Dr B R Ambedkar Konaseema
-
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ.64,31,681 ఆదాయం వచ్చింది. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కుక్ అండ్ హెల్పర్లను తొలగించం● స్పష్టం చేసిన డీఈవో నాగేశ్వరరావు ● ‘సాక్షి’ కథనానికి స్పందన కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి (ఎండీఎం) సంబంధించి మోడ్రన్ కిచెన్లు ఏర్పాటు చేసినా కుక్ అండ్ హెల్పర్లను తొలగించడం జరగదని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఈఓ) పి.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ‘మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు‘ శీర్షికన సాక్షి పత్రికలో ఈ నెల 23న ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. దానికి వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. కడపలో 13 పాఠశాలలను కలుపుకొంటూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సుమారు 2,500 విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్ విజయవంతంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలోనూ మోడ్రన్ కిచెన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గుర్తించిన మోడ్రన్ కిచెన్ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న కుక్ కం హెల్పర్లందరికీ శిక్షణ ఇప్పించి, విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, వేడి ఆహా రం అందించడానికి ఈ జిల్లాలో కూడా కొన్ని పాఠశాలలు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. ఇందుకు ఒక్కొక్క స్మార్ట్ కిచెన్నకు రూ.55.75 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. 27 నుంచి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలను ఈ నెల 27 నుంచి మే ఒకటో తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో వి.సత్యనారాయణ శనివారం విలేకరులకు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 6.45 గంటల నుంచి కల్యాణ మహోత్సవం, 28న స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు, 29న మహదాశీర్వచనం, 30న నరసింహ జయంతి పూజా కార్యక్రమాలు, మే ఒకటిన పూర్ణాహుతి, చక్రస్నానం, పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని ఆయన కోరారు. విద్యుత్ బిల్లులు నేడూ చెల్లించొచ్చు అమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నెల 26 ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లులను యథాతథంగా చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అలాగే సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయ న్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం వద్దు ఉప్పలగుప్తం: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని కొనుగోలు సిబ్బందిని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి హెచ్చరించారు. భీమనపల్లి –1 రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను, తేమ శాతాన్ని పరికరాల ద్వారా పరిశీలించారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలేవి!
అమలాపురం రూరల్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లాలోని అన్ని నియోజక వర్గాల వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాద్, కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం విలేకరులతో జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు తొత్తుగా మారి, సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే చెల్లిందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటనే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం, రామచంద్రపురం నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్ గోపాల్, కుడుపూడి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, అమలాపురం పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య కుమార్, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, టి.లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చొల్లంగి సుబ్బురామ్, సాకా ప్రసన్న కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్య నాగేంద్రమణి, దాసరి డెవిడ్ పాల్గొన్నారు. వార్డుల పునర్విభజన నిష్పక్షపాతంగా జరగాలి అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ పార్టీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాశ్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం జరగడం లేదని, నిబంధనలను పక్కన పెట్టి కూటమి నాయకుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచినా పట్టించుకోరా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాజీ మంత్రి విశ్వరూప్, కో ఆర్డినేటర్లు శ్రీకాంత్, సూర్యప్రకాశ్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు మహిళా లోకాన్ని అవమానించినట్టే.. అల్లవరం: మహిళలను అవమానపరిచేలా, వారి గౌరవాన్ని కించపరిచేలా తప్పుడు కథనాల ప్రచురించిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం మహిళా లోకాన్ని అవమానించేనట్టేనని తెలిపారు. -
కూటమి అరాచకాలను అడ్డుకుందాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, విజయలక్ష్మి ● గన్నవరపు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లకు సత్కారం పి.గన్నవరం: కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీలను, అరాచకాలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన 30 మంది తాజా మాజీ సర్పంచ్లను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గన్నవరపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. కూటమి నేతలు ఎంత ఒత్తిడి చేసినా వైఎస్సార్ సీపీ సర్పంచ్లు పార్టీ మారలేదన్నారు. సర్పంచ్ పదవి నుంచి ఎప్పుడు దిగుతారు, ఏ విధంగా దోచుకుని తిందాం అన్న రీతిలో కూటమి నాయకులు ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన బాధ్యత తీసుకుని కూటమి నాయకులను ఒక కంట కనిపెట్టి, వారి దోపిడీని అడ్డుకోవాలని జగ్గిరెడ్డి సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ దోపిడీతో విసుగు చెందిన ప్రజలు 2029లో జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామన్నారు. జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను ఇబ్బందులు పెడుతున్నా ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ గన్నవరపు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీ మారకుండా ప్రజలకు సేవలు అందించిన వైఎస్సార్ సీపీ మాజీ సర్పంచ్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కాగా.. జిల్లాలోని పలు ర్యాంపుల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన తువ్వ, మట్టి దోపిడీని పలువురు నాయకులు జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించారు. కూటమి నేతలు లంక భూములను గుల్ల చేస్తున్నారని అన్నారు. జి.పెదపూడిలో టిప్పర్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, మండల శాఖ అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్, కొమ్ముల రాము, మట్టపర్తి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు మందపాటి కిరణ్కుమార్, దొమ్మేటి వెంకట శివరామన్, కుడుపూడి విద్యాసాగర్, గుత్తుల మధు, వడలి కొండయ్య, తోరం సూర్యభాస్కర్, కొంబత్తుల ఏసు బాబు, మిండగుదిటి శిరీష్, దొమ్మేటి సత్యమోహన్, నీతిపూడి విలసిత మంగతాయారు, కర్రి నాగిరెడ్డి, తోరం గౌతమ్, చేట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్..నిల్
● పెరుగుతున్న డీజిల్ కష్టాలు ● బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు ● రైతుల పడిగాపులు ● పోలీసుల పహారా మధ్య విక్రయాలు సాక్షి, అమలాపురం/ఆలమూరు: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత మరింత పెరిగింది. డీజిల్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పెట్రోల్ రేషన్ పద్ధతిలో కొంత వరకు దొరుకుతున్నా, డీజిల్ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని బంకుల వద్ద డీజిల్ ఉన్నా పోలీసుల సమక్షంలో అమ్మకాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు.. బంకు యజమానుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన విక్రయాలు చేయాల్సి వస్తోంది. డీజిల్ కొరత లేదని, రైతులకు డీజిల్ ఇబ్బంది లేకుండా చేస్తామని అధికారులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉంది. డీజిల్ దొరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలను, పట్టుబడులకు వచ్చిన రొయ్యల చెరువులను వదిలి బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. పోలీసు బందోబస్తుతో.. ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్ మెయిన్రోడ్డులోని ఒక పెట్రోల్ బంకులో శుక్రవారం రాత్రి డీజిల్ స్టాక్ అయిపోయింది. దీంతో పాటు పెట్రోల్ కూడా లేకపోవడంపై బంకు యాజమానులు, వినియోగదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో బంకుల వద్ద.. జిల్లాలో పలు బంకుల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. పెట్రోల్కు సంబంధించి మోటార్ సైకిళ్లకు రూ.200, కార్లకు రూ.ఐదు వందలు రేషన్ పెట్టడంపై వినియోగదారులు విరుచుకుపడుతున్నారు. పెట్రోల్ ఉన్నా తమ వాహనాలకు కొసరి కొసరి కొడుతున్నారని మండిపడుతున్నారు. బంకుల వద్ద క్యూలు పెరిగిపోయాయి. మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరుతున్నాయి. డీజిల్ దొరికే చోట కార్లు, ఆటోలతో పాటు లారీలు సైతం పెద్ద సంఖ్యలో క్యూలో ఉంటున్నాయి. ఇంతా చేసి తమ వంతు వచ్చే సరికి నో స్టాక్ బోర్డు పెడుతుండడంతో చూసి వాహనాల యజమానులు ఉసూరుమంటూ వెనుదిరగడం పరిపాటిగా మారింది. డీజిల్ కొరత లేదంటున్నా.. జిల్లాలో డీజిల్ కొరత లేదని జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. పెట్రోల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ రాక తగ్గిపోయింది. బంకు యజమానులు ఎప్పటికప్పుడు ఆర్డరు పెడుతున్నా కంపెనీల నుంచి వెంటనే డెలివరీ కావడం లేదు. ఇప్పుడున్న ధరలకు అమ్మకాలు చేస్తే లీటర్కు రూ.25 నుంచి రూ.30 వరకు నష్టం వస్తోందనే ఉద్దేశంతోనే కంపెనీలు సరఫరాపై నియంత్రణ విధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి కోతలు గత ఏప్రిల్, మే నెలలో జిల్లాలో వినియోగించిన డీజిల్కు అదనంగా పది శాతం డీజిల్ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం చమురు కంపెనీలకు లేఖలు రాసింది. అయినా ఫలితం లేదు. పది శాతం అదనం మాట అటుఉంచితే సాధారణ వినియోగంలో 30 శాతం నుంచి 40 శాతం తక్కువగా డీజిల్ పంపుతుండడంతో కొరతకు కారణమనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంత పెట్రోల్ బంకుల వద్ద సాధారణ రోజులలో నాలుగు వేల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్లు డీజిల్ విక్రయాలు జరిగేవి. వరి కోతల నేపథ్యంలో ప్రస్తుతం ఏడు వేల నుంచి ఎనిమిది వేల లీటర్ల వరకూ విక్రయాలు జరగడం పరిపాటిగా ఉంది. కానీ ఇప్పుడు చాలా బంకులలో ‘‘డీజిల్ రావాల్సి ఉంది’’ అని బోర్డులు వేలాడడంతో రైతులకు పాలు పోవడం లేదు. ప్రభుత్వ మొద్దునిద్ర పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై రైతులు, సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట కోతల సమయంలో డీజిల్కు ఇబ్బంది ఏర్పడినా, ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. చమురు కంపెనీలను ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుందని ఆవేదన వ్యకం చేస్తున్నారు. సిఫారసు లేఖలు ఉండాల్సిందేనా? వరి కోత యంత్రాలు, నీరు తోడుకునే మోటార్లు, ఆక్వా చెరువుల వద్ద జనరేటర్లు, ఏరియేటర్లకు డీజిల్ కావాలంటే సిఫారసు లేఖ ఉండాల్సిందే. స్థానికంగా ఉన్న ఏవోలు, ఇతర అధికారులు లేఖ ఇస్తే కానీ డీజిల్ దొరకని పరిస్థితి జిల్లాలో నెలకొంది. అయితే వరి చేలు, చెరువులను వదిలి రైతులు అటు అధికారులు చుట్టూ, ఇటు బంకులు చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. పోనీ వాటిని పట్టుకుని బంకుల వద్దకు వెళ్లినా ఏ బంకుల వద్ద నిల్వ ఉంటుందో, ఎప్పుడు అయిపోతోందో తెలియని దుస్థితి నెలకొంది. డీజిల్ ఉన్నా గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు పడాల్సిందే. పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ బంకుల వద్ద మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అమలాపురం నలుమూలల ట్రాఫిక్ నిలిచిపోయింది.ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళుతున్నాయి. కొత్తపేట వంటి ప్రాంతాలలో నుంచి భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో అక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు పడ్డారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నా పోలీసులు మాత్రం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం విశేషం. తీవ్ర ఇబ్బందులు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పొలాల్లో వరిని కోసేందుకు యంత్రానికి అవసరమైన డీజిల్ను మమ్మల్నే సమకూర్చుకోమంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు పడలేకపోతున్నాం. డీజిల్ కొరతతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. – మోటుపల్లి సత్తిబాబు, రైతు, సంధిపూడి, ఆలమూరు మండలం -
ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి
అమలాపురం రూరల్: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నోటీసుల సాకుతో తొలగించాలని చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పార్టీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ నేతృత్వంలో గ్రామానికి చెందిన దళిత సంఘాలు, నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగించడం ద్వారా స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయని, గ్రామ వాసులకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించి విగ్రహాన్ని యథాతథంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజనీ, మాజీ సర్పంచ్ సాధనాల వెంకటరావు, అమలాపురం రూరల్ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్గోపాల్, పెనుమల విక్రమ్ పాల్గొన్నారు. -
డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేయొద్దు
అమలాపురం రూరల్: డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడుతోందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ డీజిల్ కొరత అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో కొందరు అవసరానికి మించి నిల్వ చేస్తున్నారన్నారు. జిల్లాలో డీజిల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలను జిల్లాకు సరఫరాను 10 శాతం పెంచాలని ఆదేశించామన్నారు. వరి కోత యంత్రాలకు డీజిల్ ఇబ్బంది లేకుండా విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఽధ్రువీకరణ పత్రం విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వారి సంతకం ఉన్న పత్రాన్ని రైతులు బంకుల్లో చూపిస్తే ప్రాధాన్యత క్రమంలో డీజిల్ అందజేస్తారన్నారు. డీజిల్ సరఫరాలో సమస్యలు ఎదురైనా, అధిక ధరలకు విక్రయించినా 90599 20242, 94416 92275 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. కోకో పార్కు ఏర్పాటుకు వంద ఎకరాలు కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్క్ ఏర్పాటుకు సుమారు వంద ఎకరాల సేకరణకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఆయన కలెక్టరేట్లో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసే దిశగా పలు ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ ముమ్మిడివరం: స్థానిక ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతా గోదాములను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తనిఖీ చేశారు. నిర్దేశిత నెలవారీ తనిఖీల్లో భాగంగా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీలింగ్, రిజిస్టర్లను పరిశీలించి, సందర్శన రిజిస్టర్లో సంతకం చేశారు. -
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
ఎన్నో లాభాలు
ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో భూములకు లోతు దుక్కులు ఉపయోగకరం. వాలుకు అడ్డంగా లోతు దుక్కి దున్నడం వల్ల నేలలో తేమకు రక్షణ ఉంటుంది. దీనివల్ల భూమిలోని చీడపీడలను నివారించవచ్చు. భూమి గుల్లబారి వర్షపు నీరు సంవృద్ధిగా ఇంకి ఎక్కువ కాలం పంటలకు తేమను అందిస్తుంది. కలుపు నివారణ సాధ్యమవుతుంది. పురుగుల బెడద తప్పుతుంది. భూసారం వృద్ధి, తేమ శాతం పెరుగుదలకు లోదుక్కులు ఎంతగానో ఉపయోగపడతాయి. –కె.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి, రంగంపేట మండలం● -
గాలి తగిలే దుస్తులు ధరించాలి
శరీరానికి గాలి తగిలే దుస్తులు వాడాలి. రోజుకు అవసరాన్ని బట్టి పెద్దలు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీటిని తీసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి. బయట ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. –వి.అనిరుధ్, వైద్యుడు, రాయవరం పీహెచ్సీ తగినంత నీరు అందేలా చూసుకోవాలి చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పిల్లల్లో 70 శాతం నీరు, 30 శాతం కణజాలం ఉంటుంది. మలమూ త్రాలు, చెమట, శ్వాస ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆహారంతో పాటు తగినంత నీరు శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టి.రామగుర్రెడ్డి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, అనపర్తి -
బలుసుతిప్పలో వేటగాళ్ల మధ్య ఘర్షణ
ప్రైవేట్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33 వే అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్కి జైలు శిక్ష తప్పదన్నారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఓలేటి శ్రీనివాస్, షణ్ముఖ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాట్రేనికోన: బలుసుతిప్ప గ్రామంలో రింగు వల వేటగాళ్లు– సంప్రదాయ చేపల వేటగాళ్ల మధ్య ఘర్షణ కోట్లాటకు దారితీసింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ మద్దతు ఇవ్వగా, రింగు వల వేటగాళ్లు జనసేనకు చెందిన వారు కావడంతో కూటమిలో కుమ్ములాటగా మారింది. పూర్వం నుంచీ బలుసుతిప్ప నదీ పాయల్లో చిన్న చేపలు, రొయ్యల ఉత్పత్తికి నష్టం లేకుండా చేపల వేట సాగుతోంది. గ్రామానికి చెందిన వనమాడి మోసయ్య, బందరుకు చెందిన బంధువుతో కలసి సుమారు 20 రోజుల పాటు రింగు వలతో కొత్తపాలెం, భైరవపాలెం మొగ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి వేట సాగిస్తున్నారని ఆరోపణ. చేపల వేట నిషేధం ఉన్నా నాలుగు రోజుల నుంచి చల్ల కాలువ ముక్కాం అంతరం సమీపంలోని గోదావరి పాయలో వేట చేశారు. రింగు వలతో గోదావరిలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా చేపలు, రొయ్యలను వేటాడడం సరికాదని సంప్రదాయ వేటగాళ్లు గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో రింగు వల వేట చేయవద్దని వారు మందలించారు. అయితే గేలం వేటను ఆపేస్తే రింగు వలను వేయమని ఆ వర్గం భీష్మించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచి రింగు వలలను పోలీస్ స్టేషన్కు తరలించి కాట్రేనికోన ఎస్సై అవినాష్కు ఫిర్యాదు చేశారు. ఉపశమనం పొందేందుకు.. వేసవిలో బాటసారులకు పుచ్చకాయ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ప్రయాణ సమయంలో ఎండ వేడికి దాహం, ఉక్కబోత పెరుగుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ తింటే దాహార్తిని తీర్చడమే కాకుండా ఉక్కబోత నుంచి ఉపశమనం కలుగుతుంది. –దాసరి గౌతమ్, ముమ్మిడివరం ఆరోగ్యానికి మంచిది పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కంటిచూపు మెరుగవుతుంది. కిడ్నీలు, గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వేసవి తాపం నుంచి రక్షణ కలుగుతుంది. –సీహెచ్ ముకుంద, వైద్యాధికారి, పీహెచ్సీ, కొత్తలంక -
కాల్చేసన్..
వ్యాధులు.. కారణాలు ఫ వేసవిలో అతిసారం సోకకుండా సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. ఫ బావులు, బోర్లు, చెరువులు, కాలువల నీటిలో క్లోరిన్ కలిపిన తర్వాతే వాటిని ఉపయోగించాలి. ఫ తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసి, పాత్రలపై మూతలు పెట్టాలి. ఫ వంట గదిలో ఆహార పదార్థాలపై కోసిన పండ్లు, కూరగాయ ముక్కలపై దుమ్ము, ధూళి, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ వేడిగా, తాజాగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి. ఫ ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఫ జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు రాయవరం: భానుడు భగభగలు రేపుతున్నాడు. బయటకు వెళ్తే మంట పుట్టిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, నీటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. శరీరంలో తేమ (నీటి) శాతం తగ్గకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు.. చికిత్స ఫ వడదెబ్బకు గురైతే తలనొప్పి, తల తిరగడం, ఎండిపోయిన చర్మంతో ఎక్కువ జ్వరం కలిగి ఉండడం, మగత కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పర్తి అపస్మార స్థితిలోకి వెళ్లడం జరుగుతోంది. ఫ వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్ ముక్కలను వస్త్రంలో ఉంచి శరీరం అంతా తుడవాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి. ఫ బాధితులకు చల్లని నీరు లేదా ఉప్పు ఇతర లవణాలు కలిసిన నీటిని (ఓఆర్ఎస్ ద్రావణం) తాగించాలి. అతిసారం లక్షణాలు కనిపిస్తే.. ఫ ఒకటి లేక నాలుగు సార్లు నీళ్లతో కూడిన విరేచనాలైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలి. ఫ వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతుంటే వెంటనే ‘ఓఆర్ఎస్’ ద్రావణాన్ని తాగించాలి. ఫ ఇంటిలో లభించే గంజి, పలుచని మజ్జిగ, పప్పు నీరు, కొబ్బరినీళ్లు పట్టాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఫ వేసవిలో సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఉప్పు కలిపిన పండ్ల రసాలు తాగి వెళ్లాలి. ఫ తెల్లని దుస్తులు ధరించాలి. ఫ వేసవిలో మద్యం తాగడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషయ పరిస్థితికి దారి తీస్తుంది. ఫ ఇంటి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కిటికీలకు తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించాలి. ఫ ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీలు, తల పాగాల్లాంటివి ధరించాలి. -
రాష్ట్ర ఫుట్బాల్ పోటీలకు అరట్లకట్ట విద్యార్థినులు
కరప: రాష్ట్ర స్థాయిలో జరిగే శాప్ ఫుట్బాల్ లీగ్– 2026 పోటీలకు కరప మండలం అరట్లకట్ట ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జెడ్పీ హైస్కూల్కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. జట్టులో ఆరుగురు ప్లేయర్లుగా, నలుగురు స్టాండ్బైగా ఎంపికయ్యారని హెచ్ఎం పి.శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గురువారం కాకినాడ డీఎస్ఏ మైదానంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థినులు అర్హత సాధించారన్నారు. వీరు 27న అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో వల్లు అపర్ణ, నక్కా జ్యోష్స్న, కానేటి రిషిక, షేక్ సమీరాబేగం, వాసంశెట్టి సమీరా, సిరివిశెట్టి సృజన, స్టాండ్బై ప్లేయర్లుగా పాట్నీడి లక్ష్మితులసి, పచ్చిమాల జెస్సీకా, సింగినీడి నవ్య, పంపన మహాలక్ష్మి ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులను, తర్ఫీదునిచ్చిన పీడీ కౌర్లను హెచ్ఎం శ్రీనివాస్ కుమార్, ఫస్ట్ అసిస్టెంట్ ఫణిశర్మ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు అభినందించారు. -
సామర్లకోట స్టేషన్ సెంటర్లో ఎమ్మెల్యే చినరాజప్ప అట్టహాసంగా గడియారం స్తంభం ప్రారంభించారు. ఏడాది గడువక ముందే అందులోని గడియారం మోరాయించింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రూ.15 లక్షలతో గడియారం స్తంభానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.16 లక్షలు కేటాయించి 2025
● టిక్టిక్.. బ్రేక్ –సామర్లకోట ● ఎంతొట్టి నిర్లక్ష్యం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏడాది కిందట పల్లె పండగలో భాగంగా నిర్మించిన నీటి తొట్టెలు ఎందుకూ కొనగాకుండా ఉన్నాయి. పోలవరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి వీటిని నిర్మించినా, ఆ తొట్టెల్లో నీరు పోసేవారు లేకపోయారు. వీఆర్పురం మండలంలో ఈ నీటితొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో తొట్టెకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఖర్చు చేశారు. ఈ తొట్టెల్లో నీరు నింపేవారు లేకపోయారు. –వీఆర్పురం -
ఎందుక్కు అంటే..
● వేసవి దుక్కులతో భూమికి దన్ను ● మెట్ట ప్రాంత పొలాలకు మరింత మేలు రంగంపేట: మండే ఎండను పండే పంటకు ఉపయోగించుకోవచ్చు.. ఖాళీగా వదిలేస్తే కలిసొచ్చేది లేదు.. రబీ పూర్తవ్వడంతో ఈ సమయంలో పొలాలను అలాగే వదిలేయకుండా, కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా రానున్న ఖరీఫ్లో మంచి ఫలితాలను రాబట్టుకునే వీలుంటుంది. ఈ సమయంలో లోతు దుక్కి చేయడం ఫలితాలను ఇస్తుంది. సాగు చేయబోయే పంట కోసం ఇప్పటి నుంచి సాధారణంగా కల్టివేటర్ (ట్రాక్టర్కు వాడే మామూలు నాగలి) బదులుగా లోతు దుక్కి దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడితే నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురికాకుండా తేమ పెరుగుతుంది. ఎక్కువ కాలం తేమ తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి పొలంలో నాటుకుపోతాయి. దానివల్ల రానున్న పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పొలంలో వేసవిలో దుక్కులు చేయాలి. -
చల్లదనాన్ని అందిపుచ్చకుందాం
వేసవిలో పుచ్చకాయలకు గిరాకీ ముమ్మిడివరం: ఆరోగ్యాన్ని, చల్లదనాన్ని అంది‘పుచ్చ’కునే సమయమిదే.. ప్రతి వేసవిలో వచ్చే వాటర్ మిలాన్ (పుచ్చ కాయ)కు ఎనలేని డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలకు యమ గిరాకీ వచ్చింది. ప్రస్తుతం ఈ కాయ ధర సైజును బట్టీ రూ.100 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. వివిధ పనుల రీత్యా బయటకు వచ్చిన వారికి ఎండ నుంచి తక్షణ ఉపశమనం అందించే సాధనం ఇది. సాధారణంగా వేసవిలో శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతుంటాయి. తద్వారా డీ హైడ్రేషన్, వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే శరీరంలో వాటర్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, బీ విటమిన్, విటమిన్–ఏ, విటమిన్–బీ6, విటమిన్–సీ, సుక్రోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు తదితరాలు ఉంటాయి. ఇవి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుచ్చకాయ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మల బద్ధకం రాకుండా చేస్తోంది. వృద్ధాప్యంలో అంధత్వం నివారిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. వీటిని చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. కోనసీమలోని అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాలు, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని ప్రధాన మార్కెట్లలో రోడ్ల పక్కన దుకాణాలు, తోపుడు బండ్లలో వీటిని విక్రయిస్తున్నారు. కిలో పుచ్చకాయ రూ.25 నుంచి రూ.30 పలుకుతుంది. -
తరిమేద్దోమా..!
నేడు మలేరియా నివారణ దినోత్సవం ఆలమూరు: చిన్న దోమ కుట్టడం వల్లే మలేరియా లాంటి పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలతోనే దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. శనివారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపనున్నారు. కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నియంత్రణకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ చెబుతోంది. వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి ఫ మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా గుర్తించవచ్చు. ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫ వ్యాధి సోకిన వ్యక్తికి చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఫ వ్యాధి నిరోధకశక్లి లేని రోగులు విపరీతమైన తలనొప్పి సంభవించి ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఫ గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా వ్యాపిస్తుంది. ఫ దోమలను నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది. చికిత్సా విధానం ఫ మలేరియా సోకిన రోగి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. ఫ మధ్యలో మందులు మానేస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశఽం ఉంది. ఫ ఫాల్సీపారం మలేరియాకు మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం ఫ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ఫ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి. -
క్రీడా వసతి గృహాలను ఏర్పాటు చేయాలి
దేవరపల్లి: క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్నరెడ్డి సూచించారు. రామన్నపాలెంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో క్రీడా వసతి గృహాలు ఉండేవని, వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గ్రామీణ క్రీడలను గత ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేదని, వాటిని కూడా తీసివేసిందన్నారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడలు కనుమరుగవుతున్నాయని అన్నారు. ఒలింపిక్స్ క్రీడాకారిణి సత్తి గీత తమ సోదరని ఆయన తెలిపారు. తాను రెండు సార్లు అంతర్జాతీయ స్థాయిలో, 10 సార్లు జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ ఆడి బంగారు పతకాలు సాధించినట్టు చెప్పారు. బాస్కెట్బాల్ క్రీడలో మార్టేరుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మార్టేరులో తాను స్పోర్ట్స్ భవనం ఏర్పాటు చేసి ప్రతి ఏటా 8, 9, 10 తరగతుల పిల్లలకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రామన్నపాలెంలో దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఉద్యోగ విమరణ అనంతరం స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తానన్నారు. -
ఇదేం చెత్త శిక్షణ!
60 మందికి మూడు రోజుల ‘సమీక్ష’ జిల్లాలోని 19 మండలాల్లో 344 గ్రామ పంచాయతీలు, 439 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఏప్రిల్ 01 నుంచి పదో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా తడి, పొడి చెత్తపై నిర్వహించిన ఐఆర్వీ సర్వేలో 60 గ్రామాల్లో ప్రజాభిప్రాయం ప్రతికూలంగా వచ్చింది. ఆ గ్రామాల్లో పారిశుధ్యంపై 50 శాతంలోపే సానుకూల అభిప్రాయం చెప్పారు. దీంతో సంబంధిత కార్యదర్శులకు అమలాపురం రూరల్ మండలంలోని అనాతవరంలో మూడు రోజుల పాటు సమీక్ష పేరు చెప్పి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం రేకుల షెడ్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శులందరినీ పారిశుధ్య కార్మికులతో కలిసి ఇంటింటికీ తిప్పించి తడి, పొడి చెత్తను దగ్గరుండి సేకరించేలా చేశారు. చెత్తను విభజించి డంప్ యార్డుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామంలో ర్యాలీలు నిర్వహించి గ్రామ కార్యదర్శుల సహనాన్ని పరీక్షించారు. కూటమి ప్రభుత్వంలో కార్యదర్శులకు విలువ లేదని, కరివేపాకులా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ● గ్రామ కార్యదర్శులకు తలనొప్పిగా ఐవీఆర్ సర్వే ● 80 శాతం సానుకూలత లేకుంటే చెత్త సేకరణపై అవగాహన ● జిల్లాలో 60 మందికి ఇప్పటికే ‘క్లాసు’లు పూర్తి ● ప్రభుత్వంపై పోరుబాటా.. నిరసన తెలపాలా అని ఉద్యోగుల తర్జనభర్జన ఆలమూరు: ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పీక్స్కు చేరింది. లేనిది ఉన్నట్టు మోళీ చేసి చూపించడంలో చంద్రబాబు ప్రభుత్వం లెక్కే వేరు. ఏదేమైనా సరే ఐవీఆర్ కాల్స్లో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి 80 శాతం అనుకూలంగా ఉండాల్సిందేనని అనధికార ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలకు అధికారులు బలవుతుండగా, ప్రజాగ్రహానికి కార్యదర్శులు జవాబుదారులవుతున్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనకు నిధులు మంజూరు చేయకుండా, చాలినంత మంది పారిశుధ్య కార్మికులను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం ‘చెత్త’ పాలన చేస్తోంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస వసతులు, సౌకర్యాలు లేకపోయినా గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు స్వర్ణాంధ్ర–స్వర్ణ దివస్ దిశగా గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్మికుల సహకారంతో సంపూర్ణ పారిశుధ్యం దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామానికి ఒకటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ రథం గ్రామస్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అనేక గ్రామాల్లో డంప్ యార్డులు లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం నెలకొల్పి అంటువ్యాధుల నుంచి విముక్తిని కల్పించేందుకు ప్రయత్నిస్తున్న గ్రామ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అభినందన పూర్వకంగా కాకుండా కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే పనిష్మెంట్ను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరిస్తోంది. శిక్షలకు ఐవీఆర్ ప్రామాణికం అమరావతి నుంచి ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై ప్రజలకు ఐవీఆర్ ద్వారా ఫోన్లు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ప్రశ్నావళికి ఎవరైనా ప్రతికూల సమాధానం లేదా వారడిగిన నంబర్లలో ప్రతికూల ఫలితాన్నిచ్చే నంబర్ నొక్కితే దాని ఆధారంగా ప్రభుత్వం సర్వే చేసుకుంటుంది. వాటిలో ప్రజాభిప్రాయం 80 శాతం అనుకూలంగా లేకుంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోంది. దీనిపై కనీసం గ్రామ కార్యదర్శుల వివరణ తీసుకోకపోవడంపై వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈసారి ఫెయిలైతే రాయలసీమలో! రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 30 వరకూ మరో విడత ఐవీఆర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో అనుకున్న ఫలితాలు రాక పారిశుధ్య విభాగంలో విఫలమైన గ్రామ కార్యదర్శులకు ఈసారి ‘శిక్ష’ణ రాయలసీమ జిల్లాలో ఉంటుందని జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అనాతవరంలో అమలు చేసిన శిక్ష మరువక ముందే మళ్లీ రాయలసీమలో శిక్షణ ఏంటని కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాల కల్పించకుండా సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి మండుటెండలో తిప్పించి చెత్త సేకరణ పనిని అప్పగించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై న్యాయ పోరాటం చేయాలా, లేదా ప్రభుత్వానికి నిరసన తెలపాలా అనే ఆలోచనలో కార్యదర్శులు ఉన్నట్టు తెలుస్తోంది. పారిశుధ్య నిర్వహణపై లోతుగా అధ్యయనం గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో లోపాలు తెలుసుకునేందుకు ఐవీఆర్ సర్వే జరుపుతున్నాం. తడి చెత్త–పొడి చెత్త సేకరణపై లోతుగా అధ్యయనం చేసేందుకు వీలుగా గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో మళ్లీ ఐవీఆర్ సర్వే చేస్తున్నాం. ఆ మేరకు కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం. – డి.శాంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
లాభాలు వెదజెల్లీ
స్టాల్లో తాండ్రను విక్రయిస్తున్న మహిళ చాపలపై మామిడి గుజ్జును పూస్తున్న మహిళలు ●ఆత్రేయపురం: పూతరేకుల పేరు వినగానే అందరికీ వెంటనే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. ఈ గ్రామంలో తయారయ్యే పూతరేకులు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే మామిడి తాండ్ర (మ్యాంగో జెల్లీ) తయారీకి కూడా ఆత్రేయపురం పేరు గాంచింది. శతాబ్దాలుగా ఇక్కడ తాండ్ర తయారీ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉపాధిగా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మామిడి తోటలు హెచ్చుగా ఉండటం వల్ల పండ్లను నిల్వ చేసుకోవటానికి ఇదొక ప్రధాన మార్గంగా భావించి అప్పట్లో తాండ్ర తయారీ చేయడం ప్రారంభించారని పూర్వీకులు చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి మామిడి తాండ్ర దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడి పండ్లతో తాండ్ర తయారు చేస్తుంటారు. యంత్రాల వినియోగం ప్రస్తుతం తాండ్ర తయారీకి రసం తీసే చిన్నపాటి యంత్రాలను వినియోగిస్తున్నారు. రసం తీసిన తర్వాత పంచదార, బెల్లం కలిపి ఈత ఆకు చాపలపై రసం పోసి ఆరబెడతారు. ఇలా వారం, పది రోజుల పాటు దళసరి సరిపడినంత వచ్చిన తర్వాత వాటిని చాపపై కోసి నిర్దిష్ట సైజులో ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక కేజీ లేదా అర కేజీ చొప్పున ప్యాకింగ్ చేసి అట్టపెట్టెలలో నిల్వ చేసుకుంటారు. కొంత తాండ్రను రాజమహేంద్రవరంలోని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసుకుని, ఇక్కడి వ్యాపారానికి అవసరమైనప్పుడు తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. వేసవి అనంతరం తాటి పండ్లతో తాటి తాండ్రను సైతం తయారు చేస్తారు. పంచదార తాండ్రను కిలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. బెల్లం తాండ్రను రూ.250 నుంచి రూ.350కు అమ్ముతున్నారు. లాభసాటిగా.. ఆత్రేయపురం గ్రామంలో వందల సంఖ్యలో పూతరేకుల వ్యాపారం కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడాది పొడవునా మామిడి తాండ్రను కూడా విక్రయిస్తున్నారు. గతంలో ఈ తాండ్రను ముంబై, చైన్నె, కోల్కతా తదితర నగరాలకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు చాలా వరకూ స్థానిక స్టాళ్లలోనే అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా వ్యాపారం లాభసాటిగా సాగుతోందన్నారు. ఇటీవల కాలంలో మామిడి కాయలను జ్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటికి డిమాండ్ ఏర్పడి, ధరలు కూడా పెరిగాయి. గతంలో ఒక మెట్రిక్ టన్ను రూ.2 వేలు ఉండగా, ఇప్పుడు సుమారు రూ.20 వేలు పలుకుతోంది. కొన్నిచోట్ల జ్యూస్తో జెల్లీ తాండ్రను యంత్రాలపై తయారు చేస్తున్నారు. ఆ తాండ్ర ఇక్కడ స్టాళ్లలో లభిస్తోంది. మామిడి తాండ్ర తయారీ కేంద్రంగా ఆత్రేయపురం పూతరేకులతో పాటు ఎంతో ప్రసిద్ధి మహిళలకు జీవనోపాధి విదేశాలకూ ఎగుమతి -
పెట్రోలు పోసి, నిప్పు పెట్టాలని చూసి..
● ప్రేమించడం లేదని యువతిపై యువకుడి దాడి ● సకాలంలో ఇతర విద్యార్థులు రావడంతో తప్పిన ప్రమాదం రాజానగరం: ప్రేమించిన తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆ యువతిపై పెట్రోలు పోసి, అంటించబోయాడు. ఇతర విద్యార్థులు చూసి, అతన్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో అతను వెలిగించబోయిన లైటర్ వెలగకపోవడం ఆమె అదృష్టం. ఓ కాలేజీలో చదువుతున్న కోనసీమకు చెందిన యువతిని చొప్పెల్లకు చెందిన యర్రంశెట్టి లోకేష్ ప్రేమించాడు. మూడేళ్లు చదివి మానేసిన లోకేష్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆ యువతి దూరం పెట్టింది. అయినప్పటికీ ఆమెను వెంటపడి వేధించడం మానకపోవడంతో కాకినాడకు మకాం మార్చి అక్కడ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఆమె చదువుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలు రాసేందుకు రాజానగరంలో ఓ కాలేజీకి వచ్చిన ఆమెను కాలేజీ ప్రాంగణంలోకి బైకుపై వచ్చిన లోకేష్ జుట్టు పట్టుకుని బలవంతంగా పక్కకు తీసుకువెళ్లి, ఆమె పై పెట్రోలు పోసి, లైటర్తో అంటించబోయాడు. ఆ లైటర్ వెలగకపోవడంతోపాటు ఆమె పెట్టిన అరుపులకు సమీపంలో ఉన్న ఇతర విద్యార్థులు పరుగున వచ్చి లోకేష్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపించామని ఎస్సై ప్రియకుమార్ తెలిపారు. -
పాండవులమెట్టపై పెద్ద పులి
– ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కోరుకొండ: కొద్దిరోజులుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్న పెద్ద పులి గురువారం ఉదయానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం వద్దనున్న పాండవుల మెట్ట ప్రాంతానికి చేరింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండ వైపు నుంచి నడచిన పులి అడుగుల ఆధారంగా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఫారెస్టు అధికారులు, రిస్క్యూ టీమ్, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. కోరుకొండ, కాపవరం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో ప్రచారం చేశారు. డీఎఫ్ఓ వి.ప్రభాకరరావు ఘటనా స్థలిలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 6 వ తేదీన ఈ పులిని పాపికొండలు అటవీప్రాంతంలో విడిచిపెట్టినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఈ జిల్లాకు వస్తుందని నిన్న గుర్తించి, కలెక్టర్, ఇతర అధికారులకు తెలియజేశామన్నారు. పులి పగటి వేళల్లో విశ్రాంతి తీసుకుంటోందని, మనుషుల జోలికి వెళ్లడం లేదన్నారు. నాలుగురోజులకోసారి ఆహారం తీసుకుంటోందన్నారు. రాజమహేంద్రవరం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రిస్క్యూ టీమ్ పులికోసం ఆవును ఎరగా ఉంచి, సమీపంలో మాటు వేసింది. ఉదయం మెట్టపైకెక్కిన పులి, మధ్యాహ్నం ఎండ వేడికి కిందికి దిగింది, మెట్ల కింది భాగంలోని వెదురుపిడెం వద్ద సంచరించింది. రాత్రి వేళల్లో గట్టి చర్యలు పెద్దపులి పాండవుల మెట్టమీద నుంచి కిందికి దిగుతుందన్న అనుమానంతో పటిష్టమైన చర్యలు గురువారం రాత్రి పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు నార్త్జోన్ డీఎస్పీ జీవన, కోరుకొండ తహసీల్దార్ సుగుణ తెలిపారు. -
భౌరవ నరకం
● హడలెత్తిస్తున్న శునకాలు ● ఏడాదిలో 2,198 మంది కుక్కకాటు బాధితులు ● భౌపెడుతున్న కరుపులు రాయవరం: వీధికుక్కను చంపకండి, వాటికి ఆపరేషన్లు చేయించి సంతతి పెరగకుండా చూడండి. ప్రజలను కరిచినా రేబిస్ సోకకుండా వాటికి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయించండి..ఇవి జీవకారుణ్య సంఘం నేతలు చేస్తున్న సూచనలు. మా పంచాయతీ పరిధిలో వీధికుక్కలు బాగా ఎక్కువయ్యాయి. కుక్కల నిర్మూలన చేయాలని ప్రజలు మాపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వాటి సంతతి పెరగకుండా ఆపరేషన్లు చేయండి. ఇది పంచాయతీ కార్యదర్శులు, పశువైద్యులకు చేస్తున్న విజ్ఞప్తి. కుక్కలను పట్టుకుని మా వద్దకు తీసుకొస్తే ఆపరేషన్లు చేస్తాం. ప్రతీ ఆరు నెలలకు వాటికి వ్యాక్సిన్ వేయించాలంటున్నారు పశువైద్యులు. ఇలా ఎవరికి వారు శునకాలను నియంత్రించడంలో గిరి గీసుకోవడంతో వాటిని పట్టేదెవరు.. అరికట్టేదెవరు అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరవిహారం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు రోడ్డుపై అడుగు పెట్టాలంటే వణికిపోతున్నారు. శునకాల సంఖ్యను నియంత్రించాల్సిన పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలు చేతులెత్తేస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. శునకాలకు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి సంతానోత్పత్తి ఒక కుక్క జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. పుట్టిన ఏడాది తర్వాత కుక్కలు సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. వీటి గర్భావధి కాలం రెండు నెలలు. ఒక కాన్పులో 5 నుంచి 8 వరకు పిల్లలకు జన్మనిస్తుంది. రేబిస్తో ప్రమాదం రేబిస్ వ్యాధి సోకిన కుక్క మరో కుక్కను, జంతువును, మనిషిని కరచినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డ తర్వాత చికిత్సలు లేవు. 95 శాతం మనుషుల్లో సంభవించే రేబిస్కు కుక్కకాటు ప్రధాన కారణం. ఈ జాగ్రత్తలు పాటించాలి ● కుక్కకాటుకు గురైతే మంచినీటిని ఉపయోగించి కార్బోలిక్ లేదా డెట్టాల్ సబ్బుతో 10–15 సార్లు నురుగు వచ్చేటట్టు కడగాలి. ● గాయంపై ఐస్ ముక్కలను ఉంచడం వల్ల వైరస్ కదలికలను తగ్గించవచ్చు. ● తల భాగంలో కరిస్తే గంట లోపు వ్యాక్సిన్ వేయించాలి. ఒక డోసు కండకు, ఒక డోసు వెన్నుపూసలోకి ఇవ్వాలి. ● కుక్క కరిచిన రోజు, మూడు, ఏడు, 14, 28 రోజులకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. ● యజమానులు వారి కుక్కలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ● పశువుల ఆస్పత్రిలో ఉచితంగా పశువులకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తారు. మనుషులతో పాటు పశువులు కూడా కుక్కకాటు బారిన పడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,198 మందికి కుక్కకాటు బారిన పడ్డారు. ఉచితంగా ఇంజెక్షన్లు అన్ని పశువైద్య శాలల్లో ఉచితంగా యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేస్తారు. కుక్కకాటుకు గురైన పశువు ఇచ్చే పాలను కాచుకుని మాత్రమే తాగాలి. – డాక్టర్ మక్కిన వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, రాజమహేంద్రవరం వెంటనే వైద్యం చేయించుకోవాలి కుక్క కాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, రాజమహేంద్రవరం. -
జేసీ నిడియాదేవి బాధ్యతల స్వీకరణ
అమలాపురం రూరల్: జిల్లా జాయింట్ కలెక్టర్గా వైఖోమ్ నిడియా దేవి గురువారం కలెక్టరేట్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. జేసీ చాంబర్లో వేదాశీర్వచనాల అనంతరం ఆమె పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మణిపూర్కు చెందిన ఆమె 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. కడప జిల్లా రాజంపేటకు సబ్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జేఏడీ విభాగంలో పనిచేసి జేసీగా పదోన్నతి పొందారు. నిడియా దేవి భర్త మేఘ స్వరూప్ రాజమహేంద్రవరంలో జేసీగా పనిచేస్తున్నారు. భార్యభర్తలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్ మహేష్కుమార్ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. డీఎస్ఓ అడపా ఉదయభాస్కర్, పౌరసరఫ రాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్, ఎల్డీ ఎం.కేశవవర్మ, కలెక్టరేట్ ఏవో కడలి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాలో డీజిల్ కొరత లేదు డీఎస్ఓ ఉదయ భాస్కర్ అమలాపురం రూరల్: జిల్లాలో డీజిల్ కొరత లేదని, చమురు కంపెనీల డిపోల నుంచి బంకులకు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ గురువారం తెలిపారు. ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని, రైతుల సాగు పనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన డీజిల్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు 20 లీటర్ల చొప్పున ఆయిల్ క్యాన్లలో డీజిల్ సరఫరా చేయనున్నామని, అయితే రైతు అనే ధ్రువీకరణ బంకు యాజమాన్యానికి చూపాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్థానిక రెవెన్యూ కార్యాలయంలో లేదా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఉదయ భాస్కర్ సూచించారు. నంది వాహనంపై వీరేశ్వరుని ఊరేగింపు ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో నాలుగో రోజు గురువారం గవ్యాంతం, చండీ హోమం, కళా హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం నంది వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. సదస్యం, పండిత పూజ, పండిత సత్కారాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు, కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫీజు చెల్లించలేదని వైవాకు అనుమతి నిరాకరణ బాలాజీచెరువు (కాకినాడ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులు గురువారం మధ్యాహ్నం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. కళాశాలకు సంబంధించి ఫీజు చెల్లించకపోవడంతో వైవా పరీక్షలకు అనుమతించలేదంటూ నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ధర్నా అనంతరం ప్రిన్సిపాల్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. మూడేళ్లుగా ఇక్కడ డిగ్రీ కోర్సు అభ్యసించి కనీసం ఒక ఏడాదికై నా ఫీజు చెల్లించకుండా మూడేళ్లు బకాయి పెట్టడం తగదని, కళాశాలలో పనిచేస్తున్న అఽతిథి, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం కష్టంగా ఉందన్నారు. -
రాష్ట్ర బాస్కెట్బాల్ టోర్నీ విజేత రామచంద్రపురం
బాస్కెట్బాల్ విజేత రామచంద్రపురం మహిళా జట్టుకు, పురుషుల జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు, దాతలు దేవరపల్లి: రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. బుధ, గురువారాల్లో హైదరాబాద్కు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. హైస్కూల్ హెచ్ఎం, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ పర్యవేక్షణలో నిర్వహించిన టోర్నమెంట్లో పురుషులు, మహిళా విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో రామచంద్రపురం, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 42–31 పాయింట్లతో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఏలూరు జట్టుకు ద్వితీయ, రామహేంద్రవరం జట్టుకు తృతీయ స్థానాలు లభించాయి. పురుషుల విభాగంలో రామచంద్రపురం – గుంటూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 65 – 61 పాయింట్ల తేడాతో రామచంద్రపురం జట్టు విజయం సాధించింది. గుంటూరు జట్టు ద్వితీయ, రాజమహేంద్రవరం జట్టు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు ఆంఽధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమని రవినాయుడు చేతుల మీదుగా కప్లు, నగదు బహుమతులు, మెడల్స్ అందజేశారు. గ్రామానికి చెందిన కూచిపూడి రమేష్ కప్లు సమకూర్చగా, కేర్ ఫౌండేషన్ చైర్మన్ రాపాక గాంధీ ప్రథమ నగదు బహుమతిగా పురుషుల జట్టుకు రూ.50 వేలు, రాపాక యూత్ అధ్యక్షుడు రాపాక అశోక్ ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, ఐటీ కంపెనీ ప్రతినిధులు గోపాల్, రవి తృతీయ బహుమతిగా రూ. 20 వేలు సమకూర్చారు. మహిళల జట్టుకు ప్రథమ బహుమతిని ఇమ్మణి సూరిబాబు రూ. 30 వేలు, కొయ్యలమూడి చినబాబు ద్వితీయ బహుమతిని రూ. 20 వేలు, తృతీయ బహుమతిని అనిశెట్టి ప్రభాకరరావు రూ. 10 వేలు సమకూర్చారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, ఆనంద్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల చైర్మన్ సువర్ణరాజు, పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం శివప్రసాద్, కేర్ ఫౌండేషన్ సీఈఓ రాపాక శ్రీ పాల్గొన్నారు. -
సబ్సిడీపై రుణాలు అందించాలి
మామిడి తాండ్ర తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్న మాకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి. బ్యాంకుల ద్వారా తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి భారీగా రుణాలు ఇవ్వాలి. మామిడి పండ్లు, పంచదార, బెల్లం ధరలు పెరుగుతున్నాయి. – మల్లవరపు రమేష్, తాండ్ర తయారీదారు, ఆత్రేయపురం భరోసా కల్పించాలి సంప్రదాయంగా తాండ్ర తయారు చేస్తున్నప్పటికీ కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగడం లేదు. ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలతో పాటు, తాండ్రను రిటైల్గా వ్యాపారం చేస్తున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించాలి. ఈ పరిశ్రమ వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. – సంధ్య, స్టాల్ నిర్వాహకురాలు, ఆత్రేయపురం● -
వ్యక్తి దుర్మరణం
శంఖవరం: కత్తిపూడిలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి తుని వైపు కంటైనర్ వెళ్తుండగా కత్తిపూడిలో వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ షేక్ సుభాని (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది కృష్ణా జిల్లా నూజివీడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం శంఖవరం: గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు ధ్వంసం అయ్యింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ప్రగడ కల్పన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు బీటలు వారాయి. పేలుడు ధాటికి వస్తువులు, దుస్తులు చెల్లాచెదురయ్యాయి. స్టౌపై అన్నం వండుతూ మిగతా పని చూసుకునేందుకు మేడ పైకి వెళ్లిన సమయంతో పెద్ద పేలుడు శబ్దం వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు అదుపు చేశారు. ఇండియన్ గ్యాస్ కంపెనీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. -
ఆర్ఏఓ ఆదేశించినా ‘నో స్టాక్’ బోర్డులు
పెట్రోలు దొరకక వాహన చోదకుల ఇబ్బందులు యానాం: పట్టణ పరిధిలోని పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుమ్మళ్లదొడ్డి పెట్రోలియం కాంప్లెక్స్ నుంచి ఒక్కో బంకుకు ఒక్కో పెట్రోల్ ట్యాంకర్ వస్తుందని, మరి ఆ పెట్రోలు ఏమవుతోందని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి యానాంతో పాటు ఇతర ప్రాంతాల్లో బంకుల్లో సైతం ఒక్క లీటరు పెట్రోల్ కూడా అందుబాటలో లేదు. పెట్రోలియం డీలర్లతో ఇటీవల ఆర్ఏఓ శివరాజ్మీనా సమావేశమై చర్చించినప్పటికీ వారిలో మార్పు లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్లో 20 వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ వస్తుందని, బంకుల వద్ద సంబంధిత తూనికలు, కొలతలు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు అంటున్నారు. రైతుల ఆస్తికి భరోసా కల్పించాలికలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు తమ ఆస్తిపై పూర్తి భరోసా కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఇతర ఉన్నత కార్యదర్శులు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 22 ఏ భూముల తొలగింపు కేసులు రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పురోగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే చేపట్టి భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ ద్వారా భవిష్యత్లో భూ వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు జి.మమ్మీ పాల్గొన్నారు. -
జనన, మరణాలను వారం రోజుల్లో నమోదు చేయాలి
అమలాపురం టౌన్: జనన, మరణాలను మున్సిపల్ కార్యాలయాల్లో వారం రోజుల్లో నమోదు చేయించుకోవాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) కె.శ్రీనివాసరావు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జనన, మరణాల నమోదు విభాగాన్ని ఆయన గురువారం సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందికి దరఖాస్తులు అందిన వెంటనే జనన, మరణాలను నమోదు చేసి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆయా రిజిస్ట్రేషన్లను బైండింగ్ చేసి భద్రపరచాలని సూచించారు. పట్టణంలోని ఆస్పత్రుల యాజమా న్యాలు సైతం జనన, మరణ వివరాలను సకాలంలో నమోదు చేసి నిర్ణీత సమయంలో మున్సిపాలిటీలోని సంబంధిత విభాగానికి అందజేయాలని సూచించారు. ఇళ్ల వద్ద జరిగే జనన, మరణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నమోదు చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ స్టాిస్టికల్ ఆఫీసర్ కె.వీరబాబు, అమలాపురం మున్సిపాలిటీ ఏఎస్వో బీఎన్ శ్రీనివాసరావు, విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిని ఇంటి నుంచి గెంటేయడం నేరం
● లక్ష్మీకాంతంకు న్యాయం చేయండి ● దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ రాజామణి అనపర్తి: కని పెంచిన తల్లిని ఇంటి నుంచి గెంటేయడం చట్టరీత్యా నేరమని దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్, న్యాయవాది కొంకి రాజామణి అన్నారు. గురువారం బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరి లక్ష్మీకాంతానికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే విడిచి వెళ్లిపోవడంతో లక్ష్మీకాంతం ఆ ముగ్గురి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారన్నారు. అలాగే ఆమెకు ఉన్న పూర్వపు ఆస్తులు కూడా ఆ కుమారులకు ఇచ్చేశారన్నారు. ఇది లా ఉండగా మార్చి 5న జరిగిన ఓ సంఘ టనలో నమోదైన కేసు లో ముగ్గురు కుమా రులు నిందితులుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మీకాంతం కుమారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదన్న కోపంతో మార్చి 21న ముగ్గురు కుమారులు, కోడలు, లక్ష్మీకాంతం సోదరుడు, అతని భార్య కలసి లక్ష్మీకాంతం వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కుని కొట్టి బయటకు గెంటేశారన్నారు. అప్పటి నుంచి దేవాలయాల వద్ద తలదాచుకుంటుందని, తన కుమారులు, సోదరులు కలసి తనను చంపాలని చూస్తున్నారని బాధితురాలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని రాజామణి తెలిపారు. అలాగే దళిత, బహుజన మహిళా శక్తి ఆధ్వర్యంలో గురువారం బాధితురాలితో కలసి బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై రవిచంద్రకుమార్కు ఫిర్యాదు కాపీని ఇవ్వడానికి రాగా, ఆమె కుమారులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. -
మింగుడు పడని బొండాలు!
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ వరి రైతుల ఆశల రకం బొండాలు (ఎంటీయూ–3626) కొనుగోలుపై ఈ ఏడాది స్పష్టత లేకుండా పోయింది. ఈ రకాన్ని కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెబుతున్నా మొత్తం పంటలో మూడోవంతు మాత్రమే కొనుగోలు చేయాలని వారు నిర్ణయించుకోవడం రైతులకు మింగుడు పడని అంశంగా మారింది. అనుమతి లేకున్నా సాగు సాధారణమే.. ఏటా బొండాల రకం సాగుకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పడం... రైతులు సాగు చేయడం.. ఆ తర్వాత ప్రభుత్వం మిల్లర్లతో కొనుగోలు చేయించడం సర్వ సాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ రకం సాగుకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పడం, రైతులు పెద్ద ఎత్తున సాగు చేయడం విదితమే. జిల్లా వ్యాప్తంగా 1,29,913 లక్షల ఎకరాలలో రబీ సాగు జరిగిన విషయం తెలిసిందే. దీనిలో సుమారు 37,050.14 ఎకరాలకు పైగా బొండాల రకం సాగు చేశారు. తూర్పు డెల్టాలో 55 బస్తాలు (75 కేజీలు) చొప్పున, మధ్య డెల్టాలో 50 బస్తాల చొప్పున దిగుబడిగా రానుంది. మొత్తం మీద జిల్లాలో 1,47,273 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా రానుంది. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాల్లో ఈ సాగు అధికంగా జరిగింది. ఒక్క కె.గంగవరం మండలంలోని 16,287 ఎకరాల ఆయకట్టులో వరి సాగు జరగగా దీనిలో 15,322.8 ఎకరాల్లో బొండాల రకం సాగు చేశారు. ఇక్కడ ఎకరాకు 55 బస్తాలు (బస్తా 75 కేజీ)ల చొప్పున ఈ మండలంలోని సుమారు 63 వేల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. రామచంద్రపురం మండలంలో మొత్తం ఆయకట్టు 18,953 ఎకరాలు కాగా, ఇక్కడ 18,078 ఎకరాలలో బొండాల సాగు అయింది. ఈ మండలంలోనే 74,571 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఇక ఆలమూరు మండలంలో మొత్తం ఆయకట్టు 9,855 ఎకరాలు కాగా దీనిలో సుమారు 1,497 ఎకరాల్లో బొండాల రకం సాగు చేశారు. ఇక్కడ 6,175 మెట్రిక్ టన్నులు దిగుబడిగా వస్తుందని అంచనా. కొనుగోలు సగం కన్నా తక్కువే.. జిల్లాలో పండే అన్నిరకాల ధాన్యం 4.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దీనిలో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బొండాల రకం కొనుగోలు 67,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కావడం గమనార్హం. బొండాలలో సగం మాత్రమే కొనుగోలు చేయనున్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారుల స్పందన మరో విధంగా ఉంది. ‘ధాన్యం కొనుగోలుకు లక్ష్యం అంటూ ఏదీ లేదని, ఇప్పుడు అనుకున్న పరిమాణానికి మించి కొనుగోలు చేయాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని’ జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శ్రీనివాస్ ‘సాక్షి‘కి తెలిపారు. రైతుల అవసరాలకు సుమారు 20 వేల మెట్రిక్ టన్నులు పోను ఇంకా సుమారు 60,273 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నమ్మకం కోల్పోయిన రైతులు కేరళలో బొండాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా మిగిలిన ధాన్యాన్ని కూడా మిల్లర్లే కొనుగోలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో భాగంగా ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరిలో కలపడంతో మిల్లులకు కొరత ఏర్పడింది. ఇప్పుడు జిల్లాలో కేవలం 18 మాత్రమే బ్రాయిలర్ మిల్లులున్నాయి. వీరు మాత్రమే బొండాల రకం కొనుగోలు చేయాల్సి ఉంది. దీని వల్ల మిలిగిలిన బొండాలు కొనుగోలు సాఫీగా సాగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. అష్టకష్టాలు పడి పంట పండించామని, ఈ సమయంలో కొనుగోలు చేయకపోతే నష్టపోతామని రైతులు ఆందోళనతో ఉన్నారు. బొండాల రకం కొనుగోలుపై అన్నదాతల్లో ఆందోళన రబీలో వాటి సాగే అధికం 1.29 లక్షల ఎకరాల్లో వరి సాగు 37,050 ఎకరాల్లో బొండాల రకం దిగుబడి అంచనా 1.47 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏడాది కొనుగోలు చేయాలనుకొన్నది 67 వేల మెట్రిక్ టన్నులు తక్కువ కొనుగోలు చేస్తే నష్టపోతామంటున్న రైతులు అందుబాటులో ఉన్న బాయిలర్ మిల్లులు 18 మాత్రమే -
మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు!
కుక్, హెల్పర్ల ఉపాధికి గండి విద్యార్థులకు వేడివేడిగా వండి పెట్టడానికి మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఆలస్యమైనా సొంత డబ్బుతో నిత్యావసర సరకులు కొనుగోలు చేసి, వంటలు చేసి పిల్లలకు ఆకలి తెలియకుండా భోజనం వండి వడ్డిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ విధానంతో ప్రస్తుతం కుక్ అండ్ హెల్పర్స్గా పనిచేస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన మహిళల ఉపాధికి గండి పడనుంది. ప్రతీ స్కూలులో ఒకరిద్దరికి భోజనం వడ్డించేందుకు అవకాశం కల్పిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ స్కూలులో విద్యార్థుల సంఖ్యను బట్టి ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఉపాధి పొందుతున్నారు. ఒకరిద్దరికే అవకాశం కల్పిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అని పలువురు వాపోతున్నారు. ‘రూ.3 వేల వేతనం కూడా ప్రతి నెలా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగ పెట్టినట్టు నాలుగైదు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. వడ్డించే పని కూడా ఉపాధ్యాయులకే అప్పగిస్తార’ని పలువురు కుక్లు వ్యాఖ్యానించారు. ● వడివడిగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు ● స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● 2,467 మంది కుక్, హెల్పర్ల ఉపాధికి గండి ● వేడి వేడి భోజనానికి విద్యార్థులు దూరం ● 24న కలెక్టరేట్ వద్ద ధర్నాకు ఎండీఎం కార్మికులు సమాయత్తం కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లలు కడుపారా భోజనం చేసి, శ్రద్ధగా చదువుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేశారు. వారంలో ఆరు రోజులూ విభిన్న పోషకాలతో కూడిన కూరలతో భోజనం వడ్డించేలా గోరుముద్ద పథకాన్ని అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. అయితే డొక్కా సీతమ్మ పేరును చెడగొట్టేలా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు వేస్తోంది. ఇంతవరకూ వంట ఏజెన్సీలతో పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి పొట్టకొట్టడానికి సిద్ధమై పోయిది. గతంలో కుక్లకు రూ.1,000 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తం వారికి ఏమాత్రం సరిపోదని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేలకు పెంచారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుక్ అండ్ హెల్పర్ల కుటుంబాలను రోడ్డున పడేసేలా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇదీ లెక్క.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,551 పాఠశాలలు ఉండగా 86,817 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు పని చేస్తున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మొత్తం 2,467 మంది కుక్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్యాశాఖాధికారులు జిల్లాలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుకు ప్రతి పాదనలు పంపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 1, పెద్ద మండలం అయితే 2 స్మార్ట్ కిచెన్ల చొప్పున ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇంతవరకు ఐ పోలవరం, కె.గంగవరం, మండపేట, రామచంద్రపురం మండలాల్లో 6 పాఠశాలలను స్మార్ట్ కిచెన్లకు ఎంపిక చేశారు. మిగిలిన మండలాల్లో ఎంఈఓ – 2లు పాఠశాలలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ స్మార్ట్ కిచెన్లను సిద్దం చేసి వాటి ద్వారానే మధ్యాహ్న భోజనం పంపిణీ చేయబోతున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ స్మార్ట్ కిచెన్లు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పిల్లలకు చల్లారిన అన్నమే.. ఇంతవరకూ వేడివేడిగా భోజనం చేసిన విద్యార్థులకు స్మార్ట్ కిచెన్ల వ్యవస్థ అర్ధాకలినే మిగల్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో రోజుకు సగటున 81,531 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. మండల పరిధిలో ఒక కేంద్రంలో వంటశాల ఏర్పాటు చేసి. అక్కడ చేసిన వంటలను పాఠశాలలకు పంపుతారు. దీంతో చల్లారిపోయిన అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.24, 27 తేదీల్లో ధర్నాలుప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాం. ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద, 27న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తాం. – టి.నాగవరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా యూనియన్, అమలాపురం ప్రభుత్వమే నిర్వహించాలి ప్రైవేట్ సంస్థలు సేవాభావంతో పనిచేయవు. ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహించాలి. నిత్యం అధికారుల పర్యవేక్షణలో నడిపించాలి. – ఎస్.జ్యోతిబసు, కార్యదర్శి, యూటీఎఫ్, రావులపాలెం -
మహిళల ఆందోళనతో పరీక్షల వాయిదా
అమలాపురం టౌన్: అమలాపురంలోని ఏలీమ్ ఐటీఐలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమెషీన్ శిక్షణ కేంద్రంలో చోటు చేసుకున్న వివాదంతో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. శిక్షణ కేంద్రంలో అసౌకర్యాలపై తాము ప్రశ్నిస్తే బీసీ కార్పొరేషన్కు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది తమకు హాజరు లేకుండా చేసి అనర్హులను చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కార్పొరేషన్కు చెందిన ఓ అఽధికారి కక్ష కట్టి, టార్గెట్ చేసి ఆన్లైన్ పరీక్ష నుంచి తొలగించారని పదిమంది మహిళలు స్థానిక విలేకర్లకు తెలిపారు. తమకు హాజరు సరిపోలేదని సాకుగా చూపి పరీక్షకు హాజరు కాకుండా చేయడానికి అధికారులు యత్నిస్తున్నారని ఇటీవల మునిపల్ కమిషనర్ నిర్మల్కుమార్కు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల ఆందోళనతో బీసీ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ శ్రీనుబాబు పరీక్షలను వాయిదా వేశారు. దళారులు లేకుండా ధాన్యం విక్రయించుకునే ఏర్పాట్లు ఆలమూరు : దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోడేకుర్రు, నర్సిపూడి గ్రామాలలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సత్య కృష్ణ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ తూకంలో వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న చిన్నపాటి సాంకేతిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. అనంతరం సత్యకృష్ణ రైస్ మిల్ను తనిఖీ చేసి గోనె సంచులు, తేమ కొలిచే యంత్రాలు, తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారని నిర్ధారించుకున్నారు. తహసీల్దార్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. జనగణన విధుల్లో పారదర్శకత అమలాపురం రూరల్: జనగణన – 2027 విధులను అధికారులు, సిబ్బంది పారదర్శకతతో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోందని, మే నెలలో నిర్వహించే డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించడంపై సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు రోజుల పాటు జరగనున్న అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 12 పురుషుల జట్లు, 6 మహిళా జట్లు పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. 250 మంది క్రీడాకారులు, 30 మంది పీఈటీలు, కోచ్లు, మేనేజర్లు మొత్తం 350 మంది పోటీలకు హాజరయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటలకు టోర్నమెంట్ ముగుస్తుంది. అనంతపూర్–గొల్లలమామిడాడ మహిళా జట్లతో టోర్నమెంట్ ప్రారంభించారు. పురుషులు, మహిళా జట్ల పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నట్టు శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. -
సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడవరోజు బుధవారం కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతం, సరస్వతి హోమం, స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పట్టువస్త్రాల సమర్పణ అన్నవరం: ఈ నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించేందుకు లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రత్తయ్య (విశాఖపట్నం) రూ.లక్ష విలువైన పట్టు వస్త్రాలను బుధవారం సమర్పించారు. వీటిని ఉపాలయాల్లోని దేవతామూర్తులకు కూడా అలంకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారావు, స్థానిక వాసవీ ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు పేరూరి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకార భరోసా.. తమ్ముళ్ల కులాసా!
● బోటు రిజిస్ట్రేషన్ పేరుతో దోపిడీ ● సుమారు రూ.40,57,000 నొక్కేసిన వైనం ● లబోదిబోమంటున్న మత్స్యకారులు కాట్రేనికోన: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బోట్ల రిజిస్ట్రేషన్ పేరుతో మత్స్యశాఖ అధికారులతో కుమ్మకై ్కన తెలుగు తమ్ముళ్లు భారీ మొత్తంలో దోచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని బలుసుతిప్పకు చెందిన అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి 156, ఒకరు 54, మరొకరు 76, ఇంకొకరు 57 బోట్లకు రూ.10 వేలు చొప్పున సుమారు రూ.34,30,000, ఒకరు 57 బోట్లకు రూ.11 వేలు చొప్పున రూ. 6,27,000 మొత్తం రూ.40,57,000 వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయించకపోవడం, కనీసం తాము చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, కాట్రేనికోనలో ఈ తరహా వసూళ్లు చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కోసం కొంత సొమ్మును అధికారులకు ఇచ్చామని, రెండు నెలల్లో బోట్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని, ఈ ఏడాది మత్స్యకార భరోసా సొమ్ము వచ్చేలా చూస్తామని టీడీపీ నేతలు బుజ్జగిస్తుండడంతో బాధితులు ఈ విషయమై ఎవరికీ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయారు. గతంలో కాట్రేనికోన మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది సహకారంతో కొన్ని బోట్లకు రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం బోట్లకు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో అధికార పార్టీ నేతలు దోచేస్తున్నారు. దళారులను ఆశ్రయించడంతో మోసం సముద్ర, నదీ జలాలలో చేపల వేట కోసం వినియోగించే బోటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సముద్ర వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపల వేట నిషేధ సమయం 61 రోజులకు ప్రభుత్వం మత్స్యకార భరోసా రూ.20 వేలు చెల్లిస్తుంది. దీంతో బోటు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తమకు మత్స్యకార భరోసా సొమ్ము వస్తుందని లబ్ధిదారులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. దీనిపై ఎఫ్డీఓ చలపతితో మాట్లాడగా బోట్లు రిజిస్ట్రేషన్ కోసం నగదు వసూలు విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా దళారులు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మత్స్యకారులు తమ సమస్యలపై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయానికి ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. -
ప్రాణ స్నేహితుల మహా ప్రస్థానం
తాళ్లపూడి: నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే వీరితో పాటు వెళ్లిన గన్నిన నరేంద్ర తీవ్రంగా గాయపడడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన చాపర్ల హనుమంతరావు(45), చాపర్ల రాజు(40), కొవ్వూరుకు చెందిన దుద్దుపూడి సాగర్ (41) కలిసి డిగ్రీ వరకు చదువుకున్నారు. చాపర్ల హనుమంతరావు హేమోఫిలియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి రక్తం గడ్డ కట్టదు. ఏ చిన్న దెబ్బ తగిలినా ప్రాణాపాయం. అటువంటి స్నేహితుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు మిత్రులు చాపర్ల రాజు, దుద్దుపూడి సాగర్. హనుమంతరావుకు మెరుగైన వైద్యం అందించడం కోసం తరచూ చైన్నె తీసుకువెళ్లేవారు. ఈ నెల 19న కూడా అలాగే కారులో చైన్నె వెళ్లారు. చికిత్స ముగించుకుని తిరిగి వస్తుండగా విధి వంచించింది. తెల్లవారుజామున నిద్రమత్తులో కారు సూచిక బోర్డును ఢీకొనడంతో హనుమంతరావుతో పాటు అతనికి అండగా నిలిచిన రాజు, సాగర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో స్నేహితుడు గన్నిన నరేంద్ర మృత్యువుతో పోరాడుతున్నాడు. గ్రామంలో విషాద ఛాయలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మెలిగిన వారు ఇప్పుడు విగత జీవులుగా గ్రామానికి చేరుకోవడంతో గజ్జరం, కొవ్వూరు ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డలు స్నేహం కోసం జీవితాలనే త్యాగం చేశారని, ఇప్పుడు ముగ్గురూ కలిసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పెళ్లిళ్లకు దూరం.. స్నేహమే సర్వస్వం అనారోగ్యంతో ఉన్న హనుమంతరావుకు సేవ చేసేందుకు, అతనికి తోడుగా ఉండేందుకు రాజు, సాగర్ పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. ప్రయివేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ.. ‘మా మిత్రుడికి మేమున్నామంటూ‘ నిత్యం అతనితోనే ఉండేవారు. మృత్యువులోనూ వీడని మిత్ర బంధం స్నేహితుడి చికిత్స కోసం వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం ముగ్గురు అవివాహిత స్నేహితుల దుర్మరణం గజ్జరం, కొవ్వూరులో విషాద ఛాయలు -
పిచ్చికుక్క స్వైర విహారం
పి.గన్నవరం: మండల కేంద్రం పి.గన్నవరంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కనిపించిన వారిని కరుస్తూ భయబ్రాంతులకు గురి చేసింది. మొత్తం ఆరుగురిని గాయపరిచింది. రెండు కుక్క పిల్లల్ని కూడా హతమార్చింది. తొలుత స్థానిక మూడు రోడ్ల సెంటర్లో కొప్పాడి నాగలక్ష్మి, అనంతరం శివాలయం వెనుక రోడ్లో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బెజవాడ గీతిక అనే 7వ తరగతి విద్యార్థినితో పాటు, ఆమె కూడా వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని జి.శ్రీనివాస మంగతాయారును, బాలురు ఎస్హెచ్ఎస్ సాయి, కోట ఏసేబు, మరో వ్యక్తి ఐ.మణికంఠను తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులకు పి.గన్నవరం సీహెచ్సీలో డాక్టర్ వందన వైద్య సేవలు అందించారు. ఇందులో ఏసేబు, గీతిక, నాగలక్ష్మి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. చివరికి స్థానిక అంబేడ్కర్ కాలనీలో స్థానికులు పిచ్చికుక్కను హతమార్చారు. అలాగే రాజులపాలెం గ్రామంలో ఎం.సత్యవతి, బెల్లంపూడిలో డి.వీరేంద్రలను కుక్కలు కరవడంతో పి.గన్నవరంలో చికిత్స పొందారు. బుధవారం 9 డాగ్ బైట్ కేసులకు వైద్య సేవలు అందించినట్టు డాక్టర్ వందన తెలిపారు.ఆరుగురికి తీవ్ర గాయాలు -
కొండపై పెద్దపులి తిష్ట
దేవీపట్నం: రెండు రోజుల క్రితం గోదావరి నదిని దాటుకుని దేవీపట్నం వైపు వెళ్లిన పెద్ద పులి నేలకోట వద్ద కొండపై తిష్టవేసింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద నుంచి రామదుర్గం కొండను దాటుకుని సమీపంలో శరభవరం వైపున కొండపైకి చేరింది. ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు సిబ్బందితో కలసి పులి గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంపై సమీప గ్రామాలైన దేవారం, శరభవరం, పోతుకొండ, నేలకోట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి, తోటల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి పయనాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. బుధవారం రాత్రికి పులి కొండ దిగితే శరభవరం నేలకోట రహదారిని దాటుకుని సీతానగరం మండలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. -
మార్కులు పెంచుకుందాం రండి
● ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వరం ● 27 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంరాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి 2024లో ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇంటర్ బోర్డు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంఫ్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్కు అవకాశం ఉండేది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు ఇంటర్ బోర్డు చెక్ పెట్టింది. ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు.. ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు.. ఏవీ ఎక్కువ మార్కులు అయితే వాటినే ఇంటర్ బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇంటర్ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 43,108 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 18,337 మంది పరీక్షలు రాయగా, 15,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో కనీసం రెండు వేల మంది ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పుస్తకం.. అక్షర సుమాల హారం
● రచనలకు పుట్టినిల్లు ఉమ్మడి జిల్లా ● సమాజ హితానికి ఎన్నో ప్రచురణలు ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంకపిలేశ్వరపురం: పుస్తకం.. అక్షర సుమాల హారం. జ్ఞాన దీపాల సమూహం. భావాలను వ్యక్తపరిచే ఓ సాధనం. కొత్త విషయాలను తెలిపే ఆయుధం.. అలాంటి పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించేందుకు యునెస్కో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది. గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ కథనం. కందుకూరి వీరేశలింగం పంతులు 1903లో మద్రాస్లో ఉంటూ స్వీయ చరిత్రను తొలుత 112 పేజీలతో ఆయన సొంత చింతామణి ప్రెస్లో ముద్రించారు. మిగిలిన భాగాలను బెంగళూరులో ఉంటుండగా, పూర్తి చేసినట్టు ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో 1920 డిసెంబర్ 15న రాసిన ముందుమాటలో తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ ఇప్పటి వరకూ 21 పుస్తకాలను ప్రచురించింది. మారుమూల గ్రామమైన కపిలేశ్వరపురం మండలం టేకికి చెందిన కావూరి పట్టాభిరామయ్య ‘టేకి నుండి టెగ్జాస్ వరకూ’ పేరుతో రాసుకున్న తన ఆత్మకథను 1981 మే నెలలో వెలువరించారు. అప్పటి ఏపీ ప్రభుత్వ ఆస్థాన కవి డాక్టర్ దాశరథి, మహాకవి డాక్టర్ బోయి భీమన్నలు కావూరి కృషిని ప్రశంసిస్తూ పలు మాటలు ఆ పుస్తకంలో రాశారు. కొనసాగుతున్న రచన కందుకూరి వీరేశలింగం 1920లో రాసుకున్న స్వీయ చరిత్రను చదవడంలో ఆధునిక పాఠకులకు భాషాపరమైన ఇబ్బంది తలెత్తుతుంది. ఆ పుస్తకానికి ఉన్న ప్రాశస్త్యాన్ని డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు చెలికాని స్టాలిన్ గుర్తించి, అదే పేరుతో కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చారు. 800 పేజీల ఆ పుస్తకాన్ని కాకినాడకు చెందిన పీఎస్ ప్రకాశరావు సరళతరం చేస్తూ, 172 పేజీలకు సంక్షిప్తం చేశారు. 2025 జూలైలో ప్రథమ ముద్రణ రామచంద్రపురంలో, రెండో ముద్రణ కాకినాడలో, మూడో ముద్రణ ఈ నెల 16న రాజమహేంద్రవరంలోని ఏబీ నాగేశ్వరరావు పార్క్లో సీనియర్ సిటిజన్స్, ప్రజా సంక్షేమ వేదిక పర్యవేక్షణలో ఆవిష్కృతమయ్యాయి. పిఠాపురానికి చెందిన మేకా గౌరవ్ జర్మన్ రచయిత విలియం లిబ్నిక్ పుస్తకాన్ని ‘సాలీడు, ఈగ’ పేరుతో అనువాదం చేశారు. నందిమూపురం, పురుషుడు– సీ్త్ర, చదువు అంటే ఏమిటి?, ప్రత్యామ్నాయ సినిమాలు తదితర పుస్తకాలను రాశారు. ఈ నెల కాకినాడలోని దంటు కళాక్షేత్రం యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో ‘తెలుగు నాటకరంగం– నాడు– నేడు– రేపు’ పేరుతో గౌరవ్ సంపాదకత్వాన తీసుకొచ్చిన వ్యాస సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాకినాడకు చెందిన గనారా తదితరుల బృందం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో భారీ పరిశ్రమలపై ప్రత్యేక సర్వే చేశారు. అందులోని అంశాలను ‘కడలి కల్లోలం’ పేరుతో నవలగా రాయగా 2016 వైజాగ్లో నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్త డా.ప్రభాత్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఎలాంటి సాహితీ పునాది లేని కుటుంబానికి చెందిన దేవగుప్తం పేరలింగం మూఢ నమ్మకాల గుట్టును రట్టు చేసే పుస్తకాలను తన సైకిల్కు కట్టుకుని క్షేత్ర స్థాయిలో పంచుతూ చర్చ పెట్టేవారు. తన సైకిల్కు ‘హేతువాద చైతన్య రథం’ పేరు పెట్టుకున్నారు. అధ్యయనం అలవాటు చేసుకుని 13 పుస్తకాలను సొంతంగా రచించారు. తన ఇంట్లో ‘సైన్స్ గ్రంథాలయం’ నడిపారు. పేరలింగం 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన కృషి కొనసాగించారు. కాకినాడకు చెందిన రావు కృష్ణారావు రచనలు జంగాలోపాఖ్యానం, ఆధునిక బేతాళ కథలు, బతుకుపోరు కథా సంకలనం, మనిషి, సమాజం తదితర పుస్తకాలు సమాజ మార్పునకు కృషి చేసేలా మనిషికి ప్రేరణ కల్పిస్తాయి. సాహిత్య కార్యక్రమాలు ఇలా.. ఈ నెల 5న రాజమహేంద్రవరంలో వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన ‘శతాయుష్మాన్ భవ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలోని ఏటూరి సాహిత్యభిమాన సమితి ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు, ఎనిమిది గ్రంథాలుగా రూపొందిన పుస్తకాలను రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన వికాసానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021 ఆగస్టులో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ గ్రంథాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరిస్తోంది.వివిధ కాలాలకు వారధిలా.. గత, వర్తమాన, భవిష్యత్ సామాజిక పరిస్థితులను తెలిజేసే సాధనం పుస్తకం. ఆయా కాలాలకు వారధిగా పుస్తకం ఉండాలి. 1920 నాటి రోజుల్లోని కందుకూరి స్వీయ చరిత్ర నేటికీ ప్రాంగికత కలిగి ఉంది. పుస్తకం చదవడం రోజువారీ జీవితంలో భాగం కావాలి. – డాక్టర్ పీఎస్ ప్రకాశరావు, రచయిత, కాకినాడ సామాజిక బాధ్యతగా.. పుస్తకాన్ని రచించడం, అధ్యయనం చేయడం సామాజిక బాధ్యత. ఏపుస్తకమైనా సమాజ మార్పునకు ప్రేరణ కలిగించేదిగా ఉండి తీరాలి. మూఢత్వాన్ని, ఛాందసాన్ని ప్రజలకు దూరం చేసేదిలా ఉండాలి. – గనారా, రచయిత, కాకినాడ -
జేఈఈ మెయిన్స్లో విజయకేతనం
రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాల్లో రాజమహేంద్రవరం ఎస్ఆర్ విద్యా సంస్థకు చెందిన విద్యార్థి చిట్టాల మోహన్స్వరూప్ ఆల్ ఇండియా 790వ ర్యాంకును సాధించాడు. అదే విధంగా యర్ర గుణవీరబాబు జాతీయ స్థాయిలో 1568వ ర్యాంకు పొందాడు. ఎస్ఆర్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కేటగిరీలలో అద్భుతమైన ఘన విజయాలు సాధించారని రాజమహేంద్రవరం జోనల్ ఇన్చార్జి మురళీధర్ తెలిపారు. ఆ విద్యా సంస్థల డైరెక్టర్ ఎ.సంతోష్రెడ్డి, సీఈఓ సురేంద్రరెడ్డి, జీఎం రాజేంద్రప్రసాద్, డీజీఎం రమణ, రాజమహేంద్రవరం జోనల్ ఇన్చార్జి మురళీధర్లు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. మందుబాబులకు జైలు శిక్ష పిఠాపురం: మందుబాబులకు పిఠాపురం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పిఠాపురం మండలం నర్సింగపురం రోడ్డులో రూరల్ ఎస్సై ఎస్ఎస్కే జాన్బాషా తనిఖీలు చేపట్టారు. ఇందులో పది మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచగా, ఇద్దరికి ఐదు రోజుల చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బొమ్మిడి విజయభారతి శిక్ష విధించారు. మిగిలిన ఎనిమిది మందికి రూ.10 వేల చొప్పున జరిమానా వేశారు. ద్విచక్ర వాహనం చోరీకాకినాడ లీగల్: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో ఉంచిన ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన మల్లాడి ధనేష్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పని నిమిత్తం వచ్చారు. కార్యాలయ ఆవరణలో తన బైక్ను పెట్టి లోపలకు వెళ్లి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో ధనేష్ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులుతొండంగి: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చని ఏపీ సీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జె.ఎలియాజర్, మండల వ్యవసాయశాఖ అధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ అన్నారు. బెండపూడిి గ్రామ రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎంతో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చన్నారు. రసాయన ఎరువులు వాడకుండా ఘన జీవామృతం, బీజామృతం వంటి వాటిని తయారు చేసి వినియోగించడం ద్వారా తెగుళ్ల నివారణకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం రబీ వరి పంట కోతలు కోస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చి రొట్ట విత్తనాలను (పీఎండీఎస్) వేయాలన్నారు. ఈ పైరు సాగు చేయడం ద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. వేసవిలో భూమి వేడి తగ్గి వచ్చే ఖరీఫ్ పంట సాగుకు మేలు జరుగుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ అధికారి మాదన సతీష్వర్మ, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు -
ఎట్టకేలకు బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు
ఆత్రేయపురం : ఎట్టకేలకు ప్రభుత్వం బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు మొదలు పెట్టింది. సుమారు రూ.76 లక్షలతో బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారి నుంచి వెలిచేరు వరకు, లొల్ల వంతెన సమీపంలో 300 మీటర్లు మేర మరమ్మతులు ప్రారంభించారు. ఈ రహదారి దుస్థితిపై సాక్షి పత్రికలో గత నెల 13వ తేదీన ‘తారుక్కుపోయేలా..’ శీర్షికన వార్త ప్రచురించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించారు. మంగళవారం బొబ్బర్లంక నుంచి అమ్మవారి గుడి వరకు రోడ్డు వేశారు. -
గట్టుకాయస్వాహా!
రొయ్యల సాగు కారణంగా.. వశిష్ట, వైనతేయ, గౌతమీ, వృద్ధ గౌతమీ తీరాల వెంబడి అనేకచోట్ల ఆక్వా సాగు అధికంగా ఉంది. సన్న కారు రైతులు, వివిధ సొసైటీ భూముల సాగుదారులు కలిసి ఉమ్మడిగానో లేక విక్రయాల ద్వారానో పెద్ద చెరువులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటి వరకూ ఈ భూముల రాకపోకలకు గల మార్గాలు మూసుకుపోయాయి. చెరువుల రక్షణ కోసం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలా దారులు మూసుకుపోయాయి. బ్రిటిష్ హయాం నుంచీ కూడా ఇక్కడ ఉన్న మార్గాలు సైతం ప్రస్తుత కాలంలో కనుమరుగుకావడం గమనార్హం. కారణలేంటి? బ్రిటిష్ కాలంలోని గల మార్గాలు ప్రస్తుతం మూసుకుపోవడానికి కారణాలు ఏంటీ. నది కూడా అనేకచోట్ల కోతకు గురికావడం, ఉన్న జిరాయితీ స్థలాలను రైతులు మూసివేయడం. భారీ నిర్మాణాలు, టూరిజం అభివృద్ధి, ఆక్వా చెరువుల ఏర్పాటు సమయంలో ల్యాండ్ కన్వర్షన్. సీఆర్జెడ్ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వంటి కారణాల వల్ల ఇలా గట్టులపై ప్రజల, ప్రభుత్వాల హక్కులు చేజారిపోతున్నాయి. ఈ నిబంధనలు సక్రమంగా అమలు అయితే ఇటువంటి మార్గాల సమస్యలు ఉత్పన్నం కావు. దారులపై ఏర్పడ్డ ఆక్రమణలను తొలగించాల్సి ఉంది. ● మూసుకుపోతున్న నదులు, వాగుల ఒడ్డుకు చేరే మార్గాలు ● ఏళ్ల తరబడి యథేచ్ఛగా ఆక్రమణలు ● రొయ్యల సాగు, రియల్ ఎస్టేట్లతో కనుమరుగువుతున్న దారులు ● ప్రమాదాలు సంభవించినా చేరే మార్గం కరవు మలికిపురం: కొంతకాలంగా నదీ తీరాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులు, సెలఏర్లు, కాటన్ హయాంలో ఏర్పాటయిన కాలువలు, డ్రైన్ల గట్లు కనుమరుగవుతున్నాయి. దారులు మూసుకుపోయి సాధారణ ప్రజలకు నదీ తీరం చూద్దామంటేనే దారి లేకుండా పోతోంది. ఫలితంగా ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితి ప్రజలకు లేకుండా పోతోంది. దీనికి కారణం ఎవరు. పర్యవేక్షణ చేయని అధికారులా? లేక మారుతున్న ఆక్వా వంటి వ్యవసాయ విధానంతో పాటు, రియల్ ఎస్టేట్, భారీ నిర్మాణాలా? అంటే ఇవన్నీ కారణాలే! 40 ఏళ్లుగా గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల నది పరివాహక తీరాలు, డ్రైన్లు, పెద్ద కాలువల గట్లు కనుమరుగయ్యాయి. టూరిజంతో మారిన రూపురేఖలు గోదావరి తీరంలో టూరిజం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులలో వశిష్ట నదీ తీరంలో అనేక మంది ప్రయివేటు రిసార్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీటి కోసం నదీ తీరం ఆక్రమించి నిర్మాణం చేయడంతో ఇక తీరానికి వెళ్లే మార్గం లేకుండాపోయింది. ఈ పరిస్థితి వశిష్ట నదీకి ఇరువైపులా అనేకచోట్ల నెలకొంది. ఆపదల వేళ చేరే మార్గం కూడా కరవు ఇక నదులలో, నదీ తీరాలలో ప్రమాదాలు జరిగితే హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టడానికి వెళ్లేందుకు కూడా మార్గాలు లేవు. ఇటీవల కాలంలో దిండి– చించినాడ, పాశర్లపూడి– బొడసకుర్రు, యానాం, ఎదుర్లంక వంతెనల నుంచి పలువురు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తలెత్తుతున్నాయి. ఆ సమయాలలో వంతెనల వద్ద నుంచే పడవలతో నదిలోకి వెళ్లి గాలించడం, మృతదేహాలను వెలికితీయడం చేస్తున్నారు. వంతెన నుంచి అనేక కిలోమీటర్ల మేర నదిలోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. కానీ ఏ గ్రామంలోని తీరంలో మృతదేహం ఉన్నా అక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేకపోతున్నారు. అందుకు కారణం గతంలో ఉన్న మార్గాలు మూసుకుపోవడమే. భారీ ప్రమాదాలు సంభవిస్తే.. గతంలో ముంబైలో ఒక సినిమా థియేటర్, హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడంతో దేశంలో ప్రతి థియేటర్, షాపింగ్మాల్, విద్యాసంస్థ, స్టేడియంలకు అగ్నిమాపక యంత్రాలు చేరేలా చర్యలు తీసుకున్నాం. కానీ నదులు, క్రీక్లలోను, వాటి తీరం వెంబడి భారీ ప్రమాదాలు సంభవిస్తే అక్కడికి చేరేందుకు మార్గం లేదు. అసలే కృష్ణా గోదావరి బేసిన్ ఆయిల్, గ్యాస్ నిక్షేప క్షేత్రాల నిలయం. ఆన్షోర్, ఆఫ్షోర్ల ద్వారా నేరుగా పైప్లైన్లు ఈ నదులు, క్రీక్ల అడుగు భాగాల నుంచి, జనావాసాల మధ్య నుంచి టూరిజం కేంద్రాల కింద నుంచీ కూడా దేశంలోని గుజరాత్ వంటి ప్రాంతాలకు సైతం వెళ్లాయి. 2014 సంవత్సరంలో నగరంలో గ్యాస్ పైప్లైన్ పేలింది. నగరంలోని ఒక డ్రైన్ సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో రక్షణ చర్యలకు ఇబ్బంది పడలేదు. కానీ ఏ నది వద్దనో లేక క్రీక్లోనో ఇలాంటి ఘటనలు జరిగితే రక్షణ బృందాలు ఎలా చేరాలి అన్న పెద్ద ప్రశ్న. నదులు కూడా ఇక్కడ రద్దీగానే ఉంటాయి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పడవ ప్రయాణాలు, పంట్లు, మత్స్యకార బోట్ల రాకపోకలు కూడా అధికంగానే ఉన్నాయి. యానాంతో పాటు బొడసకుర్రు, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ల నుంచి నదులలోకి బోట్లు రాకపోకలు అధికం. స్థానిక మత్స్యకారులు కూడా అధికంగా పడవలలోనే సంచారం చేస్తారు. సఖినేటిపల్లి, ముక్తేశ్వరం, సోంపల్లి రేవుల్లో కూడా ప్రయాణికుల రాకపోకలు అధికం. గడచిన నాలుగేళ్లలో పలుమార్లు నర్సాపురం రేవు నుంచి పంటు ఇంజన్ ఆగి పోయి సముద్రం వైపు రెండు కిలోమీటర్ల మేర వెళ్లిపోయింది. హాహాకారాలు చేయడం ప్రజల వంతు అయింది. ప్రమాదాలు సంభవిస్తే రక్షణ చర్యలకు మార్గాలు లేవు. కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఎంపీ హరీష్కు కేఆర్ఎస్ఎస్ బృందం వినతి అమలాపురం టౌన్: కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంలో స్తబ్దతను తొలగించి త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్కు కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. కమిటీ ప్రతినిధి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఎంపీ హరీష్ను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. కోనసీమ రైలు నిర్మాణానికి 26 ఏళ్ల కిందట పునాది రాయి పడినా లైన్కు భూసేకరణ, అలైన్మెంట్ నిర్ధారణ పూర్తి కాలేదని చెప్పారు. అమలాపురం వరకు భూసేకరణ పూర్తయినా రైల్వే శాఖకు ఆ భూమిని స్వాధీనం చేసి, లైన్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల పరంగా సమస్యలు ఉంటే ఆ భూములకు సంబంధించిన రైతులతో చర్చించి పరిష్కరించాలని ఎంపీకి బృందం సూచించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేఆర్ఎస్ఎస్ భావిస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ హరీష్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ పనులపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో ప్రాజెక్ట్కు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల గురించి ప్రస్తావిస్తానని తెలిపారు. కమిటీ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, బీఎన్ మూర్తి, ఉప్పుగంటి భాస్కరరావు, సప్పా నాగేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ, ఎరగర్త వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కాలువలు, డ్రైన్ల దుస్థితీ ఇంతే.. ఇక గ్రామాలలో ప్రధాన పంట కాలువలూ, డ్రైన్ల దుస్థితి కూడా ఇలాగా ఉంది. అనేకచోట్ల రొయ్యల చెరువులు, రియల్ ఎస్టేట్ల కారణంగా వీటి తీరాలకు చేరే మార్గాలు మూసుకు పోయాయి. కూనవరం, శంకరగుప్తం మేజర్ డ్రైన్లతో పాటు రాజమహేంద్రవరం వద్ద నుంచి విడిపోయిన అఖండ గోదావరికి గల వివిధ పాయల పరిస్థితి కూడా ఇలాగా ఉన్నట్లు అధికార యంత్రాంగం వద్ద సమాచారం ఉంది. ఇటీవల రైతులు తీవ్రంగా నష్ట పోయి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన శంకరగుప్తం క్రీక్ పూడికతీతకు ఉపక్రమించేందుకు సుమారు 400 ఎకరాలలో ఆక్రమణలు, 150 పైగా అక్రమ నిర్మాణాలు, వేలాది కొబ్బరి చెట్లు అడ్డంకిగా ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. వీటిని తొలగిస్తేనే గాని ఈ క్రీక్నకు రక్షణ గట్టు వేయలేమని చెప్పడం గమనార్హం. 0000705054-000001-AP BP CREDIT SA 10.00x8.00 AP BP CREDIT SALES -
హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిలోని జొన్నాడలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం తుది ఇచ్చింది. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు గురించి ఆలమూరు పోలీసులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోనున్న ఉప్పరగూడెంకు చెందిన మరుమట్ల ఆనంద్ అలియాస్ ఆనందీ అనే హిజ్రా ఆ సమయంలో ధవళేశ్వరంలో సహచర హిజ్రాలతో కలిసి నివాసం ఉంటోంది. 2023 మే 12 రాత్రి జొన్నాడ హైవే పక్కన పంటకాలువలో దారుణ హత్యకు గురైంది. సంచలనంగా మారిన ఈ హత్యకేసుకు సంబంధించి ధవళేశ్వరం గ్రామానికి చెందిన ధనాల మందాకిని అనే హిజ్రా ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎస్.శివప్రసాద్ కేసును నమోదు చేశారు. రావులపాలెం రూరల్ సీఐ ఎన్.రజనీకుమార్ దర్యాప్తు చేయగా కొత్తపేట డీఎస్పీ కెవి.రమణ పర్యవేక్షణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేత వెంకట భరత్ సుధీర్ అలియాస్ పెద్ద (ధవళేశ్వరం), వేలు కళ్యాణ్ అనే పెద కాళీ (బొమ్మూరు), సింగంపల్లి కార్తీకేయ అలియాస్ సింబ (ధవళేశ్వరం)కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు చెప్పారు. బాధితుల తరఫున పీపీలు కె.రాధాకృష్ణ రాజు, డి.వాణిభాయి వాదనలు వినిపించారు. ఈ కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవీ అశోక్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. -
రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం కూడదు
అమలాపురం: భూ పరిపాలన రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 22 ఏ భూములు, రిసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, ముటేషన్లు, పీజీఆర్ఎస్ అంశాల పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జాబితాలో ఉన్న భూములపై వచ్చే అభ్యర్థనలను త్వరగా పరిష్కరించాలన్నారు. భూ రీ–సర్వే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, సవరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలన్నారు. ఆర్డీవో జి.మమ్మీ, తహసీల్దార్ చినబాబు, భూ పరిపాలన సూపరిండెంట్ సుబ్బరాజు పాల్గొన్నారు. కమనీయం.. వీరేశ్వరుని కల్యాణం ఐ.పోలవరం: మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం వీరేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎదురు సన్నాహం, ద్వాదశ ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు ఆదిశైవ అర్చక సంఘ అద్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువు జరుగనుంది. మంగళవారం ఆలయంలో ఉదయం గణపతి హోమం, ప్రధాన కలాశారాధన, వాస్తు పూజ, సాయంత్రం ‘చంద్రప్రభ’ వాహనంపై గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. ఏర్పాట్లను ఆలయ ఈవో వై.సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. వాడపల్లి వెంకన్నకు బంగారు నామం సమర్పణ ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిమ్మల శ్రీను, పద్మ దంపతులు, కుటుంబ సభ్యులు రూ.1 లక్ష 30 వేల విలువైన 8.38 గ్రాముల బంగారు నామం సమర్పించారు. -
బుచ్చయ్యకు మెంటల్
అల్లవరం: తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్సార్ సీపీ వారు గుమ్మం బయటకు రాలేరని, నరకి పారేస్తామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. ఆయన మంచి డాక్టర్కి చూపించుకుని రోగాన్ని నయం చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుచ్చయ్యచౌదరికి వయసు పెరగడంతో పాటు బుద్ధి లోపించిందని, ఎమ్మెల్యేకు తక్కువ.. వీధి రౌడికి ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి గమనిస్తే గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, సమాజంలో మహిళలు, ఉద్యోగులు, బాలికలకు వీరి వల్ల రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పనితీరును, ఎమ్మెల్యేల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారని ఇజ్రాయిల్ పేర్కొన్నారు. ఫ్యాప్టో చలో విజయవాడ కరపత్రాల విడుదల అమలాపురం టౌన్: ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాలను జిల్లాలోని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ పోతంశెట్టి దొరబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో చలో విజయవాడ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఉపాధ్యాయుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర స్థాయి రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు సుబ్బారావు తెలిపారు. కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రతినిధులు కె.కళ్యాణ్బాబు, షబ్బీర్ హుస్సేన్, జీవీవీ సత్యనారాయణ, ఎండీ ఖాజా మొయినుద్దీన్, పెంకే వెంకటేశ్వరరావు, షానవాజ్ హుస్సేన్ మాజీంద్రాణి పాల్గొన్నారు. జనగణన పేరిట సైబర్ మోసాలు – జనం అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అమలాపురం రూరల్: జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు ఇళ్లకు రావడం, ఫోన్లు చేసి తాము జనగణన సిబ్బంది అని చెప్పి ఓటీపీలు, ఇతర వివరాలు అడుగుతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్. మహేష్కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన ముమ్మరంగా జరుగుతోందన్నారు. జనాభా లెక్కించే సిబ్బంది మీ నుంచి సెల్ ఫోన్ నంబర్ తప్ప ఓటీపీలు అడగరన్నారు. వేలిముద్రలు, కళ్ల నుంచి ఐరిస్ తీసుకోరని, ఎవరైనా అడిగితే చెప్పొద్దని కలెక్టర్ సూచించారు. జనగణన ప్రక్రియపై ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. మే 1 నుంచి 30 వరకు సిబ్బంది ఇళ్లకు వచ్చి ఇంటి వివరాలు సేకరిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వచ్చే సందేహాల నివృత్తికి సమస్యల పరిష్కారానికి 1855 టోల్ నంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చునన్నారు.ి ససిబ్బంది ప్రవర్తన శైలి, వారితో ఏమైనా సమస్యలు ఉంటే 1855కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. జిల్లావ్యాప్తంగా 2,408 మంది ఎన్యుమరేటర్లు, 388 మంది పర్యవేక్షకులు ఉన్నారన్నారు. జన గణనకు వచ్చిన సిబ్బంది నిజమైన వారా లేదా సైబర్ నేరగాళ్ల అని పరీక్ష చేయాలని, సిబ్బంది మెడలో గుర్తింపు కార్డు ఉందా లేదా అన్నది ప్రజలు గమనించాలన్నారు. గుర్తింపు కార్డులో క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అతని వివరాలు కనిపించాలన్నారు. అప్పుడే వారు నిజమైన సిబ్బంది అని నిర్ధారించుకోవాలన్నారు. గంజాయి నిందితుల అరెస్ట్ రంపచోడవరం: మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న పరారైన గంజాయి తరలింపు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ టీజీఎన్ ప్రసాద్, ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపారు. మారేడుమిల్లి శివారు జీఎం వలస జంక్షన్లో సోమవారం పట్టుకున్నామన్నారు. ఇందులో అప్సల్ ఆర్ఏ (కర్ణాటక), నఫ్రాజ్ (కేరళ), ఫైజాన్ రజాక్ సికే (కర్ణాటక) ఉన్నారన్నారు. ధారకొండ నుంచి 152 కిలోల గంజాయిని కారులో మారేడుమిల్లి మీదుగా బెంగళూరు తరలిస్తూ పోలీసులను చూసి పరారయ్యారు. -
సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు
అమలాపురం టౌన్: అమలాపురం మున్సిపాలిటీలో ఓ వార్డు సచివాలయ సెక్రటరీగా ఉన్న, ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) కె.నాగమణికి లిఖిత పూర్వకంగా చేశారు. ఆ మహిళా ఉద్యోగి తన పేరు, చిరునామా ప్రస్తావించకుండా ఫిర్యాదు చేయడంతో ఆమె ఎవరు? అనే కలకలం మున్సిపల్ కార్యాలయంతోపాటు పట్టణంలోని 15 వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో రేగింది. ఆమె తన ఫిర్యాదులో విజయ్కుమార్ అనే ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆమె ఈ ఫిర్యాదు నెల రోజుల కిందటే చేశారు. ఫిర్యాదు అందుకున్న ఐసీడీఎస్ పీడీ నాగమణి వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక పంపమని మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్కు సూచించారు. ఆమె ఫిర్యాదు పంపించి నెల రోజులు గడస్తున్నా ఇంత వరకూ పీడీకి నివేదిక వెళ్లలేదు. బాధితురాలు ఫిర్యాదులో పేరు ప్రస్తావించకపోవడంతో మున్సిపల్ అధికారులు ఈ ఫిర్యాదును తేలికగా తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఐసీడీఎస్ జిల్లా పీడీ నాగమణిని ‘సాక్షి’ సంప్రదించగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగి తనకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు. తనకు ఫిర్యాదు అందగానే తాను దీనిపై విచారణ చేసి నివేదిక పంపాలని మున్సిపల్ కమిషనర్కు లిఖిత పూర్వకంగా సూచించానని చెప్పారు. ఫిర్యాదు పంపించి నెల రోజులు కావస్తున్నా ఇంకా తనకు నివేదిక పంపలేదని నాగమణి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ను కూడా ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే నివేదిక పంపిస్తానని చెప్పారు. బాధితురాలు పేరు, చిరునామా లేకుండా ఆకాశ రామన్న ఉత్తరం మాదిరిగా పంపించడంతో ఫిర్యాదులో ఎంత వరకూ వాస్తవికత ఉందో పరిశీలిస్తున్నామన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 36 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 అర్జీలు వచ్చాయి. అర్జీదారులతో ఎస్పీ రాహుల్మీనా ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆయా స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐ, ఎస్సైలతో చర్చించారు. అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. ఐసీడీఎస్ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కు సూచన అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి -
వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, స్వామి, అమ్మవార్లకు అభిషేకం అనంతరం వధూవరులను చేయడం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం ధ్వజారోహణ, స్వామివారిని అమ్మవారిని భద్రపీఠంపై ఊరేగించారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉత్సవ మూర్తుల దాత శ్రీ జంపన రామకృష్ణంరాజు దంపతులు, ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, స్థానిక మహిళామండలి సభ్యులు పాల్గొన్నారు. రెండవ రోజు కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం వాస్తు పూజ, వాస్తు హోమం, అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై ఊరేగింపు, ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణ, అనంతరం కల్యాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
● ఐదుగురి అరెస్ట్ ● రూ.1.50 లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం ● ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలో ఓ కిరాణా షాపు వ్యాపారికి నకిలీ నోటు పరంగా కలిగిన అనుమానంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు అయింది. దీంతో దొంగ నోట్ల ముఠా సభ్యులైన కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన దేవి చంద్ గెహ్లోట్, రామచంద్రపురానికి చెందిన పలివెల నూకరాజు, విశాఖపట్నం జిల్లా శాలిపేటకు చెందిన మీసాల అప్పలరాజు, మండపేట మండలం మేడపాడు గ్రామానికి చెందిన బత్తుల శ్రీను, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన మట్టాడి దేవీప్రసాద్లను రామచంద్రపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్డులో హాజరుపరిచారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్ మీనా ఈ దొంగ నోట్ల ముఠా చేసిన నేరాలను విలేకరులకు వివరించారు. ఈ ముఠా నుంచి రూ.55 వేల నకిలీ రూ.500 నోట్లు, ప్రింటింగ్ మెషీన్లో ఉన్న రూ.95 వేల నకిలీ రూ.500 నోట్లు కలిపి మొత్తం రూ.1.50 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లు, నకిలీ నోట్లకు సంబంధించిన 46 పేపర్లు, కలర్ ప్రింటర్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్, రెండు ల్యాప్టాప్లు, వోల్టేజీ ఫ్రీక్వెన్సీ మెషీన్, కీ బోర్డు, కటింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. గట్టు రట్టు అయిందిలా.. రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలో గల ఓ కిరాణా షాప్ వద్దకు ఇద్దరు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి షాపులో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. షాపు యాజమానికి నోటుపై అనుమానం వచ్చి పరికించాడు. అది దొంగ నోటుగా గుర్తించాడు. ఆ ఇద్దరు వ్యక్తులను ఆరా తీస్తున్న సమయంలో వారు తమ బైక్లపై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసిన షాపు యజమాని.. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీగ లాగితే డొంక కదిలినట్టు.. ఈ ఫిర్యాదుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా తీగ లాగితే డొంక కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టు రట్లు అయింది. దొంగ నోటు మార్చేందుకు వచ్చిన దేవి చంద్ గెహ్లోట్ను విచారించగా.. పలివెల నూకరాజు తనకు పరిచయమై రూ.500 నకిలీ నోట్లు మార్చితే లాభం వస్తుందని చెప్పాడని పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వీరద్దరూ గ్రామాల్లో మోటారు సైకిళ్లపై తిరుగుతూ దొంగ నోట్లు మార్చుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సబ్ జైలులో స్నేహం.. దొంగ నోట్ల వ్యాపారానికి శ్రీకారం పట్టుబడ్డ మరో వ్యక్తి నూకరాజు పోలీసులు ప్రశ్నించినప్పుడు కొత్త విషయం వెలుగు చూసింది. నూకరాజు దొంగతనం కేసులో రామచంద్రపురం సబ్ జైలులో ఉండగా.. అతనికి అప్పటికే జైలులో ఉన్న మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, మట్టాడి దేవిప్రసాద్ పరిచయం అయ్యారు. ఈ పరిచయం స్నేహంగా మారి దొంగ నోట్ల ప్రింటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో విశాఖపట్నంలో దొంగ నోట్లు ముద్రించడానికి అవసరమైన మెషీన్లు, సామగ్రి కొనుగోలు చేశారు. అలా వీరి దొంగ నోట్ల ప్రస్థానం మొదలైంది. మండపేట మండలం వేములపల్లి శివారులో బత్తుల శ్రీను రూమ్ను దొంగ నోట్ల ముద్రణకు అడ్డాగా చేసుకున్నారు. రామచంద్రపురం సీఐ ఎం.వెంకటరమణ, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఏసు, యు.సూరిబాబు, టి.సూరిబాబు బృందం బత్తుల శ్రీను రూమ్పై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ మీనా అభినందించారు. -
సొమ్ము లేక నిలిచిన భవనం
ఇది గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల. రూ.14 లక్షలతో మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. నిధులన్నీ ఖర్చయిపోయినా గదులు నిర్మాణం పూర్తవలేదు. అదనపు నిధులు వస్తే గాని నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. పెయింటింగ్, టైల్స్ నిర్మాణం మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయని ప్రతిపాదన పంపించారు. అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకం మాత్రం కలగడం లేదు. నిధులు లేక పునాదులు దాటని పాఠశాల రావులపాలెం మండలం గొపాలపురం మెయిన్ ఎంపీపీఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పునాదులలో నిలిచిపోయాయి. మొత్తం రూ.42 లక్షలు మంజూరు కాగా, రూ.16 లక్షల పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కేటాయింపులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. -
బడిద్దాయి పనులు!
● జిల్లాలో నిలిచిపోయిన మన బడి– నాడు నేడు ● పేరు మార్చారు కాని డబ్బులివ్వడం లేదు ● గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలకు కార్పొరేట్ లుక్ ● రెండు దశల్లో 1,197 ఆధునీకరణకు శ్రీకారం ● రూ. 453.96 కోట్ల కేటాయింపు ● చంద్రబాబు సర్కారు వచ్చాక మనబడి.. మన భవిష్యత్గా పేరు మార్పు ● ఒక్క రూపాయి కూడా విదల్చని వైనం ● తాజాగా రూ.31 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు అతీగతీ లేదు సాక్షి, అమలాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మార్చడం.. తరువాత వాటిని పక్కన పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి సర్వ సాధారణంగా మారింది. పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మన బడి – నాడు నేడు పథకానికి సైతం బాబు ప్రభుత్వం ‘‘మనబడి– మన భవిష్యత్’’గా పేరు మార్చింది. కాని నిలిచిపోయిన పనులను మాత్రం పూర్తి చేయడం లేదు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా పనులు జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి మనబడి నాడు–నేడుకు గత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రెండు దశల్లో మొత్తం 761 పాఠశాలల్లో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తొలి దశలో మనబడి నాడు–నేడు పథకం ఫేజ్–1లో 436 పాఠశాలల పనులకు రూ.104.96 కోట్లు కేటాయించింది. ఈ పనులు పూర్తి కావడంతో రెండవ దశ నాడు–నేడుకు నాటి ప్రభుత్వం 761 పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 1,047 పనులకు రూ.249 కోట్లు కేటాయించింది. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లాలోని నాడు–నేడులో ఆధునీకరించిన పి.గన్నవరం ఉన్నత పాఠశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిదశ ప్రగతి స్ఫూర్తితో ఇక్కడే రెండవ దశ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిర్మాణ పనులు వేగంగా సాగాయి. నాటి ప్రభుత్వమే రివాల్వింగ్ ఫండ్ రూ.86 కోట్లు, సెంట్రల్ ప్రొక్యూర్డ్ మెటీరియల్ (సీపీఎం)కు రూ.61 కోట్లు కలిపి మొత్తం రూ.147 కోట్లు విడుదల చేసింది. రెండో దశ పనులకు రివాల్వింగ్ ఫండ్, సీపీఎం రూపేణా రూ.102 కోట్లు విడుదల కావాల్సి ఉండగా ప్రభుత్వం మారింది. దీంతో రెండవ దశ నిర్మాణ పనులు మందగించాయి. అదనపు నిధులు మంజూరు కానట్టే.. ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ రెండవ వారంలో పాఠశాలలను తిరిగి తెరచే అవకాశముంది. ఈ సమయంలో మన బడి– మన భవిష్యత్కు సంబంధించి నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, బ్లాక్ బోర్డులు, ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం అత్యవసర పనులు చేపడతామని ప్రతిపాదనలు కోరింది. గతంలో నాడు– నేడుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు పాఠశాలల అకౌంట్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు తాగునీరు, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ పైపులైన్, డెస్క్లు వంటి పనులకు ఆ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఇవి కాకుండా ఇంకా పనులు ఉంటే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ రూ.31 కోట్లతో చేపట్టే అత్యవసర పనులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేసింది. అయితే పాఠశాలలకు సెలవు ఇచ్చే సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడం విశేషం. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ ఏడాది కూడా పాఠశాలలో ఉన్న నిధులు ఖర్చు పెట్టడం తప్ప అదనంగా నిధులు ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. -
● జాతి భేదాలను మరచి..
కులాలు, మతాల పేరుతో కుమ్ములాడుకుంటూ.. రక్త సంబంధాలు, కుటుంబ బంధాలను మరచి.. ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్న ప్రపంచమిది. అటువంటి మనుషుల కన్నా తామే నయమని నిరూపిస్తోందా వానరం. జగ్గంపేట బాలాజీ నగర్లోని చెట్లపై అప్పుడప్పుడు కోతులు నివాసం చేస్తూంటాయి. ఈ క్రమంలో సమీపంలోని ఇళ్ల మధ్య ఉంటున్న ఓ పిల్లి పిల్ల, ఓ ఆడ కోతి.. జాతి భేదాలను మరచి మసలుతూండటం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పిల్లి పిల్లను ఆడ వానరం చేతుల్లోకి తీసుకుంటూ, హృదయానికి హత్తుకుంటూ, ముద్దాడుతూ, మురిపిస్తూ లాలిస్తోంది. తప్పటడుగులు వేస్తున్న బిడ్డ పడిపోకుండా కాపాడుకునే కన్న తల్లిలా.. ఆ మార్జాలాన్ని సంరక్షిస్తోంది. తోటి వానరాల నుంచి ఎటువంటి హానీ జరగకుండా కాపాడుకుంటోంది. – గండేపల్లి -
తలుపులమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు. ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రతతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో, ఆయకట్టుకు నీటి సరఫరాను తగ్గించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 77.07 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 10.27 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 150, విశాఖపట్నానికి 225, పంపా జలాశయానికి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు. -
బెంగాలీలపై బెంగ!
● జిల్లాలో కుదేలైన ఇటుకల పరిశ్రమలు ● పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఓటు వేసేందుకు వెళ్లిన కూలీలు ● ఉత్పత్తి లేక అమాంతం పెరిగిన ధర ● అదే స్థాయిలో ముడిసరకు ధరలకు రెక్కలు ● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం ఆలమూరు: వలస కూలీల మీదే ఆధారపడిన ఇటుక పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో భవన నిర్మాణ రంగం కుదేలైన తరుణంలో ఇటుక ధర క్రమేపీ పెరుగుతోంది. మరో వైపు ముడిసరకు ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో బట్టీ యజమానికి అనుకున్న మేర గిట్టుబాటు ధర లభించడం లేదు. నెల రోజుల క్రితం ఒక్కొక్క ఇటుక ఖరీదు రూ.4.5 వరకూ ఉండగా ప్రస్తుతం రూ.8.5 చేరుకుంది. ఈ నెల 23, 29న పశ్చిమ బెంగాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూలీలు దశలవారీగా వెళ్లిపోతున్నారు. వేసవి పూర్తయితే కానీ వారు వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటుక ఉత్పత్తి తగ్గిపోవడంతో కొరత వల్ల ధర పెరిగిపోయింది. చిన్న తరహా పరిశ్రమల యజమానులు తమ దగ్గర ఉన్న ఇటుకను ఆర్థిక లావాదేవీల కోసం పూర్తిగా విక్రయించుకోగా కొంతమంది కార్పొరేట్ స్థాయి బట్టీ యజమానుల దగ్గర ఇటుక పుష్కలంగా ఉంది. దీంతో వారు రోజురోజుకీ ధర పెంచుతూ పోతున్నారు. ఇదే పరిస్థితి నెలల తరబడి కొనసాగితే జిల్లాలో మూడు వంతుల బట్టీలు మూసివేయక తప్పని పరిస్థితి. ఇటుక ధర పెరుగుతుందని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరలను కూడా వ్యాపారులు ఇష్టానుసారం పెంచేస్తున్నారని ఇటుక పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. ఈ పరిస్థితి భవన నిర్మాణదారునిపై విపరీతమైన ప్రభావం చూపనుంది. ఆ కూలీలు వస్తేనే ఉమ్మడి జిల్లాలోని సుమారు రెండు వేల వరకూ ఇటుక బట్టీలు ఉండగా జిల్లాలో దాదాపు 800 బట్టీల వరకూ ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాలతో పాటు కొన్ని నదీ పరివాహక సరిహద్దు ప్రాంతాలు ఇటుక తయారిలో కీలక పాత్ర పోషిస్తూ అధిక ఉత్పత్తి సాధించేందుకు దోహదపడుతున్నాయి. జిల్లాలోని బట్టీల్లో పని చేస్తున్న సుమారు 25 వేల మంది కార్మికులలో 70 శాతం మంది బెంగాలీ కూలీలే. 20 శాతం ఒడిశా, బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. పది శాతం మంది మాత్రమే స్థానిక కూలీలు పనిచేస్తున్నారు. ఈ బట్టీల ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 20 లక్షల వరకూ ఇటుక ఉత్పత్తి అవుతుండగా బెంగాలీ కూలీలు లేకపోవడం వల్ల కేవలం ఐదు లక్షలకు పడిపోయింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు స్థానిక ఇటుక ఎగుమతులు అధికంగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇటుక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో కేవలం కూలీల మీదనే ఆధారపడటం కూడా ఒక్కొక్కసారి ఇటుక పరిశ్రమ సంక్షోభానికి కారణమవుతోంది. బెంగాలీ కూలీల ప్రభావం తీవ్రంగా ఉంది ఇటుక పరిశ్రమ మనుగడపై ప్రస్తు తం బెంగాలీ కూలీల ప్రభావం తీ వ్రంగా ఉంది. ఇటుక ధర పెరుగుతు న్నా కూలీల కొరత వల్ల పూర్తిస్థాయిలోఉత్పత్తి జరగ డం లేదు. దీనికి తోడు ముడిసరకు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వేసవి సీజన్లో కూలీల కొరత రావడంతో పరిశ్రమకు ఇబ్బందికరంగా మారింది. – చల్లా ప్రభాకరరావు, ఇటుక పరిశ్రమ జిల్లా సమాఖ్య అధ్యక్షుడు, ఆలమూరు చొప్పెల్లలో ఇటుక తయారీ చేస్తున్న బెంగాలీ కూలీలు (ఫైల్) ముడి సరకు గత ధర కొత్త ధర నల్లమట్టి ట్రాక్టర్) 1,500 2,500 బొండు ఇసుక (లారీ) 7,500 11,500ఊక (టన్ను) 3,500 4,000బూడిద (టన్ను) 1,000 1,800పుల్లలు (టన్ను) 1,800 3,200పెరిగిన ముడి సరకు ధరలు ఇటుక ధరలు ఆశాజనకంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరల పెరుగుదల కూడా అదే స్థాయిలో పెరిగింది. గత ఏడాది ధరలతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 50 నుంచి 150 శాతం వరకూ ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. అలాగే బెంగాలీ కార్మికుల కొరతతో పరిశ్రమలో పోటీతత్వం పెరిగి కూలీలకు చెల్లించే ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో వెయ్యి ఇటుక తయారీకి సుమారు రూ.ఐదు వేల వరకూ ఖర్చు అవుతుంది. గతంలో ఇటుక తయారీకి కూలీలకు సగటున రూ.900 వరకూ ఖర్చు అవుతుండగా ప్రస్తుతం రూ.1400 చేరుకుంది. గతంలో ప్రదేశాన్ని, సానుకూలతను బట్టి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉన్న లీజు ధర ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ చేరుకుంది. -
సీజన్ మొదలైంది
ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. – పిల్లి లక్ష్మి, పిఠాపురం ఇక నుంచి ఖాళీ ఉండదు వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు. – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్
అమలాపురం రూరల్: పీజీఆర్ఎస్, మీ కోసం రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో డివిజన్, మండల కేంద్రంలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీలను వెబ్సైట్ ద్వారా కానీ, ఆన్లైన్లో కానీలో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు నేరుగా కాల్ చేసి పరిష్కార స్థితిగతులను తెలుసుకొనవచ్చునని కలెక్టర్ సూచించారు. విద్యార్థులూ.. లైసెన్స్లు పొందండి అమలాపురం రూరల్: ఈ వేసవి సెలవుల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, ఇందుకు వారి తల్లితండ్రులు సహకరించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు మందుగా parivahan.saradhi.gov.in సైట్లో లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని డీటీఓ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో పరీక్షకు హాజరై లెర్నింగ్ లైసెన్స్ పొందాలన్నారు. 30 రోజుల తరువాత డ్రైవింగ్ టెస్ట్కు స్లాట్ బుక్ చేసుకుని హాజరు కావాలన్నారు. నిరక్షరాస్యులు నేరుగా స్లాట్ బుకింగ్ ప్రక్రియని డీటీఓ కార్యాలయం హెల్ప్ డెస్క్ ద్వారా పొందాలని తెలిపారు. కలెక్టర్ సూచనలతో ఈ స్లాట్ బుకింగ్ సదుపాయం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలలో పొందేలా ఏర్పాటు చేశామని, ప్రజలు గమనించాలని డీటీఓ కోరారు. డ్రైవింగ్ లైసెన్సులకు, స్లాట్ బుకింగ్లకు దళారులను ఆశ్రయించి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవద్దని డీటీఓ సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే 92816 07021 నంబర్లో సంప్రదించాలని సూచించారు. లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు గూగుల్ సెర్చ్లో ఆర్టీఓ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్ అని టైపు చేసి తెలుసుకోవచ్చని డీటీఓ పేర్కొన్నారు. సీఏఐటీ ఉపాధ్యక్షుడిగా శివశంకర్ యానాం: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వైస్ ప్రెసిడెంట్గా శివశంకర్ మరోసారి ఎన్నిక కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా యానాంకు చెందిన మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వర్ ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం, ట్రేడింగ్ వర్గాల మధ్య సమన్వయ వేదికగా పనిచేస్తున్న ఆ సంస్థ జాతీయ స్థాయి ఎన్నికలు ఈ నెల 16న జరిగాయి. ఈ ఎన్నికలలో పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన శివశంకర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యభాస్కర్ ఎంపిక పట్ల యానాం వర్తక సంఘం అధ్యక్షుడు నల్లా వెంకన్న, సెక్రటరీ కాపగంటి గోపాలకృష్ణ, వర్తక సంఘం ప్రతినిధులు అభినందించారు. నర్సరీలో మొక్కల నరికివేత కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మొవ్వులు నరికేసిన మొక్కలు తిరిగి కోలుకోవని చెప్పారు. -
ఆహా.. వకాయ
● మొదలైన ఊరగాయల సీజన్ ● జోరుగా పచ్చడి మామిడి అమ్మకాలు ● ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు పిఠాపురం: ఆవకాయ– ఈ మాట వింటే ఎవ్వరికై నా నోరూరిపోతూంటుంది. ముద్దపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచికి వేరేదీ సాటి రాదని భోజన ప్రియులు అంటూంటారు. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆవకాయ రుచికి తెలుగువాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం ఫిదా అవుతూంటారు. ప్రస్తుతం సీజన్ కావడంతో దాదాపు ప్రతి ఇంటా ఆవకాయల తయారీ ఊపందుకుంటోంది. దీనికి తగినట్టుగానే మార్కెట్లో పచ్చి మామిడికాయల అమ్మకాలు కూడా జోరందుకుంది. అంతేకాదు.. మిరప పంటకు పెట్టింది పేరైన గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎండు మిర్చి అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. ఎన్ని రకాలో.. ఆవకాయలో మళ్లీ ఎన్నో రకాలున్నాయి. బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ, పచ్చ ఆవకాయ, శనగల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఎండు ఆవకాయ వంటి రకాలున్నాయి. వీటితో పాటు మెంతికాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి (తురుము మాగాయ), ఉడుకు మాగాయ, పిందె మాగాయ వంటి ఊరగాయలను ఎక్కువ మంది పెడుతూంటారు. వీటి కోసం చెరకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, కలెక్టర్ తదితర అనేక రకాల మామిడి కాయలను ఉపయోగిస్తూంటారు. దీంతో, సీజన్ ప్రారంభం నుంచీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది. విదేశాలకు సైతం.. జిల్లావ్యాప్తంగా సుమారు 48 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం చిన్న సైజులో ఉన్న కాయలను రోజువారీ వంటల కోసం విక్రయిస్తున్నారు. ముదిరిన కాయలను ఊరగాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఊరగాయలకు ఉపయోగించే కేజీ పచ్చి మామిడి కాయల ధర రూ.35 నుంచి రూ.45 వరకూ పలుకుతోంది. సైజును బట్టి కేజీకి ఐదారు కాయల వరకూ వస్తాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం సుమారు 120 టన్నులకు పైగా మామిడి కాయల అమ్మకాలు జరుగుతున్నాయన్నది అధికారుల అంచనా. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది 30 శాతం కాయలు శ్రీలంకకు ఎగుమతి అయ్యాయట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఒమన్, కువైట్, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలకు మన ఆవకాయ తదితర ఊరగాయలు సైతం ఎగుమతి అవుతున్నాయి. పచ్చని కాయలు.. పచ్చడికి సిద్ధం -
సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో దేవస్థానంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగించే ఉత్సవ వాహనాలు, వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టిస్తున్నారు. కొండ దిగువన రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా రంగులు వేయించి ముస్తాబు చేయించారు. ఈ నెల 30న స్వామి, అమ్మవార్లను ఊరేగించే టేకు రథం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, ఇతర భవనాలు, వ్రత మండపాలకు రంగులు వేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, యనమల దివ్యలను దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం కలసి, స్వామివారి కల్యాణ ఆహ్వాన పత్రికలను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు. -
అమృతం.. ఆలస్యం!
● రూ.1,650 కోట్లతో డెల్టాలో పనులు ● వైఎస్సార్ సీపీ హయాంలోనే అంకురార్పణ ● మూడు జిల్లాల పరిధిలో 451 గ్రామాలకు ఇంటింటికీ నేరుగా జలాలు లక్ష్యం ● గత ప్రభుత్వంలోనే టెండర్లు.. శరవేగంగా సర్వేలు ● చంద్రబాబు ప్రభుత్వంలో మందగమనం సాక్షి, అమలాపురం: డెల్టా ప్రజలకు వారి ఇళ్లకే నేరుగా గోదావరి జలాలు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘అమృత ధార’ పథకం (వాటర్ గ్రిడ్) నత్త నడకన సాగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ఈ పథకానికి ఆ కాలంలోనే టెండర్లు.. సర్వే పనులు చురుగ్గా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులు మందగించాయి. ఎట్టకేలకు భూసేకరణ పూర్తవుతుండడంతో నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలలోని 32 మండలాల్లోని 451 గ్రామాలలో ఇంటింటికీ నేరుగా తాగునీరు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీని వల్ల సుమారు 14.03 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని సేకరించి మున్సిపాలిటీ, గ్రామాలలో ఉన్న రక్షిత నీటి పథకాల ద్వారా సరఫరా చేస్తారు. ఇప్పుడున్న రక్షిత నీటి పథకాలకు గోదావరి పంట కాలువల ద్వారా నీరందుతోంది. గోదావరి కన్నా రెండు, మూడు రెట్లు కలుషితమైన పంట కాలువల ద్వారా నీరు అందించడం కన్నా నేరుగా అందిస్తే సురక్షిత నీరు అందడంతో పాటు వేసవిలోనూ నీటి ఎద్దడి ఉండదు. దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటిటా పైప్లైన్లు వేయడం వల్ల ఈ పథకం వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భావించింది. 2022లో ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే పథకంలో రూ.1,650 కోట్లను కేటాయించింది. ఈ పనులకు మెగా ఇంజినీరింగ్ సంస్థ కాంట్రాక్ట్ పొందింది. గత ప్రభుత్వ హయాంలో 2024లో టెండర్లు ఖరారవడంతో పాటు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాత పథకాలకు అనుసంధానం ఉమ్మడి జిల్లాలో డెల్టా పరిధిలో ఉన్న 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ పథకాల ద్వారా తాగునీరు అందుతోంది. పాత ప్రాజెక్టులకు అనుసంధానంగా కొత్త నిర్మాణం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఇప్పటికే జలజీవన్ మిషన్లో ఇంటింటా పైప్ లైన్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా మండలాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుల సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన చోట కొత్త ట్యాంకులు నిర్మించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వచ్చాక ఆలస్యం ‘అమృత ధార’ నిర్మాణంలో భాగంగా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ (ఆర్ఎస్ఎఫ్)లను ఒక్కొక్క దానిని 30 నుంచి 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పెర్ డే) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో వడగొట్టి అక్కడ నుంచి ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్), ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఓహెచ్బీఆర్)లకు పంపిస్తారు. వీటి నిర్మాణాలకు అవసరమైన భూమిని అప్పడే గుర్తించారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు మందగించాయి. ఒకానొక సమయంలో పనులు ఆగిపోతాయనే సందేహం కూడా కలిగింది. భూసేకరణ ఆలస్యం కావడంతో పనుల ప్రారంభానికి తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మధ్య డెల్టాకు సంబంధించి తొలుత ఆత్రేయపురం మండలం వద్దిపర్రు వద్ద 12 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. తాజాగా ఇదే మండలం వసంతవాడలో 9.5 ఎకరాల భూసేకరణ జరగడంతో భూమి చదును చేసే పనులు మొదలయ్యాయి. దీనికి అనుబంధంగా పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పైప్లను అందుబాటులో ఉంచి పనులు మొదలు పెట్టారు. తూర్పు డెల్టాకు సంబంధించి ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి కడియం మండలం జేగురుపాడులో స్థలాన్ని సేకరించాలని భావించారు. చివరకు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ స్థలాన్ని సేకరించి పనులు ప్రారంభించారు. ఇప్పటికై నా ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని పనులు వేగవంతం చేయాలని డెల్టావాసులు కోరుతున్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడ వద్ద భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్లు -
యానాంలో పెట్రోలు, డీజిల్ కొరత
వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులుయానాం: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పెట్రోలు, డీజిల్ లభించక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణంలోని పలు బంకులు మూసివేయగా, తెరచి ఉన్న పెట్రోలు బంకుల్లో స్టాకు లేదంటుండడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అవసరానికి మించి సుమారు పదికి పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. అయితే అత్యవసర సమయాల్లో స్థానికులకు పెట్రోలు, డీజిల్ లభించని పరిస్థితి నెలకొంటోంది. స్థానికేతరులకు మాత్రం బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తుంటారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతాయని ప్రచారం జరగడంతో కొందరు యాజమానులు చమురు నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులకు చెందిన వాహనాల్లో సైతం పెట్రోలు నింపకుండా నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలు బంకుల నిర్వహణపై సైతం సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని, ప్రజలకు మాత్రం అవస్థలు తప్పడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పెట్రో ఉత్పత్తులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టి ప్రజలకు పూర్తిస్థాయిలో సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సర్వత్రా కోరుతున్నారు. -
జిల్లా జేసీగా వైఖోమ్ నిడియా దేవి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైఖోమ్ నిడియా దేవిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జేసీగా పనిచేసిన టి.నిశాంతి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పద్నోతిపై బదిలీ అయ్యారు. ఈనెల 4వ తేదీన ఆమె ఇక్కడ నుంచి రీలీవ్ అయ్యారు. అప్పటి నుండి ఆ బాధ్యతలను కలెక్టర్ అర్.మహేష్కుమార్ నిర్వహస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో జీఏడీ విభాగంలో పనిచేస్తున్న నిడియా దేవిని జిల్లా జేసీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు రెవిన్యూ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. హోటళ్లపై దాడులు ● 18 సిలిండర్లు స్వాధీనం ● గృహావసర సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు ● డీఎస్వో ఉదయభాస్కర్ అమలాపురం రూరల్: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ హెచ్చరిక జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు భారీగా పట్టుబడినట్టు ఆయన తెలిపారు. హొటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 18 గృహావసర సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 12 సంస్థలపై 6ఏ కేసులు నమోదు చేశారు. ఇలా దుర్వినియోగం చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. రీ–ఫిల్లింగ్పై నిఘా ఉంచామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను 70 శాతానికి పెంచినట్టు తెలిపారు. ఈ దాడులలో ఏఎస్ఓ శరత్ పీఎంయూ ప్రతినిధి వి.చంద్రశేఖర్ రెడ్డి, సీఎస్డీటీలు ఇస్మాయిల్, భారతి పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి తిరుపతి కిటకిట సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలతో పాటు కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున ఇచ్చిన తొలి హారతిని దర్శించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. వేసవి నేపథ్యంలో ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. -
చిన్నారిపై అంగన్వాడీ ఆయా దాడి
● పలకతో కొట్టడంతో తలకు తీవ్ర గాయం ● సీడీపీఓకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి తాళ్లరేవు: టాయిలెట్కు వెళతానన్నందుకు నాలుగేళ్ల బాలుడిని అంగన్వాడీ ఆయా తీవ్రంగా గాయపరచింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని జి.వేమవరం గ్రామానికి చెందిన నాలుగేళ్ల దాసరి జస్విత్ గగన్ స్వరూప్ స్థానిక 30వ నెంబరు అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్లో చదువుతున్నాడు. టాయిలెట్కు వెళతానని అంగన్వాడీ ఆయా రాయుడు వెంకటలక్ష్మిని అడిగాడు. ఆమె వద్దన్నా వినకుండా వెళ్తున్న చిన్నారిని చేతిలో ఉన్న పలకతో తలపై గట్టిగా కొట్టింది. దీంతో బాలునికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. హుటాహటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా కుట్లువేశారు. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి వెంకటరమణ ఈ మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆయాపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీడీపీఓ శ్రీదేవి విలేకర్లకు తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు మందాల గంగ సూర్యనారాయణ ప్రాంతంలోనే బాలునిపై దాడి జరగడం గమనార్హం. 21న పోలీస్ వాహనాల విడి భాగాల వేలం అమలాపురం టౌన్: జిల్లా పోలీస్ శాఖ మోటారు ట్రాన్స్పోర్టు (ఎంటీ) కార్యాలయానికి సంబంధించి పోలీస్ వాహనాల మరమ్మతుల అనంతరం తీసివేసిన విడి భాగాలకు ఈ నెల 21వ తేదీ ఉదయం పది గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల బిడ్డర్లు ఆ రోజు జరిగే వేలం పాటలో పాల్గొవాలని ఎస్పీ రాహుల్ మీనా విజ్ఞప్తి చేశారు. వేలం పాట జిల్లా పోలీస్ శాఖ ఎంటీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. -
భరోసాకు భారీ వసూళ్లు
● కళాశీల నుంచి రూ.10 వేల చొప్పున యజమానుల దోపిడీ ● సర్వే అధికారుల ఖర్చులకు మరో రూ.200 వసూలు ● ఉదాసీనంగా వ్యవహరిస్తున్న మత్స్యశాఖ అధికారులు కాట్రేనికోన: మండలంలో మత్స్యశాఖ చేపట్టిన మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వేలో బోటు యజమానులు కళాశీల నుంచి రూ.10 వేలు, సంబంధిత అధికారుల ఖర్చుల కోసం రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా బోటుకు యజమానితో సహా ఉన్న ఆరుగురి నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారు. మండలంలో బలుసుతిప్ప, కొత్తపాలెం, పల్లం, చిర్రయానం తదితర గ్రామాలలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల వద్ద ఉన్న 1,002 బోట్లను గుర్తించారు. యజమానితో పాటు ఆరుగురు కళాశీల చొప్పున 6012 మంది గుర్తింపునకు సర్వే పూర్తి చేశారు. మండల పరిధిలోని గ్రామ సచివాలయాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన మత్స్యశాఖ సహాయ సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ దందాపై అవునా.. అలాగా అంటూ ఏమీ తెలియనట్టు ఆ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎఫ్డీఓ చలపతిని వివరణ కోరగా సొమ్ము వసూలు చేయాలని ఎవరికీ చెప్పలేదని, బోటు యజమానులు విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. -
కాల్మనీ వేధింపులపై ఫిర్యాదు
అంబాజీపేట: ఓ ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకున్న మహిళ సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఆమెతో పాటు చుట్టు పక్కల వారిని నానా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయ. అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి ఐడీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.50 వేల రుణం తీసుకుని అంబాజీపేటలో బ్యూటీపార్లర్ నడుపుతున్నారు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించారు. ఆ తరువాత రూ.30 వేలు రుణాన్ని తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో కొంత గడువు కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా బ్యాంకు సిబ్బంది కాల్మనీ పేరుతో వేధింపులకు దిగారు. తనతో పాటు చుట్టూ ఉన్నవారికి ఫోన్ చేసి దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో బాధితురాలు భాగ్యలక్ష్మి, ఇతర దుకాణాల యజమానులు సీఐ ఆర్.భీమరాజుకు, ఎస్సై షేక్ సుభానికి ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులను కోరారు. -
ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రీజనల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అవికూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని, వాటికి వడ్డీ చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా.. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్స్కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పారు. ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వేయాలని, ఉద్యోగులకు ఐఆర్, ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు కూడా జరగలేదని, ఎన్నికల ముందు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా మరణిస్తున్నా ఈ ప్రభుత్వం ఒత్తిడి తగ్గించడం లేదన్నారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ‘చేనేత’ సంక్షోభం
అమలాపురం రూరల్: ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పిల్లి సూర్య ప్రకాష్ విమర్శించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన చేనేత ఆత్మ గౌరవ దీక్షలో సూర్య ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి నేతన్నలు గర్వకారణమని వారి కష్టానికి తగిన గుర్తింపు, రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. చేనేత కార్మికులకు ముడి సరుకు సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పప్పు దుర్గారమేష్, అల్లక రాజు, దొంతంసెట్టి సత్య ప్రకాష్, ముప్పన వీర్రాజు, ఉప్పు రాజు, నక్క విజయలక్ష్మి, పరమేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షలో జిల్లా చేనేత సంఘాల నాయకులు, కార్మికులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పైల్తోనే రైల్ పరుగులు
మలికిపురం: వశిష్ట గోదావరి నదిపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 30 ఏళ్ల క్రితం జాతీయ రహదారి వంతెన నిర్మాణంలో తలెత్తిన ఇబ్బంది వల్ల అదనపు పిల్లర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణానికి సైతం అదనపు పిల్లర్ నిర్మాణం తప్పడం లేదు. కోటిపల్లి–నర్సాపురం రైల్వేలైన్లో భాగంగా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల దిండి–చించినాడ మధ్య నదిపై నిర్మితమవుతున్న రైల్వే వంతెనలో భాగంగా ఆఖరి పిల్లర్ నదిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఈ ఘటనతో చివరి దశలో ఉన్న నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాణ సంస్థలు రైల్వే ఉన్నతాధికారులకు పరిస్థితిని నివేదించడంతో కొత్త డిజైన్కు శ్రీకారం చుట్టారు. దిండి వైపు లూజ్ సాయిల్ ఉంది. పిల్లర్ 20 మీటర్ల లోతుకు వెళ్లాక మడ్ బ్లో అవుట్ వల్ల ఒరిగిపోయింది. సాధారణంగా 50 మీటర్ల లోతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని, అటువంటి సమయంలో పిల్లర్ ఒరిగిపోయే ప్రమాదం ఉండదని, కానీ పైనే మడ్ బ్లో అవుట్ సంభవించడం వల్ల పిల్లర్ ఒరిగిపోయిందని రైల్వే ఇంజినీర్లు చెబుతున్నారు. తాజా పరిస్థితిని అధ్యయనం చేసిన ఇంజినీర్లు డిజైన్లో స్వల్ప మార్పులు చేశారు. ఒరిగిన పిల్లర్ను అలాగే వదిలేసి అటు, ఇటు రెండు పిల్లర్లు నిర్మించాలని నిర్ణయించారు. అది కూడా ఇంతకు ముందు పిల్లర్లకు వాడిన కర్బ్ ఫౌండేషన్ విధానంలో కాకుండా ఈ రెండు పిల్లర్లను పైల్ ఫౌండేషన్ విధానంలో నిర్మించాలని నిర్ణయించారు. లూజ్ సాయిల్ ఉన్న ప్రాంతాలలో నిర్దేశించిన పిల్లర్ స్థానంలో తొలుత భూమిలో 50 మీటర్ల వరకూ చిన్న బోర్లు వేసి అందులో ఐరన్, కాంక్రీట్ నింపడాన్ని పైల్ ఫౌండేషన్గా పిలుస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలలో పలు నిర్మాణాలకు ఈ విధానాన్నే అవలంబించారు. ఇప్పటి వరకూ రైల్వే పిల్లర్కు రూ.13 కోట్ల వరకూ ఖర్చు అయింది. ఇక్కడ కర్బ్ ఫౌండేషన్ పిల్లర్ ఒరిగి పోవడంతో ఆ మేరకు నష్టం ఏర్పడింది. కొత్తగా వేసే రెండు పిల్లర్లకు రూ.20 కోట్ల వరకూ ఖర్చు అవుతందని అంచనా. దీని పూర్తి అప్రూవల్ రావడానికి మరొక 15 రోజులు పట్టవచ్చని రైల్వే వర్గాల సమాచారం. హైవే వంతెనలోనూ ఇలాగే.. 30 ఏళ్ల క్రితం నిర్మించిన దిండి–చించినాడ జాతీయ రహదారి వంతెన నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో చించినాడ వైపు ఒక పిల్లర్ వరదల సమయంలో ఒరిగిపోయింది. దీంతో కొన్నేళ్ల సమయం తీసుకుని డిజైన్లో మార్పు చేసి ఆ పిల్లర్కు అటు, ఇటు రెండు పిల్లర్లను ఏర్పాటు చేశారు. అదే పరిస్థితి నేడు రైల్వే వంతెన నిర్మాణంలోనూ తలెత్తడం గమనార్హం. రైల్వే వంతెన నిర్మాణంలో సాంకేతిక ఇబ్బంది కొత్త ఫౌండేషన్కు నిర్ణయం అప్రూవల్ రావడానికి మరో 15 రోజులు ఆగాల్సిందే ‘కర్బ్’ పిల్లర్ ఒరిగిపోవడంతో నిలచిన నిర్మాణం రూ.13 కోట్లు గోదావరి పాలు -
మహిళా సాధికారతకు ఆద్యుడు జగన్
● మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నాం ● మాజీ ఎంపీ చింతా అనురాధ అల్లవరం: లోక్సభలో ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న మహిళా బిల్లును వైఎస్సార్ సీపీ స్వాగతిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ అన్నారు. మండలం మొగళ్లమూరులోని ఆమె నివాసంలో శనివారం మహిళా బిల్లుపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను ఎదుర్కొని మహిళా బిల్లు లోక్సభ ముందుకు వచ్చిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా అవసరమని, మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనే ఆదర్శమన్నారు. ఆయన పాలనలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందడుగు వేశారన్నారు. చట్టసభల్లో, క్యాబినేట్ మంత్రి పదవుల్లో మహిళలు ఉన్నత పదవులను పొందారని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించడంతో ఎక్కువ మంది ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఐదేళ్ల కిందటే జగన్ మహిళా సాధికారితకు పెద్ద పీట వేశారని ఆమె అన్నారు. జెడ్పీ చైర్మన్లు 56 శాతం, జెడ్పీ వైస్ చైర్మన్లు 55 శాతం, వలంటీర్లు సైతం 53 శాతం మహిళలకే ఇచ్చారని తెలిపారు. సచివాలయ ఉద్యోగాల్లో కూడా 51 శాతం మహిళా ఉద్యోగులకే కేటాయించారని అన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా అమ్మఒడి, వైఎస్సార్ చేయూత తదితర పథకాలు అమలు చేసి జగన్ మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. ప్రధాని మోదీ కంటే ముందుగానే మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగదే అన్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపే దమ్మున్న మా నాయకుడు జగన్ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రాష్ట్ర కార్యదర్శి గుబ్బల రోజా రమణి, జెడ్పీటీసీ కొనుకు గౌతమి, మాజీ సర్పంచ్లు రాకాపు విజయలక్ష్మి, బర్రే సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల పంపిణీకి చర్యలు
ఆత్రేయపురం: వినియోగదారులందరికీ సక్రమంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆత్రేయపురం ఎం.ఎస్.ఓ. పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సాక్షి పత్రికలో బుధవారం వెలువడిన ’సిలిండర్ డెలివరీ చేయకపోవడంపై ఫిర్యాదు’, వార్తకు స్పందించి ఆయన వివరణ ఇచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీ యజమానితో చర్చించారు. స్థానిక పోలీస్ ఎస్ఐ ఎస్ రాముతో ఫిర్యాదుపై మాట్లాడారు. ఆత్రేయపురంలో గల భారత్ గ్యాస్ ఏజెన్సీ వివాదం ఏర్పడి 2010 నుంయి మూతపడటంతో రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పట్లో 4,823 కనెక్షన్లు బదిలీ చేశారు. ఇటీవల ఆత్రేయపురం భారత్ గ్యాస్ ఏజెన్సీ తిరిగి ప్రారంభం కావడంతో 3,672 గ్యాస్ కనెక్షన్లు తిరిగి అప్పగించారు. ఇంకా 1,152 కనెక్షన్లు అందించాల్సి ఉంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా వినియోగదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫిర్యాదుదారుడు ఉందుర్తి మనోహరంతో గ్యాస్ కంపెనీ యజమానితో సిలిండర్లు అందించడానికి హామీ ఇప్పించారు. ఇక్కడ సుమారు 120 మందికి పైగా వినియోగదారులకు వెంటనే గ్యాస్ సిలిండర్లు అందించడానికి ఏర్పాట్లు చేస్తామని గ్యాస్ ఏజెన్సీ హామీ ఇచ్చింది. దీంతో మనోహరం ఫిర్యాదును వెనుకకు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేధింపులే ఉరికొల్పాయా?
● సీతారామపురంలో వ్యక్తి ఆత్మహత్య● మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ ● భార్య, కూటమి నాయకులు, పోలీసులపై ఆరోపణలు ● కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల నిరసన ● బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురంలో పంపన కృష్ణ లోవరాజు(38) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరణానికి ముందు రాజు విడుదల చేసిన సెల్ఫీ వీడియో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మృతుని కుటుంబ సభ్యులు, కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన రాజు పి.మల్లవరం ఓఎన్జీసీ కంపెనీలోని అగ్నిమాపకశాఖ విభాగంలో పనిచేస్తున్నాడు. శీల గ్రామానికి చెందిన అనుసూరి విజయ వనితాదేవి, రాజు 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వీరేంద్ర వంశీ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు ప్రస్తుతం సీతారామపురం మరిడమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడు రాజు భార్య దేవి చెల్లెలు, రాజు తమ్ముడు ప్రేమించుకోవడంతో వారికి కూడా వివాహం జరిపించారు. అయితే అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఇటీవల భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరగడంతో స్థానిక కూటమి నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. రెండు రోజుల క్రితం ఇరువురి మధ్య మరోసారి ఘర్షణ తలెత్తడంతో దేవి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో దేవి కుటుంబ సభ్యులు కోరంగి పోలీస్ స్టేషన్లో రాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తన భార్య కనిపించడంలేదని పోలీస్స్టేషన్కు వెళితే తనపైనే కేసు నమోదు చేశారని, మొబైల్ ఫోన్ తీసుకుని వేధింపులకు గురిచేసినట్లు రాజు తమ వద్ద వాపోయాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన ఇంటి కిచెన్లోని దూలానికి కేబుల్ వైరుతో ఉరివేసుకుని కనిపించాడు. అయితే అతని మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. దేవితోపాటు కొందరు కూటమి నాయకులు, పోలీసులు వేధింపుల వల్లే మృతి చెందాడని రాజు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులను శిక్షించాలని కోరుతూ పోలీస్స్టేషన్ వద్ద నిరసన అభం శుభం తెలియని వ్యక్తిపై లేనిపోని కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ మృతుని బంధువులు కోరంగి పోలీస్స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనుమానాస్పద స్థితిలో మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరంగి ఎస్ఐ సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ ఉన్నాయని వాటి ఆధారంగా విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాజు మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ తన భార్య ప్రవర్తన బావుండడం లేదని, తన అత్తింటివారితోపాటు కొందరు నాయకులు, బంధువులు తనపై లేనిపోని కేసులు పెట్టి తనను వేధిస్తున్నారంటూ రాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. తన ఆిస్తి తన కుమారుడికే చెందాలని వీడియోలో కోరాడు. సెల్ఫీ వీడియోలో పంపన రామారావు, అత్తిలి బాబూరావు, డి.కృష్ణ, అనుసూరి కొండ, కనకదుర్గ పేర్లను రాజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
జనసేన నేత శ్రీరామ్పై అట్రాసిటీ కేసు పెట్టాలి
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత మహిళ, దళిత సంఘాల నేతల ఆందోళన కాజులూరు: దళిత మహిళను కులం పేరుతో దూషించి అవమానించిన కాజులూరు జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తి (శ్రీరామ్) పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలంటూ గురువారం బాధిత మహిళతో కలసి పలువురు దళిత సంఘాల నేతలు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ సన్నపు లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త కిరణ్, ఆకుల నాగదేవి భర్త నాయుడు, నామా సుబ్బారావు కలసి చేస్తున్న టైల్స్ వ్యాపారం లావాదేవీలలో తలెత్తిన వివాదంపై తమకు తగువు చెప్పాలని తానూ, ఆకుల నాగదేవి ఈ నెల తొమ్మిదవ తేదీ గురువారం గ్రామానికి చెందిన అన్యం శ్రీరామ్ ఇంటికి వెళ్లామన్నారు. అయితే అతను మహిళలమని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ కులంపేరుతో దూషించి ఇంటి నుంచి నెట్టివేశారన్నారు. దీనిపై ఈ నెల 11వ తేదీన కులసంఘాల నేతలతో వచ్చి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అన్యం శ్రీరామ్ కూటమి పార్టీలో ఉన్న దళిత నాయకులతో ప్రెస్మీట్లు పెట్టించి తమపై తప్పుడు ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు ప్రేరేపిస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పోలినాటి సూర్యచంద్రం, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం, జేబీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు పత్తిపాటి బుల్లిరాజు, మాలమహానాడు అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు మాట్లాడుతూ తామంతా బాధితులకు బాసటగా ఉన్నామని, పోలీసులు తగిన చర్యలు తీసుకొనకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. దళిత నాయకులు పోతురాజు బాబురావు, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, బుల్లెట్ రాజు, పుల్లారావు పాల్గొన్నారు. -
బాబు మార్క్ క్లోజర్క్!
కాలువల పొడవు ఇలా.. తూర్పు డెల్టా కిలోమీటర్లు ప్రధాన పంట కాలువ : 6.270 సామర్లకోట కాలువ : 53.010 కాకినాడ కాలువ : 40.550 మండపేట కాలువ : 21.750 కోటిపల్లి బ్యాంకు కెనాల్ : 63.560 కోరంగి కాలువ : 35.500 ఇంజరం కాలువ : 19.740 మంజేరు కాలువ : 14.870 మొత్తం పొడవు : 255.700 మధ్యడెల్టా ప్రధాన పంట కాలువ : 13.200 ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ : 62.44 అమలాపురం మెయిన్ కెనాల్ : 51.01 పి.గన్నవరం బ్యాంకు కెనాల్ : 59.10 అమలాపురం– బెండమూర్లంక బెండా కాలువ : 8.00 మొత్తం పొడవు : 193.75 రెండు డెల్టాలు కలిపి : 449.45సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువలు మూసివేసే సమయంలో చేపట్టే క్లోజర్ పనులు ఈ ఏడాది లేనట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారులు తీరు చూస్తుంటే క్లోజర్ పనులు మమ అనిపించేలా ఉన్నారు. ఈ పనులకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తామని గొప్పలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి వట్టి చేతులు చూపుతోంది. చేసేది ఏమీ లేకనే ముందస్తు సాగు పేరుతో మే 15 నాటికి పంట కాలువలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిందీ అంటే అందుకు గోదావరి డెల్టా కారణం. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 10.89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ డెల్టాలో వరిసాగు 8.60 లక్షల ఎకరాలు. ఖరీఫ్, రబీ పంటలు కలిపి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని అంచనా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెల్టా రెండు భాగాలుగా ఉంది. తూర్పు డెల్టాలో 2,65,533 ఎకరాలు, మధ్యడెల్టాలో 1,72,000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 4,36,533 ఎకరాలలో వరి సాగు జరుగుతోంది. తూర్పు, మధ్య డెల్టాలలో కలిపి పంట కాలువలు సుమారు 449.45 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దీనిలో తూర్పు డెల్టా పరిధిలో 255.7, మధ్య డెల్టా పరిధిలో 193.75 కిలోమీటర్లు. వీటికి అనుబంధంగా చానల్స్, పంట బోదెలు కూడా ఉన్నాయి. వీటి నిడివి సుమారు 2 వేల కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. సమయం లేదు ఇంతటి కీలకమైన వ్యవస్థ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం అవుతోంది. ఏటా క్లోజర్ సమయంలో చేయాల్సిన పనులను రెండు సంవత్సరాల పాటు చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. తాజాగా ఈ ఏడాది చేయాల్సిన పనులు కూడా చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పంట కాలువల ద్వారా రబీ వరి సాగుకు నీరందిస్తున్నారు. ఈ నెల 20 నాటికి ఈ కాలువలు మూసివేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మరో ఐదు రోజులు లేదా నెలాఖరు వరకు గాని నీరు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మే 15న న కాలువలు తెరిచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ ఈ నెల 20న కాలువలు మూసివేసి, మే 15న తెరిస్తే మూసివేత సమయం కేవలం 25 రోజులు మాత్రమే. పంట కాలువల్లో నీరు అడుగంటి పనులు మొదలు పెట్టేందుకు కనీసం పది రోజులు పడుతుంది. అంటే పనులు చేసేందుకు కేవలం 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు లెక్క. అలా కాదని ఏటా ఇస్తున్నట్టు జూన్ ఒకటో తేదీన నీరు విడుదల చేస్తే పనులు చేసేందుకు నెల రోజుల సమయం దక్కుతుంది. అప్పడు కూడా కాలువలలో పూడికతీత, లాకులకు చిన్నచిన్న మరమ్మతులు, కల్వర్టులు, రివిట్మెంట్ల నిర్మాణానికి మాత్రమే సమయం సరిపోతుంది. భారీ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండదు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వానికి క్లోజర్లో పనులు చేసే ఉద్దేశం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపాదనలు మాత్రం భారీగా.. రెండు జిల్లాల పరిధిలో క్లోజర్ సమయంలో చేపట్టే పనులకు ప్రతిపాదనలు మాత్రం అధికారులు భారీగా పంపించారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించిన వివిధ సందర్భాలలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్లోజర్ సమయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక్కో నియోజకవర్గానికి రూ.మూడు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. రెండు డెల్టాలలో కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, అనపర్తి, మండపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాలున్నాయి. అధికారులు భారీగా ప్రతిపాదనలు పంపడం వల్ల నిధులు వస్తాయని, క్లోజర్లో పూడిక తొలగింపు, లాకుల మరమ్మతు వంటి పనులు వల్ల వచ్చే ఖరీఫ్, రబీలలో ముంపు ఇబ్బంది, శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి వంటి సమస్యలు గట్టెక్కుతాయన్న ఆయకట్టు రైతుల క్లోజర్ ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లుతోంది. ప్రభుత్వం తీరు చూస్తుంటే అరకొరగా కేటాయింపులు చేసి ఆ పనులు కూడా చేపట్టే అవకాశం లేకుండా ఉందని రైతుల ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది డెల్టాలో క్లోజర్ పనులు లేనట్టే నిధులిచ్చే పరిస్థితి లేక తెరపైకి ముందస్తు సాగు మే 15కి నీరిస్తామంటున్న అధికారులు నియోజకవర్గానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు వాస్తవానికి కనీస మరమ్మతులు కూడా గగనమే రెండు జిల్లాల పరిధిలో 449.45 కిలోమీటర్ల పొడవునా పంట కాలువలు -
అంతర్వేది సముద్ర తీరంలో సాగర్ కవచ్
సఖినేటిపల్లి: అంతర్వేది సముద్ర తీరంలో బుధవారం స్థానిక మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు సాగర్ కవచ్ నిర్వహించారు. భారతదేశ సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ సాగర్ కవచ్ నిర్వహిస్తారు. సముద్ర ఆధారిత, అసమాన ముప్పులకు వ్యతిరేకంగా సంసిద్ధతను మెరుగుపరుచుకోవడానికి సాగర్ కవచ్ కీలకంగా ఉంది. మైరెన్ సీఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు విన్యాసాలను తీరం వెంబడి బీచ్ వద్ద, లైట్హౌస్ వద్ద, పల్లిపాలెం మినీ హార్బర్ వద్ద చేశారు. -
ఖతార్ నుంచి క్షేమంగా ఇంటికి..
అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన సీహెచ్ నాగ లక్ష్మిని కేసీఎం అధికారులు క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. టి.గౌతమ్ అనే ఏజెంట్ ద్వారా నాగలక్ష్మి 2026 ఫిబ్రవరిలో ఖతార్ వెళ్లారు. మారే కీర్తి అనే ఆమె ద్వారా ఒక ఇంట్లో పనికి కుదిరారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న శ్రీలంకకు చెందిన మహిళ నాగలక్ష్మిని తీవ్రంగా హింసించడంతో తన భర్త దుర్గారావుకు విషయం చెప్పారు. ఏజెంట్తో మాట్లాడగా రూ.2లక్షలు కడితే గాని పంపడం కుదరదని చెప్పారు. దీంతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. కేసీఎం బృందం స్పందించి ఏజెంట్తో మాట్లాడి నాగలక్ష్మిని సురక్షితంగా తీసుకువచ్చామని కేంద్ర సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
అమలాపురం టౌన్: పది రోజులుగా అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారంతో ముగిసిందని డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 1,79,180 పేపర్ల మూల్యాంకనాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఎస్వోలు, సీఎస్లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతం చేశారన్నారు. శ్రీహరి అరెస్టు అక్రమం అల్లవరం: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తిరిగి ఇంటికి వెళ్తున్న వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అరెస్టు చేయడం అక్రమమని మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, ఏ స్టేషన్కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రతి రోజూ కనీసం ఒక వైఎస్సార్ సీపీ నేతను అరెస్టు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదన్నారు. ఇలాంటి అక్రమాలు, దౌర్జన్యాలకు వైఎస్సార్ సీపీ భయపడదన్నారు, అక్రమంగా అరెస్టు చేసిన శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా G‹œ-GÌŒæ çÜÆó‡Ó ˘ అమలాపురం టౌన్: జిల్లాలో ఫౌండేషన్ లెర్నింగ్ (ఎఫ్ఎల్) సర్వేను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించాలని సర్వే నిర్వహించే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఫీల్ట్ ఇన్వెస్టిగేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత సర్వే నిర్వహించేందుకు ఫీల్ట్ ఇన్వెస్టిగేటర్లకు ట్యాబ్స్ను అందజేశారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల మాదిరిగా మూడో తరగతి విద్యార్ధులకు పరీక్ష నిర్వహించాలన్నారు. అల్లవరం మండలం బోడసకుర్రులోని ఎంపీపీఎస్ నంబర్–1, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి శివారు నల్లావారిపేట ఎంపీపీఎస్, మండపేట మండలం వేములపల్లి ఎంపీపీఎస్ నంబర్–5, కె.గంగవరం మండలం కూళ్ల శివారు పి.కొంపలు ఎంపీపీఎస్ పాఠశాలలను ఎఫ్ఎల్ సర్వేకు ఎంపిక చేసి నిర్వహిస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. 18న జాబ్ మేళా అమలాపురం రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వికాస సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళాను నిర్వహిస్తునట్టు కలెక్టర్ అర్. మహేష్కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నాయని దాదాపు 1,300కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్, స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ అధికారి కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
సమర్థంగా జన గణన
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 20,068 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాష్ట్ర స్థాయిలో ఫలితాల పరంగా జిల్లాకు వచ్చిన ర్యాంక్లు నిరాశ పరిచేలా ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గత సంవత్సరం 19వ స్థానం రాగా ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి గతేడాది జిల్లా 15 స్థానంలో నిలువగా ఈ సంవత్సరం 16వ స్థానం సాధించింది. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలు 10,527 మంది రాయగా 7,580 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరానికి 9,541 మంది పరీక్షలు రాయగా 7,258 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 76 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 16వ స్థానాన్ని జిల్లా సాధించింది. రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలు రాసిన 20,068 మంది విద్యార్థుల్లో 14,838 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 5,230 మంది పరీక్ష తప్పారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ జిల్లా కేంద్రం అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సజావుగా జరిగింది. పరీక్షల సమయంలో ఎవరినీ డీబార్ చేయలేదు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదు. జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ కళాశాల, 104 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) కె.చంద్రశేఖర్బాబు పర్యవేక్షణలో జిల్లాలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. జిల్లాలో ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 1,842 మందికి గాను 1,039 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.4 శాతం ఉంది. జిల్లాలో ప్రథమ సంవత్సరం వొకేషనల్ కోర్సుల విద్యార్థులు 2192 మంది పరీక్షలు రాయగా 41 శాతంతో 895 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇంటర్లో బాలాజీ బెస్ట్ అమలాపురం రూరల్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పరీక్షా ఫలితాలలో అమలాపురం బీవీసీ అక్షర్ జూనియర్ కళాశాల విద్యార్థి మారిశెట్టి సాయి బాలాజీ 470కి 466 మార్కులు సాధించి కోనసీమ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. అమలాపురం రూరల్: భారతదేశంలో 17వ జనాభా గణన చారిత్రాత్మక ఘట్టమని, జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని తహసీల్దార్లు ఎంపీడీవోలు, సాంకేతిక సహాయకులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. ఆయన వారితో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనాభా గణన 2027 సన్నద్ధతలో భాగంగా కీలక అంశాలపై అవగాహన కల్పించారు. గురువారం నుంచి ఈ నెల 30 వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా అర్థ గణాంక అధికారి మురళీకృష్ణ తెలిపారు. వేగంగా అభివృద్ధి పనులు జిల్లావ్యాప్తంగా వైద్య రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీఎంఎస్ఐడీసీ కార్య నిర్వాహక ఇంజినీరు సీహెచ్ రతన్ రాజు, వైద్య అధికారుల, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి నాబార్డ్ నిధుల పనుల పురోగతిపై సమీక్షించారు. -
సైకత రూపున శివపార్వతుల దర్శనం
అమ్మలగన్నయమ్మ తలుపులమ్మ తల్లి, ఆది దంపతులైన శివపార్వతులు సైకత రూపున దర్శనమిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పులు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు దేవిన సిస్టర్స్, దేవిన శ్రీనివాస్లు తలుపులమ్మ తల్లి, శివపార్వతుల ఆకృతులతో ఈ సైకత (ఇసుక) శిల్పాన్ని రూపొందించారు. తలుపులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా.. అమరావతి మ్యాక్స్ క్వాజీ బ్యాంకు సీఈఓ ఆది స్వరూప్ పట్నాయక్ ఆధ్వర్యాన 6 టన్నుల ఇసుకతో 18 అడుగులు వెడల్పు, 8 అడుగుల ఎత్తున రూపొందించిన ఈ సైకత శిల్పం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిని శుక్రవారం సాయంత్రం వరకూ భక్తులు దర్శించుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మునుపెన్నడూ ఇటువంటి సైకత శిల్పాలు రూపొందించలేదని, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దీనిని వినూత్నంగా తీర్చిదిద్దామని శ్రీనివాస్ చెప్పారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్పర్సన్ రామలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భార్గవ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. – తుని రూరల్ -
అన్ని పనులకూ ఒక్కరే!
తాళ్లపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ వసతిగృహన్ని మంగళవారం కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించిన ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు కనీసం రాష్ట్రపతి, ప్రధాని, ఆర్డీఓ, తహసీల్దార్ పేర్లు తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్లో 23 మంది విద్యార్థులకు సగం మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ కొంతకాలంగా వార్డెన్తో పాటు పలువురు సిబ్బంది లేకుండానే హాస్టల్ నడుస్తోంది. నాలుగు నెలల క్రితం వచ్చిన కుక్ (వంటమనిషి) శివాజీ అన్ని తానై హాస్టల్ను నడుపుతున్నారు. వార్డెన్గా, వాచ్మెన్గా, కుక్గా శివాజీ పని చేయటంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వోలు ప్రకాష్, నాగేశ్వరరావు, సంజీవరావు, లీలావతి తనిఖీలో పాల్గొన్నారు. -
విజ్ఞాన భాండాఘోరం
అమలాపురం టౌన్: సమాజానికి వెలుగునిచ్చే విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా తయారైంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా గ్రంథాలయాల అభివృద్ధిని, నిధుల కేటాయింపును పట్టించుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు ఉమ్మడి జిల్లా పరిధిలోనే కొనసాగుతున్నాయి. అందులో గ్రంథాలయశాఖ ఒకటి. ప్రతి ఏటా రాష్ట్ర గ్రంథాలయాల బడ్జెట్ దాదాపు రూ.140 కోట్ల వరకూ ఉండేది. తాజాగా ప్రభుత్వం ఆ బడ్జెట్ను కేవలం రూ.36 కోట్లకు కుదించడంపై ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీతమో రామ‘చంద్ర’ ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా పింఛన్ల కింద రూ.54 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే సిబ్బంది జీతాలకు మరో రూ.52 లక్షల వరకూ అవసరం. ఇక గ్రంథాలయాల నిర్వహణ, అద్దెలు, విద్యుత్ బిల్లులు, దిన పత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు తదితర ఖర్చులు కూడా సిబ్బంది జీతాల గ్రాంటులోనే ఉంటుంది. అయితే మూడు నెలల నుంచి గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలను కూడా ప్రభుత్వం బట్వాడా చేయలేకపోతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు జీతమో రామ‘చంద్ర’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెండింగ్లో.. గ్రంథాలయాల్లో దిన పత్రికల నిధులను ప్రభుత్వం పంపించకపోయినప్పటికీ ఆయా గ్రంథాలయాల ఉద్యోగులే అరువు పద్ధతిలో ఏదోలా పత్రికలను వేయించుకుని పాఠకులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. పోటీ పరీక్షల పుస్తకాల సరఫరా అయితే మూడు నెలల నుంచే కాదు అంతకు ముందు నుంచే నిలిచిపోయింది. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న గ్రంథాలయాలకు అద్దెలు, విద్యుత్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. గుదిబండగా సెస్ బకాయిలు ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు విపరీతంగా పెరిగిపోయి గ్రంథాలయ నిర్వహణ భారం మరింత పెరిగింది. రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ల సెస్ బకాయి రూ.18 కోట్లు, ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల నుంచి రూ.16.50 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇక మున్సిపాలిటీల బకాయిలు రూ.లక్షల్లో ఉన్నాయి. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీ నుంచి రూ.20 లక్షల మేర గ్రంథాలయ సెస్ వసూలు కావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకుని జీతాలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడంపై గ్రంథాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ జీతాలను ఎప్పటిలాగే గ్రాంటు రూపంలో విడుదల చేయాలని కోరుతున్నారు. సిబ్బంది కొరత ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. 204 రెగ్యులర్ పోస్టులకు గాను కేవలం 55 మందే పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టులు 37కి 27, లైబ్రేరియన్, రికార్డు అసిస్టెంట్లు, హెల్పర్ల పోస్టులు 37కి 27 మాత్రమే ఉన్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో 102 శాఖా గ్రంథాలయాలకు 100 పనిచేస్తున్నాయి. ఇక 51 గ్రామీణ గ్రంథాలయాలకు నాలుగు, 161 పుస్తక పంపిణీ కేంద్రాలకు 138 మాత్రమే పనిచేస్తున్నాయి. ఫ గ్రంథాలయాలపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఫ మూడు నెలలుగా నిలిచిన సిబ్బంది జీతాలు ఫ పోటీ పరీక్షల పత్రికల సరఫరా నిలిపివేత ఫ దిన పత్రికలకు బిల్లులు నిల్ ఫ బడ్జెట్లోనూ భారీ కోత గ్రంథాలయాలను రక్షించాలి నిర్వీర్యమవుతున్న గ్రంథాలయ వ్యవస్థను రక్షించాలి. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గ్రంథాలయ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు. దిన పత్రికల బిల్లులు ఇవ్వకపోగా, పోటీ పరీక్షల పుస్తకాలను నిలిపివేయడం తగదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆందోళనకు దిగక తప్పదు. – జీవీఆర్ఎస్హెచ్కే వర్మ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
అమలాపురం టౌన్: జిల్లాలో మంగళవారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకూ వీటిని నిర్వహించనున్నారు. తొలి రోజు నల్ల వంతెన సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద వారోత్సవాలకు శ్రీకారం చుడుతూ అగ్నిమాపక వాహనాన్ని జిల్లా అగ్నిమాపక దళాధికారి ఎన్.పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 1926 ఏప్రిల్ 14న జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన అగ్ని మాపక అధికారులు ఎస్హెచ్ సోనికుమార్, ఎస్హెచ్ దంగర్ సింగ్లను స్మరించుకుంటూ కవాతు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారథి, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గంట అమర్బాబు, ముమ్మిడివరం అగ్నిమాపక దళాధికారి ఎస్.నాగేశ్వరరావు, అమలాపురం, ముమ్మిడివరం అగ్ని మాపక కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఇంటర్ ఫలితాల విడుదల రాయవరం: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను బుధవారం ఉదయం 10.31 గంటలకు విజయవాడలో మాథ్యమిక విద్యాశాఖ విడుదల చేయనుంది. ఫలితాల పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత మూడవ సారి జిల్లాల వారీగా ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమైన పరీక్షలు మార్చి 24తో ముగిశాయి. జిల్లాల వారీగా ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ఫలితాలను పునర్విభజన జరిగిన జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా పునర్విభజన జరిగిన జిల్లాల వారీగానే నిర్వహించిన విషయం విదితమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.16లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇంటర్ ఫస్టియర్ 22,500, సెకండియర్ 20,608, కాకినాడ జిల్లా నుంచి ఫస్టియర్ 22,010, సెకండియర్ 20,879, కోనసీమ జిల్లా నుంచి ఫస్టియర్ 13,131, సెకండియర్ 12,756, పోలవరం జిల్లా నుంచి ఫస్టియర్ 2,629, సెకండియర్ 2,336 మంది పరీక్షలు రాశారు. ఉమ్మడి జిల్లాలో 160 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు ’దివీస్’ విరాళం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్ ల్యాబ్రేటరీస్ లిమిటెడ్ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను జిల్లాలో గల నాలుగు బీసీ హాస్టల్కు అందించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు క్షేమంగా బయటపడే మెళకువలను బస్సులో ప్రయాణికులకు వివరించారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. గృహోపకరణాల దగ్ధం తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేత గడువు పెరిగింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి మూడు డెల్టా పంట కాలువలను మూసివేయాల్సి ఉంది. అయితే డెల్టా శివారు ప్రాంతాల్లో వరి ఆయకట్టుకు ఇంకా నీరు అందించాల్సి ఉన్నందున గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పెంచుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఐదు రోజుల పెంపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కీలకమైన రబీ సాగుకు సంబంధించి డెల్టా కాలువల మూసివేత గడువును ప్రభుత్వం పెంచింది. మరో ఐదు రోజులు గడువు పెంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలలో వరి చేలకు ఇంకా నీరు అందించాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీ, పంచాయతీలు, ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి పథకాలకు నీరందించాల్సి ఉన్నందున గడువు పెంచేందుకే జలవనరుల శాఖ అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై బుధవారం స్పష్టత వస్తోందని అధికారులు చెప్పారు. తూర్పు డెల్టాకు నీటి వినియోగం పెద్దగా అవసరం లేనందున 2,500 క్యూసెక్కులకు తగ్గించారు. మధ్య డెల్టాకు 1,600, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 7,759 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి 4,074 క్యూసెక్కుల నీరు వస్తోంది. వరి కోతలు జిల్లాలో రబీ వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ముందుగా సాగు చేసిన ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో రైతులు కోతలు ఆరంభించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం, రాయవరం, అనపర్తి, కొవ్వూరు, బిక్కవోలు ప్రాంతాల్లోనూ, కాకినాడ జిల్లా సామర్లకోటతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పీబీసీ పరిధిలో ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయి. డెల్టాలో శివారు వరి ఆయకట్టు పరిస్థితి చూస్తుంటే ఈ నెల 20 తర్వాత కూడా గడువు పెంచాల్సి ఉందని అంచనా. తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా పరిస్థితి ఎలా ఉన్నా మధ్య డెల్టా పరిధిలోని శివారు ప్రాంతాల కోసం మరోసారి గడువు పెంచక తప్పదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, అంబాజీపేట, పి.గన్నవరం వంటి ప్రాంతాలలో సాగు ఆలస్యమైనందున ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ సగానికి పైగా ఆయకట్టులో వరి చేలు పాలు పోసుకుని కంకులు గింజ తోడుకునే దశలో ఉండడం గమనార్హం. 128 టీఎంసీల పంపిణీ ప్రస్తుత రబీలో ఏకంగా 128.847 టీఎంసీల నీటిని వినియోగించడం గమనార్హం. డిసెంబర్ 1న జిల్లాలో రబీ వరి సాగు షెడ్యూల్ మొదలైంది. ఎప్పటి వరకు అధికారులు లెక్కల ప్రకారం తూర్పు డెల్టాకు 38.288 టీఎంసీలు నీటిని అందించారు. మధ్య డెల్టాకు 22.625 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 61.937 టీఎంసీలు నీరు విడుదల చేశారు. ఇంత పెద్ద ఎత్తున నీరు విడుదల చేసినప్పటికీ శివారు, మెరక రైతులకు నీటి ఇక్కట్లు తప్పలేదు. కోనసీమలో శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కాకినాడ జిల్లా కాజులూరు, తాళ్లరేవు, కరప, పీబీసీలో చానళ్లు, పంట బోదెల్లో నీరు అడుగంటడం, సకాలంలో నీరందక రైతులు మురుగునీటి కాలువలు, నీరు తక్కువగా ఉన్న పంట కాలువల నుంచి మోటార్లతో తోడుకుని పంటను రక్షించుకున్నారు. లొల్ల లాకులు ఫ కాలువల మూసివేత గడువు పెంపు ఫ ఆయకట్టు రైతుల నీటి అవస్థలు తీరినట్టే.. ఫ మూసివేత గడువు పెంచాలని ముందే చెప్పిన ‘సాక్షి’ ఫ నేడు రానున్న స్పష్టత మూడు డెల్టాల్లో.. మూడు డెల్టాలో కలిపి మొత్తం 8,96,533 ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాలో 2,64,533 ఎకరాలు, మధ్య డెల్టాలో 1,72,000 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 4,60,000 ఎకరాల చొప్పున వరి ఆయకట్టు ఉందని అధికారుల లెక్క. కానీ వాస్తవంగా మూడు డెల్టాల్లో కలిపి 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరుగుతుందని అంచనా. 2010లో గోదావరికి నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో కేవలం 85 టీఎంసీలతో గోదావరి డెల్టాలో రవి పంటను పండించారు. అప్పటికన్నా ఇప్పుడు ఆయకట్టు మరింత తగ్గింది. అయినప్పటికీ 128 టీఎంసీలకు పైగా నీరు ఇచ్చినా ఎద్దడి తప్పలేదు. -
అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
రావులపాలెం: అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతిని మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రావులపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుతో కలిసి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోనసీమ ముఖద్వారం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో కేక్ కట్ చేసి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలులు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఇందిరా కాలనీలోని అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు గూటం తిమోతి ప్రకాష్రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాకా మణికుమారి, మాజీ సర్పంచ్లు తాడేపల్లి నాగమణి, సబ్బితి మోహనరావు, బొక్కా కరుణాకరం, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు కప్పల శ్రీధర్, కోనాల రాజు, వైఎస్సార్ సీపీ జిల్లా యాక్టివిటీ సభ్యుడు షేక్ వల్లీబాబా, వార్డు సభ్యుడు కోనాల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమానత్వ సాధనకు నాంది అమలాపురం టౌన్: దేశంలో సమానత్వ సాధనకు అంబేడ్కర్ నాంది పలికారని వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. అమలాపురంలోని పలు కూడళ్లలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల వద్ద జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు. మద్దాలవారిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయమ్మపేట, గడియారం స్తంభం సెంటర్, వడ్డిగూడెంతో పాటు పలు వార్డుల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పు ష్పాంజలి ఘటించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, తిరుకోటి సతీష్, ఉండ్రు వెంకటేష్, గొవ్వాల రాజేష్, నాగారపు వెంకటేశ్వరరావు, దూడల ఫణి, విత్తనాల మూర్తి, మెండు రమేష్బాబు, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కల్వకొలను ఉమ పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు అమలాపురం రూరల్: మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఆయన పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఈ.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కె.కాశీ విశ్వేశ్వరరావు, జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, డి.రత్నకుమార్, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్న స్ఫూర్తితో, అంబేడ్కర్ ఆశయాలతో పోలీస్ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన అంబేడ్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి ఎస్పీతో పాటు ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఎస్పీ కార్యాలయ పోలీస్ అధికారులు పూల మాలలు వేసి, సెల్యూట్ చేశారు. ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ నాగ ప్రసాద్, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, ఏఆర్ ఆర్ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి సెల్యూట్ చేస్తున్న ఎస్పీ రాహుల్ మీనా, చిత్రంలో పోలీసు అధికారులుఅమలాపురంలో మాట్లాడుతున్న శ్రీకాంత్, చిత్రంలోఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ మహేష్కుమార్, అధికారులుఫ ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దాం ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఫ జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి -
ఒడ్డునపడ్డ చేపల్లా..
ఒడ్డుకు చేరుకుంటున్న వేట బోట్లుసాక్షి, అమలాపురం: సముద్ర వేట నిలిచిపోనుంది. జిల్లాలో అంతర్వేది తీర్థాల మొండి నుంచి ఐ.పోలవరం భైరవపాలెం వరకు విస్తారంగా ఉన్న సముద్రతీరంలో వేట నిషేధం అమలు కానుంది. ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మొదలయ్యే వేట నిషేధం జూన్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. 61 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉండనుంది. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక ఏడాదే పరిహారం ఇచ్చింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన తర్వాతే అమలు చేసింది. తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ప్రభుత్వం తీరుతో వేటకు విరామం అంటేనే మత్స్యకారులు ఒడ్డున పడ్డ చేపల్లా అల్లాడిపోతున్నారు. సముద్ర మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తాయి. వేట నిషేధం వల్ల జిల్లాలో సుమారు 1,700కు పైగా బోట్లు నిలిచిపోనున్నాయి. వీటిపై పది మండలాలకు చెందిన మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, ఆల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలకు చెందిన మత్స్యకారులు వేట మీద జీవనం సాగిస్తున్నారు. ఇలా వేట మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలు జిల్లాలో 19,426 ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, అల్లవరం మండలం ఓడలరేవు, నక్కా రామేశ్వరం, మామిడికుదురు మండలం కరవాక, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, ఎస్.యానాం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, భైరవపాలెం, గాడిమొగ గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్ర వేటకు ఎక్కువగా వెళతారు. వీరితోపాటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుంచి వచ్చే వలస మత్స్యకారులు ఇక్కడ నివాసముండి సముద్ర వేట సాగిస్తుంటారు. చేపల పునరుత్పత్తి కోసం చేపల పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిగే సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. చేపల పునరుత్పత్తికి ఇదే అదను. ఈ సమయంలో వేట జరిగితే గుడ్లతో ఉన్న చేపలు బలవుతాయి. గతంలో చేపల వేట అంగుళం, అర అంగుళం వలలతో సాగేది. చిన్న చేపలు తప్పించుకునేవి. కానీ ఇటీవల రింగు వలలు (సూక్ష్మ కన్నాలు ఉండే వల) వాడుతున్నారు. దీని వల్ల చిన్న చేప తప్పించుకునే అవకాశం ఉండడం లేదు. ఈ వలలను మత్స్యశాఖ నిషేధించినా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు అంటున్నా వీడడం లేదు. చేపల పునరుత్పత్తి సమయంలో వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంటుందన్న నిపుణుల సూచనలతో మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేట నిలిచిపోనుంది. గతంలో 45 రోజులు ఉండేది. ఈ సమయం కూడా సరిపోదని సముద్ర శాస్త్రవేత్తలు చెప్పడంతో ఇది కాస్తా 61 రోజులకు పెరిగింది. ఈ కారణంగానే ఈ రెండు నెలల పాటు వేటను ఆపేస్తున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా తెప్పల మీద వెళ్లి, అది కూడా తీరానికి కిలోమీటరు పరిధిలో వేటాడవచ్చు. అయితే జిల్లాలో గోదావరి నదీపాయలలో మాత్రం వేట కొనసాగుతోంది. వేటపై నిఘా నిషేధ సమయంలో వేట జరగకుండా పలు శాఖలు నిఘా పెడుతున్నాయి. కోస్టు గార్డు, మైరెన్, నేవీ, మత్స్యశాఖలతోపాటు స్థానిక పోలీసులు కూడా వేటను అడ్డుకుంటారు. దేశంలో కన్యాకుమారి నుంచి కోల్కతా వరకు ఇదే పరిస్థితి. జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు మత్స్యకారులు సముద్ర వేటకు దూరంగా ఉండనున్నారు. నిషేధ సమయంలో ఎవరైనా చేపల వేట సాగిస్తే వారికి రూ.2,500 వరకు జరిమానా విధించడంతో పాటు బోట్లను సీజ్ చేస్తారు. నేటి నుంచి వేట నిషేధం ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేసే యాంత్రిక పడవలు, మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను 15వ తేదీ నుంచి జాన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు జిల్లా మత్స్యశాఖాధికారి సోమవారం ప్రకటనలో తెలిపారు. సముద్ర మత్స్య సంపద సుస్థిరతకు ఈ నిషేదం విధిస్తున్నామన్నారు. ఉల్లంఘిస్తే బోట్లను, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తామన్నారు. డీజిల్ ఆయిల్ రాయితీ, వేట నిషేధ భృతి, ప్రభుత్వం అందించే అన్ని రాయితీ సౌకర్యాలు నిలుపుదల చేస్తామన్నారు. రెండు నెలల పాటు ఇలాగే.. జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి వేటకు విరామం 61 రోజుల పాటు నిలిచిపోనున్న సముద్ర వేట 45 గ్రామాల్లో మత్స్యకారులు సుమారు 1,700కు పైగా వేట బోట్లు సముద్ర వేటపై ఆధారపడి సుమారు 19,426 కుటుంబాలు తొలి ఏడాది మత్స్యకార భరోసాకు చంద్రబాబు సర్కారు ఎగనామం తొలి ఏడాది పరిహారం బాకీ వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు పరిహారం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014– 19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున పరిహారం అందించేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు వేట నిషేధం వల్ల నష్టపోయిన ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా క్రమం తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దీనిని పక్కాగా అమలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వేట నిషేధం వల్ల నష్టపోయిన ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పరిహారాన్ని విజయవంతంగా ఎగ్గొట్టారు. ఎన్నికల ముందు కూటమి కట్టిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ మత్స్యకారులను ఆకట్టుకునేందుకు రూ.20 వేల పరిహారం ఇస్తామన్నారు. ఇంతా చేసి ఒక ఏడాది మాత్రమే దీనిని అమలు చేశారు. జిల్లాలో 19 వేల మందికి పైగా మత్స్యకారులు ఉండగా గత ఏడాది కేవలం 11,300 మందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది అయినా అర్హులందరికీ రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్సీ కుడుపూడి ఫిర్యాదు
అమలాపురం రూరల్: రహదారుల పక్కన స్థలాలు ఆక్రమించి షాపులు నిర్మించుకుంటున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమలాపురం బస్టాండ్, హాస్పిటల్స్, పార్కులు, గ్రంథాలయాలు, పలు ముఖ్య కూడళ్లలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారికి తెలియజేస్తే తాను ఈ ఊరు వ్యక్తిని కానంటూ సమాధానం చెప్పటం శోచనీయంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలపై ప్రభుత్వం హైట్రా చట్టం తెచ్చి తొలగించాలని డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్లో 212 అర్జీలు అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమంలో 212 అర్జీలను స్వీకరించారు. ఆర్డీవో మమ్మీ డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డీఎల్డీవోలు రాజేశ్వరరావు, విజయలక్ష్మి పీజీఆర్ఎస్ నిర్వహించారు. పోలీస్ గ్రీవెన్స్కు 24 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి పోలీస్ గ్రీవెన్స్ను నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రదేశాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి అర్జీలు అందించారు. అర్జీల్లో సగానికి పైగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవే ఉండడంతో ఫిర్యాదిదారులను కౌన్సిలింగ్ చేసి వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు. 8 నెలలుగా పనుల్లేవ్ మహిళా ఉపాధి కూలీల నిరసన అమలాపురం రూరల్: ఉప్పలగుప్తం పంచాయతీ పరిధిలోని ఆదిలక్ష్మిపురంలో ఎనిమిది నెలలుగా పనులు కల్పించలేదని మహిళా ఉపాధి కూలీలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. పనులు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని అయితాబత్తుల వెంకటలక్ష్మి, జనిపల్లి అంజమ్మ ఆధ్వర్యంలో 35 కుటుంబాల వారు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ పంచాయతీ పరిధిలోనే ఫీల్డ్ అసిస్టెంట్ కడిమి అరుణ పనులు కల్పించడంలేదని చెప్పారు. మండలంలో కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నా కొన్ని గ్రామాల్లో జరగడం లేదన్నారు. పనులు కావాలని అడిగితే ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం పనులను ఆన్లైన్లో నమోదు చేయడం, అంచనాలు వేయడంలో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడి ఆలస్యం జరుగుతోందన్నారు. దీనివల్ల వేసవి వచ్చినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పనులు ముమ్మరంగా జరిగేవని, ఈ ఏడాది ఇంకా మొదలు కావడంలేదన్నారు. తక్షణం అన్ని గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డ్వామా పీడీ రాంబాబు, సబ్ కలెక్టర్ మమ్మీలకు వినతిపత్రం అందించారు. పి. వెంకటలక్ష్మి, పెయ్యల వరలక్ష్మి, బళ్ల అరుణ, బూల అదిలక్ష్మి, పులిదిండి మంగ, పండు వరలక్ష్మి పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా చక్రధరరావు ద్వారకా తిరుమల ఇన్చార్జిగా త్రినాథరావు బదిలీ అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈఓగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం ఈఓ ఎన్ఎస్ చక్రధరరావు పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు నాలుగు నెలలుగా అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ఇన్చార్జి ఈఓగా నియమితులైన చక్రధరరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిరావులపాలెం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనను, అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రావులపాలెం సోమసుందరరెడ్డి నగర్ (కొత్త కాలనీ)కి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాలనీకి చెందిన మానుపాటి పోసి, మానుపాటి అజయ్, మానుపాటి ఏడుకొండలు, కోసూరి వంశీ, మానుపాటి వంశీ, కావడి అనిల్, కావడి సునీల్, ఈతకోట శివ, ఎస్.కె ఖలీద్, గొలుగూరి బాలు, మహేష్, హేమంత్, కిరణ్ తదితర సుమారు 50 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పాటుపడ్డ ప్రతీ ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బొక్కా ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ బొక్కా కరుణాకరం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, నేతలు గొలుగూరి మునిరెడ్డి, షేక్ వల్లి బాబా, పార్టీ గ్రామ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
రైతుకు అమృత భాండం
సాక్షి, అమలాపురం: ఆరోగ్యానికి ఔషధంగా పేరొందిన కొబ్బరి బొండాల సీజన్ మొదలైంది. గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతోంది. మండుతున్న ఎండలు కొబ్బరి బొండాలకు గిరాకీ తెచ్చిపెట్టాయి. గత నెలలో కొబ్బరి బొండాం ధర రైతు వారీ రూ.13 నుంచి రూ.15 వరకు ఉండగా, ఇప్పుడది రూ.17 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఈ పెరుగుదల రైతులకు కొంత ఊరట కల్పించింది. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న బొండాలకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రిటైల్గా రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతోంది. లీటరు బొండాం నీళ్లు రూ.120 వరకు విక్రయిస్తున్నారు. కొబ్బరి కాయలకు గిరాకీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోందని అంచనా. ప్రధానంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పెదవేగి, విజయరాయి, జంగారెడ్డిగూడెం, నలజర్ల, కొవ్వూరు, చాగల్లు పరిసర ప్రాంతాల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉన్నా ఇక్కడి రైతుల నుంచి బొండాల సేకరణ తక్కువ. ఈ సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు 50 నుంచి 70 ఐసర్ వాహనాలు, లారీల్లో బొండాలు ఎగుమతి అవుతాయని అంచనా. బొండాం ధర పెరగడంతో కొబ్బరి కాయకు సైతం డిమాండ్ ఏర్పడింది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో నిన్న మొన్నటి వరకు వేయి పచ్చి కొబ్బరికాయల ధర రూ.13 వేల వరకు ఉండగా, అది ఇప్పుడు రూ.15 వేలకు పెరిగింది. భారీ వ్యత్యాసం ఈ సీజన్లో ఈ ఏడాది కొబ్బరి దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో వేసవిలో కొబ్బరి బొండానికి మరింత డిమాండ్ రావాల్సి ఉంది. కానీ కొబ్బరి బొండాల సైజు తగ్గడం వల్ల అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. ‘కొబ్బరి బొండాలను రైతుల వద్ద కొనుగోలు చేసిన సమయంలో ఈ స్థాయిలో ధర వ్యత్యాసం ఉండేది కాదు. సైజును బట్టి రూ.2, రూ.3 మాత్రమే తేడా ఉండేది. ఇప్పుడు బాగా చిన్న సైజు వస్తోందని రూ.15 చేసి కూడా కొంటున్నారు. బాగా పెద్ద సైజు ఉందని కొన్నిచోట్ల రూ.28 పెట్టి కూడా కొంటున్నారు’ అని ఏలూరుకు చెందిన రైతు కె.చంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. పాత తోటల్లో (15 ఏళ్లకు పైబడి వయస్సు) ఉన్న తోటల్లో బొండాల కన్నా మొక్క తోట (15 ఏళ్ల లోపు వయసు) ఉన్న తోటల్లో బొండాలకు డిమాండ్ రావడానికి సైజు ప్రధాన కారణం. ఇతర రాష్ట్రాల సరకు దిగుమతితో.. రూగోస్ వైట్ ఫ్లై (తెల్ల దోమ) వచ్చిన తరువాత కొబ్బరి తోటల్లో కాయ సైజుపై ప్రభావం చూపింది. 30 శాతం దిగుబడి తగ్గడంతో పాటు కాయ సైజు తగ్గడం కూడా పెద్దగా డిమాండ్ రాకపోవడానికి ఒక కారణమని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కొబ్బరి బొండాల కన్నా తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద సైజు బొండాలు రావడం కూడా ఇక్కడి బొండాలకు అనుకున్న స్థాయిలో డిమాండ్ రావడం లేదు. ఇది కూడా ధర ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణమైంది. ‘మార్చి నుంచి జూన్ వరకు కొబ్బరి బొండాలకు అధిక డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో బొండాల కోత ఎక్కువగా ఉంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొబ్బరికి మంచి డిమాండ్ వస్తుంది’ అని రైతులు అంచనా వేస్తున్నారు. పెరిగిన కొబ్బరి బొండాల రేట్లు మొదలైన సీజన్ రైతు వారీ ధర రూ.17 నుంచి రూ.25 వరకు కొబ్బరి ధరలకు ఊతం సైజు తగ్గడం వల్ల ఆశించిన స్థాయిలో లేని డిమాండ్ -
తాళ్లరేవులో వరుస దొంగతనాలు
● నాలుగు ఇళ్లు, స్టూడియోలో చోరీలు ● బంగారం, నగదు అపహరణ ● సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవులో వరుస దొంగతనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురవుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో సంతపేట సెంటర్, బాలాజీ నగర్లలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు గృహాలు, ఒక స్టూడియో చొరబడి బంగారం, నగదు, కెమెరాలు అపహరించుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చిన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం వెనుక గల ఇళ్లలో దొంగ చొరబడి సుమారు రూ.60 వేలు విలువ చేసే అరకాసు బంగారం, రూ.5 వేల నగదు, పక్కనే తాళం వేసిన ఉన్న మరో ఇంటిలోని రూ.15 వేలు నగదు అపహరించుకుపోయాడు. మరో ఇంటిలో కొన్ని వస్తువులు, 5 తులాల వెండి మాయమైనట్లు తెలిసింది. అలాగే సంతపేట సెంటర్లోని ఒక స్టూడియోలోకి చొరబడి రెండు కెమెరాలు, నగదు అపహరించుకుపోయారు. ఈ దొంగతనాలకు సంబంధించి పలు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముఖానికి ఎటువంటి మాస్క్ కట్టుకోకుండా దర్జాగా వచ్చిన ఓ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఒకే వ్యక్తి ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడడం అసాధ్యమని, మరికొందరు ఉండి ఉండవచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆధారాలు సేకరించి, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వానికి నివేదించాం
మోంథా తుపాను పంట నష్టంపై రైతు సేవాకేంద్రం, వీఏఏ, వీఆర్ఓ, గ్రామ కార్యదర్శులతో కూడిన బృందంతో సర్వే చేపట్టాం. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు పరిహారం అందజేస్తాం. – ఎంవీ రామారావు, జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం పరిహారం అందలేదు నెలలు గడుస్తున్నా మోంథా తుపాను నష్టపరిహారం అందలేదు. గతేడాది ఇవ్వాల్సిన పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉద్యాన పంటలకు పరిహారం మంజూరు చేయాలి. – యాతం వెంకటేశ్వరరావు, ఉద్యాన రైతు, ఆత్రేయపురం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆపద సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మోంథా తుపాను వల్ల వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట నష్టాన్ని అంచనా వేసినా ఇప్పటి వరకూ పరిహారం ఊసేలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదు. – పిల్లి వెంకన్న, పినపళ్ల, ఆలమూరు మండలం -
మగ్గానికి బకాయిల పగ్గం
● చేనేత కార్మికుల ఆవేదన ● లివరీ దుప్పట్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ ● నేసిన తర్వాత కొనని వైనం రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో చేనేత కార్మికులు ‘చంద్రబాబు మార్కు వెన్నుపోటు’ దెబ్బతో విలవిల్లాడుతున్నారు. అసలే పని లేక కాఫీ హోటళ్లలో సర్వర్లుగా, పలు షాపుల్లో కూలీలుగా మారుతున్న చేనేత కార్మికులను తెలుగుదేశం ప్రభుత్వం ఊరించి ఉసూరుమనిపించింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో లివరీ దుప్పట్లు ఉత్పత్తి చేసే చేనేత సహకార సంఘాలు శ్రీకాకుళం డివిజన్లో 6, విజయనగరం డివిజన్లో 3, రాజమహేంద్రవరం డివిజన్లో 10, విజయవాడ డివిజన్లో 4 వెరసి మొత్తం 23 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 8 నెలల కాలంలో 2,52,000 లివరీ దుప్పట్లు ఉత్పత్తి చేయాలని ఆర్డరు ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చి.. లివరీ గైడ్లైన్స్ ప్రకారం చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 50 శాతం సొమ్ము అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉండగా.. ఆర్డరు ఇచ్చి చేతుల దులుపుకొన్నారు. అయితే హాస్టల్ విద్యార్థులకు చేనేత సంఘాలు ఉత్పత్తి చేసిన దుప్పట్లు పంపిణీ చేయడం రివాజుగా జరుతున్న క్రమంలో.. సంఘాలు బ్యాంకులలో అప్పులు చేసి మరీ ఉత్పత్తి చేపట్టాయి. మూడు నెలల పాటు నేసిన దుప్పట్లు ఆప్కో ద్వారా ప్రభుత్వం తీసుకుంది. మరో 4 నెలలు నేసినవి సంఘాల వద్దే నిల్వలుగా పేరుకుపోయాయి. అడ్వాన్స్ మాట ఎలా ఉన్నా కనీసం కొనుగోలు చేసిన వాటికై నా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే కాస్త ఒడ్డున పడదామని నేతన్నలు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేనేత సంఘాల వద్ద కొనుగోలు చేసిన దుప్పట్లను ఆప్కో వద్దనే ఉంచుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రభుత్వం మెషీన్ మేడ్ దుప్పట్లు కొనుగోలు చేసి హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేయడంతో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంఘాల్లో పేరుకున్న దుప్పట్ల నిల్వలను చూస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం 2024 డిసెంబర్ నుంచి 17 నెలలుగా చేనేత సంఘాలకు ఉన్న బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన లివరీ ఉత్పత్తుల బకాయిలు సుమారు రూ. 3.70 కోట్లు, అదే విధంగా చేనేత సంఘాల వద్ద ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి కొనకపోవడంతో నిల్వ ఉన్న లివరీ బెడ్ షీట్లు సుమారు 43,980. లివరీ ఉత్పత్తులు కాకుండా చీరలు వంటి జనరల్ ఉత్పత్తుల నిమిత్తం కూడా ప్రభుత్వం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సుమారు 2.55 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని చేనేత నాయకులు చెబుతున్నారు. నేటి నుంచి దీక్షలు తెలుగుదేశం ప్రభుత్వం చేనేతలపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. చేనేత కార్మికులు చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులను కోరుతున్నాం. – అల్లక రాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ -
భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. చదువు భయంతో బాలుడి అదృశ్యం ఆచూకీ నాలుగు గంటల్లోనే లభ్యం అమలాపురం టౌన్: చదువు భయంతో ఓ బాలుడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురంలోని దుడ్డి వారి అగ్రహారానికి చెందిన కాజా సురేష్ కుమారుడు అశ్విన్ స్థానికంగా ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్లిన అశ్విన్ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడి గదిని పరిశీలించారు. అక్కడ అశ్విన్ రాసిన ఓ లేఖ లభ్యమైంది. చదువు తనకు ఇబ్బందిగా మారిందని, పదో తరగతి కూడా పాస్ కాలేననే భయంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని దానిలో రాశాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పాడి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. అమలాపురంలో సీసీ పుటేజీలు పరిశీలించగా అశ్విన్ అమలాపురం బస్ స్టేషన్లో విజయవాడ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. పోలీసులు ఆ బస్సును వెంబడించే లోపు బాలుడు మరో చోట దిగిపోవడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో బాలుడి ఫొటోను సంబంధిత నెట్వర్క్ ఏరియాలకు పంపించారు. విజయవాడ పోలీస్ సెంట్రల్ కార్యాలయం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆశ్విన్ ప్రదేశాన్ని పోలీసులు నిమిషాల్లో గుర్తించారు. వెనువెంటనే స్పందించిన పోలీసులు విజయవాడలో బాలుడిని అదుపులోకి తీసుకున్నారని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. నేడు యథాతథంగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ను సోమవారం ఉదయం పది గంటల నుంచి యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవనంలో, డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయన్నారు. -
మధుర ఫలం.. మరింత ప్రియం
● ఆలస్యమైన మామిడి దిగుబడి ● తుని మామిడికి ఎనలేని డిమాండ్ ● ప్రారంభమైన ఎగుమతులు ● ఉమ్మడి జిల్లాలో 15,362 హైక్టార్లలో సాగు తుని: మండు వేసవికి మధుర ఫలానికి అవినాభావ సంబంధం. ఉష్ణం ఉష్ణేన సీతలే అని వేసవి ఉడుకుకు మామిడిని మితంగా తింటే చలవ చేస్తుందంటారు. అందులోనూ తుని మామిడి అంటే తిని తరించాలంతే అంటారు ఆ ప్రాంత వాసులు. మూడు తరాలుగా మామిడి పండ్ల వ్యాపారం చేస్తూ.. రెండేళ్లుగా విదేశాలకు సైతం ఉద్యానశాఖ ద్వారా ఎగుమతులు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక్కడి మామిడి రైతులు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గడంతో వ్యాపారం కాస్త తగ్గుతుందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. తుని సబ్ డివిజన్లో 3458 హైక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణ రేఖ, పంచదార కంచి, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లలకు ఎంతో డిమాండ్. గతంలో ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు 60 వేల టన్నులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం దిగుబడి 10,374 టన్నులు ఉందని, ఉద్యానశాఖ అంచనాల ప్రకారం రూ.24 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనా. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యానశాఖ 3500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది ఇతర రాష్ట్రాలకు.. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్య ప్రదేశ్, బీహర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఇక్కడి మామిడిని ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం సువర్ణరేఖ టన్ను రూ.55 వేలు, బంగినపల్లి, రసాలు టన్ను రూ.45 వేలు, తోతాపురి టన్ను రూ.35 వేలు పలుకుతోంది. పండూరు, కొత్తపలి కొబ్బరి రకాల ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది కొంచెం ఆలస్యం మామిడి ఎగుమతులు ఉగాది నుంచి ప్రారంభం కావాలి. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడం, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి దగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదు. దీంతో ఇక్కడి పండ్లను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. – పి.వెంకటరమణ, మామిడి ఎగుమతిదారుడు,తుని. -
ఘనంగా శ్రవణ నక్షత్ర మాస కల్యాణం
ఆత్రేయపురం: ర్యాలి గ్రామంలోని జగన్మోహిని కేశవస్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర మాస కల్యాణాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతల వెంకట రమణమూర్తి, సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు అమలాపురం టౌన్: ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్, సోషల్ మీడియా చానళ్లు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ లింకులు, అనధికార యాప్ల ద్వారా అక్రమ బెట్టింగ్ల కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ, మోసపూరిత బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు నిర్వహిస్తున్నారన్నారు. అక్రమ బెట్టింగ్ చేసే వ్యక్తులకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరం, మనీ లాండింగ్ కోణాల్లో వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు. ఆన్లైన్ రమ్మీ, క్యాష్ గేమింగ్, టెలిగ్రామ్ బెట్టింగ్ చానల్లు, అనుమానాస్పద యూపీఐ లావాదేవీల సమాచారం తెలిస్తే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు లేదా సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి ఉప్పలగుప్తం: పిల్లలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి యనమదల ఇందిర ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీల విభాగంలో రెండో స్థానం సాధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రన్నర్గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇందిరను ఆమె నివాసంలో వెంకన్నాయుడు సత్కరించి, నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎస్టీయూ జిల్లా ఉపాధ్యాయవాణి కన్వీనర్ చిక్కం మైనర్ బాబు, మోటూరి సత్యంకాపు సైతం ఇందిరను అభినందించారు. వెంకన్నాయుడు మాట్లాడుతూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఇందిర తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె తండ్రి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు యనమదల పల్లంరాజు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఆర్టీఐ విభాగం మండల అధ్యక్షుడు పోలిశెట్టి వీర్రాజు, పార్టీ నాయకులు బొర్రాయిపాలెపు సూర్యనారాయణ, దూలం సూరిబాబు, గొల్లపల్లి బాబీ, యర్రంశెట్టి ప్రసాద్, ఆప్పారి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. లోవ దేవస్థానంలో రద్దీ తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు తదితర వాటిద్వారా రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన తెలిపారు. -
ప్రాధాన్యం ఇస్తారా...
● జిల్లాలో మొదలైన రబీ వరి కోతలు ● ఈసారి 194 కేంద్రాలు మాత్రమే ● 1.31 లక్షల ఎకరాల్లో సాగు ● 4.43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ● గత రబీలో రైతులను ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ● నష్టపోయిన డెల్టా రైతులు ● ఈసారి ఏమవుతుందోనని ఆందోళన సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యవసాయం భారంగా మారింది. విత్తు నుంచి విక్రయం వరకూ అనేక ఇబ్బందులు పడి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలిచి పండించినా, విక్రయించడానికి అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం, చేసినా సకాలంలో డబ్బులు జమ చేయకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదు. గతేడాది రబీకి ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ రబీ సీజన్ కోతలు మొదలయ్యాయి. ధాన్యం విక్రయానికి ఎన్ని కష్టాలు పడాలోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారైనా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అసలు పరీక్ష గోదావరి డెల్టాలో రబీ వరి కోతలు మొదలవుతున్నాయి. ఆత్రేయపురం, ఆలమూరు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించింది. ఈ ఏడాది మండపేట నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల పరిధిలో (కాజులూరు, తాళ్లరేవు మండలాలు మినహా) 1,31,500 ఎకరాల్లో సాగు జరిగింది. సగటు దిగుబడి ఎకరాకు 45 బస్తాలు (75 కేజీలు) లెక్క వేస్తే సుమారు 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా. రబీలో శివారు, మెరక ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు అందకున్నా, రైతులు అష్టకష్టాలు పడి పంట పండించారు. అయితే రైతులకు ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల సంఖ్య తక్కువే. దీనికి తోడు మండపేటను తూర్పు గోదావరి జిల్లాలో కలవడంతో మిల్లులు సంఖ్య, అవి ధాన్యం సేకరించే సామరర్థ్యం కూడా తగ్గిపోయింది. ఈ కారణంగానే తమ వద్ద ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం సేకరిస్తుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. గత రబీలో రైతులను ముంచేశారు గత రబీలో ధాన్యం కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లిప్తత, సకాలంలో సొమ్ములు చెల్లించడంలో నిర్లక్ష్యంతో రైతులు నిలువునా మునిగిపోయారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో ధాన్యం కొనుగోలు జరిగింది. మండపేట నియోజకవర్గంతో కలిపి జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 1.68 లక్షల ఎకరాలలో రబీ వరిసాగు జరగగా, సుమారు 5.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వచ్చింది. భారీగా దిగుబడి వచ్చినా ప్రభుత్వం తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పింది. తర్వాత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని మరో లక్ష మెట్రిక్ టన్నులకు పెంచారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కేంద్రాలలో లక్ష్యం పూర్తయ్యిందని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లర్లకే అయిన ధరకు ధాన్యం అమ్మకాలు చేయాల్సి వచ్చింది. అప్పట్లో కనీస మద్దతు ధర 75 కేజీల ఽబస్తాకు రూ.1,725 వరకు ఉండగా రూ.150 నుంచి రూ.200లు తగ్గించి రైతులు అమ్మకాలు చేసుకున్నారు. దీని వల్ల రబీ పండినా రైతులు లాభాలు పొందలేకపోయారు. చంద్రబాబు గొప్పలు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు పోయింది. తొలి వారం పది రోజులు 24 గంటల నుంచి 48 గంటలకు సొమ్ములు చెల్లించారు. తరువాత నెలల తరబడి సొమ్ములు ఇవ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెట్టారు. మే 9వ తేదీ నుంచి ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిపివేయడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. కనీసం ఖరీఫ్ సాగు ప్రారంభమైన జూన్ 1వ తేదీకి సైతం ధాన్యం సొమ్ములు వేయకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేయలేక పలు ప్రాంతాల్లో ఖరీఫ్కు దూరమయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. రైతులు అమ్మకాలు చేయాలనుకున్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో సొమ్ములు చెల్లించాలని వారు కోరుతున్నారు. -
సామాజిక సమానత్వానికి ఫూలే కృషి
● అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంత్యుత్సవం రావులపాలెం: అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్ముడు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడు జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా శనివారం రావులపాలెంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా విద్యకు శ్రీకారం చుట్టి, అణగారిన వర్గాలకు విద్యను అందించిన గొప్ప సంస్కర్త ఫూలే అన్నారు. సమాజంలోని కుల వివక్ష, అన్యాయాలపై పోరాడి, సమాన హక్కుల కోసం ప్రజలను చైతన్యపరిచారన్నారు. ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బొక్కా ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ సర్పంచ్లు కర్రి గోవింద కృష్ణారెడ్డి, సబ్బితి మోహనరావు, బొక్కా కరుణాకరం, మాజీ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అసమానతలను తొలగించిన సంస్కర్త అమలాపురం టౌన్: సమాజంలో సామాజిక అసమానతలను తొలగించిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ ముఖ్యనేతలు అన్నారు. పార్టీ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పార్కు వద్ద ఫూలే జయంతి నిర్వహించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ, పార్టీ జోన్–2 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ పాల్గొన్నారు. ఆ పార్కు ముఖ ద్వారం వద్ద గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అఖండ అక్షర జ్యోతిని ఫూలే వెలిగించి సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అహర్శిశలు శ్రమించిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. మరో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం ఆయన నిరంతరం శ్రమించారన్నారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ఆద్యుడు ఫూలే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, షేక్ అబ్దుల్ ఖాదర్, ఉండ్రు బాబ్జీ, మద్దింశెట్టి ప్రసాద్, సుంకర లక్ష్మి, తిరుకోటి సతీష్, భరణికాన బాబు, విత్తనాల మూర్తి, సూదా గణపతి, కముజు రమణ, తోరం గౌతమ్ రాజా, ముంగర ప్రసాద్, కుడుపూడి త్రినాథ్, వాసంఽశెట్ట శ్రీనివాస్, కాండ్రేగుల శ్రీనివాస్, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్, నాగారపు వెంకటేశ్వరరావు, కాళే చంటి తదితరులు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తి అమలాపురం రూరల్: జ్యోతిరావు ఫూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని, ఉన్నత చదువులతో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్, బీసీ వెల్ఫేర్ అధికారి పి.జ్యోతిలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి, శెట్టిబలిజ కార్పొరేషన్ సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. రావులపాలెంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలోఫూలే చిత్రపటానికి నమస్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి అమలాపురంలో ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ అనురాధ -
గోదావరి దాటిన పెద్ద పులి
దేవీపట్నం: గడిచిన రెండు వారాలుగా దేవీపట్నం మండలంలోనే తిష్ట వేసిన పెద్ద పులి ఎట్టకేలకు గోదావరి దాటింది. దేవీపట్నం, లింగవరం గ్రామాల వద్ద ఐదు రోజుల పాటు మకాం ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉంటుందని భావించినప్పటికీ పులి తన గమనాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దేవీపట్నం, లింగవరం గ్రామాల సమీపంలో గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సంగనపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దేవీపట్నం తరహాలోనే అక్కడ కూడా సమృద్ధిగా నీరు, పులికి ఆహారం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద పులి వచ్చిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరి జిల్లా దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రలోని తడోబా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. సీతారామ సత్రానికి రూ.5 లక్షల విరాళం అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు. -
‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ
కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్లోని జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఆ సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్పల సూర్య శంకరం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం విరమించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన దీక్షలకు అధికారులు స్పందించారు. జిల్లా సహకార అఽధికారి బి.శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న చర్యలను సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి త్రినాథరావుకు ఈ నెల 9న లేఖ ద్వారా వివరించి దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుతో పాటు సీఐడీతో విచారణ చేయించిన విషయం తెలిసిందే. వయసు మీద పడి చాలా మంది డిపాజిటర్లు చనిపోతుండడంతో తక్షణ న్యాయం కోరుతూ సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చున్న పైడికొండల హనుమంతరావు, దేవికుమారిలతో సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు చర్చలు జరిపి ఒప్పించడంతో మధ్యాహ్నం దీక్షను విరమించారు. చైర్మన్ త్రినాథరావు మాట్లాడుతూ సొసైటీ బాధితులకు సాయం చేయాలని, ముందుగా రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీలకు, కలెక్టర్, తదితరులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీఓ తెలియజేయడంతో పాటు ఎండలో దీక్షలు వద్దని అభ్యర్థించిన మేరకు దీక్ష విరమింపజేశామన్నారు. దీక్షను విరమింపజేస్తున్న చైర్మన్ త్రినాథరావు తదితరులు -
ఒకటి నుంచి బాస్కెట్ బాల్ శిక్షణ
అమలాపురం టౌన్: అమలాపురం కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ మెమోరియల్ బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలల క్రీడా స్థలంలో మే 1 నుంచి జూన్ 15 వరకూ ఉచిత వేసవి బాస్కెట్, ఫుట్ బాల్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ, బాస్కెట్ బాల్ మాజీ జాతీయ క్రీడాకారుడు కుడుపూడి సూర్యనారాయణరావు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. 45 రోజుల పాటు ఉదయం, సాయంత్రం జరిగే ఈ శిక్షణకు పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయసున్న బాల బాలికలు అర్హులన్నారు. ఫిజికల్ డైరెక్టర్ ఆకుల ఉమ, వ్యాయామ ఉపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, వెంకటరావు కోచ్లుగా వ్యవహరిస్తారన్నారు. ఆసక్తి కలవారు తమ పేర్లను 93986 77969 నంబర్కు ఫోన్ చేసి, నమోదు చేయించుకోవాలని సూచించారు. నేడు, రేపు క్రీడా ఉత్సవాలు అమలాపురం రూరల్: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తునట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు అమలాపురంలో శనివారం కోనసీమ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పొనుగుపాటి శ్రీనివాస్తో కలిసి ఆయన పోస్టర్లను విడుదల చేశారు. ఆసక్తి కల క్రీడాకారులు ఆ రోజుల్లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అరిగెల నాని, పట్టణ అధ్యక్షుడు అయ్యల బాష, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గోకరకొండ గంగన్న స్వామి పాల్గొన్నారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వా మివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. వైనతేయ నదిలో పుణ్య స్నానా లు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ము డుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,69,006 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,812 విరాళంగా అందించారు. స్వామి వారిని 6,400 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. -
అమాత్యా.. మొరాలకించవా
నిర్మాణానికి నోచుకోని వనదుర్గ గుడి రోడ్డు● సత్యదేవుని చెంత సమస్యల చింత ● భక్తులలో అసంతృప్తి వెల్లువ ● నేడు దేవదాయ శాఖ మంత్రి ‘ఆనం’ రాక ● సీతారామ సత్రానికి శంకుస్థాపన, మెట్ల దారి ప్రారంభం అన్నవరం: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తాం.. సూపర్ సిక్స్ హామీలు, లక్షలాది ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి.. గత ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి నేతలు ఇచ్చిన బూటకపు హామీలివి. అధికారం అందగానే అవన్నీ బుట్టదాఖలైన రెండేళ్లయినా ఒక్కటీ అమలు చేయకుండానే అన్నీ చేసేశాం అని ఆ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. సనాతన ధర్మానికి సారథులం అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి పెద్దలు ఆచరణలో మాత్రం దేవాలయాలకు, దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనలో మొండి చేయి చూపుతున్నారు. రత్నగిరిపై రూ.11.4 కోట్లతో నిర్మించిన సీతారామ సత్రానికి శంకుస్థాపన, మెట్ల దారిని ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలై నేడు ప్రారంభం కానుండడం గమనార్హం. కాగా ఆలయంలో పలు సమస్యలు, వసతుల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాటి పరిష్కారానికి ఆయన సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంది. పారిశుధ్యం అధ్వానం అన్నవరంలో పారిశుధ్య బాధ్యతలు చూస్తున్న పద్మావతి సంస్థకు నెలకు రూ.80 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఎక్కడా సంతృప్తి వ్యక్తం కావడం లేదు. మూలన పడిన వాషింగ్ మెషీన్లు దేవస్థానంలో సత్రాలలో వస్త్రాలను మెషీన్ల ద్వారా ఉతికిస్తామని చెప్పిన ఆ సంస్థ దోబీలతో ఉతికించింది. వీటికే సుమారు రూ.ఐదు లక్షల బిల్లు దేవస్థానం నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఫారసులతో ఉద్యోగ నియామకాలు దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం 220 మంది మాత్రమే ఉండగా, వారిలో 16 మంది ఈ ఏడాది, మరో పది మంది వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వీరి నియామకాలు ఏపీపీ ఎస్సీ ద్వారా కాకుండా ప్రజా ప్రతినిధుల సిఫారసులతోనే పూర్తి చేస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది తక్కువగా ఉండడంతో కీలక పోస్టుల్లో వీరే ఉన్నారు. అర్చకుల కొరత దేవస్థానంలో 40 ఏళ్ల క్రితం 24 మంది అర్చకులు ఉంటే ఇప్పుడు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. సేవలు మాత్రం గతం కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న వారిలో ఇద్దరు పదవీ విరమణ చేయనున్నారు. కనీసం మరో 15 మంది అర్చకులు అవసరమని ఆ వర్గం కోరుతోంది. వనదుర్గ గుడి రహదారి పూర్తి చేయండి మొదటి ఘాట్రోడ్లోని మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మాణం ఎంతో అవసరం. ఇది జరిగితే ట్రాఫిక్ అంతరాయాలు నివారించవచ్చు. అన్నదానంలోనూ సత్యదేవుని ప్రసాదం పెట్టాలి తిరుమలలో అన్నదానంలో చిన్న లడ్డూ వడ్డిస్తారు. అలాగే సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలోనూ సత్యదేవుని ప్రసాదాన్ని పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వినియోగంలో ఉన్న విధానాన్నే ఇటీవల నిలిపివేయడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
● మహిళలకు క్షమాపణలు చెప్పాలి ● నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ డిమాండ్ ● అమలాపురం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ నేతలు, మహిళలపైన అనుచిత వ్యాఖలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులు శుక్రవారం ఫిర్యాదు చేశాయి. నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ, పార్టీ జోన్ –2 మహిళా విభాగం అధ్యక్షురాలు చింతా అనురాధ, పార్టీ నాయకులు పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట పినిపే శ్రీకాంత్ విలేకర్లతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ చంద్రబాబుకు రాధాకృష్ణ కొమ్ము కాస్తూ వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు సిగ్గు లేకుండా జర్నలిజం విలువలు మరిచి రోత రాతలు రాస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ తక్షణమే ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్పైన, పార్టీ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలే ప్రసక్తే లేదని, ఆయనకు మానసిక శిక్ష వేసే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి బాబి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, అమలాపురం పట్టణం, రూరల్, ఉప్పలగుప్తం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, బద్రి బాబ్జీ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు గొవ్వాల రాజేష్, ఉండ్రు బాబ్జీ, మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్దుల్ ఖాదర్, వంగా గిరజాకుమారి, చొల్లంగి సుబ్బిరామ్, ఉండ్రు వెంకటేష్, తిరుకోటి సతీష్, సుంకర లక్ష్మి, విత్తనాల మూర్తి, సూదా గణపతి, పొగాకు శ్రీను, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండల ప్రతాపం..
● జిల్లాలో 36 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ● ఏప్రిల్ మొదటి వారంలోనే ఉడుకు ఐ.పోలవరం: మార్తాండుడు మనుషుల్ని మిడతల్లా వేయించేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వర్షం పడిన తరువాత నుంచి ఎండలు మరింత ముదిరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అమలాపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదు కాగా, రామచంద్రపురంలో 37 నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంది. రెండు రోజులుగా జిల్లాలో రెండు నుంచి మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం అధికంగా ఉండడంతో రాత్రి వేళ జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐ.పోలవరం, తాళ్లరేవు, ముమ్మిడివరం, అమలాపురం బైపాస్ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉక్కపోతలకు తోడు విద్యుత్ కోతలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం చూపుతాయని, రబీ సాగు ఆలస్యమైన చోట తరచూ తడులు అందించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు కొబ్బరి, అరటి, కోకో, కూరగాయ తోటలకు తడులు పెంచాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇదే సమయంలో మోటార్ల సౌకర్యం లేక డెల్టా కాలువల మీద ఉద్యాన పంటలకు నీరందించే రైతులు డీజిల్ మోటార్లపై ఆధారపడుతున్నారు. -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
డీఎస్వో ఉదయ్ భాస్కర్ ముమ్మిడివరం: రబీలో ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులకు ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ పోర్టర్ వినియోగం, రైతుల వివరాల నమోదు, ఈకేవైసీ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు 24 గంటల లోనే రైతుల ఖాతాలలోకి జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఫౌర సరఫరాల మేనేజర్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 26 నుంచి క్రీడా అకాడమీల ప్రారంభం అమలాపురం రూరల్: విజయవాడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖ, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పునఃస్థాపన ప్రక్రియను ప్రారంభించినట్టు కోనసీమ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వైవీ రుద్ర తెలిపారు. రాష్ట్ట్ర క్రీడాకారుల అభివృద్ధికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు దిశగా ముఖ్యమైన ముందడుగని అన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్ల లోపు వయసు గల క్రీడాకారులు జనవరి ఒకటి, 2008 నుంచి జనవరి ఒకటి, 2011 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా వివిధ క్రీడా విభాగాలలో ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు. 13న మినీ ఉద్యోగ మేళా అమలాపురం రూరల్: ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్ వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. తమిళనాడులోని హోసూర్లోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 19–35 ఏళ్ల మధ్య ఉన్న మహిళా అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, బీటెక్ పీజీ పూర్తి చేసిన వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు. సిబ్బంది సమస్యలపై ‘ఎస్పీ సంపర్క్’అమలాపురం టౌన్: పోలీస్ సిబ్బంది బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, ఇతర సర్వీస్ సమస్యలపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ‘ఎస్పీ సంపర్క్’ను శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పోలీసులు కొందరు నేరుగా, మరికొందరు ఫోన్ల ద్వారా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకొన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించేందుకు సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలి ఆర్జేడీ నాగమణి అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్దేశిత సమయంలోనే త్వరగ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఈవో పి. నాగేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీవైఈవోలు జి.సూర్య ప్రకాశం, లక్ష్మణమూర్తి, కె.వెంకటేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ బీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సాహం
● ‘నన్నయ’లో ఘనంగా ‘పట్టాల’ పండగ ● మొత్తం 722 మందికి అందజేత ● 14 మందికి బంగారు పతకాలు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం సందడిగా సాగింది. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పట్టాల పండగలో పాల్గొన్నారు. చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 14 మంది బంగారు పతకాలు అందుకున్నారు. పట్టభద్రులు దేశాభివృద్ధిలో కీలకం : చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నత చదువులతో పట్టభద్రులైన వారందరూ సమాజ హితంగా పయనాన్ని కొనసాగిస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన ‘నన్నయ’ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా అభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ‘వసుదైక కుటుంబం’ అనే భావనతో ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీలోని కన్వెన్షన్ హాలులో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి 16, 17 స్నాతకోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. 45 మందికి బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలను అందజేశారు. పట్టాలు అందుకునేందుకు 722 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారికి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అతిథులు జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, యాప్షీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిల చేతుల మీదుగా అందజేశారు. ‘నన్నయ’ కీర్తిని ఇనుమడింపజేసేలా.. వీసీ ప్రసన్న శ్రీ ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి జిల్లావాసుల చిరకాల కోరిక మేరకు ఆవిర్భవించిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను అందస్తోందన్నారు. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయిన నన్నయ భట్టారకుని కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఆరు జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా నిలిచిందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులను సమాజానికి కావలసిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరమే : ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా మాట్లాడుతూ విద్యార్థులు ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్ శాఖల అధ్యయనం వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరాన్ని ప్రస్తావిస్తూ, పాఠ్యాంశాలతోపాటు నైపుణ్యాలు, సృజనాత్మకత, అనుభవాత్మక అభ్యాసం కూడా అవసరమనే విషయాన్ని గ్రహించాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చదువును మరచిపోకుండా నిరంతరం పుస్తక పఠన చేయాలన్నారు. అందుకు అనుగునంగా తల్లిదండ్రులు కూడా నచుకోవాలని, ఇంటిలోని ర్యాక్లలో భాగవత, రామాయణాలతోపాటు చరిత్రను తెలియజేసే పుస్తకాలను కూడా పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉంచాలని సూచించారు. ఘన స్వాగతం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కులపతి హోదాలో వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని హెలీపాడ్ వద్ద ఉదయం 11 గంటలకు కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.722 మందికి పట్టాల ప్రదానం 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి, దరఖాస్తు చేసుకున్న 722 మంది విద్యార్థులకు పట్టాలను ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అందజేశారు. వీరిలో 21 మంది పీహెచ్డీ, 14 మంది గోల్డ్ మెడల్స్, 10 ప్రైజ్లు పొందిన వారున్నారు. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన 6,113 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 45,337 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించేందుకు చాన్సలర్ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య మునిరత్నంనాయుడు, జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిళలే బుద్ధి చెబుతారు
గన్నవరపు శ్రీనివాసరావు పి.గన్నవరం: మహిళలపైన, వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏబీఎన్ చానల్లో మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణకు గన్నవరపుతో పాటు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం కోఆర్డినేటర్ గన్నవరపు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తారని, కానీ ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం మహిళలను అవమానిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తన అహంకారాన్ని వీడి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మహిళలపై ఏబీఎన్ చానల్లో ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబుకు రాధాకృష్ణ బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో మహిళలే అతనికి తగిన బుద్ధి చెబుతారన్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాధాకృష్ణ డౌన్, డౌన్ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల రాము, పార్టీ రాష్ట్ర నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, ఇందుకూరి నరసింహరాజు, వాసంశెట్టి తాతాజీ, నక్కా వెంకటేశ్వరరావు, జక్కంపూడి వాసు పాల్గొన్నారు. -
పైశాచిక వ్యాఖ్యలపై ఫైర్
వైఎస్సార్ సీపీ నేతలను, వారి భార్యలను అవమానిస్తూ ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. మహిళలపై జుగుప్సాకరంగా పైశాచిక రాతలు రాసిన ఆయనను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.తక్షణమే అరెస్టు చేయాలి : పొన్నాడ ముమ్మిడివరం: మహిళలను కించపర్చే విధంగా దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ని యోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేశారు. పొన్నాడ మాట్లాడుతూ సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పితాని బాలకృష్ణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాశి బాలమునికుమారి, జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శంకరరావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి : సూర్యప్రకాశ్ రామచంద్రపురం: వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో చేసిన అవమానకర, అసత్య వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు. నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి సూర్యప్రకాష్, రామచంద్రపురం సీఐ వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. దూషణాత్మక వీడియోలను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీపీ అంబటి భవానీ, పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పి.వరప్రసాద్ పాల్గొన్నారు. కొత్తపేట: నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్న తీరు పాత్రికేయ విలువలను దిగజార్చే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు గురువారం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగ్గిరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కొత్తపేట చేరుకోగా వారందరితో కలిసి పోలీస్ స్టేషన్లో ఎస్సై జీ సురేంద్రకు ఫిర్యాదు అందజేసి రసీదు తీసుకున్నారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాధాకృష్ణ తన మీడియాలో ప్రసారమైన కార్యక్రమంలో వివాహం అయిన మహిళలను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచాతినీచంగా వ్యాఖ్యానించారన్నారు. వివాహ బంధాన్ని హేళన చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆలికి, చెల్లికి తేడా తెలియని మూర్కుడు రాధాకృష్ణ అని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గూడపాటి ప్రవీణ్కుమార్, సీనియర్ నాయకుడు చల్లా ప్రభాకరరావు, మహిళా విభాగం సభ్యురాలు కొంబత్తుల మంగమ్మ పాల్గొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు జర్నలిజం విలువలను దిగజార్చారని ధ్వజం మహిళలను అవమానించడంపై నిరసన -
పీడీ రమాదేవికి జీసీడీఓగా పదోన్నతి
కొత్తపేట: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఏ శ్రీసత్య రమాదేవి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో గర్ల్స్’ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ) గా పదోన్నతి పొందారు. కలెక్టర్ సూచన మేరకు డీఈఓ పీ నాగేశ్వరరావు నుంచి రమాదేవి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఆమె గత ఏడాది సెప్టెంబర్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీటీ) ఉమెన్ విభాగం జిల్లా సెక్రటరీగా నియమితురాలై కొనసాగుతున్నారు. సముద్ర కోత నివారణకు తోటల పెంపకం అమలాపురం రూరల్: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. గురు వారం ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి భూసేకరణ, భూపరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు. ఈ తీర ప్రాంతానికి రక్షణ కవచంలా నిలిచేలా తోటల పెంపకం కోసం 10.5 ఎకరాలు సేకరించామని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఓఎన్జీసీ అందుబాటులో ఉన్న వేరే భూమిని కొనుగోలు చేసి అప్పగిస్తుందన్నారు. జిల్లా అటవీ అధికారి ఎన్వీ ప్రసాదరావు, ఓఎన్జీసీ ప్రతినిధులు, భూసేకరణ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు పాల్గొన్నారు. 23వ తేదీ వరకు పోషణ్ పఖ్వాడా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ పోషణ్ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం పోషణ్ పఖ్వాడా గోడ పత్రికను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సెల్ఫోన్, టీవీ స్క్రీన్లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పఖ్వాడా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐసీడీఎస్ పీడీ కే.నాగమణి, డీఈవో పీ నాగేశ్వరరావు, అదనపు డీఎంఅండ్ హెచ్ వీ.భరతలక్ష్మి, డీఆర్డీఏ పీడీ రాంబాబు, సీడీపీవోలు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.4.31 లక్షలు పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
యానాంలో 93.35 శాతం పోలింగ్
● కొన్నిచోట్ల స్వల్ప వివాదాలు.. పోలీసుల రంగ ప్రవేశం ● బూత్ల వద్ద బారులు తీరిన ఓటర్లు ● ఓటుహక్కు వినియోగించుకున్న 35,445 మంది ● పురుషులు 17,311, మహిళలు 18,134 మంది ● ఓటు వేసిన సిటింగ్ ఎమ్మెల్యే అశోక్, మల్లాడి, తోటరాజు యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని పోలింగ్ బూత్ల వద్ద స్వల్ప వివాదాలు తలెత్తాయి. దీంతో పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచే పలు పోలింగ్ బూత్ల వద్ద ఓటుహక్కు వినియోగించుకోవడానికి జనం బారులు తీరారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 37,972 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 42 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఎంజీజీబీ హైస్కూల్లో పింక్ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళి నియోజకవర్గ పరిధిలో 42 పోలింగ్ బూత్లలో ఉదయం 9 గంటలకు 16.6శాతంతో 6,032 ఓట్లు, 11 గంటలకు 36.4 శాతంతో 13,998 ఓట్లు నమోదు కాగా, మధ్యాహ్నం 1 గంటకు 57.12 శాతంతో 21,689 ఓట్లు, 3 గంటలకు 74.63 శాతంతో 28,338 ఓట్లు, సాయంత్రం 5 గంటలకు 89.80 శాతంతో 34,098 ఓట్లు పోలయ్యాయి. పరిశీలించిన అబ్జర్వర్లు కనకాలపేట, కురసాంపేట, అయ్యన్ననగర్, దరియాలతిప్ప, దొమ్మేటిపేట, సావిత్రినగర్, గిరియాంపేట, తదితర ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి మహిళలు, వృద్ధులు, యువతీయువకులు బారులు తీరి నిలబడ్డారు. మెట్టకూరు జవహర్లాల్నెహ్రూ ప్రభుత్వ హైస్కూల్లో యూత్ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. వృద్ధులకు కోసం వీల్చైర్లను ఏర్పాటు చేయగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు వారిని పోలింగ్బూత్ల వద్దకు తీసుకువచ్చి ఓటు వేసేందుకు సహకరించారు. పోలింగ్బూత్లను పోలీస్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్లు రాజస్థాన్ ఐజీ ప్రీతిచంద్ర తదితరులు పరిశీలించారు. ఓటుహక్కు వినియోగించుకున్న అభ్యర్థులు శాసనసభా నియోజకవర్గ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. స్థానిక వెటర్నరీ ఆసుపత్రి వద్ద ఉన్న పోలింగ్ బూత్లో సిటింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు, జకీర్హుస్సేన్ స్కూల్ బూత్ వద్ద టీవీకే అభ్యర్థి తోటరాజు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గిడ్డి బలరాం, మెల్లం శ్రీనివాసరావు, నాటి బూరియ్య, తిరుకోటి ఆదిమూర్తి, గొల్లపల్లి లక్ష్మీస్నేహ, మల్లాడి ఉదయలక్ష్మి, సూరిమిల్లి సుబ్బారావు, జనిపల్లి వెంకన్నబాబు, కాళ్ల వెంకటరత్నం, షేక్ అహ్మద్షా ఖాదర్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కురసాంపేట, మెట్టకూరు, వంశీకృష్ణ కాలనీల్లో స్వల్ప వివాదం తలెత్తింది. మల్లాడి, అశోక్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తడంతో పోలీసు బలగాలు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.కనకాలపేట పోలింగ్ బూత్లో బారులు తీరిన ఓటర్లు విజయంపై ఎవరి ధీమా వారిది! అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో అది ఎవరి గెలుపునకు దోహద పడుతుందో అని జనంలో తర్జనభర్జన జరుగుతోంది. పట్టణంలో ఎక్కువ మంది ఓటు వేయడం, కనకాలపేట, తీర గ్రామాలైన సావిత్రినగర్, గిరియాంపేట, అయ్యన్ననగర్ల్లో అధిక ఓటుశాతం నమోదు తదితర పరిణామాల మధ్య అభ్యర్థుల మద్దతుదారులు విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. -
కించపరిస్తే సహించం
మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి రాజోలు: మహిళలను కించపరిస్తే సహించమని రాజోలు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి అన్నారు. మహిళలను అవమానిస్తూ ఏబీఎన్ చానల్లో కథనం ప్రసారం చేసిన ఎండీ రాధాకృష్ణపై ఆమె రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వి.నరేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రాజోలు సర్కిల్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను అవమానించిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరిదేవి మాట్లాడుతూ బాధ్యత గల మీడియాలో ఉంటూ మహిళలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ప్రసారాలు చేయడం దారుణమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ తన చానల్ ద్వారా మహిళాలోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖరరావు, బొలిశెట్టి భగవాన్, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజా, రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గుబ్బల మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గుబ్బల రమేష్ పాల్గొన్నారు. -
మనువాదం అమలుకు పాలకుల కుట్ర
● డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేడ్కర్ ● ఎ.వేమవరప్పాడులో అంబేడ్కర్ శిలా విగ్రహావిష్కరణ అమలాపురం రూరల్: నేటి పాలకులు మనువాదాన్ని అమలు చేసే దిశగా కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు యశ్వంత్ అంబేడ్కర్ ఆరోపించారు. అమలాపురం రూరల్ వేమవరప్పాడులో అంబేడ్కర్ శిలా విగ్రహావిష్కరణ, 135వ జయంతి మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సింహాసనం మీద కూర్చున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పేద ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆయన ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని అందరివాడు అని అన్నారు. మరో నాగపూర్గా పేరుపొందిన కోనసీమ జిల్లాలో వేలాది అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయనపై ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు జంగా బాబురావు, ఇసుక పట్ల రఘుబాబు, ఎంఏకే భీమారావు, కొంకి రాజామణి, పుణ్యమంతుల రజిని, ఈతకోట నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పందిరి విజయ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రోత పలుకుపై ఆగ్రహం
● ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలపై మండిపడిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ● మహిళలను కించపరచడమే ఆ మీడియా నైజమని ధ్వజం ● ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నం ● గడియార స్తంభంలో అడ్డుకున్న పోలీసులు ● అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద నిరసన ● పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్లుసాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్: ‘కొత్త పలుకు పేరుతో.. మహిళల మీద చెత్త పలుకులు’ రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతికి.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ‘భార్యను చెల్లిగా అనుకుని మళ్లీ పెళ్లి చేయాలన్నంతగా దిగజారిన పచ్చ మీడియా.. మహిళలపై దారుణ వ్యాఖ్యలతో వికృత కథనాలపై ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. కొత్త పలుకుల పేరుతో చెత్తరాతలు’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. అడుగడుగునా అడ్డంకులు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. పట్టణ సీఐ వీరబాబు, ఇద్దరు ఎస్ఐలు, ఏఆర్ పార్టీల పోలీసులు మోహరించారు. గడియారస్తంభం సెంటరులో వేసిన టెంట్ను తొలగించడంతో పాటు స్థానిక హైస్కూల్ సెంటరు నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలను అడ్డుకుని వెనక్కు నెట్టివేశారు. ఈ సమయంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. గడియార స్తంభం సెంటర్లో నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు భారీగా మోహరించి పార్టీ శ్రేణులను నిలువరించారు. ఈ సమయంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మహిళా నాయకులు, కార్యకర్తలను కూడా నెట్టివేశారు. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడ్డారు. అంతకుముందు కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్థానిక హైస్కూల్ సెంటర్ వద్ద నిరసనకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళాలోకం సిగ్గుపడుతోంది : చిర్ల జగ్గిరెడ్డి చంద్రబాబుకు తొత్తుగా మారి సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే చెల్లిందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే కాకుండా దేశంలో మహిళలంతా సిగ్గుపడేలా కథనాలు రాస్తున్నారని విమర్శించారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ బ్రోకరిజం చేసి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మహిళలంతా కలిసి రాధాకృష్ణ నాలిక కోసి కారం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జీతాలు ఇవ్వడానికి సొమ్ములు లేవని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రూ.రెండు లక్షలతో రాజధాని ఎలా నిర్మిస్తారని జగన్ ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిని నిర్మించవచ్చని జగన్ సలహా ఇచ్చారు. దీనిని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది స్వాగతిస్తుంటే టీడీపీ, వారి అనుకూల మీడియా చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ మావిగన్ ప్రతిపాదనపై చర్చించాలే తప్ప ఇలా తప్పుడు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. బాధ్యతాయుతమైన మీడియాలో ఉన్నవారు మహిళలను కించపరచడం దారుణమన్నారు. పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ జర్నలిజం ముసుగులో తప్పులు చేస్తే మాత్రం నిరసన తెలుపుతామని, నిలదీస్తామన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మావిగన్ ప్రతిపాదనకు ప్రజా మద్దతు వస్తుండడంతో తట్టుకోలేక రాధాకృష్ణ ఇలా నీచమైన విమర్శలకు దిగారన్నారు. రాజోలు కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గు చేటన్నారు. మీడియా సంస్థల నీచమైన వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి భరత భూషణం, తోరం భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి నాగిరెడ్డి, పాటి శివకుమార్. పట్టణౖ వెఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (నాని), ఎంపీపీ యిళ్ల శేషారావు, మార్గని గంఽగధర్, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్గోపాల్, కొనుకు గౌతమి, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు జిన్నూరి వెంకటేశ్వరరావు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజకుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, కూరపరెడ్డి రాంబాబు, కాశీ రామకృష్ణ, తొరం గౌతమ్ రాజా, మిండగుదుటి శిరీష్, గొల్లపల్లి డేవిడ్ రాజు, చీకట్ల కిశోర్, పెమ్మిరెడ్డి మురళి, సూదా గణపతి, గుబ్బల మనోహర్, జిల్లెళ్ల రమేష్, ఉండ్రు వెంకటేష్ పాల్గొన్నారు. -
కోర్టుల్లో న్యాయమూర్తులను భర్తీ చేయండి
అమలాపురం టౌన్: స్థానిక కోర్టుల్లో ఖాళీగా ఉన్న రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారు. ఈ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ బట్టు దేవానంద్లకు స్థానిక బార్ న్యాయవాదులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని బార్ సభ్యులు తెలిపారు. ఈ నియామాకాలు జరిగితే సత్వర న్యాయ సేవలు అందుతాయని పేర్కొంటూ వారు న్యాయమూర్తులను సత్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరంతోపాటు స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్కుమార్, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రం అంజేసినవారిలో ఉన్నారు. మరో 2 కోర్టులు మంజూరు అమలాపురం టౌన్: అమలాపురానికి మరో రెండు కోర్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు జీఓ విడుదలైంది. అమలాపురానికి 14వ జిల్లా అదనపు కోర్టు, 2వ సివిల్ జూనియర్ జడ్జి కోర్టు మంజూరయ్యాయి. దీనిపై బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. -
ఖతార్ నుంచి క్షేమంగా సన్నవిల్లికి
అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన జగడం విజయలక్ష్మిని కేసీఎం అధి కారుల చొరవతో సురక్షితంగా కోనసీమకు చేర్చారు. గతంలో రెండుసార్లు కువైట్లో పనిచేసిన ఆమె సన్నవిల్లి గ్రామానికి చెందిన మొల్లి సత్యనారాయణ అనే ఏజెంట్ 2025 నవంబర్ 15న ఖతార్ వెళ్లింది. అక్కడ వెంకీ అనే ఏజెంట్ ఒక ఇంట్లో పనికి పెట్టాడు. రెండు నెలలు పనిచేసి జీతం తీసుకుంది. తదుపరి ఆరోగ్యం క్షీణించడంతో కుడి చేయి వాచిపోయి పని చేయలేని స్థితికి చేరుకుంది. ఆ యించి యజమాని వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఏజెంట్తో మాట్లాడగా ఆయన రూ.లక్ష కడితే గాని పంపే ప్రసక్తి లేదని చెప్పగా వెంటనే రూ.లక్ష అప్పు చేసి ఇచ్చింది. నెల రోజులు దాటుతున్నా అతడు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశాల మేరకు ఆ బృందం సంబంధిత ఏజెంట్తో మాట్లాడి విజయలక్ష్మిని సురక్షితంగా తీసుకువచ్చినట్టు కేంద్ర సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తెలిపారు. -
మావిగన్కు రూ.20 వేల కోట్లు చాలు
రాధాకృష్ణ వ్యాఖ్యలు విచారకరం మలికిపురం: మహిళలను కించపరుస్తూ ఏబీఎన్లో కథనాలు ప్రసారం కావడం విచారకరమని దీనికి వేమూరి రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నరాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మావిగున్ కాన్సెప్ట్కు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చిందని ఆయన అన్నారు. దాని నుంచి ప్రజలను మరల్చేలా రాధాకృష్ణ చర్చ నడిపారన్నారు. ప్రస్తుతం కూటమి అమలు చేస్తున్న అమరావతి రాజధానిపై ఆ వర్గాల్లోనే వ్యతిరేకత ఉందన్నారు. -
జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
అమలాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో మండలం ఇందుపల్లి, సాకుర్రు హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో అమలాపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. 53 కేజీల విభాగంలో ఇందుపల్లి విద్యార్థులు సీహెచ్ సత్య గోపాల్, 56 కేజీల విభాగంలో బి.బాలాజీ, సాకుర్రు పాఠశాల నుంచి ఎ.అవినాష్ ప్రతిభ సాధించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు తదితరులు విజేతలను అభినందించారు. కనకదుర్గమ్మ చైత్ర మాసోత్సవాలు ప్రారంభం అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి చైత్రమాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో పండితులు కలశ స్థాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి, ఘనంగా పూజలు చేశారు. రుత్విక్కులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం, రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గరగల సంబరం నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 17న అమావాస్య నాడు జరిగే చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా, కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా అమ్మవారికి బుధవారం చండీహోమం నిర్వహించారు. కనకదుర్గమ్మకు సత్యదేవుని తరఫున సారె అన్నవరం: సత్యదేవుని తోబుట్టువుగా రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారికి చైత్ర మాసోత్సవాల సందర్భంగా స్వామివారి తరఫున సిబ్బంది బుధవారం చీర, సారె సమర్పించారు. ఉదయం 8 గంటలకు సత్యదేవుని ఆలయం నుంచి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాలతో ఊరేగింపుగా సారె తీసుకుని మెట్ల దారిన కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. రేపు గవర్నర్ రాక సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలనను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు ఉదయం 10.45 గంటలకు చేరుకుంటారు. స్వల్ప విరామం అనంతరం, 11 గంటలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, మధ్యాహ్నం 12.05 గంటల వరకూ నిర్వహించే 16, 17వ సంయుక్త స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అతిథి గృహంలో స్వల్ప విరామం అనంతరం, ఒంటిగంటకు హెలికాప్టర్లో తిరిగి విజయవాడ బయలుదేరుతారు. -
రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
మాజీ మంత్రి గొల్లపల్లి కొత్తపేట: మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ గౌరవప్రదమైన జర్నలిజంలో ఉంటూ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారన్నారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారన్నారు. ఇందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే మావిగన్ రాజధానిని వైఎస్ జగన్ ప్రతిపాదించారని, దీనిని అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తన అనుకూల మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తోందన్నారు. తమ పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయించారన్నారు. -
యువతకు స్వయం ఉపాధే లక్ష్యం
అమలాపురం రూరల్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన 19వ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలితో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్వాయర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ పంచాయతీరాజ్ విభాగాల సమన్వ యంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విస్తరాకుల తయారీకి ప్రోత్సాహం పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వక్క అరటి ఆకులతో విస్తరాకుల తయారీ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. సముద్రపు నాచు పెంపకం ప్రాసెసింగ్కు 200 మందిని ఎంపిక చేయాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించారు. నిబద్ధతతో మూల్యాంకనం చేయాలి అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మహేష్కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని మూల్యాంకన కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించి పలు సూచనలిచ్చారు. విద్యార్థి పదేళ్ల కష్టానికి, వారి భవిష్యత్ ఆశయాలకు ఈ మార్కులే పునాది అని చెప్పారు. మార్కులను ట్యాబ్లలో ఎక్కిస్తున్న ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. డీఈవో పి.నాగేశ్వరరావు మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మహేష్ కుమార్ -
యానాంలో నేడు పోలింగ్
యానాం: పుదుచ్చేరి కేంద్ర పాలిన ప్రాంత పరిధిలోని యానాం శాసనసభ నియోజకవర్గానికి గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ నుంచి ఈవీఎంలను, పోలింగ్ సామగ్రిని ప్రత్యేక బస్సులలో రిటర్నింగ్ అధికారి శివరాజ్మీనా పర్యవేక్షణలో ఆయా పోలింగ్ బూత్లకు తరలించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 37,972 మంది కాగా, వీరిలో మహిళలు 19,529 మంది, పురుషులు 18,4443 మంది ఉన్నారు. 2024లో ఓటర్లు 39,355 మంది ఉండగా ఇటీవలి ఎస్ఐఆర్ నిర్వహణలో సుమారు 1,383 మందిని వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 42 ఈవీఎంలు, 42 వీవీ ప్యాట్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని 42 పోలింగ్ స్టేషన్లకు 230 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వీరు కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో 14 మంది పరిశీలకులను నియమించారు. సావిత్రి నగర్, గిరియాంపేటల్లో 6 బూత్లకు ఆరు బృందాలను నియమించారు. ఎన్నికల్లో భద్రతకు 4 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులున్నారు. 13 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచినట్లు రిటర్నింగ్ అధికారి మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్, తమిళగవెట్రి కజగం (టీవీకే) తదితర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 42 కేంద్రాలు, 230 మంది సిబ్బంది నియామకం ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి తరలింపు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు 13 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు -
అడ్డే లేని రెడ్బుక్
● అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉద్రిక్తత ● అనుమతులు లేవని వైఎస్సార్ సీపీ నాయకుడి షెడ్డు కూల్చివేత ● అనుమతులు ఉన్నాయని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ● కార్యకర్తల అరెస్టు – అంబాజీపేట స్టేషన్కు తరలింపు ● పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి అయినవిల్లి/ అంబాజీపేట: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణ తొలగింపు పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైఎస్సార్ సీపీ నాయకుడు నిర్మించుకున్న ఒక పెద్ద షెడ్డును తొలగించేందుకు సిద్ధం కాగా.. అనుమతులు ఉన్నా ఎలా తొలగిస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్కు చెందిన రేకుల షెడ్డును పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కలిసి మంగళవారం తొలగించారు. ఏకంగా నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలు, భారీగా పోలీసు కానిస్టేబుళ్లను మోహరించి హంగామా సృష్టించారు. జేసీబీతో షెడ్డును తొలగించారు. ఇది అన్యాయమని ప్రశ్నించి, అధికారుల చర్యలను తప్పుపట్టి అడ్డుకున్న పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకుని పోయారు. ఈ సమయంలో పోలీస్, రెవెన్యూ అధికారులకు, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షెడ్డు నిర్మించుకున్న స్థలానికి చెందిన రికార్డులు, పంచాయతీ తీర్మానం శ్రీనివాస్ పేరునే ఉన్నాయని అధికారులకు చెప్పారు. వీటిని తొలగించడం అన్యాయమని అడ్డుకున్నారు. షెడ్డు వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ అధికారులు షెడ్డును కూల్చి వేయడంతోపాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు దౌర్జన్యంగా కార్యకర్తలను నెట్టి వేశారు. వారిని అక్కడ నుంచి అంబాజీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది: జగ్గిరెడ్డి నిబంధనలు పాటించకుండా ఎంత మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో డీ నోటిఫై చేయకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నిర్మాణాలను ధ్వంసం చేయడం దారుణమని, దీనిపై న్యాయం కోసం పోరాడుతామనిౖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ అనుమతులు లేకుండా షెడ్లను నిర్మించారని నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపించడం సమంజసం కాదన్నారు. మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటున్నారని, ఆ సంతకం ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారా అని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా, నోటీసులు ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపుతోనే షెడ్డు కూల గొట్టారని జగ్గిరెడ్డి ఆరోపించారు. ప్రజలను సంరక్షించాల్సిన పోలీసులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ కూలీలు నివాసం ఉండే షెడ్లను ధ్వంసం చేయించడం దారుణమన్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో తగిన ప్రతిఫలం చవిచూస్తారని హెచ్చరించారు. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది: గన్నవరపు శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. శ్రీనివాస్ తనకు చెందిన గ్రామ కంఠం భూమిలో షెడ్ల నిర్మించి, సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలకు ఆశ్రయం కల్పించారన్నారు. అయినవిల్లి మండలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని పట్టించుకోకుండా కక్ష పూరితంగా శ్రీనివాస్ కట్టడాలను భూస్థాపితం చేయడం దారుణమన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్ అయినవిల్లి మండలం నేదునూరు కౌశిక పక్కన భూమిని ఆక్రమించుకుని నివాస గృహాన్ని నిర్మిస్తున్నారని, దానిపై ఎందుకు చర్యలు లేవని ఆయన ప్రశ్నించారు. ఎంపీపీలు దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్, జెడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, మందపాటి కిరణ్ కుమార్, వాసంశెట్టి తాతాజీ, కొర్లపాటి కోటబాబు, గొల్లపల్లి డేవిడ్ రాజు, దొమ్మేటి దుర్గారావు, మైలా ఆనందరావు, మట్టపర్తి హరి, తోరం భాస్కరం, దొమ్మేటి వెంకట నరసింహం, చిట్టూరి రాధాభాయ్, చాట్ల రామారావు, కుసుమ వరలక్ష్మి పాల్గొన్నారు, పోలీసు స్టేషన్ ఎదుట జగ్గిరెడ్డి బైఠాయింపు కో ఆర్డినేటర్ శ్రీనివాసరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు అనుసరించిన కక్ష సాధింపు చర్యలు తక్షణమే విడనాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కె.జగన్నాధపురంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగ్గిరెడ్డి పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసులతో చర్చించారు. ఏ నేరం చేశారని పోలీసులు కో ఆర్డినేటర్ను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో జగ్గిరెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్ అయినవారిని విడుదల చేస్తే గాని బయటకు వెళ్లేది లేదని భీష్మించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబు ఆజ్ఞలకు తలవొగ్గి పనిచేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం నశించాలి, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసుల జులుం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలు బయటకు వెళితే అరెస్టు అయిన వారిని విడుదల చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. -
మహిళలను అవమానిస్తూ తప్పుడు కథనాలా
అల్లవరం: మహిళలను కించపరుస్తూ వారిని అవమానిస్తూ ఏబీఎన్లో వచ్చిన తప్పుడు కథనాలు, అసభ్యకర వ్యాఖ్యలను మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సమాజానికి దారి దీపంలా ఉండాలికాని, మహిళల గౌరవాన్ని కించపరచే నీచ రాజకీయాలకు వేదికగా మారకూడదని పేర్కొన్నారు. కక్ష, పక్షపాత ధోరణితో ఈ కథనాల ద్వారా వేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడుకి వత్తాసు పలుకుతూ ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం విలువలను పక్కనపెట్టారని, రాజకీయ ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి దిగజారడం దురదృష్టకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించం రాజోలు: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సహించేది లేదని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి అన్నారు. మంగళవారం ఆమె రాజోలులో మాట్లాడుతూ వార్తా ప్రచురణ, ప్రచారాల్లో కనీస నైతిక విలువలు పాటించకపోవడం బాధాకరమన్నారు. అసత్య వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం తగ్గదన్నారు. తప్పుడు కథనాలతో మహిళల మనోభావాలు దెబ్బతీసిన ఏబీఎన్ యాజమాన్యం రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ముమ్మిడివరం: పత్రికా విలువలను పక్కన పెట్టి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడే స్థాయికి దిగజారిన ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం ముమ్మిడివరంలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్రెడ్డిని కోట్లాది మంది అనుసరిస్తారని, అటువంటి వారి గురించి మాట్లాడే అర్హత రాధాకృష్ణకు లేదని విమర్శించారు. చంద్రబాబు తానా అంటే తందానా అంటున్న ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన విమర్శలను తన కుటుంబ సభ్యులకు కూడా ఆపాదించుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. తమ అధ్యక్షుడిని అగౌరవ పర్చేలా ఎల్లో మీడియా పేరుతో రాష్ట్రంలో విష ప్రచారం జరగుతోందని మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మునికుమారి హెచ్చరించారు. -
ఏబీఎన్ చానల్పై నేడు వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన
అమలాపురం టౌన్: ఇటీవల ఆంధ్రజ్యోతి (ఏబీఎన్) చానల్ వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో బుధవారం ఉదయం 9 గంటలకు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితోపాటు జిల్లా ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గం అల్లవరం: గ్రామ పంచాయతీ గ్రేడు–3 కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఓ 91లో పేర్కొన్న రూ.28,280–89,720 గా ఉన్న వేతన శ్రేణిని రూ. 25,220–80,910 వేతన శ్రేణీగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా సచివాలయ ఉద్యోగులకు తీవ్రా అన్యాయం జరుగుతుందని ఇజ్రాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు. రేషనలైజేషన్ పేరిట సచివాలయ ఉద్యోగులను కుదించి, మిగిలిన వారిని వేర్వేరు శాఖలకు బదలాయించడం, తాజాగా కార్యదర్శులు వేతన శ్రేణీని సవరించడం, ఉద్యోగుల పొట్టకొట్టడమేనని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగించి, రూ. 10 వేలు చేస్తామని ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది వలంటీర్లను తొలగించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయం వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందన్నారు. టెన్త్ స్పాట్ ఎగ్గొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు గైర్హాజరయిన 23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్టు డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డీఈవో నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. మూల్యాంకన ప్రక్రియ విధులకు హాజరు కాని ఉపాధ్యాయులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు డీఈవో నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించామని, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్స్ మొత్తం 23 మంది మూల్యాంకన విధులకు హాజరు కాలేదని డీఈవో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుందన్నారు. నేటి నుంచివైద్య ఉద్యోగుల నిరసనలు అమలాపురం టౌన్: ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైద్య ఉద్యోగులు తమ 29 సమస్యల (డిమాండ్ల) పరిష్కారాన్ని కోరుతూ జిల్లాలో బుధవారం నుంచి దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి పీవీవీ సుబ్బారావు ఈ దశల వారీ నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్కు యూనియన్ నేత సుబ్బారావు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వైద్య ఉద్యోగులు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు, తమ డిమాండ్లపై ఇప్పటికే వినతి పత్రం అందించారు. అమలాపురం, రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200 మంది వైద్య ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధ, గురువారాల్లో (8,9 తేదీల్లో) ఈ రెండు రోజులూ వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులూ ఓ గంట సేపు ఆయా ఆస్పత్రుల వద్ద ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు నూరు శాతం గ్రాస్ జీతం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదిలో 35 రోజుల సెలవులు, కనీస వేతనం రూ.28 వేలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. -
మూడో పంట లేనట్టే!
● అపరాల సాగుకు ఆమడ దూరం ● జిల్లాలో 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ● వరి సాగు జరిగేది 1.77 లక్షల ఎకరాలు ● ఏటా ఐదు శాతం కూడా ఉండని అపరాల సాగు ● ఈ ఏడాది అది కూడా కష్టమే ● ఇప్పటికీ రాయితీపై నోరు మెదపని ప్రభుత్వం ● గతంలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు ● సాగు చేస్తే రైతుకు ఎకరాకు రూ.20 వేలకు పైగా అదనపు ఆదాయం ● కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగుకు అనుకూలం ● ఆదాయంతో పాటు చేను, తోటలకు పచ్చిరొట్ట ఎరువు సాక్షి, అమలాపురం: ఒకనాడు ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టా రాను రానూ వట్టిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాలుగా మూడవ పంట అపరాల సాగు లేకుండా పోతుండగా దశాబ్ద కాలంగా తొలి పంట ఖరీఫ్కు రైతులు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అసలు అపరాల సాగు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సాగుకు సమయం లేకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం నుంచి విత్తన రాయితీపై ఇప్పటి వరకు ఒక ప్రకటన లేకపోవడంతో ఈ ఏడాది అపరాల సాగు దాదాపు లేకుండా పోనుంది. కోనసీమ జిల్లాలో సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో మండపేట నియోజకవర్గాన్ని కలుపుకుని 1.77 లక్షల ఎకరాలలో ఈ ఏడాది రబీ సాగు జరిగిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆత్రేయపురం, మామిడికుదురు మండలాల్లో రబీ వరి కోతలు మొదలయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి జోరందుకునే కోతలు మే రెండవ వారం వరకు జరిగే అవకాశముంది. ముందుగా సాగు చేసిన మండపేట, ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లో నెలాఖరు నాటికి దాదాపుగా కోతలు పూర్తి అవుతాయి. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లలో మాత్రం మే 15 తరువాత కాని కోతలు పూర్తి కావు. కలసిరాని కాలం అపరాల సాగుకు కాలం కలిసి రావడం లేదు. గతంలో మార్చి 31 – ఏప్రిల్ 10 నాటికి రెండో పంట రబీ వరి కోతలు పూర్తి కావడంతో రైతులు మినుము, పెసలు వంటి పంటలు వేసేవారు. దీనివల్ల వీరు అదనపు ఆదాయం పొందేవారు. గోదావరి డెల్టాలో ఎకరాకు మూడు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఇప్పుడు మినుము క్వింటాల్ ధర రూ.12,800 వరకు ఉండగా, పెసలు క్వింటాల్ రూ.13 వేల వరకు ఉంది. ఇదే కృష్ణా జిల్లాలో అయితే ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ రైతులకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. దశాబ్దం క్రితం మొత్తం ఆయకట్టులో కనీసం సగం అపరాలు సాగు చేసేవారు. 2010 – 2015 మధ్య కాలంలో అయితే ఇప్పుడున్న కోనసీమ జిల్లాలో సుమారు 48 వేల ఎకరాల్లో సాగు జరిగేది. రానురానూ ఆయకట్టు కుదించుకుపోతోంది. గత ఏడాది కనీసం ఐదు వేల ఎకరాల్లో కూడా జరగలేదు. ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా లేదు. ఇందుకు సమయం లేకపోవడం ఒక ప్రధాన కారణం. మే నెల వరకు కోతలు పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది ముందస్తు సాగుకు జూన్ 1వ తేదీ నాటికి నీరు విడుదల చేయాల్సి ఉంది. అపరాల పంట కాలం 75 నుంచి 85 రోజులు. దీనివల్ల సాగుకు సమయం సరిపోయే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. సాగు చేస్తే ప్రయోజనాలెన్నో.. అపరాల సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పలు ప్రయోజనాలు కలుగుతాయి. భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. రైజోబియం నోడర్స్ పెరగడం వల్ల తొలకరి పంటలో యూరియా వాడకం గణనీయంగా తగ్గించవచ్చు. చేనుకు పచ్చిరొట్ట ఎరువుతోపాటు పశువుల పెంటను కూడా వినియోగిస్తే భూమికి అమృతాన్ని అందించినట్టు అవుతుంది. – అడ్డాల గోపాలకృష్ణ, కన్వీనర్, రైతు మిత్ర రూరల్ టెక్నాలజీ పార్క్, అమలాపురం కొబ్బరిలో అంతర పంటగా.. రబీ వరి సాగు తరువాతనే కాకుండా కొబ్బరి తోటల్లో రైతులు అంతర పంటగా అపరాలు సాగు చేసేవారు. దీనివల్ల వారు అదనపు ఆదాయం పొందేవారు. కాని కొబ్బరి రైతులు ఇప్పుడు కోకో, పోక వంటి దీర్ఘకాలిక పంటలను, అరటి, కంద, పువ్వులు, కూరగాయల సాగుపై మక్కువతో అపరాల సాగుకు దూరంగా ఉంటున్నారు. ప్రణాళిక ఇవ్వని ప్రభుత్వం ఖరీఫ్ సాగు మోంథా తుపాను బారిన పడడం వల్ల ఆ ప్రభావం రబీపై పడింది. రైతులకు అప్పులు పుట్టక పోవడం కూడా రబీ ఆలస్యానికి కారణమైంది. దీనికితోడు చంద్రబాబు ప్రభుత్వం అపరాల సాగుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. విత్తనాల రాయితీ ప్రకటన చేయలేదు. అపరాలు అటుంచి కనీసం పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించి కూడా ప్రణాళిక విడుదల కాకపోవడం విశేషం. ఇటీవల కాలంలో అపరాల సాగుకు పల్లాకు తెగులు ప్రధాన అవరోధంగా మారింది. అయితే దానిని కూడా రైతులు మందులతో అధిగమిస్తున్నారు. కాని సమయం లేనందు వల్ల గత్యంతరం లేక రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. అయితే ముందుగా కోతలు పూర్తయ్యే మండపేట, ఆలమూరు, కొత్తపేట సబ్ డివిజన్లో రైతులు అపరాల సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతుండడం గమనార్హం. -
భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి
అమలాపురం రూరల్: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి 22 భూములు పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ రీ సర్వే అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ వనన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహనను క్షేత్రస్థాయిలో భూ యాజమాన్యాలకు కల్పించాలన్నారు. భూ పరిపాలనలో పారదర్శకతకు రెవెన్యూ క్లినిక్ల నిర్వహించాలన్నారు. సమన్వయంతో అంబేడ్కర్ జయంతి ● అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. వేగంగా జాతీయ రహదారిపై విద్యుత్ లైన్ల తొలగింపు పాసర్లపూడి – దిండి సెక్షన్లలో జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ ఉన్న నాలుగు ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను త్వరితగతిన తొలగించేందుకు ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులు, జాతీయ రహదారుల ఇంజినీర్లు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఏపీ ట్రానన్స్కో, జాతీయ రహదారుల ఇంజినీర్లు ఆర్డీవోతో నిర్వహించిన సమావేశంలోమాట్లాడారు. కొత్త లైన్ల ఏర్పాటుకు పరిహారం చెల్లింపుల అంశంపై వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో చర్చించి ఈ నెల 10వ తేదీ నాటికి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓటు ఉన్న కార్మికులకు సెలవు ఇవ్వాలి ఈ నెల 9, 23 తేదీల్లో పుదుచ్చేరి, తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఆ ప్రాంత ఓటర్లు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తుంటే ఆయా తేదీల్లో వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని కార్మిక శాఖకు కలెక్టర్ సూచించారు. -
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి
అమలాపురం రూరల్: రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్లాక్స్పాట్లను గుర్తించి స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు కలిసే చోట స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయాలన్నారు. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ విశ్లేషించి, కారణాలు తెలుసుకోవాలని, బ్లాక్స్పాట్లు గుర్తించాలని అన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, ట్రామాకేర్ సెంటర్లలో సౌకర్యాలు, తక్షణ చికిత్స అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లకు మరమ్మతులు, గుంతల పూడ్చివేత, స్ట్రీట్ లైటింగ్, పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్లు, ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి, సర్వీసు రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా, జాతీయ రహదారుల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ బి.రాము, జాతీయ రహదారుల ఏఈ వెంకట రమణ డీసీహెచ్ఎస్ కార్తీక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి దుర్గారావుదొర, డీపీఓ శాంతిలక్ష్మి, అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జలవనరుల పరిరక్షణకు కార్యాచరణ అమలాపురం రూరల్: నీటి సంరక్షణ–జలవనరుల పరిరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, డ్రైనేజీ, డ్వామా, భూగర్భ జల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వంద రోజుల ప్రణాళిక రూపొందించాలని అన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ భక్తులు వెంకట రమణ, ఈఈ వెంకటేశ్వరరావు, డ్రైనేజీ విభాగం ఈఈ ఎన్వీ కిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏవీఎస్ రాజన్, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డీఎల్డీఓలు పాల్గొన్నారు. -
రాజధాని చట్టం పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు
సాక్షి, అమలాపురం: అమరావతి రాజధాని చట్టం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని ధ్వజమెత్తారు. అమలాపురంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ఏడేళ్ల పాలనలో అమరావతిలో ఐదారు భవనాలు నిర్మించి, దానినే రాజధాని అని పిలవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు) గ్రోత్ ఇంజిన్ కారిడార్ ద్వారా రాజధాని, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చుతో, ఇప్పటికే ఉన్న పోర్ట్, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ల అనుసంధానంతో సుమారు 60 లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల అప్పులు చేసి భవిష్యత్తు తరాలపై భారం మోపాల్సిన అవసరముండదని ఆదిత్య తెలిపారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామన్న చంద్రబాబు, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియని చెప్పడం మోసం చేయడమేనని విమర్శించారు. వాస్తవానికి జగన్, వైఎస్సార్ సీపీ అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీకే వ్యతిరేకమని పేర్కొన్నారు. వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం అమలాపురం టౌన్: కోనసీమ వంటి డెల్టా ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల నిర్వహణకు స్థలాల కొరత ఉన్నచోట్ల పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు ప్లాస్మా టెక్నాలజీ శాశ్వత పరిష్కారమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ను ఆయన సోమవారం సందర్శించారు. ప్లాస్మా టెక్నాలజీతో తడి, పొడి చెత్తను వేరుగా ప్రాసెసింగ్ చేసే యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ యూనిట్ నిర్మాణం 15 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అక్కడ తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఈపీడీసీఎల్ ఎస్ఈ బి.రాజేశ్వరిని ఆదేశించారు. ఈ విధానం 95 శాతం వరకూ చెత్త పరిమాణాన్ని తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్, తహసీల్దార్ వీఎస్ దివాకర్, మున్సిపల్ ఏఈ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్లో స్వర్ణం రాయవరం: మండలంలోని నదురుబాద గ్రామానికి చెందిన విత్తనాల ముత్యాలరావు (ముత్తు) రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నాడు. ఈ నెల 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్టీ కళాశాలలో ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరిగాయి. మాస్టర్స్ కేటగిరీ విభాగంలో ఆయన ఈ ఘనత సాధించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న ముత్తు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఏపీఓ జె.సుధారాణి, ఫీల్డ్ అసిస్టెంట్లు అభినందనలు తెలిపారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 34 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 34 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్లు తమ చాంబర్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వివిధ సమస్యలపై వారికి ఫిర్యాదులు అందజేశారు. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీలు ముఖాముఖి చర్చించి వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉండటంతో వారికి కౌన్సెలింగ్ చేసి, సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు. -
పీజీఆర్ఎస్కు 178 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 178 అర్జీలు సమర్పించార. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీఓ మమ్మీ, డీఎల్డీఓ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్జీకి నిర్దిష్ట గడువు లోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి దుర్గారావుదొర, డీసీహెచ్ఎస్ కార్తీక్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజన్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మరణంలోనూ కలిసే పయనం
ఫ అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు ఫ మండపేట వద్ద దంపతుల దుర్మరణం ఫ మృతుల పిల్లలు, తల్లిదండ్రులను కాపాడిన స్థానికులు కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్నైట్ ఫంక్షన్కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్ కారు నడపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్, కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్, తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు. కొడుకు కౌన్సెలింగ్కు బయలుదేరి.. తిరిగి రాని లోకాలకు.. ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కలలు కన్నారు. ఆ తపనతో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గం మధ్యలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఉండమట్ల వీర్రాజు (42) ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్ సమీపాన గాదాలమ్మ నగర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య వీరశైలజ (37), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. కుమారుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అతడిని హైదరాబాద్లో ఇంటర్మీడియెట్లో జాయిన్ చేయాలని తల్లిదండ్రులు భావించారు. తద్వారా మంచి భవిష్యత్తును అందించాలని తపన పడ్డారు. కళాశాలలో సీటు కౌన్సెలింగ్ కోసం, బంధువులను కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున కుమారుడితో కలిసి వీర్రాజు, వీరశైలజ దంపతులు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్లలో సాగర్ కాలువ బ్రిడ్జి పైన వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోయింది. ఆ లారీ కిందకు కారు దూసుకుపోయింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జికి అడ్డంగా తిరిగింది. అదే సమయంలో వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య వీర శైలజ తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కు పోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో ఆ వాహనాలను విడదీసి వీర్రాజును, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా వీర్రాజు మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే వీర్రాజు దంపతులు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ధవళేశ్వరం పంచాయతీ ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీర్రాజు మృతి పట్ల పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు, సిబ్బంది సంతాపం తెలిపారు. వీర్రాజు గతంలో మండపేట మండలం ఏడిద పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. అంగరలో విషాద ఛాయలు వీర్రాజు దంపతుల మరణ వార్త ఆయన స్వగ్రామం అంగరలో విషాదం నింపింది. వీర్రాజు తండ్రి ఉండమట్ల వెంకటేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ సెంటర్లో చాలా కాలం పాటు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. ఆయనకు వీర్రాజు పెద్ద కుమారుడు. చదువుకునే రోజుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తిగా వీర్రాజు అంగర గ్రామస్తులకు చిరపరిచితుడు. పదో తరగతి వరకూ అంగర ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్మీడియెట్ మండపేటలోని ప్రైవేటు కళాశాలలోను చదివారు. జూనియర్ అసిస్టెంట్గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, కోరుమిల్లి, అంగర, నిడసనమెట్ట, వెదురుమూడి, ఏడిద గ్రామాల్లో పని చేశారు. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ తరచూ అంగర వచ్చి వెళ్లేవారు. వీర్రాజు మృతి పట్ల ఆయన స్నేహితుడు, గ్రామ మాజీ సర్పంచ్ బట్టా షణ్ముఖ శ్రీనివాస్, స్నేహితులు ఎం.సత్యనారాయణ, ఎస్.అప్పారావు, ఎ.రవికిరణ్, బడుగు కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు. కళ్ల ముందే జలసమాధి తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీర్ణించుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్, కిరణ్మయి దంపతుల పలకరింపులు ఇంకా మరచిపోక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. దంపతుల మృతితో గ్రామస్తులు సైతం తల్లడిల్లారు. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. -
మండుటెండ నుంచి ఉపశమనం
సాక్షి, అమలాపురం: మండుటెండ నుంచి ఉపశమనం కలిగించేలా జిల్లాలో సోమవారం పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో గంటపాటు ఏకధాటిగా వర్షం పడింది. అంతకు ముందు దట్టమైన మేఘాలు కమ్ముకుని చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. వారం రోజులుగా భానుడి తీక్షణతతో అల్లాడుతున్న సామాన్యులు మారిన వాతావరణంతో సేద తీరారు. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. అమలాపురం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. ఈదరపల్లి వంతెన సమీపాన రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద రెండడుగుల ఎత్తున నీరు చేరడంతో వాహన చోదకులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. అమలాపురం – బొబ్బర్లంక రోడ్డులో బండారులంక, కె.పెదపూడి, పుల్లేటికుర్రు వద్ద పలుచోట్ల రోడ్ల మీద నీరు చేరింది. ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నీట మునగడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వల్ల వరితో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటలకు మేలు జరిగింది. ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో వరి కోతలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే రబీ వరి కోతలు మొదలైన విషయం తెలిసిందే. శివారు చేలకు మాత్రం ఈ వర్షం చేసిన మేలు అంతా ఇంతా కాదు. అలాగే, పైరును ఆశించిన దోమపోటు ఉధృతి కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఉద్యాన పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి దీర్ఘకాలిక పంటలతో పాటు కూరగాయ పంటలకు సైతం ఈ వర్షం మేలు చేసింది. తోటల్లో నీరు నిలబడే స్థాయిలో వర్షం కురిసిందని, ఇది వేసవి దుక్కులకు మంచిదని రైతులు చెబుతున్నారు. ఫ జిల్లాలో పలుచోట్ల వర్షం ఫ నిలిచిన వరి కోతలు ఫ ఉద్యాన పంటలకు ఊరట -
ఇంటింతై.. వ్యయమింతై..
ఆలమూరు: పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా గృహ రుణం మంజూరు చేయలేదు. అర్హులైన ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా కేటాయించలేదు. ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వకపోయినా ఉన్నంతలోనే ఇల్లు కట్టుకుందామనుకుని ఆశ పడుతున్న సామాన్యులకు పశ్చిమాసియా యుద్ధం పిడుగుపాటుగా మారింది. ఈ యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం వారి ముందర కాళ్లకు బంధం వేస్తోంది. సిమెంటు, ఐరన్ వంటి వాటి ధరలు నెల రోజుల్లోనే 10 నుంచి 30 శాతం వరకూ పెరిగిపోవడంతో గృహనిర్మాణం లబ్ధిదారులకు పెనుభారంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం పేరుతో.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చమురు, వంట గ్యాస్ వంటి వాటి దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైనే కాదు.. గృహ నిర్మాణంపై కూడా ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రభావం నిజంగా ఏ మేరకు ఉందో తెలియదు కానీ.. దీనిని సాకుగా చూపించి గృహ నిర్మాణాల్లో వినియోగించే సిమెంటు, ఐరన్ ధరలను ఆయా కంపెనీలు పెంచేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగించే ముడి సరకు లభ్యత తగ్గిందని కొందరు చెబుతున్నారు. అయితే, కొంత మంది వ్యాపారులు సిండికేట్ అయ్యి, కృత్రిమ కొరత సృష్టిస్తూండటం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే ఇనుము ధర నెల రోజుల క్రితం టన్నుకు రూ.53 వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఏకంగా రూ.78 వేలకు చేరింది. అలాగే, సిమెంటు బస్తా ధర రూ.275 నుంచి రూ.335కు పెరిగింది. మూడు యూనిట్ల మెటల్ ధర గతంలో రూ.12 వేలు ఉండగా ఇప్పుడది రూ.18 వేలకు చేరింది. ఒక్కో ఇటుక ధర నాణ్యతను బట్టి రూ.5 ఉండగా ఇప్పుడు రూ.9 పలుకుతోంది. ఇసుక ధరలైతే చెప్పనవసరమే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రకటిస్తోందే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ప్రజలకు రూ.వేలు వదిలిపోతున్నాయి. దూరాన్నిబట్టి ఇసుక వ్యయం మరింత పెరుగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం మరింత భారమై, సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. కార్మికుల ఆందోళన గృహ నిర్మాణ రంగం కుదేలవడంతో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. తాపీ మేస్త్రులు, జట్టు కూలీలు, సాధారణ కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సీలింగ్ చేసేవారు, పెయింటర్లు ఇలా ప్రతి ఒక్కరూ రోజువారీ పనులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వీరి సంఖ్య సుమారు 25 వేల వరకూ ఉందని అంచనా. వీరితో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు కూడా పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖర్చు పెరిగిపోతోంది గృహ నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతూండటంతో నిర్మాణాలు కష్టసాధ్యంగా ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి మొదట్లో అనుకున్న బడ్జెట్కు, ప్రస్తుతం అవుతున్న ఖర్చుకు పొంతన లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. – దాడిశెట్టి అప్పారావు, తాపీ మేసీ్త్ర, ఆత్రేయపురం గృహరుణాలు మంజూరు చేయాలి గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న మాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలి. సిమెంటును రాయితీపై సామాన్యులకు అందించాలి. – తమ్మన శ్రీనివాస్, మాజీ సర్పంచ్, చెముడులంక, ఆలమూరు మండలం ధరల పెరుగుదల ఇలా (రూ.లలో) సామగ్రి నెల క్రితం ప్రస్తుతం ఇనుము 53,000.00 78,000.00 (టన్ను) సిమెంటు బస్తా 275.00 345.00 మెటల్ 12,000.00 18,000.00 (3 యూనిట్లు) ఇటుక (1) 5.00 9.00 ఫ 30 శాతం పెరిగిన సామగ్రి ధరలు ఫ పశ్చిమాసియాలో యుద్ధం సాకుతో వ్యాపారుల సిండికేటు ఫ సిమెంటు బస్తాపై రూ.50 పెరుగుదల ఫ ఐరన్ టన్నుకు రూ.20 వేల వరకూ పెంపు ఫ ఎక్కడికక్కడే నిలిచిన పనులు ఫ జిల్లాలో 25 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు అదే బాటలో ఇతర సామగ్రి మరోవైపు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గుజరాత్ నుంచి జిల్లాకు సరఫరా కావలసిన టైల్స్ సక్రమంగా రావడం లేదు. అలాగే, ఇటీవల గుమ్మాలకు, ఫ్లోరింగ్కు వుడ్కు బదులు ఉపయోగిస్తున్న గ్రానైట్, సీలింగ్కు ఉపయోగించే జిప్సమ్ షీట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. జింక్ సరఫరా లోపం ప్లాస్టిక్ పైపుల తయారీపై తీవ్రంగా పడటంతో ప్రతి పైపునకు చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.40 వరకూ వ్యాపారులు పెంచేశారు. ఇంటీరియర్, పెయింట్స్, శానిటరీవేర్, ప్లంబింగ్, కరెంట్ సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే అదనుగా ఇప్పటికే నిల్వ ఉన్న సామగ్రి ధరలను సైతం స్థానిక వ్యాపారులు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో కొంతమంది నిర్మాణదారులు అప్పులు చేసి పనులు కొనసాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ఇటువంటి సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం గృహ రుణాన్ని రూ.5 లక్షల వరకూ పెంచి అర్హులకు మంజూరు చేస్తే కాస్తయినా ఉపశమనంగా ఉంటుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. 04ఆర్వీపీ26:04ఆర్వీపీ27: -
గణపయ్య సన్నిధిలో భక్తుల సందడి
అయినవిల్లి: సమస్త విఘ్నాలనూ తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యాన గణపయ్యకు మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, లఘున్యాస పూర్వక ఏకాదశ పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. మహానివేదన చేశారు. స్వామివారికి విశేష సేవల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్లో 114 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 85 మంది పాల్గొన్నారు. గరిక పూజలో ఐదు జంటలు పాల్గొన్నాయి. ఐదుగురు భక్తులు ఉండాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఎనిమిది మంది చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 42 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 2,420 మంది స్వీకరించారు. వివిధ పూజా టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా స్వామివారికి రూ.4,26,660 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లక్ష పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): తక్షణమే జాబ్ క్యాలెండర్ను సవరించి, కనీసం లక్ష పోస్టులతో విడుదల చేయాలని డీవైఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ వి.రాంబాబు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమను గెలిపిస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామంటూ గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి, ఉగాది పండగ చేసుకోమని చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జాబ్ క్యాలెండర్లో 713 టీచర్ పోస్టులనే చూపించారని, రాష్ట్ర క్యాబినెట్ మాత్రం 2,260 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామంటూ జీఓ నంబర్ 13 విడుదల చేశారని అన్నారు. దీంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఏటా డీఎస్సీ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారని, ఫిబ్రవరి, మార్చి అని ఇప్పుడేమో ఏకంగా అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంటున్నారని రాంబాబు విమర్శించారు. జూన్లో రిటైరయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పోస్టులు పెంచాలని, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. పద్ధెనిమిదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, దీని కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్లో 100 లైబ్రేరియన్ పోస్టులు మాత్రమే చూపారని, వీటిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులే 10,762 ఉన్నాయంటూ శాసనసభలో హోం మంత్రి ప్రకటించారని, జాబ్ క్యాలెండర్లో మాత్రం 1,970 పోస్టులే చూపడం అన్యాయమని ఆయన విమర్శించారు. గ్రూప్–1, 2 ఉద్యోగాలు 5 వేలకు పైగా ఖాళీలుండగా జాబ్ క్యాలెండర్లో 841 మాత్రమే చూపారన్నారు. యూనివర్సిటీల్లో 4 వేలకు పైగా ఖాళీలున్నట్టు విద్యా శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారని, జాబ్ క్యాలెండర్లో మాత్రం 1,500 పోస్టులే చూపడం దారుణమని అన్నారు. అన్ని రకాల గ్రూప్స్ పరీక్షలకు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, డీఎస్సీకి 49, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కనీసం లక్ష పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్తో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నామని, యువత, నిరుద్యోగులు దీనిని విజయవంతం చేయాలని రాంబాబు కోరారు. కోటసత్తెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దేవస్థానం ఆధ్వర్యాన 50 లీటర్ల పెరుగుతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకంతో రూ.1,40,454 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తలుపులమ్మ పుట్టింటి సంబరాలు ఆరంభం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. లోవ దేవస్థానంలో గరగలను శిరస్సుపై అధిష్టించి వార్షిక జాతరను ఈఓ పి.విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ప్రధానార్చకులు సంప్రదాయ నృత్యాలతో ప్రారంభించారు. గత సంవత్సరం లోవ కొత్తూరులో భద్రపరచిన అమ్మవారి గరగలను కళాకారులు, గ్రామస్తులు ఆదివారం లోవ దేవస్థానానికి తీసుకువెళ్లి పుట్టధార నుంచి జాలువారే పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అమ్మవారి ప్రధాన గర్భాలయంలో ఉంచి ప్రధానార్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలతో గరగలను అలంకరించి ఈఓ, మాజీ చైర్మన్ శిరస్సులపై ఉంచుకుని నృత్యాలు చేశారు. అనంతరం, మేళతాళాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తలుపులమ్మ అమ్మవారి గరగలను ఊరేగింపుగా లోవకొత్తూరు గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాన్పుపై ఆ గరగలను ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ విశ్వనాథరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గంధామావాస్య సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి లోవకొత్తూరులో పుట్టింట 13 రోజులు జాతరోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. 16న జాగరణోత్సవం, 17న తీర్థం, అమ్మవారి ఊరేగింపు, భక్తులు అమ్మవారి దర్శనాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జాతరోత్సవాలను పురస్కరించుకుని 16, 17 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. -
స్విమ్ముతున్న విషాదం
పోలీసు గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు సంవత్సరం కేసులు మృతులు 2021 54 59 2022 63 67 2023 71 78 2024 78 80 2025 39 53 2026 37 (ఇప్పటి వరకూ) మొత్తం 308 345 ప్రవహిస్తున్న నదిని చూస్తే మనస్సు ఇనుమడించిన ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతుంది. ఉవ్వెత్తున అలలు ఎగసిపడే అపార జలనిధిని చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది. మండే ఎండాకాలంలో.. పాఠశాలలకు సెలవులు వచ్చిన వేళ.. ఆ ఝరిలో కేరింతలు కొడుతూ జలకాలాడాలనే ఉత్సాహం పొంగి పొరలుతుంది. అయితే, తెలియని నదీ తావుల్లో సరదాగా ఈతకు దిగే వేళ లోపిస్తున్న అప్రమత్తత.. పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. రావులపాలెం వద్ద గౌతమీ గోదావరిలో గల్లంతైన వారి కోసం పడవలపై గాలింపు (ఫైల్) ఆలమూరు: వేసవి ఎండల తీవ్రత నానాటికీ అధికమవుతోంది. మరోవైపు పరీక్షా కాలం కూడా ముగిసింది. దీంతో, విద్యార్థులు, యువతలో ఆటవిడుపు మొదలైంది. పర్యాటకుల్లో సందడి షురూ అయ్యింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 289 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి పాయల్లో పలు ప్రదేశాలు ఆహ్లాదకరంగా కనువిందు చేస్తూంటాయి. గోదావరి, సాగర తీరాలతో పాటు మన్యసీమ అందాలు సైతం పర్యాటకులను కట్టి పడేస్తూంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని కన్నులారా వీక్షించేందుకు.. ఆ ప్రదేశాల్లో సేద తీరేందుకు అనేక మందిలో ఉత్సాహం ఉరకలేస్తోంది. గోదావరి పరిసర ప్రాంత వాసులే కాకుండా స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు సైతం ఉల్లాసభరిత వాతావరణంలో గడిపేందుకు తహతహలాడుతూంటారు. ముఖ్యంగా సాగర తీరంలోను, నదులు, సెలయేళ్లలో స్నానాలు చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఈత సరదా సంగతి ఎలా ఉన్నా.. తెలియని చోట్ల స్నానాలకు, ఈతకు దిగే సమయంలో ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా.. ఎక్కడ లోతు ఉందో, ఎక్కడ ఊబి ఉందో తెలియక.. మృత్యుఘాతానికి బలయ్యే పరిస్థితులు పొంచి ఉంటాయి. ఏటా గోదావరి, సముద్ర తీరాల్లో లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినవారి గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. మరోవైపు కొంత మంది ఆచూకీ సైతం లభ్యం కాక ఇప్పటికీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ చర్యలు.. తీసుకుంటే మేలు ఫ గోదావరి నదీ తీరాల్లో ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, ఇరిగేషన్ హెడ్వర్క్స్, పోలీసు శాఖలు ప్రత్యేకంగా పటిష్ట చర్యలు చేపట్టాలి. పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఫ వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఫ నదీ తీరంలోని అన్ని ప్రమాదకరమైన రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసేలా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫ గోదావరి నదీ పరీవాహక గ్రామాల్లో అనుమతి లేని ప్రదేశాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో ఈత, స్నానాల వలన కలిగే అనర్థాలను వివరించే ప్రయత్నం చేయాలి. ఫ అలాగే, స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించాలి. ముఖ్యంగా లైఫ్ జాకెట్లు ధరించడం మేలు. ఫ అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన అధికారుల ఫోన్ నంబర్లను ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించాలి. అక్కడ స్నానాలు వద్దు గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవ్వరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసు పహరా ఏర్పాటు చేస్తున్నాం. – సుంకర మురళీ మోహన్, డీఎస్పీ, కొత్తపేట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా గత 11 ఏళ్లలో జరిగిన కొన్ని ముఖ్య ప్రమాదాలు, మృతుల వివరాలు తేదీ ప్రమాద ప్రదేశం మృతులు 2015 మార్చి 3 మూలస్థాన అగ్రహారం 3 2015 మే 3 జొన్నాడ 2 2015 మే 3 మూలస్థాన అగ్రహారం 2 2018 జూలై 24 శేరిలంక (పడవ ప్రమాదం) 4 2019 ఏప్రిల్ 19 బడుగువానిలంక 2 2020 జూన్ 2 బడుగువానిలంక 2 2022 మార్చి 20 బడుగువానిలంక 2 2023 ఏప్రిల్ 14 కూళ్ల 3 2023 మే 25 మద్దూరులంక 2 2023 జూన్ 27 వద్దిపర్రులంక 2 2024 మే 12 వాడపల్లిలంక 3 2024 మే 18 రావులపాలెం 3 2025 మార్చి 24 తాడిపూడి 5 2025 మార్చి 27 రాజమహేంద్రవరం 2 2025 ఏప్రిల్ 12 ఏలేరు కాలువ 4 2025 ఏప్రిల్ 15 కూళ్ల 3 2025 మే 26 సలాదివారిపాలెం 8 2026 పిచ్చుకలంక 3 ఫ కన్నీళ్లు మిగుల్చుతున్న ఈత సరదా ఫ ఈ ఏడాది మూడు ప్రమాదాలు.. ఏడుగురి మృతి ఫ గత ఐదేళ్లలో 308 ప్రమాదాలు ఫ 345 మంది మృత్యువాత ఫ తెలియని తావుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష ప్రమాదకర తావులివిగో.. ఫ ఉమ్మడి జిల్లాలో ప్రమాదకరమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఫ కోనసీమ జిల్లాలో గోదావరి తీరాన ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, కె.గంగవరం మండలం శేరిలంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెంతో పాటు అంతర్వేది, ఓడలరేవు సాగర తీరాలు అత్యంత ప్రమాదకరమైనవని గత సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 4న పిచ్చుకలంకలో జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన యువకులు మృత్యువాత పడ్డారు. ఫ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులంక, సీతంపేట, విజ్జేశ్వరం లాకులు. ఫ కాకినాడ జిల్లాలో ఏలేరు నదితో పాటు కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉప్పాడ వద్ద తరచుగా రాకాసి అలలు విరుచుకుపడుతూంటాయి. ఫ పోలవరం జిల్లా మన్యసీమలో పింజరికొండ, పాములేరు అత్యంత ప్రమాదకరంగా పేరొందాయి. ఫ ఈ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుని, ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో 308 ప్రమాదాలు జరుగగా 345 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి రికార్డుల్లోకి ఎక్కినవి. అలా అధికారిక లెక్కల్లోకి రాకుండా ఉన్న మృతుల సంఖ్య మరింత అధికంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు ఆయా ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం లేదు. -
పుష్కరాలకు తీరంలో పటిష్ట నిఘా
ఫ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫ నేరాల అదుపుపై సమీక్ష అమలాపురం టౌన్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలోని సముద్ర తీరం వెంబడి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. పుష్కరాల సమయంలో తీరంలో నిత్యం బోట్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసు సిబ్బంది పరంగా ఉన్న కొరతను పుష్కరాల సమయానికి పూర్తిగా అధిగమిస్తామని చెప్పారు. రానున్న మూడు నెలల్లో శాఖా పరంగా పూర్తి స్థాయి మార్పు చూస్తారన్నారు, అంతకు ముందు నేరాల అదుపు, పుష్కరాల ఏర్పాట్లపై ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్షించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీకే అశోక్ కుమార్, శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ తదితరులతో ఈ సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో పోలీసు బందోబస్తు ఎలా ఉండాలి.. ఎంత మంది పోలీసు సిబ్బంది ఉండాలి.. జిల్లాలోని పుష్కర ఘాట్ల పరంగా బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. ఆర్టీసీ బస్సు ఏర్పాట్లపై చర్చించారు. పుష్కరాలకు ఎంత మంది పోలీసు సిబ్బందిని కొత్తగా రిక్రూట్ చేయాలనే అంశం అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నేరాల అదుపునకు చేపట్టిన చర్యలను ఎస్పీ రాహుల్ మీనా డీజీపీకి వివరించారు. సమీక్షలో అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో డీజీపీ గుప్తా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ నిర్వహించిన పలు వినూత్న కార్యక్రమాల ఫొటోలతో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించి, అభినందించారు. ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
సమానత్వ సాధనకు జగ్జీవన్రామ్ కృషి
రావులపాలెం: దేశానికి, సమాజంలో సమానత్వ సాధనకు, దళిత హక్కుల పరిరక్షణకు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ చేసిన కృషి అపారమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెలే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆ మహనీయుని ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు. రావులపాలెంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా జగ్జీవన్రామ్ గుర్తుండిపోతారని అన్నారు. కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని, వ్యవసాయ రంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఎంతో మేలు చేశాయని వివరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్న కుమార్, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొక్కా కరుణాకరం, ఎస్సీ సెల్ సీనీయర్ నాయకులు కప్పల శ్రీధర్, కోనాల రాజు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకం.. జగ్జీవన్రామ్ జీవితం అమలాపురం రూరల్: సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో జన్మించి ఉప ప్రధాని స్థాయికి జగ్జీవన్రామ్ ఎదిగారన్నారు. భారత్ – పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన నాయకత్వంలో మన సైన్యం చరిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్, పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో డీటీఓ రామనాథం, డీవీఎంసీ సభ్యులు హాస్టల్ విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఫ రావులపాలెంలో ఘనంగా జయంతి వేడుకలు -
ముగిసిన జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులలో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఏపీ లాన్ టెన్నిస్ సంఘ కార్యదర్శి పీవీ రామకుమార్ ఆధ్వర్యాన అండర్–12, 14, 16, బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్కుమార్ ముఖ్య అతిఽథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గౌరవ అతిథిగా డాక్టర్ గిరి పాల్గొన్నారు. విజేతల వివరాలు అండర్–12 బాలుర విభాగంలో అరవింద్ విజేతగా నిలువగా, బాలికల విభాగంలో బ్రాహ్మిణి, అద్విత్య మొదటి రెండు స్థానాలు అందుకున్నారు. అండర్–14 బాలుర విభాగంలో ప్రతీక్, తనిష్లు, బాలికల విభాగంలో బ్రాహ్మిణి, విందా, అండర్–16 బాలుర విబాగంలో ప్రతీక్, నిఖిలేష్, బాలికల విభాగంలో మానివి, ఆశ్రయ మొదటి రెండు స్థానాలు గెలుపొందారు. -
జేసీగా నిషాంతి సేవలు ప్రశంసనీయం
అమలాపురం రూరల్: జిల్లా జాయింట్ కలెక్టర్గా టి.నిషాంతి అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కొనియాడారు. ఆమె పదోన్నతిపై అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్గా వెళుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం శనివారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె చూపిన చొరవను అధికారులు అభినందించారు. నిషాంతి మాట్లాడుతూ అందరి సహకారంతో సమర్థవంతంగా పనిచేయగలిగానన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్, తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఆర్డీవోలు జి.మమ్మీ, భాగ్యవతి, డీఎస్ఓ ఉదయభాస్కర్ ఆర్టీవో డి. శ్రీనివాసరావు, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. పకడ్బందీగా ధాన్యం సేకరణ అమలాపురం రూరల్: రబీ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై సహకార, రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,29,913 ఎకరాలలో వరిని సాగు చేయగా, సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి 194 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మట్టి అక్రమ తవ్వకాల పరిశీలన పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడిలంకలో ఇటీవల పెద్ద ఎత్తున జరిగిన మట్టి అక్రమ తవ్వకాలను మైన్స్, విజిలెన్స్ అధికారులు శనివారం పరిశీలించారు. లంకలో మట్టిని తీసేందుకు ఎన్ని ఎకరాలకు అధికారులు అనుమతి ఇచ్చారు, ఏఏ ప్రాంతాల్లో ఎంత మేర మట్టిని తీశారు, ఎంత లోతున అక్రమంగా తవ్వకాలు జరిపారో వివరాలు నమోదు చేసుకున్నారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు విజిలెన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ కె.వెంకటరమణ, మైన్స్ ఆర్ఐ కె.శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో కె.నరసింహారావు పాల్గొన్నారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. సుప్రభాత సేవలు, తొలి హారతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలి హారతి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, ముడుపులు, మొక్కుబడులు, తల నీలాలు సమర్పించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,74,671 ఆదాయం వచ్చింది. 5,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రెండు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,06,724 విరాళం అందించారని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నూకాంబిక హుండీ ఆదాయం రూ.26.38 లక్షలు ఆలమూరు: చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల ద్వారా రూ.26.38 లక్షల ఆదాయం లభించింది. దేవదాయశాఖ తనిఖీ ఇన్స్పెక్టర్ ఆర్.బాలాజీ రామ్ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ వీరి అప్పారావు, కార్యనిర్వాహణాధికారి వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో శనివారం వీటిని లెక్కించారు. గత నెల 10 నుంచి ఈ నెల నాలుగు వరకూ (25 రోజులు) ఈ ఆదాయం వచ్చిందని ఈఓ వీర్రాజు తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై పాలకులను నిలదీద్దాం
కొత్తపేట/రావులపాలెం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పాలకులను నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ల మాజీ ప్రతినిధులను శనివారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రావులపాలెం సీఆర్సీ ఫంక్షన్ హాల్లో జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, నరసాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభినందనలు జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా, లొంగకుండా వైఎస్సార్ సీపీ కోసం, ప్రజల పక్షాన నిలబడిన స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల్లో అత్యధిక శాతం వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న అక్కసుతోనే అధికార పార్టీ, ప్రభుత్వం ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు ఉన్న అధికారాలను తొక్కిపెట్టి, ప్రజాప్రతినిధుల హక్కులను హరించేలా పాలకులు వ్యవహరించారన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇదే ఐకమత్యంతో కలిసి రావాలని పార్టీ శ్రేణులకుపిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పనిచేయాలి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పదవీ కాలం పూర్తయ్యిందని విశ్రమించకుండా, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ ప్రతినిధులుగా ప్రజల పక్షాన పని చేయాలని సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అందుకు అన్నగా, తమ్ముడిగా జగ్గిరెడ్డి నిలబడటమే కారణమని అన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగించిందని, గతంలో ఎవరూ అమలు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, కుండ అన్నపూర్ణ, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బొణం సాయిబాబు, తోరాటి సీతామహాలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చిలువూరి రామకృష్ణంరాజు, సాకా ప్రసన్న కుమార్, బొక్కా వెంకటలక్ష్మి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాకా మణికుమారి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, కనుమూరి శ్రీనివాసరాజు, బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, జిల్లా యూత్ కార్యదర్శి గూడపాటి ప్రవీణ్ కుమార్, యాక్టివిటీ కార్యదర్శి గొలకోటి సూర్యప్రకాష్, జిల్లా పార్టీ యాక్టివిటీ మెంబరు షేక్ వల్లీబాబా, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పెదపూడి బాపిరాజు, జిల్లా పార్టీ కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రభాకరరావు పాల్గొన్నారు.ఫ పంచాయతీ మాజీ ప్రతినిధులకు జగ్గిరెడ్డి పిలుపు ఫ పదవీ కాలం పూర్తయిన సర్పంచ్లకు సత్కారం -
గోదావరిలో యువకుడి మృతి.. మరో ఇద్దరి గల్లంతు
కోనసీమ: ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండాకాలం కావడంతో గోదావరి నది నీళ్లలోకి దిగి స్నానం చేద్దామని వెళ్లారు ముగ్గురు యువకులు. అయితే, అందులోకి దిగిన వెంటనే ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యువకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు ముగ్గురు రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆ ముగ్గురు యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమైందని తెలిపారు. మిలిగిన ఇద్దరి కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొసాగుతున్నాయని అన్నారు. -
అమరావతి యుద్ధంలో జగన్పై చంద్రబాబు గెలవలేరు
అమలాపురం టౌన్: అమరావతి పేరుతో జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి ఎన్నటికీ ఉండదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై యుద్ధంలో ఎలా గెలవలేరో జగన్ మీద చంద్రబాబు కూడా గెలవలేరని చెప్పారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో సూర్యనారాయణరావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతికి శాశ్వత రాజధానిగా గుర్తింపు తీసుకురావడం, అరచేతిలో స్వర్గాన్ని చూపించినట్లుగా చెబుతున్న కలల రాజధాని అమరావతికి లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా చేయడం కాదని.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అమరావతిలో ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయిందని అన్నారు. గతంలో అమరావతి రాజధాని పేరిట రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించి, వారికి త్రీ బెడ్ రూమ్ ఇళ్ల ప్లాట్లు, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అదిస్తామంటూ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేరలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయలేని చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ప్రపంచం మెచ్చే రీతిలో అమరావతిని ఏవిధంగా, ఎప్పటికి రాజధానిగా నిర్మిస్తారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్లోనే ఉండే అవకాశం ఉన్నప్పటికీ వెనువెంటనే అమరావతికి తరలిరావడం, ఆ సమయంలో రైతుల నుంచి పథకం ప్రకారం వేలాది ఎకరాలు సేకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలను అప్పటి, నేటి కేంద్ర ప్రభుత్వాల పెద్దలు ఎందుకు నెరవేర్చడం లేదని, దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని సూర్యనారాయణరావు ప్రశ్నించారు. ఫ రాజధానికి గుర్తింపు కాదు.. ప్రత్యేక హోదా తీసుకురండి ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు -
స్పాట్ పెట్టేస్తారిక..
రాయవరం: గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 391 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో రెగ్యులర్, ప్రైవేటుగా మొత్తం 72,797 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, సగటున 99.48 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2022 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లా కేంద్రం కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేది. 2023 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. కాకినాడలో సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, కోనసీమ జిల్లాలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని బీవీఎం హైస్కూల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. జిల్లాలకు చేరిన జవాబు పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5,43,694 జవాబు పత్రాలకు ఉమ్మడి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 1,85,811, తూర్పు గోదావరి జిల్లాలో 1,76,106, కోనసీమ జిల్లాలో 1,81,777 చొప్పున జవాబు పత్రాలున్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు దాదాపు చేరుకున్నాయి. ఆయా జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు క్యాంప్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు పాల్గోనున్నారు. సబ్జెక్టుల వారీగా.. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, సంస్కృతం, ఒకేషనల్ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు నేరుగా ఉత్తర్వులు అందజేశారు. ఆరు సబ్జెక్టులు, ఒకేషనల్ పరీక్షలు కలిపి మొత్తం పది రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుంది. ఇవీ నిబంధనలు ఫ మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్ఫోన్, స్మార్ట్ఫోన్లు, వైట్నర్, ఎరేజర్ తదితర వస్తువులను తీసుకుని వెళ్లరాదు. ఫ మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫ శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. స్పాట్కు జిల్లాల వారీగా నియామకాలు ఇలా..కేటగిరీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు 1 1 1 స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జి 1 1 1 అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు 8 7 8 ఏఏసీఓలు 8 7 8 చీఫ్ ఎగ్జామినర్లు 100 79 79 అసిస్టెంట్ ఎగ్జామినర్లు 453 476 483 స్పెషల్ అసిస్టెంట్లు 267 237 242 ఫ 6 నుంచి 15 వరకూ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ ఫ ఉమ్మడి జిల్లాలో 5.44 లక్షల జవాబు పత్రాలు ఫ ఇప్పటికే లీప్ యాప్లో ఉత్తర్వులు ఫ ఏఈలు, సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లకు నేడు శిక్షణ పొరపాట్లకు తావు లేకుండా.. స్పాట్ వాల్యుయేషన్ విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. మూల్యాంకన విధులకు హాజరయ్యే వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
దళిత కళాకారుడిపై స్పీకర్ దాడి అమానుషం
అల్లవరం: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలో గ్రామ దేవత జాతరలో ఓ దళిత కళాకారుడిని విచక్షణారహితంగా చెంపపై కొట్టి, దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతరలో పదుల సంఖ్యలో పోలీసులున్నా ప్రేక్షక పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత దళితురాలైనప్పటికీ ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఈవిధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బాధితుడికి న్యాయం చేయాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. దీనిపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు నేడు సత్కారం రావులపాలెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలం నుంచి గ్రామాల్లో సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులకు శనివారం సత్కారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, సొసైటీ అధ్యక్షులుగా సేవలందించిన వారందరినీ సత్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు పార్టీ పెద్దలతో కలసి రావులపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి సీఆర్సీ ఫంక్షన్ హాలు వరకూ వెళ్తామన్నారు. అనంతరం సన్మానాలు నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగ్గిరెడ్డి కోరారు. ఉత్కంఠగా చెస్ పోటీలు అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక విద్యానిధి స్కూలులో అండర్–11 జిల్లా స్థాయి చెస్ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగాయి. 40 మందికి విద్యార్థులు పైగా పాల్గొన్నారు. బాలికల విభాగంలో అమలాపురం రూరల్ ఈదరపల్లికి చెందిన అడబాల ప్రావీణ్యశ్రీ ప్రథమ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో కొత్తపేట మండలం వానపల్లికి చెందిన కాట్నం కేతన్ ప్రహాస్ ప్రథమ, ద్రాక్షారామకు చెందిన కంచి శివరామరాజు ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ప్రిన్సిపాల్ టి.మాధవి బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ కూడా పాల్గొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలకు శిక్షణ అమలాపురం రూరల్: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టెపెండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని వివరించారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. బయోడేటా, పదో తరగతి మార్కుల జాబితా, ఇతర అన్ని పత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 8 లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలని జ్యోతిలక్ష్మీదేవి స్పష్టం చేశారు. బీసీలకు రక్షణ చట్ట చేయాలి అమలాపురం టౌన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు తక్షణమే రక్షణ చట్టాన్ని చేయాలని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్టా వీరబాబు గౌడ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల రక్షణకు చట్టం, రాజధానిలో బీసీలకు వెయ్యెకరాల కేటాయింపు, అన్ని బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వీటిపై ఈ నెల 10 నాటికి స్పష్టమైన హామీ ఇవ్వకుంటే 11న విజయవాడలో ఆమరణ దీక్షలు చేస్తామని చెప్పారు. బీసీ నాయకుడు మట్టపర్తి సూర్యచంద్రరావు కూడా మాట్లాడారు. -
విరులు సిరులై.. భక్తి ఝరులై..
వాడపల్లిలో వైభవంగా శ్రీపుష్పోత్సవంఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీపుష్పోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలతో, సర్వాలంకారభూషితులై, నవ దంపతులుగా కొలువుదీరిన స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు, పండితులు ఉదయం స్వామివారి మేలుకొలుపు, విశేషార్చన, నిత్య హోమాలు, బలిహరణం, ద్రవిడ వేద పారాయణ తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. పల్లకీ ఉత్సవం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ ఫల నివేదనలు, ప్రసాద నివేదనలు చేశారు. కల్యాణతిలకం దిద్దుకుని నూత్న శోభతో మెరిసిపోతున్న స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఆలయంలో సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన పాన్పుపై భక్తజనరంజకంగా ఆగమ శాస్త్రానుసారం శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు శిష్ల్టా సూర్యకుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఏర్పాట్లను ఈఓ సూర్యచక్రధరరావు పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
బేరం కుదరలేదు కదూ!
సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఇసుక ర్యాంపులు కొత్తపేట, మండపేట నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతులిచ్చిన సెమీ మెకనైజ్డ్ రీచ్లు 11 ఉన్నాయి. వీటిలో నాలుగింటికి ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకూ, మిగిలిన వాటికి మే నెలాఖరు వరకూ అనుమతి ఉంది. ఈ 11 రీచ్లలో సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంలో ఇసుక అందుబాటులో ఉందని అంచనా. ఇది కాకుండా ఐదు స్టాక్ పాయింట్లు వద్ద 4.63 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో పాటు, భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా ఇసుకకు డిమాండ్ లేకుండా పోయింది. దాడులు అందుకేనా..! ఇదే సమయంలో రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా ర్యాంపులపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఇసుక రీచ్ల కో ఆర్డినేట్స్, తవ్వకాల నియమనిబంధనలు.. అమ్మకాల తీరును పరిశీలించారు. అనుమతులున్న రీచ్లలోనే కాకుండా ఆత్రేయపురం, ఆలమూరు, గోపాలపురం ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు జరిగాయి. కాకినాడ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.జగన్నాథరావు, ఏలూరు మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) వెంకటరత్నం, కోనసీమ జిల్లా మైన్స్ ఏడీ బి.అశోక్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేశారు. ర్యాంపులపై పలు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేశామని ఏడీ అశోక్ కుమార్ చెప్పారు. అయితే, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్న సమయంలో కాకుండా, ఇప్పుడు దాడులు చేయడమేమిటనే అనుమానాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల మధ్య వాటాలు తేలకపోడమే దీనికి అసలు కారణమని తేలింది. ఇద్దరు నేతల హవా జిల్లాలో అధికారిక ఇసుక ర్యాంపులు కొత్తపేట, ఇప్పుడు తూర్పు గోదావరి పరిధిలోకి వెళ్లిన మండపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఉన్నాయి. అనధికారిక ర్యాంపులు పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలు కేంద్రాలుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటికే స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఉంచిన ఇసుకను దొడ్డిదారిన అమ్ముకోవడం నుంచి నేటి వరకూ ఇద్దరు కీలక నేతల హవా సాగుతోంది. ఇసుక ర్యాంపులకు అనుమతి వచ్చిన తరువాత కూడా వీరిదే హవా. కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక మీద బీ, వీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనికితోడు అనధికారిక ఇసుక తవ్వకాలు జరుగుతున్న పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలకు సైతం సిండికేటులో వాటాలందుతున్నాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే, కొత్తపేట మండలం మందపల్లి – కపిలేశ్వరపురం ర్యాంపు వద్ద సరిహద్దు వివాదం తాజా ఇసుక తుపానుకు కారణమైంది. ఆలమూరు ర్యాంపుతో విభేదాలుఫ కోనసీమ ఇసుక దందాలో కొత్త మలుపు ఫ ఇప్పటికే ‘బీ’ వర్సెస్ ‘వీ’ ఫ తాజాగా టీడీపీ, జనసేన నేతల రంగప్రవేశం ఫ మందపల్లి ర్యాంపుపై వివాదం ఫ మందపల్లి పేరు చెప్పి కపిలేశ్వరపురంలోనూ తవ్వకాలు ఫ సీఎంఓను తాకిన ఇసుక తుపాను ఫ ఫలితంగానే అధికారుల దాడులు ఇసుక తుపాను హెచ్చరిక.. మందపల్లి – కపిలేశ్వరపురం ర్యాంపుల మధ్య మొదలైన తీవ్ర ఇసుక తుపాను.. క్రమంగా బలపడి దక్షిణ నైరుతి దిశగా పయనించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) తాకింది. సిండికేటు మధ్య పొరపొచ్చాలు.. ఇద్దరు నేతల మధ్య తెగని వాటాల వివాదం.. కొత్తగా మరో ఇద్దరి రంగప్రవేశం.. సీఎంఓకు చేరిన వివాదం.. ఫలితంగా అధికార, అనధికార ర్యాంపులపై అధికారుల దాడుల వరకూ వ్యవహారం వచ్చింది. ఈ ఇసుక తుపాను ప్రభావంతో రాగల కొన్ని రోజుల పాటు జిల్లాలోని కూటమి నేతల మధ్య మరింత దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాఫీగా సాగిపోతున్న ఇసుక సిండికేటులో విభేదాలకు ఆలమూరు ర్యాంపు కారణమైంది. ఇది అధికారికంగా ఆలమూరు పేరుతో ఉన్నప్పటికీ ఈ ర్యాంపునకు వెళ్లేందుకు దారి లేదు. దీంతో, కొత్తపేట మండలం మందపల్లి మీదుగా రహదారి సౌకర్యం కల్పించారు. ఇదే అదనుగా ఆలమూరు ర్యాంపు జియో కో ఆర్డినేట్స్ దాటి మందపల్లి, పక్కనే ఉన్న కపిలేశ్వరపురం పరిధిలో కూడా తవ్వకాలు మొదలు పెట్టారు. ఇక్కడ ఇసుకతో పాటు లంక దిబ్బను కూడా తవ్వేస్తున్నారు. ఈ తవ్వకాలకు అనుగుణంగా వాటాల శాతంలో మార్పులు చేయాలని పట్టుబట్టడమే ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమైంది. ఇది కాస్తా మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసుకునేంత వరకూ వెళ్లింది. చివరకు ఈ వివాదం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో, అసలు ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాపై పూర్తి వివరాలు కావాలని ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారిక, అనధికారిక ఇసుక ర్యాంపులపై మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా వీ, బీ వివాదాలకు అదనంగా వాటాల కోసం కొత్తపేటకు చెందిన ఒక కీలక టీడీపీ నేత, మండపేటకు చెందిన జనసేన పార్టీకి చెందిన నాయకులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం మరింత ముదిరింది. తమకు కూడా వాటాలు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. ఒకవైపు అధికారుల దాడులకు తోడు మరోవైపు నేతల మధ్య వాటాల పంచాయితీ కాస్తా తమ పుట్టి ముంచేలా ఉందని సిండికేట్లోని మిగిలిన పాటదారులు ఆందోళనతో ఉన్నారు. మొత్తం మీద ఈ పంచాయితీ సీఎంఓలో తేలితేనే కానీ, ఇసుక తుపాను తీరం దాటే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వివాదం బహిరంగమవడంతో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ సాగుతున్న ఇసుక దందాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వైభవంగా శ్రీపుష్పోత్సవం
ఆత్రేయపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం ర్యాలిలో శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీపుష్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, వేద పారాయణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ద్వాదశ ప్రదక్షిణాలు, అనంతరం శ్రీపుష్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సుగంధభరిత పుష్పాలు, రకరకాల పండ్లు, మిఠాయిలు స్వామి, అమ్మవారి చెంతన ఉంచారు. శ్రీపుష్పోత్సవ వేళ ఆలయం నూతన శోభను సంతరించుకుంది. సాయంత్రం జాతీయ స్థాయి కళాకారిణి రావి బేబీ సత్యవాణి కూచిపూడి ప్రదర్శించిన నృత్యం భక్తులను అలరించింది. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, సభ్యులు, ఈఓ భాగవతుల వెంకట రమణమూర్తి పర్యవేక్షించారు. -
రథోత్సవంలో అపశ్రుతి
భద్రతా వైఫల్యానికి యువకుడి బలి పిఠాపురం: అధికారుల భద్రతా వైఫల్యం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. చేబ్రోలు జరిన రాములవారి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం కిందపడి శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ (22) మృత్యువాత పడిన సంఘటన భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి చేబ్రోలులో రాములవారి రథోత్సవం నిర్వహిస్తుండగా, చూడడానికి కత్తిపూడికి చెందిన యువకుడు దుక్కా వెంకటేష్ (శ్రీను) వచ్చాడు. రథం తాడు లాగే క్రమంలో ప్రమాదవశాత్తూ రథం తగిలి కింద పడ్డాడు. అతని పొట్ట మీదుగా రథం చక్రం నొక్కింది. వెంటనే అతనిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు మృతుడి తండ్రి దుక్క శ్రీను చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. ఏర్పాట్లలో విఫలం దేవాలయ చరిత్రలో వందల ఏళ్ల నుంచి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో ఇప్పటి వరకూ చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రస్తుత రథోత్సవంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. రథం చక్రాల వద్ద కేవలం రథాన్ని మలుపు తిప్పే శీలలతో ఉన్న వ్యక్తులు, పోలీసులు మాత్రమే ఉండాలి. అయితే జనాన్ని అదుపు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అత్యంత భారీ జన సందోహం మధ్య సాగే రథయాత్ర జరిగే చేబ్రోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఆలయ కమిటీపై ఫిర్యాదు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల రథోత్సవంలో తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి దుక్కా శ్రీను గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఆలయ కమిటీపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఇసుక ర్యాంపుల్లో అధికారుల తనిఖీలు
రావులపాలెం: జిల్లాలోని ఇసుక ర్యాంపులను మైనింగ్ శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గతంలో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జొన్నాడ, ఆలమూరు, ఊబలంక, ఆత్రేయపురం, వద్దిపర్రు, గోపాలపురం ప్రాంతాల్లో ఇసుక రీచ్లను కాకినాడ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.జగన్నాథరావు, ఏలూరు మైన్స్ ఏడీ వెంకటరత్నం, కోనసీమ జిల్లా మైన్స్ ఏడీ బి.అశోక్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. దీనిపై జిల్లా మైనింగ్ శాఖ ఏడీ అశోక్ కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇసుక ర్యాంపులపై పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేశారన్నారు. తవ్వకాల నియమ నిబంధనలు, ధరలు తదితర అంశాలను టెండర్లు దక్కించుకున్న కంపెనీలు సక్రమంగా అమలు చేస్తున్నాయా, లేదా, అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతులు ఇచ్చిన 11 సెమీ మేకనైజ్డ్ రీచ్లు ఉన్నాయన్నారు. వీటిలో నాలుగు రీచ్లకు ఈ ఏడాది డిసెంబర్ దాకా, మిగిలిన వాటికి మే నెలాఖరు వరకు కాల పరిమితి ఉందన్నారు. అలాగే 11 రీచ్ల్లోనూ సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంలో ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇది కాకుండా ఐదు స్టాక్ పాయింట్లు వద్ద మరో 4.63 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వ ఉందన్నారు. తనిఖీల్లో అనుమతులు ఇచ్చిన 11 రీచ్లే కాకుండా ఫిర్యాదులు అందిన ఆత్రేయపురం, ఆలమూరు, గోపాలపురం ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశామన్నారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. -
అట్టహాసంగా పట్టాల ప్రదానం
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూలో గురువారం 12 స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 18 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహుతులతో కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది జూలై 4వ తేదీన వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు ఎనిమిది నెలల తరువాత హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు అందుకునేవారు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్.. శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక గంట ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందడి చేశారు. ప్రగతి వివరించిన వీసీ ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తన ప్రసంగంలో వర్సిటీ సాధించిన ప్రగతి వివరించారు. దాదాపు 20 నిముషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేరణ కలిగించేలా ఆయన ప్రసంగం సాగింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ కాకినాడ స్థిరపడిందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలో యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు ఒడిసి పట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే ప్రాజెక్టులను ప్రొత్సహించాలన్నారు. యువత ఉద్యోగం కోసమే కాకుం డా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అలోచించాలని కోరారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీలు ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ డే అంటే యూనివర్సిటీతో సంబంధం ముగించడం కాదని, కేవలం యూనివర్సిటీ నుంచి ప్రపంచంలోకి ప్రవేశించడమన్నారు. శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అధ్యయనం చేస్తే ఇంజినీర్లు ప్రపంచాన్ని సృష్టిస్తారన్నారు. సైన్స్ రంగంలో పీహెచ్డీలు పొందిన సంఖ్యలో యూఎస్, చైనా తరువాత మూడో స్థానం భారతదేశం సాధించిందని, స్టార్టప్ల సంఖ్యపరంగా కూడా 3వ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీ.ఎస్.ఎస్. కుమార్, కే.వీ.ఎస్.జీ మురళీకృష్ణ, రామలింగరాజు, పాలక మండలి సభ్యులు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, సంకురాత్రి చంద్రశేఖర్, వర్సిటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. అందజేసిన పట్టాల వివరాలు 2024–25 విద్యాఏడాదికి గాను బీటెక్ 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎం ఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభించారు. అలా మొదలై.. ఇలా ముగిసి.. షెడ్యూల్ ప్రకారం స్నాతకోత్సవం ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. గంటా మూడు నిమిషాల ఆలస్యంగా 11.48 గంటలకు కార్యక్రమం ప్రారంభించారు. 11.49 గంటలకు గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభం 11.55కు పీహెచ్డీ, గోల్డ్మెడల్ విజేతలతో ప్రతిజ్ఞ 12.00 గవర్నర్ అనుమతితో వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 12.05 బంగారు పతకాలు, పీహెచ్డీల ప్రదానం 12.30 ముఖ్య అతిథి వరప్రసాద్రెడ్డి ప్రసంగం 12.45 గవర్నర్ ప్రసంగం 12.50 వీసీ ప్రసాద్ చేతుల మీదుగా గవర్నర్, ముఖ్య అతిథులకు సత్కారం 1.00 గంటకు రెక్టార్ సుబ్బారావు ధన్యవాదాలు, జాతీయ గీతంతో ముగింపు వైభవంగా జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ శాంత బయోటక్ అధినేత వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీల ప్రదానం గంట ఆలస్యంగా ప్రారంభం -
రేపు ‘తిరుమల’లో అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల క్యాంపస్లో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ అండ్ నీట్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల ద్వారా ప్రసిద్ధ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, అలాగే వారికి ఉన్నత విలువలు ఎలా నేర్పాలో తెలియజేస్తారన్నారు. ఈ సదస్సుకు హాజరవ్వాలంటే ముందుగా తమ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏఈడీయూ.సీవోఎం నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారు అదే రోజు ఉదయం 9 గంటల లోపు క్యాంపస్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. బాలిక అదృశ్యం నిడదవోలు రూరల్: పదో తరగతి పరీక్షకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. కోరుమామిడి గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం తాడిమళ్ల జెడ్పీ హైస్కూల్కు వెళ్లి తిరిగి రాలేదన్నారు. తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెల్లం ఊట ధ్వంసం తాళ్లరేవు: కోరంగి మడ అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై గురువారం అటవీ సిబ్బంది, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి 26 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ మడ అడవులలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రి మందలించాడని ఆత్మహత్య కొత్తపల్లి: తండ్రి మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నానికి చెందిన మెరుగు సత్తిరాజు (55) తన తండ్రి మందలించాడనే కోపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యులు సత్తిరాజును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కోళ్ల మేత మెషీన్పై పడి వ్యక్తి మృతి నిడదవోలు రూరల్: కోళ్లఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ, కోళ్ల మేత మెషీన్పై పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ నూతంగి సత్యానందం (33) ఎలక్ట్రికల్, ప్లంబింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కాటకోటేశ్వరం గ్రామంలో కొత్తపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన కోళ్లఫారంలో గురువారం మధ్యాహ్నం వాటర్షెడ్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కోళ్ల మేత మెషీన్పై పడ్డాడు. ఈ నేపథ్యంలో సత్యానందం తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. భార్య కోట సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యానందం మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
అమలాపురం టౌన్: వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ సీడ్ టూ సీడ్ దిశగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎంవీ రామారావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీకళా గ్రాండ్స్లో మూడు రోజులుగా సాగుతున్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ సీజన్–2026 సన్నద్ధతపై గురువారం జరిగిన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో ప్రీ – మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానం ద్వారా విత్తనం నుంచి విత్తనం (సీడ్ టూ సీడ్) వరకూ కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం అనేది ఓ విప్లవాత్మకమైన ముందడుగు అని గుర్తు చేశారు. రైతులు ప్రకృతి వ్యవసాయం బాట పట్టేందుకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన పంటలైన కొబ్బరి, అరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమలు చేసేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాలు, జీవ ఉత్ప్రేరకాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లాలోని బయో రిసోర్స్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. డీఎల్డీఓ విజయలక్ష్మికి పదోన్నతి రామచంద్రపురం రూరల్: రామచంద్రపు రం డివిజన్ డీఎల్డీఓ వి.విజయలక్ష్మికి పదోన్నతి లభించింది. ఆమె జిల్లా స్వర్ణ గ్రా మ, స్వర్ణవార్డు అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆమె గురువారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆమెను ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు. గుడ్ ఫ్రైడే ప్రార్థనలకు సర్వం సిద్ధం అమలాపురం టౌన్: మానవులకు శాంతి, సహనం, దయ, ప్రేమ తదితర మార్గాలను చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు. భూమిపై మానవుల పాపాలను రూపుమాపడానికి శిలువపై మరణించిన కరుణామయుడు. ఆయన శిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని గుడ్ఫ్రైడే ప్రార్థనలకు జిల్లాలోని అన్ని చర్చిల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సుమారు 650 చర్చిల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అమలాపురం, రామచంద్రపురాల్లో క్రైస్తవులు.. ఏసుక్రీస్తు శిలువ మోసే ఘట్టాన్ని వివరిస్తూ ప్రదర్శనలు చేయనున్నారు. అమలాపురం కలెక్టరేట్ రోడ్డులోని మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనల కోసం స్థానిక మిరియాం గ్రౌండ్స్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1500 నుంచి 2000 మంది పాల్గొనేలా వీటిని రూపొందించారు. అమలాపురం మెయిన్ రోడ్డులోని సెయింట్ లూథరన్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి అమలాపురం రూరల్: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గెడ్డం సంపదరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజు ఆకివీడు గ్రామంలో డిప్యూటీ స్పీక ర్ రఘురామ కృష్ణంరాజు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తిక సత్యనారాయణ, కార్యదర్శి కోణాల ప్రకాష్, కోశాధికారి కాండ్రేగుల గంగరాజు, అమలాపురం ఇన్చార్జి పొలమూరి మోహన్ బాబు పాల్గొన్నారు. -
రైసుమిల్లు, గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు
సామర్లకోట: పెద్దాపురంలోని వెంకటేశ్వరా రైసుమిల్లులో గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసుమిల్లులో రేషన్ బియ్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ కన్నబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లులో రైతుల నుంచి సేకరించిన ధాన్యం, బియ్యం నిల్వ వివరాలను నమోదు చేసుకున్నారు. రైసుమిల్లు సామర్థ్యం, కార్మికుల భద్రత, రైసు మిల్లుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల అమలును జేసీ పరిశీలించారు. అంతకుముందు పట్టణ పరిధిలోని రేషన్ షాపులలో పేద ప్రజలకు బియ్యం ఏవిధంగా సరఫరా చేస్తున్నారో ఆరా తీశారు. షాపులలో బియ్యం నిల్వ, స్టాక్ రిజిస్టర్, సరకుల నాణ్యత, తూకం, బిల్లింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం మెయిన్రోడ్డులోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీని క్షుణ్ణంగా పరిశీలించారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఆ గ్యాస్ ఏజెన్సీ వద్ద రోజూ వినియోగదారులు బారులు తీరడంతో ఏజెన్సీ ప్రతినిధి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్లో బుకింగ్ లోపాలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయం జరుగుతున్నట్టు గుర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి సత్యనారాయణరాజు, తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
తడిబాటు తప్పదా!
ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకులుసాక్షి, అమలాపురం: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు అడుగడుగునా ఆటంకాలే కలుగుతున్నాయి. పొలాలను తడిపేందుకు నీరు అందకపోవడంతో రైతులు తడబాటుకు గుర వుతున్నారు. విత్తు నుంచి విక్రయం వరకూ వారికి కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పుడు క్లోజర్ పనుల రూపంలో వారికి మరో ఇబ్బంది వచ్చింది. ఏప్రిల్ 15 నాటికి పంట కాలువలను మూసివేస్తామని, క్లోజర్ పనులతో పాటూ ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్, రిపేరు పనులను ప్రారంభిస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. కానీ వాస్తవంగా ఏప్రిల్ 15 నాటికి పంట కాలువలు మూసివేసే పరిస్థితి గోదావరి డెల్టాలో లేదు. నెలాఖరు వరకు పంట కాలువలకు నీరు విడుదల చేయాల్సిందే. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలోని శివారు ప్రాంతాలలో రబీ వరినాట్లు ఆలస్యం కావడంతో సాగు ఆలస్యమైన విషయం తెలిసిందే. రబీ షెడ్యూల్ ఇదీ గోదావరి డెల్టాలో ఏటా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రబీ షెడ్యూల్ మొదలవుతుంది. నాటి నుంచి రబీ అవసరాలకు అనుగుణంగా డెల్టాలోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు నీరు వదులుతుంటారు. గతంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరంగా జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (సాగునీటి పారుదల సలహా మండలి– ఐఏబీ)లో అయినా, జిల్లా విభజన తర్వాత తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల వారీగా జరుగుతున్న ఐఏబీల సమావేశంలో అయినా ఒక్కటే షెడ్యూల్ చెబుతున్నారు. డిసెంబరు 1 నుంచి రబీ మొదలవుతుందని, అదే నెల చివరి రోజు 31వ తేదీకి నాట్లు, వెదజల్లు పద్ధతి పూర్తవ్వాలని సూచనలు చేస్తున్నారు. నాట్లు పూర్తికాక.. ప్రతి ఏటా అనుకున్న సమయానికి నాట్లు పూర్తి కావడం లేదు. జనవరిలో సంక్రాంతి సమయంలో కూడా నాట్లు వేయడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వడం తప్పనిసరి. అయితే ఈసారి సాగుకు అసాధారణ ఆలస్యమైంది. ఫిబ్రవరి మొదటివారంలో కూడా నాట్లు వేశారు. అటువంటి చోట నీరందకుంటే చివరిలో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుంది. ఇవన్నీ చూస్తే ఏప్రిల్ 15 నాటికి కాలువలు మూసివేయడం అసాధ్యమని రైతులంటున్నారు. కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. యంత్రాంగం విఫలం సకాలంలో రైతులతో సాగు చేపట్టించడంలో అధికార యంత్రాంగం విఫలమవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఖరీఫ్లో మోంథా తుపానుకు రైతులు నష్టపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాల వల్ల రైతులు సాగు సకాంలో చేపట్టలేకపోయారు. ఈ కారణంగా మార్చి 31వ తేదీ నాటికి మొదలు కావాల్సిన వరి కోతలు మే మొదటి వారంలో కూడా కోసే పరిస్థితి నెలకొంది. అనుకున్న దానికన్నా ఎక్కువ నీరు ఇచ్చినప్పటికీ శివారు, మెరక ప్రాంతాలకు నీరు అందక రైతులు పడరాని పాట్లు పడ్డారు. ముఖ్యంగా వరిచేలు దుబ్బు చేసే ఫిబ్రవరి, గింజ తోడుకుని గట్టిపడే దశ మార్చి నెలలో సకాలంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనితో ప్రత్యామ్నాయంగా సొంత మోటార్లతో మురుగునీటి కాలువల నుంచి, అలాగే విద్యుత్ మోటార్లతో నీరు తోడుకుని పంటను గట్టెక్కించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నీటి ఇక్కట్లు ప్రస్తుతం తూర్పు డెల్టాకు 3,400 క్యూసెక్కులు, మధ్య డెల్టా 2,100 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,300ల క్యూసెక్కులు చొప్పున మొత్తం 10,800 క్యూసెక్కుల చొప్పున డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇంత నీరు ఇస్తున్నా ఇప్పటికీ నీటి ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఛానళ్లు, పంట బోదెలు నీరు ఇంకి పోయి దర్శనమిస్తున్నాయి. మరోవైపు రైతులు మురుగునీటి కాలువలు, నీరు తక్కువగా ఉన్న పంట కాలువల నుంచి మోటార్లతో తోడుకునే దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఫ ఏప్రిల్ 15 నాటికి డెల్టా కాలువలు మూసివేస్తామంటున్న అధికారులు ఫ గోదావరి డెల్టా శివారుల్లో సాగు ఆలస్యం ఫ దీని వల్ల నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సిందే ఫ సమృద్ధిగా ఉన్నా శివారుకు అందని వైనం ఫ అష్టకష్టాలు పడుతున్న రైతులు -
ఆపతాపాలు
● సుర్రుమనిపిస్తున్న సూరీడు ● ఉమ్మడి జిల్లాలో గుబులు ● వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు అవసరం ఇలా చేస్తే మేలు ● వేసవిలో రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచూ తాగాలి. ● లేత రంగు కలిగిన తేలికగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు పూటలా స్నానం చేయాలి. ● ఎండ తీవ్రత అఽధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే గొడుగు లేదా టోపీ ధరించాలి. లేకుంటే తలకు రుమాలు చుట్టుకోవాలి. ● ఇంట్లో కిటికీలు తెరిచి గదిలోకి గాలి వచ్చి చల్లబడే విధంగా చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ప్రచారం వేసవికాలం దృష్టా సంభవించే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ సిబ్బందితో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వడదెబ్బకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏరియా, ప్రభుత్వ, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం. –ఎం.సుమలత, అదనపు జిల్లా వైద్యాధికారి, కోనసీమ ఆలమూరు: వేసవి వచ్చేసింది.. మండే ఎండలను తెచ్చేసింది.. బయటకు వెళ్తే సుర్రుమనిపిస్తోంది.. ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణంగా మే నెల ప్రథమార్థంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. రెక్కల కష్టం మీద జీవనం సాగించే సామాన్యులపై ఎండ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు, ఇటుక పరిశ్రమ, భవన నిర్మాణ కార్మికులు, రోగ నిరోధశక్తి తగిన మోతాదులో లేని అనారోగ్య తీవ్రత ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఏరియా, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఉన్న సమయంలో మానవుని శరీరంలోకి సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. వేడిగాలుల వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్), శరీరంలో లవణాలు కోల్పోవడం (డీహైడ్రేషన్)తో కలిగే దుష్ఫరిణామాలు వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ప్రాథమిక అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వడదెబ్బకు కారణమవుతుంది. సత్వరం ప్రాథమిక చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతోంది. మగత నిద్ర రావడం, కలవరింతలు పలకడం, పెదవులు తడిబారి పోవడం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందే విధంగా చూడాలి. త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలే విధంగా చేయాలి. శరీరం సాధారణ స్థాయి ఉష్ణోగ్రత వరకూ వచ్చే వరకూ మెత్తటి తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిగిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ లేక ఓఆర్ఎస్ను తాగించాలి. అపస్మారక స్థితికి వెళ్లిన రోగితో నీరు తాగించరాదు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందించాలి.


