Dr B R Ambedkar Konaseema
-
ఆటెంకాలతో యాతన
ఫ భారీగా తగ్గిన కొబ్బరికాయల దిగుబడి ఫ వెయ్యి కొబ్బరి ధర రూ.16 వేలు ఫ ధర పెరిగినా లేని ఆనందం ఫ మూఢం మొదలు కావడంతో మళ్లీ కష్టాలే సాక్షి, అమలాపురం: కొబ్బరి కాయల దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగడం.. దిగుబడి పెరిగినప్పుడు ధర తగ్గడం సర్వసాధారణం అయ్యింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కొబ్బరి కాయల ధర పెరిగింది. కోనసీమ వ్యాప్తంగా కొబ్బరి కాయల దిగుబడి తగ్గింది. దీనితో ధర పెరిగిన సంతోషం రైతులకు లేకుండా పోయింది. కోనసీమ జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. మరో 25 వేల ఎకరాలకు సరిపడా కొబ్బరి చెట్లు ఇళ్లు, కాలువలు, రోడ్ల వెంబడి ఉన్నాయి. ఏడాదికి సగటున 94.50 కోట్ల కొబ్బరి కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. కొబ్బరి పలు రకాల ఉత్పత్తులు ఉన్నా మార్కెట్ పచ్చికొబ్బరి (నీటికాయ) మీదే ఆధారపడుతోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.16 వేల వరకూ ఉంది. గత నెలలో ఇది రూ.13 వేలు ఉండగా, ఇప్పుడు రూ.మూడు వేల వరకూ పెరిగింది. పరిస్థితి తారుమారు సాధారణంగా వేసవిలో కొబ్బరి కాయకు పెద్దగా ధర ఉండదు. వేసవిలో ఉత్తరాది రాష్ట్రాల వారు దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజలకు మామిడి కాయలతో మొక్కుబడి తీర్చుకుంటారు. పైగా మూఢం మొదలయ్యింది. కానీ విచిత్రంగా కొబ్బరికి ధర రావడం.. అది కూడా నెల రోజులకు పైబడి నిలబడి ఉండడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం కొబ్బరికాయ దిగుబడి గణనీయంగా పడిపోవడమే. కొబ్బరి ఏడాదికి సగటు దిగుబడి వెయ్యి నుంచి 1,200ల కాయలు. వేసవిలో 1,300 నుంచి 1,500 వరకు ఉంటోంది. మార్చి నుంచి జూన్ వరకు చేసే దింపుల్లో దిగుబడి అధికం. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎకరాకు 700 నుంచి 800 మించి కాయలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి వంటి తీర ప్రాంత మండలాల్లో 500 నుంచి 600 కాయల దిగుబడి వస్తోంది. దీనితో కొబ్బరి ధర పెరిగినా రైతులకు ఆనందం లేకుండా పోయింది. ‘రెండు నెలల కిందట కొబ్బరి దిగుబడి ఎకరాకు సగటు వెయ్యి కాయల వరకే ఉంది. అప్పుడు ధర వెయ్యి కాయలకు రూ.13 వేల వరకూ ఉండేది. ఇప్పుడు కొబ్బరి ధర రూ.16 వేల వరకూ ఉంది. కానీ దిగుబడి సగటు 700లు మాత్రమే ఉండడంతో రూ.11,200లకు వస్తోంది’ అని పి.గన్నవరం మండలం ముంజవరానికి చెందిన రైతు ముత్యాల రాజు ‘సాక్షి’కి తెలిపారు. దిగుబడి తగ్గిన కొబ్బరి చెట్టు తెల్లదోమ ప్రభావమే కారణమా? కొబ్బరికి అధిక దిగుబడులు రావాల్సిన సమయంలో పడిపోవడం వెనుక తెల్లదోమ (రూగోస్ వైట్ఫ్లై) ఒక ప్రధాన కారణం. తెల్లదోమ వల్ల 30 శాతం కొబ్బరి కాయ దిగుబడి తగ్గిన విషయాన్ని అంబాజీపేటకు చెందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కూడా గుర్తించిన విషయం తెలిపిందే. దీనికితోడు గత ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా ఓ కారణం. జూన్ నుంచి ఆగస్టు వరకు లోటు వర్షం కారణంగా పొత్తులకు ఉండే కొబ్బరి పువ్వులు రాలిపోవడం.. తరువాత పుచ్చులు పడిపోవడం వల్ల ఇప్పుడు దిగుబడులు తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. వేసవి కావడంతో ఉత్తరాది రాష్ట్రాల వినియోగం తగ్గడంతో పాటు.. అధిక జ్యేష్టమాసం కారణంగా శుభ కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయిలో లేక నీటికాయ ఎగుమతులు జరగడం లేదని స్థానిక కొబ్బరి వ్యాపారులు చెబుతున్నారు. -
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సతీష్
ఉప్పలగుప్తం: వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా విలసవిల్లికి చెందిన సలాది సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని సతీష్ శనివారం విలేకర్లకు తెలిపారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ను, నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్యలను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. సతీష్ను డాక్టర్ శ్రీకాంత్, ఆదిత్యలు దుశ్శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్లకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు బద్రి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల పేర్లను తొలగించడం అన్యాయం
ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు అమలాపురం టౌన్: ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి, తమ అనుమతి లేకుండా యూ డైస్ నుంచి పేర్లను తొలగించడం అన్యాయమని డీఈఓ పి.నాగేశ్వరరావుకు అమలాపురం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందించారు. అమలాపురంలో డీఈఓను ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు శనివారం కలసి తమ సమస్యలను చెప్పుకొని వినతిపత్రం అందజేశారు. ఈ వివరాలను అమలాపురానికి చెందిన డివిజన్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ కార్యదర్శి ఎన్.రమేష్ వివరించారు. 2021లో కోర్టు, విద్యా శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఈ విధంగా పేర్లను తొలగించకూడదన్న ఆంక్షలు ఉన్నాయని కరస్పాండెంట్లు గుర్తు చేశారు. ఆ ఆదేశాలు తుంగలో తొక్కడం సరికాదని స్పష్టం చేశారు. ఇది సైబర్ నేరం కిందకు వస్తుందని వారు డీఈఓకు వివరించారు. దీనిపై డీఈఓ స్పందించి ప్రైవేట్ పాఠశాలల అనుమతి లేకుండా యూ డైస్ నుంచి పేర్లు తొలగించకుండా ఆదేశాల ఇస్తానని చెప్పారని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పి.లక్ష్మీ శ్రీనివాసన్ తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి ఎన్.రమేష్, రాష్ట్ర అసోసియేషన్ నాయకుడు సరిపల్లి సిద్ధార్థ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
ఫ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాస్తారోకో ఫ వానపల్లి పీఏసీఎస్ వద్ద ధర్నా కొత్తపేట: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్క జొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఆ రైతులు రోడ్డెక్కారు. వానపల్లి, బిళ్లకుర్రు, అద్దంకివారిలంక, వాడపాలెం తదితర గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు వైఎస్సార్ సీపీ నాయకుడు, వానపల్లి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు సత్తిరాజు (రాజా), నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు పెదపూడి బాపిరాజు తదితర నాయకులు, రైతు నాయకుల ఆధ్వర్యంలో శనివారం వానపల్లి సొసైటీ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. కొంతసేపు కొత్తపేట – ముక్తేశ్వరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు రాజా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ రైతు వ్యతిరేకి అని విమర్శించారు. ఈసారి కూడా రైతులకు ఏవిధమైన తోడ్పాటు అందించకుండా, రైతు ప్రయోజనాలను గాలికొదిలేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృషితో ఏటా ఈ పీఏసీఎస్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేటి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇటీవల రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం తెరుస్తుందని, మద్దతు ధర కల్పిస్తుందని రైతులు ఆశించారన్నారు. గత్యంతరం లేక కొందరు రైతులు దళారులకు అయినకాడకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకులు, రైతులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఇసుకపట్ల సునీల్, బండారు సత్తిబాబు, వనుము నాగేంద్ర, గనిశెట్టి వెంకటేశ్వరరావు, గనిశెట్టి సతీష్, విఘ్నేశ్వరుడు, బండారు స్వరూప్, సూరిబాబు, కొటికలపూడి జగపతి తదితరులు పాల్గొన్నారు. -
ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా పెట్రో ధరలు
అమలాపురం టౌన్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యేవరకూ వేచి చూసి, ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఇప్పుడు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు విమర్శించారు. ఎన్నికల ముందు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి, తమ పార్టీకి ఓట్లు పడవని ముందే గ్రహించి ఎన్నికలు అయ్యాక పెంచడం వెనుక ప్రధాని మోదీ మోసం మరోసారి బయటపడిందని ఆయన తెలిపారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నేడు భారత ప్రధాని మోదీ అమలు చేసి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. దీంతో రైతుల ధాన్యం కల్లాల్లోనే ఎండకు ఎండి వానకు తడిసి నాశనమౌతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ విషయంలోనూ చంద్రబాబు ఆయా కంపెనీలతో కుమ్మకై ్క ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రైతుల శక్తి ఏమిటో తెలియజెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులంతా జాతీయ రహదారుల పైకి ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలతో వచ్చి పంజాబ్, హర్యానా రైతుల మాదిరి ఉద్యమాన్ని చేపట్టినప్పుడు చంద్రబాబుకు బుద్ధి వస్తుందన్నారు. వరి, ఆక్వా రైతులు ఈ తరహాలో పోరాటాలు చేసి.. చంద్రబాబు సర్కారు మెడలు వంచి లాభసాటి ధరలు సాధించుకోవాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు దారుణం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సాక్షి, అమలాపురం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని, వాటిని పెంచేది లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3కు పైగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. అమలాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా చార్జీలు భారంగా మారుతాయని తెలిపారు. దీనివల్ల అన్నివర్గాల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చమురుపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించి ధరలను నియంత్రించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతల నుంచి తప్పించుకోకుండా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున ప్రజా క్షేత్రంలో ఆందోళన చేపడుతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు. అప్పలరాజుపేట వద్ద పులి సంచారం రాజవొమ్మంగి: అప్పలరాజుపేట సమీపాన ఏపీ ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ పెంచుతున్న యూకలిప్టస్ వనాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా శనివారం వేకువజామున 5 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు యూకలిప్టస్ వనాల్లో పులి సంచరించిందని స్థానిక అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు. ఒంటరిగా అడవికి వెళ్లరాదంటూ అప్పలరాజుపేట, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. -
శాంతి భద్రతలకు ఇబ్బంది రానీయొద్దు
అమలాపురం టౌన్: రాబోయే రోజుల్లో జాతరలు, పండగలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాపై మరింత నిఘా పెంచాలని సూచించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో శనివారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) డేటా ఆధారంగా నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఎస్పీ ఆరా తీశారు. ముఖ్యంగా మూడేళ్ల పైబడి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పోలీస్ గస్తీని మరింత పెంచాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. రౌడీ షీటర్ల కదిలికలపై నిరంతర నిఘాతో వారిపై ఉన్న పెండింగ్ వారెంట్లు, అరెస్ట్లను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే జూలై 11న జిల్లాలో జరగనున్న లోక్ అదాలత్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని సూచించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై మహిళలకు గాయాలు
అమలాపురం రూరల్: మండలంలోని కామనగరువు బాలయోగి కాలనీలో శనివారం వంట గ్యాస్ లీకై నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కామనగురువులో దామిశెట్టి లక్ష్మి ఇంట్లో మిక్సీ ఆడుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా మంటలు గది అంతా వ్యాపించాయి. పక్క గదిలో ఉన్న కుటుంబీకులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో లక్ష్మి కుమార్తె కాశిన శివకుమారి రెండు చేతులూ కాలిపోయాయి. మనుమరాలు అఖిలకు స్వల్ప గాయాలయ్యాయి. లక్ష్మి మేనకోడలు తాడేపల్లి సృజన రెండు కాళ్లు, చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. మంటల్లో చిక్కుకున్న వీరంతా పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ 108 అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విజయనగరంలో చదువుకుంటున్న తాడేపల్లి సృజన వేసవి సెలవులకు అమలాపురం వచ్చి ఈ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, తాలూకా ఎస్సై శేఖర్బాబు, తహసీల్దార్ దివాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ పినిపే శ్రీకాంత్, జెడ్పీటీసీ పందిరి శ్రీహరిరామ్ గోపాల్, వైఎస్సార్ సీపీ నాయకుడు రాజులపూడి మురళీకృష్ణ, ములపర్తి శ్రీను, నక్కా చంద్రశేఖర్లు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కిమ్స్ వైద్యులకు సూచించారు. అలాగే ప్రమాద బాధితులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరామర్శించారు. -
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి
రావులపాలెం: జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వైఎస్సార్ సీపీ బలోపేతానికి పాటుపడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర కార్యదర్శులతో (పార్లమెంట్) ఆయన సమావేశమయ్యారు. పార్టీ డిజిటలైజేషన్ కార్యక్రమాలు, వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టే అంశాలపై చర్చించారు. పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి మరింత సమన్వయంతో పని చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ కార్యక్రమాలు చేరేలా ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచించారు. అలాగే జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం సూచించిన విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలన్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై రాష్ట్ర కార్యదర్శులు విప్పత్తి వేణుగోపాల్, చింతలపాటి శ్రీనివాసరాజు, కర్రి నాగిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, వంటెద్దు వెంకయ్య నాయుడు, కటకంశెట్టి ఆదిత్య, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్ల కిశోర్ తదితరులతో చర్చించారు. కార్యక్రమంలో అముడా మాజీ చైర్మన్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు గొల్లపల్లి డేవిడ్రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ మండల కన్వీనర్లు బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, మాజీ సర్పంచ్ కర్రి గోవిందకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి -
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి
అమలాపురం రూరల్: సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి జలవనరుల శాఖ ఉన్నత కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జలధార– జల హారతి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులు సమగ్రంగా చేపట్టాలన్నారు. జిల్లాలో 2,135 పనులకు ప్రతిపాదించగా 2,068 పనులు మంజూరయ్యాయన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల్లో ప్రధానంగా ఇంటి నుంచే పనిచేసే విధంగా కౌశలం సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. దీనికి 6,040 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఫ ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకూ జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన మొత్తం 14,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలు నియామకాలు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్లో రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీలుగా మేడిశెట్టి దుర్గారావు(మండపేట), కుడుపూడి రాంబాబు(మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీగా వల్లూరి రామకృష్ణ (మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీగా మాత మురళి (రామచంద్రపురం), రాష్ట్ర యూత్ వింగ్ సెక్రటరీగా సలాది సత్యనారాయణమూర్తి (అమలాపురం)లను నియమించారు. ఆర్టీఐ వింగ్జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా కొల్లు త్రినాథవర్మ (అమలాపురం), మండల పార్టీ కమిటీ కాట్రేనికోన మండల జనరల్ సెక్రటరీగా మల్లాడి వీరబాబ్జి (ముమ్మిడివరం) నియమితులయ్యారు. జీవామృతంతో మెరుగైన ఉత్పాదకత ˘ అమలాపురం రూరల్: స్పైరులిన ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకతకు యోచిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధనం విభాగాల అధికారులతో మామిడికుదురు మండలం మానేపల్లిలో స్పైరులిన ఫార్మింగ్ నిర్వహిస్తున్న కేశవతో సాగు ఉపయోగాలపై సమగ్రంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్పత్తులను ల్యాబ్కు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్య శాఖ ఏడీ వర్ధన్ను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎంవీ రామారావు, జిల్లా పశ్చిమ వర్తక శాఖ అధికారి ఎల్.విజయ రెడ్డి పాల్గొన్నారు. బడిలో చేర్పించాలి బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాల వయసు ఉన్న ప్రతి బిడ్డను బడిలో చేర్పించడమే లక్ష్యంగా ఐసీడీఎస్ విద్యాశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్య సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలతో సమావేశం నిర్వహించి బడి పిలుస్తోంది కార్యక్రమంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనముమ్మిడివరం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మున్సిపాలిటీ చెత్త సేకరణ, తరలించే వాహనాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, సఖిలే సూర్యనారాయణ, పాముబాలయ్య, పెట్టా శివప్రసాదరావు పాల్గొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు అమలాపురం రూరల్: కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర వస్తువులు, నూనెలు విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ ఉదయ భాస్కరరావు వర్తక సంఘాలకు, నూనె శుద్ధి యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వారితో సమావేశం నిర్వహించారు. డీఎస్ఓ మాట్లాడుతూ కృత్రిమ కొరత, అధిక ధరల విక్రయంపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.విశాలాక్షి, అమలాపురం వర్తక సంఘం నాయకులు కుప్పాల రామకృష్ణ, కె.వెంకటరెడ్డి, జి.ముత్యాలరావు కె.నాగరాజు పాల్గొన్నారు. -
క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో కాపాడుదాం
● పీఎం రహత్ స్కీమ్ను సద్వినియోగం చేద్దాం ● రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: Æøyýl$z {ç³Ð]l*-§éË$ fÇ-W-¯]l-糚yýl$ „ýS™èlV>-{™èl$-ÌS¯]l$ VøÌñæzÌŒæ AÐ]l-ÆŠ‡ÌZ Bçܵ-{†ÌZ ^ólÇa™ól {´ë×êË$ §ýlMóSP AÐ]l-M>Ôèæ… E…r$…-¨. GÐ]lOÆð‡¯é çܵ…¨…_ VøÌñæz¯ŒS AÐ]l-ÆŠ‡ÌZ „ýS™èl-V>{™èl$ÌS¯]l$ Bçܵ-{†ÌZ ^ólÇa™ól 7 Æøk-ÌS-´ër$ Æý‡*.1.50 ÌS„ýSÌS Ð]lÆý‡MýS* OÐðl§ýlÅ… E_™èl…V> (M>ŋ٠Ìñæ‹Ü {sîæsŒæÐðl$…sŒæ) A…¨…^ól AÐ]lM>Ô>°² MóS…{§ýl {糿¶æ$™èlÓ… MýSÍ-µ…-_…-¨. ï³G… Æøyýl$z Ķæ*MìSÞyðl…sŒæ òßæÌŒæ¢ G‹Ü-{çÜ*-ె¯ŒSÞ (ï³G… Æý‡çßæ-™Œæ)-ïÜPÐŒl$ õ³Çsìæ D çܧýl$-´ëĶæ$… A…§ýl$-»êr$ÌZ E…§ýl° Gïܵ Æ>çßæ$ÌŒæ Ò$¯é Ô¶æ${MýS-ÐéÆý‡… K {ç³MýS-r-¯]lÌZ ™ðlÍ-´ëÆý‡$. JMøP „ýS™èlV>{™èl$-°MìS Bçܵ-{†ÌZ Æý‡*.1.50 ÌS„ýSÌS Ð]lÆý‡MýS* OÐðl§ýlÅ _MìS™èlÞ Æ>Ƈ$$¡ A…§ýl$-™èl$…-¨. hÌêÏÌZ° Æð‡…yýl$ {糿¶æ$™èlÓ HÇĶæ* Bçܵ-{™èl$Ë$, 7 MýSÐ]lÊÅ-°sîæ òßæÌŒæ¢ òÜ…r-Æý‡Ï™ø ´ër$ hÌêÏÌZ G…í³MýS ^ólíܯ]l 糨 {ò³•Ðólr$ Bçܵ{™èl$ÌZÏ D E_™èl OÐðl§ýlÅ õÜÐ]lË$ ´÷…§ýl-Ð]l^èla° Gïܵ M>Æ>Å-ÌSĶæ$… õ³ÆöP…¨. VøÌñæz¯ŒS AÐ]l-ÆŠ‡ÌZ çܵ…¨…^ól ÐéÆý‡$ ™öË$™èl 112, 108ÌSMýS$ ¸ù¯]l$Ï ^ólíÜ ™èl„ýS׿ çÜÐ]l*^éÆý‡… A…¨…-^éÍ. C§ól çÜÐ]l$Ķæ$…ÌZ §ýlVýSY-Æý‡ÌZ E¯]l² ´ùÎ‹Ü õÜtçÙ¯ŒSMýS$ MýS*yé çÜÐ]l*^éÆý‡… ™ðlÍ-´ëÍ. "Ò$ çÜàĶæ$… JMýS {´ë×ê°² M>´ë-yìl-¯]lr$Ï AÐ]l#™èl$…¨' "VøÌñæz¯ŒS AÐ]lÆŠ‡ õÜÐŒæ OÌñæÐŒæÞ' D °¯é§é-ÌS¯]l$ MóS…{§ýl {糿¶æ$™èlÓ… {ç³^éÆý‡… ^ólÝù¢…-¨. Æøyýl$z {ç³Ð]l*-§éÌS çÜÐ]l$-Ķæ$…ÌZ ™èl„ýS-׿Ðól$ çܵ…¨…_ „ýS™èl-V>-{™èl$-ÌS¯]l$ Bçܵ{™èl$ÌZÏ ^ólÇa E_™èl OÐðl§ýlÅ… ´÷…§ól ÐðlçÜ$-Ë$-»ê-r$¯]l$ çܨÓ-°-Äñæ*VýS… ^ólçÜ$MøÐéÌS° Gïܵ çÜ*_…-^éÆý‡$. -
రీ సర్వే అంశాల్లో లక్ష్యాలను చేరుకోవాలి
అమలాపురం రూరల్: రీ సర్వే అంశాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోడ్ నిదియాదేవి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే రెవెన్యూ క్లినిక్లు, పౌర సేవలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంశాల పురోగతిపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో పెండింగ్కు ఆస్కారం ఇవ్వరాదన్నారు. రీ–సర్వే పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. భూసేకరణ కేసులలో పరిహారం వేగంగా గా చెల్లించాలన్నారు. జాతీయ రహదారుల అధికారుల నోటీసును అనుసరించి అమలాపురం, పేరూరులో భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో యాజమాన్య హక్కులను నిర్ధారించడానికి తహసీల్దారు కార్యాలయంలో విచారణ చేశారు. డీఆర్వో వి.సుబ్బారావు ఆర్డీవోలు, సర్వే శాఖ అధికారి కే.ప్రభాకర్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మహనీయుడు కాటన్
రావులపాలెం: తన ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో గోదావరి డెల్టాకు జీవం పోసిన మహానీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయం, రైతుల అభ్యున్నతికి కాటన్ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నాడు కాటన్ కృషి చేశారన్నారు. ఆయన దూరదృష్టి వల్లే గోదావరి డెల్టా ప్రాంతం సస్యశ్యామలం అయిందని పేర్కొన్నారు. రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల కన్వీనర్ బొక్కా కరుణాకరం, మాజీ వార్డు సభ్యుడు సఖినేటి వాకులరాజు, వత్సవాయి కృష్ణంరాజు, జొన్నాడ దొరబాబు పాల్గొన్నారు. -
స్వర్ణం స్వప్నమేనా!
అన్నవరం: సత్యదేవుని ఆలయ శిఖరాన్ని స్వర్ణమయం చేయడం కలగానే మిగిలిపోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు భారీగా పెరిగిన బంగారం ధర, మరోవైపు దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, దాతలు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ బృహత్తర కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడుతున్న పరిస్థితి నెలకొంది. సత్యదేవుని పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో అదేచోట నూతన ఆలయాన్ని పునర్నిర్మించి 2012 మార్చి 14న ప్రారంభించారు. ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్తో నిర్మించి, బంగారు రేకు తాపడం చేయడానికి వీలుగా ఆలయ శిఖరాన్ని మాత్రం ఇటుకతో నిర్మించారు. 2024లోనే.. స్వర్ణ శిఖరం ఏర్పాటును దాతల సహకారంతో పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు 2024లో భావించారు. ఈ మేరకు ఎండోమెంట్స్ ప్రధాన స్థపతి పరమేశ్వరప్ప సత్యదేవుని ఆలయ శిఖరం కొలతలు తీసుకున్నారు. సుమారు 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయ శిఖరంపై 50కి పైగా దేవతా శిల్పాలున్నాయి. వీటన్నింటి కొలతలు తీసి, తొలుత రాగి రేకుతో వీటికి కవచాలు తయారు చేయించి, ఆపై బంగారు పూత పూయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి 11.50 కేజీల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ తరువాత టీటీడీ నిపుణులు కూడా ఆలయాన్ని పరిశీలించి, శిఖరం స్వర్ణ మయం చేయడానికి సుమారు 20 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. కానీ, దేవస్థానం ఆ ప్రతిపాదనలను తిరస్కరించి, 11.50 కేజీల బంగారంతో చేయించేందుకే మొగ్గు చూపింది. ప్రస్తుతం ధరాభారం కొన్నాళ్లుగా బంగారం రేటుకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కేజీ బంగారం ధర సుమారు రూ.1.50 కోట్లు ఉంది. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో ఆలయ శిఖరం స్వర్ణమయం చేయడానికి అవసరమైన బంగారానికే దాదాపు రూ.18 కోట్లు అవుతుందని, రాగి కవచాలు, ఇతర ఖర్చులు మరో రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.20 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ వ్యయాన్ని భరించే పరిస్థితిలో దేవస్థానం లేదు. అలాగని ఇంత పెద్ద మొత్తం విరాళంగా సమర్పించేందుకు దాతలు కూడా ముందుకు రాని పరిస్థితి. దేవస్థానం గత ఫిబ్రవరిలో 9.5 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ల స్కీములో డిపాజిట్ చేశారు. అలాగే, 2018లో దేవస్థానం వద్ద ఉన్న వెండిని కరిగించి, దానిని విక్రయించగా వచ్చిన డబ్బుతో 7 కిలోల బంగారం కొనుగోలు చేశారు. దానిని కూడా స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఈ బంగారంతో స్వర్ణ శిఖరం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రతిపాదనలు ముందుకు కదిలే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో 2024లో సత్యదేవునికి సుమారు రూ.2 కోట్లతో నూతన ధ్వజస్తంభం, దానికి బంగారు రేకు తాపడం చేశారు. కానీ, స్వర్ణ శిఖరం మాత్రం నేటికీ కలగానే మిగిలిపోయింది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు బడా పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి, ఈ కార్యక్రమం పూర్తి చేస్తేనే తిరుమల, శ్రీశైలం, విజయవాడ వంటి ఆలయాల మాదిరిగా సత్యదేవుని ఆలయ శిఖరానికి కూడా స్వర్ణ శోభతో ప్రకాశించే అవకాశం కలుగుతుతుంది. ·˘ çÜ™èlŧólÐ]l#° BÌSĶæ$ çÜÓÆý‡~ ÕQÆ>°MìS గతంలో ప్రయత్నాలు ·˘ 11.50 MóSiÌS º…V>Æý‡… అవసరమన్న నిపుణులు ·˘ Æý‡*.8 MørÏÐ]l#™èl$…§ýl° Aç³µsZÏ A…^èl¯é ·˘ {ç³çÜ$¢™èl… Æý‡*.20 Mør$Ï Oò³V> ఖర్చయ్యే అవకాశం ·˘ Cç³µsìæMîS M>¯]lÆ>° ç³#ÆøVýS†ప్రతిపాదనపై స్పందన కరువు కేజీ బంగారం ధర 2024లో రూ.60 లక్షలు. ఆ ప్రకారం 11.50 కేజీల బంగారానికి రూ.7 కోట్లు, రాగి కవచాల తయారీ, ఇతర వ్యయం రూ.కోటి అవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు దాతల విరాళాలు రూ.8 కోట్లతో సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడం చేసేందుకు అప్పటి దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్ (ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్) ప్రతిపాదనలు పంపించారు. దీని కోసం భక్తులు రూ.వెయ్యి నుంచి ఎంత మొత్తం విరాళం ఇచ్చినా స్వీకరించేలా ఒక స్కీమ్ రూపొందించారు. అయితే, ఆయన 2024 నవంబర్లో విజయవాడలోని కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయిన తరువాత ఈ ప్రతిపాదనపై ఎటువంటి కదలికా లేదు. -
అధికారుల నిర్వాకంతో తాగునీటి ఇక్కట్లు
● బ్రిడ్జి తొలగింపు పనుల్లో మంచినీటి పైప్లైన్ ధ్వంసం ● నాలుగు రోజులుగా భట్లపాలెం ప్రాంతంలో జనం అవస్థలు అమలాపురంలో పెట్రోల్ బంకుసాక్షి, అమలాపురం: సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నట్టుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు రూ.మూడు చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు శుక్రవారం తెల్లవారు జాము నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెంపు వల్ల జిల్లాలో ప్రత్యక్షంగా రైతులు, వ్యాపారులు, వాహనాల వినియోగదారులపై పరోక్షంగా సామాన్యుల మీద భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా రోజుకు సగటున 6.8 లక్షల లీటర్ల పెట్రోల్, 4.80 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మీద లీటరకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పెట్రోల్ వినియోగదారుపై రోజుకు రూ.20.40 లక్షలు, డీజిల్ వినియోగదారులపై రూ.12.24 లక్షల చొప్పున మొత్తం రూ.32.64 లక్షల భారం పడనుంది. పెంపుతో జిల్లాలో రూ.109.54 ఉన్న ధర రూ.112.83 వరకు చేరింది. అయితే నయార కంపెనీ గతంలో లీటరు ధరపై రూ.5 వరకు పెంచిన విషయం తెలిసిందే. అంటే లీటరుకు రూ.3.29 చొప్పున, డీజిల్ ధర లీటరు రూ.97.37 వరకు ఉండగా, ఇప్పుడు రూ.100.51కు చేరింది. పెరుగుదల లీటరుకు రూ.3.14. తప్పని ముప్పుతిప్పలు గత ఏప్రిల్ 20వ తేదీ నుంచి పది రోజుల క్రితం వరకు జిల్లాలో పెట్రోల్, డీజిల్కు వినియోగదారులు అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కొలిక్కి రాకపోవడం, హార్మోజ్ జలసంధి ఇంకా ఇరాన్ దిగ్బంధంలోనే ఉండడంతో జిల్లాలో పెట్రోల్, డీజిల్కు కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా డీజిల్ కొరత సామాన్యులను, రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. ఏప్రిల్ నెలాఖరులో వారం రోజుల పాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు రేషన్ విధించారు. మోటార్ సైకిల్కు రూ.200, కార్కు రూ.500, లారీ వంటి భారీ వాహనాలకు రూ.1,000 చొప్పున పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేశారు. డీజిల్ దొరకకపోవడంతో రబీ వరి కోతలపై ప్రభావం పడి రైతులు సకాలంలో ఊడ్పులు చేయలేకపోయారు. దీనివల్ల మే 3వ తేదీ కురిసిన అకాల వర్షానికి కొంతవరకు పంటను కూడా కోల్పోయారు. వరి రైతులతోపాటు ఎగుమతులపై ప్రభావం చూపడంతో కొబ్బరి, అరటి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల దిగుమతిపై ప్రభావం చూపి వాటి ధరలు పెరిగాయి. ఆక్వా సాగుకు డీజిల్ అందక రైతులు ఇక్కట్లు పాలయ్యారు. రైతులపై అధిక భారం పెట్రోల్ ధర పెంపు వల్ల వ్యక్తిగత వాహనదారులపై మాత్రమే భారం పడనుంది. ప్రధానంగా మోటారు సైకిళ్లు, కార్లు, కొంతమంది ఆటోల యజమానులు ఇబ్బంది పడనున్నారు. కాని డీజిల్ ధర పెంపు వల్ల పలు వర్గాలపై భారం పడనుంది. ప్రధానంగా రైతులపై భారం అధికంగా ఉంటుంది. వరి మాసూళ్ల నుంచి ధాన్యం ఎగుమతి వరకు, ఆక్వాలో జనరేటర్లు, ఏరియేటర్ల వినియోగం, ఎగుమతులు, కొబ్బరి, అరటి, ఉద్యాన పంటల ఎగుమతులు భారం కానున్నాయి. డీజిల్ కొరత వల్ల ఎకరా కోతకు అదనంగా రూ.ఐదు వందల చొప్పున భారం పడిన విషయం తెలిసిందే. డీజిల్ కొరత సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులపై అదనంగా 20 శాతం భారం పడింది. లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగింది. జిల్లాలో 14 వేలకు పైగా ప్రయాణికుల ఆటోలు, మూడు వేలకు పైగా ట్రాన్స్పోర్టు ఆటోల మీద భారం పడనుంది. ఆక్వాలో వెనామీ సాగుకు సంబంధించి విద్యుత్ సౌకర్యం లేని రైతులు డీజిల్ మోటార్ల మీద, జనరేటర్ల మీద ఆధారపడతారు. వీటికి పెద్ద ఎత్తున డీజిల్ వినియోగిస్తారు. అలాగే కూరగాయలకు సంబంధించి ఉల్లి, బంగాళాదుంప, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. వీటితోపాటు నిత్యావసర వస్తువులు, పండ్ల వంటి వాటి ధరలు కూడా పెరుగుతాయి. ఇది సామాన్యులకు భారంగా మారనుంది. అసాంఘిక శక్తులకు అడ్డాగా బాలయోగి స్టేడియం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రాత్రి అయితే చాలు ఈ స్టేడియం గేట్లు బార్లా తెరచి ఉంటున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలో డ్రగ్స్ వినియోగం, అసభ్య ప్రవర్తనలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేడియంలో ఆటలాడే వారి వద్ద నుంచి ఫీజు కింద రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నా ఆ స్థాయిలో రక్షణ చర్యలు ఉండడం లేదని ఆరోపించారు. స్టేడియం శాప్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని పేర్కొన్నారు. ఏసీలు, కరెంట్ బిల్లుల పేరిట వేలాది రూపాయలు చెల్లిస్తున్నా ఆ స్థాయిలో నిర్వహణ ఉండడం లేదన్నారు. డీఎస్డీవో పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాస్థలంలో బాస్కెట్ వేసవి క్రీడా శిక్షణ జరుగుతున్నా స్పోర్ట్స్ అఽధికారులు తొంగిచూడకపోవడం గమనార్హమని గుర్తు చేశారు. ఎంపీ గంటి హరీష్ మాథుర్ స్పందించి స్టేడియంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు. ఇందుపల్లిలో వంతెన పనులు ధ్వంసమైన భట్లపాలెం తాగునీటి పైప్లైన్అమలాపురం రూరల్: మండలంలోని ఇందుపల్లిలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా భట్లపాలెం వెళ్లే మంచినీటి పైప్లైన్ ధ్వంసం అయింది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇందుపల్లి గ్రామంలో బెండ కెనాల్పై నూతనంగా రూ.2 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ముందస్తుగా ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సమాచారం ఇవ్వకుండా పాత వంతెనను జేసీబీతో అధికారులు తొలగించడంతో దానిని ఆనుకొని ఉన్న పైపులైను ధ్వంసం అయింది. దీంతో భట్లపాలెంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇందుపల్లి రక్షిత మంచి పథకం నుంచి పైప్లైన్ ద్వారా తాగునీటి సరఫరా జరిగేది. అది నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా వంతెన పూర్తయ్యేవరకు తాగునీరు అందించలేమని చెబుతున్నారని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలింగా పైపులు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు తాగునీటి కష్టాలు వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. అయితే నీరు పంపిణీ కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు కలెక్టర్ చర్యలు చేపట్టి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లీటరుకు రూ.మూడు చొప్పున పెంపు పెట్రోల్ వినియోగదారులపై భారం రోజుకు రూ.20.40 లక్షలు డీజిల్పై రోజుకు పడే భారం రూ.12.24 లక్షలు నిత్యావసరాల ధరలు పెరుగుతాయని వివిధ వర్గాల ఆందోళన -
బడుల్లో విద్యార్థుల నమోదు పెంచాలి
అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ఈ ఏడాది 10 శాతం పిల్లల నమోదు పెంచాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఉపాధ్యాయులను గురువారం ఆదేశించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా రాష్ట్ర పరిశీలకులు రమ్యశ్రీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు రావులపాలెంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్రోల్మెంట్ శాతం పెంపుపై దిశా నిర్దేశం చేశారన్నారు. ప్రతి చిన్నారి బడిలోకి, ప్రతి కుటుంబంలో విద్యా చైతన్యమే లక్ష్యంగా బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగు తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ను జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి, వారిని వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తీసుకోవాలన్నారు. డిజిటల్ విద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ద్వారా నాణ్యమైన డిజిటల్ బోధన అందుతోందన్నారు. ఈ సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు కరపత్రాల ద్వారా వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులను సమర్థంగా నిర్వహించాలన్నారు. 5 నుంచి ఎన్నికల జాబితా సమగ్ర సవరణ జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్కుమార్, ఇతర అధికారులు ఢిల్లీ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి త్వరలో నిర్వహించనున్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటి తనిఖీలు, ప్రత్యేక శిబిరాలు, ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనలో చురుకై న పాత్ర పోషించాలని ఆదేశించారు. అనంతరం జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారన్నారు. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారన్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు. అర్హు లైన కొత్త యువ ఓటర్లను చేర్చడం, చనిపోయినవారు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టారన్నారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని 18 ఏళ్లు నిండిన వారిని జాబితాలో చేర్చుతారన్నారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవ డానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉపయోగించ వచ్చునన్నారు. ఉప తహసీల్దార్ శివరాజ్ పాల్గొన్నారు. -
పీఎండీఎస్ సాగుతో రైతుకు భరోసా
ఐ.పోలవరం: ఫ్రీ మాన్సూన్ డ్రై సీడింగ్ (పీఎండీఎస్) విధానంలో సాగు వల్ల నేలతల్లి ఆరోగ్యంతోపాటు రైతు భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రామారావు తెలిపారు. సెర్ప్, డీఆర్డీఏల సహకారంతో ఐ.పోలవరం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలకు సరిపడా ఐదు వేల కిట్లను ఆయన గురువారం పంపిణీ చేశారు. పీఎండీఎస్ మొదటి దశను ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐ. పోలవరం మండలానికి ఆయన చేసిన తొలిసారిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడం పీఎండీఎస్ లక్ష్యమన్నారు. దీనిని సమర్థంగా అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో కేడర్ పనిచేయాలన్నారు. పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చి మేతగా ఉపయోగపడటంతో పాటు, నేలలో వానపాముల వృద్ధికి ఈ విధానం దోహదపడతాయని పేర్కొన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, నేల కోత తగ్గడం, జీవ వైవిధ్యం అభివృద్ధి చెందడం ద్వారా సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తెలిపారు. ప్రధాన పంటలో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే శక్తి పెరిగి, దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి వాణి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాస్, ఏడీఏ, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.వి.వి. సత్యనారాయణ, సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకాంత్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు
రంపచోడవరం: గంజాయి ముఠాను రంపచోడవరం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్డీపీఓ అష్రిఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణాపై సమాచారం రావడంతో సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్సై రమేష్లు రంప గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. నాలుగు బైక్లపై 11 మంది వ్యక్తులు వస్తూ, తనిఖీలను గమనించి బైక్లు వెనక్కి తిప్పి పారిపోతుండగా పోలీసులు వెంబడించి రెండు బైక్లపై ఉన్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. మిగిలిన రెండు బైక్పై నలుగురు తప్పించుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను విచారించగా, వారంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు గ్రామం పరిధిలో అనేక బైక్లు, ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తేలింది. వారి నుంచి ఆరు బైక్లు, 33 గ్రాముల బంగారం, 1.85 గ్రాములకు పైగా వెండి, కెమెరా తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామర్లకోటకు చెందిన కొరిమిల్లి సురేష్, పి.వెంకట సత్యవరప్రసాద్, రొంగల సూర్యకిరణ్, షేక్ యాసిన్, సాయి, ఆర్.అఖిల్, ప్రసాద్, శివరామదుర్గారెడ్డి, రంప గ్రామానికి చెందిన బాబ్లు, పెద్దబారంగికి చెందిన లిల్లీ, కుంజా సిద్ధులను అరెస్ట్ చేశారు. -
వాడపల్లి వెంకన్నకు రికార్డు స్థాయి ఆదాయం
– 50 రోజులకు రూ 3.24 కోట్లు ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా 50 రోజులకు రూ.3,24,82,615 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గురువారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్ టి పి టి శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు పీవి వి ఎస్ కామేశ్వరరావు, ఎం సత్యనారాయణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.2,44,76,932, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.80,05,683 లభించాయన్నారు. బంగారం73 గ్రాములు, వెండి 1,544 గ్రాములు, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత స్థాయి అమలాపురం రూరల్: విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోనసీమ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మమ్మి పేర్కొన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అమలాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ను విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవాలని తెలిపారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గుబ్బల సూర్యప్రకాశ్, మండల విద్యాశాఖ అధికారి ఎస్.దుర్గాదేవి, సీఎంఓ బి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రహమాన్, అకౌంటెంట్ వరలక్ష్మి, అనూష, త్రినాథ్, నాగమల్లేశ్వరరావు, నాగన్న పాల్గొన్నారు. కొత్తవీధి పరిధిలో పులి సంచారం రాజవొమ్మంగి: స్థానిక అటవీ క్షేత్రంలోని వయ్యేడు ఫారెస్ట్ బీట్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి గురువారం రాత్రి తెలిపారు. వయ్యేడు అటవీ ప్రాంతానికి దగ్గరలోని కొత్తవీధి, కిమ్మిలిగెడ్డ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేశామన్నారు. కాగా పులి జనావాసాల్లో వచ్చే అవకాశం లేదని, రైతులు తమ పశువులను అడవిలోకి వదిలిపెట్టవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. సముద్ర మత్స్యకారులకు శిక్షణకాకినాడ రూరల్: సముద్ర మత్స్యకారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్ఐఎఫ్టీ) ప్రిన్సిపాల్ ఎస్.అంజలి అన్నారు. నైపుణ్యాభివృద్ధి, భద్రతతో కూడిన నౌకాయాన నిర్వహణే లక్ష్యంగా సముద్ర మత్స్యకారులకు ఎస్ఐఎఫ్టీలో మూడు రోజుల శిక్షణ తరగతులను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంజిన్లను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సముద్ర ప్రయాణంలో భద్రత పొందడంతో పాటు ఆదాయం కూడా పెంచుకోవచ్చని అన్నారు. ఓబీఎం అండ్ ఐబీఎం ఇంజిన్లపై ఏపీ మైరెన్ బోర్డ్ చీఫ్ సర్వేయర్ కె.రమేష్, ఇంజిన్ల మరమ్మతులపై అచ్యుతరామరాజు, సాధారణ నిర్వహణ, ఇతర అంశాలపై మత్స్య శాఖ సహాయ సంచాలకుడు కరుణాకరరావు అవగాహన కల్పించారు. శిక్షణకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన బోటు యజమానులు, సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో రిటైర్డ్ మెకానిక్ ఇన్స్ట్రక్టర్ బాబూరావు, కార్యక్రమ కో ఆర్డినేటర్ రామకృష్ణ, దేవానందం, అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
మండుటెండలోనూ తగ్గని భక్తజన సందడి
అన్నవరం: ఎండలు మండిపోతున్నా రత్నగిరిపై భక్తుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. సూర్యుడు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చెలరేగుతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అచంచల భక్తిభావంతో సత్యదేవుని దర్శనానికి వారం రోజులుగా వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు. వారం రోజులుగా వివాహలు జోరుగా జరుగుతూండటంతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. సుమారు 40 వేల మంది భక్తులు గురువారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. వ్రతాలాచరించేందుకు సైతం భక్తులు బారులు తీరారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల నుంచి దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
ఫలించిన పోరాటం
● వైఎస్సార్ సీపీ ఉద్యమంతో దిగి వచ్చిన ప్రభుత్వం ● మసీదు మాన్యంలో ఆయుష్ కళాశాల నిర్మాణం నిలిపివేత ● ఇతర స్థలాల పరిశీలనపిఠాపురం: పేదలకు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ చేసిన పోరాటం ఫలించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పిఠాపురం మసీదు మాన్యంలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అక్కడ పేదల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకునే లోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థలాల్లో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి దాదాపు రెండేళ్లుగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై లబ్ధిదారులు పలుమార్లు అధికారులకు అర్జీలు అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోగా.. అదే స్థలంలో ఆయుష్ కళాశాల నిర్మాణానికి ప్రయత్నించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యాన వందలాదిగా లబ్ధిదారులు ఇటీవల ఆ స్థలంలో ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయానికి చేరుకుని పీడీకి వినతిపత్రం సమర్పించారు. మసీదు మాన్యంలో పేదలకు కేటాయించిన స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని, పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలని, అక్కడ ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటామని, లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆ సందర్భంగా గీత హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా.. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కొనే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాకినాడలో నిర్మించిన ఆయుష్ ఆసుపత్రి పక్కనే స్థలాలున్నప్పటికీ.. లేదని చెబుతూ, పిఠాపురంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఆయుష్ కళాశాల నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా వైద్య కళాశాల నిర్మించాలంటే పక్కనే ఆసుపత్రి కూడా ఉండాలన్న కనీస నిబంధన కూడా పాటించకుండా ఎక్కడో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో కళాశాల నిర్మించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కాకినాడలోని విలువైన స్థలాన్ని టీడీపీ నేతకు కట్టబెట్టేందుకే ఇక్కడ పేదల స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమస్యపై కలెక్టర్కు, ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మసీదు మాన్యం స్థలాన్ని పేదలకే వదిలేసి, వేరే చోట ఆయుష్ కళాశాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ దిశగా అధికారులు ఇప్పటికే వేరే స్థలాలు పరిశీలిస్తున్నారు. పిఠాపురం మండలం చిత్రాడలోని వివిధ స్థలాలను కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ ఇటీవల పరిశీలించారు. కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
నిర్లక్ష్యంపై నిప్పులు
అమలాపురం టౌన్: కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా, వరి రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని, ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డి మాండ్ చేసింది. అమలాపురం హైస్కూలు సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ఆక్వా ఫీడ్, ధాన్యం బస్తాలు, మొక్కజొన్నలు ప్రదర్శనగా ఉం చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన సాగింది. తొలుత హైస్కూలు సెంటర్లో ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కష్టాలు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లినప్పుడు రైతులకు రాయితీలు ఇచ్చి ఆదుకున్న ఘటనలను వివరించారు. ఢిల్లీలో రైతులు ఉద్యమించినట్లుగా జిల్లా రైతులు కూడా నేషనల్ హైవే పై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలతో రాస్తోరోకో చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఆక్వా ఽఫీడ్ ధరలు తగ్గించే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఆక్వా ఫీడ్ ధరలనుటన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ పెంచారని పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ధ్వజమెత్తారు. ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆక్వా కంపెనీలకు మేలు చేసేలా ఫీడ్ ధరలను పెంచారని ఆరోపించారు. రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం బాధాకరమని రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆక్వా చెరువులకు రూ.1.50కు కరెంట్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ప్రశ్నించారు. రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గతంలో ఫీడ్కు అవసరమైన ముడిసరుకు రేట్టు తగ్గినా ఫీడ్ రేట్లను ప్రభుత్వం తగ్గించలేదన్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు సిండికేట్ అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. కోనసీమ ఆక్వా రైతు సంఘ అధ్యక్షుడు రుద్రరాజు నానిరాజు మాట్లాడుతూ యుద్ధాన్ని బూచిగా చూపించి ఆక్వా ధరలను పెంచడం సమంజసం కాదన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రసంగించారు. హైస్కూలు సెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ నాయకులు పాదయాత్రగా నిరసన ప్రదర్శన చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం అందించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి భరత్ భూషణ్, కాశి మునికుమారి, కుడుపూడి బాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, నాయకులు గొవ్వాల రాజేష్, మట్టపర్తి నాగేంద్ర, గొల్లపల్లి డేవిడ్రాజు, షేక్ అబ్దుల్ ఖాదర్, చొల్లంగి సుబ్బరామ్, విత్తనాల మూర్తి, చీకట్ల కిషోర్, సూదా గణపతి, ఉండ్రు వెంకటేష్, గుత్తుల రాజు, పొగాకు శ్రీను, సాకా ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. సర్కారు తీరుపై వైఎస్సార్ సీపీ నిరసన పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని నినాదాలు రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టీకరణ కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
సమస్యలు పరిష్కరిస్తాం
డిజిటల్ పేమెంట్ల వలన కొంత మంది భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. వారికి సహాయం చేసేందుకు కౌంటర్లలో పది మంది సిబ్బందిని అదనంగా నియమించాం. సత్రాల వద్ద వ్రతం, ప్రసాదం, దర్శనం టికెట్లు పొందేందుకు కియోస్క్లు ఏర్పాటు చేశాం. వైఫై సదుపాయం కోసం రూటర్లు ఏర్పాటు చేశాం. సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలకు లేఖలు రాయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. ఈ సమస్యలన్నీ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
దాడి ఘటనలో వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు
కోటనందూరు: తండ్రి, కొడుకుపై దాడి చేసిన నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కేఏ మల్లవరం గ్రామానికి చెందిన గాడి సూర్యప్రకాష్ తనపై, తన కుమారుడు మణికంఠ ఈశ్వర్పై కత్తి పీటతో దాడి చేసి గాయపర్చాడని రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన లెక్కల సత్యనారాయణ 2021లో కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపారు. బుధవారం పిఠా పురం అసిస్టెంట్ సెషన్స్ కోర్డు జడ్జి ఎం.బాబు కేసు విచారించి నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రయాణికుల ఆటో బోల్తా నిడదవోలు రూరల్: నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం ప్రయాణికులతో వెళుతున్న ఆటో మండలంలోని తాళ్లపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఆటోలోని ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపట్టారు. ఆటోలో సుమారు 15 మంది ప్రయాణించడంతో పాటు రోడ్డు మార్జిన్ దిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 25 నుంచి శాప్ అకాడమీ ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శాప్ అకాడమీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వెయిట్ లిిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో క్రీడలకు బాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్లలోపు బాలికలు అర్హులన్నారు. 25న డీఎస్ఏ కాకినాడలో వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్లోనూ, 26న హాకీలోను, 28న ఖోఖో ఎంపికలు జరుగుతాయన్నారు. వివరాలకు 94400 31601ను సంప్రదించాలన్నారు. తిరుపతిలో.. తిరుపతిలోని శ్రీనివాస కాంప్లెక్స్లో బ్యాడ్మింటన్ బాలురు–10, బాలికలు–10 క్రీడాకారులకు ఈ నెల 21న, బాక్సింగ్లో 15 మంది బాలురకు ఈ నెల 22న, వెయిట్ లిఫ్టింగ్లో 15 మంది బాలురకు ఈనెల 23న, రైఫిల్ షూటింగ్, లాన్టెన్నిస్లో ఒక్కొక్క క్రీడలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ఈ నెల 24న జరుగుతాయన్నారు. విశాఖలో... విశాఖ కొమ్మాడి ఎస్కేపీలో ఈ నెల 29న అథ్లెటిక్స్లో 15 మంది బాలురకు, 30న సైక్లింగ్లో 15 మంది బాలురకు, 31న వాటర్ స్పోర్ట్స్లో 15 మంది బాలురకు ఎంపికలు నిర్వహిస్తున్నారన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత అర్హత పత్రాలతో ఉదయం 7 గంటకు హాజరుకావాలని తెలిపారు. సొసైటీ పెట్రోల్ బంక్ సొమ్ము స్వాహా! తాళ్లపూడి: మలకపల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో సుమారు రూ.22.40 లక్షలు స్వాహా అయ్యాయని, బంక్లో పనిచేస్తున్న గుమస్తా, సొసైటీలో పనిచేస్తున్న మరో వ్యక్తి కలిసి ఈ నిధులను దారి మళ్లించినట్టు తెలుస్తోంది. రోజు వారీ అమ్మకాలు చేయగా వచ్చిన నగదును సొసైటీలో జమ చేయాల్సి ఉండగా, వారు కొంత సొమ్మును దఫదఫాలుగా వాడుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలు ఇటీవల జరిగిన ఆడిట్లో బయట పడ్డాయి. దీనిపై సహకార సంఘ డీఆర్ ఎం.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయన్నారు. డిపార్టుమెంట్ ద్వారా రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. కాగా.. దీనిపై తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
పర్యవేక్షణా లోపంతోనే మట్టి అక్రమ దందా
రంగంపేట: అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మట్టి అక్రమ దందా నిరాటకంగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలోని పాపాయి చెరువులో కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే చెరువులోని మట్టిని స్ధానిక రైతులు తమ సొంత భూమిలో మెరక చేసుకోవడానికే ఉపయోగించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు బయట ప్రాంతాలకు తరలించి రూ.లక్షల రూపాయలు దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతులు పొందిన 30 రోజుల్లోపు చెరువులోని సిల్టును తీసి పొలాల్లో మెరక చేసుకోవాలి, లేదంటే అనుమతులు రద్దు అవుతాయి. కానీ ఇక్కడ అనుమతుల గడువు తీరిపోయినా రోజుల తరబడి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. చెరువులోని మట్టిని గరిష్టంగా 3 వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికే అనుమతి ఉంది. కానీ పాపాయి చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వి అమ్మకాలు సాగించినట్టు చెబుతున్నారు. కాగా.. దీనిపై తహసీల్దార్ అనసూయ మాట్లాడుతూ పాపాయి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న లారీలను, జేసీబీలను సీజ్ చేసి తమ కార్యాలయ ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యల కోసం రాజమహేంద్రవరం ఏడీ మైనింగ్ అధికారులకు నివేదిక అందించామని, వారు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. -
వరి రైతుకు కాస్త ఊరట
సాక్షి, అమలాపురం: ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.72 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సాధారణ రకం ధాన్యం క్వింటాల్ రూ.2,369 ఉండగా, పెంచిన ధరతో ఇది రూ.2,441 కు పెరిగింది. గ్రేడ్ – ఏ ధాన్యం ధర రూ.2,489 ఉండగా పెంచిన ధరతో రూ.2,461కు చేరింది. ఈ ధరలు వచ్చే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు నుంచి అమలులోకి రానున్నాయి. కోనసీమ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో వరి సాగు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 1,31,500 ఎకరాలలో వరి సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటించినట్టు చెబుతోంది. వాస్తవంగా రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో వరి పెట్టుబడి అధికంగా ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో వ్యవసాయ రుణాల కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ టెక్నికల్ కమిటీ నిర్ధారించిన పెట్టుబడి ఖరీఫ్లో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేలు. ఖరీఫ్ సగటు దిగుబడి 29 బస్తాలు అంటే (21.75 క్వింటాళ్లు). అంటే క్వింటాల్ ఉత్పత్తికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,528. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తానన్నది రూ.2,441. అంటే ఖరీఫ్ సాగు చేస్తే రైతులకు మిగిలేది ఏమీలేదనే. కేంద్రం చెబుతున్న పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలంటే క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.3,792 ప్రకటించాలని కోనసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.72 పెంపు -
20న మెడికల్ దుకాణాల బంద్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మందుల అంగడి వ్యాపారమైపోయిందని, ఆన్లైన్లో మందుల విక్రయాలతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు కృష్ణానగర్లోని డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఆలిండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయానుసారం ఈ నెల 19 తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు మందుల దుకాణాల బంద్ నిర్వహించనున్నామన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లను ఆపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నామన్నారు. మందుల దుకాణదారులందరూ దీన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లా బాల, కార్యదర్శి ఫణీంద్ర, మందుల వర్తకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో.. అమలాపురం టౌన్: కెమిస్ట్ల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 20న జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీఎస్ శ్రీనివాసమూర్తి, కార్యదర్శి వీవీఎస్ మూర్తి వెల్లడించారు. అమలాపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బంద్ విషయాలను వివరించారు. ఆ రోజు జిల్లాలోని దాదాపు వెయ్యి మందుల షాపులు మూతపడనున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల ద్వారా మార్కెట్ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ కోశాధికారి బీఎస్ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ.. జ్ఞాన సముపార్జన
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● వివిధ అంశాలపై అవగాహన ● ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటున్న వైనం తుని రూరల్: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ అంశాలపై శిక్షణ పొందుతూ విజ్ఞానం పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్లో టైపింగ్, పరికరాలు (టూల్స్), పెయింటింగ్పై శిక్షణ ఇస్తున్నారు. డి.పోలవరం, కొలిమేరు, ఎన్.సూరవరం, ఎస్.అన్నవరం, తేటగుంట పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ జరిగే ఈ శిక్షణను ఒక్కొక్క పాఠశాలలో 15 నుంచి 20 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ఆరో తరగతి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత చదువుల్లో మరింత వేగవంతంగా కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పట్టు సాధిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.డి.పోలవరం హైస్కూల్లో పెయింటింగ్ నేర్చుకుంటున్న విద్యార్థులు కంప్యూటర్పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు -
శ్రీ ప్రకాష్ విద్యార్థుల విజయకేతనం
బాలాజీచెరువు (కాకినాడ): సీబీఎస్ఈ ప్రకటించిన ప్లస్ – 2 ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ ప్రకాష్ తెలిపారు. ఎంఈఏ గ్రూపులో కె.లాస్య మేఘన 479/500, బైపీసీలో బి.స్పృహ 471/500, ఎంపీసీలో వి.లక్ష్మీనారాయణ 454/500, బీఈఏలో కె.అన్విత 420/500 మార్కులు సాధించి అగ్రస్థానాల్లో నిలిచారన్నారు. నూటికి నూరుశాతం ఉత్తీర్ణతా శాతంతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఆ విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. 15న కాకినాడలో ధర్నా రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సమస్యలను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులు గాలికి వదిలేస్తున్నారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం వెంటూరులో మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సంఘ తరఫున అనేకసార్లు విన్నవించినా ఫిర్యాదులను కార్యాలయ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని దివ్యాంగులు కాకినాడలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ఈ నెల 15న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కె.లాస్య మేఘన బి.స్పృహకె.అన్విత వి.లక్ష్మీనారాయణ -
తిరుగు ప్రయాణంలో విషాదం
● పెళ్లి బృందం వెళుతున్న వ్యాన్ బోల్తా ● 16 మందికి గాయాలు ● ఆస్పత్రికి వెళ్లే సరికి వారిలో ఒకరి మృతి ● క్షతగాత్రులకు పెద్దాపురం సీహెచ్సీలో చికిత్స ● మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలింపు గండేపల్లి/సామర్లకోట: వారందరూ ఎంతో సంతోషంగా శుభకార్యానికి హాజరయ్యారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపి, భోజనాల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి పామాయిల్ తోటలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రికి వెళ్లే సరికి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం ఆర్బీపట్నానికి చెందిన కొల్లు సత్యకు గండేపల్లి మండలం యల్లమిల్లికి చెందిన బుంగా సతీష్తో బుధవారం యల్లమిల్లిలో వివాహం జరిగింది. ఈ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు వ్యాన్లో వచ్చారు. తిరుగు ప్రయాణంలో గండేపల్లి మండలం పి.నాయకంపల్లి శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో టర్నింగ్ వద్ద వ్యాన్ అదుపుతప్పి ఆయిల్ పామ్ తోటలోకి పల్టీలు కొట్టుకొంటూ దూసుకుపోయి ఆగింది. బాధితుల ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో వెళుతున్న ఇతర ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్తో కలిపి వ్యాన్లో 16 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గరు పురుషులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 14 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్షతగాత్రులకు వైద్యం అందించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి తెలిపారు. సీహెచ్ జ్యోతిబాబు, డి.హర్ష, ఆర్.ప్రవీణ్ కుమార్, ఎ.లోవకుమారి, ఆర్.మారియ్య, పి.లోవలక్ష్మి, ఎం.చంద్రావతి, ఎ.వీరదుర్గాప్రసాద్, ఎస్.వెంకటలక్ష్మి, ఎం.బుజ్జి, కె.ఏసురత్నం, కె.సూరిబాబు, సంజన, ఎస్.సురేంద్రలకు వైద్యం అందించామన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే సుశాంత్ కుమార్ (14) మృతి చెందాడన్నారు. మిన్నంటిన రోదనలు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం బుధవారం సాయంత్రం క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో నిండిపోయింది. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్, పెద్దాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్తో కలిసి సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై వి.మౌనిక, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. -
పీఎం సూర్య ఘర్తో స్వయం సమృద్ధి
అమలాపురం రూరల్: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా మునిసిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీ ఈపీడీసీఎల్, మున్సిపల్ కమిషనర్, ఎల్డిఎంతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి పీఎం సూర్య ఘర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమలాపురం నడిపూడి సమ్మర్ స్టోరేజ్ చెరువు వద్ద నున్న రెండు ఎకరాల విస్తీర్ణంలో 500 కిలో వాట్ యూనిట్ ఏర్పాటుపై పై చర్చించారు. ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ బి రాజేశ్వరి, మునిసిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, ఇంజినీర్లు, నెడ్క్యాప్ ప్రతినిధులు ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. చెత్తను వేరు చేయాలి చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులకు సూచించారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ శానిటైజేషన్ వెబినార్ కలెక్టర్లతో బుధవారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ చెత్త సేకరణ మూడు రకాలుగా చేపట్టాలన్నారు తడి, పొడి చెత్త, హాని కర వ్యర్థాలు విడివిడిగా సేకరించాలన్నారు. పనివేళలను మార్చాలి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా, కార్మికుల ఆరోగ్య, ప్రాణ రక్షణ కోసం పనివేళలను మార్పు చేయాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పనులను తగ్గించాలన్నారు. ప్రతి పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పాడి పరిశ్రమపై సమీక్ష పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, సొసైటీలు పాటుపడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశు దాణా విక్రయాలు, పాల దిగుబడి పెరుగుదల అంశాలపై సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా, రైతుల సేవే పరమావధిగా సొసైటీల ద్వారా ఈ మల్టీ–గ్రేడ్ దాణాను విక్రయిస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ అనిత, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ, రోళ్లపాలెం సొసైటీ అధ్యక్షుడు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్రావు, వివిధ డైరీ ఫామ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ నిరసన
కొత్తపేట: ఆక్వా ఫీడ్ ధరలు అధికంగా పెంచడం, ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేయడం వంటి అంశాలకు సంబంధించి రైతుల తరఫున వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అమలాపురం హైస్కూల్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో రైతులు అయోమయ పరిస్థితులకు లోనయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. రబీ వరి కొనుగోలులో ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు. రెండో ఘాట్ రోడ్డు సిద్ధం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం రెండో ఘాట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాలుగా లోవ దేవస్థానానికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగానే భక్తులు, వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా వాహనాలు, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆషాఢ మాసం, ఇతర పర్వదినాల్లో ఘాట్ రోడ్డులో తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలన్న ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తిపై డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు రూ.70 లక్షలు అందించడంతో రెండో ఘాట్ రోడ్డు నిర్మించారు. దీనిని అధికారికంగా ప్రారంభించాల్సి ఉండగా.. ట్రయల్ రన్గా కొండపై నుంచి దిగువకు వెళ్లే వాహనాలను ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. కొమరిపాలెం పంచాయతీకి ఐఎస్వో గుర్తింపు అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపుగా ఇచ్చే ఐఎస్వో సర్టిఫికెట్కు ఎంపికయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో కొమరిపాలెం గ్రామం మొదటగా ఈ పురస్కారానికి ఎంపికై నట్టు పంచాయతీ ప్రత్యేకాధికారి వి.నాగేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. కేరళకు చెందిన ప్రత్యేక ఆడిట్ బృందం సోమ, మంగళవారాలలో గ్రామంలో పర్యటించింది. ఆడిట్ బృంద సభ్యులు కేఎం సలీమ్ ఆధ్వర్యంలో విజయవాడ పీఆర్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది కళ్యాణి తదితరులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, పంచాయతీ కార్యాలయ ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. గ్రామస్తుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించిన బృంద సభ్యులు పంచాయతీ పనితీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించి ఐఎస్వో సర్టిఫికెట్కు ఎంపిక చేసినట్టు ప్రత్యేకాధికారి తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన స్థానిక నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఎం చిన్ని, డి రాము, లచ్చిరెడ్డి అపర్ణ, వీఆర్వో శివకుమార్, సచివాలయ సిబ్బందిని అభినందించారు. -
ప్రభుత్వ దన్నుతోనే..
‘‘అప్సడాకు కనీస సమాచారం లేకుండా.. కంపెనీలు ఇష్టానుసారం మేత ధరలు పెంచారంటే వారికి ప్రభుత్వ దన్ను ఉండడమే కారణం’ అని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారిని అన్నిరకాలుగాను మోసం చేసిందని మండిపడ్డారు. అమలాపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వనామీ రొయ్యల సీడ్, ఫీడ్ అమ్మేవారు, రొయ్యలు కొనుగోలు చేసేవారు కోట్ల రూపాయల లాభాలు చూస్తుంటే పంట సాగు చేస్తున్న రైతులు మాత్రమే నష్టపోతున్నారన్నారు. రెండు పంటలు పోయినా కనీసం ఒక్క పంట చేతికి వచ్చినా ఎంతో కొంత లాభాలు చూడవచ్చని ఆశతో సాగు చేస్తుంటే రైతుల మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నవారు నిలువునా దోపిడీ చేయడం అన్యాయమన్నారు. విదేశీ మారకద్రవ్యం అందించే వనామీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని బాబి హితవు పలికారు. – జిన్నూరి రామారావు (బాబి) -
ఫీడ్ ధరలు ఆక్వాకు గుదిబండ
● తగ్గించవలసిందే ● మాజీ ఎంపీ చింతా అనురాధ అల్లవరం: కంపెనీలు ఫీడ్ ధరలు పెంచడం ఆక్వా రంగానికి గుదిబండగా మారతాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ అన్నారు. అల్లవరం మండలం మొగళ్ళమూరులోని ఆమె నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు ఫీడ్ ధరలు పెంచిందన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)తో సంబంధం లేకుండా ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా టన్నుకి రూ.8,420, టైగర్ రొయ్యల మేత రూ.10,530 చొప్పున పెంచాయన్నారు. పాలకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా రొయ్యల ఎగుమతులు నిలిచిపోతే నిర్ణయించిన ధరలకే రొయ్యలను కొనుగోలు చేసేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకొన్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఒక్క రూపాయి పెంచలేదని గుర్తు చేశారు. -
కొనసాగుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలు ˘
అయినవిల్లి: మండలంలోని అయినవిల్లి–నేదునూరు గ్రామంలోని కుమ్మరికాలువకు అనుకుని కొందరు రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. దీనిపై సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాత్రి వేళల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ఈ చర్యలను నిలువరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రశాంగా ఏపీ ఈఏపీ సెట్ అమలాపురం రూరల్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించ ఏపీ ఈఏపీ సెట్ (ఎంసెట్) పరీక్షలు అమలాపురంలో మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్లలో 166 మందికి 160 మంది పరీక్షలు రాశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కో ఆర్డినేటర్ అడబాల కుమార్, ఏవో జక్కం కృష్ణారావు తెలిపారు. తొలిరోజు 96 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు వారు తెలిపారు. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏసీబీ వలలో మున్సిపల్ డీఈ రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ డీఈ కె.శశిధర్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్ కాంట్రాక్టర్ కనూరి పవన్కుమార్కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ డీఈ తన అసిస్టెంట్ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. -
‘బొండాలు’ను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సాక్షి, అమలాపురం: కనీస మద్దతు ధరకు తమ వద్ద ఉన్న బొండాల రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతు సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఎద్దేవా చేశారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నో కష్టాలు పడి, అప్పులు చేసి మరీ రైతులు పంట పండిస్తే అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి జిల్లాలో బొండాల రకం ధాన్యాన్ని ఎక్కువ పండించారు. వీటిని కొనుగోలు చేయాలంటే రైసు మిల్లర్లు సిండికేటుగా మారి కొనడం లేదని ఇజ్రాయిల్ ఆరోపించారు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా యూనిట్గా కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను యూనిట్గా పరిగణించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే అకాల వర్షం వల్ల రైతులు దెబ్బతిని ఉన్నారని, ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏరువాకకు ఎరువేదీ?
సమంజసం కాదు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యేటా ఎరువుల ధరలను పెంచడం సరికాదు. దీనివల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి ధాన్యంబస్తాపై అదనపు ధర సౌకర్యం కల్పించాలి – గుణ్ణం రాంబాబు, వరి రైతు, మాజీ సర్పంచ్, గుమ్మిలేరు, ఆలమూరు మండలం పాత నిల్వలను ప్రదర్శించాలి ఎరువుల ధరలు పెరుగుతాయన్న వార్తల దృష్ట్యా ఇప్పటి వరకూ ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలి. దీనివల్ల అవసరమైన రైతులు ఎరువులను కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ విధానాన్ని జిల్లా వ్యవసాయశాఖ సమగ్రంగా అమలు చేయాలి. – ముదునూరి సత్యనారాయణరాజు, రైతు, ఆత్రేయపురం ఆలమూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను భారీగా పెంచేసింది. వాటి ధరలు పెంచుతున్నంత వేగంగా ధాన్యం ధర పెంచాలని కనీసం ఆలోచించకపోవడం శోచనీయం. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక అన్నదాత నానా అవస్థలు పడుతున్నాడు. ధాన్యం మసూళ్లు సమయంలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నా.. చంద్రబాబు సర్కార్ పంటల బీమా తొలగించి తీరని అన్యాయం చేస్తున్నా కనీసం ప్రశ్నించేవారు లేకపోవడం బాధాకరం. అర్హులైన అనేక మంది రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ యోజన అందజేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 400 టన్నుల ఎరువుల నిల్వల్లో సగానికి పైగా విక్రయించినట్టు వ్యవసాయశాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. విక్రయించినట్టు చూపించిన ఎరువులను రాబోయే ఖరీఫ్ సీజన్లో కొత్త ధరలతో విక్రయించి వ్యాపారులు దోచుకుంటారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ సైతం అంతగా స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు ముందే ధరల పెంపు ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో 1.32 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టేందుకు సుమారు 88.74 వేల మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. మూడేళ్లుగా వరికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. ప్రస్తుత ఏడాదైతే రూ.75 నుంచి రూ.300 వరకూ ధర పెరిగింది. ఈ ఖరీఫ్ సీజన్కు యేటా మాదిరిగానే సుమారు 43.25 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా వరి రైతులపై సుమారు రూ.11.80 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం డీఏపీ, యూరియాకు భారీగా అందిస్తున్న రాయితీని ఈ ఖరీఫ్ సీజన్లో ఉపసంహరించుకునే పరిస్థితి ఉందనే సమాచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పాత నిల్వల పరిస్థితి ఏంటి? జిల్లాలో గత రబీ సీజన్లో సరఫరా చేసిన ఎరువుల్లో అత్యధిక భాగం ప్రైవేటు డీలర్లు, సొసైటీల వద్ద నిల్వ ఉండిపోయాయి. అయితే ఆ ఎరువులను పాత ధరలకు విక్రయించాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకునేలా వ్యవహరించడం లేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 166 సొసైటీలతో పాటు ప్రైవేట్ ఎరువు, పురుగు మందుల దుకాణాల వద్ద సుమారు 15 టన్నుల వరకూ ఎరువుల నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాబోయే సీజన్లో రైతుల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని పాత ధరల ఎరువులను కొత్త ధరలకు విక్రయిస్తారేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత ఎరువుల నిల్వలు, ధరల పట్టికను ఆయా సొసైటీల వద్ద, ఎరువులు దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుకు భారంగా ఎరువు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చడీ చప్పుడు కాకుండా ఒకేసారి ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారాయి. రబీ సీజన్ ముగిసిన వెంటనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఈ ఎరువుల ధరలను ఉద్దేశపూర్వకంగా పెంచి అధికభారం మోపాయనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డీఏపీ, యూరియా ధరల్లో మార్పులు ఉండవని చెబుతున్నా, నియంత్రణలో లేని మిగిలిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు బారీ స్థాయిలో పెరిగాయి. ఈ కాంప్లెక్స్ ఎరువుల పెరుగుల వల్ల అన్నదాతకు ఎకరాకు రూ.రెండు వేల వరకూ పెరిగిపోతుంది. మరోసారి పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.75 నుంచి రూ.300కు చేరిక అన్నదాతలపై రూ.11.80 కోట్ల భారం పాత ఎరువులను కొత్తవాటితో కలిపి విక్రయించేలా వ్యాపారుల చర్యలు పట్టించుకోని జిల్లా వ్యవసాయ శాఖ -
మార్పులకు గ్రీన్ సిగ్నల్
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ ఆగ్మంటేషన్ డ్రైవ్ ’ (ప్రసాద్’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, టూరిజం శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా భవన నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. -
ఉరిమే ఉత్సాహంపై.. లీక్ పిడుగు
● నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థుల్లో నిరుత్సాహం ● తాము పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన బాలాజీచెరువు (కాకినాడ): వైద్యవిద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎల్జిబుల్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేయడంతో అటు విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కొన్నేళ్లుగా శిక్షణ తీసుకొని ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన వారు మరికొన్ని రోజుల్లో ఫలితాలు వెలువడుతాయని ఎదురుచూస్తున్నారు. ఈ దశలో పేపర్ లీక్ కావడంతో మొత్తం పరీక్షనే రద్దు చేశారని సమాచారం రావడంతో నిరుత్సాహ పడ్డారు. తాము పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. మళ్లీ సన్నద్ధం కావాలా అన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్షకు కాకినాడ జిల్లాలో 3,126 మంది దరఖాస్తు చేసుకోగా 3,080 మంది పరీక్ష రాశారు. Mö™èl¢ ç³È„> ™ól©-ÌS¯]l$ ˘ ప్రకటించాలి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం. – మతుకుమిల్లి శ్రీవిజయ్ చాలా బాధాకరం నా పేరు ఎండీ ఫాజీలా బేగం. నేను రెండు సంవత్సరాల నుంచి నీట్కి ప్రిపేర్ అయి, మే 3న జరిగిన ఎగ్జామ్ చాలా బాగా రాశాను. నాకు 600 మార్కులు వస్తాయని చాలా కాన్ఫిడెంట్గా వున్నాను. ఐతే ఎవరో చేసిన తప్పుకి నేను మళ్లీ ఎగ్జామ్ రాయాల్సి రావడం నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటుందని ఆశిస్తున్నాను. – ఎండీ ఫాజీలా బేగం, కాకినాడ ఆందోళనకరం నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్ ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 3వ తేదీన రాజమహేంద్రవరం కేంద్రంగా 8 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. నీట్కు జిల్లావ్యాప్తంగా 5వేల నుంచి 6 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి నీట్ 2026కు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితులను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కోచింగ్లు, ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరిస్తూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరీక్ష రద్దు కావడం వారిలో ఆందోళన రేకెత్తించింది. అసలు లీకేజీ ఎలా జరిగింది?, ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి బయటకు వెళ్లింది? పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయా? వంటి అంశాలపై పారదర్శక దర్యాప్తు జరిపి నిజాలను బయట పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
కలెక్టర్ లేని మీటింగ్ ఎందుకు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు. సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. MýSÌñæ-MýStÆŠ‡ çÜÐ]l*-Ðól-Ô>-°MìS Æ>¯]l…-§ýl$MýS$ °Æý‡çÜ-¯]lV> ¯ólÌSOò³ MýS*Æý‡$a¯]l² ˘ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రావు, కోనసీమ జిల్లా జెడ్పీటీసీ సభ్యులుసమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం వాడీ వేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్ ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. -
హక్కుల సాధన కోసమే పోరాటం
● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ ● అమలాపురంలో మొదలైన మహాసభలు ● ఎర్ర జెండాలతో హోరెత్తిన మహా ప్రదర్శన అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మికుల్లో ఐక్యత కోసం, కార్మిక హక్కుల సాధన కోసం జాతీయ, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో 30వ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఏర్పాట్లు చేసింది. పుర వీధుల్లో సంఘం మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక ప్రతినిధులు 30వ కవాతు నిర్వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, చైతన్య, రాష్ట్ర కార్యదర్శులు కె.లోకనాధం, వి.వెంకటేశ్వర్లు ప్రసంగించి వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు పలు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కార్మిక ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. చివరిగా సభా వేదికపై వారంతా సంఘీభావం ప్రకటించారు. -
అర్జీలు ఫుల్.. పరిష్కారం సోసో
● పీజీఆర్ఎస్పై అర్జీదారుల అసంతృప్తి ● క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు అమలాపురం రూరల్: సమస్యలపై పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించడమే తప్ప పరిష్కారాలు చూపడం లేదని ప్రజలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల, పట్టణ కేంద్రాల్లో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కలెక్టరేట్కు వచ్చి అర్జీ ఇస్తున్నా అదే తంతు నడుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో అర్జీదారులు పోటెత్తారు. జేసీ వైఖోమ్ నిడియాదేవి తదితర అధికారులు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 165 అర్జీలు స్వీకరించారు. పింఛన్ ఇప్పించండి 25 ఏళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాను. 2004 వరకు ప్రభుత్వ పింఛను వచ్చేది. నాపై హత్య కేసు నమోదు కావడంతో పింఛను నిలిపివేశారు. ఆ కేసును 2012లో కోర్టు కొట్టేసింది. 2014 నుంచి పింఛను కోసం తిరుగుతున్నా మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. పింఛను ఇప్పించి ఆదుకోవాలి. – ఆచంట కృష్ణమూర్తి, బి.సావరం, రాజోలు ఉపాధి పనులు నిలిపివేయాలి వరికోతలు, ఊడ్పులు సమయంలో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేయాలి. ఎండిన ధాన్యాన్ని, గడ్డిని ఒబ్బిడి చేసుకునేందుకు కూలీలు దొరకడం లేదు. ఆ కాలంలో ఉపాధి పనులకు విరామం ప్రకటించాలని జీవో ఇచ్చినా అమలు కావడం లేదు. భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్లో కలెక్టర్, జేసీ, డ్వామా పీడీలకు వినతి పత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. – ఉప్పుగంటి భాస్కరరావు, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నా స్థలం ఆక్రమించి ప్రహరీ కట్టారు నేను ఒంటరి మహిళను. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తు న్నా. ఓదూరులో నాకు పెంకుటిల్లు ఉంది. ఈశాన్యంలో పది అడుగులు వదలి ఇల్లు నిర్మించాను. జీవనోపాధి నిమిత్తం ఏడేళ్లు గ్రామంలో లేను. ఇటీవల ఇంటికి వచ్చి చూడగా ఇంటి పక్కన ఉన్న కడిం శ్రీను, కడిం నాగలక్ష్మి నా స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ కట్టారు. అదేమని ప్రశ్నిస్తే నాపైనే దౌర్జన్యం చేసి రాకపోకలను అడ్డుకునేలా రాళ్లు, కంకర వేస్తున్నారు. నిన్ను చంపినా అడిగే దిక్కు లేదంటూ బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించాను. – కలవల సత్యవతి, ఓదూరు, రామచంద్రపురం డ్రెయిన్తో ఇబ్బందులు అమలాపురం పట్టణం 12వ వార్డులో డ్రెయిన్లో పూడికలు తీయకపోడం వల్ల నీరు పొంగి దోమలు వ్యాపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. వైద్యనాథం వీధిలో ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల వాసన వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రాంతంలో హోల్సేల్ వ్యాపారుల వల్ల వాహనాల రద్దీ అధికంగా ఉండి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. – షేక్ ఖాజాబాబు, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అమలాపురం పట్టణం -
బొండాలు ధాన్యం కొనకుంటే ఆందోళన
● కోనసీమ రైతు పరిరక్షణ సమితి ● కలెక్టరేట్ వద్ద పారబోస్తామని హెచ్చరిక అమలాపురం రూరల్: జిల్లాలో రబీలో రైతులు పడించిన బొండాలు రకం వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే రైతులు పడించిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి కలెక్టరేట్ వద్ద పడేసి నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద వారు నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మనందం, ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు అధ్వర్యంలో రైతు ప్రతినిధులు జేసీ నిడియాదేవిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మండపేట రైస్ మిల్లుల్లో గతంలో ధాన్యం కోనుగోలు జరిగేదని, జిల్లా విభజనతో మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కలవడం వల్ల సమస్య వస్తోందన్నారు. రైతు నాయకులు చిక్కం పెద్దబ్బులు, జిన్నూరి వెంకటేశ్వరరావు, ఆకుల లక్ష్మణరావు, ఆకుల శేషనాయుడు, టీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడియం రైల్వే గేటు మూసివేత కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. -
కాలుష్యానికి కారకులను శిక్షించాలి
● దేవి ఫిషరీస్ వద్ద పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తుల ఆందోళన ● అస్వస్థతకు గురైన పలువురు ఆస్పత్రుల్లో చేరిక తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి వస్తున్న కలుషిత జలాలు కాలువలోకి వదలడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తులు సోమవారం స్థానిక దేవి ఫిషరీష్ వద్ద ఆందోళన చేసి బాధ్యులను శిక్షించాలని, ఆయా కంపెనీలపై అధికారులు దృష్టి సారించాలని నినాదాలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు పాలెపు పోశియ్య, గ్రామ పెద్దలు పంట కాలువ చెంతనే ఉన్న కంపెనీలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు మూడు రోజులుగా గ్రామంలో సుమారు 30 మంది వివిధ ఆస్పత్రిలలో వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోరంగిలో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంటు నుంచి పంటకాలువలోకి విడుదలైన కలుషిత జలాలు -
మొక్కజొన్న, అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
● వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరపు, జిన్నూరి ● వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన అయినవిల్లి: మొక్కజొన్న, అరటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాబు ధర ప్రకటించాలని, తుపాను, అకాల వర్షాలకు దెబ్బతిన్న ఆయా పంటల రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి రామారావు (బాబి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని తొత్తరమూడి కె.పెదలంకలో తుపాను, వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు గుత్తాల బాబురావు, రేవు రాంబాబు, బొక్కా సత్యనారాయణ, మద్దా వెంకటలక్ష్మి తదితరులు పాడైన పంటలను వారికి చూపించారు. ఈ ఏడాది మొక్కజొన్న ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, అరటి సైతం బాగుందని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అయినకాడికి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2400 చెల్లించే వారని ఈ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1700 మాత్రమే చెల్లింస్తున్నారన్నారు. అరటి గెల మార్కెట్లో రూ.400 వరకూ పలికేదని ఇప్పుడు రూ.50కి కూడా కొనావారు లేరన్నారు. ఇంతలా నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు చూస్తోందని మండి పడ్డారు. తక్షణం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంటల బీమాకు కేంద్ర ప్రభుత్వం, రైతులు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమవాటా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. దీంతో బీమా సంస్థలు పంటల బీమాకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో అయినవిల్లి, పి.గన్నవరం మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసబాబు, యన్నబత్తుల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ కొర్లపాటి కోటబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు రెడ్డి గనిరాజు, కోట విజయరాజు, గుత్తుల నాగబాబు, మిండగుడిది శిరీష్ నారాయణస్వామి, కుడుపూడి రామకృష్ణ, మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్కుమార్, మతుకుమిల్లి సత్తులు తదితరులు ఉన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 28 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 28 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి గ్రీవెన్స్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటంబ తగదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలే ఉండడంతో వారికి ఎస్పీ, ఏఎస్పీలు కౌన్సిలింగ్ చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నించారు. గోదావరిలో యువకుని గల్లంతుయానాం: తన స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన యువకుడు గోదావరిలో గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన ఇంటర్మీడియెట్ చదువుతున్న 18 ఏళ్ల సాహెద్ అబ్దుల్ పైజాన్ తన స్నేహితులు 11 మందితో కలిసి నాలుగు బైక్లలో యానాంకు వచ్చారు. పట్టణాన్ని సందర్శించి అనంతరం గౌతమీగోదావరిలో శివంబాత్ వద్ద గోదావరిలో స్నానానికి దిగారు. షేక్ పైజాన్ గల్లంతుకావడంతో ఆందోళన చెందిన మిగిలివారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అతని తల్లిదండ్రులు, బంధువర్గం ముమ్మిడివరం కొత్తలంక బాబా దర్శనానికి వెళ్లారని, తాను రానని చెప్పి వారికి చెప్పకుండా యానాం వచ్చాడని స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని డ్రైన్లు బాగు చేస్తాం మలికిపురం: రైతుల పాలిట దుఃఖదాయనిగా మారిన శంకరగుప్తం మేజరు డ్రైన్ ఆధునికీకరణతో పాటు దాని అనుబంధ మీడియం, మైనర్ డ్రైన్లను సైతం మరమ్మతు చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. శంకరగుప్తం మేజరు డ్రైన్ పూడికత తీత పనులను సోమవారం కేశనపల్లిలో ప్రారంభించారు. గత ఏడాదిగా డ్రైన్ దుస్థితిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవడంతో డ్రైన్ పూడిక తీత పనులకు ప్రభుత్వం రూ.20.77 కోట్లు విడుదల చేసింది. ‘ముంచెట్టుతోంది’ శీర్షికతో సోమవారం సాక్షిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దశల వారీగా అనుబంధ డ్రైన్లు బాగు చేస్తామని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని ఆయన వేదికపై ప్రకటించారు. రాజోలు దీవిలో 60 గ్రామాల్లోనూ ఉప్పునీటి బారిన పడి రైతులు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ధవళేశ్వరం ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేశనపల్లిలో పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, డ్రైన్స్ అధికారులు -
సాగుకు సేతు బంధనం!
సాక్షి, అమలాపురం: గడచిన రెండేళ్లుగా జిల్లాలో ముందస్తు ఖరీఫ్కు అడ్డంకులు తప్పడం లేదు. ఈ ఏడాదైనా కుదురుతుందా అనుకుంటే వంతెనల నిర్మాణం పేరుతో మరోసారి ముందుస్తు సాగుకు బ్రేకులు పడనున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ను గట్టెక్కించడం.. రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం.. మూడో పంటగా అపరాలు సాగు చేయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో ఖరీఫ్. తొలి ఖరీఫ్ సమయానికి కూటమి అధికారంలోకి వచ్చినా కొలువుదీరలేదు. రెండోసారి అంటే గత ఏడాది కూడా జూన్ 1న నీరు వదిలి మమ అనిపించారు. తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 100 క్యూసెక్కులు వదిలారు. ఆత్రేయపురం మండలం లొల్ల సమీపంలో 15 రోజుల పాటు నీరు నిలిపివేశారు. అమలాపురం ఈదరపల్లి వద్ద, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణం పేరుతో అటు చల్లపల్లి, ఇటు అల్లవరం బెండా కాలువకు నెలాఖరు వరకు నీరు వదల్లేదు. సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు. ఇప్పుడు ఆలస్యమే ఆర్అండ్బీ అధికారుల తీరు వల్ల ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని మూడు వంతెనల నిర్మాణానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ మూడు వంతెనలు బెండాకెనాల్ (నడిపూడి నుంచి అల్లవరం కాలువ) మీదనే. ఈదరపల్లి పాత వంతెనను ఆధునీకరించడంతో పాటు ఇందుపల్లి, అమలాపురం అయ్యప్పస్వామి ఆలయం వద్ద వంతెన పనులు మొదలు పెట్టారు. ఇక్కడ ఎంత వేగంగా పనులు చేసినా నెల రోజుల సమయం పడుతోంది. అంటే జూన్ 15 తరువాత కాని ఈ కాలువ నుంచి దిగువకు నీరు వదిలే అవకాశం లేదు. ఇందుపల్లి వియర్ దిగువన (అమలాపురం, అల్లవరం మండలాలో) సుమారు 14,600 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉంది. ఆక్వా సాగు పోగా సుమారు 8 వేల ఎకరాలలో వరి సాగవుతోందని అంచనా. ఈ చేలకు సకాలంలో నీరందదు. వంతెనల నిర్మాణాలు ఆలస్యమైతే ఇక్కడ సాగు కూడా ఆలస్యంగా మొదలు పెట్టాలి. ఆ పరిస్థితి వస్తే ఈసారి కూడా రైతులు తొలి పంటను వదిలేసుకోవలసిందే. ముందస్తు సాగుకు అడ్డంగా వంతెన నిర్మాణాలు ఈనెల 15 లేదా జూన్ ఒకటి నుంచి నీరు విడుదల అమలాపురం బెండా కాలువపై పనులు అమలాపురం, అల్లవరం మండలాల్లో ఆలస్యం కానున్న సాగు సాగుకు దూరమవుతున్న రైతులు అధికారులదే తప్పంతా మధ్య డెల్టాలో పంట కాలువలను గత నెల 27వ తేదీ కల్లా మూసివేస్తారని తెలుసు. పైగా ఈ ఏడాది మే 15 కల్లా సాగునీరు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని జల వనరుల శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక వేళ మే 15కు అనుమతి రాకున్నా జూన్ 1న అయినా కాలువలు తెరవాల్సి ఉంది. ఆర్అండ్బీ అధికారులు కాలువలకు నీరు వదిలే ముందు తాపీగా పనులు ప్రారంభిస్తుండడం గమనార్హం. ఇందుకు అధికారులు చెప్పే కారణం వంతెనల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆలస్యమైందని. వంతెన నిర్మాణం మంచిదే అయినా ఆ కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టు సకాలంలో సాగునీరు అందించకుండా చేయడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. -
ఆటోడ్రైవర్ నిజాయతీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తన ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును తిరిగి ఆమెకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆటో డ్రైవర్. కోటగుమ్మం సెంటర్ వద్ద ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు. -
ఉష్ణతాపం నుంచి ఉపశమనం
తుని రూరల్: పగలంతా తీవ్రమైన ఉష్ణతాపంతో అల్లాడిన తుని మండల ప్రజలు.. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో సేద తీరారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే కారు మబ్బులు కమ్ముకున్నా వర్షం కురవ లేదు. ఉదయం ఏడు గంటల తర్వాత సూర్యుడు భగభగమంటూ ప్రతాపం చూపించాడు. ఉష్ణోగ్రత గరిష్టంగా 34, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. దీంతో, ప్రజలు ఆపసోపాలు పడ్డారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన కారు మబ్బులు మళ్లీ కమ్ముకున్నాయి. చల్లని ఈదురు గాలి వీయడంతో ప్రజలు సేద తీరారు. రాత్రి ఏడు గంటల తర్వాత ఒక మోస్తరు వర్షం కురవడంతో అప్పటి వరకూ వేసవి తాపంతో తల్లడిల్లిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఈదురు గాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ముంచెట్టుతోంది
● ఉప్పునీటితో దెబ్బతింటున్న కొబ్బరి తోటలు ● లెక్కలు వేసినా పరిహారం మాటెత్తని ప్రభుత్వం ● ఆందోళన చెందుతున్న రైతులు మలికిపురం: కల్పతరువు.. కొబ్బరి చెట్టు. కోనసీమకు వన్నె తెచ్చే పంట ఇది. ప్రస్తుతం రాజోలు దీవిలో కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సుమారు ఐదు వేల ఎకరాలకు పైబడి కొబ్బరి చెట్లు ఉప్పునీటి బారిన పడి చనిపోయాయి. మరో 20 వేల ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు, వరి చేలు ప్రమాదంలో పడ్డాయి. ఇటీవల విశాఖ కేంద్రంగా జరిగిన లైడార్ సర్వేలో పలు కీలక అంశాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇక్కడి భూమి కుంగడం, ఉప్పునీటి బారిన పడి ఇలా జరుగుతుందని ఆ సర్వేలో పేర్కొన్నారు. మారుతున్న భౌగోళిక పరిస్థితులతో పాటు ఓఎన్జీసీ వంటి ఆయిల్ సంస్థల అన్వేషణ, చమురు వెలికితీత వంటి కారణలతో ఇలా జరుగుతుందని పలువురు చెబుతున్నారు. రాజోలు దీవిలో ప్రధానంగా 26 కిలోమీటర్ల పొడవున ఉన్న శంకరగుప్తం క్రీక్ (రక్త తుల్యనది) పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో ఈ ప్రభావం అఽధికంగా ఉంది. సముద్ర పోటు ప్రభావంతో ఉప్పునీరు ఈ క్రీక్ (డ్రైన్)లోకి వస్తుంది. మామిడికుదురు మండలం కరవాక నుంచి ప్రవేశించే ఈ డ్రైన్ గోగన్నమఠం, కాట్రేనిపాడు, గొల్లపాలెం, తూర్పుపాలెం, పల్లిపాలెం, గూడపల్లి, గుబ్బలపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, బట్టేలంక, కత్తిమండ, అడవిపాలెం, చింతలమోరి మోరిపోడు, మోరి, కేశవదాసుపాలెం గ్రామాల మీదుగా కేశవదాసుపాలెంలో సముద్రం వద్ద ముగుస్తుంది. రాజోలు దీవిలోని అన్ని ప్రధాన మీడియం, మైనర్ డ్రైన్లు కలిసి మురుగునీటిని కరవాక, గోగన్నమఠం గ్రామాల వద్ద వైనతేయ నదిలో కలుపుతోంది. దీవిలో దాదాపు అన్ని గ్రామాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఈ డ్రైన్ పరిధిలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఉప్పునీటి ప్రభావం నానాటికీ అధికం కావడంతో కొబ్బరి చెట్లు చనిపోవడం అధికమైంది. కొబ్బరి తోటలపైనే ఆధారపడిన అనేక మంది రైతులు, నిరు పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగేళ్లుగా అధ్యయనం చేసి.. ఈ సమస్యలపై కేంద్రం నుంచి వచ్చిన బృందం నాలుగేళ్లుగా నాలుగు సార్లు ఆయా గ్రామాల్లో పర్యటించింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కేరళ నుంచి వచ్చిన కొబ్బరి అభివృద్ధి బోర్డు సభ్యులు, డ్రైన్స్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ అధ్యయనం చేశారు. ఉప్పునీటి ప్రభావం వల్లే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని గుర్తించారు. దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా వారు పరిశీలన చేశారు. ఇక్కడితో సమస్య ఆగదు కేవలం రూ.20 కోట్లతో కరవాక నుంచి శంకరగుప్తం వరకూ పూడికతీసి గట్టు వేసినంత మాత్రాన సమస్య తీరిపోదు. ఎందుకంటే ఈ డ్రైన్ పరిధిలోని గ్రామాల్లో సమస్య జఠిలంగానే ఉంది. ఇటీవల ఉద్యాన శాఖ చేసిన సర్వేలో కేవలం మేజర్ డ్రైన్ పరిధిలో బాధిత రైతులనే గుర్తించారు. ఇంకా అనేక గ్రామాల్లో ఇలా కొబ్బరి చెట్లు చనిపోయి రైతులు ఆదాయం కోల్పోయారు. ఇటీవల ఉద్యాన, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చేసిన సర్వేలో చాలా తక్కువగా నష్టం అంచనా వేశారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ పరిధిలో మాత్రమే 1,501 మంది రైతులు 513 హెక్టార్లలో తోటలను నష్టపోయారని, వారికి రూ.58.09 కోట్ల పరిహారం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాస్తవంగా కొబ్బరి, సరుగుడు తోటలకు నష్టం చాలా ఎక్కువగా ఉంది. శంకరగుప్తం మేజర్ డ్రైన్తో పాటు గోగన్నమఠం, కూనవరం, కత్తిమండ, వేపచెట్టు, గొంది, రామేశ్వరం తదితర మీడియం, రెవెన్యూ డ్రైన్ల ద్వారా కూడా ఉప్పునీటి ప్రభావానికి విలువైన భూములు, పంటలను రైతులు కోల్పోతున్నారు. వీటి లెక్క వేయడం లేదు. కేశనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (ఫైల్) అన్ని గ్రామాల్లోనూ సమస్యే ఉప్పునీటి ప్రభావంతో రాజోలు దీవిలో దాదాపు అన్ని గ్రామాల్లోని కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్లపైనే ఆధారపడి జీవించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు పరిహారం అందించాలి. శంకరగుప్తం డ్రైన్తో పాటు అన్ని డ్రైన్లపై దృష్టి పెట్టాలి. మొక్కుబడిగా నిధులు కేటాయింపు కాదు. – రుద్రరాజు చిన్నరాజా, గుడిమూల, సఖినేటిపల్లి మండలం ప్రభుత్వానికి పంపాం ఉప్పునీటి ప్రభావంతో శంకరగుప్తం మేజరు డ్రైన్ పరిధిలో చనిపోయిన కొబ్బరి చెట్ల లెక్కలు వేశాం. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపాం. పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు బాధితులకు అందిస్తాం. – రమణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
కార్పెట్లు పరిచారు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్పెట్లు పరిచారు. ఎండ వేడికి కాళ్లు కాలి దేవస్థానానికి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నా ఆలయ ప్రాంగణంలో కార్పెట్లు వేయకపోవడంపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ?’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయం లోపలకు వెళ్లే మార్గంలోను, అన్నదానం విభాగం మార్గంలోను, రథపాత్లోను కార్పెట్లు వేశారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, గతంలో కూడా ‘సాక్షి’ వార్తలు ప్రచురించినప్పుడు అధికారులు స్పందించి, కార్పెట్లు వేసినప్పటికీ నాలుగు రోజులకే తీసేశారు. ఈసారి అలా చేయకుండా ఎండాకాలమంతా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ నుంచి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండటం, అడపాదడపా వర్షాలు కురుస్తున్నా తీవ్రమైన ఎండలు కాస్తూండటంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 76.53 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 9.72 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. పంటల సాగు ముగియడంతో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. విశాఖపట్నానికి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువులకు కూడా నీటి సరఫరాను నిలిపివేశారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోను వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిశాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 21 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.1,78,200, పూజా టికెట్లకు రూ.2,33,510, కేశఖండన శాలకు రూ.16 వేలు, వాహన పూజలకు రూ.3,980, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.61,860, విరాళాలు రూ.31,531 కలిపి మొత్తం రూ.5,25,081 ఆదాయం సమకూరిందని వివరించారు. డ్రోన్ నిఘాలో..కాకినాడ రూరల్: వేసవి సెలవులు, ఆపై ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు రక్షణ కల్పించేలా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్లో జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో బీచ్తో పాటు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. తిమ్మాపురం పోలీసులతో పాటు వివిధ స్టేషన్ల సివిల్ పోలీసులు, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తీర ప్రాంతంలో అల్లరి మూకల కదలికలను గమనించడంతో పాటు, సముద్రంలో స్నానాలకు దిగిన వారు ప్రమాదాల బారిన పడకుండా పర్యవేక్షించి, హెచ్చరికలు జారీ చేశారు. -
న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు అవసరం
● హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ ● అమలాపురంలో కోర్టుల ప్రారంభం అమలాపురం టౌన్: న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు లేకపోతే కక్షిదారులకు త్వరితగతిన న్యాయ సేవలు అందించలేమని తూర్పుగోదావరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ అన్నారు. అమలాపురం కోర్టు భవనాల్లో కొత్తగా ఏర్పాటైన 14వ అదనపు జిల్లా కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను దేవానంద్తో పాటు మరో నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షతన జరిగిన సభకు హైకోర్టు న్యాయమూర్తులు దేవానంద్, ఆర్.రఘునందన్రావు, బీవీఎల్ఎన్ చక్రవర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా అదనపు కోర్టు భవనానికి 2012లో శంకుస్థాపన జరిగితే, 2026లో ప్రారంభోత్సవం జరిగిందంటే కోర్టుల పట్ల, మౌలిక సదుపాయాల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ఘటన ప్రత్యేక సాక్ష్యమని గుర్తు చేశారు. రాష్ట్రంలో 96 కోర్టులు మంజూరయ్యాయని, వీటికి పూర్తి మౌలిక సదుపాయాల కల్పన త్వరలోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తులు రఘునందన్రావు, సుమతి, చక్రవర్తి, విజయ్లు తూర్పుగోదావరి జిల్లా ముద్దు బిడ్డలని కొనియాడారు. న్యాయమూర్తులు రఘునందన్రావు, సుమతి, చక్రవర్తి, విజయ్లు మాట్లాడుతూ కేసులు త్వరితగతిన పరిష్కారానికి కొత్త కోర్టులు రావాలన్నారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముమ్మిడివరం న్యాయమూర్తి రహమ్ తుల్లా హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ పుట్టు పూర్వోత్తరాలను సభకు వివరించారు. అనంతరం కోర్టుల భవన సముదాయంలో 14వ అదనపు జిల్లా కోర్టును, 2వ సివిల్ (జూనియర్ డివిజన్) కోర్టు కం మెజిస్ట్రేట్ కోర్టులను ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా అదనపు కోర్టు బెంచ్పై హైకోర్టు న్యాయమూర్తి సుమతి ఆశీనులై కొన్ని కేసులను పరిశీలించారు. 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గంటా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గుబ్బల చంద్రమౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, సీనియర్ న్యాయవాదులు ఎండీ ఆజామ్, నల్లా ప్రభాకర్, కుడుపూడి అశోక్, డీబీ లోక్, నల్లా సురేష్కుమార్, కళా వెంకట్రావు, కూచిమంచి శశిధర్ శ్రీరామ్, అబ్బిరెడ్డి సురేష్ తదితరులు హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నిదియాదేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, అమలాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. -
సీసీ ఫుటేజీ బయట పెడితే అవినీతి బట్టబయలు
ఎస్.అన్నవరం వద్ద కమ్ముకున్న కారు మబ్బులుఅనపర్తి: ఈవీఎంల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యథావిధిగా మాటల గారడీ చేస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. అనపర్తి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, తన అవినీతిని నిరూపిస్తే ఆస్తులు రాసిస్తానంటూ ఎమ్మెల్యే చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలని అన్నారు. ఆయన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామన్నారు. అక్రమ సంపాదనతో కూడిన ఆ పాపిష్టి సొమ్ము తమకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యేకి ఎవరెవరు ఎంతెంత లంచాలు ఇచ్చారో బాధితులే నేరుగా వెల్లడించారని, అవసరమైతే వారు ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక మద్యం షాపు యజమాని విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, డబ్బులివ్వకముందు టీ ఇచ్చి పంపిన ఎమ్మెల్యే, ముడుపులు అందిన తర్వాత తన ఇంట్లో చేపల పులుసు బాగుంటుందని భోజనం పెట్టారని, ఇది ఆయన తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటి పక్కనే దాదాపు ఏడాదిన్నర పాటు భారీ పేకాట డెన్ నడిచిందని, రోజుకు రూ.2 లక్షల చొప్పున భారీగా వసూళ్లు జరిగాయని, పరిస్థితి శ్రుతి మించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ డెన్పై రైడ్ చేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. అతని ఇంట్లో జరిగిన రెండు శుభకార్యాల సందర్భంగా వ్యాపారవేత్తలను బెదిరించి వందకు పైగా బంగారు బిస్కెట్లు వసూలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ కార్యక్రమాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఎటువంటి కటింగ్స్ లేకుండా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
యథావిధిగా నేడు పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవనంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. విఘ్ననాయకా భజేహం అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పంచామృతాభిషేకంలో ఒక జంట, లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో ఎనిమిది మంది పాల్గొని పూజలు చేశారు. ఆరుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, ముగ్గురికి తులాభారం, నలుగురికి అన్నప్రశన చేశారు. ఏడుగురు తలనీలాలు సమర్పించగా, 15 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1,673 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్క రోజే ఆలయానికి రూ.2,14,525 ఆదాయం సమకూరిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
అమలాపురంలో కోర్టులు ప్రారంభం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటైన 14వ అదనపు జిల్లా కోర్టు, 2వ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కం మేజిస్ట్రేట్ కోర్టుల ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కోర్టులను తూర్పుగోదావరి జిల్లా పాలన జడ్జీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.రఘునందన్రావు, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాపతి విజయ్ ప్రారంభించారు.అనంతరం అమలాపురం కోర్టుల ప్రాంగణంలో తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత అధ్యక్షతన జరిగిన సభకు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ, బార్ అసోసియేషన్ సమన్వయంతో ఒక మదర్ శాఖలా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి వ్యవస్థను ముందుకు నడిపించాలని వారు ఆకాంక్షించారు. అమలాపురం 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గంటా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గుబ్బల చంద్ర మౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది
● వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబి అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600లకు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దుతు ధర ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబి గుర్తు చేశారు. కేజీ పొగాకు ధర రూ.265 కూడా పలకడంలేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందని గుర్తు చేశారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్ట నష్టాలు వర్ణనాతీతమన్నారు. కొందరు నేతలు బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్ కొరత వరకూ కొందరు కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ పంటకు మద్దతుఽ ధర దక్కకపోతే ఆ పంటకు మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కూడా గ్రామాలకు వాహనాలను పంపించి ఆయా పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించిన ఘటనలను గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తూ ధరల స్థిరీకరణ వాగ్దానాన్ని విస్మరించిందన్నారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళనలకు దిగుతామని బాబి హెచ్చరించారు.పుష్కరాల పనులపై సమీక్ష అమలాపురం రూరల్: గోదావరి పుష్కరాలు 2027ను పురస్కరించుకొని తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత ధ్యేయంగా అభివృద్ధి పనులకు అంచనాలను ప్రతిపాదించాలని జాయింట్ కలెక్టర్ వైఖడ్ నిడియాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నదీ తీర ప్రాంతాల్లోని ఘాట్లను ఆధునీకరించడమే ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలిపారు. పాత ఘాట్లకు మరమ్మతులు చేపట్టడం, రక్షణ గోడల నిర్మాణం, నదీ తీరంలో మెట్ల నిర్మాణం చేపట్టేలా ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించాలన్నారు. డీఆర్ఓ వీ.సుబ్బారావు దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ వీ. సత్యనారాయణ, పీఆర్ ఎస్ ఈ పీ.రామకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ ఏవీఎస్ రాజన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ. రాము, సీసీఓ ఎం మురళీకృష్ణ జల వనరుల శాఖ ఈ ఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. డిజిటల్ జనగణన పూర్తి చేయాలి జిల్లాలో మే 1 వ తేదీ నుంచి ప్రారంభమైన డిజిటల్ జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ వైఖోడ్ నిడియాదేవి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ మే 30 నాటికి వంద శాతం పూర్తి కావాలన్నారు. పురుగు మందు తాగిన యువకుల మృతి ఆత్రేయపురం : వెలిచేరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేర్వేరు ఘటనలలో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెలిచేరుకు చెందిన సంగ దుర్గాప్రసాద్(26) తల్లిదండ్రులు మందలించగా మనస్థాపంతో పురుగు మందు తాగి మృతి చెందాడు. దుర్గాప్రసాద్ ఏ పనికీ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గత నెల 30న తల్లిదండ్రులు మందలించడంతో పురుగు మందు తాగాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము తెలిపారు. అదే గ్రామానికి చెందిన అయినం రామాంజనేయులు పురుగు మందు తాగి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఐటీఐ చదివిన రామాంజనేయులుకు ఇటీవల ఉద్యోగం రాగా తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గత నెల 28న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ రాము తెలిపారు. -
అరకొర పనులూ క్లోజ్ర్!
● నియోజకవర్గానికి రూ.మూడు కోట్లతో పనులని హడావుడి ● జిల్లాలో చేస్తామని చెప్పిన పనుల విలువ రూ.18 కోట్లు ● పంట కాలువల అత్యవసర మరమ్మతులకు రూ.12 కోట్లు ● చేస్తున్నవి మాత్రం అంతంతమాత్రం ● క్లోజర్ పనులపై ఆసక్తి చూపని చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఏటా నీట మునుగుతున్నా.. రబీకి శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడుతున్నా అందుకు ప్రధాన కారణం డెల్టా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే. మూడంచెల పంట కాలువలు, నాలుగంచెల మురుగునీటి కాలువల వ్యవస్థ పూడుకుపోయి, పలుచోట్ల కుంగిపోయి ఆక్రమణల బారిన పడటం వల్ల ఏటా రైతులు కోట్లాది రూపాయల పంటను నష్టపోతున్నారు. ఈ విపత్తుల నుంచి రక్షించేందుకు పంట కాలువలు, మురుగునీటి కాలువలను ఆధునీకరించాలని రైతులు కోరుతున్నారు. వరుసగా రెండో ఏడాది క్లోజర్ (పంట కాలువలు మూసివేసిన సమయంలో) పనులను చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా చేసి మమ అనిపిస్తుండడంతో ఈ ఏడాది కూడా నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడో వంతు పనులు కూడా అనుమానమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గోదావరి డెల్టా ఆధునీకరణ, ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ (ఓ అండ్ ఎం), క్లోజర్ పనులు వంటి వాటికి రూ.75 కోట్లు కేటాయించింది. డెల్టాకు కేటాయించింది అరకొర నిధులే అయినా వాటిని కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు. దీనిపై రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డెల్టా పరిధిలో నియోజకవర్గానికి రూ.మూడు కోట్లతో పనులు చేస్తామని చెప్పింది. రూ.రెండు కోట్లతో పంట కాలువలకు అత్యవసర మరమ్మతులు, పూడికతీత పనులు, రూ.కోటితో ఏడాది పొడవునా మురుగునీటి కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలగిస్తామని హామీ ఇచ్చింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు కలిపి రూ.18 కోట్ల పనులు చేయాల్సి ఉంది. మూడవ వంతు కూడా పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాలువల్లో ఇంకని నీరు జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలోని ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంట బోదెలలో ఇప్పటికీ నీరు ఇంకా లేదు. చూస్తుంటే కాలువలు ప్రవహిస్తున్నట్టుగానే ఉన్నాయి. కాలువలలో ఈ స్థాయిలో నీరు ఉంటే అరకొర పనులు చేయడం కూడా వీలుకాదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నాటికి పంట కాలువలు మూసివేస్తామని, తిరిగి జూన్ ఒకటో తేదీని తెరుస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 45 రోజుల క్లోజర్ సమయంలో పనులు పెద్ద ఎత్తున చేస్తామన్నారు. తీరా రబీ పూర్తి కాకపోవడంతో తూర్పు డెల్టా కాలువకు ఏప్రిల్ 25 వరకు, మధ్య డెల్టా కాలువకు ఏప్రిల్ 28 వరకు నీరు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా క్లోజర్కు కేవలం 33 నుంచి 36 రోజుల సమయం మాత్రమే దక్కినట్టు అయింది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ల్లో పారుతున్న నీరుఈ ఏడాదీ ఇబ్బందులు తప్పవా? ధవళేశ్వరం, బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ల నుంచి శివారు లాకుల వరకు అన్నీ అధ్వానంగా ఉండడంతో నీరు లీకవుతోంది. ఈ నెల మూడో తేదీన కురిసిన భారీ వర్షంతో పంట కాలువలు, చానల్స్, పంట బోదెల్లో నీరు చేరింది. దీంతో పూడికతీసే పనులు చేపట్టే అవకాశం కన్పించడం లేదు. కనీసం ఉపాధి హామీ పథకంలో చిన్న చిన్న పంట బోదెలు కూడా తవ్వే అవకాశం లేదని రైతులు అంటున్నారు. క్లోజర్ పనులు పెద్దగా జరగకపోవడంతో ఈ ఏడాది కూడా ఖరీఫ్లో ముంపు నీరు దిగకపోవడం, రబీలో శివారు, మెరకలకు నీరు అందకపోవడం వంటి ఇబ్బందులు పడక తప్పదని డెల్టా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కోనసీమ అందాలు షూటింగ్లకు అనువు
– ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అమలాపురం టౌన్: కోనసీమలోని సహజ సిద్ధ ప్రకృతి అందాలు సినిమాల చిత్రీకరణకు అనువుగా ఉంటాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) జిల్లా శాఖ అధ్యక్షుడు మోకా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగలక్ష్మి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఏపిమా అధ్యక్షుడు పిల్లా లక్ష్మీ ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సాయి, జి. పల్లంరాజు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. అనంతరం ఏపీమాకు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఏపీమా అధ్యక్షుడిగా పిల్లా లక్ష్మీప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఆవుల వీర శేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా జానపాటి విశ్వేశ్వరరావు, కోశాధికారిగా గుర్రం వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా రాపేటి అప్పారావు, తెనాలి శకుంతలలు ఎన్నికయ్యారు. ఏపీ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్స్ యూనియన్కు కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా బండ్రెడ్డి శశికుమార్, ఉపాధ్యక్షుడిగా చితిరాల నాగ మధు, ప్రధాన కార్యదర్శిగా కొడదల శివప్రసాద్రెడ్డి, కోశాధికారిగా ఉబా ప్రసాద్ ఎన్నికయ్యారు. -
ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్
● రూ.97.50 లక్షల సొత్తు స్వాధీనం ● ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి అమలాపురం టౌన్: వారు ఇంటి తలుపుల టవర్ బోల్ట్లు తీయడంలో, ఐరన్ రాడ్తో తాళాలు పగులగొట్టడంలో సిద్ధహస్తులు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీలు చేయడం వారి నైజం. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ వీధిలోని ఒక డాబా ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు 30వ తేదీన జరిగిన చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ దొంగల చోరీల చిట్టా బయట పడింది. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు ఆ ఇద్దరి దొంగలను వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.97.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఏటిమొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్ (వీరబాబు), తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన వైరా చిరంజీవి ఈ చోరీలకు పాల్పడ్డారు. రవిశంకర్ను కొత్తపేట నాయుడు రైస్ మిల్లు వద్ద బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిరంజీవిని అనపర్తిలో అరెస్ట్ చేశారు. అమలాపురంలో తన కార్యాలయంలో గురువారం ఎస్పీ రాహుల్ మీనా విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 646,361 గ్రాముల బంగారు నగలు, రూ.2,100 నగదు, ఒక మోటారు సైకిల్, ఒక స్మార్ట్ ఫోన్, ఒక లాప్టాప్ను చూపించారు. 14 చోరీల కేసుల్లో సొత్తు స్వాధీనం ఈ అంతర జిల్లాల దొంగలు జిల్లాతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు చేశారు. ఈ 14 చోరీల కేసుల నుంచి మొత్తం రూ.97.50 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఏ1పై 120 చోరీలు, ఏ2పై హత్య కేసు ఈ చోరీల్లో ఏ1 అయిన రవిశంకర్ ఇప్పటి వరకూ 120 ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు కొత్తపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ2 అయిన చిరంజీవిపై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందన అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేయడంపై ఎస్పీ మీనా పోలీస్ అధికారులు, క్రైమ్ సిబ్బందిని ప్రశంసించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట ఎస్సై జి.సురేంద్రకుమార్, క్రైమ్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, ఏఎస్ఐ ఎం.సుబ్బరాజు, కానిస్టేబుళ్లు లంకాడి శ్రీను, డి.అర్జునరావు, బీడీవీ ప్రసాద్, జి. కృష్ణసాయి, ఎ.శుభాకర్, ఆర్సీహెచ్వీ ప్రసాద్, ఎం.హరిబాబులకు ఎస్పీ మీనా రివార్డులు అందించి అభినందించారు. -
కలకలం రేపిన విషాహారం
● కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ● పరామర్శించిన నేతలు, అధికారులు కొత్తపేట: ఫుడ్ పాయిజన్తో సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన కొత్తపేట మండలంలో కలకలం రేపింది. వివాహ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని రెండో పూట, కొందరు మూడోపూట కూడా తిని అస్వస్థతకు గురైన ఘటన వానపల్లి శివారు రామమోహనరావుపేటలో చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ డాక్టర్ డీ దొర, తహసీల్దార్ వై.రాంబాబు తక్షణ చర్యలు తీసుకుని బాధితులను కొత్తపేట సీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశారు. బాధితుల్లో 11 మంది చిన్నారులు ఆ గ్రామంలో ఇంకా పలువురు అస్వస్థతకు గురయిన విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ డీ దొరకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన 108 జిల్లా ఇన్చార్జ్ వెంకటేష్ను అప్రమత్తం చేసి జిల్లాలో అంబులెన్స్లు రామమోహనరావుపేటకు పంపించాలని సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 15 అంబులెన్స్లు రాగా వాటిలో 42 మందిని కొత్తపేట సీహెచ్సీకి తరలించారు. వారిలో వానపల్లి రామమోహనరావుపేటకు చెందిన వారు 37 మంది కాగా మిగిలిన 5 గురు మోడేకుర్రుకు చెందిన వారు. మొత్తం బాధితుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. వారికి ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది వానపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివ వైద్య సేవలు అందించారు. జేసీ నిడియాదేవి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ ఫుడ్ పాయిజనై వానపల్లి వాసులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట ఆస్పత్రికి వచ్చి రోగులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అన్ని వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ దొర, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ తరఫున తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా పార్టీ నాయకుడు సాకా జానకిరామరాజు ఉన్నారు. -
ధాన్యం రైతుల దైన్యం పట్టదా?
రామచంద్రపురం: ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని రబీలో పండిన ధాన్యాన్ని కొనే నాథుడు లేడని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త పిల్లి సూర్యప్రకాశ్ విమర్శించారు. రబీలో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద గురువారం సూర్యప్రకాశ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ వాతావరణం అనుకూలించటంతో జిల్లాలో ధాన్యం అధిక దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. జిల్లాలో 16 రైసు మిల్లులే ఉన్నాయని వీటికి మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసే అనుమతి ప్రభుత్వం ఇవ్వటంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. సుమారు రూ.420 కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండగా కేవలం 16 రైస్ మిల్లులు ఉండటంతో ఇది సాధ్యం కాదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాతిపదికగా తీసుకుని రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రబీ మాసూళ్లు జరుగుతుండగా ఎప్పుడు వర్షం వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎంఆర్ను నిలిపివేసిందన్నారు. ఇదే అదనుగా దళారులు అయినకాడికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.1,770 మద్దతు ధర ప్రకటించినా రూ.1,640లకే కొనుగోలు చేస్తూ రైతులను వెన్నపోటు పొడుస్తున్నారని అన్నారు. పంటను పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. అనంతరం రైతులు, పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. గిట్టుబాటు ధర ఏది బాబూ? అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ సూర్యప్రకాశ్ రైతులకు అండగా ధర్నా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాతిపదికగా ధాన్యం సేకరించాలని డిమాండ్రైతులను నట్టేట ముంచేసిన చంద్రబాబు గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన చంద్రబాబు రైతులను మాఫీ చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాఽథ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంటలు పండించిన రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకి అని అన్నారు. జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడు గుణ్ణం సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ ఎంపీపీలు, పార్టీ కన్వీనర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
కోలుకుంటున్న ఫుడ్ పాయిజన్ బాధితులు
● 15 మంది డిశ్చార్జి ● ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి, ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదుగురికి చికిత్స ● పర్యవేక్షిస్తున్న తహసీల్దారు కొత్తపేట: వివాహ విందుతో ఫుడ్ పాయిజన్కు గురైన బాధితులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. వారంతా గురువారం నుంచి స్థానిక సీహెచ్సీ, ఒక ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు. మండల పరిధిలోని వానపల్లి శివారు రామమోహనరావుపేటలో ఓ ఇంట బుధవారం మధ్యాహ్నం విందు భోజనం చేసి, మిగిలిన పదార్థాలను అదే రోజు రాత్రి, మరునాడు ఉదయం కూడా ఆరగించారు. దానికి తోడు వేసవి ఉష్ణోగ్రతలతో ఆహారం ఒంటికి సహించక గురువారం మధ్యాహ్నం 11 నుంచి చిన్నారులు సహా 50 మందికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 9.30 గంటల వరకు 49 మంది ఆస్పత్రిలో చేరగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది, డీఎంహెచ్ఓ డాక్టర్ దుర్గారావు దొర ఆధ్వర్యంలో వానపల్లి పీహెచ్సీ వైద్యులు వైద్య సేవలు అందజేశారు. రాత్రి 10.45 గంటలకు ఆరుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేయగా వారు స్థానిక ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 13 మంది, ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఇద్దరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. తహశీల్దార్ వై.రాంబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆయా ఆస్పత్రుల్లో బాధితుల యోగ క్షేమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు, ముగ్గురు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని, మిగిలిన వారికి జ్వరాలు తగ్గాయని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకున్న వారిని డిచ్చార్జ్ చేస్తామన్నారు. రామ్మోహనరావుపేటలో వైద్య శిబిరం ఫుడ్ పాయిజన్ జరిగిన వానపల్లి శివారు రామ్మోహన్ రావుపేటలో వైద్య నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్ఓ ఎం.దుర్గారావుదొర తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వానపల్లి పీహెచ్సీ వైద్యులు జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేశారు. సర్వైలెన్స్ బృందాలు క్లోరినేషన్ చేపట్టినట్టు తెలిపారు. -
అమలాపురానికి 14వ అదనపు జిల్లా కోర్టు
● అందుబాటులోకి అదనపు సివిల్ జడ్జి కోర్టు ● జిల్లా న్యాయమూర్తిగా ప్రియదర్శిని నియామకం ● రేపు ప్రారంభోత్సవం ● ఐదుగురు హైకోర్టు జడ్జిల రాక అమలాపురం టౌన్: అమలాపురానికి 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంజూరైంది. జిల్లా అదనపు కోర్టుతో పాటు రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కూడా మంజూరు కావడంతో మొత్తం కోర్టుల సంఖ్య 8కి చేరుకుంది. ఈ కొత్త జిల్లా కోర్టును, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటికే 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జిగా గంటా ప్రియదర్శిని నియమితులయ్యారు. తాజా కోర్టుల ప్రారంభోత్సవాలకు హైకోర్టు జడ్జి, తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బట్టు దేవానంద్, హైకోర్టు జడ్జీలు ఆర్.రఘుందన్రావు, బీవీఎల్ఎన్ చక్రవర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్ ముఖ్య అతిథులుగా హాజరై వాటిని ప్రారంభించనున్నారు. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక ఇక్కడ కోర్టుల విస్తరణ అనివార్యమైంది. తాజాగా వచ్చిన కోర్టులతో కేసులు మరింత త్వరగా పరిష్కారమయ్యే వీలుంటుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గంధం సునీతతో పాటు న్యాయమూర్తులు గంటా ప్రియదర్శిని, గుబ్బల చంద్ర మౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు కోర్టుల ప్రారంభోత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
నమ్మించి దగా చేశారు
‘సహకార’ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణరామచంద్రపురం రూరల్: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న సహకార సంఘాల ఉద్యోగులను నమ్మించి హామీ ఇచ్చిన ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓతో దగా చేసిందని రాష్ట్ర ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ కోశాధికారి పెంకే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 రోజుల పాటు వివిధ దశలలో సమ్మె చేయగా సంబంధిత మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వయంగా వచ్చి తమ నాయకులతో చర్చించి ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. జీఓ 322తో ఉద్యోగులకు ఒరిగేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. జీఓ 36 ప్రకారం 2019 నుంచి 40 శాతం పెంపుదల కోరితే ప్రభుత్వం గత జీఓలను పక్కన పెట్టి తాజా జీఓలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 20 శాతం వేతన పెంపుదల పూర్తి జీతంపై కాకుండా బేసిక్ పే పై మాత్రమే వర్తింపజేయడం దుర్మార్గమన్నారు. 2019 తరువాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో వారిని కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం దారుణమన్నారు. -
అన్నదానానికి రూ.లక్ష విరాళం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన దొడ్డ పూర్ణచంద్రరావు, భాగ్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.1,00,226 విరాళాన్ని సమర్పించారు. వీరికి ఆలయ సిబ్బంది నారాయణ, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి జిల్లా పీఆర్టీయూ డిమాండ్ అమలాపురం టౌన్: గత ఏడాది ఇచ్చిన బ్యాగుల్లో కొన్ని నాణ్యత లేక నెల రోజుల్లోపే చిరిగిపోయి విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, ఈ ఏడాది నుంచైనా నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలని జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దీపాటి సురేష్బాబు, మొంగం అమృతరావు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పీఆర్టీయూ శాఖ తమ రాష్ట్ర సంఘం నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంతో చర్చించాలని సూచించిందని, ఈ మేరకు వారు అమలాపురంలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి శనివారం విద్యార్థులు స్పోర్ట్స్ టీ షర్టుల వంటివి ధరించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు ఒక స్పెల్ మాత్రమే పంపిణీ అవుతున్నాయని, ఉపాధ్యాయులకు కూడా స్కూలు కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలా పలు ముఖ్యమైన అంశాలు, సమస్యలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నాటికి పరిష్కరించాలని విద్యా శాఖకు, ప్రభుత్వానికి ఆ నాయకులు విజ్ఞప్తి చేశారు. పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జేసీ నిడియాదేవి అమలాపురం రూరల్: జిల్లాలో మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ వైఖోడ్ నిడియాదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో ఆమె సమీక్షించారు. ఇంటర్ రెండేళ్లకు సంబంధించి 14,171 మంది హాజరుకానున్నారని, వీరి కోసం మొత్తం 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రశ్నపత్రాలను జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో పోలీసు, విద్యుత్, రవాణా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. చదువు ప్రాథమిక హక్కు చదువు ప్రతి బిడ్డకు ప్రాథమిక హక్కని, పిల్లలను పనులకు పంపడం నేరమని జేసీ నిడియాదేవి పేర్కొన్నారు. అందరి సమన్వయంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. గ్రామస్థాయి బృందాలుగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పడి సమన్వయంతో పనిచేసి బడిబయట పిల్లలను గుర్తించాలన్నారు. రత్నగిరిపై పెళ్లి సందడి అన్నవరం: సత్యదేవుని సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాళ్లు, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు. -
ధాన్యపు సీమలో దండుపాళ్యం
సాక్షి, అమలాపురం: ఆరుగాలం కష్టపడి పంట పండించినా ధాన్యానికి గిట్టుబాటు రాక నష్టపోవడం జిల్లా రైతులకు పరిపాటిగా మారింది. ఈ ఏడాది విత్తు నుంచి విక్రయం వరకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రకృతి సహకరించ లేదు. సాగుకు ప్రభుత్వ మద్దతు లేదు.. రైతుకు రుణం దక్కలేదు.. శివారుకు సాగునీరు అందలేదు.. పండించిన ధాన్యానికి ‘కనీస మద్దతు’ ధర అందడం లేదు. దళారులు.. షావుకార్లు కుమ్మకై ్క తాలు, తప్పలు బూచిగా చూపించి బస్తాకు మూడు కిలోల కోత పెడుతుండడంతో పంట పండించినా లాభాలు పొందలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అసలే ఆలస్యం.. ఆపై కొర్రీలు.. కోతల సమయంలో డీజిల్ దొరకక ఒక వారం రోజులు.. ఆకాల వర్షంతో కోతలు నిలిచి మరో వారం రోజులు రబీకి అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ అధిగమించి పండిన ధాన్యాన్ని విక్రయానికి పెడితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఆర్బీకేలు నిబంధనలు వల్లె వేస్తున్నాయి. వర్షాలకు ధాన్యం తడిసినా తేమ శాతం, తాలు తప్పలు, మట్టి వంటి నిబంధనలలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. కళ్లాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీనితో రైతులే ఆయా కేంద్రాలకు వెళ్లి ధాన్యం విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 1.31 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగవగా, సుమారు 4.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అంచనా. దీనిలో 2.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇంత వరకు కేవలం 1.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అంటే లక్ష్యంలో ఇంకా 50 శాతం కూడా కొనుగోలు చేయలేదు. రైతుల అవసరాలకు పోను మిల్లర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా దళారులు, ఏజెంట్లు సిండికేటుగా మారారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర 75 కేజీల బస్తా రూ.1776.75 చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్బీకేలలో నిబంధనలు, ఆర్బీకేల వద్దకు వెళ్లి ధాన్యం విక్రయిస్తే రవాణా, జట్టు కూలీల ఇబ్బందులు ఇవ్వన్నీ చూసి రైతులు తమ కళ్లాల వద్దే ధాన్యం విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వారికి కనీస మద్దతు ధర రావడం లేదు. జిల్లాలో అత్యధికంగా బస్తా రూ.1,700కు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో అయితే కొన్ని చోట్ల తేమ ఎక్కువ ఉన్న పచ్చి ధాన్యాన్ని రూ.1,650 చొప్పున కొన్నారు. తరువాత సన్నాలు, మిగిలిన రకాలకు ఇతర రాష్ట్రాలలో డిమాండ్ ఉండడంతో ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. మూడు కేజీల కోత ధర విషయంలో తొలుత అయినట్టుగా తరువాత గిట్టుబాటు కాకపోవడంతో మిల్లర్లు, దళారులు కొత్త పద్ధతి మొదలు పెట్టారు. ధాన్యంలో తాలు తప్పలు వస్తున్నాయని బస్తాకు మూడు కేజీల చొప్పున కోత పెడుతున్నారు. 75 కేజీల బస్తాను కొనుగోలు చేసి 72 కేజీలకు మాత్రమే సొమ్ములు చెల్లిస్తున్నారు. ధాన్యంలో తాలు తప్పలు కేవలం అర కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటోంది. ఇలా ఉన్నా కనీస మద్దతు ధర చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ మూడు కిలోల చొప్పున నిర్మొహమాటంగా కోత పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు బస్తాకు రూ.71 వరకు నష్టపోతున్నారు. ఎకరాకు 50 బస్తాలు పండిస్తే రూ.3,550 కోల్పోతున్నారు. ఇటీవల భారీ వర్షం పడిన తరువాత తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి ఇస్తున్నా ధరలకు కోత పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేజీలు తగ్గిస్తే చర్యలు తీసుకుంటాం ధాన్యం కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా తాలు తప్పలు, ఇతర కారణాలు చూపించి కిలోలు తక్కువ నమోదు చేస్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. 75 కేజీల బస్తాకు మూడు కేజీల తగ్గించి ధర నిర్ణయిస్తే రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ తాలు, తప్ప, తేమ పేరుతో బస్తాకు మూడు కిలోల చొప్పున కోత నిబంధనలు, రవాణా, జట్టుభారంతో అయినకాడికి విక్రయిస్తున్న అన్నదాత ఆర్బీకేల ద్వారా 50 శాతం దాటని కొనుగోళ్లు ఎంఎస్పీ రాకపోవడంపై రైతుల ఆందోళన -
మంచి ప్రోత్సాహం ఇచ్చింది
సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ నాకు పరీక్షల్లో మంచి ప్రోత్సాహం ఇచ్చింది. మెటీరియల్తోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా తోడైంది. పరీక్షల ఫలితాల్లో 583 మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాను. విద్యార్థుల్లో ప్రతిభను పదును పెట్టేందుకు సాక్షి చేసిన కృషి అభినందనీయం. – కొమ్ముల రఘు వైష్ణవి, జెడ్పీ ఉన్నత పాఠశాల, నగరం, మామిడికుదురు మండలం 581 మార్కులు సాధించాను పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్నే ఫాలో అయ్యాను. పరీక్షల్లో 581 మార్కులు సాధించడానికి ఆ స్టడీ మెటిరీయల్ ఉపయోగపడింది. ఉపాధ్యాయులు నిర్వహించిన అదనపు తరగతుల్లో కూడా ఈ స్టడీ మెటిరీయల్పై తర్ఫీదు ఇవ్వడంతో ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడింది. – గుండుమేను శివ శైలజ, జెడ్పీ హైస్కూలు, లక్కవరం మలికిపురం మండలం సపోర్టుగా నిలిచింది పదో తరగతి పరీక్షల్లో నాకు సాక్షి సపోర్టుగా నిలిచింది. 579 మార్కులు తెచ్చుకుని మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచాను. సాక్షి యాజమాన్యం అందించిన మోడల్ పేపర్లు చాలా ఉపయోగపడ్డాయి. ఉపాధ్యాయుల దీటైన బోధనతోపాటు సాక్షి స్టడీ మెటీరియల్ను కూడా ప్రాక్టీస్ చేయిండచంతో ఈ ఉత్తమ ఫలితం సాధించాను. – కట్టా మోహన్ సాయి శ్రీహర్ష, జెడ్పీ హైస్కూలు, రావులపాలెం మెటీరియల్ ఉపయోగపడింది పదో తరగతి పరీక్షల్లో సాక్షి దినపత్రిక ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడింది. నేను పరీక్షల్లో 572 మార్కులు సాధించానంటే అందుకు ఆ స్టడీ మెటీరియలే కారణం. ముఖ్యంగా లెక్కలు, సైన్స్ పాఠ్యాంశాలపరంగా సాక్షి స్టడీ మెటీరియల్ చదవం వల్లే మెళకువలను తెలుసుకుని పరీక్షలు రాశాను. – చిట్టిమేను యశస్విని, జెడ్పీ హైస్కూలు, దేవగుప్తం, అల్లవరం మండలం ‘సాక్షి’కి థ్యాంక్స్ పదో తరగతి పరీక్షల్లో మంచి కీలక సమయంలో సాక్షి దినపత్రిక స్టడీ మెటీరియల్ను అందించి విద్యార్ధులకు ఫలితాల పరంగా మంచి చేయూత ఇచ్చింది. నేను 579 మార్కులు సాధించానంటే అందుకు సాక్షి అందించిన తోడ్పాటే. సాక్షికి నా థ్యాంక్స్. – మందపాటి స్వప్న, జెడ్పీ హైస్కూలు, బట్టేలంక, మలికిపురం మండలం భవిష్యత్తుకు పునాది సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ నా ఉన్నత భవిష్యత్తుకు పునాది వేసింది. నేను పరీక్షల్లో 575 మార్కులు సంపాదించాను. నాలాంటి పేద విద్యార్ధులకు స్టడీ మెటీరియల్తో బాసటగా నిలిచింది. విద్యార్థుల్లో ప్రతిభను పదును పెట్టేందుకు సాక్షి చేసిన కృషి అభినందనీయం. – మేకా వీర నాగ సాయి, జెడ్పీ హైస్కూలు, కొత్తపేట -
ఈ హర్షం సాక్షిగా..
మండల స్థాయిలో ప్రథమంగా నిలిచా.. సాక్షి దినపత్రిక పరీక్షలకు రెండు నెలలకు ముందే పలు సబ్జెక్ట్ల స్టడీ మెటీరియల్ను అందజేసింది. ఆ రెండు నెలలూ స్టడీ మెటీరియల్లో ఇచ్చిన మోడల్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేసి ఫాలో అయ్యాను. అందులో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఫలితంగా 584 మార్కులు సాధించి మండలంలోనే ప్రథమంగా నిలిచాను. – మట్టపర్తి కీర్తన, జడ్పీ ఉన్నత పాఠశాల, నగరం, మామిడికుదురు మండలం తోడుగా నిలిచింది పదో పరీక్షలకు ముందు సాక్షి దినపత్రిక ఇచ్చిన స్టడీ మెటీరియల్ నాకు తోడుగా నిలిచింది. ముందుగానే మెటీరియల్ ఇవ్వడంతో అది ఎంతగానో ఉపయోగపడింది. పరీక్షల ఫలితాల్లో 576 మార్కులు సాధించాను. – షేక్ షీఫీరిజ్జా, జెడ్పీ బోయస్ ఉన్నత పాఠశాల, అమలాపురం అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ‘సాక్షి’ బాసటగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద విద్యార్థులు తమ ప్రతిభను మరింత విస్తరించుకునేలా, విజయం అందుకునేలా ‘సాక్షి’ తోడుగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రిక సమకూర్చిన ఉచిత స్టడీ మెటీరియల్ వల్లే తాము అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యామని జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు చెబుతున్నారు. మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశాలపై విద్యా నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్ వల్ల ఉత్తమ ఫలితాలు సాకారమయ్యాయని ఉపాధ్యాయులే కాకుండా వాటిని అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థులు అంటున్నారు. దీనికి తోడు ‘సాక్షి’ దినపత్రికలో రోజూ పదో తరగతి పాఠ్యాంశాల వారీగా నిపుణుల సూచనలు, సలహాలతో పాఠాలను ప్రచురించడం కూడా విద్యార్థులకు ఉపయోగపడింది. తరగతి గదుల్లో రోజువారీ బోధనతోపాటు సాక్షి ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఆధారంగా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మార్కులు సాధించడంతో ‘సాక్షి’ సహకరించింది. ‘పది’లో ఉత్తమ ఫలితాలకు తోడుగా నిలిచిన ‘సాక్షి’ దినపత్రిక ఉచిత స్టడీ మెటీరియల్తోనే అత్యధిక మార్కులు సాధించామంటున్న విద్యార్థులు -
స్వరాజ్య భానుడు శ్రీరామరాజు
● అల్లూరి పోరాట నిరతి ఎనలేనిది ● ఆంగ్లేయ వలస పాలకులపై అగ్గిపిడుగు ● నేడు మన్నెం వీరుడు అల్లూరి వర్ధంతి అడ్డతీగల: భారత స్వాతంత్య్ర పోరాటంలో సాయుధ విప్లవంతో ఆంగ్లేయులకు దడ పుట్టించిన అల్లూరి శ్రీరామరాజు పోరాట నిరతి ఎనలేనిది. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఓసారి ఆ చైతన్య స్ఫూర్తి చరిత్ర పుటల్లోకి వెళ్లొద్దాం. శ్రీరామరాజుకు అడ్డతీగల ప్రాంతంతో విడదీయరాని బంధం ఉంది. 1897 జులై 4న విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగిలో ఆయన జన్మించారు. 1922వ సంవత్సరంలో మొదలు పెట్టిన సాయుధ విప్లవం 1924 మే 7న ఆయన ప్రాణాలు విడిచే వరకూ ఆయన తిరుగుబాట్లు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని రగిల్చాయి. వాటిలో రంప తిరుగుబాటు చెప్పుకోదగినది. మద్రాసు అటవీ చట్టం (1882) ద్వారా గిరిజన హక్కులను బ్రిటీష్ సామ్రాజ్యవాదులు కాలరాస్తున్న వేళ సామాజిక అసమానతలను చూసి అల్లూరి రగిలిపోయారు. దీంతో గిరిజనులతో కలసి సాయుధ పోరాటం ద్వారా తెల్ల దొరలకు నిద్ర లేకుండా చేశారు. గెరిల్లా యుద్ధ తంత్రం బ్రిటీష్ వారి ఆధునిక ఆయుధాలను ఎదుర్కోవడానికి అల్లూరి గెరిల్లా పద్ధతిని (అడవుల్లో దాక్కొని మెరుపు దాడి చేయడం) ఎంచుకున్నారు. ఇలా పోలీస్స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. ముందుగా లేఖలు రాసి మరీ దాడులు చేస్తూ బ్రిటీష్ వారికి సవాలు విసిరారు. 1922 అక్టోబర్ 15న అడ్డతీగల పోలీస్స్టేషన్పై దాడిచేసి ఆయుధాలను, అక్కడ నిర్బంధించిన కొందరు గిరిజన విప్లవకారులను విడిపించుకుని వెళ్లిపోయారు. అనంతర కాలంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, చింతపల్లి, అన్నవరం, కేడీ పేట పోలీస్స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకువెళ్లారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవడం బ్రిటీష్ పాలనను అంతం చేయడం లక్ష్యంగా ఆయన ఉద్యమం చేశారు. ఎన్నో విఫలయత్నాలు చేసి చివరకు 1924 మే 7న చింతపల్లి అడవుల్లో అల్లూరిని పట్టుకుని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం వద్ద కాల్చి చంపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన పోరాటానికి చిరునామాగా నిలిచారు. అడ్డతీగలతో ఆత్మీయ బంధం కొంత కాలంపాటు అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద నివసించి, గిరిజనులతో మమేకమై పలు విషయాలపై వారిలో చైతన్యం తీసుకువచ్చారు. రచ్చబండ వద్ద గిరిజనులతో సమావేశమై వారి తగవులను తీర్చేవారు. ఆయుర్వేద వైద్య సేవలను కూడా అందించేవారు. -
మెచ్చిన వారికి.. నచ్చిన సీటు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొంతమంది అక్రమార్కులకు దేవదాయ శాఖ రూ.లక్షలు కురిపించే కల్పవృక్షంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పైసలిస్తే చాలు హోదాలు, మార్గదర్శకాలను గాలికొదిలేసి మెచ్చిన వారికి నచ్చిన సీటు కట్టబెట్టేస్తున్నారు. ఆదాయం దండిగా వచ్చే ఆలయాలకు పోస్టింగ్లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఇటీవల జరిగిన ఈఓల బదిలీలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకా.. ఫ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెన్నికగన్న తుని తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఈఓగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన పెన్మత్స విశ్వనాథరాజును ఈఓగా కొనసాగిస్తున్నారు. లోవ దేవస్థానం ప్రసాదం తయారీలో నాణ్యత లేకపోవడంతో ఆహార నియంత్రణ శాఖ అధికారులు కొన్నాళ్ల కిందట దాడులు చేసి, జరిమానా విధించారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారి లేకపోవడమే దీనికి కారణమనే విశ్లేషణలు అప్పట్లో సిబ్బంది నుంచి వచ్చాయి. ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన ఈఓను నియమించాలి. కానీ, ఇక్కడ పెద్దాపురం మహారాణి సత్రం గ్రేడ్–2 ఈఓగా ఉన్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్ను నియమించారు. గ్రేడ్–1 సీనియార్టీ కలిగిన ఎంతో మంది వారి అర్హత కంటే తక్కువ స్థాయి ఆలయాల్లో ఈఓలుగా పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పక్కన పెట్టి మరీ గ్రేడ్–2 ఈఓను కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో నియమించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి లేకపోవడంతో ఇక్కడ యంత్రాంగం మధ్య సమన్వయంలోపించి, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే అప్పటి కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను స్వయంగా చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి యంత్రాంగం భక్తుల కంటే నిత్యం అధికార పార్టీ నేతల సేవలోనే తరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఫ వాస్తవానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అల్లు వెంకట దుర్గాభవాని పిఠాపురం ఆలయ ఈఓగా పని చేసేవారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగానే ఆమెను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పంచారామ క్షేత్రానికి బదిలీ చేయడం గమనార్హం. ఫ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే కాకినాడ బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి గ్రేడ్–1 ఈఓగా ఉన్న చింతపల్లి విజయభాస్కర్రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓగా ఉన్న వుండవల్లి వీర్రాజు చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టుబట్టి మరీ ఆయనను నియమించుకున్నారనే విమర్శలున్నాయి. ఫ కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రం ఈఓగా గ్రేడ్–1 కేడర్ అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్ను నియమించారు. ఆయనకు కాకినాడ గాంధీనగర్ ఆలయంతో పాటు కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. ఇక్కడ గ్రేడ్–1 ఈఓగా ఉన్న సౌజన్యను తప్పించి గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇలా హోదాలు, కేడర్లతో పని లేకుండా మెచ్చిన వారికి నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరిలోవ దేవస్థానం ఈఓ పెన్మత్స విశ్వనాథరాజు జిల్లా దేవదాయ అధికారి వెంకటేశ్వరరావు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈఓ జగన్మోహన శ్రీనివాస్ జిల్లా అధికారి నియామకంపైనా విమర్శలుకాకినాడ జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పుష్కర కాలం క్రితమే గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి పొందిన, సీనియర్ అయిన నడకుదురు గ్రూపు టెంపుల్స్ ఈఓ తలాటం సూర్యనారాయణను ఏప్రిల్ 1న నియమించారు. అయితే, ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారుల కనుసన్నల్లో చక్రం తిప్పుతున్న ఓ కోటరీ నెల రోజులు దాటీ దాటగానే సూర్యనారాయణను సాగనంపేసింది. దీనికి సరైన కారణం కూడా చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులే విస్మయానికి గురయ్యారు. సూర్యనారాయణ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వి.వెంకటేశ్వరరావును ఉద్యోగోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయ శాఖాధికారిగా నియమించారు. వాస్తవానికి ఈ పోస్టింగ్ ఇవ్వాలంటే సీనియర్ గ్రేడ్–1 ఈఓ లేదా ఆ శాఖలో సూపరింటెండెంట్ హోదా అయినా ఉండాలి. అమలాపురంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు పెండింగ్లో ఉందని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకొంటున్నారు. ఈ కేసు తేలకుండానే ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా అధికారిగా నియమించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లాలో సీనియర్ గ్రేడ్–1 ఈఓలు ఎంతో మంది ఉండగా రెండు జిల్లాల అవతల నుంచి అది కూడా గ్రేడ్–1కు అర్హత లేని వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఫ దేవదాయ శాఖ బదిలీల్లో నిబంధనలకు నీళ్లు! ఫ ఇష్టానుసారం ఈఓల స్థాన చలనం ఫ భారీగా డబ్బు చేతులు మారుతోందని ఆరోపణలు -
నాటి విద్యా సంస్కరణలతో నేడు ఉత్తమ ఫలితాలు
అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విద్యా సంస్కరణలతో నేటి పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ బుధవారం ప్రకటనలో తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా తొమ్మిది రకాల మౌలిక సౌకర్యాలు కల్పించారని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త భవనాలు నిర్మించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలను తల్లుల ఖాతాలకు జమ చేశారని పేర్కొన్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, షూస్, నోట్ పుస్తకాలు, బ్యాగ్ అందించారని తెలిపారు. కార్పోరేట్ స్కూల్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఏర్పాటుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి అమలుచేసిన విద్యా సంస్కరణలతోనే నేటి పదవ తరగతిలో 600 కి 596 మార్కులను నలుగురు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కై వసం చేసుకొన్నారని, మరో తొమ్మిది మంది 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వేలల్లో ఉన్నారన్నారు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ అమలాపురం రూరల్: భర్త పింఛను పొందుతూ చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ మార్పు చేసి అందిస్తామని డీఆర్డీఏ పీడీ రాంబాబు బుధవారం తెలిపారు. వృద్ధాప్య, వైధవ్య, వికలాంగ, హెల్త్ వంటి పింఛన్లు కొత్తవి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని త్వరలో మంజూరు చేయనుందన్నారు. -
పర్యావరణ హితంగా ప్లాస్మా టెక్నాలజీ
● హానికరమైన వ్యర్థాలను బూడిదగా మార్చే సాంకేతికత ● అమలాపురంలో ట్రయల్ రన్ ● పరిశీలించిన కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం టౌన్: ప్లాస్మా టెక్నాలజీ ద్వారా హానికరమైన వ్యర్థాలను బూడిదగా మార్చడం ఆధునికంగా పర్యావరణ హితమైన పద్ధతి అని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. అమలాపురం మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద రూ.5 కోట్లతో నిర్మించిన ప్లాస్మా టెక్నాలజీ యూనిట్కు ట్రయల్ రన్ బుధవారం నిర్వహించిన క్రమంలో ఆ యూనిట్ను కలెక్టర్ పరిశీలించి ప్రసంగించారు. సాధారణంగా పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయని, ప్లాస్మా అనేది నాలుగో రూపమన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వాయువును మండించినప్పుడు అది ప్లాస్మాగా మారుతుందని చెప్పారు. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ద్వారా హానికరమైన వ్యర్థాలను డ్రైవ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసే యూనిట్ను ఇక్కడ నెలకొల్పామన్నారు. తడి,పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన బయో– మెడికల్ వేస్ట్ను కూడా ఈ ప్లాస్మా యూనిట్ రోజుకు 10 టన్నులు ప్రాసెసింగ్ చేసి సురక్షితంగా నాశనం చేస్తుందని తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల చెత్త కుప్పలు ఉండవని, డంపింగ్ యార్డ్ల పేరుతో ఎక్కువ భూమి కూడా అవసరం లేదని వివరించారు. చెత్తను నాశనం చేసిన తర్వాత వచ్చే బూడిదతో గ్యాస్ వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. చెత్త సమస్యకు ఇది ఒక శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్, తహసీల్దార్ వీఎఎస్ దివాకర్, మున్సిపల్ ఇంజినీర్లు, ప్లాస్మా యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
చిన వెంకన్నకు రూ.2.20 కోట్ల రాబడి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. సగటున రోజుకి శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. 11న అప్రెంటిస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ కంపెనీలకు సంబంధించి ఈ నెల 11న ప్రధాన మంత్రి అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణులై, ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని సూచించారు. హుండీల ఆదాయం రూ.19.31 లక్షలు ఆలమూరు: మండలంలోని చింతలూరులో వేంచేసియున్న శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల లెక్కింపు బుధవారం జరిగింది. రామచంద్రపురం దేవదాయశాఖ తనిఖీ ఇన్స్పెక్టర్ ఆర్ బాలాజీ రామ్ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ వీరి అప్పారావు, కార్యనిర్వాహణాధికారి వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో స్థానిక ఆలయ ముఖ మండపంలో దేవదాయశాఖ సిబ్బంది, మహిళా భక్త బృంద భక్తులు ఈ హుండీలను లెక్కించారు. గత నెల 4 నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ (32 రోజులు) రూ.19.31 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వీర్రాజు తెలిపారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధువులు, రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామి దర్శనానికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. 9న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): ఈ నెల 9న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎంపికై నవారు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో జరిగే అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్ఏ మైదానం స్విమ్మింగ్ పూల్లో జరిగే ఎంపికలకు పురుషులు, మహిళలు హాజరు కావాలని కోరారు. -
రైతులకు నష్టం కలిగేలా ఉపాధి పనులు
వీబీజీ రామ్ జీగా కొత్త రూపం సంతరిచంకున్న ఉపాధి హామీ పథకం పనులు గత పది రోజుల వరకు జిల్లాలో మందకొడిగా సాగాయి. కాని ఇప్పుడు రోజుకు ఏకంగా 50 వేల పని దినాలు కల్పిస్తున్నామని ఈ పథకం అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. అకాల వర్షంతో రబీ అస్తవ్యసంగా మారిన నేపథ్యంలో ఉపాధి పనులు ఆపాలని, ఉపాధి వేతనదారులతో దెబ్బతిన్న పంటను రక్షించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు లక్ష్యం గుర్తుకు రావడం గమనార్హం. దీనివల్ల రైతులకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. నే డు -
ఎస్సీ హోదాకు డిమాండ్
అమలాపురం టౌన్: తమకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ అమలాపురంలో దళిత క్రైస్తవులు మంగళవారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులను తక్షణమే అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను నిరాకరిస్తున్న 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నల్లవంతెన వద్ద నుంచి మొదలైన ర్యాలీ ఎర్రవంతెన, ముమ్మిడివరం గేటు సెంటరు, గడియారం స్తంభం సెంటరు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం రోడ్డు మీదుగా సాగింది. ర్యాలీలో క్రైస్తవులు పలుచోట్ల మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేసి తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. గడియారం స్తంభం సెంటరులో నాయకులు సభ నిర్వహించి ప్రసంగించారు. కలెక్టర్ మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడులకు వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. జేఏసీ నాయకులు ఎ.రాజ్కుమార్, ఎం.యెహోషువ, ఎర్నెస్ట్ తాతపూడి, శ్రావణ్కుమార్, సువర్ణరాజు, దానియేలు, స్పర్జనరాజు, శాంతిరాజుతోపాటు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, కేపీడబ్ల్యూ, ఎఫ్ఎఫ్సీఐ తదితర క్రైస్తవ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమలాపురం పోస్టల్ డివిజన్కు 9 అవార్డులు
అమలాపురం టౌన్: రాష్ట్ర స్థాయిలో (ఏపీ పోస్టల్ సర్కిల్) 2025–26 సంవత్సరానికి అమలాపురం పోస్టల్ డివిజన్కు పలు విభాగాల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. అమలాపురం డివిజన్ పోస్టల్ సిబ్బంది 9 అవార్డులు, ప్రశంసా పత్రాలు కూడా కై వసం చేసుకున్నారు. ఈ విషయాలను అమలాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీకర్ బాబు వెల్లడించారు. ఇటీవల బాపట్లలో జరిగిన పోస్టల్ ఉన్నతాధికారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి చేతుల మీదుగా అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీకర్బాబు ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు అవార్డులు అందుకున్నారు. నికర ఖాతాలు తెరవడంలో రాష్ట్ర స్థాయిలో డివిజన్ ద్వితీయ స్థానాన్ని, డిజిటల్ ట్రాన్స్క్షన్స్లో తృతీయ స్థానాన్ని సాధించింది. -
ఉపాధి కార్మికులతో వ్యవసాయ పనులు
● కష్టకాలంలో అందని చేయూత ● అకాల వర్షానికి దెబ్బతిన్న రబీ వరి ● కోత యంత్రాలు దిగక నిలిచిన మాసూళ్లు ● గట్ల మీదనే గడ్డి సేకరణ యంత్రాలు ● తడిసిన ధాన్యం ఆరబోతకు కూలీల కొరత ● మరోవైపు ఆగని ఉపాధి హామీ పనులు ● గత ప్రభుత్వంలో ఉపాధి కూలీల ద్వారా పంట ఒబ్బిడి ● జిల్లాలో 15 వేల ఎకరాలకు పైబడి ధాన్యం రాశులపైనే కె.గంగవరంలో తడిసిన ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులుసాక్షి, అమలాపురం: ఆపత్కాలంలో అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారీ వర్షాల వల్ల ఒకవైపు పంట దెబ్బతినడం.. మరోవైపు యంత్రాలతో కోతలు నిలిచిపోయి కూలీల కోసం రైతులు ఎదురు తెన్నులు చూస్తున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో ఉపాధి పనిదినాల పేరుతో జిల్లా యంత్రాంగం ఉపాధి కార్మికులను అందుబాటులో లేకుండా చేస్తోంది. జిల్లాలో ఈ నెల 3వ తేదీన రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం రైతుల వెన్ను విరిచింది. వర్షాల సమయంలో సుమారు 15 వేల ఎకరాలకు సరిపడా 56,260 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దనే ఉంది. సుమారు 10 శాతం ధాన్యం తడిసిపోయింది. చేలల్లో రాశులు ఉంచిన రైతులకు ఎక్కువగా దెబ్బతగిలింది. దీనిని గట్ల మీదకు చేర్చి ఎండబెట్టడం రైతులకు ఇప్పుడు తలకుమించిన భారంగా మారింది. వర్షం వల్ల చేలల్లో నీరు చేరడంతో వారం రోజుల పాటు యంత్రాలు దిగే అవకాశం లేదు. పడిపోయిన చేలతోపాటు పక్వానికి వచ్చిన చేలల్లో కోతలు అత్యవసరంగా చేయాలి. చేలల్లో ఉండిపోయిన గడ్డిని ఒబ్బిడి చేయాలి. కాని ఈ సమయంలో కూలీలు లేకపోవడంతో రైతులు హైరానా పడుతున్నారు. మరోవైపు పురుషులకు రూ.600 నుంచి రూ.700 వరకు ఉన్న కూలీ ఇప్పుడు రూ.750 నుంచి రూ.800కు చేరింది. మహిళలకు రూ.450 వరకు ఉన్న కూలీ రూ.500కు పెంచారు. ఇది తమకు మరింత భారంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కోతలకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతున్నారు. ఎకరాకు 12 మంది కూలీలు అవసరం కాగా, పడిపోయిన చేలల్లో కోతలకు 15 మంది అవసరమవుతున్నారు. ఈ విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తివేసింది. తడిసిన ధాన్యం కొనుగోలుపై నోరు మెదడపం లేదు. మరోవైపు ఉపాధి కార్మికులతో వ్యవసాయ పనులు చేయించాలనే రైతుల డిమాండ్ పట్టించుకోవడం లేదు. దీనిపై సోమవారం కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), కోనసీమ రైతు సంఘాలు ధర్నా చేశాయి. అది 2023 ఏప్రిల్ నెలాఖరు సమయం. జిల్లాలో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. నాటి కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో రైతులకు చేదోడుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) వేతనదారులతో వ్యవసాయ పనులు చేయించారు. నీట మునిగిన పనులు ఒబ్బిడి చేయడం, ధాన్యం రాశులను గట్ల మీదకు చేర్చడం, నీట మునిగిన చేలల్లో ఉన్న ముంపు నీరు దిగేలా బోదెలు వేయించడం చేశారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 1,03,000 ఉపాధి పనిదినాలు అమలు చేయడంతో రైతులు ముంపు ముప్పు నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డారు. నా డు -
జవాబుదారీతనంతో పని
అమలాపురం రూరల్: పారదర్శకత, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి రెవెన్యూ అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయిలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం, రీ–సర్వే ప్రక్రియ వేగవంతం, ప్రజా ఫిర్యాదుల తక్షణ పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 22–ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ జరిపి, అర్హత కలిగిన భూములను జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. జేసీ వైఖోమ నిడియాదేవి, ఆర్డీవోలు జి.మమ్మీ, బి.భాగ్యవతి, సర్వే ఏడి కే. ప్రభాకర్ పాల్గొన్నారు. -
హామీల విస్మరణ ం
ఇవీ డిమాండ్లు ఫ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ఫ అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్ట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ఫ రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఫ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఫ మినిమమ్ టైం స్కేల్, ఇంటి అద్దె, కరవు భత్యం ఇవ్వాలి. ఫ రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యుటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ఫ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. ఫ వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ఫ మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ఫ కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఫ డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. కపిలేశ్వరపురం: ప్రభుత్వ బడి నిర్మాణం, నిర్వహణ, విద్యా బోధన, చిన్నారుల ఆలనా పాలన, ఉపాధ్యాయులకు చేయూత.. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యా శాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సంఖ్య రీత్యా తక్కువగానే ఉన్నప్పటికీ విద్యా శాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఈ ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి, సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ కానీ వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవలివీ.. మండల మానవ వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) కో ఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయ నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీర్ పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విసిగి వేసారి.. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి డిమాండ్లను విస్మరించారు. మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి, రాష్ట్రం ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటికి పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. ·˘ çÜÐ]l${VýS Õ„ýS E§øÅVýS$ÌS ´ùÆý‡$»êr ·˘ ÐéÇ çÜÐ]l$çÜÅÌS పరిష్కారానికి గతంలో లోకేష్ హామీ ·˘ Æð‡…yólâýæÏÐ]l#™èl$¯é² çܵ…¨…^èl° {糿¶æ$™èlÓ… ·˘ yìlÐ]l*…yýlÏ Ýë«§ýl¯]lMýS$ çÜMýS$r$…º E§ýlÅÐ]l$… ·˘ Ðól$ 15¯]l Ð]l$…{† ÌZMóS‹Ù ఇంటికి పాదయాత్ర ·˘ EÐ]l$Ãyìl hÌêÏÌZ ఆ దిశగా కదులుతున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లన్నీ రాజ్యాంగబద్ధమైనవి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే మేము అడుగుతున్నాం. కూటమి ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు గడిచిపోతున్నా మా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – నూకపెయ్యి గంగాధర్, రాష్ట్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యుడు, ఉప్పలగుప్తం -
నరసన్న హుండీల ఆదాయం రూ.18,92,187
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం ఎండోమెంట్స్ అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో భక్తుల నుంచి విరాళాలు రూపంలో మొత్తం రూ.18,92,187 ఆదాయం చేకూరింది. మార్చి 31 నుంచి మే 5వ తేదీ వరకూ 36 రోజులకు పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారుడు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఆలయంలోని హుండీలను తెరచి లెక్కింపు చేపట్టారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.18,61,780, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.10,847, అన్నదానం హుండీల ద్వారా రూ.19,560 లభించినట్టు ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు, స్వామివారి సేవకులు పాల్గొన్నారు. -
విఘ్నేశ్వరునికి సంకటహర చతుర్థి పూజలు
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారికి సోమవారం సంకటహర చతుర్థి పూజలు వైభవంగా జరిపారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి పంచమృతాభిషేకాలు, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాలు, గరిక పూజ, ఉండ్రాళ్ల పూజ, శ్రీ లక్ష్మీ గణపతిహోమం నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం 2,276 మంది భక్తులు స్వీకరించారు. స్వామికి వివిధ పూజల ద్వారా రూ.3,24,759 ఆదాయం లభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. విద్యా శాఖలో విభజన షురూ రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియకు విద్యా శాఖ తెర తీసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగింది. దీంతో, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఉమ్మడి తూర్పు గోదావరి విభజన జరిగింది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 11 ఏజెన్సీ మండలాలను కలిపి ఇటీవల పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు. పునర్విభజన అనంతరం కొత్త జిల్లాల్లో విద్యా శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసి, పరిపాలన సాగిస్తున్నారు. అయితే, జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ బదిలీలు, పదోన్నతులు మాత్రం ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన మాత్రమే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటుతో పాటుగా ఇతర అంశాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన చేపట్టేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల విభజన, సర్దుబాటు ప్రక్రియకు తెర తీసింది. గెజిట్లో నోటిఫై కావడంతో.. కొత్త జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గెజిట్లో నోటిఫై చేయడంతో ఇకపై అన్ని ప్రక్రియలూ కొత్త జిల్లాల వారీగానే జరగనున్నాయి. ఇటీవల నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు మాత్రం కేంద్రం ఇంకా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన తొలుత ఉద్యోగుల సర్దుబాటుపై దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాల వారీగా ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఆ సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న వారు, ఖాళీలు, మిగులు పోస్టులు, విద్యా శాఖ కార్యాలయాల్లో సిబ్బందిని పరిగణలోకి తీసుకుని పోస్టుల సర్దుబాటు చేస్తారు. ఈ క్రమంలో స్థానికత, సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తే జూన్, జూలైల్లో కొత్త జిల్లాల ప్రాతిపదికన విద్యా శాఖ పాలన ప్రారంభమయ్యే అవకాశంఉంది. ఏమవుతుందో! గతంలో తెలంగాణ రాష్ట్రంలో పునర్విభజన జరిగిన జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు వివాదాస్పదంగా, గందరగోళంగా మారింది. ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడి ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది. తమ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. ఆర్డీఓ శ్రీరమణి సస్పెన్షన్ రద్దు సామర్లకోట: పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణి సస్పెన్షన్ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో ఫిబ్రవరి 28న 28 మంది మరణానికి కారణమైన బాణసంచా విస్ఫోటంలో డివిజన్ స్థాయి అధికారులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా నాడు పెద్దాపురం ఆర్డీఓగా ఉన్న శ్రీరమణి కూడా సస్పెన్షన్కు గురయ్యారు. సామర్లకోట మండలం ఏర్పడినప్పటి నుంచీ కాకినాడ డివిజన్లోనే ఉంది. ఆర్డీఓ సస్పెండ్ అవడానికి నెల రోజుల ముందే ఈ మండలాన్ని పెద్దాపురం డివిజన్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో ఆర్డీఓకు సంబంధం లేదంటూ ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. ఈ నేపథ్యంలో శ్రీరమణి సస్పెన్షన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఆర్థిక సంక్షోభంలో మొక్కజొన్న రైతులు
రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం: రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం పట్టణ గాంధీపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, సుమారు 30 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించినా, బహిరంగ మార్కెట్లో రైతులకు కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్య మాత్రమే ధర లభిస్తోందని అన్నారు. 2026 మార్చి నాటికి సగటు మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,589గా నమోదైందని, కొన్ని ప్రాంతాల్లో ధర రూ.1,429 వరకూ పడిపోయిందని చెప్పారు. ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,200 వరకూ ఉంటున్నప్పటికీ, రైతులు తీవ్ర నష్టాలతో పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, కృష్ణా జిల్లాల్లోని రైతులు మధ్యవర్తుల ఒత్తిడికి లోనై తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మార్క్ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను సేకరించారని గుర్తుచేశారు. ఇటీవల ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మొక్కజొన్న సేకరణకు ముందుకు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బోస్ విమర్శించారు. మొక్కజొన్నను తక్షణమే కనీస మద్దతు ధర రూ.2,400కు ప్రభుత్వం సేకరించాలన్నారు. ప్రతి మండలంలో ప్రభుత్వ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలు, పెనుగాలుల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, నేతలు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
రాజమహేంద్రవరం సిటీ: బీసీలకు స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించగా, జిల్లాలో వినతులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని, మట్టపర్తి సత్యనారాయణ, డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు, నక్కా సోమేశ్వరరావు తదితరులు రాజీవ్ రంజన్ మిశ్రాను కలసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక కులాల ప్రజలు విద్యా, ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. వాడపల్లి ఆలయానికి రూ.కోటితో రోడ్డు ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయానికి బీటీ రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.కోటి నిధులు మంజూరైనట్లు సోమవారం ఈఓ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. -
అసౌకర్యాలతో చిక్కిత్సా!
● ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని వైద్యం ● చాలాచోట్ల వైద్యుల కొరత ● అంబులెన్స్లు లేవు, ఉన్నచోట డ్రైవర్లు లేరు సాక్షి, అమలాపురం: సర్కారు వైద్యం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఆలనాపాలనా కరవైంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీలు), ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్సీలు), ఇలా అన్నింటా వసతుల లేమి కనిపిస్తోంది. గైనకాలజీ, కార్డియాలజీ వంటి విభాగాలకు వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో అత్యవస వైద్యం కోసం రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే అంబులెన్స్ కొరత పట్టిపీడిస్తోంది. ఉన్నచోట డ్రైవర్లు లేక ఇబ్బంది వస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఆసుపత్రులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, పలు సమస్యలు వెలుగుచూశాయి. ఆ వివరాలు ఇలా.. సమస్యల్లో ‘పడకేసి’ అమలాపురంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ 40 నుంచి 50 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్ పేషెంట్లకు బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రికి ఉన్న ఒకే ఒక అంబులెన్స్ రోగులకు అత్యవసరమైతే సేవలు అందడం లేదు. ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగే మెడికల్, బ్లడ్ డొనేషన్ క్యాంప్లకు ఇది వైద్యులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆసుపత్రిలో మందుల కొరత ఉంది. దాదాపు 600 రకాల మందులను అందుబాటులో ఉండాల్సి ఉండగా, క్వార్టర్ చివరిలో ఉండడం వల్ల దాదాపు 70 నుంచి 80 రకాల మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ● రామచంద్రపురం 100 పడకల ఏరియా ఆసుపత్రి మండపేట, అనపర్తి, రామచంద్రపురం నియోజకవర్గాలకు పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ఆర్ఎంఓ, చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్ వైద్యులు లేరు. అతి ముఖ్యమైన కార్డియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. దీనితో గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసరమైన వైద్యం అందడం లేదు. ఈ నేపథ్యంలో కాకినాడకు పరుగులు తీయాల్సి వస్తోంది. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ ప్రస్తుతం మూలనపడింది. ● కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు అంబులెన్స్ ఉంది. కానీ డ్రైవర్ లేరు. దానితో షెడ్లో నిరుపయోగంగా ఉంది. ● రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ను నియమించకపోవడంతో గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్ట్ను నియమించకపోతే ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించినా, ఫలితం లేదు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడు ఉన్నా వైద్య చికిత్సలకు అవసరమైన సదుపాయాలు అవసరం ఉంది. దీనికోసం రూ.40 లక్షలతో ప్రతిపాదన చేసినా ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహించేందుకు పది బెడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ నిలిచిపోతే జనరేటర్ సదుపాయం లేక డయాలసిస్ జరుగుతున్న సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ● పి.గన్నవరం సీహెచ్సీలో డీసీఆర్, పీడియాట్రిషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, మత్తు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎస్సార్ పద్ధతిలో తాత్కాలికంగా డాక్టర్లను నియమించి సేవలందిస్తున్నారు. రెగ్యులర్ డాక్టర్లు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గైనకాలజిస్ట్ పోస్టులకు గాను ఒకరిని ఇతర ప్రాంతానికి డిప్యూటేషన్ వేశారు. దీంతో ఉన్న ఒక డాక్టర్ సెలవు పెడితే ఆ రోజుల్లో డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. డిప్యూటేషన్పై వెళ్లిన గైనకాలజిస్ట్ను వెనక్కి రప్పించాలని, శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టోర్ నుంచి రావాల్సిన మందుల స్టాక్ ఆలస్యంగా వస్తుంది. -
పరిష్కారమే పెద్ద సమస్య
● అర్జీలకు స్పందించని అధికారులు ● పదే పదే విన్నవిస్తున్నా పట్టించుకోని వైనం ● ప్రయోజనం లేకుండా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: పదే పదే తిరుగుతున్నాం.. సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం మాత్రం దొరకడం లేదని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న అర్జీదారులు వాపోతున్నారు. ప్రతి సోమవారం చంద్రబాబు ప్రభుత్వం అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ప్రయోజనం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఒక సమస్య పరిష్కారానికి చాలాసార్లు తిరుగుతున్నామని జనం అంటున్నారు. దీంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, తాగునీరు, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ నిడియదేవి, డీఆర్వో సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ మొత్తం 153 అర్జీలను స్వీకరించారు. ఇదిలా ఉంటే పలువురు తమ సమస్యలపై ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం రండి.. న్యాయం జరగడం లేదు మాది ముమ్మిడివరం మండలం అనాతవరం. తమ గ్రామ సర్వే నంబర్ 276లో మా కుటుంబ సభ్యులకు 45 సెంట్ల భూమిని తల్లిదండ్రులు రాసిచ్చారు. ప్రభుత్వం చేసిన రీ సర్వేలో 40 సెంట్ల భూమి ఉందని అధికారులు నిర్ధారించారు. 5 సెంట్ల భూమి తక్కువ ఉందని పక్క రైతు నుంచి తమకు భూమిని స్వాధీనం చేయాలని పీజీఆర్ఎస్లో ఐదు వారాలుగా ఫిర్యాదు చేస్తున్నాం. అధికారులు న్యాయం చేయలేదు. మళ్లీ ఇటీవల సర్వే చేసి మీ భూమిలో 40 సెంట్లు ఉందని సర్వే అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం ఫిర్యాదు చేస్తున్నా మండల సర్వేయర్ పట్టించుకోవడం లేదు. – భూల మణికుమారి, అనాతవరం పట్టించుకోకుంటే ఆందోళనే.. డి.రావులపాలెంలో ఇళ్ల మధ్య పీచు యంత్రాలు పెట్టి పీచు తయారు చేస్తున్నారు. దీనివల్ల దుమ్మూ ధూళితో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. పది వారాలుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. పరిశ్రమ శాఖ, పంచాయతీ అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. గ్రామానికి దూరంగా పెట్టుకోవాలని గ్రామస్తులు, పెద్దలు చెప్పినా ఆ యజమాని పట్టించుకోవడం లేదు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళన చేస్తాం. – నల్లా పుల్లయ్యనాయుడు, డి.రావులపాలెం నడవలేను.. ఆదుకోండి నాకు పుట్టుక నుంచి రెండు కాళ్లూ లేవు. ప్రభుత్వం నుంచి మూడు చక్రాల బ్యాటరీ బండిని మంజూరు చేయాలని ఎన్నో సార్లు విన్నవించుకున్నా. 90 శాతం వికలాంగురాలిని. నేను నడవలేను. నాకు తల్లిదండ్రులు లేరు. పక్క ఇంటి దయాదాక్షిణ్యాల మీద వేరేవారి పంచన ఉండి ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛనుతో బతుకుతున్నాను. నేను బయటకు వెళ్లాలంటే ఒకరి సాయం కావాలి. అధికారులు ఇప్పటికైనా కరుణించాలి. – రొక్కాల మరియమ్మ, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు అల్లవరం మండలం గోడిలంక పీహెచ్సీ వైద్యాధికారి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల జిల్లా మలేరియా అధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లడానికి అనుమతి కోరగా, మహిళా సిబ్బందిని డాక్టర్ బాలరాజు దారుణంగా దూషించారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైద్యాధికారి మాట్లాడారు. ఆ వైద్యుడిపై సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలి. – మహిళా ఉద్యోగులు గోడిలంక పీహెచ్సీ అల్లవరం మండలం -
చెరువులో పడి వ్యక్తి మృతి
తాళ్లరేవు: జాతీయ రహదారి 216 చెంతన కోరంగి వంతెన దిగువన గల రొయ్యల చెరువుల్లో పడి వినకోటి సత్తిబాబు(34) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యన్నారాయణ, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పటవల ఎస్సీపేటకు చెందిన సత్తిబాబు రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. అయితే చెరువు మధ్య భాగంలో చేరే మురుగును తొలగించేందుకు ఏర్పాటు చేసిన యంత్రంలో ప్రమాదవశాత్తూ కాలు చిక్కుకుపోయింది. దీంతో సత్తిబాబు నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన ఇతర కూలీలు హుటాహుటిన అతన్ని బయటకు తీసి తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక సామాజిక ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కోరంగి ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతోపాటు, చెరువుల యజమాని రఘుతో మాట్లాడారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని చెరువుల యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వృద్ధురాలికి అపరిచిత వ్యక్తి టోకరా అమలాపురం టౌన్: ఓ వృద్ధురాలికి బ్యాంక్ రుణం ఇప్పిస్తానని నమ్మించి, ఓ అపరిచిత వ్యక్తి 24 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. ఈ మేరకు అమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేరూరు శివారు తోట్లపాలేనికి చెందిన ఆ వృద్ధురాలి ఇంటికి అపరిచిత వ్యక్తి ఈ నెల 2న మోటారు సైకిల్పై వచ్చి మాట కలిపి రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె ఇంట్లో బంగారు గొలుసు ఉందని గ్రహించాడు. రుణం కాగితాలు పూర్తి చేసేందుకు ఆమెను పంచాయతీ వద్దకు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మి ఆ వృద్ధురాలు ఆ అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్ ఎక్కింది. పంచాయతీ వద్దకు వెళ్లిన తర్వాత ఆమెను అక్కడే దింపి ఇప్పుడే వస్తానని చెప్పి వృద్ధురాలి ఇంటికి వెళ్లి బంగారు నగను కాజేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు గ్రామంలో సీసీ పుటేజీలు సేకరించారు. దాని ఆధారంగా ఆ ఆగంతకుడిని గుర్తించి పట్టి ఇచ్చిన వారికి రూ. 5 వేలు రివార్డుగా అందిస్తామని క్రైమ్ పోలీసులు ప్రకటించారు. వివరాలకు 94404 73215 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు. జనసేన కార్యకర్తపై టీడీపీ నేతల దాడి పి.గన్నవరం: అమ్మవారి జాతర సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తపై టీడీపీ నాయకులు, ఇద్దరు పోలీసులు దాడికి పాల్పడ్డారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పి.గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాడ్రేవుపల్లిలో మాణిక్యాలమ్మ జాతర సందర్భంగా ఈ ఘటన జరిగింది. జనసేన నాయకుల కథనం ప్రకారం.. ఈ నెల 2న మాణిక్యాలమ్మ జాతర సందర్భంగా వాడ్రేవుపల్లికి చెందిన మానేపల్లి నాగసాయి లక్ష్మీ నరసింహస్వామి అనే జనసేన కార్యకర్త నాయీ బ్రాహ్మణుల తరఫున పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సత్యనారాయణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అదే రోజు రాత్రి అతను భార్య, పిల్లలతో కలసి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, పాత కక్షలతో స్థానిక టీడీపీ నాయకులు కోళ్ల సాయితేజ, బొక్కా వెంకట రమణమూర్తి, ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు (వెంకన్న బాబు), చెల్లుబోయిన వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. ఫ్లెక్సీ పెట్టడానికి నీకు ఎంత ధైర్యం అంటూ, కులం పేరుతో దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన అతని భార్యను గెంటేశారు. జాతరలో తన భర్తను టీడీపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కొట్టారని ఆరోపిస్తూ బాధితుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు చేసింది. ఫ్లెక్సీ తీసివేయాలంటూ ఏఎస్సై, కానిస్టేబుల్ కలసి తన భర్తను కొట్టారని తెలిపింది. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్సై శివకృష్ణకు ఫిర్యాదు చేసింది. ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, నాయకులు వాసంశెట్టి కుమార్, జేఎస్ రాజా, అడబాల తాతకాపు, ఎన్.రఘు తదితరులు బాధితులకు మద్దతు నిలిచారు. -
యానాంలో ‘మల్లాడి’కే పట్టం
● ఉత్సాహంగా విజయోత్సవ ర్యాలీ ● మంచి పాలన అందిస్తానని కృష్ణారావు వెల్లడి యానాం: యానాం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు ఆరోసారి ఎన్నికయ్యారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయనకు 19,863 ఓట్లు రాగా, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ కె.చిట్టిరాజు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. మూడో రౌండ్లో మల్లాడికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి శ్రీనివాస్ అశోక్ తన సతీమణి లక్ష్మీ స్నేహతో కలసి బయటకు వెళ్లిపోయారు. డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 11 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజుకు 167 ఓట్లు, స్వతంత్రులు జనిపల్లి వెంకన్నబాబుకు 9 ఓట్లు, కాళ్ల వెంకటరమణకు 18 ఓట్లు, గిడ్డి బలరాంకు 78 ఓట్లు, తిరుకోటి ఆదిమూర్తికి 4 ఓట్లు, నాటి బూరయ్యకు 19 ఓట్లు, మల్లాడి ఉదయలక్ష్మికి 9 ఓట్లు, మెల్లం శ్రీనివాసరావుకు 14 ఓట్లు, లక్ష్మీస్నేహా మేడపాటికి 34 ఓట్లు, షేక్ అహ్మద్షా ఖాదర్కు 27 ఓట్లు, సూరిమిల్లి సుబ్బారావుకు 195 ఓట్లు లభించాయి. ఆరోసారి ఎన్నికై .. నియోజకవర్గం నుంచి ఆరోసారి మల్లాడి కృష్ణారావు విజయకేతనం ఎగురవేశారు. 1996, 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందారు. ఇప్పుడు తిరిగి మల్లాడి విజయం సాధించారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణారావు ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి మీనా నుంచి మల్లాడి కుమారుడు రఘువంశీ సర్టిఫికెట్ అందుకున్నారు. భారీగా విజయోత్సవం మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. ప్రత్యేక వాహనంపై మల్లాడి నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఓ వైపు బాణసంచా కాల్పులు, మరోవైపు పూలమాలలతో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మహిళలతో విజయోత్సవ ర్యాలీ సాగింది. ఇకపై మంచి పరిపాలన ఉంటుందని మల్లాడి కృష్ణారావు అన్నారు. గతంలో పేకాట పరిపాలన చూశారని, ప్రజలు అశోక్కు గుణపాఠం చెప్పారని విమర్శించారు. -
64,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తి
పి.గన్నవరం: జిల్లాలో 64,500 ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.వెంకట రామారావు తెలిపారు. ఆదివారం ఆయన మండలం రాజులపాలెం శివారు మర్రిగుంటలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాట్రేనికోన, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో అధిక వర్షం కురిసిందన్నారు. ఆయన వెంట డీఆర్సీఏడీ ఏడీఏ ఏవీఎస్ రాజశేఖర్, ఇన్చార్జి ఏడీఏ సీహెచ్డీ విజయకుమార్, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పచ్చిగా మోసం!
పిఠాపురం: రబీ ధాన్యం కొనుగోళ్లలో కొంత మంది మిల్లర్లు, అధికార యంత్రాంగం కలిపి దోపిడీకి తెర తీసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో రబీ కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే పచ్చి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసిన కొంత మంది మిల్లర్లు.. ఇప్పుడు కొందరు అధికారులతో కుమ్మకై ్క, ఎండు ధాన్యం కొంటున్నట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) ద్వారా కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) నమోదు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు రబీ వరి కోతలు పూర్తయిన పంట పొలాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నమోదు చేయాల్సి ఉండగా.. సీఎంఆర్ నమోదు కోసం ఆ ప్రక్రియ ఎక్కడా జరగడం లేదని పలువురు అంటున్నారు. అయితే, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని అధికారులు కొట్టిపారేస్తున్నారు. రబీలో జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దాదాపు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. జిల్లాలో సుమారు 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణాకు 2,101 వాహనాలను, సుమారు 37.50 లక్షల గోనె సంచులు, 227 తేమ యంత్రాలను సిద్ధం చేశారు. అలాగే, 3,400 మంది హమాలీలను, 990 మంది సిబ్బందిని నియమించారు. సీఎంఆర్కు 119 రైస్ మిల్లులను ఎంపిక చేశారు. ఏం జరుగుతోందంటే.. జిల్లాలో రబీ వరి కోతలు మార్చి నెలాఖరుకే ప్రారంభమయ్యాయి. అప్పటికి ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇదే అదనుగా కొంత మంది ప్రైవేటు వ్యాపారులు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి, తమ మిల్లులకు తరలించేశారు. నిబంధనల ప్రకారం సాధారణ రకం 75 కిలోల బస్తాకు రూ.1,725, ఎ–గ్రేడ్ రకానికి రూ.1,777 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, అప్పటికప్పుడు మెషీన్తో కోసిన 75 కేజీల పచ్చి ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,300కు కొనుగోలు చేశారని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కొద్ది శాతం మాత్రమే ధాన్యం ఉందని అంటున్నారు. వరి కోతలు చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో లక్షల బస్తాల ఎండు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సీఎంఆర్లో నమోదు చేయిస్తూ, దోపిడీకి తెర లేపారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తమ వద్ద తక్కువ ధరకు కొన్న పచ్చి ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేసినట్టుగా ఆన్లైన్లో నమోదు చేస్తూ.. ఒక్కో బస్తాకు రూ.400కు పైగా దోచుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈవిధంగా రూ.కోట్లలో దోపిడీ సాగుతోందన్నది వారి వాదన. పంట వేసినప్పుడు కామన్ వైరెటీగా ఉన్న సాధన రకం ధాన్యాన్ని కోతల సమయంలో గ్రేడ్–1 ఫైన్ వైరెటీగా మార్చారు. ఎక్కువ ధర చెల్లించాల్సి రావడంతో మిల్లర్లు ఈ రకం కొనుగోలును ప్రస్తుతం నిలిపివేశారు. తాము పండించిన సాధన రకం ధాన్యం తమ వద్దనే ఉండగా.. సీఎంఆర్లో కొనుగోలు చేసినట్లు చూపుతూ మోసానికి పాల్పడుతున్నారని రైతులు అంటున్నారు. అవాస్తవం సీఎంఆర్ నమోదు నిబంధనల ప్రకారమే జరుగుతోంది. గతంలో కొన్న ధాన్యానికి ఇప్పుడు సీఎంఆర్ నమోదు అనేది అవాస్తవం కాదు. అటువంటిది ఎక్కడా లేదు. అలా జరిగి ఉంటే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – దేవులా నాయక్, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ, కాకినాడ రబీ ధాన్యం దిగుబడి అంచనా 6.76 లక్షల టన్నులు జిల్లాలో నెల రోజుల క్రితమే పచ్చి ధాన్యం కొనుగోలు 75 కేజీల బస్తాకు రూ.1,300 మాత్రమే చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం ఎండు ధాన్యం రూ.1,777కి కొన్నట్లు సీఎంఆర్లో నమోదు! రూ.కోట్ల మేర రైతు సొమ్ము దోపిడీసీఎంఆర్లో మాయాజాలం! సీఎంఆర్ కోసం ఏ కేంద్రం నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారో పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. కానీ ఎక్కడా కొనుగోలు చేయకుండానే ఎండు ధాన్యం కొన్నట్టు చూపుతూ, మిల్లర్లకు అనుకూలంగా సీఎంఆర్ నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని ఓ బడా వ్యాపారి నెల రోజుల క్రితమే భారీగా పచ్చి ధాన్యం కొనుగోలు చేయగా.. ఆయనకు లాభం చేకూరేలా ఎండు ధాన్యం కొన్నట్లు అధికారులు సీఎంఆర్ నమోదు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీఎంఆర్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
డీడీ మూర్తి సేవలు అభినందనీయం
అమలాపురం రూరల్: పశు సంవర్ధక శాఖలో 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన డిప్యూటీ డైరెక్టర్ కర్నీడి వెంకట సత్యనారాయణమూర్తి సేవలు అమూల్యమని ఆ శాఖ డీడీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా స్థానిక సత్యనారాయణ కల్యాణ మండపంలో ఆదివారం ఆ శాఖ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో పీఆర్ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ మూర్తి తదితరులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మూర్తి దంపతులను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. అనంతరం మూర్తి మాట్లాడుతూ కోనసీమ రైతులు, ఉద్యోగుల సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు రైతులకు సేవలు అందించానన్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు డీటీఓ శ్రీనివాసరావు అమలాపురం రూరల్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యా సంస్థల బస్సులు మే 15 కల్లా ఫిట్నెస్ పొందాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 71 విద్యాసంస్థలకు 784 బస్సులు ఉన్నాయని, వాటికి విధిగా ఫిట్నెస్ పొందాలని డీటీఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బీవీసీ ఇంజినీరింగ్ విద్యా సంస్థకు చెందిన 27 బస్సులను తనిఖీ చేసినట్టు ఆయన తెలిపారు. రవాణాశాఖ అధికారులు జిల్లాలో ప్రతి విద్యా సంస్థకు వచ్చి బస్సులు తనిఖీ చేస్తారని వివరించారు. బస్సులలో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారం తదితర అంశాలను వారు పరిశీలిస్తారని తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
కళ్లంలో నీళ్లుసాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పరిధిలో రబీ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తు నుంచి పంట చేతికి వచ్చే వరకూ సాగునీరు.. ఎరువుల కోసం రైతులు పడిన కష్టాలు ఎన్నో. అన్నింటినీ అధిగమించి పంట పండించినా.. కోతల వేళ కష్టాలు తప్పడం లేదు. నిన్నమొన్నటి వరకూ డీజిల్ కొరతతో మెషీన్ కోతలకు ఇబ్బంది అయ్యింది. ఆదివారం కురిసి భారీ వర్షంతో ఆ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. జిల్లాలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. వర్షానికి ముందు భారీ ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు పడిపోయాయి. దీంతో అమలాపురం–బొబ్బర్లంక, అమలాపురం–కాకినాడ జాతీయ రహదారి 216 వంటి ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొత్తపేట మండలం అవిడి వద్ద చెట్టు కూలిపోవడంతో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీలు, క్రేన్లతో వాటిని తొలగించారు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగబడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన వంటి శివారు మండలాలకు సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు వంటి లోతట్టు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. అమలాపురం పట్టణం ఈదరపల్లి వంతెన దిగువన రెండడుగుల ఎత్తున నీరు చేరింది. తడిసిన ధాన్యం రెండు గంటల పాటు కురిసిన వర్షం రబీ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షానికి కళ్లాలోని ధాన్యం తడిచిపోయింది. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పుకున్నారు. అయినా వర్షం నీరు దిగువ నుంచి ఆ రాశుల్లోకి చేరింది. ఈదురుగాలులకు బరకాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు. జిల్లాలో కోతలు ముమ్మరంగా సాగినప్పటికీ ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. యంత్రాల కోత వల్ల ధాన్యంలో 24 శాతం నుంచి 26 శాతం తేమ వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొంటున్నారు. దీనివల్ల రైతులు మూడు నాలుగు రోజుల పాటు ధాన్యాన్ని ఎండబెట్ట విక్రయించాల్సి వస్తోంది. దీని వల్ల రైతుల కళ్లాల్లోనే ధాన్యపు నిల్వలు ఉండిపోవడంతో అవి తడిసిపోయాయి. ఈ ధాన్యాన్ని ఆరబెట్టడం వారికి తలకు మించిన భారంగా మారింది. వర్షానికి పనులు కూడా తెలిసిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 183 ఎకరాలలో చేల మీద పనులు ఉన్నట్టు అంచనా. అయితే వాస్తవంగా ఇంతకన్నా ఎక్కువే పనులు మీద ఉన్నాయని రైతులు చెప్తున్నారు. మొన్న డీజిల్ కొరత.. నేడు వర్షం.. అకాల వర్షం రబీ వరి రైతుల నెత్తిన పిడుగు పాటుగా మారింది. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 1.31 లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఇప్పటి వరకు 64,567 ఎకరాలలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 66,437 ఎకరాలలో వరి కోతలు జరగాల్సి ఉంది. ముందస్తు సాగు జరిగిన ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో 65 శాతం వరకు కోతలు పూర్తి కాగా, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో 40 శాతం కోతలు మాత్రమే జరిగాయి. వారం పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న డీజిల్ కొరత వల్ల వరి కోతలు ఆలస్యమైన విషయం తెలిసిందే. దీనివల్ల కోతల జాప్యమయ్యాయి. తాజాగా భారీ వర్షం వల్ల ఐదారు రోజులు పాటు యంత్రాలు పొలాల్లోకి దిగే పరిస్థితి లేదు. దీనికి తోడు పనల మీద ఉన్న చేలు, పడిపోయిన చేల నూర్పిళ్లు కూడా వారం రోజుల పాటు ఆలస్యం కానుంది. సకాలంలో డీజిల్ అంది ఉంటే జిల్లాలో ఇప్పటికే 90 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యేవని రైతులు చెబుతున్నారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపించిన అలసత్వం ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణమైంది. ఉద్యాన పంటలకు మేలు ఇదిలా ఉండగా భారీ వర్షం ఉద్యాన రైతులకు కొంత ఊరటనిచ్చింది. గడిచిన పది రోజులుగా జిల్లాలో 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల వల్ల కొబ్బరి, అరటి, పోక, కోకో, కూరగాయల పంటలు వాడిపోతున్నాయి. బోర్ల ద్వారా నీరందిస్తున్నా ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురవడంతో ఉద్యాన పంటలు కోలుకున్నాయి.8 కోనసీమ జిల్లాలో భారీ వర్షం ఈదురు గాలులు.. ఉరుములు.. మెరువులు రోడ్లపై కూలిన చెట్లు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు తడిసి ముద్దయిన ధాన్యపు రాశులు వారం పాటు నిలిచిపోనున్న కోతలు డీజిల్ కొరతతో మొన్నటి వరకు ఆలస్యం రబీ రైతులను వీడని కష్టాలు -
పంట ఉత్పత్తులను కాపాడుకోవాలి
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: కష్టపడి పండించిన ప్రతి గింజను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొన్నారు. అకాల వర్షాల పట్ల అజాగ్రత్త వహించకుండా అధికారుల సూచనలు పాటించాలని ఆయన అన్నారు. ఆదివారం పౌర సరఫరా అధికారులు, వ్యవసాయ శాఖ, తహసీల్దార్లతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మూడు రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రంలోనూ సరిపడా టార్పాలిన్లు, బరకాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఉత్కంఠకు నేటితో తెర.. నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు యానాం: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో 30 వ యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటిగ్ హాలులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్ చేసి, 7.30కు స్ట్రాంగ్రూమ్లలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో ఉంచనున్నారు. అనంతరం 8 గంటలకు పోస్టల్బ్యాలెట్లు ఒక టేబుల్ వద్ద, పది టేబుళ్లలో 8.30కు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్బూత్లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది. తాటిపర్తిలో కార్డన్ సెర్చ్ 38 ద్విచక్ర వాహనాల స్వాధీనం గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఎస్సైలు ఎన్.రామకృష్ణ, వి.మణికుమార్, వంద మంది పోలీసు సిబ్బందితో కలసి తాటిపర్తి గ్రామంలో ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు వివరాలు సేకరించి, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలను గమనించినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. ‘మట్టి’ దొంగలు దొరికేనా!సాక్షి టాస్క్ఫోర్స్: కడియపులంకలో నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.లక్షల విలువైన నల్లమట్టిని దోచుకుపోయిన దుండగులను అధికారులు పట్టుకుంటారా అనే సందేహాలను మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల దోపిడీయే ప్రధాన అజెండా పని చేస్తున్న కొందరు నాయకులు ఈ మట్టి దోపిడీకి కూడా అండదండలు అందించారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నిత్యం వందలాది మంది తిరిగే రోడ్డు పక్కనే ఉన్న మట్టిని రాత్రికి రాత్రే మాయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనే మట్టి దోపిడీకి సిద్ధమైనప్పటికీ మీడియాలో కథనాలు రావడంతో ఆ మట్టిని పరిరక్షించాల్సిందిగా సంబంధిత నిర్మాణ కాంట్రాక్టర్కు రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ముఖ్య నాయకుల మధ్య వాటాలు కుదరనందువల్లనే అప్పట్లో మట్టి జోలికి వెళ్లలేదని కూడా అంటున్నారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా మట్టి దోచుకుపోవడం వెనుక భారీ మంత్రాంగమే నడిచిందని, వాటాలపై అక్రమార్కులు స్పష్టతకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. కూటమి పార్టీల్లోని కీలక నాయకులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
మా మీదే కేసులు పెడతారా?
నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన నిడదవోలు: కూటమి పేరుతో తామంతా పనిచేయడం వల్లే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నెగ్గారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు తమ పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్పై, జనసేన నాయకులపై దుష్ప్రచారం చేస్తూ సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్ట మణికంఠ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ గత నెల 26న జనసేన కార్యకర్తలు అడ్డాల సాయి లక్ష్మణ్, అచ్యుత పవన్ కుమార్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్రావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు పెట్టారని, విచారణకు స్టేషన్కు రమ్మంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఈ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మేరకు వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శ్రీనివాస్, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మణికంఠ ఆచూకీ తెలిపే వరకూ ఎన్ని రోజులైనా అక్కడే ఉంటామని నిరసన తెలిపారు. వారితో సీఐ తిలక్ చర్చించినా ఫలితం లేకుండా పోయింది. మణికంఠ తండ్రి కృష్ణ మా ట్లాడుతూ, 1989 నుంచి టీడీపీ కోసం పని చేసిన తమకు జనసేన నాయకుల వల్ల రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగవరంలో భూ ఆక్రమణలపై పోరాడుతుంటే తన కుమారుడు మణికంఠపై జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో పెట్టాడని బోరున విలపించారు. టీడీపీ నాయకులమైన తమకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
కనుల విందుగా.. విరుల పండగ
అన్నవరం : సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజయిన శనివారం రాత్రి శ్రీపుష్పయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిండయిన పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలంకరణల నడుమ నిత్య కల్యాణ మండపంలో రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు కన్నులారా తిలకించి తన్మయులయ్యారు. పండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎన్.సూర్యచక్రధరరావులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీరిన సత్యదేవుడు, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు. ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి, భక్తులు పులకించారు. కిక్కిరిసిన ఆలయం వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయని, 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
బండతో మోదీసేరు!
సాక్షి, అమలాపురం: అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్ యుద్ధం తొలి దెబ్బ వాణిజ్య సిలిండర్పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రల ఎన్నికల తరువాత పెట్రో ధరలు పెరుగుతాయనే నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది. వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.993.50 పెంచింది. రూ.2,019.5 ఉన్న 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.3,184కు చేరింది. ఈ హఠాత్ పరిణామంతో చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోతున్నారు. ధర పెరుగుతుందని ఊహించారు కానీ ఈ స్థాయిలో పెరుగుతుందని వారు అనుకోలేదు. ఈ పెరిగిన ధరలతో తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసే వారు వాపోతున్నారు. సహజంగానే తమ వంటకాలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఈ సమయంలో రూ.వెయ్యి పెంచితే ఇక లాభాలేం వస్తాయని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సిలిండర్ ధరల పెంపుతో ఇటు బడ్డీల వద్ద.. అటు రెస్టారెంట్ల వద్ద కూడా తయారు చేసే అల్పాహారం, బిర్యానీలు, భోజనాల ధరలు పెరగనున్నాయి. ఈ భారం పరోక్షంగా వినియోగదారులపై పడనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాలవారూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో గృహ అవసరాల గ్యాస్ ధర రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అయితే వీటి ధరలు సైతం మరోసారి పెరుగుతాయనే ప్రచారంతో గృహ వినియోగదారులు గుండెల్లో గుబులు రేపుతోంది. కొనసాగుతున్న కొరత యుద్ధం మొదలైన నాటి నుంచి వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. దీనికి తీవ్ర కొరత నెలకొంది. ఆ మధ్య వారం రోజుల పాటు గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలెండర్లకు డిమాండ్ ఏర్పడిన తరువాత పరిస్థితి సద్దుమునిగింది. కాని వాణిజ్య అవసరాల గ్యాస్ దొరకడం లేదు. ఇప్పటికే దీనిని బ్లాక్లో విక్రయిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు వాణిజ్య అవసరాల గ్యాస్ ధర రూ.2,190.50 ఉండగా రూ.మూడు వేలు చేసి బ్లాక్లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. నల్ల బజారుకు మరింతగా.. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 1,731 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా జిల్లాలో బడ్డీలు, తోపుడు బండ్లు, చిన్న చిన్న హోటళ్ల నుంచి అతిపెద్ద రెస్టారెంట్లు వరకు పదిహేను వేలకు పైబడి ఉంటాయని అంచనా. కానీ వాణిజ్య సిలిండర్లు మాత్రం అందులో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలకు వినియోగించడమే. ఇప్పుడు గృహ అవసరాల సిలిండర్కు, వాణిజ్య సిలిండరుకు మధ్య ధర ప్రస్తుత వ్యత్యాసం రూ.2,442 వరకు ఉంది. దీనితో గృహ అవసరాల గ్యాస్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించనున్నారు. ఈ కారణంగా వాణిజ్య సిలెండర్లను కాదని గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ను నేరుగా వినియోగించనున్నారు. లేదా గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య సిలిండర్లలోని నింపి వినియోగించనున్నారు.వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్లు వాణిజ్య సిలిండర్ ధర పెంపుతో వ్యాపారుల గగ్గోలు రూ.993.50 తాజా పెంపుతో రూ.3,384కు చేరిక ప్రత్యక్షంగా వ్యాపారులు, పరోక్షంగా వినియోగదారులపై భారం పెరగనున్న ఆహార ఉత్పత్తుల ధరలు జిల్లాలో 1,731 వాణిజ్య సిలిండర్లు వాస్తవానికి 15 వేలకు పైనే ఉంటాయంటున్న అధికారులు బ్లాక్ మార్కెటింగ్కు మరింత ఊతం -
పశు సంవర్ధక శాఖ ఇన్చార్జి జిల్లా అధికారిగా విజయరెడ్డి
అమలాపురం టౌన్: పశు సంవర్ధక శాఖ జిల్లా ఇన్చార్జి అధికారిగా అమలాపురం సహాయ సంచాలకుడు ఎల్.విజయరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన భవాని ప్రసాద్ ఉద్యోగ విరమణ చేయడంతో విజయరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ మహేష్కుమార్, జేసీ నిడియాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన తన కార్యాలయంలో శనివారం పశు వైద్యులు, అధికారులతో సమీక్షించారు. జిల్లా అధికారి భవాని ప్రసాద్తో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కర్నీడి మూర్తి కూడా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ కె.చంద్రశేఖరరెడ్డి ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. బాలాజీకి రూ.3.22 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. సుప్రభాత సేవ, తొలి హారతి కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3.22 లక్షలు ఆదాయం వచ్చింది. స్వామి వారిని 7,100 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,200 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,13,503 విరాళంగా అందించారని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. పెళ్లి కొడుకు అదృశ్యం ఉప్పలగుప్తం: పెళ్లి కొడుకు అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎస్కే జానీ బాషా కథనం మేరకు గోపవరానికి చెందిన అయినవిల్లి నాగేంద్రకు ఏప్రిల్ 29న ఐ.పోలవరం మండలం కేశనకుర్రుకు చెందిన వధువుతో వివాహం జరిగింది. మే 1న పెళ్లి అనంతరం కార్యక్రమాలకు సిద్ధపడుతుండగా అదే రోజు ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదని అతడి తండ్రి రెడ్డమ్మ తనకు ఫోన్ చేసినట్టు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, అతని ఆచూకీ తెలిసినవారు 94409 04852కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సముద్ర నాచు సాగుకు ప్రోత్సాహం అమలాపురం రూరల్: తీరప్రాంత మత్స్యకారులు, డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి సముద్ర నాచు సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. శనివారం కేరళలోని అమృత యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు జపాన్ శాస్త్రవేత్తలతో కలిసి సముద్రపు నాచు పెంపకంపై అధ్యయనానికి జిల్లాకు వచ్చారన్నారు. డీఆర్డీఏ పీడీ డి.రాంబాబుతో కలిసి కాట్రేనికోన మండలం చిరయానం గచ్చకాయల పోరలలోని చెరువులను, సముద్రాన్ని వారు పరిశీలించారన్నారు. ఈ సాగు చేపట్టే లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి కోనసీమ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి జిల్లాలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నివారణకు 661 ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, రెవెన్యూ అధికా రులు పాల్గొన్నారు. ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలి ఐదేళ్లు నిండిన ప్రతి బిడ్డను బడిలో చేర్పించడమే లక్ష్యంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. శనివారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. నేటి నుంచి రెమిడియల్ తరగతులు ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం సోమవారం నుంచి ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీగా భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాలు వ్రతాలు ఆచరిస్తున్న భక్తులతో పాటు సాధారణ భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, స్వామివారిని సుందరంగా అలంకరించారు. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉచిత అన్న, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. సత్య సాయి సేవా సంస్థలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. (అంతర చిత్రం) ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు -
వ్యక్తిపై హత్యాయత్నం
మలికిపురం: గుడిమెళ్లంక గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎస్సై పీవీవీ సురేష్ కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన పాస్టర్ పోలినాటి యూసఫ్ రాజు (రవి రాజు)కు ఇద్దరు భార్యలు, వారికి సంతానం ఉన్నారు. ప్రస్తుతం వరంతా అతనికి దూరంగా ఉంటున్నారు. దీంతో మూడేళ్లుగా గుడిమెళ్లంకకు చెందిన దివ్యాంగురాలు విజయకుమారితో అతడు సహజీవనం చేస్తున్నాడు. ఆమెను కొన్నాళ్లుగా చిత్రహింసలు పెడుతుండడంతో ఆమె తమ్ముడు బండారు నాగరాజు తన సోదరిని శుక్రవారం తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన యూసఫ్రాజు అక్కడికి వచ్చి ఇంటిలోకి పెట్రోలు పోయడంతో పాటు, ఇంటి ఎదుట ఉన్న బైక్పై కూడా పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. దీంతో బయటకు వచ్చిన నాగరాజు కర్రతో యూసఫ్ రాజును కొట్టడంతో పాటు అక్కడే ఉన్న కత్తితో చేతులు, మెడ, దవడలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రాజును కాకినాడ ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్కారు మార్కు ట్రీట్మెంట్! రాజోలు: రోగులంటే చిన్నచూపు.. నిర్లక్ష్యం.. ఆపై అవమానాలు తప్పవని రుజువు చేశారు రాజోలులోని సామాజిక ఆస్పత్రి సిబ్బంది. శుక్రవారం రాత్రి తీసువచ్చిన యూసఫ్ రాజును బెడ్పై పడుకోబెట్టారు. అతడి గాయాలకు తాళలేక బెడ్ పైనుంచి పడిపోయి ఆర్తనాదాలు పెడుతున్నా అక్కడి సిబ్బంది ఏమాత్రం స్పందించలేదు. చివరకు అతడి పరిస్థితి తీవ్రంగా ఉందని, అత్యవసర వైద్యం కోసం కాకినాడకు తీసుకెళ్లాలని డ్యూటీ డాక్టర్ అనూష సూచించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డయానాను వివరణ కోరగా.. యూసఫ్రాజు మద్యం మత్తులో ఉన్నాడని, ప్రథమ చికిత్స చేస్తున్నపుడే బెడ్ పైనుంచి పడి మలమూత్ర విసర్జన చేయడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారైందని తెలిపారు. అతడితో ఎవరూ సహాయకులు రాకపోవడంతో శానిటేషన్ సిబ్బంది వచ్చి శుభ్రం చేసే వరకు ఫ్లోర్పైనే ఉన్నాడని ఆమె తెలిపారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో కాకినాడకు తరలించామన్నారు. బాధితుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ధాన్యం కొనాలి
● ధాన్యం అమ్ముకోలేక రైతులు నలిగిపోతున్నారు ● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం: రబీ మాసూళ్ల సీజన్లో జిల్లా రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. స్థానిక గాంధీపేట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండో పంట ప్రొక్య్రూర్మెంట్ విధానాన్ని మెరుగు పర్చాలని సీఎం చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్లు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సరపడినన్ని రైస్ మిల్లులు ఉండటంతో ఇబ్బందులు ఉండేవి కావని, జిల్లాల విభజన అనంతరం ఈ జిల్లాలో 16 మిల్లులు మాత్రమే ఉన్నాయని, వాటిలోనే కొనుగోలు చేసేందుకు అనుమతించారని బోస్ అన్నారు. ఎంఎస్పీ ప్రకారం 75 కేజీల ధాన్యం బస్తా రూ.1778 కాగా రైస్ మిల్లులు రూ.462 కోట్లకు బ్యాంకు హామీని ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ 16 రైస్ మిల్లులు ఆ మేరకు గ్యారెంటీ ఇవ్వడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే రైతులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ధాన్యం కొనుగోలు చేయడమే దీని పరిష్కారమని ఎంపీ ప్రభుత్వానికి సూచించారు. గత మోంథా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా సీఎం చంద్రబాబు ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత కాదని, మిగిలిన రంగాలను కూడా అభివృద్ధి చేయకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని ఆయన అన్నారు. పంట మాసూళ్లు పూర్తి కాకుండానే కొంత మేర కొనుగోళ్లు చేయాలని, ప్రభుత్వం లక్ష్యాలు విధిస్తే రైతులు ఏమై పోవాలని ఆయన ప్రశ్నించారు. ఇదే అదనుగా దళారులకు రూ.1600కే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందని ఆయన అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంఎస్పీకి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అప్పట్లో రైతులు హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తండ్రిని కోల్పోయి పౌరసఫరాల శాఖ మంత్రి మనోహర్ తీవ్రమైన భాదలో ఉన్నారని, ఆయన బదులుగా చంద్రబాబు ఆ బాధ్యత తీసుకుని అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. కేవలం లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయండని చెప్పి చేతులు దులుపుకోవటం సమజసం కాదని ఎంపీ బోస్ అన్నారు. -
వీడిన పేగు బంధం
● తండ్రి కళ్లెదుటే కుమార్తె మృతి ● దైవ దర్శనానికి వెళ్తుండగా ఘటన బైక్ను ఢీకొన్న టిప్పర్ కొత్తపేట: కళ్ల ఎదుటే కన్న బంధం వీడిపోయింది.. దైవ దర్శనానికి తండ్రీ కుమార్తె వెళ్తుండగా, వెనుక నుంచి టిప్పర్ ఢీకొన్న ఘటనలో తండ్రి కళ్లెదుటే తన చిట్టితల్లి మృతిచెందడం కలచివేసింది. స్థానిక బోడిపాలెం వంతెన సమీపంలో జరిగిన ఘటనపై ఎస్సై జి.సురేంద్ర కథనం మేరకు అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విళ్ల వీర్రాజు కుమార్తె గీతారాణి (24) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమె స్వగ్రామానికి రావడంతో శనివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు బైక్పై ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి బయలు దేరారు. వారు బోడిపాలెం వంతెన సమీపానికి చేరుకోగా, వాడపాలెంలో ఇసుక దిగుమతి చేసి ఊబలంక ర్యాంపునకు వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి బలంగా ఢీకొని బైక్ను సుమారు 30 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో గీతారాణి తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కాగా వీర్రాజు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన 108 సిబ్బంది యువతిని పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వీర్రాజును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గీతారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీర్రాజు నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. రెండు రోజులు సెలవులని వచ్చి.. వీర్రాజు కొబ్బరికాయల వ్యాపారి. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె గీతారాణి బీటెక్ చదివి హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం సెలవు పెట్టి ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చింది. శనివారం తండ్రితో వాడపల్లి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో చేయి విరిగి, తీవ్ర గాయాలపాలై షాక్కు గురైన తండ్రిని ఆ దారిన పోయేవారు లేపగా నా పాప ఏదీ అంటూ గీతారాణి మృతదేహం దగ్గరకు వచ్చి అమ్మా.. లే అమ్మా అంటూ రోదిస్తూ తల్లడిల్లిపోయాడు. నేనే నీ నిండు ప్రాణాలు బలి గొన్నాను! అయినవిల్లి: శనివారం తెల్లవారు జామున ఐదు గంటలకు వాడపల్లి వెళ్లేందుకు అలారం పెట్టుకుందని, అయితే ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని, తనకు కూడా పనులు ఉన్నాయని రెండు గంటలకే నిద్రలేపి తయారై తన వాహనంపై వెళ్లామని వీర్రాజు అన్నారు. కుమార్తె చెప్పినట్టే ఐదు గంటలకు బయలుదేరి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేదని, తన వల్లే తన చిట్టితల్లి మృతి చెందిందని ఆయన భోరున విలపించాడు. వాడపల్లి దర్శనానికి వెళ్లిన తన కుమార్తె గీతారాణి విగత జీవిగా తిరిగి రావడంతో ఆమె తల్లి పద్మ ఇంటి వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. కుమార్తె మృత దేహాన్ని చూసి ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తుండడంతో చూపరులు చలించిపోయారు. ఈ ఘటనతో చింతనలంకలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అమలాపురం రూరల్: అత్తమామల వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమలాపురం మండలం బండారులంకలో శనివారం చోటుచేసుకుంది. బండారులంక దంగేటివారిపాలేనికి చెందిన కడలి సాయి వెంకట జ్యోతి (24 ) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండారులంక చెందిన కడలి శిరీష్తో ఆమెకు 2021లో వివాహమైంది. ఐదేళ్లుగా పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో భర్త, అత్తమామలు, బంధువులు జ్యోతిని వేధింపులకు గురిచేశారు. అవి భరించలేక జ్యోతి శనివారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి దంగేటి సత్యవతి తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఎస్సై శేఖర్బాబు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహాన్ని పరిశీలించి ఆత్తమామలు, బంధువులు నలుగురిపై వేధింపులు, గృహ హింస కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏరియా అసుపత్రికి తరలించారు. -
రెండో స్థానాన్ని పదిలం చేశారు
● కలెక్టర్ మహేష్కుమార్ ● అత్యున్నత మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు అభినందన అమలాపురం రూరల్: క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పదో తరగతి విద్యార్థులు నిరూపించారని, జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపారని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. గురువారం నాటి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐదుగురిని ఎస్పీ రాహుల్ మీనాతో కలసి కలెక్టరేట్లో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ పి.నాగేశ్వరరావు జిల్లాలో 590 మార్కులు పైబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 12 మంది వరకు ఉన్నారని, మొత్తం 241 ప్రభుత్వ పాఠశాలలకు 94 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, 145 పాఠశాలలు 61.99 శాతం ఉత్తీర్ణత, రెండు పాఠశాలలు 60 శాతం లోపు ఉత్తీర్ణత సాధించాయని కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 596 మార్కులు సాధించిన ఎస్ఆర్ఎల్ నిహారిక, 595 సాధించిన ఎన్.కృతిక, జీహెచ్ సత్య దుర్గ, 593 మార్కులు సాధించిన సీహెచ్ జ్యోతి, కె.అభిశ్రీలను కలెక్టర్, ఎస్పీ అభినందించారు. వారితో పాటు జిల్లా ఉప విద్యాశాఖాధికారి జి.సూర్యప్రకాశం ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. పుష్కరాల వసతులపై అంచనాలు ఇవ్వండి గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు, వసతుల కల్పనకు నాలుగు రోజుల్లో అంచనాలు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులతో సమీక్షించారు. కోనసీమ ప్రాంతంలో సుమారు 1.5 కోట్ల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. విలువిద్యకు నవశకం మండలం కామనగరువు చల్లపల్లి రోడ్డులో ఉన్న ది అమలాపురం కళాశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సాయి విలువిద్య సంస్థ వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ మహేష్కుమార్ శుక్రవారం ప్రారంభించారు. విలువిద్యకు నవశకం తీసుకువచ్చేలా శాప్ సరికొత్త అడుగు వేసిందని ఆయన అన్నారు. పీఎండీఎస్ సాగు ఎంతో కీలకం ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున భూములలోని తేమను కాపాడుకుని భూసారాన్ని పెంచడానికి డైరెక్ట్ మాన్సూన్ డ్రై షోయింగ్ (పీఎండీఎస్) సాగు ఎంతో కీలకమని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎండీఎస్ సాగు కిట్ల పంపిణీ, సాగు విస్తీర్ణాలపై సమీక్షించారు. జలధార పనులు వేగవంతం చేయాలి భూగర్భ జలాలు పెంచే దిశగా జలధార పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. -
ఘనంగా సత్యదేవుని శ్రీ చక్రస్నానం
అన్నవరం: శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు వైశాఖ పౌర్ణమి, శుక్రవారం ఉదయం పంపానదిలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు.ఉదయం 8–30 గంటలకు పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను, ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ మండపం లోపల గల సింహాసనం మీద స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పండితుల మంత్రోచ్ఛాటన మధ్య స్వామివారికి, శూలానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, నెయ్యితో అవభృతస్నానం చేయించారు. విభిన్నంగా శ్రీచక్రస్నానం పంపా నదిలో సత్యదేవుని శ్రీచక్రస్నానం ఈసారి వాడపల్లిలో జరిగినట్టుగా విభిన్నంగా నిర్వహించారు. అవభృత స్నానం అనంతరం సత్యదేవుని ఉత్సవ మూర్తిని, శూలాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. అనంతరం ఒడ్డున నిర్మించిన ఇనుప మంచె మీదకు స్వామివారిని, శూలాన్ని తీసుకువచ్చి పైపు ద్వారా నదిలో నీటితో శూలాన్ని అభిషేకించగా ఆ మంచె కింద ఉన్న భక్తులు స్నానం చేశారు. సాయంత్రం అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. రంగులతో నాగవల్లిని తీర్చిదిద్ది పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నీలలోహిత మాల (నల్లపూసల దండ) ధారణ చేశారు. స్వామి కల్యాణం నాడు ఆరోహించిన ధ్వజాన్ని అవరోహణ చేశారు. అర్చకస్వాములు కంకణ విమోచనం చేశారు. -
పేదల సొంతింటి కలను చిదిమేసిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్ ఫినిషింగ్ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు. లేబర్ కాంట్రాక్టర్ దౌర్జన్యం! కడియం: మండలంలోని మాధవరాయుడుపాలెం పరిధిలోని చైతన్యనగర్లోని ఏపీ పేపరుమిల్లులో ఒక లేబర్ కాంట్రాక్టర్ కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ, దౌర్జన్యం చేస్తున్నాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తమ దీక్షా శిబిరం సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు కాంట్రాక్టర్ దౌర్జన్యాలను కార్మికులు వివరించారు. మిల్లులో ఉన్నతాధికారుల వద్ద నమ్మకస్తుడిగా వ్యవహరిస్తూ సదరు లేబర్ కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడంటున్నారు. పే స్లిప్పులు ఇవ్వకపోవడం, సెలవు అడిగితే మర్నాడే పనికి రావద్దనడం వంటివి చేస్తున్నాడని వివరించారు. ఈ మేరకు నాయకులు యాజమాన్యంతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు. ఇన్చార్జి డీఎంహెచ్వోగా డాక్టర్ వసుంధర రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఇన్చార్జి డీఎంఅండ్హెచ్వోగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఎన్.వసుంధరను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత డీఎంఅండ్హెచ్వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు గురువారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వసుంధర శుక్రవారం బొమ్మూరులోని డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. -
బడి
నాడు మన నేడు నిల● ప్రతిఫలిస్తున్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకాలు ● పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు ● రెండేళ్లుగా రాష్ట్రస్థాయి రెండో స్థానంలో కోనసీమ జిల్లా ● 97 ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాక్షి, అమలాపురం: ‘చేసేది ఏమిటో.. చేసేయి సూటిగా.. వేసేయి పాగా ఈ తోటలో’ అని సీనియర్ సముద్రాల వారు అన్నట్టు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అనుకున్న పథకాలు కచ్చితంగా అమలు చేయడంతో వాటి ఫలితాలు నేడు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలు ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల రూపంలో చూస్తున్నాం. విద్యార్థి జీవితంలో మొదటి మెట్టు పదో తరగతిని జిల్లా విద్యార్థులు అలవోకగా ఎక్కేశారు. గురువారం విడుదలైన ఆ పరీక్షా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జోన్–2 పరిధిలో అయితే మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. ఇంతటి ఘనత సాధించారంటే అంతకు పూర్వ రంగం ఎంతో గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుందన్నది అందరూ గుర్తించాల్సిందే. ఈ విషయమే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విద్యార్థుల సాధన ఒక ఎత్తయితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యాశాఖకు ఇచ్చిన ప్రోత్సాహం ఎనలేనిది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు పోషకాహారం అందజేయడం, యూనిఫాం, ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో బోధన ఇలా ప్రతి విషయంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాల విద్యకు గట్టి పునాది వేశారు. ● జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 19,138 మంది హాజరు కాగా 18,343 మంది (95.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది స్థానాన్నే మళ్లీ సాధించినా, అప్పటి 91.43 శాతం ఉత్తీర్ణతను అధిగమించడం గమనార్హం. ● 92 శాతం మంది, అంటే 16,866 ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే 2,362 మంది అదనం. ● 87 జెడ్పీ, రెండు ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, రెండు బీసీ సంక్షేమ రెసిడెన్షియల్, రెండు సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ● అల్లవరం మండలం సామంత్రకుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శిరిగినీడి రిషితా లక్ష్మీ నిహారిక 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసారి 590 మార్కులు దాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 12 మంది. ముమ్మిడివరం మండలం అనాతవరం ఉన్నత పాఠశాలలో ట్యాబ్లతో విద్యార్థులు -
పద్వితీయం
జెండా ఎగరేసిన అల్లవరం మండలం ● టాప్ టెన్లో నలుగురికి చోటు ● సామంతకుర్రు విద్యార్థికి జిల్లా ప్రథమ స్థానం అల్లవరం: పదవ తరగతి ఫలితాల్లో అల్లవరం మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి మండలాన్ని అగ్రస్థానంలో ఉంచారు. సామంతకుర్రు ఉన్నత పాఠశాలకు చెందిన శిరిగినీడి రిషిత లక్ష్మీ నిహారిక 596 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థి కాకిలేటి దేవిశ్రీప్రసాద్ 592 మార్కులతో, ఓడలరేవు ఉన్నత పాఠశాలకు చెందిన మోకా లాస్య 592 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాలకు చెందిన పోతు దుర్గాలక్ష్మీ సాహితి 591 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా విద్యా శాఖ విడుదల చేసిన టాప్ టెన్ జాబితాలో అల్లవరం మండలానికి చెందిన నలుగురు చోటు దక్కించుకొని మండలాన్ని అగ్రస్థానంలో ఉంచారని ఎంఈఓలు కిరణ్బాబు, ఎస్.ఏడుకొండలు తెలిపారు. సాక్షి, అమలాపురం: పదవ తరగతి ఫలితాలలో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఏడాది ఫలితాన్ని అధిగమించ లేకపోయినప్పటికీ అదే స్థానాన్ని నిలుపుకున్నారు. జిల్లా 95.85 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలు జిల్లా విద్యాశాఖ అధికారులలో ఉత్తేజాన్ని నింపాయి. పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిన జిల్లా జోన్–2 పరిధిలో మొదటి స్థానం సాధించింది. గత ఏడాది జోన్ –2 పరిధిలో రెండవ స్థానం రావడం గమనార్హం. బాలికలదే పై చేయి పది ఫలితాలలో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 9,570 మంది బాలురు, 9,568 మంది బాలికలు కలిపి 19,138 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో బాలురు 9,102 (95.11శాతం), బాలికలు 9,241 (96.58శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 18,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,253 మంది ఉత్తీర్ణత (91.43శాతం) సాధించగా, గత విద్యా సంవత్సరంలోనూ బాలికలే పైచేయి సాధించారు. 9,392 మంది బాలురు, 9,479 మంది బాలికలు కలిపి 18,871 మంది పరీక్షలకు హాజరు కాగా, బాలురు 8,420 (89.65 శాతం), బాలికలు 8,833 (93.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే బాలురు, బాలికల ఉత్తీర్ణతా శాతం కూడా పెరగడం గమనార్హం. పెరిగిన ఫస్ట్ క్లాస్లు జిల్లాలో 18,343 మంది ఉత్తీర్ణత సాధించగా వీరిలో 16,866 (92 శాతం) మంది ప్రథమ శ్రేణిలో, 1,161 (6శాతం) మంది ద్వితీయ శ్రేణిలో, 316 (2 శాతం) తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. 795 మంది ఫెయిలయ్యారు. గత ఏడాది ఫలితాలతో పోల్చితే మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినవారు 2,362 మంది పెరిగారు. పటిష్టమైన ప్రణాళికతో.. పది ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా విద్యార్థులను పరీక్షలకు తీర్చిదిద్దడం ఒక కారణం. జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు గతేడాది నవంబర్లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది రెండవ స్థానంలో నిలవడంతో ఈ ఏడాది ఫలితాలు విద్యాశాఖకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో తొలి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో పనిచేశారు. 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకు పదవ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. పదవ తరగతి విద్యార్థులకు 100 రివిజన్ టెస్టులు, మూడు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం ఫలితం చూపించింది. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు.. ప్రభుత్వ పాఠశాలలు పది ఫలితాల్లో సత్తా చాటాయి. మండల, జెడ్పీ యాజమాన్యంలో 209 పాఠశాలలకు 87, ప్రభుత్వ యాజమాన్యంలో 8 పాఠశాలలకు రెండు, ఎయిడెడ్ యాజమాన్యంలో ఒకటి, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు రెండుకు రెండు, సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలు 8 పాఠశాలలకు రెండు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం మీద 241 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు 94 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 145 పాఠశాలలు 61 నుంచి 99 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండు పాఠశాలలు మాత్రం 60 లోపు ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావుతో పాటుగా జిల్లా యంత్రాంగాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తస్లీమ్ అన్సారియా, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి అభినందించారు. డీవైఈవోలు జి.సూర్యప్రకాష్, పి.రామలక్ష్మణమూర్తి, కడలి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన కోనసీమ జిల్లాలో 95.85 శాతం ఉత్తీర్ణత బాలుర ఉత్తీర్ణత 95.11 శాతం బాలికల ఉత్తీర్ణత 96.58 శాతం సంతృప్తికరం పది ఫలితాలు సంతృప్తి ఇచ్చాయి. రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలవడం సంతోషాన్నిచ్చింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పర్యవేక్షణ చేయడంతో ఈ ఫలితాలు సాధించగలిగాం. – పి.నాగేశ్వరరావు, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. -
కార్మికూడుకి కష్టమే!
కపిలేశ్వరపురం: ఉన్న ఊరును విడిచి పనులు.. ఉత్తుత్త వేతనాలు.. కార్మికుల నోటికి కూడు అందని పరిస్థితులు.. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్బుక్ పాలనతో అణచివేత ధోరణులు.. ఫలితంగా కార్మిక, కర్షకులకు తీరని వెతలు.. సంపద సృష్టిస్తానంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రామికులు సృష్టించిన సంపదను వారికి దూరం చేస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి నెట్టేశారు. శ్రామికుల జీతభత్యాలు కుటుంబ అవసరాలు తీర్చే స్థాయిలో లేవు. శుక్రవారం మే డే సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శ్రమజీవుల సమస్యలపై కథనం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 107 మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ శ్రామిక శక్తితో భారీ ఉత్పత్తి ఎగుమతి అవుతోంది. అలాగే 4,53,027 హెక్టార్లలో వరి సాగవుతుంది. వ్యవసాయానికి అనుబంధంగా రవాణా, రైసుమిల్లు రంగాలు ఉన్నాయి. కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరంలో వర్తక, వ్యాపారాలు, కోనసీమ జిల్లాలో ఆక్వా, కొబ్బరి, పోలవరం జిల్లాలో అటవీ సంపద సృష్టిలో శ్రామికులు పనిచేస్తున్నారు. అలాగే 6,782 మంది అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. సుమారు 5,33,815 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. నాలుగు జిల్లాల్లో వేలాది మంది సచివాలయ, తదితర రంగాల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యమాలు.. కార్యచరణలు ఫ ఈ నెల 17న సమగ్ర శిక్ష కార్యాలయాల కాంట్రాక్టు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశమయ్యారు. తమ వేతనాలు పెంచాలంటూ మే నెల 15న విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మంత్రి లోకేష్ నివాసం వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఫ ఈ నెల 16న కాకినాడలో పెన్షన్ సాధన కమిటీ సమావేశం నిర్వహించి, పాత పింఛను విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఫ కాకినాడలో ఈ నెల 25న జిల్లా స్వర్ణకారుల సంఘం సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన స్వర్ణకారులకు నెలకు రూ.8 వేల పింఛన్ ఇవ్వాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ఫ మార్చి 24న యూటీఎఫ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు నాలుగు ఉమ్మడి కలెక్టరేట్ల ఎదుట రణభేరి పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఫ తమ జీతాలు పెంచాలంటూ సహకార సంఘాల ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరిలో సమ్మె నిర్వహించి కొన్ని డిమాండ్లను సాధించుకున్నారు. ఫ ఫిబ్రవరి 20న రాజమహేంద్రవరంలో విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వహించాలంటూ ఆర్టీసీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రామిక మహిళా ఉద్యమాలిలా.. ఫ తమకు పనులు కల్పించడం లేదంటూ ఈ నెల 13న అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఉప్పలగుప్తం మహిళా ఉపాధి కూలీలు ధర్నా చేశారు. ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24న అంగన్వాడీలు నిరసన ర్యాలీలు చేశారు. ఫ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5న ఆశ కార్యకర్తలు విజయవాడలో నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. శ్రామికులపై నిర్బంధకాండ ఫ మార్చి 3న విజయవాడలో అంగన్వాడీల శాంతియుత మహా ధర్నాలో మంత్రుల ఆదేశాలపై విధ్వంసం సృష్టించారు. అనేక మంది పోలీసులు వచ్చి టెంట్లు పీకేసి వందల మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఫ చేనేత సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో ఈ నెల13 నుంచి 20 వరకూ కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 నుంచి తాటిపర్తి కల్యాణ మండపంలో ఆమరణ దీక్ష చేస్తుండగా, పోలీసులు ఈ నెల 22న భగ్నం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ఇలా..కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 2024 ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యలంటూ హామీలను విస్మరిస్తున్నారు. ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంది. పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని చెప్పి విస్మరించారు. వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించి ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాలన్న డిమాండ్ గాలికి వదిలేశారు. ఈ నెల 22న కాకినాడలో జిల్లా కలెక్టర్కు గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఫ శ్రామికవర్గంపై రెడ్బుక్ పాలన ఫ కూటమి పాలనలో దయనీయ పరిస్థితులు ఫ ఇచ్చిన హామీలను అడిగితే నిర్బంధం ఫ నేడు ప్రపంచ కార్మికవర్గ దినోత్సవం -
ఓపెన్లోనూ టాప్ లేపారు
● ఓపెన్ స్కూల్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి ● పది, ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కోనసీమ రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయాయి. రెగ్యులర్ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి కాగా, ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాల్లోనూ బాలికల హవా కన్పించింది. గత నెల 2 నుంచి 13వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, గత నెల 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. పది, ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో కోనసీమ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పది ఫలితాల్లో 83.07 శాతం ఉత్తీర్ణతతో కోనసీమ మొదటి స్థానంలో నిలిచింది. ఓపెన్ టెన్త్కు కోనసీమ జిల్లా నుంచి 1,122 మంది హాజరు కాగా 932 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 80.25 (524), బాలికల ఉత్తీర్ణతా శాతం 86.99 (408) ఉంది. ఓపెన్ ఇంటర్ ఫలితాల్లోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (79.55శాతం)తో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కోనసీమ జిల్లా నుంచి 4,142 మంది పరీక్షకు హాజరు కాగా 3,295 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 78.48 శాతం, బాలికల ఉత్తీర్ణత 81.16 శాతంగా ఉంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం ఓపెన్ టెన్త్, ఇంటర్లో ఫెయిలైన వారికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశముంది. మే 2 నుంచి 11వ తేదీ వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫీజు చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీ కౌంటింగ్కు రూ.200 వంతున చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం వెరిఫికేషన్కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెగ్యులర్ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ను అనుసరించి జరుగుతాయి. మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. పరీక్ష రుసుమును మే 2 నుంచి 11వ తేదీ వరకు ఏపీటీ ఆన్లైన్ ద్వారా లేదా పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించవచ్చు. -
కల్యాణ వైభోగమే
వైభవంగా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం ద్వారకాతిరుమల: చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఆలయం నుంచి రెండు వేరువేరు వాహనాలపై అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఈఓ వేండ్ర త్రినాథరావు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావులు పట్టు వస్త్రాలను సమర్పించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటలకు – భజన కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వర కచేరి సాయంత్రం 5 గంటల నుంచి – హరికథ సాయంత్రం 6 గంటల నుంచి – భక్తి రంజని రాత్రి 7 గంటల నుంచి – భరత నాట్య ప్రదర్శనలు రాత్రి 8 గంటల నుంచి – మోహిని భస్మాసుర నాటకం రాత్రి 8 గంటల నుంచి – శ్రీవారి రథోత్సవం అలంకారం : శ్రీ కూర్మ అలంకారం మోహినీ అలంకారంలో చినవెంకన్న ముగ్ధ మనోహర రూప లావణ్యాలను ఒలికిస్తూ.. మోహినీ అలంకారంలో శ్రీవారు గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నారు. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు జగన్మోహినీగా మారారు. అపురూప సౌందర్యాలను ఒలికిస్తూ.. సీ్త్ర రూపంలో ఉన్న చిన్నతిరుమలేశుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. -
రీజెన్సీ నాయుడు కన్నుమూత
● రీజెన్సీ ఫ్యాక్టరీ స్థాపించి వందలాది కార్మికులకు ఉపాఽధి ● దక్షిణ భారతదేశంలో సిరామిక్స్ రంగం వ్యాప్తికి కృషి ● సంతాప సూచకంగా వ్యాపార సంస్థల బంద్ యానాం: స్థానిక రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ భారీ పరిశ్రమ, దాని అనుబంధ సంస్థల వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం డాక్టర్ జీఎన్ నాయుడు బుధవారం కన్నుమూశారు. ఆయన దక్షిణ భారతదేశంలో సిరామిక్స్ పరిశ్రమ వ్యాపించడానికి విశేష కృషి చేశారు. 1983లో యానాంలో రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమలు దక్షిణభారతదేశమంతటా వ్యాపించడంలో కీలకపాత్ర పోషించారు. ఫ్యాక్టరీ స్థాపించడంతో అప్పటివరకు వెనుకబడి ఉన్న యానాం నియోజకవర్గం అనతికాలంలోనే కార్మికులకు ఉపాధి, విద్యాసేవలు, టైల్స్ పరిశ్రమకు కావాల్సిన వాటిని అందించేందుకు ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలతో వైభవాన్ని సంతరించుకుంది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక వ్యాపార సంస్థలు ఎంతగానో అభివృద్ధి సాధించాయి. ఇంజినీరింగ్ రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ప్రదానం చేసింది. 2012 జనవరి 27 జరిగిన దుర్ఘటనతో మూతపడిన రీజెన్సీ పరిశ్రమను మళ్లీ ప్రారంభించేలా రూ.100 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు రూపొందించారు. రోజుకు 7వేల చదరపు మీటర్ల నుంచి 25వేల చదరపు మీటర్ల టైల్స్ను హెల్త్కేర్, హాస్పాటాలిటీ రంగాలకు ప్రత్యేకంగా తయారు చేసేలా మరమ్మతులు చేపట్టారు. దీంతో ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉంది. కార్మికుల పిల్లల కోసం రీజెన్సీ పబ్లిక్స్కూల్, జూనియర్, ఇంజనీరింగ్, బీఈడీ కాలేజీలను స్థాపించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైతం ఏర్పాటు చేశారు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఫ్యాక్టరీలో ఉద్యోగం ఫ్యాక్టరీ అనుబంధ సంస్థ రిగ్మా యూనిట్లో పని చేసే యువతులను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అటువంటి వారి భర్తలకు ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రకటించి అమలు చేసి అందరి మన్ననలు పొందారు డాక్టర్ జీఎన్ నాయుడు. రీజెన్సీ కార్మికుల నివాళి రీజెన్సీ కార్మికులు నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో నందగిరి హిల్స్, జూబ్లిహిల్స్ వద్ద జరుగుతాయి. నాయుడు మృతికి సంతాప సూచకంగా యానాంలో వ్యాపార సంస్థలను మూసివేశారు. -
విలువలు పాటించిన నేత చిట్టబ్బాయి
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి తుది శ్వాస విడిచే దాకా రాజకీయ విలువలు పాటించారని పలువురు కొనియాడారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన చిట్టబ్బాయి 5 వర్ధంతి కార్యక్రమాలు పట్టణంలో బుధవారం జరిగాయి. అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లోని గుర్రపు బండ్ల స్టాండ్లో గల చిట్టబ్బాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడం చిట్టబ్బాయి నైజమని, తన రాజకీయ జీవితంలో ఆస్తులను సైతం పోగొట్టుకున్న నిస్వార్థ నాయకుడు చిట్టబ్బాయి అని స్మరించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి భరత్ భూషణ్, కాశి మునికుమారి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, అమలాపురం పట్టణం, అల్లవరం మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, కొనుకు బాపూజీ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్దుల్ ఖాదర్, గొవ్వాల రాజేష్, పీకే రావు, కముజు రమణ, విత్తనాల మూర్తి, ఊటుకూరి సుబ్రహ్మణ్యం, చిట్టూరి పెదబాబు, కేతా భాను తేజ, అడపా బాబులు, చెల్లుబోయిన నాని, విత్తనాల ఇంద్ర శేఖర్, దొమ్మేటి రాము, గుత్తుల రాజు, ఈతకోట శ్రావణ్ పాల్గొన్నారు. స్థానిక సూర్య నగర్లోని చిట్టబ్బాయి స్వగృహంలో ఆయన భార్య అరుణ, కుమారుడు భరత్ భూషణ్, కోడలు సత్య శైలజ వర్ధంతి నిర్వహించారు.వర్ధంతి కార్యక్రమాల్లో వక్తలు -
వేటగాళ్ల పేర్ల గల్లంతు
కాట్రేనికోన: దళారులతో చేతులు కలిపిన మత్స్యశాఖ సిబ్బంది చేతివాటం చూపి అసలైన మత్స్యకార భరోసా లబ్ధిదారులను తొలగించి చేపల వేటతో సంబంధం లేనివారి పేర్లు ఆన్లైన్ జాబితాలో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపల వేట చేస్తున్న కళాసీలను సర్టిఫై చేస్తూ బోటు ఓనర్లు మత్స్యశాఖ సర్వే సిబ్బందికి పత్రాలు ఇవ్వడంతో బోటుపై కళాసీలను ఉంచి గుర్తింపు ఫొటోను తీసారు. అయితే తాము సర్టిఫై చేసి మత్స్యశాఖ అధికారులకు అందచేసిన లబ్ధిదారులకు బదులు చేపల వేటకు సంబంధం లేని వారి పేర్లు ఆన్లైన్ జాబితాలో దర్శనం ఇవ్వడంతో బోటు ఓనర్లు కంగుతిన్నారు. గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన జాబితాలో వందలాది మంది లబ్ధిదారుల పేర్లు గల్లంతు అయ్యాయి. వాటి స్థానంలో కొత్తవారి పేర్లు కనిపించడంపై వారు మండిపడుతున్నారు. కనీసం బోటు ఓనరుకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పేర్లు మార్పు చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు లబ్ధిదారులు గళం విప్పారు. పింఛను తీసుకోవడం, అధికంగా వచ్చిన కరెంటు బిల్లులు సాకుగా చూపిస్తూ లబ్ధిదారులను తొలగించి వారి స్థానంలో సంబంధంలేని వారిని భరోసా జాబితాలో ఆన్లైన్ చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఆన్లైన్ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.8వేలు చొప్పున దళారీలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. బ్రహ్మ సమేథ్యం పంచాయతీ బలుసుతిప్ప, కొత్తపాలెం, మగసానితిప్ప గ్రామాలలో సుమారు 200 పేర్ల వరకు తొలగించి కొత్తవారి పేర్లు చేర్చినట్టు సమాచారం. మత్స్యశాఖ అధికారుల మాయాజాలంలో కొన్ని.. బోటు నంబర్ 78, 150, 380, 384, 500, 534, 610, 1,264, 1,348, 1,434 కామాడి బ్రహ్మాజి, కామాడిరాజు, మల్లాడి శ్రీను, పినపోతు మల్లి, రామనాథ్, పాలెపు బాలదాసు శ్రీను, పెమ్మాడి సతీష్కుమార్, మల్లాడి భైరవమూర్తి, మల్లాడి కార్తీక్, నాట్ర వీరేంద్ర వర్మలను జాబితా నుంచి తొలగించి వాటి స్థానంలో వేరే పేర్లు ఆన్లైన్ చేశారు. వీరిలో చేపల వేటకు సంబంధంలేని ఇతర కులస్తులు పేర్లు ఉన్నాయని బోటు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం,కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలలో సుమారు 1,700 బోట్లకు ఈ నెల 18న మత్స్యశాఖ అధికారులు మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వే చేపట్టారు. చేపలు, రొయ్యలు ప్రత్యుత్పత్తి జరిగే సమయం ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. వేటను కోల్పోతున్న లబ్ధిదారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం రూ.20 వేలు చొప్పున చెల్లిస్తుంది. బోటుపై వేటాడుతున్న కళాసీలను సర్టిఫై చేసి జాబితాను బోటు ఓనర్లు మత్స్యశాఖ అధికారులకు సమర్పించవలసి ఉంది. బోటు ఓనర్లు కళాసీల నుంచి రూ.10వేలు చొప్పున, మత్స్యకార భరోసా గుర్తింపు సర్వే చేపట్టిన అధికారులు ఖర్చుల పేరుతో బోటుకు రూ.1,200 చొప్పున వసూలు చేశారని సమాచారం. మండలంలో 1,001 బోట్లకు 6,006 మంది లబ్ధిదారులు ఉన్నారు. బ్రహ్మ సమేథ్యం పంచాయతీ పరిధిలోని బలుసుతిప్ప, కొత్తపాలెం, నీళ్ళరేవు, మగసానితిప్ప, పల్లం, చిర్రయానం బోట్లకు యజమానితో పాటు ఆరుగురు కళాసీలు చొప్పున గుర్తించి సర్వే పూర్తి చేశారు. లబ్ధిదారుల జాబితాలో పేర్ల మార్పుపై మత్స్యశాఖ ఇన్చార్జి జేడీ ఎల్బీఎస్ వర్థన్ను వివరణ కోరగా వసూళ్లతో తమకు సంబంధం లేదన్నారు. భరోసా లబ్ధిదారులకు న్యాయం చేస్తానని, ఆన్లైన్ జాబితాలో లబ్ధిదారులను తొలగించి కొత్త పేర్లు చేర్చితే వాటిని తొలగిస్తామన్నారు. దళారులతో చేతులు కలిపి మత్స్యశాఖ మాయాజాలం బోటుపై ఫొటో గుర్తింపు ఒకరిది.. ఆన్లైన్ జాబితాలో మరొకరు మత్స్యకార భరోసా పేర్లు తొలగింపుపై లబ్ధిదారుల ఆందోళన పేరు మారింది నా బోటు రిజిస్ట్రేషన్ నంబర్ 534. నా బోటుపై పనిచేస్తున్న కళాసీల పేర్లతో డిక్లరేషన్ పత్రం మత్స్య శాఖ అధికారులకు అందజేశాను. పాలెపు బాలదాసు శ్రీనివాసరావుకు బదులు ఈశ్వరరావు పేరు ఆన్లైన్ జాబితా లో ఉంది. – పేమ్మడి ఆదినారాయణ, బోటు ఓనర్ వేటకు సంబంధం లేనివారు జాబితాలో.. బోటు రిజిస్ట్రేషన్ నంబర్ 610.....నా పేరుకు బదులు మోరంపూడి జోయల్ లివింగస్టన్ పేరు ఆన్లైన్లో ఉన్న లబ్ధిదారుల జాబితాలో ఉంది. చేపల వేటకు సంబంధం లేని ఇతర సామాజక వర్గం చెందిన వ్యక్తి పేరు జాబితాలో ఉండడం ఆశ్చర్యపరచింది. – పేమ్మడి సతీష్ కుమార్ -
యూరియా వాడకం తగ్గించాలి
అమలాపురం రూరల్: వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగాన్ని ముఖ్యంగా యూరియా వాడకాన్ని గణనీయంగా తగ్గించి సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి యూరియా సమస్యలు పీఎండీఎస్ ప్రోత్సాహకాలపై వ్యవసాయ ఉద్యాన సేర్ప్ సిబ్బందితో సమీక్షించారు. బీసీ రిజర్వేషన్ కోటాపై వినతుల స్వీకరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాపై వినతులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ బుధవారం కమిషన్ అధ్యక్షుడుగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మే 4 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమహేంద్రవరం ఆర్ అండ్బీ అతిథిగృహంలో వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. ఇబ్బందులు తగ్గాయి జిల్లాలో వారం రోజులుగా నెలకొన్న డీజిల్ కొరత ఇబ్బందులు తగ్గాయని ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమవేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు బంకులను తనిఖీ చేస్తూ నిల్వల వివరాలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణ సమస్యలను పరిష్కరించాలి అయినవిల్లిలో ఏర్పాటు చేస్తున్న 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణంలో ఎదురైన సమస్యలను పరిష్కరిం చుకోవాలని కలెక్టర్ ట్రాన్స్కో ఇంజినీర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఇంజినీర్లతో సమీక్షిస్తూ చిరుతపూడి ప్రభల తీర్థంకు అడ్డంకిగా ట్రాన్స్మిషన్ లైను రావడంతో పక్కకు జరపాలని ఉత్సవ ప్రతినిధులు కోరుతున్నారని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
జూన్ నెలాఖరునాటికి నూతన టెర్మినల్ భవనం పూర్తి
కోరుకొండ: జూన్ నెలాఖరు నాటికి మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణ దశలోఉన్న నూతన టెర్మినల్ భవనం పూర్తవుతుందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజ్కిషోర్ తెలిపారు. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం బుధవారం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడికొచ్చారు. అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుని ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, తిరుపతికి సర్వీసులున్నట్టు, దానికణుగుణంగా అయోధ్య, వారణాసిలకు నిర్వహించడానికి ఎయిర్లైన్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. జనరల్ మేనేజర్ వసుంధర, ఎయిర్పోర్టు డైరెక్టర్ కె.ప్రీతి, ప్రాజెక్టు ఇన్చార్జి వి.శ్రీనివాసు పాల్గొన్నారు. -
ధాన్యం అమ్మకం సమస్య పరిష్కరించండి ˘
ఎంపీ బోస్ రామచంద్రపురం: రబీ మాసూళ్లు జరుగుతున్న సమయంలో ధాన్యం అమ్మకాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో లక్ష 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారన్నారు. దీనికి సరిపడా బాయిల్డ్ రైస్ మిల్లులు జిల్లాలో లేవన్నారు. మొత్తం 11 మాత్రమే బాయిల్డ్ రైస్ మిల్లులు కోనసీమ జిల్లాలో ఉన్నాయని, ప్రస్తుత రబీ సీజన్లో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం లేదన్నారు. దీంతో పాటుగా ప్రభుత్వానికి రూ.250 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలని, కేవలం 11 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండటం వల్ల అంత సొమ్ము కట్టే తాహతు వాటికి లేదన్నారు. మండపేట, రాయవరం, అనపర్తి తదితర ప్రాంతాల్లో ఉండే రైస్ మిల్లులకు జిల్లా వాసులు ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని ఎంపీ బోస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టొద్దు ˘ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ ముమ్మిడివరం: తమిళనాడు మత్స్యకారులకు వత్తాసు పలుకుతూ మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ విమర్శించారు. ఆయన ముమ్మిడివరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్య్సకారుల సంక్షేమానికి మేలు చేయగా చంద్రబాబు ప్రభుత్వం వారికి అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. జువ్వెలదిన్నె హార్బర్ విషయంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 షిపింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. హార్బర్లు లేకపోతే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి పోవల్సిన దుస్ధితి ఏర్పడుతుందన్నారు. జువ్వెలదిన్నె హార్బర్ను రూ.300 కోట్లతో జగన్ నిర్మిస్తే చంద్రబాబు ప్రభుత్వం కొంత భాగాన్ని సాగర్ డిఫెన్స్ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించడాన్ని ఆ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. తమిళనాడుకు చెందిన ఫైబర్ బోట్లు, పెద్ద బోట్లతో వేటాడుతున్నా చంద్రబాబు సర్కారు వారికి అండగా నిలబడుతోందన్నారు. సమస్యను పరిష్కరించకుండా మత్య్సకారుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబీ), ఎస్ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నారాయణ, పెయ్యల చిట్టిబాబు, నల్లా నరసింహమూర్తి, నేల కిశోర్ పాల్గొన్నారు. రైతులకు ప్రాధాన్యమివ్వాలి తాళ్లరేవు: పెట్రోలు బంకుల్లో డీజిల్ సరఫరాకు సంబంధించి రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, వరి కోత మెషీన్ల వినియోగానికి ఇచ్చిన తరువాతే మిగిలిన వారికి సరఫరా చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఆయన తాళ్లరేవు హెచ్పీసీఎల్ బంకును తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, వ్యావసాయ అధికారులు నిర్ధారించిన వారికి రోజుకు 70 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేస్తారన్నారు. మిగిలిన వారికి టిన్నులు, బాటిళ్లలో డీజిల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులను ఆదేశించారు. -
రైతులు అడిగినంత డీజిల్ ఇవ్వాలి
అమలాపురం రూరల్: రైతులు ఇబ్బందులు పడుతున్నందున వారికి అడిగినంత డీజిల్ ఇవ్వాలని వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం నాయకులు కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబి) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ మహేష్కుమార్కు నాయకులు రైతులతో కలసి వినతి పత్రం అందించారు. బాబి మాట్లాడుతూ జిల్లాలో వరి కోత, ఆక్వా పంట సీజన్ సమయంలో డీజిల్ కొరత ఏర్పడి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మార్కెట్లో డీజిల్ అధిక ధరలకు అమ్మడం వల్ల వరి రైతులకు పంటకోత ఖర్చు అధికం అవుతోందన్నారు. అధికమైన విద్యుత్ కోతలు, డీజిల్ దొరకక ఆక్వా రైతులకు నష్టం ఏర్పడుతోందన్నారు. ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి డీజిల్ కొరతను పరిష్కరించాలని కోరారు.పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పితాని బాలకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు ఢిల్లీ నారాయణ, గుబ్బల రమేష్, రాష్ట్ర కార్యదర్శి పి.చిట్టిబాబు, నల్లా నరసింహమూర్తి పాల్గొన్నారు. డిమాండ్ను అనుగుణంగా సరఫరా పెట్రోల్, డీజిల్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసేందుకు తహసీల్దార్లు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు సమన్వయం వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, నయారా ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, తహసీల్దార్లు, సీఎస్డీటీలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గుమ్మళ్లదొడ్డి నుంచి ఆయిల్ సరఫరా సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వరి కోతలకు సంబంధించి డీజిల్ సరఫరాకు సచివాలయ వ్యవసాయ సహాయకులు, ఆక్వారంగా రేడియేటర్ల వినియోగానికి మత్స్య సహాయకులు కూపన్లు జారీ చేస్తారని, వీటి ఆధారంగా రోజువారీ కేటాయింపులు జరిపి ఆయిల్ సరఫరా చేయాలన్నారు. జేసీ వైఖోమ నిడియాదేవి పాల్గొన్నారు. -
డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు
మాకు ఆటోనే జీవనాధారం. ఇటీవల కొన్ని రోజులుగా డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు సగటున లోకల్ ట్రిప్ల కోసం నాలుగు నుంచి ఆరు లీటర్లు అవసరం. దూర ప్రాంతానికి అయితే కనీసం పది లీటర్లు పడుతుంది. కానీ బంకుల్లో రూ.200 మాత్రమే కొడుతున్నారు. దానికి కూడా రెండు గంటలు లైన్లో ఉండాలి. ఒక పూట, ఒక్కో రోజు ఆటో పక్కన పెట్టేయాల్సిన దుస్థితి. ఎక్కడన్నా ఆగిపోతే బ్లాక్లో లీటరు రూ.125 చేసి కొనుగోలు చేస్తున్నాం. – తరెట్ల రజనీకాంత్, ప్రెసిడెంట్, దుర్గా సిద్ధివినాయక ఆటో యూనియన్, కొత్తపేట 5 గంటలు నిలుచుంటే 2 లీటర్లు జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడినప్పటి నుంచి బంకుల వద్ద మూడు నుంచి ఐదు గంటల వేచి ఉంటే రెండు లీటర్లు డీజిల్ దొరుకుతుంది. అది రెండు రోజుల నుంచి అసలు దొరకడం లేదు. రోజు వారీ కిరాయిలు, రూట్లలో ఆటోలు నడపలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు డీజిల్ లేక స్టాండ్లో ఆటోలను ఖాళీగా పెట్టుకుంటున్నాం. – వాసంశెట్టి సత్తిరాజు, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు, అమలాపురం -
పెట్రోగిపోతున్నా పట్టదా?
నానాటికీ తీవ్రమవుతున్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను చంద్రబాబు సర్కారు పరిష్కరించకపోవడాన్ని ఖండిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. ఆటోలు, ట్రాక్టర్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి అక్కడ బారులు తీరిన రైతులు, వాహనాల డ్రైవర్లు, సామాన్య జనంతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి మజ్జిగ అందజేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో గృహిణులు, వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. బంకుల్లో ఆయిల్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. – సాక్షి నెట్వర్క్వినియోగదారుల పక్షాన పోరాడతాం : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ బంకుల వద్ద పూర్తి స్ధాయిలో అయిల్ నిల్వలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినియోగదారుల పక్షాన పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ హెచ్చరించారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోలు బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వినియోగ దారులు పడుతున్న ఇక్కట్లను స్వయంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యమే కారణం: మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరిదేవి ఇంధన కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని రాజోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె రాజోలులోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ కావాలంటే సిఫారసు లేఖలు తెచ్చుకోవలసిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం : గన్నవరపు శ్రీనివాసరావు పెట్రోల్, డీజిల్ కోసం రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. నగరం పెట్రోల్ బంక్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యకమంలో ఆయన మాట్లాడుతూ విజనరీ పాలన అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమేనా చంద్రబాబూ అని ప్రశ్నించారు. నేరం అధికారులపైకి నెట్టేస్తున్నారు : పిల్లి సూర్యప్రకాశ్ క్రెడిట్ చోరీకి పాల్పడే సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ కొరత అధికారుల మూలంగానే ఏర్పడిందంటూ నేరం అధికారులు మీద నెట్టివేస్తున్నారని రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్ ధ్వజమెత్తారు. రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో గల హెచ్పీసీఎల్ బంకు వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొరత రాష్ట్రంలోనే ఎందుకు?: శివకుమార్, డేవిడ్రాజు పెట్రోల్, డీజిల్ కొరత మన రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడిందో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆలోచన చేసి, సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్, ఆ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు డిమాండ్ చేశారు. కొత్తపేటలో పెట్రోలు బంకు వద్ద ప్రజలు, రైతులకు మద్దతుగా వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
తొలగని చముర్జెన్సీ!
సాక్షి, అమలాపురం: డీజిల్ కొరత సామాన్యులు, మధ్య తరగతి, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత బస్సు పథకం తరువాత కిరాయిలు తగ్గి నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్న ఆటో డ్రైవర్ల మీద డీజిల్ కొరత పిడుగులా పడింది. వరి కోతలు, మామిడి వంటి పండ్ల అమ్మకాల సీజన్లో చేతి నిండా బేరాలున్నా రవాణా ఆటోలు, మినీ వ్యాన్ చక్రాలు డీజిల్ లేక కదలకపోవడంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు వరి కోతలు, కుప్ప నూర్పిడులు, మరోవైపు ధాన్యం రవాణా జరిగే ముమ్మర సీజన్లో డీజిల్ దొరకకపోవడంతో ట్రాక్టర్ యజమానులు, రైతులు ఆవేదనతో గడుపుతున్నారు. జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన పెట్రోల్, డీజిల్ కొరత రానురానూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. కొరత లేకుండా చూస్తాం... కొరతను అధిగమిస్తాం.. రెండు రోజులలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.. అని అధికారులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మెరుగు పడడం లేదు. జిల్లాలో మంగళవారం కూడా పలు బంకులు పెట్రోల్, డీజిల్ లేక మూతపడడం.. ఉన్నచోట్ల వాహనాల చాంతాండంత క్యూ లు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రధానంగా డీజిల్ కొరత సామాన్యులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. మరీ ముఖ్యంగా ఆటోలు.. రవాణా ఆటోలు.. మినీ వ్యానులు.. ట్రాక్టర్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి గడిచిన వారం రోజులుగా రోజువారీ పని లేకుండా చేస్తోంది. దీంతో వారు అర్ధాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. నిలిచిపోయిన ఆటోలు డీజిల్ కొరతతో జిల్లాలో సగానికి పైగా ప్రయాణికుల రవాణా ఆటోలు నిలిచిపోయాయి. జిల్లాలో 14 వేలకు పైగా ప్రయాణికుల ఆటోలు ఉండగా, డీజిల్ కొరత వల్ల తొమ్మిది వేలకు పైగా ఆటోలు నిలిచిపోయాయని అంచనా. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే ఆటోలు కదలడం లేదు. జిల్లాలో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, మలికిపురం వంటి సముద్ర తీర ప్రాంత వాసుల ప్రధాన రవాణా వాహనం ఆటో. అటువంటి ఆటోలు డీజిల్ కొరతతో మూలనపడడంతో స్థానిక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజు విడిచి రోజు కూడా డీజిల్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ట్రాన్స్పోర్టు ఆటోలకు సైతం బ్రేక్ డీజిల్ దొరకక పోవడంతో ప్రయాణికుల ఆటోలతో పాటు రవాణా ఆటోలు కూడా నిలిచిపోతున్నాయి. వీటితోపాటు మినీ వ్యాన్లు కూడా కదలడం లేదు. రావులపాలెం అరటి, ఆలమూరు మండలం మడికి కూరగాయల మార్కెట్కు సీజన్ కావడంతో మామిడి, పుచ్చకాయ, దోసకాయలు, ఇతర పండ్ల రవాణాలకు ఈ ఆటోలు చాలా కీలకం. అరటి ఉత్పత్తులు, కూరగాయల తరలింపులో ఇవి చాలా కీలకం. వీటితోపాటు అమలాపురం, రామచంద్రపురం వంటి పట్టణాలు, మేజర్ పంచాయతీలలో సిమెంట్, ఐరన్, ఇతర వస్తువుల రవాణా కూడా సాగేది వీటి మీదనే. ఇవి కదిలే పరిస్థితి లేకపోవడం వల్ల వాటి యజమానులతోపాటు ఆయా వ్యాపారులపై కూడా ప్రభావం చూపుతోంది. కదలని ట్రాక్టరు డీజిల్ కొరతతో ట్రాక్టర్లు కదలడం లేదు. రబీ వరి కోతలు, నూర్పిడులు ముమ్మరంగా సాగుతున్న తరుణం ఇది. ఈ సమయంలోనే ట్రాక్టర్లకు పని ఉండేది. కుప్ప నూర్పిడులు, ధాన్యం రవాణా వంటి పనులలో బిజీగా ఉండాల్సిన సమయంలో డీజిల్ లేక వాటిని మూలన పెడుతున్నారు. ట్రాక్టర్ల సహాయంతో వరి కోత యంత్రాలు కోసిన గడ్డిని పశువులకు ఉపయోగపడే విధంగా భద్రపరచుకోవడానికి ట్రాక్టర్ చాలా అవసరం. డీజిల్ ఉన్న సమయానికి వెళ్తే రెండు, మూడు గంటలు లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. డీజిల్ ఆయిల్ తెచ్చుకోవడానికి డబ్బాలను తీసుకొని వెళ్తే బంకుల దగ్గర ప్రభుత్వం చెప్పిందని డబ్బాలలో ఆయిల్ పోయడానికి నిరాకరిస్తున్నారు. వాహనాలను తీసుకుని వెళ్తే సమయం అంతా అక్కడ వృథా అవడం వల్ల ఒక పూట పనిపోతోందని వాపోతున్నారు. కూపన్ పట్టుకుని వెళుతున్నా డీజిల్ లేకపోవడంతో వారు ఇబ్బందుల పాలవుతున్నారు. రావులపాలెంలో పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం క్యూ కట్టిన ఆటోలుఅమలాపురంలో డీజిల్ లేక స్టాండ్లో ఉంచిన ఆటోలు ఆగిన జీవన ‘చక్రం’ డీజిల్ కొరతతో నిలిచిపోతున్న ఆటోలు, మినీ వ్యాన్లు రవాణా ఆటోల పరిస్థితి మరింత దారుణం కదలని ‘‘ట్రాక్టర్లు’’ కోతలు, నూర్పిడులు, ఽ దాన్యం రవాణాకు బ్రేక్ కీలక సమయంలో నడవని వాహనాలు ఆందోళనలో యజమానులు -
కూటమి వైఫల్యం వల్లే డీజిల్ సంక్షోభం
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం ఏర్పడిందని రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలోని ఈదరపల్లిలో రిలయన్స్, గాయత్రీ పెట్రోల్ బంకుల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈదరపల్లిలో పెట్రోల్ బంక్ వద్దకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్సీ, కోఆర్డినేటర్ల, పార్టీ నాయకులు డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారుల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ పరిపాలనాధక్షుడు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు డీజిల్ సంక్షోభం ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్నారు. సీఎం, మంత్రులు, కలెక్టర్లు, జేసీలు కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. కోనసీమలో నగరంలో ఆయిల్ రిఫైనరీ ఉన్న, ఓడలరేవులో చమురు నిల్వలు ఉన్న రైతులకు డీజిల్, పెట్రోల్ దొరకడం లేదన్నారు. అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రాజోలు కోఆర్డినేటర్ రాజేశ్వరీదేవి మాట్లాడుతూ కోత యంత్రాలకు డీజిల్ లేక వరి కోతలు నిలిచిపోయాయన్నారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే డీజిల్ సంక్షోభం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), అమలాపురం పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్యకుమార్, రాష్ట్ర కార్యదర్శులు చింతలపాటి శ్రీనివాసరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, పాటి శివ, ఎస్ఈసీ మెంబర్ కుడుపూడి భరత్ భూషణం, పట్టణ అఽధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్, అల్లవరం మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ తదితరులు పాల్గొన్నారు. -
వీడని ఇంధన కష్టాలు
సాక్షి, అమలాపురం/ ఆలమూరు: జిల్లాలో డీజిల్ కొరత పెరిగే కొద్దీ అన్నదాత కష్టాలు రెట్టింపవుతున్నాయి. అష్టకష్టాలు పడి పంట పండించిన రబీ వరి రైతులకు సరిగ్గా కోతలు.. కుప్ప నూర్పిళ్లు.. ధాన్యం పట్టుబడుల సమయంలో డీజిల్ కొరత వారి నెత్తిన పిడుగు పడినట్టయింది. డీజిల్ కొరత వల్ల వరి మాసూళ్లు అన్నదాతకు అదనపు భారంగా మారింది. సమయానికి వరికోత యంత్రం అందుబాటులో ఉన్నా డీజిల్ కొరతతో కోత ధరకు రెక్కలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 872 వరి కోత యంత్రాలు పనిచేస్తున్నాయి. రామచంద్రపురం, కె.గంగవరం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ముమ్మరంగా వరి కోతలు జరుగుతుండగా మిగిలిన మండలాల్లో సైతం కోతల మొదలయ్యాయి. డీజిల్ కొరతను బూచిగా చూపి వరి కోత యంత్రం అద్దెను పెంచేశారు. ఇప్పటి వరకూ గంటకు రూ.2,800–రూ.3000 వరకు వరకు అద్దే ఉండేది. డీజిల్ కొరత పేరుతో అద్దె రూ.3,500కు పెంచారు. ఎకరాకు కోతకు వచ్చి రూ.500 నుంచి రూ.700 వరకు పెరగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎంత చేసి డీజిల్ పట్టుకు రావలసిన బాధ్యత రైతులదే కావడం గమనార్హం. అలాగే ధాన్యాన్ని రవాణా చేసే ట్రాక్టర్, మినీ వాహనాల కిరాయి ధరలు కూడా పెగిపోయాయి. డీజిల్ కొరతను బూచిగా చూపి సాధారణ రవాణా చార్జీల కన్నా అదనంగా 20 శాతం ధరలు పెంచేశారని రైతుల ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడ్డామని అనుకున్న సమయంలో డీజిల్ కొరత వరి రైతులకు సంకటంగా మారింది. పెరిగిన కొబ్బరి రవాణా చార్జీలు కొబ్బరి రైతులపై డీజిల్ కొరత పరోక్ష భారాన్ని మోపుతుంది. కొబ్బరి ఎగుమతి కేంద్రమైన జిల్లాలోని అంబాజీపేట నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కురిడీ కొబ్బరి, నీటి కొబ్బరి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసింది. ఈ సీజన్లో అంబాజీపేట నుంచి కురిడీ కొబ్బరి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలకు రోజుకు 30 లారీలకు పైగా ఎగుమతి అవుతుంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజుకు సగటున 70 లారీల వరకు నీటికొబ్బరి (పచ్చి కొబ్బరి) ఎగుమతి జరుగుతుందని అంచనా. ఈ లారీల రవాణాకు సైతం డీజిల్ కొరత ప్రధాన అవరోధంగా మారింది. చాలా బంకుల్లో డీజిల్ లేకపోవడం ఉన్నచోట రేషన్ పద్ధతిలో డీజిల్ కొట్టడం వల్ల లారీ యజమానులు సుదూర ప్రాంతాలకు రవాణా అంటే భయపడుతున్నారు. దీనిని సాకుగా చూపించి రవాణా ధరలు పెంచేశారు. అంబాజీపేట నుంచి రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు లారీ కిరాయి రూ.లక్ష వరకు ఉండేది. ఇప్పుడు అది 20 శాతం వరకు పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అదనంగా పెరిగిన రవాణా భారాన్ని స్థానిక వ్యాపారులు రైతులపై మోపుతున్నారు. ఆక్వా రైతులదీ ఇంచుమించు ఇదే పరిస్థితి గత వారం రోజులుగా ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో డీజిల్ మీదనే ఏరియేటర్లు తిప్పాల్సి వస్తుంది. అలాగే చిన్న, సన్న కారు రైతుల్లో ఎక్కువ మందికి విద్యుత్ సౌకర్యం లేదు. వీరంతా డీజిల్ జనరేటర్లు ఆశ్రయించాల్సి వస్తోంది. రొయ్యల చెరువులే కాకుండా చేపల చెరువులకు నీరు అందించాల్సి ఉన్న డీజిల్ మోటార్ల మీదనే ఆధార పడాల్సి వస్తుంది. వీరంతా స్థానికంగా ఉన్న బంకుల వద్దనే డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంది. తీరప్రాంత గ్రామాల్లో బంకులు అందుబాటులో లేని రైతులు పెట్రోల్, డీజిల్ అమ్మే బడ్డీలు, గ్రామాల్లో అనధికారికంగా డీజిల్ అమ్మే వారి వద్ద వీటిని కొనుగోలు చేస్తున్నారు. పుదుచ్చేరి యానం నుంచి అక్రమ మార్గంలో డీజిల్ తెచ్చి స్థానికంగా విక్రయాలు చేస్తున్నవారు తీర ప్రాంత గ్రామా ల్లో ఎక్కువగా ఉన్నారు. గతంలో ఐదు లీటర్ల డీజిల్ రూ.500లకు ఇచ్చేవారు. ఇప్పుడు ఐదు లీటర్లను రూ.600 నుంచి రూ.700 చేసి విక్రయిస్తున్నారు. ఎకరా రొయ్యల చెరువులకు నాలుగైదు ఏరియేటర్లు ఉంటాయి. రోజుకు కనీసం 20 లీటర్ల వినియోగం ఉంటుంది. గతంలో అవుతున్న ఖర్చుకన్నా ఇప్పుడు రోజుకు రూ.400 నుంచి రూ.800ల వరకు అదనపు భారం పడుతుందని రొయ్యల రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారి ప్రకటనలు వారివే.. కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిల్లా యంత్రాంగం చెబుతుంది. పనిలో పనిగా ప్రచార మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ, అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురై, అవసరానికి మించి భవిష్యత్ అవసరాలకు గాను డీజిల్ను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవంగా జిల్లాలో సోమవారం కూడా పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వేలాడుతూ కనిపించాయి. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేకపోవడంతో బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతూ కనిపిస్తున్నాయి. ఫోన్లు స్విచాఫ్ చేసుకున్న బంకుల యాజమానులు, సిబ్బంది అమలాపురం టౌన్: అధికారుల పర్యవేక్షణ లోపం, కొరవడిన ప్రభుత్వ ముందు చూపు వల్ల జిల్లాలో డీజిల్, పెట్రోలు కొరత జటిలమైంది. ఇంత కాలం సొంత పనులకు, ప్రభుత్వ పనులకు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు పైరవీలు, సిఫారసులు చేయించుకున్న ప్రజలు ఇప్పుడు వాటన్నింటికీ స్వస్తి పలికి కేవలం డీజిల్, పెట్రోలు కోసం బంక్ యజమానులకు ఫోన్లు చేయించుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు బంకు యజమానులు, సిబ్బందికి ఫోన్ చేసినా సెల్ఫోన్లు స్విచాఫ్లో పెట్టేసి ఎవరికీ సమాధానం చెప్పకుండా అజ్ఞాతంలో ఉండిపోతున్నారు. అమలాపురంలో ఓ బంక్ యాజమాని, సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తకపోయే సరికి ఓ రాజకీయ నాయకుడు అసహనానికి గురయ్యాడు. ఈ విషయంలో నేనేమీ చేయలేనని ఆయిల్ కోసం సిఫారసులు, పైరవీల కోసం వచ్చిన వ్యక్తికి చెప్పి చేతులెత్తేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న చేదు అనుభవం ఇది. మూడు రోజుల నుంచి సాగుతున్న ఇంధన కష్టాలకు ఇంకా తెరపడలేదు. పానిక్ బయింగ్, ఫ్యూయల్ ఫియర్ అంటూ కబుర్లు చెప్పిన అధికారులు డిమాండ్ తగ్గ సరఫరా చేయడంతో ఫుల్స్టాప్ పెట్టలేకపోతున్నారు. అసలే రబీ సీజన్ కోతల దశలో ఉండటంతో కోత మెషీన్లకు, రొయ్యల చెరువుల్లో ఏరియేటర్లకు, కొబ్బరి ఎగుమతులు చేసే లారీలకు డీజిల్ ప్రస్తుతం అత్యవసరం ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కష్టాలు నుంచి విముక్తి లభించడం లేదు.ఫ కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న డీజిల్ కొరత ఫ పెరిగిన కోత మెషీన్ల అద్దె ఫ ఉత్తర భారతానికి కొబ్బరి ఎగుమతులపై ప్రభావం ఫ 20 శాతం వరకు పెరిగిన లారీల రవాణా చార్జీలు ఫ ఆక్వా పైనా అదనపు భారం మూడు రోజులుగా మూలనే ఉంది డీజిల్ లేకపోవడంతో గడచిన మూడు రోజులుగా కోత మెషీన్ మూలనపడి ఉంది. సీజన్లో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చెల్లూరు, అంగర, కొత్తూరు సెంటర్, మండపేట, ఆలమూరు, గోపాలపురం, రావులపా లెం తిరిగినా నాకు డీజిల్ చుక్క దొరకలేదు. ఇల్లు అమ్ముకొని వరి కోత మెషీన్ కొన్నాను. అధికారులు ఇచ్చిన స్లిప్పులు పట్టుకుని బంకులకు వెళ్తున్నా డీజిల్ దొరకడం లేదు. సీజన్లో పని లేకపోతే మెషీన్ ఉండి ఆదాయం లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. – చింతాకుల వెంకన్న, కపిలేశ్వరపురం -
రాజా వాసిరెడ్డి గొప్ప దార్శనికుడు
అమలాపురం టౌన్: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కేవలం పాలకుడు మాత్రమే కాదని గొప్ప దార్శనికుడని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆయన సేవలను కొనియాడారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. ఎస్పీ మీనా మాట్లాడారు. తొలుత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి ఎస్పీ మీనాతో పాటు జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఎస్పీ కార్యాలయ పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి కాలంలో చెరువులు తవ్వించి పేదలకు అన్నదాన సత్రాలు ఏర్పాటుతో పాటు అనేక దేవాలయాలు నిర్మించిన ఆధ్యాత్మిక వేత్త, దాత అని కొనియాడారు. స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ నాగప్రసాద్, ఏఆర్ ఆర్ఐ బ్రహ్మానందం, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సేవలను గుర్తు చేసుకున్నారు. పాలనాదక్షుడు ‘వాసిరెడ్డి’ అమలాపురం రూరల్: ప్రజాక్షేమం కోరి, ధర్మాన్ని రక్షించిన పాలకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో వెంకటాద్రి నాయుడు చిరస్థాయిగా నిలిచారని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధర్మరక్షణే పరమావధిగా శిథిలావస్థకు చేరిన వందలాది దేవాలయాలను పునరుద్ధరించిన ఘనత రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడికే దక్కుతుందన్నారు. అమరావతి సంస్థానాధీశులైన వెంకటాద్రినాయుడు గొప్ప దాత, ప్రజారంజక పాలకుడన్నారు. -
వివాద ఆలయ స్థలం వద్ద పోలీసు పికెటింగ్
కాట్రేనికోన: మండలంలో చెయ్యేరు అగ్రహారంలో కనకదుర్గమ్మ ఆలయం పునర్నిర్మాణం విషయంలో సరిహద్దు రైతుకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం తలెత్తడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వివాద స్థలం సర్వే నెంబరు 441/1లో ఉన్న భూమిలో ఇరువర్గాలు ఏ విధమైన పనులు చేపట్టరాదని కాట్రేనికోన తహసీల్దార్ వి.రవికిరణ్ అన్నారు. శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకుని 145,164 సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశించా రు. తదుపరి ఉత్తరు్ువ్ల వచ్చేంత వరకు ఇరువర్గా లు భూమిలో పనులు చేపట్టరాదన్నారు. రెవె న్యూ ఆదేశాలతో రైతు చట్టాలను గౌరవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని కాట్రేనికోన ఎస్సై అవినాష్ అన్నారు. -
పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు
అల్లవరం: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వ్యవసాయం, ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోతోందని, చిరు వ్యాపారులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని మాజీ ఎంపీ చింతా అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొరత తీవ్ర స్థాయిలో ఉందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని, సాధారణ ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడవలసి వస్తోందని తెలిపారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో అధికారుల లెటర్లు ఉంటేనే డీజిల్ పోసే పరిస్థితి ఉందన్నారు. డీజిల్ కొరతతో వ్యవసాయ, వ్యాపార, ఆక్వా రంగాలు కుదేలవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని చమురు కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని, డీజిల్, పెట్రోల్ సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కృత్తిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో డీజిల్, పెట్రోల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్కు పోటెత్తిత్తిన అర్జీదారులు అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, సాగు, తాగునీటి సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమస్యలు విన్నవించుకుంటున్న పరిష్కారం కావట్లేదని వారు వాపోయారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో భూ సమస్యల ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జేసీ వైఖోమ్ నిడియాదేవి, సమగ్ర శిక్ష ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, రెవెన్యూ సేవలతో పాటు ఇళ్లస్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్షన్ మంజూరు తదితర సమస్యలపై 195 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేస్తూ నూటికి నూరు శాతం సంతృప్తికర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. పోలీసు గ్రీవెన్స్కు 25 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్లు ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి ఈ పోలీస్ గ్రీవెన్స్ను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ తమ సమస్యలపై ఎస్పీ, ఏఎస్పీలకు ఫిర్యాదు పత్రాలు అందించారు. పోలీస్ వ్యవస్థపై పూర్తి నమ్మకం కలిగేలా పోలీస్ గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదులపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని ఎస్పీ మీనా ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉండడంతో ఎస్పీ, ఏఎస్పీలు అర్జీదారులను కౌన్సెలింగ్ చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. జనగణనలో భాగస్వాముల్ని చేసేందుకే 5కే రన్ అమలాపురం రూరల్: దేశ డిజిటల్ జనగణన విధానంలో స్వీయ గణనకు ప్రాధాన్యతనిస్తూ భాగస్వాముల్ని చేసే లక్ష్యంతో 5కే రన్ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ అన్నారు సోమవారం కలెక్టరేట్ నుంచి గడియార స్తంభం వరకు స్వీయగణనపై చైతన్యం రగిలించేలా 5కే రన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ రన్ ద్వారా మన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పరుగులో ఉత్సాహాన్ని పొంది, జనగణన ప్రాముఖ్యతను తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అర్ధ గణాంకాధికారి మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, పీఆర్ ఈఈ అన్యం రాంబాబు, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో సాధారణ స్థితికి డీజిల్ సరఫరా
అమలాపురం రూరల్: జిల్లాలో డీజిల్ సరఫరా రాబోయే రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీజిల్ కొరత అంశంపై ముందుగా ఏపీ ఈపీడీసీఎల్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమీక్షలో ఆక్వారంగ ఏరియేటర్లకు, వ్యవసాయ కోతలకు, రోజువారి డీజిల్ వినియోగంపై లక్ష్యాలు నిర్దేశించారు.ఈ సమీక్షలో గత మూడు రోజులుగా సరఫరాలో కొద్దిపాటి అంతరాయాలు మూలంగా ఆక్వా రంగ ఏరియేటర్లకు గాను డీజిల్ వినియోగం పెరిగిందని ప్రస్తుతం విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగడంతో ఆక్వా రంగంలో డీజిల్ వినియోగం ప్రస్తుతం తగ్గుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ముమ్మరంగా యంత్రాలతో వరి కోతలు నిర్వహిస్తున్నారని వీటికి డీజిల్ కోసం సచివాలయ వ్యవసాయ సహాయకులు కూపన్లను రోజువారి వారి సంతకంతో ధ్రువీకరించి పంపుతారని వాటికి ఆయిల్క్యాన్లలో ఆయిల్ నింపి సరఫరా చేయాలని బంకు ప్రతినిధులకు పంపుతారని ఆ మేరకు డీజిల్ సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో పంట కాలువలు మూసివేసిన తర్వాత చేపట్టే పూడికతీత పనుల మట్టిని ప్రభుత్వ పాఠశాలు, బరియల్ గ్రౌండ్స్ పల్లపు ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు మండలాల వారీగా జలవనరులు, జిల్లా పంచాయతీ, గనుల శాఖ, డిప్యూటీ ఎంపీడీవో, డ్వామా సిబ్బందితో కమిటీలు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు
అమలాపురం టౌన్: మహిళలపై తన ఆంధ్రజ్యోతి పత్రిక, చానల్ ద్వారా తప్పుడు రాతలు, ప్రసారాలు చేసే ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలు ఆరోపణలతో ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శ్రీనివాసరావు, పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఏబీఎన్ చానల్లో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి, పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ ఎంతసేపూ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును మోయడమే అతని అసలు అజెండా అని ధ్వజమెత్తారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పే వరకూ తమ నిరసన ఇలానే కొనసాగుతుందని శ్రీనివాసరావు హెచ్చరించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావుతో పాటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు, అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల పార్టీ అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్, విత్తనాల ఇంద్రశేఖర్, మేడిశెట్టి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్, తోరం భాస్కరరావు, అడ్డగళ్ల సాయిరామ్, మొల్లేటి త్రిమూర్తులు, తోరం గౌతమ్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. -
నేడు జనగణన 5కే రన్
అమలాపురం రూరల్: జనగణన 2027కు సంబంధించి ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకూ డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న స్వీయగణనపై ప్రజలను చైతన్యపరిచేందుకు సోమవారం జనగణన 5కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి ఈ రన్ ప్రారంభించి, కలెక్టరేట్ వరకూ జరుగుతుందన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, ఉద్యోగులు, యువత పాల్గొనాలని కోరారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవనంలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. డీజిల్ కొరతపై ఆందోళన వద్దు అమలాపురం రూరల్: డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజులలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో సరఫరా పునరుద్ధరణ కోసం చమురు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. పెట్రోల్ బంకుల్లో నిల్వల పర్యవేక్షణకు రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నంబర్ 9059 920242, 94933 13862కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. బీచ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి కాకినాడ రూరల్: సందర్శకులకు ఇబ్బందులు కలకుండా బీచ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సూర్యారావుపేట బీచ్ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీచ్లో సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. స్వీయ గణనలోభాగస్వాములు కావాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వీయ గణన(సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్, టూటౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ వరకూ ఆదివారం నిర్వహించిన 5కే రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 30 వరకూ జిల్లాలోని ప్రతి పౌరుడూ స్వీయ గణన నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటింటా జనగణ నమోదు కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకూ జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్నారని చెప్పారు. -
నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు..
తేల్చి చెప్పిన ఊడిమూడిలంక వంతెన కాంట్రాక్టర్ పి.గన్నవరం: మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై రూ.71.43 కోట్లతో చేపట్టిన వంతెన పనులకు సంబంధించి రూ.14 కోట్ల మేర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే, పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం వంతెన పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజినీర్ శివకుమార్కు అసోసియేట్ ఇంజినీర్స్ ఎంటర్ప్రైజెస్ (కాంట్రాక్టర్) పీఎస్ రాజు తేల్చిచెప్పారు. గతంలో రూ.22 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన రూ.14 కోట్లు విడుదల చేయకపోవడంతో అతి ముఖ్యమైన వేసవి కాలాన్ని వినియోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధుల విడుదలకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే లంకలో అబెక్ట్మెంట్ వాల్ నిర్మాణం కోసం 14 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని సమకూర్చాలని కోరారు. మొత్తం 9 పిల్లర్లు, రెండు అబెక్ట్మెంట్ వాల్లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఇంత వరకూ 50 శాతం పనులు పూర్తి అయ్యాయని పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు సీఈకి వివరించారు. వంతెన పూర్తయితే ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కష్టాలు తొలగుతాయని ఆయన తెలిపారు. పనుల ప్రగతిని ఆయన ఎస్ఈకి వివరించారు. వంతెన నిర్మాణాన్ని సీఈ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ పి.రామకృష్ణం రాజు, జేఈ సంపన్న దుర్గా కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవాలకు శ్రీకారం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడే వరుడైన వేళ.. సిరులొసంగే దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వధువైన మహత్తర సన్నివేశాన్ని కన్నులారా తిలకించి, భక్తులు పులకించిపోయారు. సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై పండితులు శ్రీకారం చుట్టారు. రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాములు పెళ్లి పెద్దలుగా వెంట రాగా.. సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై ప్రత్యేక ఆసనం మీద సత్యదేవుడు, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను వేంచేయించి, ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారిని, స్వామివారిని వధూవరులను చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పసుపు దంచే రోలు, రోకళ్లకు పండితులు పూజలు చేసిన అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ ఘనంగా నిర్వహించారు. పండితుల చతురోక్తులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుని కల్యాణోత్సవానికి సుమారు 25 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. భక్తుల వాహనాలను కొండ దిగువన కళాశాల మైదానం వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి కొండ మీదకు చేరేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కల్యాణ ఏర్పాట్లను చైర్మన్, ఈఓ సమీక్షించారు. ఫ వధూవరులుగా అమ్మవారు, సత్యదేవుడి అలంకరణ ఫ రత్నగిరిపై కన్నుల పండువగా వేడుక ఫ నేటి రాత్రి స్వామివారి కల్యాణం అన్నవరంలో నేడు ఫ తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఫ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ ఫ ఉదయం 9.00 : అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షా వస్త్రధారణ ఫ రాత్రి 7.00 : కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామివారు. వెండి గజవాహనంపై అమ్మవారు, వెండి పల్లకీపై సీతారాముల ఊరేగింపు ఫ రాత్రి 9.30 : రత్నగిరి కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం ఫ రత్నగిరి కళావేదికపైన, కొండ దిగువన ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు. -
చేతిచమురు వదలకుండా..
చమురును చక్కబెట్టేస్తున్నారు.. కొరత పేరు చెప్పి కొరివి తెస్తున్నారు.. గంటల తరబడి క్యూలో ఉన్నవారిని కాదని గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు.. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ తంతును అడ్డుకునేవారు లేకపోతున్నారు.. వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఫ బ్లాక్ మార్కెట్కు డీజిల్, పెట్రోల్ ఫ కొరతను సాకుగా చూపి ఎత్తుగడ ఫ బంకుల వద్ద చమురు లేదని బోర్డులు ఫ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు కాట్రేనికోన/ అమలాపురం రూరల్ / అల్లవరం: పెట్రోల్ బంకుల్లో ఎంతకంతకూ రద్దీ పెరుగుతోంది. కోనసీమలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. చివరికి చమురు లేదని బోర్డు పెట్టడం కనిపిస్తోంది. జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 115 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆదివారం చాలాచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్టులు పెట్టేశారు. మరికొన్ని చోట్ల భారీ క్యూ కనిపించింది. అక్కడ మాత్రం రూ.100, లేక రూ.200 చొప్పున పెట్రోల్ కొట్టడం కనిపించింది. ఇదిలా ఉంటే కొందరు బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకుంటున్నట్లు సమాచారం. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, అమలాపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఆక్వా, రైతులకు వ్యవసాయ, మత్స్యశాఖ అధికారుల సిఫార్సు లేఖలతో డీజిల్ అందించారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోనూ ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. పంట చేలు కోతకు రావడం, ఎండల తీవ్రత, విద్యుత్ కోతలతో ఆక్వా రైతులు సైతం జనరేటర్లు, ఇంజిన్లపై ఏరియేటర్లు తిప్పేందుకు డీజిల్పై ప్రధానంగా ఆధారపడటం, బంకులలో తగినంత డీజిల్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరతను సాకుగా చూపిస్తూ, కొన్ని బంకుల్లో బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలా అంటే.. ఫ జిల్లాలో మూడో రోజు ఆదివారం డీజిల్ కష్టాలు మరింత పెరిగాయి. కొన్ని బంకుల వద్ద పోలీసుల సమక్షంలో అమ్మకాలు సాగించారు. డీజిల్ కోసం వినియోగదారులు, బంకు యాజమాన్యాల మధ్య వివాదాలు జరిగాయి. ఫ కాట్రేనికోన మండలం దొంతికుర్రు పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఫ కొత్తపేట పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనదారులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రైతులు, వాహనాదారులు ఆందోళన చేశారు. ఫ అమలాపురంలో పట్టణ, రూరల్ మండలంలోని 13 పెట్రోల్ బంకుల్లో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించారు. ఈదరపల్లి, అమలాపురం నల్లవంతెన, ఎర్రవంతెన పెట్రోల్బ బంకు వద్ద క్యూ రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి – నంగవరం రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం రైతులు బారులు తీరారు. వరి కోత మెషీన్లకు డీజిల్ కోసం క్యూలో ఉన్నా, స్టాక్ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ బయట ఇళ్లు, షాపుల వద్ద 5 లీటర్ల డీజిల్ను గతంలో రూ.500 విక్రయించగా, ఇప్పుడు రూ.700కు అమ్ముతున్నారు. వీరికి బంకుల నుంచే చమురు వస్తున్నట్లు సమాచారం. కొన్ని బంకుల నుంచి నేరుగా లీటరుకు రూ.5 అదనంగా తీసుకుని మధ్యవర్తుల ద్వారా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్కు తరలింపు చమురును బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. జిల్లాలో రైతులు, వాహనదారులు చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. డీజిల్, పెట్రోల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నా, బయట అందుకు విరుద్ధంగా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీజిల్ కృత్తిమ కొరతను నివారించాలి. డీజిల్ కొరత, అనధికార విద్యుత్ కోతలతో ఆక్వా రంగం కుదేలవుతుంది. మొన్నటి వరకూ యూరియా, నేడు డీజిల్ కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. చంద్రబాబు పాలనంటేనే పడిగాపులు తప్పవన్నట్లు ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలి. –బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ ఇక్కడ పడిగాపులే.. కాట్రేనికోన మండలంలో ఎన్నడూ లేని విధంగా డీజిల్ కోసం రొయ్యలు, చేపల చెరువుల రైతులు, వాహనదారులు పడిగాపులు పడ్డారు. దొంతికుర్రు బంకు వద్ద డీజిల్ కోసం ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాట్రేనికోన పెట్రోలు బంకులో డీజిల్ నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది. దొంతికుర్రు, కాట్రేనికోన పెట్రోల్ బంకులలో శనివారం రాత్రి 5 వేల లీటర్ల చొప్పున డీజిల్ ఆయిల్ దిగుమతి చేసుకున్నారు. ఆదివారం 11 గంటలకు కాట్రేనికోనలో 1,750 లీటర్లు, దొంతికుర్రు బంకులో 6,140 లీటర్లు స్టాకు ఉన్నట్లు గుర్తించామని తహసీల్దార్ వి.రవికిరణ్ తెలిపారు. కొంత సేపటికే కాట్రేనికోన బంకులో డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీజిల్ను సరఫరా చేస్తున్నామని తహసీల్దార్ రవికిరణ్ అన్నారు. అల్లాడిపోతున్న ఆక్వా వేసవి ఉష్ణోగ్రతలకు రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్లు పెట్టకుంటే ఆక్సిజన్ స్థాయి పడిపోయి ఒక్కసారిగా పంట మృత్యువాత పడే పరిస్థితి దాపురిస్తుంది. ఇలా ఆక్వా పరిశ్రమ అల్లాడిపోతుంది. విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో రైతులు డీజిల్ జనరేటర్లు, ఇంజిన్లపై ఆధారపడి ఏరియేటర్లను తిప్పుతూ పంటను రక్షించుకుంటున్నారు. బంకులలో డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ఆక్వా పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ.64,31,681 ఆదాయం వచ్చింది. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కుక్ అండ్ హెల్పర్లను తొలగించం● స్పష్టం చేసిన డీఈవో నాగేశ్వరరావు ● ‘సాక్షి’ కథనానికి స్పందన కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి (ఎండీఎం) సంబంధించి మోడ్రన్ కిచెన్లు ఏర్పాటు చేసినా కుక్ అండ్ హెల్పర్లను తొలగించడం జరగదని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఈఓ) పి.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ‘మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు‘ శీర్షికన సాక్షి పత్రికలో ఈ నెల 23న ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. దానికి వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. కడపలో 13 పాఠశాలలను కలుపుకొంటూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సుమారు 2,500 విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్ విజయవంతంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలోనూ మోడ్రన్ కిచెన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గుర్తించిన మోడ్రన్ కిచెన్ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న కుక్ కం హెల్పర్లందరికీ శిక్షణ ఇప్పించి, విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, వేడి ఆహా రం అందించడానికి ఈ జిల్లాలో కూడా కొన్ని పాఠశాలలు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. ఇందుకు ఒక్కొక్క స్మార్ట్ కిచెన్నకు రూ.55.75 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. 27 నుంచి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలను ఈ నెల 27 నుంచి మే ఒకటో తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో వి.సత్యనారాయణ శనివారం విలేకరులకు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 6.45 గంటల నుంచి కల్యాణ మహోత్సవం, 28న స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు, 29న మహదాశీర్వచనం, 30న నరసింహ జయంతి పూజా కార్యక్రమాలు, మే ఒకటిన పూర్ణాహుతి, చక్రస్నానం, పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని ఆయన కోరారు. విద్యుత్ బిల్లులు నేడూ చెల్లించొచ్చు అమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నెల 26 ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లులను యథాతథంగా చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అలాగే సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయ న్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం వద్దు ఉప్పలగుప్తం: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని కొనుగోలు సిబ్బందిని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి హెచ్చరించారు. భీమనపల్లి –1 రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను, తేమ శాతాన్ని పరికరాల ద్వారా పరిశీలించారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలేవి!
అమలాపురం రూరల్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లాలోని అన్ని నియోజక వర్గాల వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాద్, కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం విలేకరులతో జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు తొత్తుగా మారి, సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే చెల్లిందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటనే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం, రామచంద్రపురం నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్ గోపాల్, కుడుపూడి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, అమలాపురం పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య కుమార్, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, టి.లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చొల్లంగి సుబ్బురామ్, సాకా ప్రసన్న కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్య నాగేంద్రమణి, దాసరి డెవిడ్ పాల్గొన్నారు. వార్డుల పునర్విభజన నిష్పక్షపాతంగా జరగాలి అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ పార్టీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాశ్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం జరగడం లేదని, నిబంధనలను పక్కన పెట్టి కూటమి నాయకుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచినా పట్టించుకోరా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాజీ మంత్రి విశ్వరూప్, కో ఆర్డినేటర్లు శ్రీకాంత్, సూర్యప్రకాశ్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు మహిళా లోకాన్ని అవమానించినట్టే.. అల్లవరం: మహిళలను అవమానపరిచేలా, వారి గౌరవాన్ని కించపరిచేలా తప్పుడు కథనాల ప్రచురించిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం మహిళా లోకాన్ని అవమానించేనట్టేనని తెలిపారు. -
కూటమి అరాచకాలను అడ్డుకుందాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, విజయలక్ష్మి ● గన్నవరపు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లకు సత్కారం పి.గన్నవరం: కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీలను, అరాచకాలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన 30 మంది తాజా మాజీ సర్పంచ్లను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గన్నవరపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. కూటమి నేతలు ఎంత ఒత్తిడి చేసినా వైఎస్సార్ సీపీ సర్పంచ్లు పార్టీ మారలేదన్నారు. సర్పంచ్ పదవి నుంచి ఎప్పుడు దిగుతారు, ఏ విధంగా దోచుకుని తిందాం అన్న రీతిలో కూటమి నాయకులు ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన బాధ్యత తీసుకుని కూటమి నాయకులను ఒక కంట కనిపెట్టి, వారి దోపిడీని అడ్డుకోవాలని జగ్గిరెడ్డి సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ దోపిడీతో విసుగు చెందిన ప్రజలు 2029లో జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామన్నారు. జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను ఇబ్బందులు పెడుతున్నా ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ గన్నవరపు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీ మారకుండా ప్రజలకు సేవలు అందించిన వైఎస్సార్ సీపీ మాజీ సర్పంచ్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కాగా.. జిల్లాలోని పలు ర్యాంపుల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన తువ్వ, మట్టి దోపిడీని పలువురు నాయకులు జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించారు. కూటమి నేతలు లంక భూములను గుల్ల చేస్తున్నారని అన్నారు. జి.పెదపూడిలో టిప్పర్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, మండల శాఖ అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్, కొమ్ముల రాము, మట్టపర్తి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు మందపాటి కిరణ్కుమార్, దొమ్మేటి వెంకట శివరామన్, కుడుపూడి విద్యాసాగర్, గుత్తుల మధు, వడలి కొండయ్య, తోరం సూర్యభాస్కర్, కొంబత్తుల ఏసు బాబు, మిండగుదిటి శిరీష్, దొమ్మేటి సత్యమోహన్, నీతిపూడి విలసిత మంగతాయారు, కర్రి నాగిరెడ్డి, తోరం గౌతమ్, చేట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్..నిల్
● పెరుగుతున్న డీజిల్ కష్టాలు ● బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు ● రైతుల పడిగాపులు ● పోలీసుల పహారా మధ్య విక్రయాలు సాక్షి, అమలాపురం/ఆలమూరు: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత మరింత పెరిగింది. డీజిల్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పెట్రోల్ రేషన్ పద్ధతిలో కొంత వరకు దొరుకుతున్నా, డీజిల్ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని బంకుల వద్ద డీజిల్ ఉన్నా పోలీసుల సమక్షంలో అమ్మకాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు.. బంకు యజమానుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన విక్రయాలు చేయాల్సి వస్తోంది. డీజిల్ కొరత లేదని, రైతులకు డీజిల్ ఇబ్బంది లేకుండా చేస్తామని అధికారులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉంది. డీజిల్ దొరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలను, పట్టుబడులకు వచ్చిన రొయ్యల చెరువులను వదిలి బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. పోలీసు బందోబస్తుతో.. ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్ మెయిన్రోడ్డులోని ఒక పెట్రోల్ బంకులో శుక్రవారం రాత్రి డీజిల్ స్టాక్ అయిపోయింది. దీంతో పాటు పెట్రోల్ కూడా లేకపోవడంపై బంకు యాజమానులు, వినియోగదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో బంకుల వద్ద.. జిల్లాలో పలు బంకుల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. పెట్రోల్కు సంబంధించి మోటార్ సైకిళ్లకు రూ.200, కార్లకు రూ.ఐదు వందలు రేషన్ పెట్టడంపై వినియోగదారులు విరుచుకుపడుతున్నారు. పెట్రోల్ ఉన్నా తమ వాహనాలకు కొసరి కొసరి కొడుతున్నారని మండిపడుతున్నారు. బంకుల వద్ద క్యూలు పెరిగిపోయాయి. మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరుతున్నాయి. డీజిల్ దొరికే చోట కార్లు, ఆటోలతో పాటు లారీలు సైతం పెద్ద సంఖ్యలో క్యూలో ఉంటున్నాయి. ఇంతా చేసి తమ వంతు వచ్చే సరికి నో స్టాక్ బోర్డు పెడుతుండడంతో చూసి వాహనాల యజమానులు ఉసూరుమంటూ వెనుదిరగడం పరిపాటిగా మారింది. డీజిల్ కొరత లేదంటున్నా.. జిల్లాలో డీజిల్ కొరత లేదని జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. పెట్రోల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ రాక తగ్గిపోయింది. బంకు యజమానులు ఎప్పటికప్పుడు ఆర్డరు పెడుతున్నా కంపెనీల నుంచి వెంటనే డెలివరీ కావడం లేదు. ఇప్పుడున్న ధరలకు అమ్మకాలు చేస్తే లీటర్కు రూ.25 నుంచి రూ.30 వరకు నష్టం వస్తోందనే ఉద్దేశంతోనే కంపెనీలు సరఫరాపై నియంత్రణ విధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి కోతలు గత ఏప్రిల్, మే నెలలో జిల్లాలో వినియోగించిన డీజిల్కు అదనంగా పది శాతం డీజిల్ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం చమురు కంపెనీలకు లేఖలు రాసింది. అయినా ఫలితం లేదు. పది శాతం అదనం మాట అటుఉంచితే సాధారణ వినియోగంలో 30 శాతం నుంచి 40 శాతం తక్కువగా డీజిల్ పంపుతుండడంతో కొరతకు కారణమనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంత పెట్రోల్ బంకుల వద్ద సాధారణ రోజులలో నాలుగు వేల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్లు డీజిల్ విక్రయాలు జరిగేవి. వరి కోతల నేపథ్యంలో ప్రస్తుతం ఏడు వేల నుంచి ఎనిమిది వేల లీటర్ల వరకూ విక్రయాలు జరగడం పరిపాటిగా ఉంది. కానీ ఇప్పుడు చాలా బంకులలో ‘‘డీజిల్ రావాల్సి ఉంది’’ అని బోర్డులు వేలాడడంతో రైతులకు పాలు పోవడం లేదు. ప్రభుత్వ మొద్దునిద్ర పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై రైతులు, సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట కోతల సమయంలో డీజిల్కు ఇబ్బంది ఏర్పడినా, ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. చమురు కంపెనీలను ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుందని ఆవేదన వ్యకం చేస్తున్నారు. సిఫారసు లేఖలు ఉండాల్సిందేనా? వరి కోత యంత్రాలు, నీరు తోడుకునే మోటార్లు, ఆక్వా చెరువుల వద్ద జనరేటర్లు, ఏరియేటర్లకు డీజిల్ కావాలంటే సిఫారసు లేఖ ఉండాల్సిందే. స్థానికంగా ఉన్న ఏవోలు, ఇతర అధికారులు లేఖ ఇస్తే కానీ డీజిల్ దొరకని పరిస్థితి జిల్లాలో నెలకొంది. అయితే వరి చేలు, చెరువులను వదిలి రైతులు అటు అధికారులు చుట్టూ, ఇటు బంకులు చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. పోనీ వాటిని పట్టుకుని బంకుల వద్దకు వెళ్లినా ఏ బంకుల వద్ద నిల్వ ఉంటుందో, ఎప్పుడు అయిపోతోందో తెలియని దుస్థితి నెలకొంది. డీజిల్ ఉన్నా గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు పడాల్సిందే. పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ బంకుల వద్ద మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అమలాపురం నలుమూలల ట్రాఫిక్ నిలిచిపోయింది.ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళుతున్నాయి. కొత్తపేట వంటి ప్రాంతాలలో నుంచి భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో అక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు పడ్డారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నా పోలీసులు మాత్రం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం విశేషం. తీవ్ర ఇబ్బందులు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పొలాల్లో వరిని కోసేందుకు యంత్రానికి అవసరమైన డీజిల్ను మమ్మల్నే సమకూర్చుకోమంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు పడలేకపోతున్నాం. డీజిల్ కొరతతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. – మోటుపల్లి సత్తిబాబు, రైతు, సంధిపూడి, ఆలమూరు మండలం -
ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి
అమలాపురం రూరల్: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నోటీసుల సాకుతో తొలగించాలని చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పార్టీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ నేతృత్వంలో గ్రామానికి చెందిన దళిత సంఘాలు, నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగించడం ద్వారా స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయని, గ్రామ వాసులకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించి విగ్రహాన్ని యథాతథంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజనీ, మాజీ సర్పంచ్ సాధనాల వెంకటరావు, అమలాపురం రూరల్ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్గోపాల్, పెనుమల విక్రమ్ పాల్గొన్నారు. -
డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేయొద్దు
అమలాపురం రూరల్: డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడుతోందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ డీజిల్ కొరత అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో కొందరు అవసరానికి మించి నిల్వ చేస్తున్నారన్నారు. జిల్లాలో డీజిల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలను జిల్లాకు సరఫరాను 10 శాతం పెంచాలని ఆదేశించామన్నారు. వరి కోత యంత్రాలకు డీజిల్ ఇబ్బంది లేకుండా విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఽధ్రువీకరణ పత్రం విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వారి సంతకం ఉన్న పత్రాన్ని రైతులు బంకుల్లో చూపిస్తే ప్రాధాన్యత క్రమంలో డీజిల్ అందజేస్తారన్నారు. డీజిల్ సరఫరాలో సమస్యలు ఎదురైనా, అధిక ధరలకు విక్రయించినా 90599 20242, 94416 92275 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. కోకో పార్కు ఏర్పాటుకు వంద ఎకరాలు కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్క్ ఏర్పాటుకు సుమారు వంద ఎకరాల సేకరణకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఆయన కలెక్టరేట్లో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసే దిశగా పలు ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ ముమ్మిడివరం: స్థానిక ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతా గోదాములను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తనిఖీ చేశారు. నిర్దేశిత నెలవారీ తనిఖీల్లో భాగంగా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీలింగ్, రిజిస్టర్లను పరిశీలించి, సందర్శన రిజిస్టర్లో సంతకం చేశారు. -
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
ఎన్నో లాభాలు
ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో భూములకు లోతు దుక్కులు ఉపయోగకరం. వాలుకు అడ్డంగా లోతు దుక్కి దున్నడం వల్ల నేలలో తేమకు రక్షణ ఉంటుంది. దీనివల్ల భూమిలోని చీడపీడలను నివారించవచ్చు. భూమి గుల్లబారి వర్షపు నీరు సంవృద్ధిగా ఇంకి ఎక్కువ కాలం పంటలకు తేమను అందిస్తుంది. కలుపు నివారణ సాధ్యమవుతుంది. పురుగుల బెడద తప్పుతుంది. భూసారం వృద్ధి, తేమ శాతం పెరుగుదలకు లోదుక్కులు ఎంతగానో ఉపయోగపడతాయి. –కె.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి, రంగంపేట మండలం● -
గాలి తగిలే దుస్తులు ధరించాలి
శరీరానికి గాలి తగిలే దుస్తులు వాడాలి. రోజుకు అవసరాన్ని బట్టి పెద్దలు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీటిని తీసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి. బయట ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. –వి.అనిరుధ్, వైద్యుడు, రాయవరం పీహెచ్సీ తగినంత నీరు అందేలా చూసుకోవాలి చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పిల్లల్లో 70 శాతం నీరు, 30 శాతం కణజాలం ఉంటుంది. మలమూ త్రాలు, చెమట, శ్వాస ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆహారంతో పాటు తగినంత నీరు శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టి.రామగుర్రెడ్డి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, అనపర్తి -
బలుసుతిప్పలో వేటగాళ్ల మధ్య ఘర్షణ
ప్రైవేట్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33 వే అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్కి జైలు శిక్ష తప్పదన్నారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఓలేటి శ్రీనివాస్, షణ్ముఖ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాట్రేనికోన: బలుసుతిప్ప గ్రామంలో రింగు వల వేటగాళ్లు– సంప్రదాయ చేపల వేటగాళ్ల మధ్య ఘర్షణ కోట్లాటకు దారితీసింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ మద్దతు ఇవ్వగా, రింగు వల వేటగాళ్లు జనసేనకు చెందిన వారు కావడంతో కూటమిలో కుమ్ములాటగా మారింది. పూర్వం నుంచీ బలుసుతిప్ప నదీ పాయల్లో చిన్న చేపలు, రొయ్యల ఉత్పత్తికి నష్టం లేకుండా చేపల వేట సాగుతోంది. గ్రామానికి చెందిన వనమాడి మోసయ్య, బందరుకు చెందిన బంధువుతో కలసి సుమారు 20 రోజుల పాటు రింగు వలతో కొత్తపాలెం, భైరవపాలెం మొగ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి వేట సాగిస్తున్నారని ఆరోపణ. చేపల వేట నిషేధం ఉన్నా నాలుగు రోజుల నుంచి చల్ల కాలువ ముక్కాం అంతరం సమీపంలోని గోదావరి పాయలో వేట చేశారు. రింగు వలతో గోదావరిలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా చేపలు, రొయ్యలను వేటాడడం సరికాదని సంప్రదాయ వేటగాళ్లు గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో రింగు వల వేట చేయవద్దని వారు మందలించారు. అయితే గేలం వేటను ఆపేస్తే రింగు వలను వేయమని ఆ వర్గం భీష్మించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచి రింగు వలలను పోలీస్ స్టేషన్కు తరలించి కాట్రేనికోన ఎస్సై అవినాష్కు ఫిర్యాదు చేశారు. ఉపశమనం పొందేందుకు.. వేసవిలో బాటసారులకు పుచ్చకాయ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ప్రయాణ సమయంలో ఎండ వేడికి దాహం, ఉక్కబోత పెరుగుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ తింటే దాహార్తిని తీర్చడమే కాకుండా ఉక్కబోత నుంచి ఉపశమనం కలుగుతుంది. –దాసరి గౌతమ్, ముమ్మిడివరం ఆరోగ్యానికి మంచిది పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కంటిచూపు మెరుగవుతుంది. కిడ్నీలు, గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వేసవి తాపం నుంచి రక్షణ కలుగుతుంది. –సీహెచ్ ముకుంద, వైద్యాధికారి, పీహెచ్సీ, కొత్తలంక -
కాల్చేసన్..
వ్యాధులు.. కారణాలు ఫ వేసవిలో అతిసారం సోకకుండా సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. ఫ బావులు, బోర్లు, చెరువులు, కాలువల నీటిలో క్లోరిన్ కలిపిన తర్వాతే వాటిని ఉపయోగించాలి. ఫ తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసి, పాత్రలపై మూతలు పెట్టాలి. ఫ వంట గదిలో ఆహార పదార్థాలపై కోసిన పండ్లు, కూరగాయ ముక్కలపై దుమ్ము, ధూళి, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ వేడిగా, తాజాగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి. ఫ ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఫ జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు రాయవరం: భానుడు భగభగలు రేపుతున్నాడు. బయటకు వెళ్తే మంట పుట్టిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, నీటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. శరీరంలో తేమ (నీటి) శాతం తగ్గకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు.. చికిత్స ఫ వడదెబ్బకు గురైతే తలనొప్పి, తల తిరగడం, ఎండిపోయిన చర్మంతో ఎక్కువ జ్వరం కలిగి ఉండడం, మగత కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పర్తి అపస్మార స్థితిలోకి వెళ్లడం జరుగుతోంది. ఫ వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్ ముక్కలను వస్త్రంలో ఉంచి శరీరం అంతా తుడవాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి. ఫ బాధితులకు చల్లని నీరు లేదా ఉప్పు ఇతర లవణాలు కలిసిన నీటిని (ఓఆర్ఎస్ ద్రావణం) తాగించాలి. అతిసారం లక్షణాలు కనిపిస్తే.. ఫ ఒకటి లేక నాలుగు సార్లు నీళ్లతో కూడిన విరేచనాలైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలి. ఫ వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతుంటే వెంటనే ‘ఓఆర్ఎస్’ ద్రావణాన్ని తాగించాలి. ఫ ఇంటిలో లభించే గంజి, పలుచని మజ్జిగ, పప్పు నీరు, కొబ్బరినీళ్లు పట్టాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఫ వేసవిలో సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఉప్పు కలిపిన పండ్ల రసాలు తాగి వెళ్లాలి. ఫ తెల్లని దుస్తులు ధరించాలి. ఫ వేసవిలో మద్యం తాగడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషయ పరిస్థితికి దారి తీస్తుంది. ఫ ఇంటి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కిటికీలకు తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించాలి. ఫ ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీలు, తల పాగాల్లాంటివి ధరించాలి. -
రాష్ట్ర ఫుట్బాల్ పోటీలకు అరట్లకట్ట విద్యార్థినులు
కరప: రాష్ట్ర స్థాయిలో జరిగే శాప్ ఫుట్బాల్ లీగ్– 2026 పోటీలకు కరప మండలం అరట్లకట్ట ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జెడ్పీ హైస్కూల్కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. జట్టులో ఆరుగురు ప్లేయర్లుగా, నలుగురు స్టాండ్బైగా ఎంపికయ్యారని హెచ్ఎం పి.శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గురువారం కాకినాడ డీఎస్ఏ మైదానంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థినులు అర్హత సాధించారన్నారు. వీరు 27న అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో వల్లు అపర్ణ, నక్కా జ్యోష్స్న, కానేటి రిషిక, షేక్ సమీరాబేగం, వాసంశెట్టి సమీరా, సిరివిశెట్టి సృజన, స్టాండ్బై ప్లేయర్లుగా పాట్నీడి లక్ష్మితులసి, పచ్చిమాల జెస్సీకా, సింగినీడి నవ్య, పంపన మహాలక్ష్మి ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులను, తర్ఫీదునిచ్చిన పీడీ కౌర్లను హెచ్ఎం శ్రీనివాస్ కుమార్, ఫస్ట్ అసిస్టెంట్ ఫణిశర్మ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు అభినందించారు. -
సామర్లకోట స్టేషన్ సెంటర్లో ఎమ్మెల్యే చినరాజప్ప అట్టహాసంగా గడియారం స్తంభం ప్రారంభించారు. ఏడాది గడువక ముందే అందులోని గడియారం మోరాయించింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రూ.15 లక్షలతో గడియారం స్తంభానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.16 లక్షలు కేటాయించి 2025
● టిక్టిక్.. బ్రేక్ –సామర్లకోట ● ఎంతొట్టి నిర్లక్ష్యం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏడాది కిందట పల్లె పండగలో భాగంగా నిర్మించిన నీటి తొట్టెలు ఎందుకూ కొనగాకుండా ఉన్నాయి. పోలవరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి వీటిని నిర్మించినా, ఆ తొట్టెల్లో నీరు పోసేవారు లేకపోయారు. వీఆర్పురం మండలంలో ఈ నీటితొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో తొట్టెకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఖర్చు చేశారు. ఈ తొట్టెల్లో నీరు నింపేవారు లేకపోయారు. –వీఆర్పురం -
ఎందుక్కు అంటే..
● వేసవి దుక్కులతో భూమికి దన్ను ● మెట్ట ప్రాంత పొలాలకు మరింత మేలు రంగంపేట: మండే ఎండను పండే పంటకు ఉపయోగించుకోవచ్చు.. ఖాళీగా వదిలేస్తే కలిసొచ్చేది లేదు.. రబీ పూర్తవ్వడంతో ఈ సమయంలో పొలాలను అలాగే వదిలేయకుండా, కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా రానున్న ఖరీఫ్లో మంచి ఫలితాలను రాబట్టుకునే వీలుంటుంది. ఈ సమయంలో లోతు దుక్కి చేయడం ఫలితాలను ఇస్తుంది. సాగు చేయబోయే పంట కోసం ఇప్పటి నుంచి సాధారణంగా కల్టివేటర్ (ట్రాక్టర్కు వాడే మామూలు నాగలి) బదులుగా లోతు దుక్కి దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడితే నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురికాకుండా తేమ పెరుగుతుంది. ఎక్కువ కాలం తేమ తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి పొలంలో నాటుకుపోతాయి. దానివల్ల రానున్న పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పొలంలో వేసవిలో దుక్కులు చేయాలి. -
చల్లదనాన్ని అందిపుచ్చకుందాం
వేసవిలో పుచ్చకాయలకు గిరాకీ ముమ్మిడివరం: ఆరోగ్యాన్ని, చల్లదనాన్ని అంది‘పుచ్చ’కునే సమయమిదే.. ప్రతి వేసవిలో వచ్చే వాటర్ మిలాన్ (పుచ్చ కాయ)కు ఎనలేని డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలకు యమ గిరాకీ వచ్చింది. ప్రస్తుతం ఈ కాయ ధర సైజును బట్టీ రూ.100 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. వివిధ పనుల రీత్యా బయటకు వచ్చిన వారికి ఎండ నుంచి తక్షణ ఉపశమనం అందించే సాధనం ఇది. సాధారణంగా వేసవిలో శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతుంటాయి. తద్వారా డీ హైడ్రేషన్, వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే శరీరంలో వాటర్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, బీ విటమిన్, విటమిన్–ఏ, విటమిన్–బీ6, విటమిన్–సీ, సుక్రోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు తదితరాలు ఉంటాయి. ఇవి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుచ్చకాయ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మల బద్ధకం రాకుండా చేస్తోంది. వృద్ధాప్యంలో అంధత్వం నివారిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. వీటిని చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. కోనసీమలోని అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాలు, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని ప్రధాన మార్కెట్లలో రోడ్ల పక్కన దుకాణాలు, తోపుడు బండ్లలో వీటిని విక్రయిస్తున్నారు. కిలో పుచ్చకాయ రూ.25 నుంచి రూ.30 పలుకుతుంది. -
తరిమేద్దోమా..!
నేడు మలేరియా నివారణ దినోత్సవం ఆలమూరు: చిన్న దోమ కుట్టడం వల్లే మలేరియా లాంటి పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలతోనే దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. శనివారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపనున్నారు. కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నియంత్రణకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ చెబుతోంది. వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి ఫ మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా గుర్తించవచ్చు. ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫ వ్యాధి సోకిన వ్యక్తికి చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఫ వ్యాధి నిరోధకశక్లి లేని రోగులు విపరీతమైన తలనొప్పి సంభవించి ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఫ గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా వ్యాపిస్తుంది. ఫ దోమలను నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది. చికిత్సా విధానం ఫ మలేరియా సోకిన రోగి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. ఫ మధ్యలో మందులు మానేస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశఽం ఉంది. ఫ ఫాల్సీపారం మలేరియాకు మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం ఫ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ఫ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి. -
క్రీడా వసతి గృహాలను ఏర్పాటు చేయాలి
దేవరపల్లి: క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్నరెడ్డి సూచించారు. రామన్నపాలెంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో క్రీడా వసతి గృహాలు ఉండేవని, వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గ్రామీణ క్రీడలను గత ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేదని, వాటిని కూడా తీసివేసిందన్నారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడలు కనుమరుగవుతున్నాయని అన్నారు. ఒలింపిక్స్ క్రీడాకారిణి సత్తి గీత తమ సోదరని ఆయన తెలిపారు. తాను రెండు సార్లు అంతర్జాతీయ స్థాయిలో, 10 సార్లు జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ ఆడి బంగారు పతకాలు సాధించినట్టు చెప్పారు. బాస్కెట్బాల్ క్రీడలో మార్టేరుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మార్టేరులో తాను స్పోర్ట్స్ భవనం ఏర్పాటు చేసి ప్రతి ఏటా 8, 9, 10 తరగతుల పిల్లలకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రామన్నపాలెంలో దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఉద్యోగ విమరణ అనంతరం స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తానన్నారు. -
పాండవులమెట్టపై పెద్ద పులి
– ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కోరుకొండ: కొద్దిరోజులుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్న పెద్ద పులి గురువారం ఉదయానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం వద్దనున్న పాండవుల మెట్ట ప్రాంతానికి చేరింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండ వైపు నుంచి నడచిన పులి అడుగుల ఆధారంగా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఫారెస్టు అధికారులు, రిస్క్యూ టీమ్, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. కోరుకొండ, కాపవరం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో ప్రచారం చేశారు. డీఎఫ్ఓ వి.ప్రభాకరరావు ఘటనా స్థలిలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 6 వ తేదీన ఈ పులిని పాపికొండలు అటవీప్రాంతంలో విడిచిపెట్టినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఈ జిల్లాకు వస్తుందని నిన్న గుర్తించి, కలెక్టర్, ఇతర అధికారులకు తెలియజేశామన్నారు. పులి పగటి వేళల్లో విశ్రాంతి తీసుకుంటోందని, మనుషుల జోలికి వెళ్లడం లేదన్నారు. నాలుగురోజులకోసారి ఆహారం తీసుకుంటోందన్నారు. రాజమహేంద్రవరం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రిస్క్యూ టీమ్ పులికోసం ఆవును ఎరగా ఉంచి, సమీపంలో మాటు వేసింది. ఉదయం మెట్టపైకెక్కిన పులి, మధ్యాహ్నం ఎండ వేడికి కిందికి దిగింది, మెట్ల కింది భాగంలోని వెదురుపిడెం వద్ద సంచరించింది. రాత్రి వేళల్లో గట్టి చర్యలు పెద్దపులి పాండవుల మెట్టమీద నుంచి కిందికి దిగుతుందన్న అనుమానంతో పటిష్టమైన చర్యలు గురువారం రాత్రి పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు నార్త్జోన్ డీఎస్పీ జీవన, కోరుకొండ తహసీల్దార్ సుగుణ తెలిపారు.


