముంపునీరు సముద్రంలోకి దిగేందుకంటూ మురుగునీటి పారుదల శాఖ అధికారులు ఇటీవల డ్రెడ్జింగ్ నిర్వహించారు. మొగ వద్ద 600 మీటర్లు వదిలి మురుగునీటి కాలువలో సుమారు 2.50 కిలో మీటర్ల మేర డ్రెడ్జింగ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే అర కిలోమీటరు మేర కన్నా ఎక్కువగా ఉన్న మొగ ఇప్పుడు తెరుచుకోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది అధికార పార్టీ మద్దతుదారులు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయడం వల్ల మొగ తెరుచుకుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల మురుగునీటి కాలువలలో డ్రెడ్జింగ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, దీని వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా వర్షాలు లేని సమయంలో వేసవిలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ డ్రెడ్జింగ్ కోసం గత ఏడాది ఆగస్టులో డ్రెడ్జర్ను రప్పించారు. తవ్వకాలకు అనుమతి రాకపోవడంతో నెలల తరబడి ఇక్కడే ఉంచారు. అప్పట్లో తవ్వకాలు చేసినా గత ఏడాది ఖరీఫ్ పంట మునిగి పోకుండా ఉండేది. అప్పుడు చేయకపోవడం వల్ల వర్షాలకు చేలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. పైగా ముంపునీరు వీడకపోవడం వల్ల రబీ నారుమడులు వేసే అవకాశం లేకపోవడం.. సాగు ఆలస్యం కావడం.. ఆ ప్రభావం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి తగ్గడానికి కారణమైంది. ఇప్పుడు అవసరం లేని సమయంలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఎగదున్నుకు వస్తున్న సముద్ర నీరు కూనవరం కాలువ ద్వారా వేగంగా ఇతర డ్రెయిన్లలోకి వెళ్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మొగ నుంచి ఎగదన్నుతున్న సముద్రపు నీటి పోటు డ్రెయిన్లలోకి ఉప్పునీరు పంట కాలువలు, చానళ్లకూ చేరిక ఇదే కొనసాగితే ఖరీఫ్కు ముప్పు ఏటా మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాలు సాగుకు దూరం డ్రెడ్జింగ్ వల్ల నష్టమేనంటున్న రైతులు సీన్ రివర్స్ కూనవరం మొగ ద్వారా గత రెండు రోజులుగా సముద్ర నీరు మురుగునీటి కాలువ ద్వారా ఎగదన్నుతోంది. అధికారులు చేసిన డ్రెడ్జింగ్ లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. ప్రస్తుతం మురుగునీటి కాలువలోకి వస్తున్న నీటికి అడ్డుకట్ట వేయకుంటే ఇది పంట కాలువలు, పంట కాలువలకు అనుబంధంగా ఉండే ఛానళ్లు, పంట బోదెలలోకి కూడా వచ్చే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఇదే జరిగితే ఇక్కడ మొత్తం ఆయకట్టును సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. వేసవిలో అమలాపురం–చల్లపల్లి ప్రధాన పంట కాలువ ద్వారా చింతలపూడి లాకు (సమనస లాకు)ల వరకు ఉప్పునీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడు కూడా ఇదే జరిగితే కూనవరం డ్రెయిన్ పరిధిలో మొత్తం సాగు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది కాలువల మరమ్మతులు, వంతెనల నిర్మాణాల పేరుతో కాలువలకు గట్లు వేయడం వల్ల చేలకు ఇంకా సాగునీరు చేరలేదు. సాగు కాలం ఆలస్యమవుతున్నందున చాలా మంది రైతులు సాగు విరమణ ఆలోచనలలో ఉన్నారు. ఇప్పుడు మురుగునీరు దిగకపోవడానికి తోడు ఉప్పునీరు చొచ్చుకు వస్తుండడం చూసి సాగు చేసే ఆలోచనలో ఉన్న కొద్దిమంది రైతులూ భయపడుతున్నారు. వరి, కొబ్బరి రైతులకు అపార నష్టం ఇప్పటివరకు ముంపు సమస్యతో తొలకరి సాగు చేయడానికి మాత్రమే ఇబ్బంది పడే వాళ్లం. కూనవరం మేజర్ డ్రైన్ మొగను అధికారుల ప్రమేయం లేకుండా తెరవడంతో సముద్రం నుంచి ఉప్పునీరు డ్రైన్లలోకి చేరుతుంది. దీనితో కూనవరం మేజర్ డ్రైవింగ్ గుండా నీరు ప్రవహించి పిల్ల కాలువలు పంట కాలువల్లో సైతం ఉప్పునీరు చేరి పంట పొలాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో దాళ్వా సాగుకు సైతం ఉపయోగపడకుండా భూములు ఉప్పుగా మారి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపించి రైతుల సాగుకు సహకరించాలి. – మంచం బాలకృష్ణ, రైతు గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం -
పైసలిస్తేనే పోస్టింగ్!
రీ వెరిఫికేషన్ పూర్తి కాకినాడ క్రైం: సచివాలయం ఏఎన్ఎంల నుంచి ఎంపీహెచ్ఏఎఫ్లుగా పదోన్నతులు పొందిన అభ్యర్థుల కౌన్సిలింగ్ రీవెరిఫికేషన్ బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన 390 మందికి కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహంనాయక్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. తాజా ప్రక్రియలో ఇద్దరు అనర్హులను, గత ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బృందాన్ని మోసగించి పదోన్నతులు పొందిన ఇద్దరు సచివాలయ ఏఎన్ఎంలను గుర్తించారు. ఓ ఏఎన్ఎం వివాహితురాలు అయినప్పటికీ అవివాహిత హోదాలో బదిలీ ప్రయోజనం పొందింది. మరో ఏఎన్ఎం ప్రొహిబిషన్ డిక్లేర్ కాకపోయినా బదిలీలకు హాజరై తనకు అనుకూలమైన స్థానాన్ని పొందింది. వీరద్దరిని డీఎంహెచ్ఓ బుధవారం నాటి రీవెరిఫికేషన్లో గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా 388 మందికి నియామక పత్రాలు అందజేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతుల కౌన్సెలింగ్లో అవినీతి జాతర సాగుతోంది. కొందరి అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కాసులిస్తేనే పదోన్నతులు, కోరుకున్న కుర్చీలు దక్కుతున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. పదోన్నతుల బాగోతంలో లక్షలు చేతులు మారాయి. సాధారణంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు తలా ఇంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇటువంటివన్నీ ఉద్యోగులు సంతృప్తి కోసం సంతోషంగా ఇస్తుంటారు. ఏ శాఖలో అయినా ఇదేమీ కొత్త కూడా కాదు. ఎటొచ్చీ పదోన్నతులకు ఒక రేటు, కోరుకున్న సీటు కోసం మరొక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడటమే ఈ సారి సంబంఽధిత శాఖలో హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతులు కాకినాడ డీఎంహెచ్ఓ నోడల్ అధికారి వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 830 సబ్ సెంటర్లలో సుమారు 400 సబ్ సెంటర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం గత ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో భార్య, భర్తలు, వితంతువులు, పెళ్లికాని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 60 మందికి పోస్టింగులు ఇచ్చారు. 340 సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలుగా పదోన్నతి కోసం క్యూ కట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జరిపిన కౌన్సెలింగ్కు ముందుగానే ఆ శాఖలోని కొందరు చేతివాటం చూపించారు. ఇందుకోసం ఒక రేటు కూడా నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. పదోన్నతి పొందిన వారికి సీటు కేటాయించే సందర్భంలో సొమ్ములు గుంజారు. రూ.4000 నుంచి రూ.5000 వంతున వసూలు చేశారు. ఇలా రూ.20 లక్షలు వరకు ముడుపులు వసూలుచేశారు. ఇందులో వైద్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒకరికి 50 శాతం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే దిగువ స్థాయి వారు 20 శాతం, క్షేత్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే వారికి 30 శాతం వంతున వాటాలు వేసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి కాకినాడలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఎపిడిమిక్ విభాగంలో మరొకరు, ఏఎన్ఎం సంఘంలో ముగ్గురు కలిసి ఈ మొత్తం అవినీతి బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టి సొమ్ము చేసుకున్నారు. పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్లో పెట్టి సొమ్ములు ఇచ్చిన వారికి కోరుకున్న పోస్టింగ్లు కట్టబేట్టేశారు. ఇలా పోస్టింగ్లు అందుకున్న వారి నుంచి రూ.30 వేలు వంతున వసూలు చేసి మూటగట్టేసుకున్నారు. ఇలా మరో తొమ్మిది లక్షలు ముడుపులు మెక్కి పోస్టింగ్లు ఇచ్చేశారనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఇలా సొమ్ములు తీసుకున్న వ్యవహారంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యుల వ్యహారాలు పర్యవేక్షించే ఒకరు, పరిపాలనా విభాగంలో మరొకరు సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ లంచావతారాలతో విసుగెత్తిపోయిన ఐదుగురు ఏఎన్ఎంలు వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ రీ కౌన్సెలింగ్ జరపాలని ఆదేశాలు చేశారు. దీంతో బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేలకు వేలు సొమ్ములు ముట్టచెప్పి పోస్టింగులు పొందిన వారి పరిస్థితి రీ కౌన్సెలింగ్తో కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. సొమ్ములు ఇచ్చి కోరుకున్న పోస్టింగులు పొందిన వారి స్థానాలు తాజా కౌన్సెలింగ్లో మారిపోతున్నాయి. దీంతో గత ఆదివారం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని సదరు సూత్రధారులపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. సొమ్ములు తిరిగి ఎలా ఇవ్వగలుగుతామని, ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని బుజ్జగిస్తున్నారు. రీ కౌన్సెలింగ్ పూర్తయ్యి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్ పోస్టుకో రేటు నిర్ణయం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పలువురు ఏఎన్ఎంలు ఆయన ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ సొమ్ము తిరిగి ఇవ్వాలని మెక్కిన వారిపై ఒత్తిడి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయడ్డారు. వారిని స్థానికులు చికిత్స కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెళ్తున్న కారు దుద్దుకూరు వద్ద అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో జావీద్, ఆయాష్ గాయపడగా స్థానికులు హైవే అంబులెన్స్లో వారిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. -
యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు
రాజానగరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మెగా యోగ’ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీ ఉన్న ‘నన్నయ’లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదే స్థాయిలో 16,123 మంది హాజరు కావడంతో, దీనిని ఒక రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సి.కె. రాయుడు, తాతా వెంకట వరప్రసాద్లు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలు, క్యాంపస్ల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్సలోకి ఎక్కడంతో పాటు యూనివర్సిటీ చరిత్రలో ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు మేథో సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో అవసరమన్నారు. యోగాసనాలతో అబ్బురపరిచారు యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్పెట్లపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వేసిన యోగాసనాలు ఆబ్బురపరిచాయి. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రతినిధుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల నుంచి 16,123 మంది హాజరు -
సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి
కోటికేశవరంలో విషాదం కోరుకొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం, సీతపల్లివాగులో స్నానానికి దిగి కోరుకొండ మండలం కోటికేశవరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులు 15 మంది బుధవారం వాగులోకి స్నానాలకు దిగారు. వారిలో పీతల రాకేష్ (25), గుమ్మడి హర్ష (25) వాగు ప్రవాహ వేగానికి కాలు జారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వాగులోని రాళ్లకు వారు బలంగా ఢీకొని మృతి చెందారు. వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ ముడే సింధూ దివ్య, ఆమె భర్త ముడే కామేష్ ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలకు పంచనామా తదితర కార్యకలాపాలు నిర్వహించారు. ఇసుక తవ్వుతున్న ఏడు పడవల సీజ్ తనిఖీల్లో జిల్లా మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తాళ్లపూడి: స్థానిక డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఏడు పడవలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, టాస్క్ఫోర్స్ ఎస్సై ఆంజనేయులు తదితరులు సాధారణ తనిఖీల్లో భాగంగా బోట్స్మన్ సొసైటీ సభ్యులు గోదావరిలో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఏడు పడవలను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందని వారు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పడవలను సీజ్ చేశామని తెలిపారు. కాగా ఇసుక తవ్వకాలు చేపట్టిన పడవలు ఎవరివన్న విషయమై సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. -
వేతనాల ఆలస్యం రివాజే!
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 18వ తేదీ వచ్చినా ఈ నెల జీతాల బిల్లు సిద్ధం చేసిన దాఖలాలు లేకపోవడంతో దేవస్థానంలోని 349 మంది కార్మికులు మూడో నెలలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిల్లు తయారై ఆడిట్కు వెళ్లి పాసై వస్తే అప్పుడు చెక్కుపై ఈఓ సంతకం చేయడం, దానిని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు బదలాయించడం, ఆయన సదరు కార్మికుల అకౌంట్లలో జమచేయడం ఈ ప్రక్రియంతా కనీసం వారం రోజుల ప్రహసనం. అంటే 25వ తేదీ దాటితే తప్ప కార్మికులకు మే నెల జీతాలు పడని పరిస్థితి. గత రెండు నెలలూ ఆలస్యమే.. ఆలయంలో కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం రివాజైపోయింది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 30న, ఏప్రిల్ నెల జీతాలు మే 28న చెల్లించారు. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి, మే 26న ప్రచురితమైన ‘వీరి కష్టం తుడిచేవారేరీ’ కథనాలకు స్పందించి అధికారులు ఆ తేదీలకై నా వారి అకౌంట్లలో జమ చేయగలిగారు. ఇందులో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.లక్ష కోత పెట్టి రూ.58 లక్షలు విడుదల చేశారు. అయితే మొత్తం నిధులు వస్తేకానీ చెల్లించనని కాంట్రాక్టర్ చెప్పడంతో జూన్ ఒకటో తేదీకి కానీ జమ చేయలేదు. కాంట్రాక్టర్ వల్లే ఆలస్యం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ సకాలంలో పీఎఫ్ జమ చేయకపోవడం, బిల్లు అందచేయకపోవడం వల్లే జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందని అధికారులు పదే పదే చెప్తున్నారు. ఏజెన్సీకి స్థోమత లేకపోయినా.. హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లకు పైగా దేవస్థానంలో పారిశుధ్య విధులు నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెల పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థను కాంట్రాక్టుకు ఎంపిక చేసే వరకు విధులు కొనసాగించాలని అధికారులు కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కాంట్రాక్టు కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆ కాంట్రాక్టు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్ధకు 349 మందికి జీతాలు ఇచ్చే స్థోమత లేకపోయినా అధికారులు నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టుగా హడావిడిగా విధులు కట్టబెట్టారు. దీంతో ఆ సంస్థపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేని పరిస్థితిని అధికారులే కల్పించుకున్నారు. కానీ సకాలంలో జీతాలు అందక పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రత్నగిరిపై కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు వరుసగా మూడో నెలా ఆలస్యం సగం నెల దాటినా సిద్ధం కాని బిల్లు -
మరిడమ్మ జాతరకు పటిష్ట భద్రత
కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీహరిరాజు కరప: ఈనెల 25వ తేదీ నుంచి 40 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు అసౌక్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తునకు కరప ఎస్ఐ టి.సునీతతో చర్చించేందుకు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురంలో అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్యూలైన్లు, వివిధ శాఖల సమన్వయంపై ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తు బాలిక అదృశ్యం కేసుపై ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు డీఎస్పీని కలసి తమగోడు వినిపించారు. బాలికను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్న యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. కిడ్నాప్ కేసుతో పాటు, పోక్సో కేసు పెట్టాల్సి ఉంటుందని, ఎక్కడున్నా వెంటనే సమాచారం చెప్పాలని యువకుడి తండ్రికి డీఎస్పీ సూచించారు. ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. బాలిక అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాలిక వివరాల ముఖ్యమైన నగరాల్లోని పోలీసులకు పంపినట్టు ఆయన తెలిపారు. అనంతరం కరపలోని పురాతన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. అర్చకులు విలపర్తి శ్రీనివాస్, విలపర్తి సత్యకృష్ణ, పెద్దింటి గోపాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చారు. -
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఇద్దరు ఖైదీలు విడుదలయ్యారు. ఆ వివరాలను సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఖైదీలు విడుదల కాగా వారిలో రాజమహేంద్రవరం సెంట్రల్ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. వారిలో కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన కోనేటి సత్తిబాబు, గజ్జవరపు మురళీకృష్ణ ఉన్నారు. వీరు హత్య కేసులో జైలుకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 17 నాటికి అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇద్దరు ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం ఇచ్చి విడుదల చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్స్టేషన్లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చేనుకు చేప మందు
ప్రయోజనాలు ఇవే.. ● ఫిష్ అమినో యాసిడ్లో నత్రజని శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. ● స్వల్ప కాలిక పంటలైన కూరగాయలు, వరి, పప్పు దినుసులకు మొదటి 40 రోజులు చాలా కీలకమైనవి. వాటి పెరుగుదల పైన మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే యూరియా, డీఏపీ ఎరువుల కంటే ఎక్కువ బలాన్ని పంటకు ఇస్తుంది. ● 40 రోజుల తర్వాత పది రోజులకు ఒకసారి ఇతర ద్రవాలతో కలిపి దీనిని వాడుకోవచ్చు. దీనిని వాడడం వల్ల మొక్క ఆకులు బాగా పచ్చబడటం, కొమ్మలు బాగా రావటం, కాయ సైజు బాగా పెరగడం జరుగుతుంది. ● నత్రజనితో పాటు ఇతర పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె ఎక్కువ మొత్తంలో వస్తుంది. పిఠాపురం: సాధారణంగా ఉబ్బసానికి చేప మందు వేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేపలతో చేలకు మందు తయారు చేస్తున్నారు. దాన్నే ఫిష్ అమినో యాసిడ్ మీనామృతం అని పిలుస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలోని గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది అధిక మొత్తంలో మీనామృతం తయారీ చేపట్టారు. రోజుకు 300 లీటర్ల మీనామృతం తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. మీనామృతం తయారీఽ విధానాన్ని ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. మీనామృతం మీనామృతం తయారీకి చేపలు, బెల్లం, బొగ్గు, దేశీయ ఆవు మూత్రం అవసరమవుతుంది. ముందుగా చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేప లోపలి భాగాలను కూడా వినియోగించుకోవచ్చు. వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. ముందుగా కత్తిరించిన చేపలు ఎన్ని కేజీలున్నాయో తూకం వేసి సిద్ధం చేసుకోవాలి. అంతే మొత్తంలో బెల్లాన్ని దగ్గర పెట్టుకోవాలి. బెల్లాన్ని పొడిగా దంచుకోవాలి. 200 లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ములు తీసుకోవాలి. వాటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మీనామృతం కలపడానికి ఒక పెద్ద గిన్నె లేదా టబ్ అవసరం. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తయారీ విధానం పెద్ద గిన్నె లేదా టబ్లో 10 కేజీల చేపలు, 10 కేజీల బెల్లం, 100 గ్రాముల బొగ్గు పొడి, ఒక లీటర్ ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎన్ని కేజీల చేపలు ఉంటే అన్నిసార్లు కలుపుకొని డ్రమ్ములో వేసుకోవాలి. వీటిని కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి. తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే చేపలు ఎన్ని ఉన్నాయో అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా డ్రమ్ములు సిద్ధం చేసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి డ్రమ్ములో కలిపిన చేపలు వేసినప్పుడు 60 శాతం మాత్రమే నింపాలి. లేకపోతే రెండో రోజు పొంగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ము 60 శాతం నింపిన తరువాత దానిని కప్పేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ సంచితో మూతిని గట్టిగా కట్టాలి. దీన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో ఐదు నిమిషాల పాటు కర్రతో కలుపుతూ ఉండాలి. అనంతరం కర్రను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి, దానితో ద్రవాన్ని కలిపినప్పుడు పురుగులు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ద్రవాన్ని కలిపిన అనంతరం డ్రమ్ముకు కవర్ కట్టి వేయాలి. ఇలా 20 నుంచి 25 రోజులలో ద్రావణం తయారవుతుంది. సుమారు 20 రోజుల తర్వాత ద్రావణం నుంచి తాటి పండు వాసన వస్తుంది. అలా వాసన వస్తే ద్రావణం ఉపయోగించడానికి వీలుగా తయారైనట్లు గుర్తించాలి. ఉపయోగించే విధానం మొక్కలు నారుదశలో ఉన్నప్పుడు వంద లీటర్ల నీటికి 250 గ్రాముల ద్రావణం సరిపోతుంది. చిన్న మొక్కలైతే 500 గ్రాములు, పెద్దవైతే ఒక కేజీ వరకూ వాడుకోవచ్చు. స్ప్రే చేసినప్పుడు ఫలితం తొందరగా కనిపిస్తుంది. ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకూ ఉపయోగించుకోవాలి. ఈ ఫిష్ అమినో యాసిడ్ నీటిలో కలిపే ముందు ఒక కేజీ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో బాగా కలుపుకొని, ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో చేపలతో మీనామృతం తయారీ దుర్గాడలో ఖరీఫ్కు సిద్ధమవుతున్న ద్రావణం -
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చాగల్లు: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు – పంగిడి రహదారిలోని ఎస్.ముప్పవరం శివారులో ఇసుక ట్రాక్టర్ ఆగి ఉంది. దాన్ని పోలవరం నుంచి నిడదవోలు వెళుతున్న నిడదవోలు డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అలాగే బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ అయ్యి సమీపంలో ఇంటి గేటును ఢీకొని ట్రక్కు బొల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన జి.వీర వెంకట సత్యనారాయణతో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో వారిని మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు చేరవేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వేస్ట్ ఆయిల్ ప్యూరిఫై యూనిట్లో తనిఖీలు
కాకినాడ రూరల్: సర్పవరం ఆటోనగర్లో వేస్ట్ ఆయిల్ను ప్యూరిఫై చేసి సెకండ్ గ్రేడ్ ఆయిల్, గ్రేజ్ తయారు చేసే ఎస్ఏఎఫ్ పెట్రోలియం యూనిట్పై విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, విజిలెన్స్ సీఐలు, కాకినాడ సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ సప్లయి అధికారి ప్రసన్న లక్ష్మీదేవి, అర్బన్ టీపీ అనిల్ కుమార్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చైన్నె నుంచి ట్యాంకర్లో తీసుకువచ్చిన టర్పెన్టైన్ను గుర్తించారు. జీఎస్టీ బిల్లులు ఉన్నప్పటికి టర్పెన్టైన్లో పెట్రోలియం కంటెంట్ ఉండడంతో వాహనంతో సహా 25 వేల లీటర్ల సరుకు ఉన్నట్టు గుర్తించారు. టర్పెన్టైన్ ఉన్న వాహనంతో పాటు మరో ఖాళీ వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాలు, సరకు విలువ సుమారు రూ.75 లక్షలు అధికారులు తెలిపారు. -
‘నన్నయ’ రిజిస్ట్రార్గా సుధాకర్ పదవీ విరమణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టార్గా ఆచార్య జి.సుధాకర్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 నుంచి రిజిస్ట్రార్గా సుధాకర్ విశిష్ట సేవలందించారన్నారు. ‘నన్నయ’ యూనివర్సిటీ అభివృద్ధిలో ఒక రిజిస్ట్రార్గా భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని ఆచార్య సుధాకర్ పేర్కొన్నారు. కాగా.. సుధాకర్ ఇక నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో హ్యుమన్ జెనిటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలావుండగా ‘నన్నయ’ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా అకడమిక్ డీన్ ఆచార్య కేవీ స్వామిని నియమిస్తూ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయశాఖ ఆస్తులను పరిరక్షించాలి బోట్క్లబ్ (కాకినాడ): ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురైతే కోర్టులో కేసులు దాఖలు చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలోని ఆలయ, సత్రాలకు సంబంధించిన ఈవోలతో మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవదాయశాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా ఆలయ ఈఓ, సత్రాల ఈవోలపైనే ఉందన్నారు. నగరం పరిధిలో ఉన్న ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములు, ఖాళీ స్థలాలు అన్నీ ఆన్లైన్లో ఆయా సత్రాలు, ఆలయాల పేరున ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. భూములు ఏమైనా ఆక్రమణలో ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
కోనసీమ కళ .. పూరీలో భళా..
కొత్తపేట: కోనసీమకు చెందిన గరగనాట్యం, వీరనాట్యం కళాబృందాల ప్రదర్శనలకు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్ (జానపద జాతర)లో విశేష గుర్తింపు లభించింది. ఆ ఫెస్టివల్లో భాగంగా వెస్ట్ జోన్ కల్చరల్ ఉదయ్పూర్, సౌత్ జోన్ కల్చరల్ తంజావూరు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జానపద జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గరగ నాట్యం, వీరనాట్యం ప్రదర్శనలకు అవకాశం అభించింది. సోమవారం నిర్వహించిన ఆయా ప్రదర్శనల్లో ప్రసాద్తో పాటు 20 మంది ఆయా కళాబృందాలు తమ ప్రతిభను ప్రదర్శించి, నిర్వహకులను, ప్రముఖులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారులను ముఖ్యంగా టీమ్ లీడర్ ఏసు వెంకట ప్రసాద్.. ఒడిశా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపత్ర, తదితర ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ బృందాలను గుర్తించి దేశ, విదేశాల్లో అవకాశాలు కల్పి స్తున్న రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ సీఈఓ మల్లికార్జునరావుకు కళాబృందాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తొమ్మిది మందికి రిమాండ్
ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి తొమ్మిది మంది నిందితులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండు విధించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యర్ర కాలనీ సమీపంలో ఈ నెల 15వ తేదీ రాత్రి పెనికేరుకు చెందిన కె.రోహిత్, చింతలూరుకు చెందిన పి.తేజ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ సందర్భంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై 15 మంది నిందితులను గుర్తించి సోమవారం కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఐ.ప్రవీణ్ కుమార్ 15 రోజుల రిమాండు విధించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వెళ్లింది 31 మంది... వచ్చింది 50 మంది నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సెలింగ్ పూర్తి కాకినాడ క్రైం: సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీజీహెచ్లోని కమ్యూనిటీ హాల్లో వెబ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షించారు. జీజీహెచ్లో తొలి నుంచి 24 ఖాళీ స్టాఫ్ నర్సుల పోస్టులు ఉండగా, ఉన్న వారి నుంచి 31 మంది బదిలీ అయ్యారు. దీంతో మొత్తం 55 ఖాళీలు ఏర్పడ్డాయి. మంగళవారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది స్టాఫ్ నర్సులు కొత్తగా కాకినాడ జీజీహెచ్కు బదిలీ అయ్యారు. దీంతో సింహభాగం భర్తీ అయి, మరో ఐదు ఖాళీలు మిగిలాయి. అలాగే, జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్సులు 9 మంది బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. స్టాఫ్ నర్సులకు పదోన్నతులు వచ్చే వరకు ఈ స్థానాలు భర్తీ అయ్యే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేషన్ సీనియారిటీని అనుసరించి బదిలీ అయిన వీరంతా రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లారు. అలాగే నర్సింగ్ ట్యూటర్లలో ఓ పోస్టు రిటెన్షన్ అయి దరఖాస్తుదారు అదే స్థానంలో కొనసాగనున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీలో భర్తీ అయ్యింది. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం – రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి కొడకల వెంకట రమణ (30) అనే వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన కొడకల వెంకటరమణ అనపర్తి మండలం పి.రామచంద్రాపురం కోళ్లఫారంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో సోమ వారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నానికి రైలులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు కావడంతో 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం
అమలాపురం టౌన్: అమలాపురం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన తల్లీ పిల్లలను (కుమార్తె, కుమారుడు) విశాఖపట్నం మద్దెలపాలెంలో పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేకే కన్నబిడ్డలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న తల్లీపిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తక్షణమే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లో అదృశ్యమైన ఆ కుటుంబాన్ని వెతికి పట్టుకున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల నరేష్ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హారతి తన బిడ్డలతో తొలుత మామిడికుదురు మండలం లూటుకుర్రులోని తన పుట్టింటికి స్కూటీపై వెళ్లడం, అక్కడ నుంచి అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్కు వచ్చి సైకిల్ స్టాండ్లో స్కూటీని పెట్టి అదృశ్యమైనట్లు పోలీసులు ఆ రోజు రాత్రే గుర్తించారు. విశాఖపట్నం బస్సు ఎక్కి వెళ్లిన ఆమె తన బిడ్దలతో మద్దెలపాలెంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నట్లు అమలాపురం పోలీసుల విచారణలో తేలింది. వారిని విశాఖ నుంచి అమలాపురం తీసుకుని వచ్చి బంధువులకు అప్పగించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై కేఎం జోషి, కానిస్టేబుల్ రాయు డు శ్రీను, ఐటీ కోర్ విభాగం కానిస్టేబుల్ జాఫర్ సాంకేతికత ఆధారంగా తల్లీపిల్లలను గుర్తించారు. తల్లి వద్దకు క్షేమంగా చేరిన బాలిక కాకినాడ రూరల్: చీడిగ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక చల్లా సత్య పావని అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆ బాలికను మంగళవారం ఇంద్రపాలెం పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న సత్యపావని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు రాత్రి అదృశ్యం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సై వీరబాబు ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలించారు. ఆ బాలిక ముందుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి సామర్లకోట వచ్చి, చివరకు రామచంద్రపురంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఇంద్రపాలెం తీసుకువచ్చి విచారించగా తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు పావని చెప్పింది. దీంతో బాలిక, ఆమె తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, అనంతరం అప్పగించారు. కాగా.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తల్లీపిల్లల ఆచూకీ లభ్యం భర్త వేధింపులు భరించలేకే పారిపోయినట్టు వెల్లడి -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాలుమూరి సాగర్, కానూరు అగ్రహారానికి చెందిన కర్సినపు ప్రవీణ్ కుమార్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం, కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తగరపు వెంకట్, వర్దణపు మణి తదితరులు మూడు కిలోల గంజాయిని రవాణా చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరందరూ పెరవలిలోని హిందూ శ్మశానవాటిక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. అనుమానంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి దొరికింది. దానితో పాటు రెండు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తణుకు కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. గంజాయి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు కోరుకొండ: గంజాయి కేసులో ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను కోరుకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు కేజీల గంజాయిని కోరుకొండ మండలం అయ్యన్నగళ్లు వద్ద పంచుకుంటుండగా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆ సమయంలో ఐదుగురు దొరికారని, ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ పరారయ్యాడన్నారు. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన నరేష్ కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలిపారు. కాగా.. నరేష్ను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్సై కూన నాగరాజు, కానిస్టేబుల్ ఉదయ భాస్కర్, ప్రసాద్ అభినందించారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు పాల్గొన్నారు. -
ఖాతారు చేయని సర్కారు!
సాక్షి, అమలాపురం: ఖరీఫ్ ముంచుకొస్తోంది. ఒకవైపు వాతావరణం చల్లబడింది. ప్రభుత్వం డెల్టా కాలువలకు ఆలస్యంగానైనా నీరు విడుదల చేసింది. మరో వారం, పది రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ నారుమళ్లు మొదలు కానున్నాయి. పెట్టుబడులకు రైతు చేతిలో చిల్లి గవ్వలేకుండా పోయింది. రబీ ధాన్యం సొమ్ము కోసం ఆయకట్టు రైతులు రోజుల తరబడి ఎదురు తెన్నులు చూస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులను నీరుగారుస్తోంది. ‘‘రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తాము. ఇది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉంచినట్టుగా ధాన్యం సొమ్ముకు రోజుల తరబడి బకాయిలు ఉంచము’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ పలు సందర్భాలలో సెలవిచ్చారు. రబీ ధాన్యం కొన్న మొదట్లో అలాగే చెల్లించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కొనుగోలు పెరిగిన తరువాత కూటమి ప్రభుత్వం ముసుగు తొలగించింది. రోజుల తరబడి సొమ్ము చెల్లించకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. జిల్లాలో 1,64,854 ఎకరాల్లో రబీ సాగు జరగగా, 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆయా కేంద్రాలకు టార్గెట్లను కుదించింది. రైతుల వద్ద సగం ధాన్యం ఉన్నా సరే ఆయా కేంద్రాలలో టార్గెట్లు అయిపోయాయని కొనుగోలు నిలుపుదల చేశారు. దీనితో మిల్లర్లను, దళారులను ఆశ్రయించాల్సి రావడం, ఇదే అదనుగా కనీస మద్దతు ధర సాధారణ రకం బస్తా (75 కేజీలు) రూ.1,720 ఉండగా వారు రూ.1,400, రూ.1,500 చేసి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మండపేట, రాజోలు, అమలాపురం వంటి ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యంతో రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో ధాన్యం సేకరణ లక్ష్యం మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదు. కొనుగోలు లేదు... చెల్లింపు లేదు జిల్లాలో ఇప్పటి వరకు 2,69,375.360 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనిలో 499.840 మెట్రిక్ టన్నులు గ్రేడ్– ఏ రకం కాగా, 2,68,875.520 మెట్రిక్ టన్నులు సాధారణ రకం. మొత్తం ధాన్యం విలువ రూ.613.08 కోట్లు కాగా, ఇప్పటి వరకు రైతులకు రూ.364.43 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.248.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో రూ.246.94 కోట్లు బిల్లులు ఆమోదించి చెల్లింపుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. సాంకేతిక కారణాల వల్ల రూ.1.20 కోట్ల చెల్లింపులను బ్యాంకులు వెనక్కు పంపాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మే నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత మే నెలలో ఇదే సమయానికి రైతులకు ఉన్న ధాన్యం బకాయిలు రూ.167 కోట్లు ఉండగా సోమవారం నాటికి ఇది రూ.248.65 కోట్లకు పెరిగింది. ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో ధాన్యం సొమ్ము చెల్లించపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే రబీ కోతలకు పెద్ద ఎత్తున అప్పులు చేశామని వారు చెబుతున్నారు. ‘‘ధాన్యం షావుకార్లు, మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు చేస్తే మంచి ధర వస్తుందని భావించాము. అప్పులు చేసి నూర్పిడులు పూర్తి చేశాము. కాని 45 రోజులుగా సొమ్ము వేయడం లేదు. వచ్చే కొద్దిపాటి లాభం చేసిన అప్పులకు, చెల్లించే వడ్డీకి సరిపోతోంది’ అని రైతులు వాపోతున్నారు. గతంలో ఇన్ని రోజుల పాటు ధాన్యం సొమ్ము బకాయిలు ఉంచిన దాఖలాలు లేవని వారు చెబుతున్నారు. బ్యాంకుల అప్పులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పద్దులను ఓవర్ డ్యూలో పెడుతున్నారని, ముందు ముందు బ్యాంకు అప్పులు కూడా పుట్టవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సొమ్ము బకాయిలపై కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జూన్ మూడవ వారం వచ్చినా సొమ్ము ఇవ్వరా? జిల్లాలో ధాన్యం సొమ్ము చెల్లింపును మే 8వ తేదీ నుంచి నిలిపివేశారు. దీనివల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ పెట్టుబడులకు సైతం అప్పులు చేయాల్సి వస్తోంది. నూర్పిడులకు చేసిన అప్పులకు వడ్డీలే కట్టాలా? ఖరీఫ్ కోసం మరోసారి అప్పులు చేయాలా? అనే మీమాంస రైతులలో నెలకొంది. ప్రభుత్వం తక్షణం ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. – యాళ్ల బ్రహ్మానందం, అధ్యక్షుడు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి కె.గంగవరంలో ధాన్యం కొనుగోలు ధాన్యం అమ్మకాలు చేసి నెలన్నరకు పైగా.. నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు జిల్లాలో 2.69 మెట్రిక్ టన్నుల కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.613.08 కోట్లు రైతులకు చెల్లించింది రూ.364.43 కోట్లు ఇంకా చెల్లించాల్సింది రూ.248.65 కోట్లు ఖరీఫ్ పెట్టుబడులకు సొమ్ము లేదు రబీ అప్పులకు పెరుగుతున్న వడ్డీ ఓవర్ డ్యూలోకి పోతున్న బ్యాంకు ఖాతాలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన కోనసీమ రైతు పరిరక్షణ సమితి -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● రత్నగిరిపై సత్రాలకు ఎట్టకేలకు మరమ్మతులు ● రూ.1.20 కోట్లతో పనులు ● రెండు నెలల్లో పూర్తి అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ సత్రాల మరమ్మతులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి. రూ.1.20 కోట్లతో న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాల్లో ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఈఓ వీర్ల సుబ్బారావు పరిశీలించారు. ఆయా సత్రాల్లో చేపడుతున్న పనుల గురించి ఆయనకు ఈఈ వి.రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, టెండర్ షరతుల ప్రకారం ఈ మూడు సత్రాల్లో మరమ్మతులు పూర్తి చేయడానికి మూడు నెలల గడువుందని చెప్పారు. అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఈఓ ఆదేశించారన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూఢమి, దానికి తోడు ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు. అందువలన ఈ సమయంలో భక్తులు పెద్దగా రారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆలోగా సత్రాల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సగం గదుల్లో సమస్యలు దేవస్థానంలో హరిహర సదన్, శివసదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ, ప్రకాష్ సదన్, శ్రీ సీతారామ సత్రం, కొండ దిగువన సత్య నికేతన్ సత్రాలున్నాయి. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ గదులు 620 ఉన్నాయి. వీటిలో సుమారు 120 గదులు పాడై, అద్దెకిచ్చేందుకు ఏమాత్రం వీలుగా లేవు. మరో 150 గదుల్లో ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సరిగా లేవు. ప్రకాష్ సదన్ వంటి సత్రాల్లో బస చేసిన భక్తులు ఆ గదుల్లో ఉండలేక రాత్రికి రాత్రే ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి మరమ్మత్తులు చేయించాలని చాలా కాలం నుంచి భక్తులు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్రాల గదులకు మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించి, అంచనాలు రూపొందించారు. తొలుత రూ.40 లక్షలతో హరిహర సదన్ సత్రంలో గదులకు మరమ్మత్తులు పూర్తి చేసి, రంగులు వేయించారు. తరువాత న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాలకు మరమ్మత్తులు చేయించేయించాలని నిర్ణయించి, రూ.40 లక్షల చొప్పున అంచనాలు రూపొందించి, టెండర్లు ఖరారు చేశారు. ● ఓల్డ్ సెంటినరీ సత్రం: దీనిని నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఇందులో 48 గదులున్నాయి. పెళ్లి బృందాల వారు ఇక్కడ గదులు రిజర్వ్ చేసుకుని, సత్రం ఆవరణలో వివాహాలు చేసుకుంటారు. ఈ సత్రం గదులకు పెయింట్లు వేసి చాలా కాలమైంది. డోర్లు, కిటికీలు, వాటర్ పైప్లైన్లు, బాత్రూముల్లో ఫిట్టింగ్స్ పగిలిపోయాయి. నీరు లీకవుతూండటంతో డ్రైనేజీ పైప్లైన్లకు నాచు పట్టింది. కొన్నిచోట్ల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ● న్యూ సెంటినరీ సత్రం: సుమారు 28 ఏళ్ల కిందట నిర్మించిన ఈ సత్రంలో కూడా 48 గదులున్నాయి. వివాహాది శుభకార్యాలకు భక్తులు గదులు రిజర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఓల్డ్ సెంటినరీ సత్రం మాదిరిగానే సమస్యలున్నాయి. ● ప్రకాష్ సదన్ సత్రం: వీఐపీ సత్రంగా పేరొందిన ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. 86 గదులున్నాయి. గదికి రూ.వెయ్యి చొప్పున రోజుకు రూ.86 వేల మేర అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉండటం, దగ్గర్లోనే క్యాంటీన్, పార్కింగ్ సదుపాయాలుండటంతో ఈ సత్రంలో బస చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులోని పలు గదుల్లో కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. -
ఇంటర్ తరువాత కోర్సుల ఎంపికే కీలకం
● మూడు, నాలుగేళ్లు కష్టపడితే ఆనందమయ జీవితం ● సంప్రదాయ డిగ్రీ కోర్సులతోనూ ఉపాధి రాయవరం: ఇంటర్ తర్వాత ఏ కోర్సు చదవాలి! ఏ రంగంలో స్థిరపడాలనే సందేహాలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తుంటాయి. తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోకుండా విద్యార్థులు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో 9,246 మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన మరో ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందారు. వీరిలో 70 శాతం మేరకు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనా. ఇంటర్ తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు ఇవీ.. వైద్య విద్య ఇంటర్లో బైపీసీ చదివేవారు వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశముంది. నీట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్ సీటు లభిస్తుంది. వైద్య విద్య పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యులుగా స్థిరపడవచ్చు. సీఏతో సీఏ (చార్టర్ అకౌంటింగ్) మంచి ఉపాధినిచ్చే కోర్సు. ఇంటర్ తరువాత సీపీటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించి, ఐపీసీఏలో చేరవచ్చు. ఇది నాలుగున్నర సంవత్సరాల కోర్సు. కామర్స్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ను బీకామ్ ఆనర్స్ అని కూడా పిలుస్తారు. ఇంంటర్లో కామర్స్ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో బీకామ్ ప్రవేశానికి సీయుఈటీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, బీమా రంగాల్లో కెరీర్ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు బీకామ్ అకౌంటింగ్, టాక్సేషన్ తీసుకోవాలి. బీకామ్ కోర్సు పాఠ్యాంశాల్లో ఇండియన్ టాక్స్ సిస్టమ్, ఫైనాన్సియల్ అకౌంటింగ్, వాల్యూయాడెడ్ టాక్స్, సెంట్రల్ టాక్స్ ప్రొసీజర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్ ఉంటాయి. బీబీఏ, బీసీఏ, సీఏ, సీఎస్ తదితర వృత్తిపరమైన కోర్సులను చదవడానికి వీలుంది. డిగ్రీతో బోలెడు అవకాశాలు సీయూ సెట్ రాసి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం గల విశ్వవిద్యాలయాల్లో హ్యూమన్ సైన్సు కోర్సులు చదవచ్చు. మన రాష్ట్రంలో బీఏతో పాటు బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంది. బీఎస్సీ కంప్యూటర్ కోర్సుకు కూడా డిమాండ్ ఉంది. డిగ్రీ చదివే విద్యార్థులకు నైపుణ్యాల పెంపుపై వివిధ యూనివర్శిటీలు దృష్టి సారించాయి. ఇప్పుడిప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలలో డిగ్రీ చదివే విద్యార్థులు కూడా అవకాశాలు పొందుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునేవారు డీఈడీ పూర్తి చేసి అవకాశాలు పొందవచ్చు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐదేళ్ల కోర్సులకు చెందిన ప్రవేశ పరీక్షలు రాసి ఇంటర్ తరువాత న్యాయ విద్యను అభ్యసించవచ్చు. ఫార్మసీకి ప్రాధాన్యముంది ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫార్మసీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఏపీ ఈఏపీసెట్తో బి–ఫార్మసీ ప్రవేశాలు జరుగుతాయి. ఇది పూర్తి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, హాస్సిటల్ ఫార్మాసిస్టులుగా ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయం, ఉద్యానం ఏపీ ఈఏపీసెట్తోనే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ చదివే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల ఈ కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సింగ్తో స్వయం ఉపాధి ఇంటర్ బైపీసీ విద్యార్థులకు నర్సింగ్ చక్కని అవకాశం. ఈ కోర్సుతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్ తరువాత నాలుగేళ్ల కోర్సును ఎంపిక చేసుకుంటే మహిళలకు మంచి అవకాశాలు ఉంటాయి. రెండేళ్ల ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్తో ఉజ్వల భవిత పెయింటింగ్, శిల్పకళ, ప్రింట్ మేకింగ్, విజువల్ కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, ఆర్ట్ హిస్టరీ వంటి విభాగాల్లో శిక్షణ పొందడానికి ఫైన్ ఆర్ట్స్ కోర్సులు ఉపకరిస్తాయి. ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన అనంతరం విద్యార్థులు గ్యాలరీలు, మ్యూజియం, మీడియా సంస్థలు, విద్యారంగం తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. డిగ్రీ కోర్సులతో ఉపాధి ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సులతో ఉపాధి పొందడానికి వీలుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎంప్లాయిబిలిటీ కోర్సులు ప్రవేశ పెట్టారు. వీటికి డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటుగా, ఆక్వా కల్చర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను కలిపి డిగ్రీ చేసుకునే వెసులుబాటు ఉంది. – డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం ఇంజినీరింగ్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఏపీ ఈఏపీసెట్లో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధాన్యం అధికం. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఏఐ, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. ఐఐటీ, ఎన్ఐటీలో చేరి ఇంజినీరింగ్ చేస్తే డిగ్రీ పూర్తయ్యేలోగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వూల్లో ఆఫర్లు వస్తున్నాయి. -
తాళ్లరేవు సీహెచ్సీ సూపరింటెండెంట్ స్నేహలత సస్పెన్షన్
తాళ్లరేవు: స్థానిక సీహెచ్సీ సూపరింటెండెంట్ ఆర్.స్నేహలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తాడేపల్లి విజిలెన్స్ విభాగం డీఎస్హెచ్ నుంచి ఉత్తర్వులు ఆస్పత్రికి అందాయి. ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి రెండో కాన్పుగా జన్మించిన పసికందు మృతి చెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ స్నేహలత, స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని, వారిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో మాట్లాడి, విచారణ నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా అదేరోజు బాధ్యులైన నర్సులను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్ స్నేహలతను సోమవారం సస్పెండ్ చేశారు. ప్రసవానికి ముందు కేసును సరిగ్గా అనుసరించకపోవడం, రోగికి జ్వరం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, అటెండర్ల కాల్కు వెంటనే స్పందించకపోవడం, కేసు షీట్ను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!
ఖరీఫ్ ఆలస్యమైతే సాగుకు దూరం గత నెల చివరి వారంలో నైరుతి రాకముందే తొలకరి వర్షాలు జిల్లాలో కురిసాయి. నాలుగు రోజుల పాటు వర్షాలు పడడంతో ఖరీఫ్కు వరుణుడు శుభారంభం పలికినట్టు రైతులు ఆశించారు. తిరిగి నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరందితే రైతులు నారుమడులు వేసుకునేందుకు దుక్కులు ప్రారంభించేవారు. కాని కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులకు నారుమడులు పోసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది మరింత ఆలస్యమైతే రైతులు సాగు విరమించుకునే ప్రమాదం కూడా ఉంది. ముందస్తు సాగు చేయకపోతే మునిగిపోతాం డెల్టా శివారుల్లో... మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ముందస్తు సాగు చేయకుంటే చేలు ముంపు బారిన పడతాయి. ఈ కారణంగానే మా ఆయకట్టు రైతులు తొలి పంటకు దూరమవుతున్నారు. అటువంటిది ఇప్పటి వరకు కాలువలకు నీరు ఇవ్వకుంటే సాగు ముందుకు ఎలా సాగుతుంది. అధికారులు అర్థం చేసుకోవాలి. – బొక్కా శ్రీనివాస్, రైతు, అల్లవరం ● అసలు గడువు కన్నా ఆలస్యంగా నీటి విడుదల ● మధ్య డెల్టాలో శివారులకు చేరని వైనం ● ఇప్పటికీ ప్రధాన కాలువకు 700 క్యూసెక్కులే ● ఇంకా పంట కాలువల మీద ‘సాగుతూ...’నే ఉన్న పనులు ● పంట కాలువలు క్లోజ్ చేసింది ఏప్రిల్ 27న ● పనులకు అనుమతి వచ్చింది మే నెలాఖరున ● ఖరీఫ్కు పలువురు రైతులు దూరమయ్యే ప్రమాదం సాక్షి, అమలాపురం: మధ్య డెల్టా (కోనసీమ సీమ)లో ఖరీఫ్ సాగుకు ప్రధాన అవరోధం ముంపు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య ఈశాన్య రుతుపవనాలు... బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల వల్ల ఖరీఫ్ పంట ముంపుబారిన పడడం సర్వసాధారణంగా మారింది. ఈ కారణంగా ఇక్కడ ముందస్తు సాగు చేయడం ద్వారా భారీ వర్షాలు.. తుపాన్ల బారి నుంచి పంటను రక్షించుకునే అవకాశముంది. దీనిని గుర్తించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది. కూటమి ప్రభుత్వం మాత్రం జూన్ 15 దాటినా మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకుండా ఆయకట్టు రైతులకు ఖరీఫ్ను దూరం చేస్తోంది. జిల్లాలో 2,52,742 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉండగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు. దీనిలో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోందని అంచనా. ఇందులో మధ్యడెల్టా పరిధి (పాత కోనసీమ ప్రాంతం)లో సుమారు 1.10 లక్షల ఎకరాలు ఉంటుంది. దీనిలో ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో శివారు ఆయకట్టు అధికం. ఇక్కడ ఏడు మండలాల్లో 60 వేల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉందని అంచనా. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారడంతో కొద్ది పాటి వర్షానికే వరి చేలు రోజుల తరబడి నీట మునగడం, పంట నష్టపోవడం పరిపాటి. ఈ కారణంగానే రైతులు ఏటా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు దూరమవుతున్నారు. ఏటా తొలకరి సాగు వదిలేసే రైతుల సంఖ్య.. ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు పంపిణీ చేయాలనే నిర్ణయం వెనుక ముంపు ఒక కారణం. మూడేళ్ల కాలంలో గోదావరి డెల్టాలో ముందస్తు సాగుకు అనుకూలంగా జూన్ 1వ తేదీన పంట కాలువలకు నీరు విడుదల చేసేవారు. గత ఏడాది సాధారణ ఎన్నికల హడావుడిలో అధికారులు ఉన్నా జూన్ 1న నీరు వదిలారు. ఇప్పుడు కూడా మధ్య డెల్టాకు ఒకటవ తేదీన సాగునీరు వదిలారు. అయితే తొలి పది రోజులు మధ్యడెల్టాకు కేవలం 100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 12వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు నీరు పెంచారు. ఆదివారం 700, సోమవారం 1,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మధ్య డెల్టా పరిధిలో ముక్తేశ్వరం కాలువకు అయినవిల్లి మండలం చింతనలంక లాకుల దిగువకు నీరు వదలడం లేదు. అమలాపురం నడిపూడి లాకుల వద్ద నుంచి బెండాకెనాల్కు నీరు వదలడం లేదు. అమలాపురం నుంచి చల్లపల్లి కాలువకు నీరు వదిలినా అది కూడా అరకొరగానే. మొత్తమ్మీద మధ్య డెల్టా ప్రతి శివారు ప్రాంతంలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మే నెల చివరిలో క్లోజర్కు అనుమతులు గోదావరి డెల్టాలో ఈ ఏడాది క్లోజర్ సమయంలో చేపట్టిన పనుల విలువ రూ.5.50 కోట్లు మించి లేదు. ఇందులో డ్రైనేజీ విభాగంగా రూ.2.50 కోట్లతో ఆత్రేయపురం మండలంలో సైఫన్ నిర్మాణాలు చేపట్టగా, మిగిలిన నిధులతో ఇరిగేషన్ రెగ్యులర్ విభాగం అరకొర పనులు చేపట్టింది. వీటిలో పంట కాలువల్లో పూడిక తీత, చిన్నచిన్న మరమ్మతులు ఉన్నాయి. డెల్టా ప్రధాన పంట కాలువలను ఏప్రిల్ 15తో మూసివేస్తామన్న అధికారులు రైతుల కోరిక మేరకు 20వ తేదీ వరకు పెంచారు. తరువాత చేపల సాగు చేసే రైతులు కాసులు చెల్లించడంతో గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ ఏప్రిల్ 27వ తేదీ వరకు నీరు విడుదల చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలువలు మూసివేశారు. కాలువలపై చేపట్టిన అరకొర పనులకు అప్పటికే అనుమతులు ఇచ్చి ఉంటే కాలువలు ఎండిపోయిన తరువాత కనీసం మే 15 నుంచి అయినా పనులు మొదలు పెట్టేవారు. కానీ ఈ పనులకు మే నెలాఖరున అనుమతులు మంజూరు చేయడం విశేషం. ఈ కారణంగా జూన్ ఒకటి తరువాత పనులు మొదలు పెట్టారు. పది కల్లా పూర్తి చేస్తామని చెప్పి చేయకపోవడంతో కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయలేదు. దీనివల్లే ఇంకా పూర్తిస్థాయిలో పంట కాలువల ద్వారా నీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఇది మధ్యడెల్టా శివారుల్లో సాగు ఆలస్యం అవడానికి కారణమైంది. -
బ్రాందీషాపు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా
మామిడికుదురు: పెదపట్నం గ్రామంలోని ఏటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా బ్రాందీ షాపు ఏర్పాటుకు నిరసనగా సోమవారం స్థానికులు ధర్నా చేశారు. బ్రాందీ షాపు ఎదురుగా నిల్చుని నిరసన తెలిపారు. ఆలయం సమీపంలో నివాస గృహాల వద్ద బ్రాందీషాపు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. గతంలో ఇదే విధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు. అప్పట్లో ఈ షాపును వేరే చోట ఏర్పాటు చేశారని చెప్పారు. మళ్లీ ఇక్కడ బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వల్ల తాము నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. బ్రాందీ షాపు ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేశారు. నిరసనలో గెద్దాడ సందీప్, కుక్కల వేణు, గెద్దాడ సావిత్రి, చెల్లింగి సత్యనారాయణ, కుక్కల సక్కుబాయి, ముత్యాల సుబ్రహ్మణ్యం, కుక్కల నాగలక్ష్మి, అరిగెల కృష్ణవేణి, చెల్లింగి వరలక్ష్మి పాల్గొన్నారు. -
పెద్దాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెద్దాపురం: పట్టణ శివారు కట్టమూరు పుంత ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన జానకి సత్య శ్రీనివాస్ (వెంకన్నబాబు) (32)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... మృతుడు ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో మెడపై బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పగిలిన బీర్ బాటిళ్లు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమా.? మద్యం మత్తులో ఎవరైనా హత్య చేశారా? మరే ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్పై గతంలో హత్య, హత్యాయత్నంతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచాఉరం. పెద్దాపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ మౌనిక తెలిపారు. -
అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అర్జీలకు నూరు శాతం పరిష్కారం అమలాపురం రూరల్: అర్జీలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, ఎస్డీసీ కృష్ణమూర్తి, డీఎల్డీవో రాజేశ్వరరావు 255 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రజాసమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 15 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ అర్జీల స్వీకరించారు. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన పితాని వెంకటేశ్వరరావు తన దగ్గర బంధువుల నుంచి ఆస్తులపరంగా మోసానికి గురయ్యాయని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ తగాదాపై ఏఎస్పీ బాధితులతో చర్చించారు. అమలాపురంలో విలువైన స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న తన బంధువుల నుంచి తన స్థలాన్ని ఇప్పించాలని వెంకటేశ్వరరావు తన ఫిర్యాదులో కోరారు. భూ తగాదాలతోపాటు కుటుంబ వివాదాలకు చెందిన ఫిర్యాదులపై కూడా అర్జీదారులతో మాట్లాడారు. ఎస్సై గంగాభవాని కూడా పాల్గొన్నారు. -
‘సార్... ఇలా చేశారు’
నర్సింగ్ బదిలీలలో మాయాజాలంపై ఆర్డీ కలెక్టర్కు వివరణ కాకినాడ క్రైం: నర్సింగ్ బదిలీలలో నర్సింగ్ అసోసియేషన్ అగ్రనాయకత్వ మాయాజాలంపై కలెక్టర్ షణ్మోహన్ సీరియస్ అయ్యారు. బదిలీల ప్రయోజనాలను పొందేందుకు అసోసియేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న వారి పేర్లకి బదులు ఇతరులవి చేర్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీ డాక్టర్ పద్మశశిధర్ని ఆరా తీశారు. ఈ ఉదంతంపై పూర్తి వివరాలివ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివాదానికి సంబంధించి ఆది నుంచీ చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని ఆర్డీ వివరణాత్మకంగా కలెక్టర్కు అందించారు. ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై కలెక్టర్ అప్రమత్తమయ్యారు. తమకందుతున్న వివిధ యూనియన్ల లెటర్లలోని ఆఫీస్ బేరర్ల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ధారించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా కలెక్టర్ సూచనల మేరకు బాధ్యులపై చర్యలు చేపడతామని డాక్టర్ పద్మశశిధర్ అన్నారు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల ఘర్షణ ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో ఇరు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం స్థానిక పెద్ద కాలువ రోడ్డులోని ఎర్రకాలనీ వద్ద పలివెల తేజ, కొమ్ము రోహిత్ వర్గాల మధ్య ఆదివారం రాత్రి పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హత్యా ప్రయత్నం జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలోని రేకుల షెడ్డులో మేడిశెట్టి వెంకటరమణ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎస్ఐ వాసంశెట్టి రవిచంద్ర కుమార్ సోమవారం తెలిపారు. ఊలపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకటరమణ పందలపాక కోదండ రామ రైస్మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంట్లో రూ.100 అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను పనిచేసే రైస్మిల్లు ఎదురుగా ఉన్న షెడ్డులోకి వెళ్లి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రుమాలుతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఆయన కుమారుడు అజిత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించి, పంచానామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మార్కెట్లోకి సుజుకి కొత్త స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని కంటిపూడి సుజుకి షోరూంలో సోమవారం కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు సుజుకి న్యూ యాక్సెస్ 125 సీసీటీఎఫ్టీ ఎడిషన్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ వీలర్ విక్రయ రంగంలో సుజుకి ఆక్సిస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని. కొత్తగా లాంచ్ చేసిన టీఎఫ్టీ వాహనానికి సరికొత్త హంగులు, అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. కలర్ డిజిటల్ మీటర్, వెదర్ అలర్ట్, నావిగేషన్, మెసేజ్ అలర్ట్, వాట్సాప్ కాల్, మైలేజ్ రేంజ్, డెమో నైట్ మోడ్ లాస్ట్ పార్కింగ్ అలర్ట్, స్పీడ్ ఎక్సీడింగ్ అలెర్ట్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్ అని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, జి.ఎం రాజారావు, కస్టమర్లు, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం
వాడపల్లిలో యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ మహేష్కుమార్, ఎమ్మెల్యే బండారు తదితరులు కొత్తపేట: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆర్. మహేష్కుమార్ పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో డివిజన్ స్థాయి యోగాభ్యసనాల కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 45 నిమిషాల సరళ యోగా సనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. మహిళలకు, చిన్నారులకు యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ద్వారా శారీరక శక్తి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. అనంతరం ఆయుష్ వైద్యులు, ఓం శాంతి యోగా గురువులు వందలాది మందితో యోగాసనాలు వేయించారు. డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీఓ పీ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు. -
గోదావరిలో స్నానానికి దిగిన యువకుడి మృతి
● రెండో రోజు ఒడ్డున మృతదేహం లభ్యం ● కలసి వెళ్లిన మిగిలిన ఆరుగురు మిత్రులు సురక్షితం కరప/ఐ పోలవరం: ఆదివారం సరదాగా గడపడానికి వెళ్లిన ఏడుగురు స్నేహితులు గోదావరిలోకి స్నానానికి దిగగా, ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండో రోజు సోమవారం గోదావరి ఒడ్డున మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కరప గ్రామానికి చెందిన నరాల సాయికృష్ణ(19) మరో ఆరుగురు స్నేహితులతో కల్సి ఆదివారం సరదాగా గడపడానికి మోటార్ సైకిళ్లపై యానాం వెళ్లి, అక్కడి నుంచి ఎదుర్లంక వంతెన దాటివెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఒకరికొకరు సాయపడి ఒడ్డుకు చేరడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీరిలో సాయికృష్ణ గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడి, ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగురిని ఐ.పోలవరం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గల్లంతైన సాయికృష్ణ మృతదేహం రెండో రోజు సోమవారం ముమ్మిడివరం సమీపంలో గోదావరిలో మునిగిపోయిన ప్రాంతంలోనే పైకి తేలింది. రెండురోజులుగా తాత నరాల కృష్ణ(వెంటూరు కృష్ణ), తండ్రి నరాల బుజ్జి, బంధువులతో కల్సి కన్నీరు,మున్నీరుగా విలపిస్తూ గోదావరి ఒడ్డునే ఉండిపోయారు. ఎలాగైనా బతికిబయట పడతాడని ఎదురుచూశారు. తీరా శవమై తేలడంతో తాత, తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి వెళ్లి తన కూతురికి ఎలా చెప్పాలంటూ తాత కృష్ణ, తండ్రి బుజ్జి గుండెలు అవిసేలా విలపిస్తూ, కూలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కరప మండల యూత్ అధ్యక్షుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెంకే సత్తిబాబు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఘటనా స్థలానికెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పారు. గోదావరిలో గల్లంతైన సాయికృష్ణ స్వగ్రామం కరప గోదావరిలో గల్లంతైన యువకుడు నరాల సాయికృష్ణ స్వగ్రామం కరప. అతని తండ్రి బుజ్జి చిన్న హోటల్ నిర్వహిస్తాడు. తాత నరాల కృష్ణ భార్య కరప హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తుంటారు. తల్లి గృహిణి. వీరికి ఒక కుమారుడు సాయికృష్ణ ఇంటర్మీడియెట్ చదివాడు. కుమార్తె కరప హైస్కూలులో చదువుతోంది. కరప, శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులతో కల్సి యానాం మీదుగా వంతెన దాటి వెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఐ.పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో సోమవారం సాయంత్రం సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది. కరపలో విషాద ఛాయలు సాయికృష్ణ మృతితో కరపలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరినీ నవ్విస్తూ, కలుపుగోలుతనంగా ఉండే సాయికృష్ణ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లికి మరణవార్త తెలియనివ్వలేదు. -
కన్నుల పండువగా సాహితి అరంగేట్రం
గన్ఫౌండ్రీ: ప్రముఖ నాట్య శిక్షణాలయం జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నృత్య గురువు జ్యోతిరెడ్డి శిష్యురాలు సాహితీ పద్మప్రియ కూచిపూడి నాట్య రంగ ప్రవేశం సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పుష్పాంజలి, జతిస్వరం, అలరింపు, వర్ణం, థిల్లాన వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్ ఆనంద్ రాజేశ్వర్ బైవార్ మాట్లాడుతూ.. నేటి తరానికి శాసీ్త్ర య సంగీత కళలపై మక్కువ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ శాసీ్త్రయ కళలపై మక్కువ పెంచుకున్న సాహితి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇన్కమ్ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్వీ రెడ్డి, ఇన్కమ్ట్యాక్స్ (ఇన్వెస్టిగేషన్) ప్రైమరీ డైరెక్టర్ రాజ్గోపాల్ శర్మ తల్లిదండ్రులు మానస, ఐఆర్ఎస్ ఏపీ బాబు పాల్గొన్నారు. కొట్లాటకు నిలయాలుగా బ్రాందీషాపులు కోరుకొండ: మండలంలోని బ్రాందీషాపులు కొట్లాటలు, ఘర్షణలకు నిలయాలుగా తయారయ్యాయి. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కోరుకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జంభూపట్నం బ్రాందీషాపు వద్ద ఇద్దరు యువకులు గాయపడ్డారు. పశ్చిమగానుగూడెం గ్రామానికి చెందిన కాటుమళ్ల రాజశేఖర్ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బీరు సీసాలతో కొట్టారు. గాధరాడకు చెందిన చంద్రమళ్ల మహేష్ తలపై గుర్తుతెలియని వ్యక్తులు బీరుసీసాలతో మోదారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సైనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 0000648886-000001-Casual Advertis 10.00x8.00 Casual Advertisers -
ధాన్యం బకాయి సొమ్ము చెల్లించాలని వినతి
అమలాపురం రూరల్: గత మే నెలలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మంగెన నరసింహరావు, ఎరుబండి లక్ష్మయ్య, అప్పారి చిన వెంకట రమణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ 45 రోజులుగా ధాన్యం సొమ్ము రాలేదని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సూమారు రూ.250 కోట్లకుఽపైగా ధాన్యం బకాయిలు ఇవ్వాలని వారు తెలిపారు. ‘తల్లికి వందనం’కు కరెంటు షాక్ఈఆర్ఓ కార్యాలయానికి క్యూ కట్టిన జనం అమలాపురం రూరల్: తల్లికి వందనం పథకానికి విద్యుత్ షాక్ తగిలింది. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు అమలాపురం ఈదరపల్లిలో ఉన్న ఈఆర్ఓ కార్యాలయానికి సోమవారం క్యూ కట్టారు. తమ పేరున విద్యుత్ మీటర్లు లేవని, అయినా తల్లికి వందనం పథకాన్ని నిలిపివేశారని కొందరు వినియోగదారులు వాపోయారు. తండ్రి, తల్లి పేరున ఉన్న విద్యుత్ మీటర్లను తమ ఆధార్తో లింక్ చేయడం వల్ల విద్యుత్ వాడకం ఉన్న కారణంగా ప్రభుత్వ పథకాలు రావడం లేదని తెలిపారు. ఆధార్ లింక్ తొలగించాలని కోరారు. ఏడాది విద్యుత్ వాడకం స్టేట్మెంట్ ఇవ్వాలని కొందరు విద్యుత్ వినియోగదారులు ఈఆర్ఓలను కోరారు. వినియోగదారుల నుంచి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తులు తీసుకుని, రెండో రోజులు తర్వాత స్టేట్మెంట్లు ఇస్తామని అధికారులు చెప్పారు. -
సంప్రదాయానికి పెద్ద పీట.. కొబ్బరికాయలకు పసిడి వన్నెలద్దీ..!
సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు.కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. అంబాజీపేట పెద్ద వీధిలో కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, కొబ్బరి కాయలు, చెరకు గెడలు, ధాన్యం కుచ్చులతో ముస్తాబు చేసిన పెళ్లి ఇంటి వద్ద స్వాగత ద్వారం ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు.ఇతర ప్రాంతాలకు సైతం..కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.అరటి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసే వేదికలు అభిరుచి మారుతోందిపెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్లో డెకరేషన్లు చేస్తున్నాం.– బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారం¿ోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాకొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదిక -
రికార్డుల కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. కురిడీ కొబ్బరి ధర కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగి ఆల్టైమ్ రికార్డు నమోదు చేయగా.. పచ్చి కొబ్బరి కాయ సైతం ఆల్టైమ్ హైరికార్డులు సృష్టిస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.17,500 నుంచి రూ.18.500 పలుకుతోంది. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం ఇదే మొదటిసారి. మరోవైపు కురిడీ కొబ్బరి సైతం కురిడీ రూ.27 వేలకు చేరింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగవుతోంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వకాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు తగ్గలేదు. తరువాత ఈ ధర పెరుగుతూ వస్తోంది. గత నెలలో వీటి ధర రూ.16 వేలకు చేరింది. ఇదే గరిష్ట ధర అనుకున్నారు. అయితే.. రైతులు, వ్యాపారుల అంచనా దాటి కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరగడం గమనార్హం. పచ్చి కొబ్బరికి ఈ స్థాయి ధర రావడం మార్కెట్లో ఇదే మొదటిసారి. ఉత్తరాదిలోని గుజరాత్, హరియాణ,, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. కురిడీకి రికార్డు స్థాయి ధర కురిడీ కొబ్బరి సైతం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పాత కాయలలో (8 నెలలకు పైబడి నిల్వ ఉన్న) గండేరా రకం (పెద్ద రకం) వెయ్యి కురిడీ కొబ్బరి కాయల ధర రూ.27 వేలకు చేరడం రికార్డు. గతంలో దీని సగటు ధర రూ.14 వేలు మించేది కాదు. ఇక గటగట (చిన్నకాయ) ధర రూ.25 వేలుగా ఉంది. కొత్త కాయల్లో గండేరా రూ.26 వేలు, గటగట రూ.24 వేల వరకు పెరగడం విశేషం. నిల్వలు లేకపోవడమే కారణం » ఏడాది కాలంగా రైతుల వద్ద, వ్యాపారుల వద్ద కొబ్బరి నిల్వ ఉండటం లేదు. గతంలో దింపు తీసిన కొబ్బరి రెండు, మూడు నెలలపాటు రైతుల వద్దనే ఉండేది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో వారం వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి కొబ్బరి, కురిడీ కొబ్బరికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. » ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాదికి కొబ్బరి కాయ ఎగుమతులు పెరిగిన కారణంగా మార్చి నెల నుంచి గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు నుంచి జాతీయ మార్కెట్కు ఎగుమతి అయ్యే కొబ్బరిలో మూడోవంతు కూడా అందుబాటులో లేకుండా పోయింది. స్థానిక కొబ్బరి డిమాండ్ పెరగడానికి ఇది కారణమైంది. » మార్చి నుంచి మే నెలాఖరు వరకూ ఎకరాకు సగటున 1,200 కాయల వరకూ దిగుబడి వస్తోంది. తరువాత అది తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సగటు దిగుబడి 700 కాయల వరకూ ఉంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమైంది. » ఇంత ధర ఉన్నా రైతులు వెంటనే అమ్మడం లేదు. ధర మరింత పెరిగే అవకాశముందనే అంచనాతో ఆచితూచి విక్రయిస్తున్నారు. -
చిన్నారికి ఎంత కష్టం.. వైద్యానికి రూ. 16 కోట్లు అవసరం!
కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్
● 21 నుంచి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన ● 25 నుంచి ఆప్షన్ల ఎంపిక ● జూలై 3న సీట్ల కేటాయింపు రాయవరం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లావ్యాప్తంగా 3,830 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,162 మంది బాలురు, 1,668 మంది బాలికలు ఉన్నారు. వీరు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు నిర్వహించే కౌన్సెలింగ్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీని కోసం అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని శ్రీ వైవీఎస్ అండ్ బీఆర్బీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు విద్యార్థులు వెళ్లి ఆప్షన్స్ ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. షెడ్యూల్ మేరకు తమ ర్యాంకును బట్టి విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి. అనంతరం వారికిచ్చిన తేదీ ప్రకారం ఆన్లైన్లో అడ్మిషన్ పొందాలి. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెస్ ఫీజు చెల్లించాలి. ఆ రశీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ లేని వారు ఏడేళ్ల రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాన్ లోకల్ విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారు అర్హత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్ సమయంలో సబ్మిట్ చేయాలి. వీరికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జిల్లాలో 6 కళాశాలలు రామచంద్రపురంలో ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవే టు యాజమాన్యంలో మరో ఐదు పాలిటెక్నిక్ కళాశాల లు జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్, ఎలక్ట్రా నిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులున్నాయి. పలు కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 33, మెకానికల్ 33 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 1,500 వరకూ సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద 10 శాతం అదనంగా సీట్లు పెంచి ప్రతి బ్రాంచిలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ సైతం ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, షెడ్యూల్ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. – కేపీవీఎస్ఎన్ ప్రసాద్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ద్రాక్షారామ జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల వివరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రామచంద్రపురం: డీఎంఈ–33, డీసీఈ–33. శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల: డీసీఈ–30, డీఎంఈ–30, డీఈఈ–60, డీఈసీఈ–60, డీసీఎంఈ–120, డీఏఐఎం–60. బీవీసీ, ఇంజినీరింగ్ కళాశాల: డీసీఎంఈ–180, డీఈసీఈ–60, మెకానికల్–30, ఈఈఈ–30. వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, సీసీఎన్–60, డీఈసీఈ–60, ఈఈఈ–60, మెకానికల్–60. శ్రీ వైవీఎస్ అండ్ శ్రీ బీఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాల, ముక్తేశ్వరం: డీఈఈఐఈ–30, డీసీఎంఈ–54, డీఈసీఈ–60, డీఈఈఈ–108, డీఎంఈ–108. కై ట్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, డీఈసీఈ–60, సివిల్–30, డీఈఈఈ–30, మెకానికల్–30, ప్యాకింగ్ టెక్నాలజీ–30.సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ ఇలా.. తేదీ సమయం ర్యాంకు జూన్ 21 ఉదయం 9.00 1–7,499 మధ్యాహ్నం ఒంటిగంట 7,501–15,000 22 ఉదయం 9.00 15,001–23,500 మధ్యాహ్నం ఒంటిగంట 23,501–32,000 23 ఉదయం 9.00 32,001–40,000 మధ్యాహ్నం ఒంటిగంట 40,001–50,000 24 ఉదయం 9.00 50,001–59,000 మధ్యాహ్నం ఒంటిగంట 59,001–68,000 25 ఉదయం 9.00 68,001–77,000 మధ్యాహ్నం ఒంటిగంట 77,001–86,000 26 ఉదయం 9.00 86,001–95,000 మధ్యాహ్నం ఒంటిగంట 95,001–1,04,000 27 ఉదయం 9.00 1,04,001–1,12,000 మధ్యాహ్నం ఒంటిగంట 1,12,001–1,20,000 28 ఉదయం 9.00 1,20,001–1,27,000 మధ్యాహ్నం ఒంటిగంట 27,001–చివరి ర్యాంకు వరకూ ఆప్షన్ల ఎంపిక తేదీలు తేదీలు ర్యాంకులు జూన్ 25, 26 1–50,000 27, 28 50,0001–90,000 29, 30 90,0001–చివరి ర్యాంకు వరకూ అడ్మిషన్ల సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. జూలై 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం. జూలై 3న సీట్ల కేటాయింపు. -
శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా...
ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం ఫ ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటే శా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజ నం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ ఐ ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ను నియంత్రించా రు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
తల్లికి వంచన
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025● తల్లికి వందనానికి ని‘బంధనాలు’ ● జిల్లాలో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులు ● పథకం వర్తించిన వారు 1,70,869 మంది ● 69,131 మందికి కోత ● గత ఏడాది బకాయిల ఊసెత్తని సర్కార్ సాక్షి, అమలాపురం: తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి.. నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రానివారు కంగారు పడవద్దని, ఇంకా సమయం ఉందని, అవకాశం ఇస్తామని అధికారులు చెబుతున్నా.. నిబంధనలు చూస్తూంటే చాలా మందికి తల్లికి వందనం అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కింద వీరిలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.250 కోట్లు జమ చేశారు. రకరకాల సాకులతో మిగిలిన 69,131 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనలతో చాలా మంది అనర్హులుగా మారారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుకుంటున్న ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు, కూటమి నేతలు ఊదరగొట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద జిల్లాలోని తల్లులకు నాలుగేళ్లలో రూ.850.63 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం పేరును తల్లికి వందనంగా మార్చింది. అదే సమయంలో ఈ పథకం అమలులో అనేక ఆంక్షలు పెట్టారు. దీంతో పలువురు ఈ పథకానికి దూరమయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇవీ నిబంధనలు ● తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. ● తల్లి, తండ్రి, పిల్లల ఆధార్ నంబర్లు చెల్లుబాటై ఉండాలి. ● నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి. ● మూడెకరాల లోపు మాగాణి, 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు. ● మున్సిపల్ పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండరాదు. ● కుటుంబ సభ్యులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ● నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించరాదు. ● ఆదాయ పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అనర్హులు. ● ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అనర్హులు. ● వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే ఈ పథకం వర్తింపజేస్తారు. వీరికి తరువాత.. అంగన్వాడీ నుంచి కొత్తగా ఒకటో తరగతికి వెళ్లే పిల్లలు, పదో తరగతి పూర్తి చేసుకుని, కొత్తగా ఇంటర్లో చేరే విద్యార్థుల పేర్లు ప్రస్తుతం అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 వరకూ వీరి నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30న వెలువడే తుది జాబితాలో వీరి పేర్లు వస్తాయి. వీరికి వచ్చే నెల 5 తర్వాత తల్లికి వందనం డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదని, వీరు విద్యా దీవెన పథకం కిందకి వస్తారని చెబుతున్నారు. నాడు తప్పు.. నేడు ఒప్పా? గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి నిధుల నుంచి తొలుత రూ.1,000, తదుపరి ఏడాది నుంచి రూ.2 వేల చొప్పున పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక ఖాతా ప్రారంభించి, దానికి ఈ నిధులు డిపాజిట్ చేయించారు. ఆ సొమ్ముతో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన కెమికల్స్, ఇతర సామగ్రి కొనుగోలు చేసేవారు. ఆయాలను నియమించి, వారికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం అందించారు. దీనిపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. వాటిని మరచిపోయారో ఏమో కానీ.. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా చెప్పగా.. తీరా అమలులోకి వచ్చేసరికి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.2 వేలకు పాఠశాల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. దీంతో, నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తప్పని చెప్పారని, ఇప్పుడు అదే విధానం ఎలా ఒప్పు అయిందని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనలు సరళతరం చేయాలి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలి. ఇన్ని నిబంధనలు విధిస్తే అధిక సంఖ్యలో అనర్హులవుతారు. పదో తరగతి పూర్తి చేసిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలి. నెలకు 300 యూనిట్ల విద్యుత్ వాడకం నిబంధన తొలగించాలి. – బి.సిద్దు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ -
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. సర్వ దర్శనాలు చేసుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టికెట్లు, వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ.1,65,420 వచ్చింది. అన్నప్రసాద పథకానికి భక్తులు రూ.39,691 విరాళాలు సమర్పించారు. ‘కూటమి’ ఏడాది వైఫల్యాలపై నేడు పుస్తకావిష్కరణ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ముద్రించిన పుస్తకాన్ని పార్టీ నేతలు అమలాపురంలో ఆదివారం ఆవిష్కరించనున్నారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్తో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారు. ఆదివారం ఉదయం జిల్లా స్థాయిలోనూ, సోమవారం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోను, మంగళవారం మండల కేంద్రాల్లోను ఈ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని జగ్గిరెడ్డి తెలిపారు. -
మాకు మంచి స్నేహితుడు
నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్ముడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్న సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు. –తండ్రి సత్యనారాయణతో సప్పా నాగేశ్వరరావు, కొంకుదురు ఎంతో ప్రేమగా చూస్తారు.. సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను. –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు -
ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం
కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్బీఐ చీఫ్ అసోసియేట్ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.98 స్కోర్తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 91వ ర్యాంక్ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కింది. అనంతరం సివిల్స్లో ఐఏఎస్ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది. -
నీట్లో సత్తా చాటిన ఆదిత్య
బాలాజీచెరువు (కాకినాడ): నీట్–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్రెడ్డి తెలిపారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ‘ఆదిత్య’ను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతి, డైరెక్టర్ సుగుణ, ప్రిన్సిపాల్స్ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు. -
నాన్నా... నీ మనసే వెన్న
ఫాదర్స్ డే రోజునే ఉద్యోగంలోకి.. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్ పేపర్లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్ ఎంసెట్లో 289వ ర్యాంకు, గేట్లో 240వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో సామ్సంగ్ రీసెర్చ్ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్లో గూగుల్ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్ జేఈ మెయిన్స్లో 1924వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్ ప్లేసమెంట్లో గూగుల్కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్ ఫాదర్స్ డే రోజునే గూగుల్లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు. ఫ నడిపించే దైవం ఆయనే ఫ కుటుంబానికి వెలుగునిచ్చే సారథి ఫ నేడు ఫాదర్స్ డే కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది. -
మొదటి గురువులా..
ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి. –తండ్రి సత్యనారాయణతో గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక ఆయనే కొండంత ధైర్యం ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం. –తండ్రి బండారు రాముతో సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్, కొప్పవరం -
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్ తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు. ఆరు గంటలపాటు ఆందోళన కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలా ఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబా బు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరు లు ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. -
84 శాతం మందికి ఉద్యోగాలు
అమలాపురం రూరల్: భట్లపాలెంలో బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అచీవర్స్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా 2025 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం విద్యార్థుల్లో 84 శాతం మంది ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారని కళాశాల ప్లేస్మెంట్ అధికారి అడబాల కుమార్ తెలిపారు. విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆ విద్యార్థులకు చైర్మన్ బోనం కృష్ణ సతీష్, బోనం విజయలక్ష్మి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రిటికల్ రివర్ సంస్థ సీనియర్ డైరెక్టర్, గ్లోబల్ హెడ్ జేపీ సోలమన్ దేవవరం విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీజీ రామారావు, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్ టీవీ జనార్దన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు, శ్రీచలం తదితరులు పాల్గొన్నారు.