Dr B R Ambedkar Konaseema
-
యుద్ధప్రాతిపదికన పనులు చేయండి
అమలాపురం రూరల్: జిల్లాలోని పంట కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ జల వనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో సమ్మర్ క్లోజర్ పనుల పురోగతిపై జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జలవనరుల శాఖ ఇంజినీర్లతో స్థానికంగా సమీక్ష సమావేశం జరిపారు. ప్రభుత్వం చేపట్టిన జలధార– జలహారతి పనులను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట కాలువలకు సాగునీటిని విడుదల చేశారని, శివారు భూములకు సైతం సాగునీరు సజావుగా అందేలా పూడికతీత పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సమీక్షలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటేశ్వరరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ప్రత్యూష పాల్గొన్నారు. త్రిపుర హైకోర్టు జడ్జి పూజలు ఆత్రేయపురం/ సఖినేటిపల్లి: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని చరిత్ర ప్రసిద్ధి గాంచిన జగన్మోహినీ కేశవస్వామి ఆలయాన్ని శనివారం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి తొలుత ఆలయంలో సిబ్బంది, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేయించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ సిబ్బంది మేడిద శ్రీనివాస్ స్వామివారి చిత్రపటం అందజేశారు. అలాగే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని త్రిపుర హైకోర్టు జస్టిస్ రామచంద్రరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెరువుల తొలగింపు కాట్రేనికోన: పల్లంకుర్రు పంచాయతీ గొల్లగరువులోని గోదావరి పెరుగులంక భూమిలో చెరువులను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తొలగించారు. గోదావరి పెరుగులంక భూమిలో అక్రమ చెరువుపై బలుసుతిప్పకు చెందిన కర్రి శేషాద్రి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో అనధికారంగా సాగు చేస్తున్న రెండు ఎకరాల్లో చెరువులను ధ్వంసం చేశారు. భక్తజన సంద్రమైన రత్నగిరి అన్నవరం: వేలాదిగా భక్తులు తరలిరావడంతో రత్నగిరి శనివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. మొత్తం 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
పట్నా హైకోర్టు జడ్జి పూజలు
ఆత్రేయపురం/ రామచంద్రపురం రూరల్/ అయినవిల్లి, సఖినేటిపల్లి: జిల్లాలోని పలు ఆలయాలను పట్నా హైకోర్టు జడ్జి ఎ.అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ద్రాక్షారామలో భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో స్వామివారి శేష వస్త్రాలతో ఆయన్ని సత్కరించి, స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాన్ని అంద జేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని పట్నా హైకోర్టు జడ్జి అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయాన్ని జడ్జి అభిషేక్రెడ్డి దర్శించుకుని, అన్నదాన పథకానికి రూ.10,116 విరాళం సమర్పించారు. -
ముందస్తుకునీరుసంగా..
ఫ జిల్లాలో ఖరీఫ్కు నేటికీ అందని జలాలు ఫ మే 31న విడుదల చేస్తున్నట్టు హడావుడి ఫ ముక్తేశ్వరం కాల్వకు లొల్ల వద్దే నిలుపుదల ఫ అమలాపురం కెనాల్కు నడిపూడి వద్ద బంద్ ఫ ముందస్తు సాగుకు గ్రహణం సాక్షి, అమలాపురం: ముందస్తు సాగుకు ముందుకు రండి అన్నారు.. సాగునీరు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారు.. గోదావరి డెల్టా పరిధిలో ఖరీఫ్ సాగును అధికారులు అపహాస్యం చేస్తున్నారు. ముందస్తు సాగుకు ఒకరోజు ముందే సాగునీరు విడుదల చేసినట్టు భారీ ప్రచారానికి తెర తీసిన ప్రభుత్వం, ఇప్పటి వరకూ చుక్కనీటిని కూడా దిగువకు వదలడం లేదు. తుపాన్లు, భారీ వర్షాలు వంటి విపత్తుల నుంచి పంట ముంపు బారిన పడకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు సాగు విధానాన్ని అమలులోకి తెచ్చింది. మిగిలిన ప్రాంతాల రైతులు కన్నా ఇది గోదావరి డెల్టా రైతులకు ఎక్కువ మేలు చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం ముందస్తు సాగును ప్రహసనంగా మార్చేసింది. రైతులను ఉద్దరిస్తున్నామనే ప్రచారం కోసం గత నెల 31న డెల్టా కాలువలకు నీరు విడుదల చేసింది. గేట్లు ఎత్తి అతి తక్కువ నీరు విడుదల చేసి ప్రచారం మాత్రం భారీగా చేసుకుంది. కానీ మధ్య డెల్టాలో మూడు ప్రధాన పంట కాలువలకు ఇప్పటి వరకూ నీరు రాకపోవడం గమనార్హం. అక్కడే ఆపేసి.. బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ నుంచి విడుదలైన నీరు లొల్ల లాకుల వరకూ వచ్చి నిలిచిపోయింది. దిగున కాలువల మీద క్లోజర్ పనులు చేస్తున్నామని చెప్పి, అధికారులు అక్కడే నీళ్లు ఆపేశారు. జూన్ మొదటి వారం అయిపోతున్నా, పంట కాలువల్లో నీరు పారని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో జలవనరుల శాఖ అధికారులు శనివారం నీటి విడుదలను పెంచారు. మధ్య డెల్టాకు శనివారం ఉదయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ పంట కాలువల్లో నీరు పూర్తి స్థాయిలో పారే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కూడా నీరు విడుదల చేసినా పలుచోట్ల ఆటంకాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ముకేశ్వరం బ్యాంక్ కెనాల్కు సంబంధించి లొల్ల లాకుల వద్దే నీటిని నిలిపివేయనున్నారు. అలాగే అమలాపురం కాలువకు సంబంధించి నడిపూడి లాకుల వద్ద నీటిని నిలిపిస్తారు. ఒక్క పి.గన్నవరం బ్యాంక్ కెనాల్కు మాత్రమే నీటిని విడుదల చేయనున్నారు. అధికారుల నిర్ణయం వల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో సాగు ఆలస్యం కానుంది. ఇక్కడ మరింత ఆలస్యం అమలాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఈ ఏడాది కూడా సాగు ఆలస్యం కానుంది. అటు అమలాపురం – చల్లపల్లి, ఇటు అమలాపురం– అల్లవరం (బెండా కెనాల్) మీద వంతెన నిర్మాణాలు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ఈ కారణంగా ఈ రెండు కాలువలపై ఎగువన ఉన్న నడిపూడి లాకుల వద్ద నీరు నిలుపుదల చేశారు. ఇక్కడ పనులు ఒక దశకు వచ్చే వరకూ నడిపూడి లాకుల నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదు. గత ఏడాది కూడా సాగునీరు సకాలంలో అందకుండా చేశారు. ఈదరపల్లి, నడిపూడి వద్ద అమలాపురం, బెండా కెనాల్పై వంతెన నిర్మాణం పేరుతో గత ఏడాది జూన్ 20 తరువాత కానీ దిగువకు నీరు వదలలేదు. దీనితో అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లోని శివారు ప్రాంతాల్లో రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో సాగు చేయకుండా వదిలేశారు. ఈ ఏడాదీ ఇలానే చేసే అవకాశం ఉందనే ప్రచారంతో రైతులు మండి పడుతున్నారు. ఈ నెల 10వ తేదీ తరువాత సాగునీరు వదలకుంటే ఊరుకునేది లేదని రైతులు అల్టిమేటం జారీ చేశారు. నీరివ్వకున్నా ముందస్తు సాగుకు.. ఇది అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం. ఇక్కడకు సాగునీరు రాకున్నా, రైతులు బోరు నీరు ద్వారా సాగుకు సిద్ధమవుతున్నారు. భూమిని దుక్కు దున్నేందుకు మోటారు ద్వారా నీరు పెడుతున్నారు. పంట కాలువ ద్వారా సాగునీరు ఆలస్యంగా అందినా ఇబ్బంది లేకుండా ముందస్తు సాగు చేసే ఆలోచనతో రైతులు ఉన్నారు. ఇదే విధంగా పలువురు ముందుస్తు సాగు చేసి పంటలు తుపాను బారిన పడకుండా చూసుకునే పనిలో పడ్డారు. జలవనరుల శాఖ అధికారులు మాత్రం సకాలంలో నీరందించడంలో విఫలమవుతున్నారు. -
కౌన్సిల్ సభ విజయవంతానికి పిలుపు
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న అమలాపురం కిమ్స్ కళాశాలలో మీటింగ్ హాల్లో నిర్వహించనున్న జిల్లా ప్రథమ కౌన్సిల్ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కె.మల్లేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు సంఘ నాయకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, ఉద్యోగులను ఆహ్వానించారు. శనివారం ఉప్పలగుప్తం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, భీమనపల్లి పంచాయతీ, సహకార సంఘం, పీహెచ్సీ, జిల్లా పరిషత్ హైస్కూల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సంఘ బలోపేతానికి ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. అమలాపురం తాలూకా అధ్యక్షుడు పి.కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బీహెచ్ఎస్కే వర్మ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్వర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కె.దినేష్ తదితరులు మద్దతు తెలిపారు. -
నర్సరీలో పని కల్పించాలి
అవిడి నర్సరీలో వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారం. కొంతకాలంగా పని చెప్పడం లేదు. దీంతో దూర ప్రాంతాల్లో వేరే పనులకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఈ నర్సరీలో అయితే ఎక్కడికీ వెళ్లక్కర్లేకుండా ఇంటికి సమీపంలోనే వ్యయ ప్రయాసలు లేకుండా పనిచేసుకోవచ్చు. –ముంగండ సత్యవతి, కూలీ, అవిడి నిర్వహణకు నిధులు రావాలి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 4.80 లక్షల మొక్కలు పెంచగా, 3.30 లక్షలు పంపిణీ చేశాం. ఇంకా 1.50 లక్షల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయి. ఈ నర్సరీల నిర్వహణకు నిధులు రాక, అటవీ శాఖ సిబ్బందితో వాటరింగ్ చేయిస్తున్నాం. –ఎంవీ ప్రసాద్, డీఎఫ్ఓ, అమలాపురం అలసత్వమే కారణం గత ఏడాది సకాలంలో మొక్కలు పంపిణీ చేయక సుమారు 40 శాతం మొక్కలు నిలిచిపోయాయి. అటవీ శాఖ అలసత్వం కారణంగా సకాలంలో నిధులు మంజూరు కాక, స్థానిక కూలీలకు పని కల్పించక, నర్సరీ నిర్వహణ లేక మొక్కలు ఎండిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలి. –దూళి సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, అవిడి -
మొక్కవోని నిర్లక్ష్యం
ఫ నర్సరీలను గాలికొదిలేసిన అటవీ శాఖ ఫ ఎండిపోతున్న మొక్కలు ఫ పనులకు దూరమైన ఉపాధి కూలీలు కొత్తపేట: మొక్కవోని నిర్లక్ష్యం అలుముకుంది.. ఉపాధి కూలీలకు పని దూరమైంది.. ఫలితంగా నర్సరీల్లో పచ్చదనం ఆవిరి అయ్యింది. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్), మండల ప్రజా పరిషత్ల సహకారంతో అటవీ శాఖ సామాజిక వన విభాగం కింద నర్సరీలు ఏర్పాటు చేసింది. ఆ నర్సరీల్లో పెంచిన మొక్కలు గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్లు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఆ సంస్థల ఆయా ప్రాంగణాలు, ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించాలి. అయితే ప్రస్తుతం నర్సరీల నిర్వహణ గాలికొదిలేశారు. ఫలితంగా నర్సరీల్లో రూ.లక్షల విలువైన మొక్కలు ఎండిపోతున్నాయి. కొత్తపేట మండలం అవిడి గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సరీ పనులు చేపట్టారు. దీనికోసం 8 పనుల కింద మొత్తం రూ.42.53 లక్షలు మంజూరు కాగా, ఇందులో వేతనాల రూపంలో రూ.16.68 లక్షలు, మెటీరియల్ ఖర్చుల కింద రూ.25.85 లక్షలు కేటాయించారు. 3,965 పని దినాలకు వేతనాల రూపంలో రూ.11.88 లక్షలు, మెటీరియల్ రూపంలో రూ 18.91 వెచ్చించారు. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కల్లో సుమారు 60 శాతం గత ఏడాది వర్షాకాలానికి ముందే పంపిణీ చేయగా, మిగిలిన మొక్కలు వర్షాకాలంలో పంపిణీ చేయాలి. కానీ పంపిణీ జరగలేదు. ఫలితంగా సుమారు 40 శాతం మొక్కలు నర్సరీలోనే ఉండిపోయాయి. వాటిని సంరక్షించే వారు లేక ఎండిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందుగానే అంటే గత ఏడాది నవంబర్, డిసెంబర్లో సంబంధిత అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించాలి. అది జరగకపోవడంతో నిర్వహణ పనులకు ఆమోదం లభించలేదని సమాచారం. ఫలితంగా నర్సరీల్లో కవర్లలో మట్టి నింపడం, విత్తనాలు వేయడం, నారు పాతడం, వేర్లు భూమిలోకి వెళ్లకుండా వేరే కవర్లలోకి మార్చడం, నీరు పోయడం వంటి పనులు చేసే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. అలాగే కొత్తపేట డిగ్రీ కళాశాల, అవిడి, ఆత్రేయపురం మండలం కట్టుంగ, మెర్లపాలెం, రాయవరం మండలం చెల్లూరు, అమలాపురం మండలం కామనగరువు, అయినవిల్లి మండలం శానపల్లిలంకలో సుమారు రూ 2.05 కోట్లతో అటవీశాఖ నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కల సంరక్షణ లేక ఎండిపోతున్నట్టు సమాచారం. -
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 80 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఎండలు మండుతున్నా, ఎటు చూసినా భక్తజనమే కనిపించింది. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి పూజలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సత్యసాయి సేవా సంస్థలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. -
విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ అన్నారు. దీనిని రాబోయే రోజుల్లో ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వెనుక వీధిలో శిరీష్ అధ్యక్షతన శనివారం జిల్లా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. ఆ కార్యాచరణ ప్రణాళికపై జరిగిన చర్చలో శిరీష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు పార్టీ విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆందోళనలను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరుకు దిగాలని ఆయన సూచించారు. పార్టీ విద్యార్థి విభాగం నాయకులే కాకుండా యువజన, ఐటీ, సోషల్ మీడియా విభాగాల నాయకులు కూడా పాల్గొని కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో నేతలు ఉంగరాల సంతోష్, తోరం గౌతమ్రాజా, దొమ్మేటి సత్యమోహన్, జిల్లెళ్ల రమేష్, మద్దింశెట్టి ప్రసాద్, తాడి సహదేవ్, పందిరిపల్లి అజయ్కుమార్, రాజేష్, దేవరపల్లి గౌతమ్, చొల్లంగి నవీన్, గంటి ఆకాష్, గొల్లపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందినవారికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్లో స్టేట్ బీసీ సెల్ సెక్రటరీగా కామిశెట్టి శ్రీనివాసరావు (అమలాపురం), స్టేట్ వాణిజ్య విభాగం సెక్రటరీగా బొడ్డు నాగేశ్వరరావు (అమలాపురం), రాష్ట్ర వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీగా పిన్నమనేని వెంకట దుర్గరాజు (అమలాపురం), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా దొమ్మేటి శ్యాంబాబు(అమలాపురం)లను నియమించారు. ఎమ్మెల్యే సైకిల్ తొక్కడం హాస్యాస్పదం? ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సాక్షి, అమలాపురం: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సైకిల్ తొక్కుతూ తద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అమలాపురం ఎర్ర వంతెన నుంచి సమనస, యానాం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున చెట్ల నరికివేస్తుంటే అరికట్టడంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే విఫలమయ్యారని ఇజ్రాయిల్ విమర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్ల సంరక్షణ, కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న పచ్చదనాన్ని కాపాడేందుకు కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. ఒకవైపు సైకిల్ తొక్కుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పడం, మరోవైపు వేలాది చెట్లు నరికివేస్తున్నా స్పందించకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా ఆయన అభివర్ణించారు.సమనస, యానాం పరిసర ప్రాంతాల్లో జరిగిన చెట్ల నరికివేతపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని, నరికిన ప్రతి చెట్టుకు ప్రత్యామ్నాయంగా కనీసం పది మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం బిల్లింగ్ అప్రూవల్ ఇచ్చే ముందు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలనే నిబంధనను పాటించాలని సూచించారు. తప్పుడు విద్యార్హతలతో ప్రమోషనా? రాజమహేంద్రవరం సిటీ: తప్పుడు విద్యార్హతలతో పదోన్నతి పొందిన ఎలక్ట్రికల్ ఏఈ ఎం.వెంకటేశ్వరరావుపై, ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన పబ్లిక్ హెల్త్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏలూరుకు చెందిన రిటైర్డ్ మున్సిపల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ కేవీ సాయిప్రపాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఏపీ ప్రభుత్వ ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట శుక్రవారం మండుటెండలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్లో ఎటువంటి అనుమతులూ లేని కళింగ యూనివర్సిటీలో డీఈఈఈ చదివినట్లు తప్పుడు విద్యార్హతలు సృష్టించి, ప్రమోషన్ పొందారని ఆరోపించారు. దీనిపై అన్ని ఆధారాలతో అనేక ఫిర్యాదులు చేసినా అప్పటి అధికారులు పదోన్నతి కల్పించారని ధ్వజమెత్తారు. ఈ విషయమై ప్రధానికి ఫిర్యాదు చేయగా వచ్చిన ఆదేశాలను సైతం ఖాతరు చేయని పబ్లిక్ హెల్త్ ఎస్ఈపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి తెలుగు సాహితీ మహాసభలు రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ(జీజీయూ)లో రెండు రోజుల పాటు జరిగే ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభం కానున్నాయి. చైతన్య సరస్వత పరిషత్ సహకారంతో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యాన ఈ సభలు జరగనున్నాయి. సాహిత్య, సాంస్కృతిక విభాగాలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళారూపాలు, ప్రాచీన కవుల వారసుల ప్రత్యేక ప్రదర్శనలు వీటిలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు కేవీవీ సత్యనారాయణరాజు, కత్తిమండ ప్రతాప్ తెలిపారు. -
రైల్వే పాట్లుఫామ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఎండకు ఎండి.. వానకు తడవాల్సిన దుస్థితి రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో నెలకొంది. విజయవాడ రైల్వే డివిజన్లో విజయవాడ తరువాత రాజమండ్రి అత్యంత ప్రాధాన్యం ఉన్న రైల్వే స్టేషన్. నిత్యం సుమారు 125 ప్రయాణికుల రైళ్లు, 70కి పైగా గూడ్స్ రైళ్లు రాకపోకలు ఈ స్టేషన్ మీదుగా నడుస్తూంటాయి. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ముఖ్యమైన రోజులు, పండగల్లో ప్రయాణికుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆలయాలను దర్శించేందుకు, పావన గోదావరి తీరంలో పితృకార్యాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తూంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రాజమండ్రి స్టేషన్లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. ముఖ్యంగా 4, 5 ప్లాట్ఫామ్ల పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు, అసహనానికి గురవుతున్నారు. ఇవీ సమస్యలు ఫ రెండేళ్ల కిందటి వరకూ రాజమండ్రి రైల్వే స్టేషన్లో మూడు ప్లాట్ఫామ్లు మాత్రమే ఉండేవి. రెండేళ్ల క్రితం 4, 5 ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్లకు నిత్యం 20 రైళ్లు వస్తున్నాయి. అయితే, ‘తాళము వేసితిని.. గొళ్లెము మరచితిని’ అనే చందంగా రైల్వే శాఖ వ్యవహరిస్తూండటం ప్రయాణికులకు ఇక్కట్లను తెచ్చి పెట్టింది. 4, 5 ప్లాట్ఫామ్లైతే నిర్మించి, ప్రారంభించేశారు కానీ.. వాటిపై కనీస సౌకర్యాలు కల్పించడంపై రైల్వే అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫ ఈ ప్లాట్ఫామ్లపై ఈ రెండేళ్లలో ఎక్కడా కనీసంగా కూడా షెల్టర్ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రయాణికులు ఎండకు ఎండి, వానకు తడవాల్సిన దుస్థితి. ఈ బాధకు తాళలేక కొంత మంది గొడుగు వేసుకుని రక్షణ పొందుతున్న పరిస్థితి. ఫ రైళ్ల రాక సమయంలో ఏ బోగీ ప్లాట్ఫామ్పై ఎక్కడ వస్తుందో ప్రయాణికులకు తెలియజేసే కోచ్ ఎగ్జిబిషన్ (డిస్ల్పే) బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. దీంతో, రైలు వచ్చిన తరువాత అది ఆగే రెండు మూడు నిమిషాల్లోనే తమ తమ బోగీల కోసం ప్రయాణికులు ప్లాట్ఫామ్పై ఉరుకులు, పరుగులు తీస్తూ ప్రయాసకు గురవుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, భారీ లగేజీతో వస్తున్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫ వారి అగచాట్లు కళ్ల ముందే కనిపిస్తున్నా రైల్వే అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు లేని ప్లాట్ఫామ్లపై రైళ్లను నిలపడమెందుకని, షెల్టర్, బోగీ డిస్ల్పే బోర్డుల వంటి సౌకర్యాలున్న మిగిలిన ప్లాట్ఫామ్లపై ఆపవచ్చు కదా అని పలువురు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఆరో నంబర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటిస్తున్న అధికారులు.. ఉన్న ప్లాట్ఫామ్లపై కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తమకు శాపంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ 4, 5 ప్లాట్ఫామ్లు ప్రారంభించి రెండేళ్లు ఫ నిత్యం ఆగుతున్న 20 రైళ్లు ఫ నేటికీ కానరాని బోగీ డిస్ల్పే బోర్డులు ఫ రైలు వస్తే తప్పని పరుగులు ఫ ఇప్పటికీ ఏర్పాటు కాని షెల్టర్లు ఫ ఎండయినా.. వానయినా గొడుగు పట్టుకోవలసిందే.. ఫ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇక్కట్లు -
సస్పెండ్ చేసిన కండువా
అన్నవరం: ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు రత్నగిరిపై ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆ ఏవుందిలే.. మామూలు కండువాయే కదా అని అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదు. ఇప్పుడా కండువాయే వారిపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఈ సంఘటన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్లతో వ్రతాలాచరించే భక్తులకు చాలా సంవత్సరాలుగా అంచు మీద జరీతో స్వామివారి నామం ముద్రించిన కండువాలను అందించేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్ దక్కించుకున్న కొత్త టెండర్దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు రోజుకో డిజైన్, రంగు కలిగిన కండువాలు ఇవ్వడంపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. వెంటనే సత్యదేవుని నామం ముద్రించిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్దారుపై అధికారులు ఒత్తిడి తేవడంతో గురువారం 900 కండువాలు పంపించాడు. వీటిని గురు, శుక్రవారాల్లో భక్తులకు అందజేశారు. అయితే, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారన్న అభియోగంపై సెంట్రల్ స్టోర్స్ విభాగం సూపరింటెండెంట్ తాడి గుర్రాజును ఆ విభాగం నుంచి గోశాల, గార్డెన్కు బదిలీ చేశారు. అలాగే, జూనియర్ అసిస్టెంట్ కె.రమణబాబును సత్యగిరి సత్రాల శానిటరీ సూపర్వైజర్గా బదిలీ చేశారు. తాజాగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.·˘ Æý‡™èl²WÇOò³ çÜ*ç³Ç…sñæ…yðl…sŒæ, గుమాస్తాలపై వేటు ·˘ ÐéÆý‡… ÆøkÌZÏ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం -
మార్తాండవం
రైతుల్లో ఆందోళన నైరుతి రుతుపవనాల ఆలస్యం, పంట కాలువల ద్వారా నీరు అందించకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఎప్పటిలా ఆలస్యం కానుంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండడం వల్ల లోటు వర్షమనే అంచనాలు ఖరీఫ్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ● జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు ● మరోసారి పెరిగిన ఉష్ణోగ్రతలు ● 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు ● కొంపముంచిన అకాల వర్షం సాక్షి, అమలాపురం: తొలకరి జల్లులతో సేద తీరాల్సిన వేళ.. ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తున్నట్టుగా కాస్తున్న ఎండలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. రోహిణీ కార్తె కావడంతో ప్రచండ భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. జూన్ 1వ తేదీన కురిసిన అకాల వర్షంతో వాతవరణం చల్లబడుతోందని అనుకుంటే.. తరువాత నుంచి నిప్పులు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎండ మండిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్లపైకి రావాలంటే జంకు జిల్లాలో మరోసారి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, 29 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రోహిణీ ప్రారంభమైన గత నెల 25 నుంచి మొదలై ఎండ వేడి, వడగాడ్పులతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మిట్ట మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోడ్డు మీదకు వచ్చేందుకు జనం జడుస్తున్నారు. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. ఆటోలు, బస్సుల మీద ప్రయాణాలు చేసేవారు సైతం వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కబోత వాతావరణానికి తోడు, ఎడాపెడా విద్యుత్ కోతలతో వారు అల్లాడిపోతున్నారు. అడపాదడపా వర్షం పడినా మరో రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయనే వాతావరణ శాఖ హెచ్చరిక జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ కారణంగా రాత్రి వేళల్లో కూడా వాతావరణం పెద్దగా చల్లబడడం లేదు. వేడిగాలులు, ఉక్కబోత వాతావరణంతో రాత్రులు కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నైరుతి రాక ఆలస్యం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రాక ఆలస్యమైంది. తొలుత రుతు పవనాలు మే నెల 26వ తేదీన కేరళను తాకుతాయని, తరువాత వారం రోజుల్లో రాష్ట్రంలోకి వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే చివరి వారానికే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తొలుత చేసిన ప్రకటనతో ఈ సమయానికి తొలకరి చిరుజల్లులు పడతాయని.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని జనం పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఆలస్యంగా ఈ నెల 5వ తేదీన మాత్రమే నైరుతి కేరళకు వచ్చింది. మరో వారం తరువాత కాని జిల్లాకు వచ్చే అవకాశం లేదు. ఈ ప్రభావం వల్లే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు గత నెల 25న మొదలైన రోహిణీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రోహిణీ ఎండలు మండిపోతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ, లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. అమలాపురం మండలం కామనగరువు వద్ద నిర్మానుష్యంగా మారిన 216 రహదారి పట్టని ప్రభుత్వం గత మే నెల 20వ తేదీ నుంచి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడదెబ్బకు జనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొందరు చనిపోయారు. అంబాజీపేట మండలంలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎండల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి కనీస చర్యలు లేవు. పీహెచ్సీల ద్వారా ఓఆర్ఎస్లు ఇవ్వడం మినహా గతంలో పెట్టినట్టుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ వంటివి అందించలేదు. వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛంధ సంస్థలు మాత్రమే ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
పారిశుధ్య కార్మికుల ధర్నా
రామచంద్రపురం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పెరిగిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన జీతాలు కాంట్రాక్టర్ ఇవ్వడం లేదన్నారు. ఈ విషయం అనేకమార్లు కాంట్రాక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినా సమాధానం ఇవ్వడం లేదన్నారు. జీతాలు అడిగినందుకు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో చేసిన డ్యూటీలను మార్చివేశారని, మార్చిన డ్యూటీల వల్ల మహిళలు రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తోందన్నారు. పెరిగిన జీతాలు ఎరియర్స్తో ఇవ్వాలని, పాత పద్ధతిలోనే డ్యూటీలు కొనసాగించాలని, హాస్పిటల్లో పడకలు పెరిగినందువలన వర్కర్స్ ని పెంచాలని, జీతాలు ప్రతినెలా ఏడో తారీఖు లోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. -
అధికారులకు విజ్ఞప్తి చేసినా..
రైల్వే అధికారులు నిర్లక్ష్యం వల్లనే 4, 5 ప్లాట్ఫామ్లపై దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా రెండేళ్లుగా ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నా కనీస వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించకపోవడం దారుణం. ఇప్పటికై నా ఈ సమస్యలను పరిష్కరించి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. – లంకా సత్యనారాయణ, అధ్యక్షుడు, పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రాజమహేంద్రవరం ఇబ్బందికరం రాజమండ్రి రైల్వే స్టేషన్ 4, 5 ప్లాట్ఫామ్లపై తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్ఫామ్ల నిర్మాణ సమయంలోనే షెల్టర్లు కూడా నిర్మించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. రైలు ఆగే సమయంలో ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ ఇబ్బందికర పరిస్థిలో దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు రైలు ఎక్కడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. – బండారు శ్రీనివాస్, రాజమహేంద్రవరం -
పాఠాలు : 89పేజీలు : 2553తరగతులు : 5టీచర్ : ఒకరు
కొత్తపేట: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకూ సాంఘిక శాస్త్ర సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అత్యధికంగా ఉంటోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లింది. పాఠ్యాంశాలపై పునఃసమీక్ష జరిపి, సిలబస్ భారం తగ్గించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ప్రస్తుత పాఠ్యాంశాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఒకే సబ్జెక్టులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి విభిన్న అంశాలను బోధించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై అధిక విద్యాభారం పడటమే కాకుండా, బోధనా నాణ్యతపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో సిలబస్ తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠాలు అధికం ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పాఠాలను గణనీయంగా తగ్గించారు. కానీ సాంఘిక శాస్త్రంలో మాత్రం ఇప్పటికీ అత్యధిక పాఠాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్ సబ్జెక్టులో బయాలజీ 5, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 4.. కలిపి మొత్తం 13 పాఠాలున్నాయి. వీటిని వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే అవకాశం కూడా ఉంటుంది. అదే పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉన్నాయి. వీటిని ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం పదో తరగతికి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన తరగతులకూ వర్తిస్తోంది. వీటి బోధనకు ఉపాధ్యాయులు, చదవటానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఫ ఉపాధ్యాయుల ఆవేదన ఫ సిలబస్ తగ్గించాలని డిమాండ్ ఫ విద్యార్థులకూ కష్టమని వివరణ ఫ పునఃసమీక్ష చేయాలని వినతి -
రెండేళ్ల వంచనపై గర్జన
సాక్షి, అమలాపురం: ‘‘ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొన్ని పథకాలను పక్కన పెట్టారు. మరికొన్నింటికి కోత విధించారు. ఈ రెండూ చాలవని మోగా డీఎస్సీలో అక్రమాలకు తెరలేపి దగా చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత ఇలా సమాజంలో అన్ని వర్గాల వారికి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్ల పాలనను మోసం.. నయవంచనతో సాగించిన చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’’ అని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు, పలు మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ నిరసనలు విజయవంతంగా సాగాయి. ఆయా నియోజకవర్గాలలో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆలమూరులో.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఆలమూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు వచ్చి వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంఘీభావం పలికారు. కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి నాగిరెడ్డి, పాటి శివకుమార్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో.. రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో పార్టీ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పార్టీ సీజీసీ సభ్యుడు కె.ఎస్.ఎన్.రాజు, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజు పాల్గొన్నారు. అమలాపురం పరిధిలో.. అమలాపురం నియోజకవర్గం పరిధిలో అమలాపురం పట్టణం, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనూరాధ, వంటెద్దు వెంకన్నాయుడు, మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్ధుల్ ఖాదర్, చీకట్ల కిషోర్, వంగా గిరిజా కుమారి, జిన్నూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఐ.పోలవరం మండలంలో పాత ఇంజరం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత ఇంజరంలో మెండ వెంకన్న షాపు నుంచి ఎదుర్లంక అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీగా వెళ్లారు. పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్ఈసీ సభ్యురాలు కాశి బాల మునుకుమారి పాల్గొన్నారు. పి.గన్నవరం సెంటరులో.. పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో పి.గన్నవరం సెంటరులో నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్లో నిరసన ప్రదర్శన చేసి టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టారు. సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో.. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కాజులూరు మండలం గొల్లపాలెం సెంటరులో పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దగ్ఢం చేస్తున్న పార్టీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్కుమార్ తదితరులు అమలాపురం నియోజకవర్గం అల్లవరంలో కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్న పార్టీ శ్రేణులు, పాల్గొన్న మాజీ ఎంపీ చింతా అనూరాధ తదితరులు సూపర్ సిక్స్కు వెన్నుపోటుపై వైఎస్సార్ సీపీ పోరు జిల్లా వ్యాప్తంగా మండలాల్లో నిరసన ప్రదర్శనలు కూటమి మేనిఫెస్టో ప్రతుల దగ్ధం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు -
సిలబస్ భారం
సిలబస్ భారం వల్ల విద్యార్థులకు సమగ్ర అవగాహన కలగడం లేదు. ఉపాధ్యాయుల బోధనలో కూడా నాణ్యత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం విద్యార్థులకు కష్టంగా ఉంటోంది. సాంఘిక శాస్త్ర సిలబస్ను హేతుబద్ధీకరించాలి. – కేఎస్వీ కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం పని భారం సాంఘిక శాస్త్రంలో సిలబస్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మారిన నూతన పాఠ్య పుస్తకాలలో మరింత పెరిగింది. ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని విపరీతంగా పెంచుతోంది. విద్యార్థులకు కూడా ఇబ్బందికరమే. కాబట్టి సిలబస్ను తగ్గించాలి. – కుడుపూడి మురళీధర్, సోషల్ టీచర్, పుల్లేటికుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠాలు ఎక్కువ పదో తరగతిలో సైన్స్కు 13 పాఠాలు ఉండగా, సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉండటం, అలాగే ఆరు నుంచి 9 తరగతుల్లోనూ అధిక పాఠ్య భారం కొనసాగడం ఆందోళనకరం. సమాజం, రాజ్యాంగం, చరిత్ర, పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సిలబస్ రూపొందించాలి. – కేవీ శేఖర్, ప్రధాన సంపాదకులు, రాష్ట్ర ఎస్టీయూ ఉపాధ్యాయవాణి, రావులపాలెం -
వెన్నుపోటు ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
గడచిన రెండేళ్లలో ప్రజలపై మోయలేని భారం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడంలో వారిని పూర్తిగా వంచించింది. ఈ రెండేళ్లు చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తున్న అసమర్థపాలన, అరాచకవాదం, వెన్నుపోటు రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలయ్యే విధంగా వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి గద్దె దింపుతాం. – చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట నియోకవర్గ కో ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రచారం తప్ప అభివృద్ధి లేదు చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రచారం పీక్లో ఉంది కాని అభివృద్ధి లేదు. ఒకరింట చేపల కూర వండుతున్నారు. మరోచోట కల్లు తాగుతున్నారు. ఇంకొక చోట ముంజులు తింటున్నారు. ఇలా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వెన్నుపోటుకు చిరునామా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటుకు చిరునామా. ఎన్నికల ముందు అమలు చేయలేని వాగ్దానాలు చేసి రెండేళ్ల కాలంలో వాటిని అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఈసారి బాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరు. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ అప్పులే చేశారురెండేళ్ల చంద్రబాబు పాలనలో సంక్షేమం లేదు. ఏకంగా రూ.3.56 లక్షల కోట్లు అప్పులు చేశారు. అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల సొమ్మును చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు జేబులు నింపుకుంటున్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలని చెప్పారు. మరి ఈ రెండేళ్లలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అది ఇవ్వలేదు సరికదా.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా అందించలేదు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ ● -
స్పీకర్ రఘురామకృష్ణరాజును బర్తరఫ్ చేయాలి
జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో 2024 ఎన్నికల తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, 164 సీట్లతో ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నిరాశ ఎదురైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేసిందో, ఎంత చెడు చేసిందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దళిత క్రైస్తవుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న స్పీకర్ రఘురామకృష్ణరాజును తన పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత క్రైస్తవులను ఏకం చేసి, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో ‘దళిత క్రైస్తవ సమర శంఖారావం‘ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
కోకోకు ప్రమాణాల రూపకల్పన అవసరం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ(నిర్కా)లో నిర్వహించిన ‘ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్ అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, కోకో పంటకు ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా అధిక ధరలు పొందే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీఎఫ్పీఎస్ సీఈఓ గెడ్డం శేఖర్ బాబు మాట్లాడుతూ, కోకో రైతులను ప్రాసెసింగ్ పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కోకోశాల (చైన్నె) వ్యవస్థాపకుడు, కన్సల్టెంట్ నితిన్ చోర్డియా సాంకేతిక సెషన్లో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కోకో బీన్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేడింగ్, నిల్వ విధానాల్లో పాటించాల్సిన శాసీ్త్రయ పద్ధతులను వివరించారు. చాక్లెట్, కోకో పౌడర్, కోకో బటర్ తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవకాశాలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 38,671 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోందని, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వర్క్షాప్లో వెల్లడించారు. కోకో సాగు, ప్రాసెసింగ్పై మార్గదర్శకాలకు 79950 87041 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను సంప్రదించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏపీఎఫ్పీఎస్ ఈడీ ఏ దుర్గేష్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.సుధ, ఐదు జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు, కోకో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి -
ఓటర్ల సంఖ్య 1,200 దాటితే హేతుబద్ధీకరణ
అమలాపురం రూరల్: ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1,200 దాటితే నిబంధనల ప్రకారం ఆయా కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం రామచంద్రపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల బీఎల్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసీఐ రూపొందించిన డేటా విశ్లేషణపై టెక్నికల్ అసిస్టెంట్లు బీఎల్ఓలు అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2002 నాటి డేటాను డౌన్లోడ్ చేసుకుని బీఎల్ఓ యాప్ మ్యాపింగ్పై టెక్నికల్గా అధ్యయనం చేయాలన్నారు. బీఎల్వోలు, ఈసీఐ యాప్ పోర్టల్ విశ్లేషణ ఓపెన్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జేసీ వైఖోం నైదియాదేవి ప్రసంగిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర సవరణ దశను అధికారికంగా ప్రారంభించిందన్నారు. డీఆర్వో సుబ్బారావు, ఈఆర్వోలు జి. మమ్మీ, సరళావతి, జీవీవీ సత్యనారాయణ, డి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు రాజు,రవి వర్మ, తహసీల్దార్లు, బి.మృత్యుంజయరావు, రవికిరణ్ పాల్గొన్నారు. 14 థియేటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అమలాపురం రూరల్: జిల్లాలో 14 థియేటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉందని డీఆర్వో వీ.సుబ్బారావు తెలిపారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు, రాష్ట్ర తెలుగు డెవలపెమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ అన్ని జిల్లాల జాయింట్ జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి ఏపీ సినిమా థియేటర్లలో ఆమోదిత చిత్రాల ప్రదర్శనకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 థియేటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉందని, రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా మార్గ నిర్దేశం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయా థియేటర్లో యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 థియేటర్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ సూపరింటెండెంట్ రమణకుమారి పాల్గొన్నారు. పెట్రో ధరలకు నిరసనగా 9న రాస్తారోకోలు అమలాపురం టౌన్: పెంచిన పెట్రో, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే రాస్తోరోకోలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక గొల్లగూడెంలో గల జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఐ, సీపీఎంల నాయకులతో గురువారం జరిగిన రాస్తారోకోల సన్నాహాక సమావేశంలో సుబ్బరావు మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు అందకుండా లీటర్ ఇంధనంపై కేంద్రం రూ.20, రాష్ట్రం రూ.35 చొప్పున భారీగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు మాట్లాడుతూ. కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులో చట్టబద్ధంగా 50 శాతం వాటా రాష్ట్రానికే దక్కాలని డిమాండ్ చేశారు. వామపక్షాల నాయకులు చెల్లుబోయిన తాతారావు, వై.చిట్టిబాబు, పెద్దిరెడ్డి రాము, శీలం వెంకటేష్, జి.దుర్గాప్రసాద్, సఖిలే సూర్యనారాయణ పాల్గొన్నారు. విజ్ఞాన శిబిరాలతో నైతిక విలువలు అమలాపురం టౌన్: గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు నింపుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు) అన్నారు. జిల్లాలో 67 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 28న మొదలై ఈ నెల 6వ తేదీతో ముగుస్తాయన్నారు. అమలాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో గురువారం జరిగిన శిబిరం ముగింపు సందర్భంగా ప్రసంగించారు. పోటీల్లో విజేతలైన 30 మంది విద్యార్థులకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తిని సత్కరించారు. -
వెన్నుదున్ను
ఆలమూరు: వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో పాటు భూసారం పెరగాలంటే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రబీ, ఖరీఫ్లకు మధ్య వేసవిలో చేపట్టే దుక్కులతో భూసారం పెరుగుతుంది. ఇవి రైతులకు సాగులో వెన్నుదన్నుగా నిలిచి సాగులో పెట్టుబడి తగ్గించుకోవడానికి దోహదపడతాయి. నేడు ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడంతో ట్రాక్టర్ల సాయంతో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 4.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుంది. యాజమాన్య పద్ధతులు ఫ భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ఖరీఫ్లో మంచి దిగుబడులు అందుకునే వీలుంటుంది. ఫ ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉన్న సమయంలో లోతు దుక్కు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కాబోతోంది. ఫ వేసవి దుక్కులు మెట్ట, చాగల్నాడు ప్రాంతాల రైతులకు ఎంతో ఉపపయోకరంగా ఉంటాయి. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ దుక్కులు చేపడుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ఫ వేసవి లోతు దుక్కులు చేపట్టడం వల్ల భూమి సారవంతమవుతుంది. భూమి కింద పొరల్లోని మట్టి పైకి రావడం, పై పొరల్లో మట్టి వెళ్లడం వల్ల ఎండ వేడికి అందులోని క్రిమికీటకాలు నశిస్తాయి. ఫ నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వర్షం నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. ఫ పొలాల్లో లోతుగా దున్నడం వల్ల భూమిలో నీరు ఇంకి పోయి, తేమ శాతం పెరిగి సేంద్రియ పదార్థాలు త్వరితగతిన కుళ్లిపోయి పోషకాలుగా మారతాయి. ఫ భూమిని అడుగు లోతు వరకూ దున్నితే విత్తనం వేగంగా మొలకెత్తి, వేళ్లు సులభంగా భూమిలో దిగి మొక్కకు సారం పెరుగుతుంది. ఫ దుక్కుల వల్ల కింద నుంచి పైకి వచ్చే పురుగులను పక్షులు తినడం ద్వారా తెగుళ్ల బెడద తప్పుతుంది. ఫ పొలాల్లో మట్టి గడ్డలు తొలగిపోయి సారవంతమైన నేల ఏర్పడుతుంది. తద్వారా నాణ్యమైన పంట పండించేందుకు దోహదపడుతుంది. భూసారం పెరుగుతుంది వ్యవసాయశాఖ సూచనలకు అనుగుణంగా పంట పొలాల్లో దుక్కు దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల తెగుళ్లను నివారించుకోవడం ద్వారా పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు, అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతుంది. రైతులందరూ క్రమం తప్పకుండా దుక్కుకు ప్రాధాన్యమివ్వాలి. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఆలమూరు డివిజన్ నిబంధనలు తప్పనిసరి ఖరీఫ్ పంటకు తెగుళ్ల బెడదను నివారించి, అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయశాఖ సూచనలతో పాటు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. సాధారణ కల్టివేటర్ (ట్రాక్టర్కు వాడే మామూలు నాగలి)కు బదులు లోతు దుక్కు దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడాలి. దీని వల్ల నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురి కాకుండా తేమ ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. వాటి వల్ల వచ్చే పంటకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఉపయోగం కలుగుతుంది. ఫ దుక్కి దున్నితే లాభాల పంటే ఫ వేసవి దుక్కులతో ఎంతో ప్రయోజనం ఫ ప్రాధాన్యత ఇస్తున్న రైతులు -
చోరీ కేసులో రూ.58 లక్షల సొత్తు స్వాధీనం
అనపర్తి: చోరీ కేసులో సుమారు రూ.58 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. అనపర్తి పోలీస్స్టేషన్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం బృందంతో కలసి దర్యాప్తు చేశారన్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెంకు చెందిన శిరపనశెట్టి సన్యాసిరావు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మండలంలోని కొప్పవరం వంతెన వద్ద అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. అనపర్తిలోనే కాకుండా ఆలమూరులోను, రావులపాలెంలో రెండు చోట్ల, నర్శీపట్నం, కోరుకొండలలోను చోరీలకు పాల్పడినట్టు ఆమె తెలిపారు. మొత్తం ఆరు చోరీలలోను సుమారు రూ.58 లక్షల విలువైన 385 గ్రాముల బంగారు వస్తువులు, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5వేల నగదు స్వాధీనం చేసినట్టు డీఎస్పీ విద్య తెలిపారు. రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన చేధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ హెచ్సీ ప్రసాద్ రమణ సురేష్, విజయ్ అనపర్తికి చెందిన తమ్మారావు, రాజేష్, క్రైమ్ బ్రాంచ్ సీఐలు రాంబాబు, బాలాచారి, అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై ఎల్ శ్రీనునాయక్లను డీఎస్పీ విద్య అభినందించారు. -
విద్యార్థుల స్థాయికి మించి..
సోషల్ స్టడీస్లో సిలబస్ విద్యార్థుల స్థాయికి మించి ఉంది. పాఠాల సంఖ్య కూడా మిగతా సబ్జెక్టులతో పోల్చిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి. విద్యార్థులపై సిలబస్ భారం మోపడం సరైన పద్ధతికాదు. – ఎస్.జ్యోతిబసు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రావులపాలెం ఇబ్బందికరం ఆరు నుంచి పది తరగతులకు సోషల్ సిలబస్ బోధన, అభ్యసన అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. దీని నుంచి తప్పనిసరిగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించాలి. సోషల్లో ఉండే నాలుగు అంశాలకు సంబంధించి ప్రతి రెండు అంశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – దీపాటి సురేష్ బాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
రేషన్ బియ్యం పట్టివేత
● కేసు నమోదు ● విలువ రూ.6 లక్షలు దేవరపల్లి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యర్రవరం గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తున్న 14,470 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అధికారులు పట్టుకున్నారు. వివరాలను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ ఎ.సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి 14,470 కిలోల రేషన్ బియ్యం(326 బస్తాలు) లారీలో యర్రవరం పౌల్ట్రీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో సివిల్ సప్లయ్ జిల్లా సహాయ అధికారి నాగాంజనేయులు ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నట్టు సత్యనారాయణ తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసి, 6(ఎ), 7(1) కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు. గో మాంసం స్వాధీనంగొల్లప్రోలు (పిఠాపురం రూరల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గోమాంసాన్ని గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశారు. -
సొసైటీలకు షేర్ ధనాన్ని జమ చేయండి
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీసీసీబీకి చెల్లించిన షేర్ ధనాన్ని ఆయా సంఘాలు బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులకు జమ చేయాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రంలోని డీసీసీబీలకు సహకార కమిషనర్ బాబు.ఎ మంగళవారం ఉత్తర్వులు పంపించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సహకార సంఘాలకు డీసీసీబీ బోధిస్తూ పొదుపు సూత్రాలు సూచించింది. సంఘాల్లో సభ్యులైన రైతులు చెల్లిస్తున్న షేరు ధనాన్ని ఎప్పటికప్పుడు డీసీసీబీకి పంపించేస్తున్నామని, ఆ మొత్తాలను డీసీసీబీ నుంచి సంఘాలు తీసుకున్న అప్పులకు జయ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈనెల 27న ‘సాక్షి’ దిన పత్రికలో ‘బ్యాలెన్స్ చేసేదెలా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సహకార కమిషనర్ స్పందించి ఈ సమస్య పరిష్కారానికి డీసీసీబీలకు ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘాలకు చెందిన షేర్ ధనాన్ని డీసీసీబీలు తక్షణమే ఆ సంఘాలకు జమ చేయాలని కమిషనర్ లిఖిత పూర్వకంగా ఆదేశించారు. దీంతో సహకార సంఘాలు డిమాండ్ చేస్తున్న షేర్ ధనం సమస్య పరిష్కారమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 298 సహకార సంఘాల్లో 130 సంఘాలు దాదాపు రూ.400 కోట్ల మేర ఇంబ్యాలెన్స్తో ఉన్నాయని ఇటీవల డీసీసీబీ పేర్కొంది. సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న అప్పులు, సంఘాల స్థాయిలో రైతులు తీసుకున్న అప్పుల మధ్య ఇంబ్యాలెన్స్ (అసమతుల్యత) ఏర్పడిందని ఆ బ్యాంక్ ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సహకార సంఘాలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని డీసీసీబీ సూచించింది. సంఘాల ఇంబ్యాలెన్స్కు కారణం తమ దుబాకా ఖర్చులు కాదని, డీసీసీబీ వద్ద సంఘాలకు చెందిన కోట్లాది రూపాయల షేరు ధనాన్ని తమ సంఘాలు బ్యాంక్ నుంచి అప్పలకు జమ చేయకపోవడం వల్లే సంఘాల నష్టపోతున్నాయని సీఈవోలు, త్రీమెన్ కమిటీలు వాదనకు దిగాయి. మొత్తం మీద షేర్ ధనం అదే సంఘాలకు జమ చేసేలా సహకార కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. డీసీసీబీలకు సహకార కమిషనర్ ఉత్తర్వులు -
అధినేతతో భేటీ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలువురు నాయకులు బుధవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వడిశెట్టి నారాయణరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. – సాక్షి, అమరావతి రెండు ఇసుక లారీల సీజ్ సాక్షి కథనం నేపథ్యంలో స్పందించిన గనులశాఖ రావులపాలెం: జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై బుధవారం తనిఖీలు చేసి గోపాలపురం హైవేపై రెండు ఇసుక లారీలను సీజ్ చేసి వాటికి రూ. 50 వేలు అపరాధ రుసుం విధించినట్టు గనుల శాఖ ఏడి అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ తనిఖీలు నామమాత్రమేనా అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అనదికార దందా’ పేరుతో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం గోపాలపురం హైవేపై గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వందలాది లారీలు నిత్యం హైవే మీద తిరుగుతున్నా వారికి మాత్రం గోపాలపురం వద్ద రెండు లారీలే కనిపించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై గనుల శాఖ ఏడీని సాక్షి వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారంతో వెళ్లి నిఘా పెట్టగా రెండు లారీలను సీజ్ చేశామన్నారు. ఈ లారీలు గోపాలపురం స్టాక్ పాయింట్ నుంచి వస్తున్నాయా? అని సాక్షి ప్రశ్నించగా... గోపాలపురం వశిష్ట గోదావరిలో నుంచి ఇసుకను తీసుకున్న వస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్ చేశామని ఏడీ అన్నారు. కొత్తపేట ఆర్డీవోగా సత్యనారాయణ కొత్తపేట: స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అండ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా జీవీవీ సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన శ్రీకర్ ఫిబ్రవరి 25న బదిలీ కావడంతో నెల్లూరు జిల్లా రామాయపట్నం పారిశ్రామిక క్లస్టర్ అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను కొత్తపేట ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం అక్కడ రిలీవ్ అయ్యారు. -
పైలాపచ్చీసులకు చెక్!
అమలాపురం టౌన్: కళాశాలలకు వెళ్లకుండా వేరే వ్యాపకాలతో కాలక్షేపం చేసే విద్యార్థుల ఆటలు ఇక చెల్లవు. కళాశాలలకు ఒక పూట వచ్చి పైలాపచ్చీసుగా తిరిగే విద్యార్థులకు చెక్ పెట్టేలా విద్యాశాఖ ఫేషియల్ అటెండెన్స్ విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఈ విధానం అమలవుతోంది. గత సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకూ ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్కు ఫేషియల్ అటెండెన్స్ లింకు కొంతమంది విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా రాకుండా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. దీంతో విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీ యంబర్స్మెంట్ వర్తించేలా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఫేషియల్ అటెండెన్స్తో లింకు పెట్టింది. జిల్లాలో ఉన్న 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు జరుగుతోంది. జిల్లాలోని 65 వరకూ ఉన్న ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం వల్ల జిల్లాలోని కొన్ని కళాశాలల్లో విద్యార్థులు హాజరు కాకపోయినప్పటికీ వారిని హాజరైనట్లు చూపించి వారి నుంచి కొంత డబ్బును తీసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరుతో ఇక ఆ ఆటలు చెల్లవు. కొన్ని కళాశాలల అధ్యాపకులు వేరే కోర్సుల స్టడీ పేరుతో అనధికార సెలవులు పెట్టే విధానానికి ఈ ఫేషియల్ రికై ్నజ్డ్ సిస్టమ్తో అడ్డుకట్ట పడనుంది. జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకు ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు రాకపోయినప్పటికీ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారని భావిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది ఫేషియల్ అటెండెన్స్తో నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను పెండింగ్ లేకుండా జమ చేయాలని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2024–25 సంవత్సరానికి ప్రభుత్వం కొంత మొత్తాన్నే జమ చేసింది. అదే 2025–26 సంవత్సరానికి ఒక రూపాయి కూడా జమ చేయలేదు. ఈ పెండింగ్ వల్ల జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.హాజరు శాతం పెరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నాం. ఈ విధానం అన్ని కళాశాలకు వర్తింప చేస్తుండడం వల్ల విద్యార్థుల హాజరు పెరిగే అవకాశం ఉంటుంది. – డాక్టర్ వి.నరసింహస్వామి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమలాపురం ఇక ఫేషియల్ అటెండెన్స్తో హాజరు నిర్ధారణ ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాలల్లో అమలుకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు ప్రైవేటు కళాశాలల్లోనూ ప్రారంభానికి సన్నాహాలు -
తాపీల్దార్ ఆఫీసు!
ఐ.పోలవరం: మండల తహసీల్దార్ కార్యాలయం బుధవారం ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల మీద వచ్చిన జనం అధికారులు, సిబ్బంది కోసం మండుటెండలో ఎదురుతెన్నులు చూశారు. కనీసం సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. 10.30 గంటలు దాటిన తరువాత ఒక వీఆర్వో వచ్చి తలుపులు తీశారు. వచ్చినవారు ‘‘అమ్మా సిబ్బంది ఏరి’’ అని అడగగా మాకు తెలియదు అని చెప్పారు. తరువాత ఎప్పుటికో గాని అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో రాలేదు. అప్పటి వరకు కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తూనే ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం ఇలా తాపీగా తెరచుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అవినీతి అక్రమాలకు రెండేళ్లు
● రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రామచ్రందపురం: రాష్ట్రంలో అవినీతి అక్రమాలతో రెండేళ్ల పాటు వెన్నుపోటు పాలనను చంద్రబాబు నాయుడు సాగించారని, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి సంబంధించి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా అరకొరగా సూపర్ సిక్స్ను అమలు చేసి, అన్ని చేసేశాం అని గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 నుంచి 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1,500లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికీ అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ రెండేళ్లలో రాష్ట్రంలోని యువతకు రూ. 72 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా అందించలేదన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవినీతికి పాల్పడి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ శాఖ మంత్రి లోకేష్ దగా డీఎస్పీగా మార్చేశారన్నారు. డీఎస్పీలో అవినీతిపై ఆధారాలతో సహా తమ పార్టీ బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. తల్లికి వందనం పథకం మొదటి సంవత్సరం ఎగ్గొటి, అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను కూడా నిలువునా ముంచేశారని సూర్యప్రకాశ్ అన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక నానా అవస్థలు పడినా ఈ జిల్లా మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని వర్గాల వారికి చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజల్లో ఎండగట్టేందుకు నేటి నుంచి జిల్లాలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రాల్లో పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మాదిరాజు ఫృథ్వీరాగ్, జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, మాజీ ఎంపీపీ అంబటి భవానీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోలమూరి శివాజీ, మాజీ కౌన్సిలర్ గుబ్బల గణ, పోతంశెట్టి గోపాలకృష్ణ, ఎండీ మస్తాన్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సతీష్కుమారి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గుత్తుల శ్రీను(డ్రీమ్), పార్టీ కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పోలినాటి వరప్రసాద్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయిలక్ష్మి, పార్టీ నేతలు గుంట ముక్కల దొరబాబు, బొమ్ము మోహనరావు, కొసనా కామేశ్వరరావు, బండి త్రిమూర్తులు, సత్తిశంకర్రెడ్డి, మాజీ సర్పంచ్ చిల్లే నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
హామీలను విస్మరించి.. ప్రజలను మోసగించి..
ఫ ఎన్నికలను హామీలను పట్టించుకోని చంద్రబాబు ఫ అన్ని వర్గాల ప్రజల అవస్థలు ఫ వెఎస్సార్ సీపీ నాయకుల ధ్వజం ఫ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ ఫ 4న నియోజకవర్గాల్లో నిరసనలు అమలాపురం రూరల్: ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో సహా 143 హామీలు ఇచ్చి, సంపద సృష్టించి అమలు చేస్తామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి, ప్రజలను నట్టేట ముంచారని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్కుమార్, పాములు రాజేశ్వరీదేవి, గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిరసనగా జూన్ 4న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. వెన్నుపోటుకు చిరునామాగా చంద్రబాబు మారారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎన్నికల సమయంలో ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి సర్కారు అధికారంలో చేపట్టి జూన్ 4కు రెండేళ్లు అవుతున్న సందర్భంగా, వారి నిరంకుశ పాలనపై నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పేరి కామేశ్వరరావు, కేఎస్ఎన్ రాజు, కుడుపూడి భరత్ భూషణం, సాక మణి కుమారి, బాలముని కుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, నియోజవర్గాల పరిశీలకలు చింతలపాటి శ్రీనివాస్ రాజు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాములు ప్రకాష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి కంచర్ల శేఖర్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గుబ్బల మనోహర్, అమలాపురం టౌన్ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (నాని), అంబాజీపూట మండల అధ్యక్షుడు విత్తనాలు ఇంద్రశేఖర్, సఖినేటిపల్లి మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, పి.గన్నవరం నియోజవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు గన్నవరపు సాయి ప్రసాద్, తిరుకోటి సతీష్కుమార్, విత్తానాలమూర్తి ,ఈతకోట శ్రావణ్, చెల్లుబోయిన నాని తదితరులు పాల్గొన్నారు. -
విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం అమలాపురం దేవదాయశాఖ, ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో లెక్కించారు. 69 రోజులకు రూ.34,80,870 లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఇంకా 1.8 గ్రాముల బంగారం, 49.2 గ్రాముల వెండి, 25 విదేశీనోట్లు లభించాయని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గోదావరిలో పడి వ్యక్తి మృతి ఐ.పోలవరం: బహిర్భూమి కోసం గోదావరి ఒడ్డుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలం తెల్లవారిపాలేనికి చెందిన వేగిరావతి వెంకటేశ్వరరావు (43) ముమ్మిడివరంలో శ్రీ సాయి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ముమ్మిడివరం నుంచి యానాం వైపు వెళుతూ బహిర్భుమి కోసం ఎదుర్లంక వద్ద గోదావరి గట్టుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి గోదావరిలో పడిపోయాడు. చూసిన స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి పనులకు వచ్చి కూలీల మృతి కొత్తపేట/కాజులూరు: ఉపాధి పనులకు వచ్చిన కూలీలు పని ప్రదేశంలోనే మృతి చెందారు. వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలు..కొత్తపేట మండల పరిధిలోని గంటి గ్రామానికి చెందిన చామకూరి హనుమంతరావు (75) అనే ఉపాధి కూలీ.. డ్రైన్ పూడికతీత పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఏపీఓ ఎన్.ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంటిలోని వరాల నాగమ్మ తల్లి ఆలయం రోడ్డు వెంబడి డ్రైన్ పూడికతీత పని చేపట్టారు. మంగళవారం ఉదయం 52 మంది ఉపాధి కూలీలు ఆ పనికి వెళ్లగా, ఫొటో తీసుకునే సమయంలో చామ కూరి హనుమంతరావు హఠాత్తుగా గుండెపోటు తో కుప్పకూలాడు. వెంటనే ఉపాధి సిబ్బంది, సహచరులు వైద్య సిబ్బందిని తీసుకువచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాలువ తవ్వకం పనులు చేస్తూ.. కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో కాలువ తవ్వకం పనిచేస్తున్న ఉపాధి కూలీ మేడిశెట్టి రాఘవ మృతి చెందింది. ఆమె తన తోటి కూలీలతో కలసి మంగళవారం ఉదయం గ్రామ శివార్లలోని డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో పనికి వెళ్లింది. పనిచేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమె అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఉపాధి ఏపీవో బి.వెంకటలక్ష్మి, వీఆర్వో వరలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పరామర్శించారు. జోసా కౌన్సెలింగ్పై అవగాహన రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జోసా/సి–శాబ్ కౌన్సెలింగ్ 2026 అవేర్నెస్ ప్రోగ్రామ్కు సుమారు 4000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, బీఐటీఎస్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తమ రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించగలరన్నారు. జోసా కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్లలో సీట్లు వస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తాడేపల్లిగూడెం ఎన్ఐటీ డీన్ డాక్టర్ వీరేష్ కుమార్ పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఫ రాజ్యసభ సభ్యుడు బోస్ ఫ అమలాపురంలో ముగిసిన బాస్కెట్ బాల్ శిక్షణ అమలాపురం టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అప్పుడే మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. జాతీయ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో నెల రోజులుగా జరుగుతున్న బాస్కెట్ బాల్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బోస్తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. అమలాపురం కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ మెమోరియల్ జిమ్, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 1న ఈ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అభినందనీయం జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏటా వేసవిలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు క్రమం తప్పకుండా బాస్కెట్ బాల్ క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ క్రీడల విలువ తెలిసిన ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అదే స్ఫూర్తితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి క్రీడాకారులు కావాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. కోచ్ ఆకుల ఉమ, వ్యాయాయ ఉపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, వెంకట్రావు మాట్లాడుతూ రోజూ వంద మందికి తక్కువ కాకుండా విద్యార్థులు బాస్కెట్ బాల్ క్రీడలో తర్ఫీదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సూదా గణపతి, క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డగళ్ల సాయిరామ్, ముంగర ప్రసాద్, మోటూరి సత్యంకాపు, నక్కా చంద్రశేఖర్, దోనిపాటి లోవరాజు పాల్గొన్నారు. -
విద్యార్థిని అబార్షన్పై అధికారుల విచారణ
అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన సమీపంలోని వుమెన్ కేర్ జనరల్ ఆస్పత్రిలో గత నెల 26న ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై విచారణ కమిటీ అధికారులు మంగళవారం అదే ఆస్పత్రిలో విచారణ నిర్వహించారు. అమలాపురం ఇన్చార్జి ఆర్డీవో జి.మమ్మీ, డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తిక్, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.నాగమణి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ కె.నాగ మానస, అడిషనల్ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ భరతలక్ష్మితో కూడిన విచారణ కమిటీ ఆస్పత్రి సిబ్బందిని లోతుగా విచారించింది. విద్యార్థినికి నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ జరిగిన ఘటనపై కలెక్టర్ ఆర్.మహేష్ కుమా ర్ విచారణ కమిటీని నియమించి, తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాలపై విచారణ కమిటీలోని అధికారులు ఆస్పత్రిని సందర్శించి విచారణ మొదలుపెట్టారు. తొలుత ఆస్పత్రి వైద్యురాలు, పి.గన్నవరం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఎల్.శిరీషను, తర్వాత ఇతర వైద్యులు, నర్సులు, సిబ్బందిని వేర్వరుగా విచారణ చేశారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆస్పత్రి వైద్యులు, నర్సులు నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆస్పత్రి స్టాఫ్ నర్సు వైద్యం చేసిందని, ఇందులో తమకు సంబంధం లేదని వైద్యురాలు తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అనంతరం ఆర్డీవో మమ్మీ, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ దుర్గారావు దొర ఆస్పత్రిలో విలేకర్లతో మాట్లాడుతూ ఇంకా కొందర్ని విచారణ చేయాల్సి ఉందని, మొత్తం పూర్తయ్యాక నివేదికను కలెక్టర్ మహేష్ కుమార్కు అందజేస్తామని చెప్పారు. బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగ మానస మాట్లాడుతూ తమ రాష్ట్ర కమిషన్ నుంచి కూడా త్వరలో ప్రతినిధులు అమలాపురంలోని ఆస్పత్రికి వచ్చి విచారించనున్నార ని చెప్పారు. అలాగే వుమెన్ కేర్ జనరల్ ఆస్పత్రి వైద్యురాలైన డాక్టర్ శిరీష పనిచేస్తున్న పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మంగళవారం సాయంత్రం నుంచి కమిటీ అధికారులు విచారణ చేశారు. -
అనదికార దందా
ఫ గోదావరిలో జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు ఫ పాటించని అధికారిక ఇసుక ర్యాంపు నిర్వాహకులు ఫ యథేచ్ఛగా తవ్వకాలు, అమ్మకాలు ఫ అనధికారిక తవ్వకాలు సరేసరి ఫ పట్టించుకోని అధికార యంత్రాంగం సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఒకవైపు అనుమతులు ఉన్న ర్యాంపుల్లో సరిహద్దులు చెరిపి తవ్వకాలు చేస్తున్నారు. మరోవైపు అనధికార ర్యాంపులను ఏర్పాటు చేసి మట్టి, బొండు ఇసుక, ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న గౌతమీ, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట నదీ పాయల వెంబడి ఇస్టానుసారం తవ్వకాలు చేస్తూ గుల్ల చేస్తున్నారు. చివరకు జాతీయ హరిత ట్రిబునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబునల్) నిబంధనలను సైతం తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు కానిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. నదీ గర్భాల్లో జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 15 వరకు అధికారికంగా కూడా ఇసుక, మట్టి, ఇతర తవ్వకాలు చేయకూడదు. గతంలోనే ఎన్జీటీ ఈ తీర్పునిచ్చింది. జూన్ ఒకటి నుంచి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూలై 15 తర్వాత గోదావరికి వరద మొదలవుతుంది. తిరిగి అక్టోబరు 15 వరకు అంటే ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు తవ్వకాల మీద ఎన్జీటీ నిషేధం విధించింది. మన జిల్లాలో అక్టోబరు 15 తరువాత ఈశాన్య రుతుపవనాలు రావడం, తర్వాత తుపాన్ల కారణంగా నవంబరు నెలాఖరు వరకు ర్యాంపులను తెరిచే అవకాశం లేదు. అయితే ఎన్జీటీ తీర్పును దిక్కరిస్తూ జిల్లాలో అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆత్రేయపురం నుంచి అంతర్వేది తీరం వరకు ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆత్రేయపురం, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, ముమ్మిడివరం మండలాల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీటిని నిలువరించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఇదే అక్రమార్కులకు కలిసి వస్తోంది. కనీసం ఎన్జీటీ నిబంధనలు పాటించైనా వీటిని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నా పట్టించుకునే వారే లేరు. అడపాదడపా వర్షాలు పడుతున్నా, వాతావరణ సహకరించడంతో ఇక్కడ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. వరదల కోసం ర్యాంపుదారుల ఎదురు తెన్నులు గోదావరికి వరదలు వస్తే జిల్లాలోని ఇసుక ర్యాంపులలో తవ్వకాలు దాదాపు నిలిచిపోతాయి. ఈ సమయంలో స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తారు. ఇది కొంత వరకు ఖర్చుతో కూడుకున్న అంశం. గోదావరి నుంచి స్టాక్ పాయింట్కు ఇసుక తరలించడం, అక్కడ తిరిగి ఎగమతి చేయడం కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం. అదే గోదావరిలోనే నేరుగా ఎగుమతి చేస్తే ర్యాంపు నిర్వాహకులకు ఎక్కువగా సొమ్ములు మిగులుతాయి. అయినా కూడా ర్యాంపు నిర్వాహకులు ఈ ఏడాది తొందరగా వరదలు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు కారణం గోదావరి పొడవునా అక్రమంగా చేస్తున్న తవ్వకాలు నిలిచిపోతాయని. ప్రస్తుతం ఈ తవ్వకాల వల్ల ర్యాంపులలో ఇసుకకు డిమాండ్ లేకుండా పోతోంది. అలాగే గత ఏడాది పెద్ద ఎత్తున స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ ఉంచినా అమ్మకాలు సాగలేదు. పోనీ మైనింగ్, ఇతర అధికారులతో కలిసి అనధికార తవ్వకాలను అడ్డుకుందామన్నా వాటి వెనుక ఆయా నియోజకవర్గాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. పేరుకే ఉచితం ఉచిత ఇసుక విధానమని ప్రభుత్వం చెబుతున్నా ర్యాంపుల వద్ద ఇసుక ఖరీదైన వ్యవహారంగా మారింది. బాట చార్జీలు, ఇసుక లోడింగ్ చార్జీలు, పర్యావరణ అనుమతులు, జీఎస్టీ పేరుతో టన్నుకు రూ.132 వరకు వసూలు చేస్తున్నారు. ఒక లారీ అంటే సుమారు 20 టన్నుల ఇసుకకు రూ.2,640 అవుతోంది. దీనికి రవాణా చార్జీలు అధికం. అయితే అక్రమార్కులకు వద్ద ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ర్యాంపులన్నీ కొత్తపేట, మండపేట నియోజకవర్గంలో ఉన్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలుకు రవాణా చార్జీలు అధికం. అదే గోదావరి పొడవునా తవ్వకాలు చేస్తే ఇసుక రవాణా ఖర్చులు కూడా కలిసి రావడంతో అక్రమార్కుల వద్దనే ఇసుక అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ర్యాంపులు జిల్లాలో మొత్తం 12 అధికారికంగా ఇసుక ర్యాంపులున్నాయి. ప్రస్తుతం ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, ఆత్రేయపురం మండలం మెర్లపాలెం (ఊబలంక సరిహద్దు), కపిలేశ్వరపురంలో అధికారిక ర్యాంపులున్నాయి. వీటిల్లో ఈ ఏడాది డిసెంబరు 9 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయి. అయినా సరే ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి జూన్ 1వ తేదీ అంటే సోమవారం నాటికే వీటిని మూసివేయాల్సి ఉంది. కానీ ఈ నాలుగు ర్యాంపుల వద్ద కూడా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. -
కూ.. చిక్కుచిక్
ఫ కోనసీమ రైల్వే లైన్కు అనేక చిక్కులు ఫ ఎట్టకేలకు కొత్త ఎలైన్మెంట్ ఖరారు ఫ పరిహారం చెల్లించకపోవడంతో ప్రజల అసంతృప్తి మలికిపురం: దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృషితో తెరపైకి వచ్చిన కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్టు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ట్రాక్ ఎలైన్మెంట్లు వేయడం, వాటిని మార్చడంతోనే సరిపోతోంది. ఎట్టకేలకు కొత్త ఎలైన్మెంట్ ఖరారైనా పరిహారం చెల్లించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో రాజోలు దీవిలోనే కొనసీమ రైలు తిరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. దిండిలో గతంలో సేకరించిన రైల్వే లైన్ మార్గంలో 20 ఏళ్ల క్రితం ఏపీటీడీసీ టూరిజం కేంద్ర భవనాలు నిర్మాణమయ్యాయి. అంతే కాక కొత్త కాలనీ, పాత కాలనీలు ఉన్నాయి. స్థానికుల నుంచి విన్నపాలు రావడంతో అప్పటి కలెక్టర్ ఎలైన్మెంట్ మార్పునకు అంగీకరిస్తూ కొత్త లైన్ సర్వే కోసం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వశిష్ట నదిపై ఉన్న దిండి – చించినాడ వంతెనకు తూర్పున ఒక లైన్, పశ్చిమాన మరో రెండు లైన్లు సర్వే చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను అప్పట్లో రూపొందించారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు శివకోడు నుంచి లైన్ మార్చాల్సి ఉండడం, నదిపై వంతెన నిర్మాణం, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని కొత్త లైన్ ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అధికారులు గట్టి కసరత్తే చేశారు. ఇటువంటి పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా కోనసీమ రైలు రాజోలు దీవిలోనే తిరుగుతోంది. ఎట్టకేలకు సుగమం ఎట్టకేలకు రెండు నెలల క్రితం దిండి వంతెనకు తూర్పు వైపు నుంచి కంటే పశ్చిమ వైపు నుంచే రైలు మార్గం ఫైనల్ అయింది. రైల్వే లైన్ను పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాలకొల్లుకు కాకుండా నర్సాపురం స్టేషన్కు మాత్రమే అనుసంధానం చేయాల్సి ఉన్నందున నర్సాపురానికి దగ్గరి మార్గమైన రామరాజులంక – ఏనుగువానిలంక మధ్య వశిష్ట నది మీదుగా రైల్వే లైన్ వేసేలా కొత్త ఎలైన్మెంట్ రూపొందించారు. రామరాజులంక మీదుగా దిండిలో వశిష్ట నదిని దాటి కొత్త లైన్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామరాజులంక, గుడిమెళ్లంక పంచాయతీ, మట్టపర్రు, చింతలపల్లి, కడలి మీదుగా పాశర్లపూడి వైపు కొత్త ఎలైన్మెంట్ తయారు చేశారు. అయితే ఈ ఎలైన్మెంట్లో కూడా గుడిమెళ్లంక గ్రామస్తులు కోర్టులకు వెళ్లడంతో కాస్త ఆలస్యం అయినా ఎట్టకేలకు కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ ఎలైన్మెంట్నే ఖరారు చేశారు. రైల్వే లైన్ ఏర్పాటులో అలసత్వం కోనసీమ రైల్వే లైన్ ఏర్పాటులో కూటమి సర్కారు తీవ్ర అలసత్వం వహిస్తోంది. ఫలితంగా భూసేకరణకు పరిహారం ఇవ్వలేదు. ట్రాక్ పనులు ప్రారంభం కావడంలేదు. ఇలా అయితే ఎన్ని అలైన్మెంట్లు వేస్తారో అర్థం కావడం లేదు. – దివ్వి చిట్టిబాబు, అప్పనరామునిలంక పరిహారం మాటేమిటి! కొత్త ఎలైన్మెంట్ ప్రకారం రాజోలు దీవిలో తాటిపాక, గెద్దాడ మధ్య కాకుండా కడలి సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటవుతుంది. ఇక మలికిపురం మండలంలో మరో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారు. కొత్త లైన్ ఏర్పాటును బట్టి ఈ అవకాశం ఉంటుంది. కొత్త ఎలైన్మెంట్కు భూ సేకరణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. పరిహారం మాత్రం చెల్లించలేదు. దిండిలో వంతెన నిర్మాణం చేపట్టిన ప్రాంత రైతులకు మాత్రమే పరిహారం అందించారు. కోనసీమ రైల్వే లైన్ ఏర్పాటులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపక పోవడం వల్ల మరింత ఆలస్య అయ్యే పరిస్థితి నెలకొంది. అలైన్మెంట్ ఖరారు అయినా పరిహారం ఇవ్వక పోవడం, ట్రాక్ పనులకు నిధులు ఇవ్వక పోవడంతో ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. -
దగా డీఎస్సీపై మహాగ్రహం
సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్: ‘ఇది మెగా డీఎస్సీ కాదు, ముమ్మాటికి దగా డీఎస్సీ. అర్హులను అనర్హులను చేశారు, అనర్హులను అందలమెక్కించారు. యువతను వంచించారు, నిరుద్యోగులను మోసం చేశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి’ అని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురంలో యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన, ధర్నా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, వాటి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, లేదంటే హైకోర్టు జడ్జితోనైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్కు పాదయాత్రగా.. తొలుత స్థానిక నల్ల వంతెన వద్ద నిరసన శిబిరం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అర్హుల ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలు నిరుద్యోగ యువతను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం, నియామక ప్రక్రియను వివాదాస్పదం చేసి వేలాది మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి నాగ ఆదిత్య కుమార్, చింతలపాటి శ్రీనివాసరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మిండగుదిటి శిరీష్, చీకట్ల కిషోర్, తోరం గౌతమ్, జిన్నూరి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సత్య మోహన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన రాజా, యువ జన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్, పార్టీ నాయకులు సంసాని నాని, విత్తనాల మూర్తి, అమర్ కుమా ర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పోరుబాట నిరుద్యోగులకు అండగా పార్టీ శ్రేణులు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ నల్లవంతెన నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు -
ఉద్యమించాలి
డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగ యువత ఉవ్వెత్తున ఉద్యమించాలి. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నిరుద్యోగ యువతకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారు డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. డీఎస్సీ అవినీతిపై సీబీఐ, హైకోర్టు సింగిల్ జడ్జితో విచారణ చేపట్టాలి. ఉద్యోగాలను మెరిట్ లిస్టులో అభ్యర్థులకు ఇవ్వకుండా కూటమి నాయకుల బంధువులకు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇచ్చారు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ అక్రమాలపై విచారణ చేయాలి మెగా డీఎస్సీ అక్రమాలపై విచారణ చేయాలి. అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ మాత్రమే చెప్పడం లేదు. దగా పడిన నిరుద్యోగ యువత హైకోర్టు తలుపుతట్టారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాల్సి ఉంది. రెండేళ్లలో కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా ఒక్కరు కూడా అక్రమం జరిగిందని రోడ్డు ఎక్కలేదు. – పిల్లి సూర్య ప్రకాష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం కోఆర్డినేటర్ యువతకు అన్యాయం డీఎస్సీ మెరిట్ లిస్టును ప్రభుత్వం ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడింది. నిరుద్యోగ యువతకు మంత్రి లోకేష్ అన్యాయం చేశారు. డబ్బులిచ్చిన అభ్యర్థులకే ఉద్యోగాలకు ఎంపికై నట్టు సమాచారం పంపించారు. మెగా డీఎస్సీపై ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెడతామని సీఎం చంద్రబాబు భయపెడుతున్నారు. నిరుద్యోగ యువత ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. – పాముల రాజేశ్వరీదేవి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాజోలు కోఆర్డినేటర్ సమాధానం చెప్పాలి మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఉద్యోగాలు వస్తాయని ఎంతో కష్టపడి చదివిన యువతకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ద్రోహం చేశారు. డీఎస్సీ అవినీతిపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్పై అసత్య ప్రచారం ఆపి, మీ నిజాయితీని నిరూపించుకోవాలి. అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం చర్చకు సిద్ధం కావాలి. – గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కో ఆర్డినేటర్ నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ డీఎస్సీలో దగా పడిన నిరుద్యోగ యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో నిరుద్యోగ యువత ఆలోచించాలి. వైఎస్సార్ సీపీ చేపట్టిన దగా డీఎస్పీకి మద్దతుగా నిరుద్యోగ యువత రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయాలి. – చింతా అనూరాధ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వివరణ ఇవ్వరేం! ఇది మెగా డీఎస్సీనా లేక అభ్యర్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?, అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అది నా విజనరీ వల్లే అని చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు.. ఇవాళ డీఎస్సీ అక్రమాలపై నోరెందుకు మెదపడం లేదు. బాధితులు రోడ్లు ఎక్కి నిరసన తెలుపుతుంటే ఆయన గానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గానీ ఎందుకు స్పందించి వివరణ ఇవ్వడం లేదు. – మిండగుదిటి శిరీష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ● -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ
తుని: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఓబీసీ కేటగిరిలో 167 ర్యాంకు, జనరల్ కేటగిరిలో 974 ర్యాంకు సాధించాడని ప్రిన్సిపాల్ వీవీఎస్ఎస్.భానుమూర్తి సోమవారం తెలిపారు. శ్రీప్రకాష్లో స్కూల్ లెవెల్ నుంచి ఇస్తున్న పొసైటీ ఫర్ ప్రమోటింగ్ ఎకడమిక్ ఎక్స్లెన్స్ ఇన్ స్కూల్ (స్పేసెస్), శ్రీప్రకాష్ అచీవర్స్ అకాడమీ(స్పా) ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ద్వారా తమ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
రొయ్యల చెరువులతో సాగు భూములకు నష్టం
అమలాపురం రూరల్: మలికిపురం మండలం లక్కవరంలో ఉప్పునీటి రొయ్యల చెరువుల అక్రమ సాగుతో వ్యవసాయ భూములు.. బీడుగా మారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ చెరువుల వ్యర్థాల కారణంగా 80 ఎకరాల్లో భూములు నాశనమయ్యాయని, కొబ్బరి చెట్లు వెర్రి తలలు వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల వేదిక నాయకులు ఏడిద రాజేష్, ముత్యాల శ్రీనివాసరావు, ఎ.రవి మాట్లాడుతూ రొయ్యల చెరువుల కారణంగా వ్యవసాయం చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లక్కవరంలో ముదునూరి విష్ణుమూర్తి రాజు, ముదునూరి శ్రీనివాసరాజు పది ఎకరాలు ఎకరాల సారవంతమైన భూములను అక్రమ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చివేశారని ఆరోపించారు. ఆ చెరువులను తొలగించాలని కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
12 నెలల జీతం ఇప్పించండి
అమలాపురం టౌన్: తమకు 12 నెలల జీతం ఇప్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు కోనసీమకు చెందిన 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవ కుమార్ ఆధ్వర్యంలో టీచర్లు సోమవారం వినతి పత్రం అందించారు. అలాగే తమ సర్వీ స్ను తక్షణమే 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. జీవోఎం ఇచ్చిన రూల్స్ ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని సీఎంకు గుర్తు చేశారు. అలాగే ఆదివారం అమలాపురం మున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణకు ఇదే డిమాండ్లపై రాష్ట్ర ఫెడరేషన్ బృందం వినతి పత్రం ఇచ్చింది. పోలీస్ గ్రీవెన్స్కు 24 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీగా పదోన్నతి పొందిన జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ ఈ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఫిర్యాదులు అందించారు. వారితో ఏఎస్పీ ప్రసాద్ ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లలో మాట్లాడారు. అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకం అమలాపురం రూరల్: మండలంలోని నడిపూడి బండారులంక, నడిపూడి వెళ్లే లింకు రోడ్డుకు ఆనుకుని పంట కాలువ వద్ద అక్రమంగా ఆక్వా చెరువులను తవ్వుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల మధ్య ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారన్నారు. వీటి వల్ల బండారులంకలో కొత్తగా ఏర్పడిన జాతీయ రహదారి, రహదారి వెంబడి ఉన్న నివాసాలు, పంట పొలాలకు నష్టం జరుగతుందన్నారు. రెండు పంటలు పండే వరి చేలలో రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారని బండారులంక, గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుగంటి భాస్కరరావు మాట్లాడుతూ వ్యవసాయ భూములతో పాటు సమీపంలోని వంద ఎకరాల కొబ్బరి తోటలు, వాటిలో అంతర పంటలుగా సాగు చేస్తున్న అరటి, పోక, కోకో నాశనం అవుతాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
సైద్ధాంతిక పునాదులపైనే జేవీవీ ప్రయాణం
● రాష్ట్ర జీవీవీ ప్రధాన కార్యదర్శి సురేష్ ● ముగిసిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు అమలాపురం టౌన్: సైద్ధాంతిక పునాదులపైనే జన విజ్ఞాన వేదిక (జేవీవీ) నాడు.. నేడు.. ఎప్పుడూ ప్రయాణిస్తుందని, ఆ లక్ష్యంతోనే పనిచేస్తుందని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తువ్వా సురేష్ స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ హోమ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ తరగతులను జేవీవీ జిల్లా అధ్యక్షుడు జె.సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివి ధ జిల్లాల నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు జిల్లాల వారీగా నివేదికలు సమర్పించారు. సంస్థ జిల్లా గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జేవీవీ పోరాటం మనుషుల మీద, వారి వ్యక్తిగత విశ్వాసాలపై కానే కాదని, మనుషుల మూఢ నమ్మకాలపైనేనని చెప్పారు. తరగతుల్లో పాల్గొన్న అమలాపురం వీజీఎస్ అధినేత శిరం రామారావు మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబరాలకు ఎప్పటిలాగే తన వంతు సహకారం ఉంటుందని ప్రకటించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు కేఎంఆర్ ప్రసాద్, జి.మురళీధర్, గిరిధర్, జీవీహెచ్పీ వర్మ, రాష్ట్ర సమతా కన్వీనర్ ఎంకేపీ వాణి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వరప్రసాద్ సంస్థ సిద్ధాంతాలను వివరించారు. సంస్థ రాష్ట్ర కోశాధికారి మురళీధర్ ‘ఆర్థిక క్రమశిక్షణ –నిర్వహణ సమస్యలు’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బీఎన్ వెంకటేశ్వరరావు, బి.శివకుమార్, ఖాజా మొహినుద్దీన్ పాల్గొన్నారు. -
ఇంకా..
● సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్ మద్యమైనా ప్రతి బాటిల్పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు. ● నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని జనం అడుగుతున్నారు సార్! -
కోనసీమకూ గంజాయిగా..
● మొన్న రాజోలు.. నిన్న అమలాపురం ● డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు ● 21 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన అమలాపురం టౌన్: గంజాయిని కూకటి వేళ్లతో పెకలిస్తామన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. మొన్న రాజోలు, నిన్న అమలాపురంలో పట్టుబడ్డ వ్యసనపరుల వల్ల జిల్లాకూ గంజాయి వ్యాపించినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో ఇటీవల కొత్తగా వచ్చిన డిటెక్టన్ కిట్ల (బయో చెక్)తో గంజాయి వినియోగించిన వారిని క్షణాల్లో పట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో రాజోలులో పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో డ్రగ్స్ కేసులు ఎదుర్కొన్న పాత నేరస్తులు, అనుమానితులకు డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేస్తే 10 మందికి పాజిటవ్ వచ్చింది. అలాగే అమలాపురం పట్టణ పరిధిలో ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీల సమక్షంలో 52 మందిని శనివారం రాత్రి పరీక్షిస్తే 11 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ పరీక్షల ద్వారా పట్టుబడిన వారిని పోలీసులు మొదటి తప్పుగా హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మరోసారి పట్టుబడితే కేసులు, అరెస్టులు తప్పవని వివరిస్తున్నారు. రాజోలులో పట్టుబడ్డ వారిని తక్షణమే డీఅడిక్షన్ సెంటర్కు పంపించారు. అమలాపురంలో పట్టుబడ్డ వారిపై నిఘా పెట్టారు. -
కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది
వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి మలికిపురం: రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన రెండేళ్లకే కూటమి ప్రభుత్వం ప్రజలలో పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆదివారం ఆయన మలికిపురంలోని పార్టీ సీఈసీ సభ్యులు కేఎస్ఎన్ రాజు నివాసంలో పార్టీ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడంతోనే కూటమి నేతల సమయం సరిపోతుందని, ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే సమయం ఎక్కడ ఉంటుందన్నారు. జగన్ పాలనను, కూటమి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, రాజోలు కో ఆర్డినేటరు పామలు రాజేశ్వరీ దేవి, సీఈసీ సభ్యులు కెఎస్ఎన్ రాజు తదితరులు ప్రసాదరాజును సన్మానించారు. పార్టీ నాయకులు కంచర్ల శేఖర్, పాముల ప్రకాష్, గుబ్బల మనోహర్, కసుమ చంద్రశేఖర్, చింతా ప్రసాద్, బల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలి
● జిల్లా రైతుల వద్ద 20 వేల మెట్రిక్ టన్నులు ● జేసీకి వైఎస్సార్ సీపీ రైతు విభాగం వినతి అమలాపురం రూరల్: పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లా రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజోలు మండల పరిధిలో 203 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను సంప్రదించగా లక్ష్యం పూర్తయ్యింది.. తాము తీసుకోలేమంటున్నారని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) అధ్వర్యంలో జేసీ వైఖోమ్ నిడియాదేవిని కలసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో ధాన్య సేకరణ జరగలేదని అన్నారు. వర్షం వస్తేఽ ధాన్యం తడిసి రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలు మండలంలో 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా పంట చేలోనే ఉందని, ఇలా జిల్లాలో ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జేసీని వారు కోరారు. జిన్నూరితో పాటు పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకులు గుబ్బల రమేష్, పాముల ప్రకాష్, జవహర్లాల్, చెల్లుబోయిన సత్యనారాయణ, గుబ్బల సత్యనారాయణ, పాల్గొన్నారు. వాడపల్లి వెంగన్నకు బస్సు సమర్పణ రూ.32 లక్షల విలువైన వాహనాన్ని అందించిన కెనరా బ్యాంకు ఆత్రేయపురం: మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రావులపాలెంలోని కెనరా బ్యాంక్ రూ.32 లక్షల విలువైన బస్సును బహూకరించారు. అలాగే ఆలయ నిత్యాన్నదాన పథకానికి అయినవిల్లి మండలం చింతనలంక వాస్తవ్యులు విల్లా మణికంఠ, జ్యోతి దంపతులు కుటుంబ సభ్యులు రూ.50,120 సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు స్వామి వారి ఫోటో అందజేశారు. జయము జయము గణేశా అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని వివిధ పుష్పాలతో అలంకరించి అనంతరం మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషకం నిర్వహించారు. జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం అమలాపురం రూరల్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్లలోపు బాలల నుంచి జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ నాగమణి తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సాంస్కృతి రంగాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించిన బాలలు జూలై 31వ తేదీలోపు httpr://awardr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతులు మీదుగా బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని తెలిపారు. ఈదరపల్లి–ముక్కామల రహదారి బంద్ అమలాపురం రూరల్: అమలాపురం మండలం ఈదరపల్లి నుంచి ముక్కామల వెళ్లే కాలువ గట్టు రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు నేదునూరు – పెదపాలెం ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రావులపాలెం వైపు ప్రయాణించే వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవా లని అధికారులు సూచించారు. భారీ వాహనాలు జనుపెల్లి, నేదునూరు మీదుగా, బండారులంక అంబాజీపేటమీదుగా ముక్కామల వెళ్లాలన్నారు. -
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
చీకట్లతో వెతలు
● వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు ● ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి ● సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు అమలాపురం రూరల్: మండే వేసవి ఎండలకు తోడు వేళాపాళా లేకుండా విద్యుత్ శాఖ విధిస్తున్న కోతల వల్ల ప్రజలు అల్లాడి పోతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు పెరగడంతో జనం రాత్రి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు పెరిగిన విద్యుత్తు వినియోగం జిల్లాలో మే 20 తేదీ నుంచి 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో విద్యుత్ వాడకం భారీగా పెరిగిపోయింది. సాధారణంగా మే నెలలో విద్యుత్ వాడకం అధికంగా ఉంటుంది. 2025 మే 14న జిల్లాలో 5.656 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వాడారు. ఈ ఏడాది మే 25న రికార్లు స్థాయిలో 7.444 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వాడేశారు. జనం ఆగ్రహం ఇటీవల కామనగరువు మెట్ల సత్యనారాయణ కాలనీలో ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పోవడంతో కాలనీవాసులు ఽసబ్స్టేషన్ ముట్టడించి ధర్నా చేశారు. అమలాపురం రూరల్, అల్లవరం, పి.గన్నవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో సబ్ స్టేషన్లు వద్ద ధర్నాలు చేయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పొదుపు చర్యలు పాటించాలి అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ వాడకం పెరిగి ట్రాన్ప్ఫార్మర్ల తరచూ ట్రిప్ అవుతున్నాయి. దీనివల్లే విద్యుత్ అంతరాయాలు జరుగుతున్నాయి. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి. విద్యుత్ వచ్చిన వెంటనే ఏసీలు, గృహ పరికరాలు వెంటనే ఆన్ చేయకుండా అరగంట ఆగాలి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి తగ్గి విద్యుత్ అంతరాయాలు ఉండవు. – బి.రాజేశ్వరి, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ కాలిపోయిన 63 ట్రాన్స్ ఫార్మర్లు జిల్లా వ్యాప్తంగా 26 వేల ట్రాన్ఫార్మర్లు ఉండగా 63 కాలిపోయాయి. 28 గాలులకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానే కొత్తవి ఏర్పాటు చేశారు. వర్షాలు, ఈదురు గాలులు, తుపాన్, వరదల సమయంలో మాత్రమే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం అవుతూ ఉంటాయి. కాని తొలిసారిగా జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు విద్యుత్ వాడకం పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ నిలిచిపోయి కొంత సమయానికి వచ్చిన వెంటనే ఏసీలు, ఫ్యాన్లు కూలర్లు, మోటార్లు అందరూ ఒకేసారి ఆన్ చేయడం వల్ల ఓవర్ లోడ్కు ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నాయి. జిల్లాలో కొబ్బరి ఆకులు విద్యుత్ లైన్లపై పడి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామాల్లో వందలాది ఇన్స్లేటర్లు కాలిపోయి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. -
జూనియర్ కాలేజీలకు వేసవి సెలవుల పొడిగింపు
అమలాపురం టౌన్: జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించారని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి (డీఐఈవో) కె.చంద్రశేఖర్బాబు తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. సెలవుల పొడిగింపుపై ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు ఇచ్చారన్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఆ తేదీని జూన్ 6కు మార్పు (వాయిదా) చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకూ జరుగుతున్న క్రమంలో ఈ మార్పు చేశారని స్పష్టం చేశారు. జూన్ 6వ తేదీన కళాశాలల పునఃప్రారంభానికి ఆయా ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. తొమ్మిది ప్రైవేట్ బస్సులపై కేసు రావులపాలెం: నిబంధనలను ఉల్లంఘించిన తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.22,800 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ ఈతకోట టోల్ ప్లాజా వద్ద 32 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారన్నారు. అతి వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, జ్యోతి, సురేష్ కుమార్, షణ్ముఖ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గంజాయితో జీవితాలు నాశనం
● ఎస్పీ రాహుల్ మీనా ● పాత నేరస్తులు, అనుమానితులు, రౌడీ షీటర్లకు అవగాహన అమలాపురం టౌన్: గంజాయి తాగడం వల్ల జీవితాలు నాశనమవుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. గంజాయి కేసుల్లో పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులైన 52 మందికి స్థానిక డీఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో శనివారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి తాగడాన్ని గుర్తించేందుకు కొత్తగా వచ్చిన డిటెక్షన్ కిట్లతో 52 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వారందరికీ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. మరోసారి పట్టుబడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక నుంచి అనుమానితులకు డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేస్తామని, పట్టుబడితే కేసులు, అరెస్ట్లతో పాటు డి అడిక్షన్ సెంటర్కు తరలిస్తామని తెలిపారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన పూర్తిగా మార్చుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దన్నారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం పట్టణం, రూరల్, ముమ్మిడివరం సర్కిళ్ల సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత కుమార్, మోహన్ కుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారుజామునే ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. వారందరూ గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భక్తులకు చల్లని మజ్జిగ, నీరు అందించడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లనుపర్యవేక్షించారు. -
చెరువు మట్టి స్వాహా!
తాళ్లపూడి: కూటమి ప్రజాప్రతినిధుల అండతో కొవ్వూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి మరీ చెరువులను గుల్ల చేస్తోంది. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని కృష్ణమ్మ చెరువును టార్గెట్ చేసిన మట్టి మాఫియా మూడు రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. స్థానిక టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా మొత్తం సాగుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. జలసిరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని రైతుల పేరుతో పొక్లెయిన్లు, జేసీబీలతో భారీ స్థాయిలో చెరువు గర్భాన్ని తవ్వేసి ట్రాక్టర్లు, లారీలతో దూర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో పూడికతీత పనులకు పరిమితులు, అనుమతులు ఉండాలి. కానీ, ఇక్కడ అవేమీ పట్టనట్లు మాఫియాయే అధికారులుగా, పరిశీలకులుగా వ్యవహరిస్తూ వందలాది ట్రాక్టర్లు, లారీలతో మట్టిని యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.1,500కు, లారీ మట్టిని ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయిస్తూ నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారమంతా అమాత్యులదేనంటూ ఆ ప్రాంతానికి అధికారులు రాకుండా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కళ్ల ముందే ఇంత భారీ ఎత్తున మట్టి దందా సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కృష్ణమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గజ్జరం కృష్ణమ్మ చెరువులో చెలరేగిన మాఫియా టీడీపీ నాయకుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు భారీ యంత్రాలతో 3 రోజులుగా దందా ట్రాక్టర్ మట్టి రూ.1,500,లారీ ఐదారు వేలకు విక్రయాలు -
50 శాతం గ్యాస్ను రాష్ట్రానికే వినియోగించాలి
అమలాపురం టౌన్: కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే సహజ వాయువు (గ్యాస్)ను 50 శాతం మేర రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తూ జన విజ్ఞాన వేదిక (జేవీవీ) అమలాపురంలో శనివారం సాయంత్రం ర్యాలీ చేపట్టింది. జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు జనుపల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర జేవీవీ నాయకులు మురళీధర్, గిరిధర్, జి.ఈశ్వరరావు, జీఎస్హెచ్పీ వర్మ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కారెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని గ్యాస్ కోసం నినాదాలు చేశారు. కూచిమంచి అగ్రహారంలోని యూటీఎఫ్ హోమ్ నుంచి మొదలైన ర్యాలీ బ్యాంక్ స్ట్రీట్ మీదుగా గడియారం స్తంభం సెంటర్కు చేరుకుంది. కాలుష్యం వల్ల నష్టపోతున్న మత్స్యకారులు, సన్నకారు రైతులకు జీవన భద్రత కల్పించాలని, కొబ్బరి చెట్లు, స్థానిక పంటల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆక్వా చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలని, తీర ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. -
రత్నగిరిపై కరెంటు కష్టాలు
● సబ్ స్టేషన్ ఉన్నా తప్పని ఇబ్బంది ● లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు ● కాలిపోతున్న మోటార్లు ● భక్తులకు ఇక్కట్లు అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇవీ సమస్యలు ● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్ చేయడంతో లిఫ్టు పని చేసింది. -
నేడూ విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
అమలాపురం రూరల్: జిల్లాలో అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అదే విధంగా సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు కూడా పనిచేస్తాయన్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు. ఎకరాకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం అమలాపురం రూరల్: 216 జాతీయ రహదారి వెంబడి విద్యుత్ టవర్లు ఎత్తు పెంచి పునర్నిర్మించడానికి భూములు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వ ధర కంటే 200 శాతం పరిహారం పెంచి ఎకరాకు రూ.కోటి చొప్పున (సెంటు భూమి ఖరీదుగా నిర్ణయించి) ఇవ్వనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి తెలిపారు. ఆమె అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, జాతీయ రహదారులు, ట్రాన్స్కో అధికారులు, భూములు ఇచ్చిన యజమానులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 216 జాతీయ రహదారి వెంబడి రాజోలు, మామిడికుదురు మండలాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను పునర్నిర్మించేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. జేవీవీ శిక్షణ తరగతులు ప్రారంభం అమలాపురం టౌన్: అమలాపురంలోని యూటీఎఫ్ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర స్థాయి తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 38 ఏళ్లుగా జేవీవీ అనేక సేవలు, కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శిక్షణకు మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు జనుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ తరగతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన 150 మందికి పైగా ప్రతినిధులకు జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వర ప్రసాద్ స్వాగతం పలికారు. జిల్లా గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జేవీవీ లక్ష్యాలను, ఇప్పటి వరకూ నిర్వహించిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను వివరించారు. అనంతరం ‘శాసీ్త్రయ సమాజ నిర్మాణ కోసం జేవీవీలో భాగస్వామ్యం కండి’ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పవన్ వైఖరి ప్రచారార్భాటమే.. రాజమహేంద్రవరం సిటీ: పేపర్ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్కు అర్థం కాలేదన్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ శృంగవరంలో ఘటన రౌతులపూడి: మండలంలోని రౌతులపూడి – కత్తిపూడి ఆర్అండ్బీ రహదారిలో శృంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శృంగవరానికి చెందిన యలమంచిలి అమ్మాజీ, యలమంచిలి చక్రవేణి గుడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రోడ్డుపైకి వెళ్లారు. అదే సమయంలో కత్తిపూడి వైపు నల్ల కంకరరాయి లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై ఉన్న వీరిని ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో అమ్మాజీ (52) మృతి చెందింది. చక్రవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వెంకటేశ్వరరావు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతి వేగంతో అదుపు తప్పిన కారు
ఫ కంటైనర్ను ఢీకొన్న వైనం ఫ ముగ్గురికి తీవ్ర గాయాలు దేవరపల్లి: అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి, డివైడర్ను దాటి ఓ కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గు రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండుగొలను – కొవ్వూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద శనివారం అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కాగా.. కారు ఢీకొనడంతో కంటైనర్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ వంతెన గోడను ఢీకొని ఆగింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కాగా.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పి.మనోహర్ తెలిపారు. -
కూరగాయలకు ఎండ దెబ్బ
ఆలమూరు: ఈ వేసవిలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల తోటలతో పాటు వాణిజ్య పంటలైన అరటి, మొక్కజొన్న, కందలపై పడింది. మొక్కలు ఎండిపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. అలాగే ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడంతో పాటు దిగుబడి బాగా తగ్గిపోయింది. జిల్లాలోని 19 మండలాల్లో 1.23 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా, వాటిలో 4,805 ఎకరాల్లో కూరగాయాల తోటలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ ఉదయం, సాయంత్రం తోటలకు సాగునీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి పాటిస్తే మేలు. ఫ పొలంలో ఎండిన గడ్డి, వరి గడ్డి, ప్లాస్టిక్ మల్చింగ్ వేయాలి. దీని వల్ల నేలలో తేమ ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. ఫ షేడ్ నెట్ను 35 నుంచి 50 శాతం మధ్య ఏర్పాటు చేస్తే అధిక ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుతుంది. ఫ మొక్కల చుట్టూ కలుపును తొలగించాలి. ఎండ తీవ్రత లేని సమయంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. ఫ పొటాషియం నైట్రేట్ (కేఎన్ఓ3) ఒక శాతం లేదా 13:00:45 ద్రావణాన్ని పిచికారీ చేస్తే చక్కని ఫలితాలు ఆశించవచ్చు. ఫ నిర్ణీత సమయంలో పొటాష్ ఇవ్వడం వల్ల మొక్కలకు ఉష్ణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఫ వేసవి తీవ్రతతో టమాటా, మిర్చి, బెండ, దోసకాయ, కాకర వంటి పంటల్లో పుష్పాలు రాలే అవకాశం ఉన్నందున తోటల్లో తేమను స్థిరంగా ఉంచాలి. తీగ జాతి రకాలు లాభదాయకం వేసవిలో తరచూ పెరిగే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా కూరగాయల సాగులో ఉద్యాన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలను ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. వేసవిలో అనుకూలమైన తీగజాతి రకాలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – డీవీ రమణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఫ తోటలకు సక్రమంగా అందని నీరు ఫ నాణ్యత, దిగుబడి తగ్గిపోయిన వైనం పందిరి సాగు లాభదాయకం వేసవిలో పందిరి సాగు మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీగ జాతి కూరగాయలైన దోస, బీర, కాకర, సొర, దొండ, పొట్లకాయ వంటి రకాలను సాగు చేస్తే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఇవి నేలను తాకకుండా ఎండ వేడిమి నుంచి రక్షణ పొందుతాయని, అలాగే పూల తోటల్లో కూడా తీగ జాతి మొక్కలు సాగు చేస్తే చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు. -
వెలి ఘటనపై తహసీల్దార్ విచారణ
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పాత కోరంగికి సంబంధించిన వెలి ఘటనపై శనివారం తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు టేకుమూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామపెద్దలు తమ కుటుంబానికి రూ.లక్ష జరిమానా విధించి, వెలివేశారని తెలిపాడు. గత మూడేళ్లుగా తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయాడు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని, తాను పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారన్నాడు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నాడు. దీంతో గత ఏడాది అక్టోబర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. కాగా.. సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని, రెండు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ను గ్రామ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తహసీల్దార్ హెచ్చరించారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీడీఓ కె.సత్యనారాయణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దొంగల భయంతో యువకుల గస్తీ
తుని రూరల్: ఎస్.అన్నవరం శివారు శేషాద్రి నగర్ కాలనీలో ఇటీవల తరచూ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, పంపనబోయిన రాజబాబు (చంటి) ఆధ్వర్యంలో 15 మంది యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో కర్రలతో వీధుల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే విధంగా కాపలా ఉంటున్నట్టు కనకాల వీరభద్రరావు, తేనే లోవరాజు, నడిమింటి ఎల్లంనాయుడు, దుంగ దారబాబు, పోలిశెట్టి చందు తదితరులు తెలిపారు. కొందరు దైవదర్శనాలకు, శుభకార్యాలకు రెండు, మూడు రోజులు ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కొత్తపల్లి: మోటారు సైకిల్పై వస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురం – పాత ఇసుకపల్లి రహదారిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ముగ్గురు యువకులు మైటారు సైకిల్పై అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనపాపపేట, మూలపేట, పాత ఇసుకపల్లి మీదుగా పిఠాపురం వస్తుండగా ప్రమాదవశాత్తు పాత ఇసుకపల్లి శివారు ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో సాఖా సాయిరాం (16) మృతి చెందగా, గాయపడిన ఇద్దరు యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్ లక్ష్మణా..
ఫ నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచిన యువకుడు ఫ రూ.20 లక్షల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న మహిళ ఫ భద్రంగా అందజేసిన వైనం కపిలేశ్వరపురం (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిదకి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నా రు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామా ల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసు లు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
రక్తహీనత ఉన్న విద్యార్థినికి అబార్షనా?
● విచారణలో వెలుగు చూస్తున్న ఉమెన్ కేర్ ఆస్పత్రి తప్పిదాలు ● నిందితులపై పోలీస్ కేసులు పెట్టలేదని ఎస్పీకి ప్రజా సంఘాల ఫిర్యాదు ● వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అమలాపురం టౌన్: రక్తహీనత (హిమోగ్లోబిన్) 12 గ్రాములు ఉండాల్సిన విద్యార్థినికి కేవలం 6.8 గ్రాములు ఉండగా ఆమెకు అబార్షిన్ ఎలా చేశారని విచారణాధికారులు వైద్యులను ప్రశ్నిస్తున్నారు. అమలాపురం నల్లవంతెన సమీపంలో గల వుమెన్ కేర్ అండ్ జనరల్ ఆస్పత్రిలో ఓ బాలికకు అబార్షన్ చేసిన వైద్యులను విచారణాధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు వారి నుంచి సమాధానాలు కరవయ్యాయి. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ శిరీషను బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగ మానస, డీఎంహెచ్వో డాక్టర్ దుర్గారావు దొర వేర్వేరుగా విచారించినప్పుడు రక్తహీనత ఉన్న విద్యార్థినికి మీరెలా అబార్షన్ చేశారని పదే పదే అడిగారు. రక్త హీనతకే తాము వైద్యం చేశామని, అబార్షన్కు కాదని ఆస్పత్రి వైద్యులు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలైన విద్యార్థినిని, వారి తల్లిదండ్రులను విచారణాధికారులు అడిగినప్పుడు అబార్షన్ చేశారని చెప్పడం గమార్హం. గర్భం పోవడానికి ముందుగా రెండు టాబ్లెట్లు ఇచ్చారని, అవి వేసుకున్నప్పటి నుంచి తనకు విపరీతమైన నొప్పి వస్తోందని బాధితురాలు గగ్గోలు పెట్టింది. రాజకీయ అండ ప్రభావం చూపుతోందా? ఈ దారుణ ఘటనపై కలెక్టర్ మహేష్కుమార్ విచారణ కమిటీని నియమించి ఆస్పత్రి వైద్యులు, బాధితురాలు, వారి కుటుంబీకులను విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అనుచరుడొకరు ఈ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పాడని బాధితుల మాటలను బట్టి తెలుస్తోంది. విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులకు గర్భం దాల్చిన బాలికను అమలాపురం తీసుకుని వెళ్లి అబార్షన్ చేయించమని చెప్పింది అతడే. పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలికి అబార్షన్ చేయాలని సూచించిందీ అతడే. అమలాపురంలోని ఆ వైద్యురాలికి చెందిన ప్రైవేటు ఆస్పత్రిలో విద్యార్థిని చేర్చి, అబార్షన్ చేయించే ఏర్పాట్లు చేయించిందీ అతడే. బాధ్యులపై ఇప్పటి వరకూ కేసులు నమోదు కాకపోవడానికి, పి.గన్నవరం ప్రభుత్వ, అమలాపురం ప్రైవేటు ఆస్పత్రి వైద్యురాలిపై ఇప్పటి వరకూ చర్యలు చేపట్టకపోవడానికి రాజకీయ అండదండలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల నిరసన, ఎస్పీకి ఫిర్యాదు : ఇప్పటికే పలు ప్రజా సంఘాల ప్రతినిధులు అమలాపురంలోని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి ఆమెకు అండగా నిలిచారు. బాధ్యులపై పోక్సో కేసులు నమోదు చేయాలని, ఆస్పత్రి వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరపతిరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు తదితరులు ఇవే డిమాండ్లపై ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు ఎస్పీ కార్యాలయానికి శుక్రవారం వెళ్లి ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో బాలికకు అబార్షన్ చేసిన ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపైన, అడ్డదారిలో వైద్యం చేసిన వైద్యాధికారిణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో గాని, నగరం (మామిడికుదురు మండలం) పోలీస్ స్టేషన్లో గాని బాధ్యులపై కేసులు నమోదు కాలేదని వారు ఎస్పీకి వివరించారు. -
దగా డీఎస్సీపై ధ్వజం
● వైఎస్సార్ సీపీ విద్యార్థి పోరు కార్యక్రమంలో అర్ధనగ్న ప్రదర్శన ● అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత అమలాపురం రూరల్: విద్యార్థులను మెగా డీఎస్సీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి పోరు కార్యక్రమంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం అందించారు. వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్, ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెల్ల రమేష్ ఆధ్వర్యంలో అమలాపురం మండలం జనుపల్లి మన్నా కాలనీ వద్ద అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం విన్నూతంగా నిరసన తెలిపారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శిరీష్ మాట్లాడుతూ మెరిట్ లిస్టులు బయట పెట్టకుండా, బయట వారికి పోస్టులు అమ్ముకోవడం చాలా దారుణం అని అన్నారు. ఎవరైతే పరీక్ష పత్రాలు తయారు చేశారో వారిని ఎందుకు విధుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. హఠాత్తుగా మెగా డీఎస్సీకి సంబంధించిన ఉన్నత అధికారిని ఎందుకు బదిలీ చేశారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెరిట్లో సెలెక్ట్ అయిన వారికి న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తామని అన్నారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘాల ఉపాధ్యక్షుడు పందిరిపల్లి అమర్కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు బడుగు మోహన్, దొమ్మేటి అర్జున్, లీలా ప్రసాద్, కరుణ సాయి, మాదిరెడ్డి లోవరాజు, రైనా, గుత్తాల రాజమోహన్, నియోజకవర్గం విద్యార్థి సంఘాల నాయకులు గంటి ఆకాష్, గొల్లపల్లి రాజశేఖర్, గంటా వీరేష్, మట్ట నాని, మండల విద్యార్థి సంఘాల నాయకులు ఉండ్రు వినోద్, రాష్ట్ర నాయకులు మందశెట్టి ప్రసాద్ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. -
టీడీపీ కార్యకర్తల అనుచిత ప్రవర్తనపై ఎస్పీకి ఫిర్యాదు
అమలాపురం టౌన్: ఇళ్ల మధ్య ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న టీడీపీ కార్యకర్తలపై రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన వంద మందికి పైగా జనం ఎస్పీ రాహుల్ మీనాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఎంపీ హరీష్ మాధూర్ అనుచరుడనని చెప్పుకునే సాయి సూర్య అనుచరులు ఇళ్ల మధ్య ప్రజలు ఇబ్బంది పడే రీతిలో ప్రవర్తిస్తూ, తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి వల్ల ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట అమలాపురంలో ఎంపీ హరీష్ మాథూర్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజులను స్వయంగా కలిసి సాయి సూర్య అనుచరుల దౌర్జన్యాల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్తులు వివరించారు. పదోన్నతి పొందిన ప్రసాద్కు ఎస్పీ అభినందన అమలాపురం టౌన్: నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ను ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. ఆయన అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ప్రసాద్కు ఎస్పీ కార్యాలయంలో శుక్ర వారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. ఏఎస్పీ ప్రసాద్ను ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అభినందించారు. ఎస్పీ– సంపర్క్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఎస్పీ రాహుల్ మీనా ఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్లో నిర్వహించిన ‘ఎస్పీ– సంపర్క్’ కార్యక్రమంలో పాల్గొని తమ సాధక బాధలు వివరించారు. బాధ్యతలు స్వీకరించిన మల్లాడి యానాం: ప్రభుత్వం కేటాయించిన చాంబర్లో మంత్రి హోదాలో మల్లాడి కృష్ణారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సీఎం రంగసామి, మంత్రి నమశ్శివాయం, పలువురు ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరై చాంబర్లో జరిగిన వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన పూజాకార్యక్రమాల్లో పాల్గొని మల్లాడి కృష్ణారావును దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీ హాలులో గతంలో రెవెన్యూ, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించిన చాంబర్లోనే ఆయన మళ్లీ మంత్రి హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారి మునిస్వామి, అమన్శర్మ పాల్గొన్నారు. -
అనే నేను
వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తరువాత వారి బతుకుల్ని ఏవిధంగా బాగు చేయాలో తెలుసుకునేందుకు.. 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేసి.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున.. అంటే 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించారు. కోవిడ్ వంటి మహావిపత్తు ముంచుకొచ్చినా.. తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చూశారు. కారణాలేవైనా.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు జగన్ అందించిన సంక్షేమ పాలనకు దూరమయ్యామనే ఆవేదన రెండేళ్లుగా జనానికి తప్పడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై విసిగి వేసారుతున్న ప్రజలు మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని, ‘జగన్ అనే నేను’ మాటను మరోసారి వినాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్త పుంతలు తొక్కిందనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. సంక్షేమ సిరులు ● అప్పటి వరకూ రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను ఇచ్చిన మాట మేరకు రూ.2.250కి పెంచుతూ నాడు జగన్ తొలి సంతకం చేశారు. ఆ తరువాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరానికి పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేశారు. 2019 మే 30 నాటికి ఉమ్మడి జిల్లాలో 5,81,827 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. జగన్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరింది. ● 2019కి ముందు టీడీపీ పాలనలో రేషన్ కార్డు కోసం అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జగన్ పాలనలో అరగంటలోనే రేషన్ కార్డు మంజూరు చేసి అందించడం ఓ సెన్సేషన్. ● ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిపుష్టం చేసి, ఈ పథకం పరిమితిని తొలుత రూ.5 లక్షలకు, ఆపై ఏకంగా రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అంతేకాదు.. ఏకంగా 3,200కు పైగా ప్రొసీజర్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ● వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. ● వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. ● జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలు అమలు చేశారు. ప్రభుత్వ బడుల్లో ట్యాబులు, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి వాటికి శ్రీకారం చుట్టారు. ● వైఎస్సార్ ఆసరా, చేయూత, డ్వాక్రా మహిళల రుణమాఫీ (ఆసరా), 45–60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ఏటా ఆర్థిక సాయం అందించారు. ఓసీ మహిళలకు కూడా దీనిని వర్తింపజేశారు. ● వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించారు. అంతేకాదు.. ప్రకృతి విపత్తులు సంభవించి, పంట నష్టం వాటిల్లితే సీజన్ దాటకుండానే పరిహారం అందించడం ఓ రికార్డు. ● పేదల సొంతింటి కలను నిజం చేసేలా అక్కచెల్లెమ్మల పేరిట వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించడమే కాదు.. ఇళ్ల నిర్మాణానికి సైతం సాయం అందించారు. జగనన్న కాలనీల పేరిట ఏకంగా ఊళ్లే నిర్మించారు. ప్రజల వద్దకే పాలన ఉమ్మడి జిల్లాలో 2019 నాటికి 779 క్లస్టర్ల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండేవి. కానీ, 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులుండేవారు. 230 క్లస్టర్ల పరిధిలో కార్యదర్శుల కొరత ఉండటంతో ఆ ప్రభావం ప్రభుత్వ సేవలపై పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక పరిపాలనను ప్రజల చెంతకే చేర్చేలా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న కాకినాడ జిల్లా కరపలో శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలోను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా 11 మంది ఉద్యోగులను నియమించి, దేశ విదేశాలకు సైతం ఆదర్శంగా నిలిచే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలకు నాంది పలికారు. అంతే కాదు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ను ప్రజల ఆమోదంతో నియమించి, సచివాలయ వ్యస్థకు అనుసంధానం చేశారు. దీంతో, ప్రజలకు 500కు పైగా ప్రభుత్వ సేవలు వారి ముంగిటనే ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభంగా అందేవి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా పునర్వ్యవస్థీకరించారు. కరపలో పైలాన్ ఆవిష్కరించి, సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’ అంటూ సరిగ్గా ఇదే రోజు జననేత జగన్ చేసిన ప్రమాణం.. నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో నవశకాన్ని లిఖించింది. ఆ శుభదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. ప్రజల ముంగిటకు చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. అవ్వాతాతలకు బిడ్డలా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిలా.. పిల్లలకు మేనమామలా.. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో భరోసానిచ్చారు. ఇంటివద్దకే పింఛన్లు, రేషన్ సరకులు.. అమ్మ ఒడి.. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతు భరోసా వంటి వినూత్న పథకాలతో పేదలకు చేయూతనిచ్చారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచారు. తమ జీవితాలను మలుపు తిప్పిన ఆ రోజును ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు.అభివృద్ధి మెరుపులు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన బడి నాడు–నేడు పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఆధునీకరించిన పాఠశాలలను ఉమ్మడి జిల్లాలో పి.గన్నవరం మండలం పోతవరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అంకితం చేసి, రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల పిల్లలు సైతం డాక్టర్లు కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం, అమలాపురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం కళాశాలలో ఇప్పటికే బోధన ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నల్లజర్ల మండలంలో రూ.250 కోట్లతో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టారు. తద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు 1,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో బయో–ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి 2022 నవంబర్లో జగన్ భూమిపూజ చేశారు. తొండంగి మండలంలో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం జరగడానికి నాడు జగన్ దార్శనికతే కారణమని చెప్పాలి. మత్స్యకారుల కోసం సుమారు రూ.230 కోట్లతో ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. నేడు.. సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు నేడు.. అవధి లేని సంక్షేమానికి నాంది పడిన రోజు నేడు.. అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన రోజు నేడు.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు -
సుడిగాలి బీభత్సం
నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు రామచంద్రపురం రూరల్: మండలంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గాలి వానా మొదలై సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రామచంద్రపురం 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వెళ్లే 33 కేవీ ఫీడర్లపై సుడిగాలి ప్రభావం పడటంతో విద్యుత్ శాఖకు అపార నష్టం ఏర్పడింది. ద్రాక్షారామ సబ్ స్టేషన్ పరిధిలోని తాళ్లపొలం, ఆదివారపుపేట, జగన్నాయకులపాలెం, ద్రాక్షారామ గ్రామాల్లో 18కి పైగా విద్యుత్ స్తంభాలు, 6 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయని ఏపీఈపీడీసీఎల్ రామచంద్రపురం రూరల్ ఏఈ మేడిశెట్టి వెంకటరమణ తెలియజేశారు. పలు గ్రామాల్లో 12 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు. సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ద్రాక్షారామ – రామచంద్రపురం ప్రధాన రహదారిపై తాళ్లపొలం తదితర చోట్ల నేలకొరిగిన వృక్షాలు తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తన సిబ్బందితో తక్షణ చర్యలు చేపట్టారు. చెట్టు మీద పడి యువకుడికి తీవ్ర గాయాలు కొత్తపేట: మండల పరిధిలోని పలివెల – కొత్తపాలెం రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకునిపై చెట్టుకొమ్మలు పడి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు పలివెల వంతెన దిగువున కొత్తపాలెం వెళ్లే రోడ్డులో భారీ వృక్షం రోడ్డుపై కుప్పకూలింది. అదే సమయంలో కొత్తపాలెం గ్రామానికి చెందిన యయువకుడు కుడుపూడి వెంకటేష్బాబు చెట్టుకింద ఇరుక్కుపోయాడు. అతను తీవ్రంగా గాయపడగా, మోటార్బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వారు చెట్టుకొమ్మలు తొలగించి వెంకటేష్బాబును బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతనిని అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు స్థానికులు తెలిపారు. -
విద్యార్థినికి అబార్షన్పై డీఎంహెచ్వో విచారణ
● వైద్యానికి, కేస్ షీటులో రాసిన మందులకు పొంతన లేని వైనం ● ఘటనపై సమగ్ర నివేదిక కోరిన కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ భరతలక్ష్మి ఆ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థినికి అబార్షన్ చేసిన విధానం, కేస్ షీటు తదితర అంశాలను వారు పరిశీలించారు. అబార్షన్కు వాడిన మందులు, కేస్షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని వారి విచారణలో గుర్తించారు. తాము చేసిన విచారణ విషయాలను కలెక్టర్ మహేష్కుమార్కు వివరించారు. దీంతో ఆర్డీవో జి.మమ్మీ, డీఎంహెచ్వో డాక్టర్ దుర్గారావు దొర, ఐసీడీఎస్ పీవో కె.నాగమణి తదితర అధికారులతో ఓ కమిటీని కలెక్టర్ నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కమిటీని కలెక్టర్ ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎం హెచ్వో డాక్టర్ దుర్గారావు దొర తెలిపారు. మూతపడిన ఆస్పత్రి ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్వో ఆస్పత్రి వైద్యురాలు శిరీషను అదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్ అయి చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది. -
విద్యుత్ కోతలపై మహిళల నిరసన
● మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ● సబ్స్టేషన్ను ముట్టడించిన నాయకులు కాట్రేనికోన: విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో కాట్రేనికోన విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించిన మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మండల కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల వారు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు మండి పడ్డారు. మండలంలో విద్యుత్ లైన్లు 1996 తుపానుకు వేసినవి కావడంతో శివారు ప్రాంతాలలో పాడైపోయాయని, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ఓఎన్జీసీ (వేదాంత) సంస్థకు చెందిన భారీ వాహనాల రాకపోకల కోసం రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నల్లా నరసింహమూర్తి, యూత్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడు గంటి వెంకట సుధాకర్ అన్నారు. కరెంట్ లేక మహిళలు, వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాట్రేనికోన, ఉప్పూడి ఫీడర్ నుంచి వేట్లపాలెం, సత్తమ్మ చెట్టు, రాజానగరం, కాపులపాలెం, నాగపట్టణం, మర్రిచెట్టు కాలనీ, గచ్చకాయలపోర, చిర్రయానంలకు కరెంట్ కోత అధికంగా ఉండటంపై మండి పడ్డారు. సిబ్బంది అలసత్వంపై విద్యుత్ శాఖ ఎస్ఈ బి.రాజ రాజేశ్వరికి ఫోన్లో వివరించారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సంగాని మునేంద్ర, కముజు మల్లికార్జునరావు, రంబాల శ్రీను, నల్లా చిన్నాజీ, గిడ్ల శ్రీనివాసరావు, నీలం బాలయ్య పాల్గొన్నారు. -
రుణాల ఖాతాకు షేర్ ధనం
సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ డిమాండ్ అమలాపురం టౌన్: రూ.కోట్లలో నిల్వ ఉన్న షేర్ ధనాన్ని సహకార సంఘాల రుణాల ఖాతాకు జమ చేయాలని జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం డీసీసీబీని డిమాండ్ చేసింది. అమలాపురంలోని కళా వెంకట్రావు వ్యవసాయ సహకార సంఘ భవనంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశం సహకార ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు గుదిబండలా మారిన జీవో నంబర్ 322 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12 నుంచి సహకార ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలకు బదులు చెప్పకుండా చేస్తున్న సహాయ నిరాకరణ మరికొన్ని రోజులు కొనసాగించాలని సమావేశం తీర్మానం చేసింది. 2011 నుంచి ఆప్కాబ్ ద్వారా వచ్చిన 6 శాతం డివిడెండ్ను సంఘాలకు జమ చేయాలని, నెగిటివ్ క్లయిమ్స్ పేరుతో వసూలు చేస్తున్న వడ్డీ రాయితీని అప్పుల ఖాతాకు జమ చేయాలని కోరింది. ప్రస్తుతం సంఘాల నుంచి వసూలు చేస్తున్న 10 శాతం షేర్ ధనాన్ని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ రుణాలను పాత పద్ధతి డీసీసీబీ మంజూరు చేయాలని సమావేశం సూచించింది. నేతలు పెంకే సత్యనారాయణ, కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్, బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి ప్రసంగించారు. -
తీర్థ స్థలం మీదుగా విద్యుత్ లైన్..
అయినవిల్లిలో నిర్మించే సబ్ స్టేషన్కు కొత్తపేట మండలం మందపల్లి నుంచి అయినవిల్లి వరకు 400 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. ఇందుకు విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. ఆ టవర్ల నిర్మాణంలో భాగంగా మూడు మండలాలు, మూడు గ్రామాల కూడలి అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామ పంచాయితీ పరిధి (అవిడి డామ్ సెంటర్)లో ప్రతి సంవత్సరం జరిగే ప్రభల తీర్థ స్థలం మీదుగా ఆ విద్యుత్ లైన్ను మళ్లిస్తున్నారు. అక్కడ సుమారు 10 సెంట్ల స్థలంలో హై పవర్ విద్యుత్ టవర్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఆ శాఖ అధికారులు, డివిజన్, మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో చిరుతపూడి గ్రామ పంచాయతీలో ఆయా గ్రామాల ప్రజలతో గడచిన రెండు నెలల్లో నాలుగు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఆయా గ్రామాల ప్రజలు హై పవర్ ఎలక్ట్రికల్ లైన్ వల్ల ప్రాణాలకు ప్రమాదముందని, లైన్ వేయవద్దని అభ్యంతరం చెప్పారు. అనాదిగా హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న తీర్థానికి ఆటంకం కలగకుండా విద్యుత్ లైన్ వేరే ప్రాంతానికి మార్చుకోవాలని కోరారు. అయితే అధికారులు ఈ స్థలమే టవర్ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీర్థ స్థలానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ కమిటీలో నియామకాలు
అమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీసీ సెల్ కమిటీలో పలువురికి చోటు కల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా కామన కృష్ణమూర్తి (పి.గన్నవరం) మిడా హరిబాబు (ముమ్మిడివరం), యనమదల నాగేశ్వరరావు (కొత్తపేట), జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శులుగా దండుమేను రూపేష్ (అమలాపురం) చెల్లుబోయిన బుచ్చయ్య (రాజోలు), చింతా నాగ మునీంద్రరావు (ముమ్మిడివరం) కోటని గణేశ్వరరావు (రామచంద్రపురం) వీరమల్లు శ్రీనివాస్(మండపేట) నియమితులయ్యారు. జిల్లా బీసీ సెల్ కార్యదర్శులుగా బెజవాడ సూరిబాబు (కొత్తపేట), కొల్లు రాంబాబు, బొంతు శ్రీనివాస్ (పి.గన్నవరం), మట్టా శ్రీనివాస యాదవ్ (కొత్తపేట) గుత్తుల శ్రీనివాస్ (రామచంద్రపురం), కంచి వెంకట రమణ, తిరుమను నరసింహస్వామి (రాజోలు), వాసంశెట్టి శ్రీనివాసరావు(మండపేట), ఇనుమర్తి లింగమూర్తి, సోమనాథపల్లి కుమారస్వామి(అమలాపురం), కాముజు రామ సుబ్రహ్మణ్యం, కొరసిక వెంకట సత్యనారాయణ (ముమ్మిడివరం)లను నియమించారు. వీరేశ్వరస్వామి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఐ.పోలవరం: మురమళ్లలో కొలువైన శ్రీభద్రకాళీ వీరేశ్వరస్వామివారిని గురువారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పి.సుధ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అర్చకులు యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. వేద ఆశీర్వచనం గావించారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, పర్యవేక్షణాధికారి కఠారి శ్రీనివాసరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత!కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. మిల్లులోని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి లాకౌట్ ఎత్తివేసినట్లు పర్మినెంట్ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. -
భక్తుల మనోభావాలకు షాక్ ఇస్తారా?
● ప్రభల తీర్థం స్థలంలో విద్యుత్ టవర్ నిర్మాణం తగదు ● ప్రజాప్రతినిధులకు, అధికారులకు మూడు మండలాల ప్రజల వినతి కొత్తపేట: రెండు నియోజకవర్గాలు, మూడు మండలాల ప్రధాన కూడలి. ఏటా కనుమ పండగ నాడు ప్రభల సభా స్థలి.. వేలాదిగా భక్తులు తరలివచ్చి తిలకించే తీర్థ స్థలి. అదే కొత్తపేట మండలం అవిడి డామ్ సెంటర్ సమీపాన అంబాజీపేట మండలం చిరతపూడి పంచాయతీ పరిధిలో గల ప్రభల తీర్థ స్థలం. ఆ స్థలంలో హై పవర్ లైన్ విద్యుత్ టవర్ నిర్మిస్తారట.. ఇంకెక్కడా స్థలం లేనట్టు ఈ ప్రభల తీర్థ స్థలమే కనిపించిందా? ఇక్కడ టవర్ నిర్మిస్తే వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఎక్కడ నిర్వహించాలి? అని ప్రభల ఉత్సవ కమిటీలు, భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం అవిడి, మోడేకుర్రు, రాకుర్తివారిపాలెం, పి.గన్నవరం నియోజక వర్గ పరిధిలోని అంబాజీపేట మండలం చిరుతపూడి, పి.గన్నవరం మండలం నరేంద్రపురం, కుందాలపల్లి, పప్పులవారిపాలెం గ్రామాల ప్రజలు సోమవారం అమలాపురంలో పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ప్రసిద్ధి చెందిన ప్రభల తీర్థం.. చిరుతపూడి గ్రామ పరిధిలోని ఒక రైతుకు చెందిన 1.09 ఎకరాల వరి పంట పొలంలో ప్రతి సంవత్సరం. కనుమ పండగ రోజున ప్రభల తీర్థం సుమారు 450 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ తీర్థానికి అవిడి, మోడేకుర్రు, రాకుర్తివారిపాలెం, గొల్లకోటివారిపాలెం, చిరుతపూడి, కుందాలపల్లి, పప్పులవారిపాలెం, నరేంద్రపురం గ్రామాల్లోని శివాలయాల ప్రభలను తీసుకొస్తారు. వీటితో పాటు ప్రతి శివారు గ్రామం నుంచి సుమారు ఒక్కొక్కటి 40 నుంచి 60 అడుగుల ఎత్తులో ఉండే సుమారు 25 ప్రభలను ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులు తమ భుజాలపై మోసుకొంటూ రోడ్డు, కాలువలు, తోటలు, వరి చేలను దాటుకుంటూ చిరుతపూడి గ్రామం తీర్థ స్థలానికి తీసుకువస్తారు. అక్కడ ఆ రోజు రాత్రి తీర్థం జరుగుతుంది. ఆయా మండలాల నుంచే కాక జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జిల్లాలోని సంక్రాంతి ప్రభల తీర్థాల్లో మకర సంక్రాంతి నాడు జరిగే కొత్తపేట, కనుమ రోజు జరిగే జగ్గన్నతోట, చిరతపూడి ప్రభల తీర్థాలకు చరిత్ర ఉంది. -
ఈడీ దాడులకు నిరసనగా సీపీఎం ధర్నా
అమలాపురం టౌన్: కేరళం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ అమలాపురంలో జిల్లా సీపీఎం శాఖ గురువారం సాయంత్రం ధర్నా చేసింది. గడియారం స్తంభం సెంటరులో జిల్లా పార్టీ కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రంలో బీజేపీ, నరేంద్రమోదీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు, లొంగ దీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ధర్నాలో పార్టీ నాయకులు సీహెచ్. సూర్యప్రకాశరావు, సఖిలే సూర్యనారాయణ, పీతల రామచంద్రరావు, జి.దుర్గాప్రసాద్, ఇసుకపట్ల మంగాదేవి పాల్గొన్నారు. -
420 చంద్రబాబుపై యుద్ధం చేస్తున్నాం
అంబాజీపేట: రాష్ట్రంలో మోసకారి, 420 అయిన చంద్రబాబుపై యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబాజీపేటలో ఏవీఆర్, వైఎస్సార్ కల్యాణ మండపంలో కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగిన బీఎల్ఏల నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మహానాడు పేరుతో మీటింగ్లు పెడితే జనాలు వచ్చి ఛీ కొడతారనే భయంతో కేవలం డీజిల్ సాకు చూపిస్తూ అక్కడక్కడ యూనిట్లు, క్లస్టర్ల మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని విమర్శిచారు. ఇచ్చిన హామీలను నిలబెట్టు కోలేదు కాబట్టే కార్యకర్తలు, ప్రజలు వచ్చి నిలదీస్తారనే భయపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పవిత్రమైన దేవాలయాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. గుడిలో కార్యక్రమాలు పెట్టి మహానాడు జరుపుకునే దుర్మార్గపు ఆలోచన చేయడం సిగ్గు చేటన్నారు. ఆక్వా రంగం మొదలు మొక్కజొన్న వరకు ప్రతీ ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలను మానుకోకపోతే రాబోయే పుష్కరాల్లో ముంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పుష్కరాలకు సంబంధించి చేస్తున్న పనులన్నీ అవినీతి మయమేనన్నారు. డీఎస్సీని అవినీతి మయం చేసి లోకేష్ సూట్ కేసులు నింపుకున్నారన్నారు. లోకేష్కు సిగ్గుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్ సైకిల్పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. మద్యం మానుకోమన్నందుకు కుమారుడి ఆత్మహత్య తుని: మద్యం అలవాటు మానుకోవాలని తండ్రి చెప్పిన మాటలకు మనస్తాపం చెందిన కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కథనం ప్రకారం. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు పెద్దిరాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు పులుగు అనిల్కుమార్ (25) లారీ డ్రైవర్. వీరు ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం అలవాటు ఉన్న అనిల్కుమార్ను తండ్రి పెద్దిరాజు మద్యం తాగడం మానేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పాడు. దీంతో అనిల్కుమార్ బుధవారం రాత్రి మోటారు సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రావికంపాడు – అన్నవరం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నవరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ త్రినాథరావు తెలిపారు. 3న కాకినాడలో క్రికెట్ జట్టు ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 3న కాకినాడ ఆర్ఎంసీ మైదానంలో జిల్లా క్రికెట్ క్రీడాకారిణుల ఎంపికలు జరుగుతాయని సంఘ కార్యదర్శి నక్కా వెంకటేష్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు సీనియర్ మహిళలు, అండర్–23, 19, 15 బాలికల విభాగాల్లో ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల వారు అర్హత ధ్రువపత్రాలు, క్రికెట్ డ్రస్, షూతో హాజరుకావాలని ఆయన కోరారు. బావిలో పడిన అప్పన్నెద్దు బయటకు తీసిన స్థానికులు తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంతన ప్రమాదవశాత్తూ అప్పన్నెద్దు బావిలో పడింది. ఇరుకుగా ఉన్న బావిలో పడడంతో సుమారు రెండు గంటలకుపైగా అప్పన్నెద్దు నరకయాతన అనుభవించింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని చాలాసేపు తాళ్లతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో స్థానిక కాంట్రాక్టరు మంథా కృష్ణమూర్తి (నాని) జేసీబీని తీసుకువచ్చి బావికి సమాంతరంగా తవ్వారు. తరువాత బావి వరను పగులగొట్టి అప్పనెద్దును జాగ్రత్తగా బయటకు లాగారు. మానవత్వంతో అప్పన్నెద్దును బయటకు తీసి కాపాడిన వారందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఆన్లైన్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఆన్లైన్ సేవలను మనమిత్ర వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గురువారం ఆలయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే అర్చకులు, వేద పండితుల బృందం సభ్యులు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ ఆవరణలో సామూహిక అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి తొలి హారతి, సుప్రభాత సేవ, వేంకటేశ్వర సహిత లక్ష్మీ హోమం జరిపారు. వడగాడ్పుల నేపథ్యంలో ఆలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
నేడు, రేపు డీఎస్ఏలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురు, శుక్రవారాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను ఎల్ఈడీ స్క్రీన్స్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త గురువారం తెలిపారు. స్థానిక కృషీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫ్యాన్ పార్స్క్ను నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులకు ఫ్యాన్ పార్కు ఒక పెద్ద పండుగ లాంటిదన్నారు. స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు తమ నగరంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తుందన్నారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, చిల్ట్రన్స్ గేమ్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు ద్వారకాతిరుమల: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసి, పిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే. మండలంలోని దేవినేనివారిగూడేనికి చెందిన కావేరికి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, రేమెల్ల గ్రామానికి చెందిన కొనకాల ఉమామహేశ్వరరావుతో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో కావేరి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. 5 లక్షలు, 30 సెంట్ల భూమి, బంగారు ఆభరణాలను ఇచ్చారు. మద్యానికి అలవాటుపడిన భర్త తనను చిత్రహింసలు పెట్టడంతో పాటు, అదనపు కట్నం కోసం అతని తల్లిదండ్రులు కొనకాల సావిత్రి, దుర్గారావులు వేధిస్తున్నారని కావేరి పేర్కొంది. గతేడాది జూన్ 8న తనను కొట్టి, పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు కావేరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
పట్టపగలే సంచోరిస్తూ..
● అదును చూసి దొంగతనాలు ● నిందితుడిని పట్టుకున్న సర్పవరం పోలీసులు కాకినాడ రూరల్: పట్టపగలే దొరలా వస్తాడు.. అదును చూసి దోచుకుపోతాడు.. ఇలా కొన్నేళ్లుగా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2024, 2025, 2026లో ఆరు పగటి పూట చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితుడు కాకినాడ అర్బన్ రేచర్లపేట బర్మాకాలనీకి చెందిన ములపర్తి దుర్గాప్రసాద్ (నాని) అనే ప్రసాద్ను సర్పవరం పోలీసులు ఆర్టీఓ కార్యాలయం రోడ్డులోని కోటయ్య కన్వెన్షన్ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.32 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడతుండగా పోలీసులకు మాత్రం చిక్కడం ఇదే మొదటి సారి అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేయరాదని, ఇళ్లకు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) అనే పోలీస్ అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాప్లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉచిత పోలీసు సర్వీస్ను ఉపయోగించుకుని, నేరాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏసుబాబు, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధరల్లో ఊరగాయాలు
● చుక్కల్లో మామిడి ధర ● ఆవకాయ రుచికి దూరం ● భారీగా పెరిగిన ముడిసరకు ● నిల్వ పచ్చళ్ల తయారీపై ప్రభావం ఆలమూరు: ఘుమఘుమల సమ్మేళనం ఆవకాయ గొప్పదనం.. మామిడి కాయలు, గుంటూరు కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు, పప్పు నూనె కలిపి తయారు చేసే ఆవకాయకు అమృతపు రుచి వస్తోంది.. వేసవిలో ప్రతి ఇంటా ఈ తయారీ మొదలవుతుంది. తెలుగువారి నోట ఆవకాయ ముద్ద పడందే తృప్తి ఉండదు. దేశాలు దాటినా ఆవకాయ వాసన మాత్రం తెలుగువారిని తనవైపు లాక్కుంటుంది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్లు తెలుగువారి సంస్కృతిలో ఒదిగిపోయిన ఈ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఆ అనుభూతి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల ప్రతి ఒక్కరి మదిలో ఈ రుచి పెనవేసుకుంది. నోరూరించే ఈ ఊరగాయలను తయారు చేసుకోవడం పెను భారమైంది. వంద మామిడి కాయలు కొనుగోలు చేస్తే సుమారు ఐదు కుంచాల ముక్కలు అవుతాయి. ఒక్కో కుంచం పచ్చడికి రూ.నాలుగు వేల వరకూ ఖర్చు అవుతుంది. వందకాయల ఆవకాయ పచ్చడి పెడితే దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం అన్నిచోట్ల పచ్చళ్ల సీజన్ ఊపందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, వేరుశెనగ, గానుగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరకు కొరత అధికమైంది. ఈ ప్రభావం పచ్చళ్ల తయారీపై పడింది. తగ్గిన వ్యాపారం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో, రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ, తుని, మండపేటలోని తదితర హోల్సేల్ మార్కెట్లో పచ్చడికి ఉపయోగించే మామిడికాయల ఽవ్యాపారం ఈ ఏడాది తగ్గిపోయింది. ఆ మార్కెట్లకు ప్రతి రోజూ నూజివీడు, కత్తిపూడి, జగ్గంపేట తదితర చాగల్నాడు, మెట్ట ప్రాంతాల నుంచి పచ్చళ్ల తయారీకి వినియోగించే మామిడి రకాలు గతంలో వందల టన్నుల్లో రాగా, ప్రస్తుతం పదుల సంఖ్యలోకి పడిపోయింది. గ్రామీణ ప్రాంత వ్యాపారులు అక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న మామిడికాయలను పరిసర ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మామిడికాయ రకాన్ని బట్టి ధర నిర్ణయించ బడుతుంది. ఎంతో ఇష్టంగా.. ఆవకాయ, మాగాయ, ఉల్లి ఆవకాయ తదితర పచ్చళ్లు అంటే అందరూ ఇష్టపడతారు. తొలి ఏడాది అత్తవారింటికి కోడలు తప్పనిసరిగా పచ్చళ్లు కావడి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చళ్ల కావళ్లు స్థోమతను బట్టి ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం పెళ్లింట కూడా పడింది. పెళ్లిళ్లలో ఇటీవల తరచూ ఆవకాయ అన్నం, ఆవకాయ ఫ్రైడ్రైస్, ఆవకాయ పులిహోర, ఆవకాయ బిర్యానీ వంటి వంటకాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగింటి లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆవకాయను వడ్డించకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ ఆవకాయ తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతోంది. పచ్చళ్ల తయారీలో ఉపయోగించే ముడిసరకుల ధరలు ఇలా సరకులు గత ఏడాది ఈ ఏడాది కిలో ధర కిలో ధర అవకాయ కారం 400 650 మాగాయ కారం 310 550 గానుగ నూనె 380 450 వేరుశెనగ నూనె 180 270 ఆవాలు 150 220 మెంతులు 120 170 వెల్లుల్లి 200 250 ఉప్పు 12 20 పరిమితంగానే తయారీ పెరిగిన మామిడికాయ, ముడి సరకుల ధరతో ఊరగాయ పెట్టడం పెనుభారంగా మారింది. దీనివల్ల పరిమితంగానే ఆవకాయ, మాగాయి పచ్చళ్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది వరకూ ఈ పచ్చళ్లు సరిపోవు. మార్కెట్ ముడి సరకుల ధరలు ఎప్పుడూ ఇంతలా పెరగలేదు. –పి.శివకల్యాణి, నార్కెడిమిల్లి, ఆత్రేయపురం మండలం -
ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వినియోగం
● అంతరాయాల నివారణకు కంట్రోల్ రూమ్లు ● విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్ సాక్షి, పాడేరు: కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), పోలవరం జిల్లా పరిధిలో 73825 85554, 94906 10027 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. -
అందుబాటులోకి శాశ్వత క్యూ కాంప్లెక్స్
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో పెద్ద తిరుపతిలో మాత్రమే ఉన్న శాశ్వత క్యూ కాంప్లెక్స్ను.. ఇప్పుడు చిన్నతిరుపతిలో నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో రూ.12.50 కోట్లతో నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా నూతన అనివెట్టి మండపంలో ఈఓ త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పెద్ద తిరుపతిలో మినహా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ శాశ్వత క్యూ కాంప్లెక్స్ లేదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ క్యూ కాంప్లెక్స్ను నిర్మించామన్నారు. ట్రైల్ రన్ వేసిన తరువాతే ఈ క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించినట్టు చెప్పారు. గతంలో నిర్మించిన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ 3 వేల మంది భక్తులకు సరిపోయేదని, ఈ శాశ్వత క్యూ కాంప్లెక్స్లో ఒకేసారి 4,500 మంది భక్తులు కూర్చోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు నిరంతరాయంగా మంచినీటిని అందిస్తున్నామన్నారు. భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరిగి బయటకు వెళ్లి, అక్కడ ఉచిత ప్రసాదాన్ని అందుకుంటున్నారని అన్నారు. శాస్త్రబద్ధంగానే ఏర్పాట్లు.. నూతన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర కట్టడాలు, దర్శన ఏర్పాట్లు పూర్వ ఆచారాలు, సనాతన సంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. స్వామివారిని ఎదురుగా దర్శించుకోవాలన్న కోరికను గతంలో భక్తులు తన వద్ద వ్యక్తపరిచారని ఇప్పుడు అది సాకారమైందని తెలిపారు. ఈఓ వేండ్ర త్రినాథరావు -
కాల్వష్యం పట్టదా?
● ఇక్కడి చెత్త తొలగించకపోతే... అక్కడ పూడిక తీత పనులు నిరుపయోగం ● కాల్వ గట్టుపై వేసిన మట్టి గుట్టలను తొలగించకపోతే మళ్లీ కాలువలోకే.. అమలాపురం టౌన్: ప్రస్తుత కాల్వల క్లోజర్ సమయంలో అమలాపురం ప్రధాన పంట కాల్వలో చెత్త, పూడికల తీత పరంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల కాల్వలు కలుషితం అవుతున్నాయి. ఇందులో అమలాపురం మున్సిపాలిటీ నిర్లక్ష్యం కూడా ఉంది. పట్టణ పరిధిలోని కాల్వలో తక్షణమే చేపట్టాల్సిన పనులు లేకపోవడం కూడా శాపంగా మారింది. అమలాపురం ప్రధాన పంట కాల్వ పట్టణం మీదుగా ప్రవహిస్తుంది. నల్లవంతెన – ఎర్ర వంతెన మధ్య దాదాపు కిలోమీటరు మేర ప్రవహిస్తున్న ఈ పంట కాల్వ అసలు రంగు ప్రస్తుత క్లోజర్ సమయంలో బయటపడింది. కాల్వలో దాగి ఉన్న చెత్త గుట్టలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదే పంట కాల్వలో ప్రవహించే గోదావరి జలాలను అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం మండలాల్లో తాగునీటి ప్రాజెక్టులకు వినియోగిస్తారు. పంట కాల్వలో పేరుకు పోయిన చెత్తను కనీసం కాల్వ క్లోజర్ సమయంలోనైనా తొలగించాలని అమలాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం అమలాపురం పట్టణ పరిధిలోనైనా కాల్వలోని చెత్త గుట్టలను తొలగించాలని మున్సిపాలిటీని కోరుతున్నారు. ఇదే సమయంలో పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి నల్ల వంతెన వరకూ పంట కాల్వ గట్టు చెంత ఎక్కడ నుంచో తరలించిన మట్టి గుట్టలను వరసగా ఉంచారు. ఈ గుట్టలను తక్షణమే తొలగించకపోతే అదే మట్టి గాలికో, వర్షాలకో మళ్లీ కాల్వలోకి జారి పోయి మరింత పూడుకుపోతుంది. మున్సిపాలిటీ ఈ మట్టి గుట్టలను కాల్వ గట్టు నుంచి తొలగించకపోవడంతో బుధవారం ఉదయం కురిసిన వర్షానికి మట్టి కొంచెం కరిగి మళ్లీ కాల్వలోకి జారింది. ఇదే ప్రధాన పంట కాల్వలో చల్లపల్లి వద్ద ఇప్పటికే జేసీబీతో మట్టి పూడికతీత పనులు జరుగుతున్నాయి. అమలాపురంలోని నల్లవంతెన – ఎర్ర వంతెన మధ్య కాల్వలో పేరుకు పోయిన చెత్తను తొలగించకుండా చల్లపల్లి కాల్వలో పూడికతీత పనులు చేసినా నిరుపయోగమే. కాల్వకు నీరు వదిలిన తర్వాత అమలాపురం కాల్వలోని చెత్త కొట్టుకు వచ్చి పూడిక తీసిన ప్రదేశాల్లో పడి సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అమలాపురం పంట కాల్వలోని పేరుకు పోయిన చెత్తను, శ్మశానం నుంచి నల్లవంతెన వరకూ కాల్వ గట్టు మీద వేసిన మట్టి గుట్టలను మున్సిపాలిటీ తక్షణమే తొలగించాలి. లేదంటే క్లోజర్ సమయంలో ఇరిగేషన్ శాఖ చేపట్టిన పనులన్నీ వృథా అవుతాయి. -
బాలురే డ్రైవర్లు!
● మట్టి మాఫియా మాయాజాలం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం పి.మల్లవరం పంచాయతీ రాంజీనగర్ రహదారిలో మట్టి ట్రాక్టర్ నడుపుతున్న బాలుడుపి.మల్లవరంలో జేసీబీని ఆపరేట్ చేస్తూ ట్రాక్టర్లో మట్టిని వేస్తున్న బాలుడుతాళ్లరేవు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు.. మట్టిని తరలిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు దొరక్క బాలురతో ట్రాక్టర్లను నడిపించేస్తున్నారు. ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ట్రాక్టర్లతోపాటు భారీ వాహనాలైన జేసీబీలను కూడా పట్టుమని పదేళ్లయినా నిండని పిల్లలతో డ్రైవింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం పి.మల్లవరం పంచాయతీ పెదపేటలో మట్టిని ట్రాక్టర్లతో తరలించారు. ఆ మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపే జేసీబీ డ్రైవర్ ఒక బాలుడు కావడం గమనార్హం. 14 ఏళ్ల లోపు ఉండే ఆ బాలుడు ప్రమాదకర రీతిలో జేసీబీని ఆపరేట్ చేయడాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. సాధారణంగా 18 ఏళ్లు దాటితేనే తప్ప టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయరు. అలాంటిది 14 ఏళ్ల లోపు బాలుడు జేబీసీని ఆపరేట్ చేయడం గమనార్హం. మట్టి ట్రాక్టర్లను కూడా లైసెన్స్లేని బాలురు నడుపుతున్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాలని, బాలురు వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
వ్యర్థంతో అర్థం
ఐ.పోలవరం: వ్యవసాయ వ్యర్థాలను అర్థవంతంగా వినియోగిస్తే మేలైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. వ్యవసాయ ఆధారిత కోనసీమ జిల్లాలో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువే అని చెప్పాలి. కొబ్బరి డొక్కతో తప్ప మిగిలిన వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ఇటువంటి వాటితో మహిళా స్వయం శక్తి సంఘాలు, రైతు సంఘాలు, నిరుద్యోగ యువతతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తూడు, గుర్రపుడెక్కతో.. గోదావరి డెల్టా రైతులను కడగండ్లు పాల్జేసే తూడు, గుర్రపు డెక్కతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇది వ్యవసాయ వ్యర్థం కాకున్నా జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన అవరోధంగా మారిన విషయం తెలిసిందే. తూడు, గుర్రపు డెక్క ఇటు రైతులను, అటు ఇరిగేషన్ అధికారులను దశాబ్దాల కాలం పాటు ముప్పుతిప్పలు పెడుతున్న కలుపు మొక్కలు. కాలువల్లో టన్నుల కొద్దీ లభిస్తోంది. వీటి వల్ల జరుగుతున్న నష్టం భరించలేక రైతులు ఏటా ఐదు వేల ఎకరాల్లో వరిసాగునే వదిలేందుకు సిద్ధమవుతున్నారు. గోదావరి డెల్టా పరిధిలో పంట కాలువలు, మురుగునీటి కాలువల్లో పేరుకుపోతున్న వీటిని తొలగించేందుకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ● గుర్రపుడెక్కతో తయారు చేసే కంపోస్టులో పోషకాలు మెండు. కుళ్లిన గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తే దానిలో సేంద్రియ కర్భనం 60 శాతం, సల్వమోతాదులో నత్రజని 2.5 శాతం, భాస్వరం 1.8 శాతం, పొటాషియం 4 శాతం ఉంటుంది. వీటితోపాటు మాలిడియన్, మెగ్నీషియం వంటి అరుదైన పోషకాలు ఉంటాయి. ఇది కొబ్బరి పొట్టుతో సమానంగా నీటి నిల్వను చేసి మొక్కకు అందజేస్తోంది. వరి చేలల్లో మిగిలిన పోషకాలు డ్రెయిన్లలో వెళ్లిన తరువాత గుర్రపుడెక్క ఎక్కువగా స్వీకరిస్తోంది. కంపోస్టుగా తయారు చేసి వినియోగిస్తే చేలల్లో నష్టపోయిన పోషకాలు చెట్లకు అందుతాయి. పంచాయతీలలో నిర్మించిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. రైతు సంఘాలు, మహిళా స్వయం శక్తి సంఘాలతో వీటిని ఉత్పత్తి చేయవచ్చు. ● గుర్రపు డెక్క నార తీసి చేతి సంచులు, బుట్టలు, ఇతర గృహోపకర అలంకార వస్తువులు తయారు చేసే అవకాశముంది. కృష్ణ, గుంటూరు జిల్లాలో డ్వాక్రా సంఘాలు వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాయి. ఇటువంటి వాటిని ఇక్కడ కూడా స్వయం శక్తి సంఘాల ద్వారా తయారు చేయించే అవకాశముంది. గుర్రపు డెక్క కంపోస్టుమురుగునీటి కాలువలో గుర్రపుడెక్క వ్యవసాయ వ్యర్థాలను సొమ్ము చేసుకోవచ్చు గుర్రపు డెక్క, తూడుతో సేంద్రియ ఎరువు నారతో అలంకరణ వస్తువులు అరటి నార, పోక ఆకులతో పలు ఉత్పత్తులు అరటి బొందలతో.. జిల్లాలో అరటి 15వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున సాగవుతున్న విషయం తెలిసిందే. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతోపాటు రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం మండలాల్లో ఈ సాగు అధికం. అరటి గెలల సేకరణ తరువాత బొందలు, ఆకులను రైతులు వదిలేస్తున్నారు. వీటిని వినియోగించి సేంద్రియ ఎరువు తయారు చేయడంతోపాటు అరటి ఆకుల ఆహారాన్ని వడ్డించే కంచాలు, ప్లేటులుగా తయారు చేయవచ్చు. అరటి బొందల నుంచి నారను సేకరించి వీటితో కూడా గృహోపకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. జిల్లాలో గతంలో అరటి నారతో ఉత్పత్తుల తయారీకి పలు ప్రయోగాలు జరిగినా ఫలితం ఇవ్వలేదు. అంబాజీపేట మండలం ముక్కామల, రావులపాలెంలో ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లేకుండా ఉంది. -
వక్క (పోక) ఆకులతో..
వక్క చెట్టు (పోక చెట్టు)జిల్లాలో 200 ఎకరాలు సాగు అవుతుండగా ఆకులను రైతులు వ్యర్థాలుగా వదిలేస్తున్నారు. వీటిని సేంద్రియ ఎరువుగా తయారు చేయడంతోపాటు రకాల వస్తువులను తయారు చేస్తే రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశముంది. దళసరిగా, బలంగా ఉండే ఈ ఆకుతో ఆహారం తినే ప్లేట్లు, బౌల్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైంది. వీటిని వాడటం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని నివారించే అవకాశముంది. ఈ ఆకులతో తయారు చేసిన ప్లేట్లలో రసాయనాలు ఉండవు. వేడి ఆహారాన్ని కూడా ఈ ఆకుల ప్లేట్లలో వడ్డించడం ఆరోగ్యానికి సురక్షితం. వక్క ఆకులతో పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు, గిన్నెలు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే అనకాపల్లి వంటి జిల్లాలో ఇటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కాని జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో వక్క సాగు జరుగుతున్నా ఇటువంటి పరిశ్రమలను మాత్రం ఏర్పాటు చేయలేదు. -
జగన్ కలిసిన జగ్గిరెడ్డి
రావులపాలెం: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రావులపాలెం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొవ్వూరి సూర్యనారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీశైలం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని వారు జగన్కు అందజేశారు. ముస్లింలకు జగ్గిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు కొత్తపేట: ముస్లిం సోదర, సోదరీ మణులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంగ్లిషు పరీక్ష వాయిదా ముమ్మిడివరం: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను బక్రీద్ పండగ సెలవు కారణంగా వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్స్కూలు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు కూడా వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు. 17 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం సఖినేటిపల్లి: మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో మంగళవారం రాత్రి వీచిన పెనుగాలులకు, పిడుగుల ప్రభావానికి వివిధ గ్రామాల్లో 17 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్టు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.ప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 11 కేవీ ఇన్సులేటర్లు చాలాచోట్ల ధ్వంసం అయినట్టు పేర్కొన్నారు. రెండు మండలాల్లో కొబ్బరి చెట్లు విరిగి పడి 14 విద్యుత్ పోల్స్ దెబ్బతిన్నాయన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 48 గంటలు పడుతుందన్నారు. ఇసుక లారీలపై 47 కేసులు అమలాపురం రూరల్: ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ నెలలో ఇసుక లారీలపై 47 కేసులు నమోదు చేసి రూ.2.80 లక్షల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసిన రవాణా వాహనాలు బస్సులు, లారీలు, క్యాబ్లకు వీఎల్టీడీ (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్) పరికరం అమర్చుకోవాలని, ఇది వాహన యజమానుల బాధ్యత అని డీటీవో తెలిపారు. ఏఎస్పీ ప్రసాద్కు ఎస్పీగా పదోన్నతి అమలాపురం టౌన్: ఏఎస్పీగా పనిచేస్తున్న ఏవీఆర్పీబీ ప్రసాద్కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనకు నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. పదోన్నతితో ఆయనకు ఈ జిల్లా నుంచి బదిలీ అనివార్యమైంది. ఎస్పీ పదోన్నతి లభించిన ఏఎస్పీ ప్రసాద్ను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్డర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈయన నాలుగైదు రోజుల్లో జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు. ప్రసాద్ ఏఎస్పీగా 2024 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ను ఎస్పీ రాహుల్ మీనాతోపాటు ఎస్పీ కార్యాలయం సీఐలు, ఎస్సైలు అభినందించారు. వేగంగా రీ–సర్వే అమలాపురం రూరల్: రీ–సర్వే ప్రగతిని నిరంతరం ఆన్లైన్ చేయాలని, డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని జేసీ నిడియాదేవి తహసీల్దారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో తహసీల్దారులతో సమావేశం నిర్వహించి రీ సర్వే పురోగతిపై సమీక్షించారు. -
వేంకటేశ్వర ఆలయంలో చోరీ
సామర్లకోట: మండల పరిధి అచ్చంపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రా చోరీ జరిగింది. స్వామివారికి నివేదన అనంతరం అర్చకుడు కృష్ణమాచార్యులు ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు రాగా తెలుపులు తెరచి ఉన్నాయి. దీంతో స్వామివారి ఆభరణాలు పరిశీలించి చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్, వేలిముద్ర నిపుణులు ఆలయానికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆలయ తాళాన్ని నకిలీ తాళంతో తెరిచినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, ఈఓ ప్రతాప్కుమార్ ఆలయానికి చేరుకుని స్వామి, దేవేరులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మూడు కిలోల వెండి, మూడు కాసులు బంగారు ఆభరణాలు చోరీ జరిగిన్నట్లు అర్చకుడు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలకు బీమా చేయించినట్టు తెలిసింది. ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాతో ఫుటేజీ స్టోర్ అయ్యే హార్డ్డిస్క్ సైతం చోరీకి గురైనట్టు గుర్తించారు. దీంతో ఆలయానికి సంబంధించిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామంలోని సెల్ షాపులో చోరీ జరిగి 24 గంటలు గడువక ముందే ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ -
విద్యుదాఘాతంతో గడ్డి టెక్కీల దగ్ధం
అనపర్తి: విద్యుత్ తీగ తెగిపడి ఎండు గడ్డి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 1200 ఎండు గడ్డి టెక్కీలు దగ్ధమైనట్టు బాధిత రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ లైన్కు సంబంధించిన తీగ తెగి రోడ్డు పక్కన నిల్వ ఉంచిన గడ్డి టెక్కీలపై పడడంతో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వీటిలో కొర్ల శ్రీనివాస్కు చెందిన ఐదు వందల టెక్కీలు, మందనక్క సత్యనారాయణకు చెందిన 300, కోరాడ రాఘవ 180, మహిపాల చంద్రరావుకు చెందిన 190 టెక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అమ్మమ్మను హత్య చేసిన మనవడికి యావజ్జీవ జైలు తొండంగి: దురలవాట్లకు బానిసైన మనుమడు మద్యం మత్తులో డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన కేసులో మనుమడికి యావజ్జీవ శిక్ష పడిందని సీఐ చెన్నకేశవరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దానవాయిపేట పంచాయతీ నర్శిపేటకు చెందిన బెనుగు దీనమ్మ (75)ను మనుమడు గోసల జాన్ 2025 జూలై 12న మద్యం మత్తులో డబ్బులు ఇవ్వాలని గొడవపడి హత్య చేశాడు. ఈ ఘటనపై దీనమ్మ కుమార్తె, జాన్ తల్లి గోసల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిఠాపురం ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జాన్కు జడ్డి పి.భాస్కరరావు యావజ్జీవ శిక్ష విధించారన్నారు. -
శబరిలో మునిగి మహిళ మృతి
చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్టెల్ టవర్ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి.. నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుకు గురై..రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోక్సో కేసు నమోదు దేవరపల్లి: నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్ కుమార్పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు. బాలుడి అక్రమ రవాణాకు చెక్ ● కిడ్నాప్కు గురైన పశ్చిమబెంగాల్ బాలుడు ● రక్షించి తండ్రికి అప్పగించిన అధికారులు కాకినాడ క్రైం: పశ్చిమ బెంగాల్లో అక్రమ రవాణాకు గురైన 16 ఏళ్ల బాలుడ్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సిబ్బంది, తుని రైల్వే పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే, ఓ గుర్తు తెలియని యువకుడు బాలుడికి మాయమాటలు చెప్పి ఈ నెల 24న పశ్చిమబెంగాల్లో రైలు ఎక్కించాడు. రైలు రాష్ట్రం సరిహద్దులు దాటే సరికి బాలుడికి భయం మొదలైంది. 25న ఆంధ్రప్రదేశ్లో తుని రైల్వేస్టేషన్కి చేరేసరికి రైలులో సాధారణ తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బాలుడి అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించి వివరాలు ఆరా తీశారు. ఈ లోగా బాలుడిని తీసుకువచ్చిన యువకుడు పరారయ్యాడు. బాలుడి విషయాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారి చదలవాడ వెంకట్రావుకు తెలియజేశారు. ఆయన జిల్లా పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, బాలుడి చిరునామాను గుర్తించి తండ్రి హరిద్దీన్ను పిలిపించి అప్పగించారు. -
బతుకు పోరులో మృత్యువేట
● ఆటోను లారీ ఢీకొని ఇద్దరి మృతి ● ఘటన స్థలంలో మహిళ.. ఆస్పత్రిలో ఆటో డ్రైవరు.. ● మరో ఐదుగురు మహిళలకు గాయాలు సామర్లకోట/కొత్తపల్లి: స్థానిక కాకినాడ రోడ్డులోని ఐదు తూముల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉప్పాడ శివారు కొత్తపేటకు చెందిన ఆరుగురు మత్స్యకార మహిళలు, రామిశెట్టిపేటకు చెందిన ఎరిపల్లి ప్రేమకుమార్ (38) ఆటోలో ఉదయం మట్లపాలెంలో చేపలు కొనుక్కుని అక్కడి నుంచి సామర్లకోటలో విక్రయించేందుకు వస్తున్నారు. వారి ఆటోను తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట మీదుగా కాకినాడ వెళుతున్న లారీ ఐదు తూముల వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో గంపల చిట్టెమ్మ (35) అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన వారంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అడపా గరగారావు క్షతగాత్రులను ఆటోలో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమకుమార్ మృతి చెందాడు. కాగా గరికిన సింహాద్రి, రామిశెట్టి నాగమణి, వెరిపల్లి చిట్టెమ్మ, మేకల పోరిమేరీ, దొడ్డి సత్యవతి చికిత్స పొందుతున్నారు. వీరిలో గరికిన సింహద్రి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిట్టెమ్మ మృతదేహాన్ని పెద్దాపురం సీహెచ్సీకి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఉప్పాడలో విషాదఛాయలు ఈ ప్రమాదంలో ఇద్దరు ఉప్పాడ వాసులు మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ ప్రేమకుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతడికి భార్య, కవల కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి మృతితో వారితో పాటు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా చిట్టెమ్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. చేపలు విక్రయంతో వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు కుమార్తెలకు వారు వివాహాలు చేశారు. కొంతకాలంగా చేపల వ్యాపారం మానేసిన ఆమె ఇటీవల 15 రోజులుగా వ్యాపారానికి వెళ్తోంది. ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. -
ఐపీఎల్ ఫీవర్!
పల్లెల్లో సైతం అదే క్రేజ్ క్రికెట్కు పల్లెల్లో సైతం క్రేజ్కు తక్కువేమీ లేదు. చిన్న పిల్లలు సైతం బ్యాట్, బాల్, మూడు నాలుగు కర్రముక్కలు పట్టుకుని మైదానాల బాట పడుతున్నారు. పగటి పూట మైదానంలో సాధన.. రాత్రి పూట టీవీల్లో ఐపీఎల్ వీక్షణగా సాగుతున్నాయి పల్లె యువత వేసవి సెలవులు. క్రీడల ప్రోత్సాహానికి చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – ముత్యాల పవన్ కిశోర్, పీడీ, జెడ్పీ ఉన్నత పాఠశాల, ముక్కామల ● పగలు సాధన.. రాత్రి వీక్షణ.. ● పల్లెల్లో సందడి చేస్తున్న యువత ● ఉత్సాహంగా వేసవి సెలవులు కొత్తపేట: కళ్లు చెదిరే ఫోర్లు.. ఆకాశాన్నంటే సిక్సులు.. మిరుమిట్లు గొలిపే లేజర్ షో.. చీర్ గళ్స్ చిందులు.. ప్రపంచ క్రికెట్లో మేటి ఆటగాళ్ల ఏకై క వేదిక ఐపీఎల్. ప్రపంచంలో ఏ క్రీడకూ లేని క్రేజ్ క్రికెట్ సొంతం. ఐపీఎల్ 19వ సీజన్ చివరి అంకానికి చేరింది. అభిమాన జట్ల విజయాలు.. అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభకు ఈలలు, చప్పట్లు, అరుపులు కేకలతో మజాను ఆస్వాదిస్తున్నారు. వేసవి సెలవుల్లో.. పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభమైంది. అన్నీ కలిసొచ్చాయి. క్రికెట్ కిట్లు తీశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానాల్లో టీమ్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్లు. రాత్రి ఇళ్లలో ఐపీఎల్ మ్యాచ్ల సందడి. -
● వెనుక చూపేదీ?
ప్రయాణమేదైనా లక్ష్యం వెనకున్నవారి శ్రేయస్సు కోసమే. ఆ ప్రయాణమే ప్రమాదకరంగా ఉంటే.. ఆ లక్ష్యానికి అర్ధం లేదు. ఇదిగో ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. ఎన్నో కుటుంబాలు వారి రాకకోసమో.. క్షేమంగా చేరారన్న సమాచారం కోసమో వారిళ్లలో ఎదురు చూస్తుంటారు. అనుకోని ఘటనలో జరగరానిది జరిగితే వారిపై ఆధారపడి ఉన్నవారి జీవితాలు తలకిందులేగా..! ఎవరి జీవితాలను వారు తేలిగ్గా తీసుకుని ఇలా ప్రయాణాలు చేస్తుంటే అధికారులు సదస్సులు, అవగాహనలు పెట్టి ఏం లాభం? మండల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే హైవేలో నిత్యం చిన్నో పెద్దో ప్రమాదాలు మామూలే. వాహన చోదకులకు కాదు.. ప్రయాణికులకు ‘వెనుక’ చూపు ఎంతో అవసరం. – గండేపల్లి -
పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ
● ఆర్జేడీ నాగమణి ● డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ రాజమహేంద్రవరం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్ అడాప్ట్ లెర్నింగ్ (పాల్ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్ సమన్వయకర్త కిశోర్ బాబు, సీమాట్ సీనియర్ లెక్చరర్ ఎస్.ప్రసాద్, సమగ్ర శిక్ష సీనియర్ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలన
అల్లవరం: మండలంలోని ఓడలరేవు, కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని అల్లవరం తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావును ఆదేశించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖల అధికారులు సంయుక్తంగా సోమవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. సర్వే నెంబర్లు 1037, 1033 పొలాల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేసినట్లుగా అధికారులు నివేదిక ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. నేటికి ఓడలరేవులో టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు రెవెన్యూ అధికారులు కనుసన్నలో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ వెంట ఎస్సై సంపత్కుమార్, వీఆర్ఓ సతీష్ పాల్గొన్నారు. -
ఇటు భయం
బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026ఫ అటు అభయం ఫ జిల్లాలో అత్యంత బలహీనంగా ఏటిగట్లు ఫ వర్షా కాలంలో వరద వస్తే భయం ఫ మరమ్మతులకు పట్టించుకోని చంద్రబాబు సర్కారు ఫ పశ్చిమ గోదావరి జిల్లా వైపు పనులు చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఫ మన వైపు పటిష్ట పనులను విస్మరించిన పాలకులు మలికిపురం: జిల్లాలోని ఏటిగట్లు అత్యంత బలహీనంగా మారాయి. వీటి మరమ్మతులకు చంద్రబాబు సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా వైపు మంత్రి నిమ్మల రామానాయుడు ఇలాకాలో మాత్రం జోరుగా పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వర్షాలు ప్రారంభమవుతాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ముందుకు దూకుతుంది. ఆ సమయంలో లంక గ్రామాలతో పాటు ఏటిగట్టుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. గోదావరి ఉమ్మడి జిల్లాలో మూడు ప్రధాన పాయలుగా విడిపోయి యానాం, ఓడల రేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పాయలకు కుడి ఎడమ వైపున సుమారు 420 కిలోమీటర్ల మేర ఏటిగట్లను నిర్మించారు. ధవళేశ్వరం ఆనకట్లను నిర్మించిన సమయంలో వేసిన ఈ ఏటిగట్లు అనంతరం బలహీన పడ్డాయి. ఇలా గత 20 ఇళ్లలో గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఆ ఏటిగట్లకు పలుచోట్ల గండ్లు పడి, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పొంచి ఉన్న ప్రమాదం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటిగట్లు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాకాలంలో గోదావరికి వరద వచ్చినప్పుడు ప్రమాదం పొంచి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వరదల తీవ్రత అంతగా ఉండదని చెబుతున్నారు కానీ, ప్రాజెక్టు నిండితే మిగుల జలాలు సముద్రంలోనికి వదలడం ఖాయం. ఇప్పటికే ఏటా 600 టీఎంసీలకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో వరదలను తట్టుకునే సామర్థ్యం ప్రస్తుతం ఏటిగట్లకు లేదని అధికారులు అంచనా. వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా, రెండేళ్లుగా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. గతంలో వివిధ ఘటనలు ఫ 1946లో వశిష్ట కుడి గట్టుకు మలికిపురం మండలం రామరాజులంక ఏటిగట్టుకు గండి పడింది. ఆ ప్రాంతానికి గండి పేటగా పేరు వచ్చింది. రాజోలు దీవి మొత్తం మునిగి పోయింది. ఫ 1986లో పి.గన్నవరం మండలం మొండెపు లంక వద్ద ఏటిగట్టుకు గండి పడి సుమారు 30 గ్రామాలు జలమయమయ్యాయి. ఫ 1986లోవశిష్ట కుడిగట్టుకు సిద్ధాంతం కింద పెదమల్లంలో గండి పడింది. అప్పట్లో పాలకొల్లు, నర్సాపురం పట్టణాలతో పాటు సుమారు 70 గ్రామాలు జలమయమయ్యాయి. ఇంకా పలు చోట్లు గండ్లు పడినట్లు లెక్కలు చెబుతున్నారు. ఫ 2006లో పి.గన్నవరం పైన ఏటిగట్టుకు గండి పడి చాలా గ్రామాలు జలమయమయ్యాయి. పశ్చిమలో పనులు చకచకా ఏటిగట్లకు సంబంధించి పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో పటిష్ట పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ అత్యంత బలహీనంగా ఉన్న కోనసీమ జిల్లాలో మాత్రం అసలు పనులే ప్రారంభించలేదు. ఇరిగేషన్శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ఏటిగట్ల పనులు జోరుగా జరుగుతున్నాయి. గోగన్నమఠంలో ప్రమాదకరంగా ఉన్న వైనతేయ నది కుడిగట్టుమంత్రి నిమ్మల ఇలాకాలో దిండి అవతలి వైపు ఉన్న చించినాడలో వశిష్ట నది కుడి గట్టు పనులు రెండుసార్లే మరమ్మతులు గోదావరి పాయల కుడి, ఎడమ గట్లకు గతంలో రెండు సార్లు మాత్రమే పటిష్ట పనులు చేపట్టినట్లు రైతు నాయకులు చెబుతున్నారు. 1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభించి 1852లో పూర్తి చేశారు. అనంతరం 1961లో స్వల్ప కాలిక పటిష్ట పనులు చేపట్టారు. 2007 తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 శాతం పటిష్ట పనులు పూర్తి చేశారు. ఆయన మరణాంతరం పనులను అర్థాంతరంగా ఆపేశారు. -
జూలై నెలాఖరులోపు వరి నాట్లు
● జూన్ 1న సాగునీరు విడుదల ● స్వల్పకాలిక వరి వంగడాలే మేలు ● జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తూర్పు డెల్టా రైతులు జూలై నెలాఖరులోపు వరినాట్లు పూర్తి చేసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ సూచన నేపథ్యంలో నేరుగా విత్తే విధానం వద్దని, స్వల్పకాలిక వరి వంగడాల సాగే చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రైతులకు సూచించారు. ఖరీఫ్ 2026 సీజన్లో కాకినాడ జిల్లాలో అన్ని సాగునీటి వ్యవస్థల కింద మొత్తం 3,70, 354 ఎకరాల పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తొలుత గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ జి.శ్రీనివాస్ జిల్లాలో వివిధ వ్యవస్థల కింద ఖరీఫ్ సాగుకు అందుబాటులో ఉండే నీటి నిల్వల వివరాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించిన సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా కింద జూన్ 1 నుంచే సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏలేరు, పంపా రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోనూ, పుష్కర లిఫ్ట్, తాండవ ప్రాజెక్టుల ద్వారా జూలై రెండో వారంలోను, వర్షాలు ప్రారంభమయ్యాక సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆగస్టు రెండవ వారంలోను నీటిని విడుదల చేసేందుకు షెడ్యూల్ రూపొందించామన్నారు. జిల్లాలో గోదావరి తూర్పు డెల్డా కింద కాలువ శివారున ఉన్న పెదపూడి, సామర్లకోట, కాకినాడ రూరల్, అర్బన్, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు జూన్ మొదటి వారానికి నీరు చేరనున్న నేపథ్యంలో జూన్ 10 నుంచి నెలాఖరులోపు నారుమళ్లు ముగించి, జాలై నెలాఖరు నాటికి వరినాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సేకరించని 1156, 1153, 1010, సీఆర్ 126 రకాల వంగడాలను సాగు చేయవద్దని సూచించారు. తక్కువ కాలపరిమితి గల వరి రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీ ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్గా కాకినాడ జిల్లాను ఎంపిక చేశారని, ’అగ్రి స్టాక్’ ద్వారా ఆన్లైన్ యూరియా కేటాయింపులను చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా గృహాల గణన పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: జాతీయ జనగణన ప్రక్రియలో అత్యంత కీలకమైన గృహాల గణనను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమరావతి నుంచి ఏపీ జనగణన నోడల్ అధికారి ప్రత్యేక కమిషనర్ ఎస్ఎస్ రావత్, జనగణన డైరెక్టర్ జె.నివాస్ మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు చొరవ చూపి నిర్దేశిత కాలవ్యవధి నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ సేవల్లో అసత్వం వహించొద్దని ఆదేశించారు. జిల్లాలో నాన్ రెసిడెంట్ కేరళీస్ ఫుడ్స్ సహకారంతో, కొబ్బరి ఆధారిత విలువధారిత ఆహార ఉత్పత్తుల స్థానిక తయారీ సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం పక్కాగా అమలు కావాలని, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు చేయాలన్నారు. అలాగే జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. -
బాలెన్స్ చేసేదెలా!
షేర్ ధనం అంటే.. ఉదాహరణకు సంఘంలో ఒక రైతు రూ.లక్ష అప్పు తీసుకుంటే షేర్ ధనం కింద రూ.10 వేలను అప్పుడే డీసీసీబీకి చెల్లించి వేస్తున్నామని సంఘాల సీఈవోలు చెబుతున్నారు. అదే రైతు అప్పును క్లోజ్ చేస్తున్నప్పుడు, ముందుచ్చిన షేర్ ధనం రూ.10 వేల తగ్గించి మిగిలిన రూ.90 వేలు చెల్లిస్తున్నాడు. అలా ఆ 10 వేలు డీసీసీబీ వద్దే ఉండిపోతున్నాయి. ఆ లెక్కన ఇప్పుడు ఇంబాలెన్స్గా ఉన్న 130 సంఘాలకు చెందిన కోట్లాది రూపాయల షేర్ ధనం డీసీసీబీ వద్దే నిల్వ ఉండిపోతోంది. ఆ షేర్ ధనం నిల్వలు తమకే చెందుతాయని, అయితే తాము దానిపై వచ్చే వడ్డీ నష్టపోతున్నామని సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీసీసీబీ, సంఘాల మధ్య ఇప్పుడు షేర్ ధనం చిచ్చు రగులుతోంది. షేర్ ధనం డీసీసీబీ వద్ద నిల్వ ఉండడం వల్లే సంఘాలు ఇంబాలెన్స్కు గురవుతున్నాయే తప్ప మేము చేసే ఖర్చుల వల్ల కాదని సంఘాల సీఈవోలు, త్రీమెన్ కమిటీల ప్రతినిధులు చెబుతున్నారు. అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలోని 298 సహకార సంఘాలకు గాను 130 సంఘాల్లో సుమారు రూ.400 కోట్ల మేర ఇంబాలెన్స్ (అసమతుల్యత) ఏర్పడింది. దీని వల్ల సంఘాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, బ్యాంక్ రికవరీలు, లిక్విడిటీ, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని డీసీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో సహకార సంఘాలు కూడా తమ వాదన వినిపిస్తున్నాయి. సంఘాల వద్ద రైతులు రుణాలు తీసుకునేటప్పుడు వారి నుంచి వసూలు చేసే షేర్ ధనం (క్యాపిటల్) డీసీసీబీకే చెల్లించేస్తున్నామని, ఆ షేర్ ధనాన్ని తమకు బ్యాంక్ ఇచ్చిన రుణాలకు జమ చేసుకోకపోవడం వల్లే ఇంబాలెన్స్ సమస్య తలెత్తుతోందని చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని డీసీసీబీ పూర్తిగా కొట్టి పారేస్తోంది. సంఘాలు ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులను తగ్గించుకుంటే మంచిదని సూచిస్తోంది. డీసీసీబీ పొదుపు మంత్రం సంఘాలు ఇంబాలెన్స్ క్రమంగా తగ్గించుకునేందుకు, భవిష్యత్తులో అది మరింత పెరగకుండా నివారించేందుకు డీసీసీబీ కొన్ని సూచనలు చేసింది. ఆ ప్రకారం.. సంఘాల సభ్యులైన రైతులకు మంజూరు చేసిన అప్పులపై వడ్డీని సక్రమంగా లెక్కకట్టి వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది జీత భత్యాలు, ఇతర భత్యాలు (ఎలవన్స్లు) పెంచకూడదు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్పవర్ కమిటీ (డీఎల్ఈసీ) అనుమతి లేకుండా సంఘాల్లో శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు నియామకాలు చేపట్టకూడదు. గత ఆర్థిక సంవత్సరం ఖర్చులతో పోల్చి కనీసం 25 శాతం ఖర్చులను తగ్గించుకుని సంఘాల నిర్వహణ చేయాలి. సభ్యుల నుంచి డిపాజిట్లు సేకరించి బ్యాంక్లో డిపాజిట్ చేయడం ద్వారా మార్జిన్ వడ్డీ పొందడం, సభ్యుల డిపాజిట్లపై సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ సంఘాల ద్వారా అప్పులు మంజూరు చేసి సక్రమంగా వసూలు చేసి లాభాలు ఆర్జించాలి. ఇలా మొత్తం 18 పొదుపు సూత్రాలను డీసీసీబీ సహకార సంఘాలకు సూచిస్తూ ఆంక్షలు విధించింది. ఖర్చులు తగ్గించుకోవాలి ప్రభుత్వ నిబంధనలకు లోబడి సహకార సంఘాలు ఖర్చులను తగ్గించుకోవాలి. అప్పుడే ఇంబాలెన్స్ సమస్యలన్నీ తీరుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాన్ని రైతుల నుంచి సక్రమంగా వసూలు చేసుకోవాలి. అప్పుడే డీసీసీబీకి, పీఏసీఎస్లకు ఆర్ధిక స్థితిగతులు బాగుంటాయి. – పి.ప్రవీణ్కుమార్, సీఈవో, డీసీసీబీ, కాకినాడ ఫ సహకార సంఘాల్లో ఇంబాలెన్స్ సమస్య ఫ డీసీసీబీ ఆందోళన ఫ పొదుపు పాటించాలని సూచన ఫ షేర్ ధనం జమ చేయకపోవడమే కారణమని సంఘాల వాదన -
సీనియారిటీ ప్రాతిపదికనే కౌన్సెలింగ్
ఆలమూరు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) పదోన్నతుల బదిలీ సీనియారిటీ ప్రాతిపదికనే జరిగింది. సాక్షి దినపత్రికలో ఈ నెల 25న ‘ఇవే పన్నులో బాబూ..’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ తొలుత సీనియారిటీ ప్రకారం కాకుండా ఇంటి పన్నుల చెల్లింపుల శాతం ఆధారంగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జీఓ జారీ చేశారు. దీనిపై సాక్షి పత్రికలో కథనం రావడంతో సోమవారం వరకూ పంచాయతీరాజ్ వెబ్బ్సైట్లోని పీడీఓలో ఉన్న ఇంటిపన్నుల శాతం తెలిపే వివరాల షీట్ లింకును తొలగించారు. ఆయా జిల్లాల్లో పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పూర్వపు విధానంలోనే కౌన్సెలింగ్ జరిగింది. సర్వీస్ రూల్స్ ప్రాతిపదికగానే ప్రస్తుతం కౌన్సెలింగ్ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్కు, కథనం ప్రచురితం చేసిన సాక్షికి పీడీఓలు ధన్యవాదాలు తెలియజేశారు. పూతరేకుల దుకాణాల్లో తనిఖీలు ఆత్రేయపురం: ఉచ్చిలి, ఆత్రేయపురం సమీపంలోని పూతరేకుల తయారీ, విక్రయాలు జరిపే దుకాణాల్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.రామయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయా దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యిని పరిశీలించారు. స్థానికంగా కొందరి నుంచి కల్తీ నెయ్యిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించి, రిపోర్టులు వచ్చిన అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తామని వై.రామయ్య తెలిపారు. పూతరేకుల పరిశ్రమ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున ఇక్కడి తయారీదారులు బ్రాండెడ్ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నందున నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యాపారులకు తెలిపారు. తనిఖీలో వైద్య శాఖ సిబ్బంది పీహెచ్ అరుణకుమారి, సూపర్ వైజర్ మూర్తి, వీఆర్వో జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్ర స్థాయి అవార్డు అమలాపురం రూరల్: సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్రస్థాయిలో టాప్ ఫెర్పార్మర్ అవార్డు లభించింది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం ఆమెకు డివిజన్ సంక్షేమ అధికారులు భగవాన్, సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ప్రవీణ్, కోశాధికారి బీఎంవీ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్బాబు అభినందనలు తెలిపారు. జ్యోతిలక్ష్మీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఫలితంగా తనకు అవార్డు దక్కిందని స్పష్టం చేశారు. -
ఓటరు జాబితాపై శ్రద్ధ చూపాలి
సామర్లకోట: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో అనేక ప్రశ్నలను సంధిస్తే ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎస్సీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన దుర్మార్గంగా ఉన్నదని, వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతీ నాయకుడు బీఎల్ఎలపై శ్రద్ధ చూపి ఓటర్లను కాపాడుకోవాలన్నారు. స్థానిక సంస్థలలో కూటమి పార్టీలు ఓటమి చెందితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు, సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు సర్పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఇంటింటా తిరిగే సమయంలో వారితో టచ్లో ఉండాలన్నారు. అర్హత ఉన్న వారి ఓట్లు తొలగిస్తే వెంటనే పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ 24 సంవత్సరాల తరువాత ఓటర్ల సవరణ జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సర్ టాస్క్ఫోర్సు కమిటీ సభ్యుడు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఓట్లు తొలగించిన విధంగా రాష్ట్రంలో జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఒమ్మి రఘురాం బీఎల్ఎలకు శిక్షణ ఇచ్చారు. టాస్క్ఫోర్సు కమిటీ సభ్యులు వాసిరెడ్డి జమీల్, రాష్ట్ర పార్టీ కార్య దర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వీరంరెడ్డి నాని పాల్గొన్నారు. బీఎల్ఎల అవగాహన సదస్సులో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా -
పోలీస్ గ్రీవెన్స్కు 35 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ గ్రీవెన్స్కు వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. ప్రతి అర్జీదారుడితో ఎస్పీ మీనా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి అధికారులతో చర్చించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. పోలీస్ ఉద్యోగంలో మానసిక దృఢత్వం ముఖ్యం అమలాపురం టౌన్: పోలీస్ ఉద్యోగంలో మానసిక దృఢత్వం ముఖ్యమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్థానిక కూచిమంచి అగ్రహారంలోని ఎస్ఆర్సీఎం హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో జిల్లా పోలీసు అధికారులకు సోమవారం ధ్యాన తరగతులను ఆయన ప్రారంభించారు. రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఎ.రాజశేఖర్, ఎం.బాలక్షృష్ణ పర్యవేక్షణలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన నిర్వహించారు. హృదయ ఆరోగ్య పరిరక్షణ, క్రమబద్ధమైన వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అంశాలపై ఆరోగ్య నిపుణులు సూచనలు ఇవ్వడమే కాకుండా పోలీసు అధికారులతో యోగా, ధ్యానం చేయించారు. ఎస్పీ మీనాతో పాటు జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి రోజూ ఉదయం కొంత సమయం యోగా, ధ్యానం వంటి ఆరోగ్య కార్యక్రమాలకు కేటాయించాలని ఎస్పీ మీనా సూచించారు. పీడీ సెట్లో ఏడో ర్యాంక్ రాజోలు: పోస్ట్ డిప్లొమా సెట్ (పీడీ సెట్)లో రాజోలు ఏనుగుపల్లివారి పేటకు చెందిన డాక్టర్ రీనా రివాంజలిన్ ఆల్ ఇండియా స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నిర్వహించిన పీడీ సెట్లో జాతీయ స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించిన డాక్టర్ రీనా రివాంజలిన్ను సోమవారం పలువురు అభినందించారు. రివాంజలిన్ ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్గా, ఆమె భర్త డాక్టర్ వై.జాషువా గుంటూరు మెడికల్ కళాశాలలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్సాహంగా రేలా ఉత్సవాలు రంపచోడవరం: రంపచోడవరంలో ఆదివాసీ రేలా ఉత్సవాలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్, జేసీ ప్రశాంత్కుమార్ హాజరయ్యారు. గిరిజనులతో కలసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సాయంత్రం ఏడు గంటలకు రేలా ఉత్సవాలు ప్రారంభించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, మెంబర్ గొర్లె సునీత, డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, ఎంపీపీ బందం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల పెళ్లి తంతు, రేలా నృత్యాలు, గిరిజనుల సంప్రదాయ వస్తువులను ప్రదర్శించారు. -
పదే పదే తిరుగుతూ..
● అవే సమస్యలపై మళ్లీ అర్జీలు ● నామమాత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: పదే పదే తిరుగుతున్నా పరిష్కారం దొరకడం లేదు.. మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నా పట్టించుకునేవారు కానరావడం లేదు.. దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)పై ప్రజలకు నమ్మకం ఉండడం లేదు. అమలాపురంలోని కలెక్టరేట్కు వచ్చి జిల్లా అధికారులకు అర్జీలు ఇస్తున్నా పట్టించుకునే వారు ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు మొత్తం 250 మంది అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ సైదియదేవి, డీఆర్వో సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, డీఆర్డీ పీడీ డి.రాంబాబుకు వినతిపత్రాలు అందించారు. వీటిలో ఎక్కువ సార్లు వచ్చిన అర్జీదారుల మనోగతం తెలుసుకుందాం.. ఐదు సార్లు ఫిర్యాదు చేశా.. రాజోలులోని వశిష్ఠ లెఫ్ట్ బ్యాంకు వద్ద ఏటుగట్టుపై కొబ్బరి చెట్ల ఫలం సాయం పొందేందుకు మా పెద్దలు 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. ఇదే ఆధారంగా జీవిస్తున్నాం. ఇక్కడి కొబ్బరి చెట్లకు అడ్డుగా ఓ వ్యక్తి బడ్డీ పెట్టాడు. అనుమతి లేకుండా అతను కొన్ని కొబ్బరి మొక్కలు వేశాడు. కొబ్బరి చెట్ల దింపునకు వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. దీనిపై ఇప్పటికి కలెక్టరేట్లో ఐదు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. – వెటుగోట్ల విజయలక్ష్మి, రాజోలు ధ్రువీకరణ ఇవ్వడం లేదు ఐదేళ్లుగా పక్షవాతంతో మంచంపై ఉన్నాను. ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉందని వృద్ధాప్య పింఛను రాలేదు. అనారోగ్యం కారణంగా మంచంపైనే ఉన్నాను. దీనికి సదరం ధ్రువీకరణ పత్రం కోసం మా కుటుంబ సభ్యులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. వైద్య పత్రాలు లేవని చెప్పి అధికారులు ధ్రువీకరణ ఇవ్వడం లేదు. రెండేళ్లుగా సచివాలయం, ఎంపీడీఓ, కలెక్టరేట్లలో అర్జీలు ఇస్తూనే ఉన్నాను. – ఎం.సుబ్బారావు, మొగళ్లమూరు, అల్లవరం మండలం -
కలెక్టరేట్ వద్ద నిరసనల జోరు
అమలాపురం రూరల్: అంబాజీపేట మండలం చిరుతపూడి పంచాయతీ పరిధిలో ప్రభల తీర్థం జరిగే పంట చేల స్థలంలో విద్యుత్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆ గ్రామస్తులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. మందపల్లి నుంచి అయినవిల్లి మండలం వరకూ 400 కేవీ విద్యుత్ టవర్ ఏర్పాటుతో సంకాంత్రికి జరిగే తీర్థానికి ఆటంకం కలుగుతుందని ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు సోమవారం ఆందోళన చేశారు. ఈ పొలాల నుంచి ఈ నిర్మాణం వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరుతపూడి, కుందాలపల్లి, మోడేకుర్రు, అవిడి, నరేంద్రపురం, రాకుర్తివారిపాలెం–గొల్లకోటివారిపాలెం గ్రామాల్లో శివాలయాల నుంచి ప్రభలతో పాటు ప్రతి గ్రామం నుంచి ప్రభలను చిరుతపూడి గ్రామ తీర్థ స్థలానికి తీసుకు వస్తారన్నారు. మందపల్లి నుంచి అయినవిల్లి 400 కేవీ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్కు హైపవర్ లైన్ ప్రభల తీర్థం జరిగే స్థలం మధ్యలో నుంచి వెళ్తుందని వారు తెలిపారు. ఈ స్థలం మధ్యలో సుమారు 10 సెంట్ల స్థలంలో హైపవర్ విద్యుత్ టవర్ నిర్మిస్తామని అధికారులు చిరుతపూడి గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారన్నారు. దీనిపై తాము అభ్యంతరం తెలిపామన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్మాణ పనులు చేస్తామంటున్నారని అన్నారు. దీనిని నిరసిస్తూ మాజీ సర్పంచులు కోట బేబీరాణి, సరేళ్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు ధూళి సూరిబాబు, నేతల నాగరాజు, గ్రామ పెద్దలు కలెక్టర్ను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కలసి వినతిపత్రం అందించారు. ఆక్వా సమస్యలు పరిష్కరించండి ఆక్వా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రొయ్యల చెరువులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. రొయ్యల ధరలు పెంచాలని, వాటి మేత ధరలు తగ్గించాలని ఆక్వా రైతు నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు, చవటపల్లి నాగభూషణం డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు రాజు మాట్లాడుతూ సిండికేట్ వ్యవస్థ కారణంగా ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సిండికేట్ను విచ్ఛిన్నం చేయాలని డిమాండ్ చేశారు. నాగభూషణం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. -
ధరల్లో పెట్రోగిపోతూ..
చమురు ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేట్రేగిపోతున్నాయి.. ఎక్కడా ఆగకుండా బాదేస్తున్నాయి.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.. ఈ పెంపు రవాణా, నిత్యావసరాలకు ధరాఘాతం కానున్నాయి.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మనకే ఎక్కువ ధరలు ఉండడం సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారుపై అన్నివర్గాలూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆలమూరు: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీగా చమురు ధరలు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెంచేసింది. పెట్రోల్, డీజిల్పై 11 శాతం మేర ధరలను పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోంది. కోనసీమ జిల్లా వ్యాస్తంగా హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)తో పాటు రిలయన్స్, నయారా తదితర ప్రైవేట్ కంపెనీలకు చెందిన 112 పెట్రో బంకులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోజూ సుమారు 2.40 లక్షల లీటర్ల పెట్రోల్, 3.25 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఈ నెల 14వ తేదీన పెట్రోల్ ధర రూ.109.39, డీజిల్ రూ.97.24 ఉంది. ప్రస్తుతం నాలుగో సారి పెంపుతో పెట్రోల్ ధర రూ 117.21, డీజిల్ ధర 104.93కు చేరింది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్పై రూ.8.04, డీజిల్పై రూ.7.82 పెంచినట్లు అయ్యింది. ఇలా జిల్లా వాసులపై రోజుకు సుమారు రూ.65 లక్షల భారం పడనుంది. దేశంలోనే అత్యధిక చమురు ధర ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ తగ్గించి ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ను చేస్తూనే ఉంది. అయినా చంద్రబాబు సర్కారు ప్రజలపై భారం వేస్తోంది. ఇదే‘వంట’ భారం పెరిగిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పెట్రో ధరల పెంపు మరింత భారంగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పేట ధరల దాడి చేస్తున్నాయి. ఇప్పటికే రవాణా చార్జీలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాలుగోసారి పెరిగిన చమురు ధరలతో మరింత పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు, కర్రి పాయింట్ల యజమానులు ధరలను భారీగా పెంచేశారు. టిఫిన్, మీల్స్పై ఇప్పటికే ప్లేట్కు రూ.పది నుంచి రూ.25 వరకూ పెరిగిపోయింది. ఆటోల్లో కనీస చార్జీలకు రెక్కలొచ్చాయి. కూరగాయల ధరల చుక్కలన్నంటుతున్నాయి. ఈ చమురు ధరల పెంపు ఇలా కొనసాగితే భవిష్యత్లో మరిన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉపశమన చర్యలు అవసరం పెట్రో ఉత్పత్తుల ధరలు నియంత్రణ లేకుండా పెరగకుండా సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అందరి నుంచి వస్తుంది. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడతామంటున్న చంద్రబాబు సర్కార్ చమురు ధరల తగ్గింపులో పోటీపడాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో భారీగా ఉన్న వ్యాట్ను తగ్గించడంతో పాటు రోడ్డు సెస్ను రద్దు చేయాలనే డిమాండు వ్యక్తమవుతుంది. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ నింపుతూ..తేదీ పెట్రోల్ ధర పెంపు డీజిల్ ధర పెంపు (రూపాయల్లో) (రూపాయల్లో) 14.05.26 (నాటికి) 109.39 97.24 15.05.26 3.29 3.14 19.05.26 0.87 0.91 23.05.26 0.87 0.91 25.05.26 2.79 2.73 117.21 104.93 ఆగని చమురు ధరల పెంపు ప్రజలపై వరుసగా వడ్డింపు పది రోజుల్లో పెట్రోల్పై రూ.8.04, డీజిల్పై రూ.7.82 భారం జిల్లాలో రోజుకు రూ.65 లక్షల అదనం -
గూడు తొలగించొద్దని వేడుకోలు
పాడా పీడీకి వినతి పత్రం అందించిన బాధితులుపిఠాపురం రూరల్: తమ గూడు తొలగించొద్దని పట్టణ పరిధి ఇందిరానగర్ కాలనీ వాసులు సోమవారం పాడాలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులను వేడుకున్నారు. అధికారులకు వినతి పత్రం అందించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్ శివారున 12 కుటుంబాలకు చెందినవారు 40 సంవత్సరాల పైబడి జీవిస్తున్నారు. వీరు నివసిస్తున్న ఇళ్లకు అధికారులు మున్సిపల్ పన్ను, కుళాయి పన్ను సైతం విధించారు. విద్యుత్ శాఖ కరెంట్ మీటర్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి 30 రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని లేని పక్షంలో జేసీబీలతో తామే తొలగిస్తామని హెచ్చరించారని బాధితులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను అర్ధంతరంగా ఖాళీ చేసి వెళ్లిపొమ్మనడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం సక్రమం కానప్పుడు, ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంట్ మీటర్ ఎలా వేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేక పాకలు వేసుకుని జీవిస్తున్నామని, వేరే చోటకు పోవాలంటూ అధికారులు చెప్పడం తగదని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
పెట్రో ధరల పాపం.. చంద్రబాబుదే
పెట్రో ఉత్పత్తుల ధరలను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెంచడం దారుణం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. పెట్రోల్పై 31 శాతం, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ను విధించి ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు సంపదను సృష్టించడం లేదు. ప్రజల సంపదను హరిస్తున్నారు. అలాగే ఆక్వా, మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. చమురు ధరలు సత్వరమే తగ్గించకపోతే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు భారీ ఉద్యమానికి దిగుతాం. – చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
సంపద సృష్టి అంటే ఇదేనా!
● చమురు ధరలు పెంచడం అన్యాయం ● కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, చమురు ధరలు పెంచుకుంటూ పోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై అమలాపురంలో ఏబీసీ ఫుడ్ కోర్టు వద్ద జగ్గిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాట్ ట్యాక్స్ పేరులో దోచేస్తున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు రోడ్డెక్కి మరీ ధర్నాలు చేస్తుంటే, కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతుందన్నారు. ఆక్వా రైతులు రొయ్యల ధరలు పెంచాలని ఆందోళన చేస్తున్నా, పట్టించుకోవడం లేదని జగ్గిరెడ్డి అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులకు మేలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. -
న్యాయం చేయాలని పోస్టల్ బాధితుల ఆందోళన
తాళ్లరేవు: పి.మల్లవరం పోస్టాఫీస్లో పొదుపు చేసుకున్న తమ నగదుకు లెక్కలు లేకుండా పోయాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.వేలు జమచేస్తే రూ.వందల్లో ఉన్నట్లు పాస్బుక్లలో చూపుతున్నారని వాపోతున్నారు. తాము పొదుపు చేసుకున్న నగదును తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని సోమవారం పి.మల్లవరం పోస్టల్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ధూళిపూడి సాయిపవన్ మాట్లాడుతూ పోస్టాఫీస్లో తన తండ్రి పేరిట రూ.32,870 జమ చేశానని, అయితే ప్రస్తుతం కేవలం రూ.878 మాత్రమే అకౌంట్ బుక్లో చూపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తన తల్లి పేరిట రూ.22977 జమ చేయగా, రూ.1,493 ఉన్నట్లు చెబుతున్నారని వాపోయారు. మిగిలిన సొమ్ము ఏమైందని ప్రశ్నించగా, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అంటున్నారు. సుకన్య పథకం కింద తన మేనకోడలు కూర్మా నాగలక్ష్మి పేరిట రూ.52,500 నగదు జమ చేయగా, కేవలం రూ.21,457 మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారని బాధి తుడు ఆనాల పాపారావు వాపోయాడు. సుమారు 40 మంది బాధితులకు చెందిన రూ.25 లక్షలకు పైగా నగదు కనిపించకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. పాత అకౌంట్ పుస్తకాలను కనిపించకుండా చేసి, కొత్త పుస్తకాలు ఇచ్చారని, వాటిలో తాము దాచుకున్న పూర్తి నగదు లేదని తెలిపారు. దీనిపై జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తి సామర్లకోట : పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనకు సంబంధించి బాధ్యులుగా చేస్తూ అప్పటి ఆర్డీఓగా ఉన్న కే శ్రీరమణని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అనంతరం ఎన్ శ్రీధర్ను ఇన్చార్జిగా నియమించారు. రెగ్యులర్ ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమించారు. -
బొజ్జ గణపయ్యకు విశేష పూజలు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి రెండు జంటలు పంచామృతాభిషేకం నిర్వహించారు. అలాగే లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 26 మంది దంపతులు పాల్గొన్నారు. ఒక జంట గరిక పూజ నిర్వహించింది. 13 మంది లక్ష్మీగణపతిహోమంలో పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం వేశారు. 8 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 1224 మంది స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,26,845 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ముమ్మిడివరం: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు ఏఎస్ఎస్టీ కమిషనర్ బి.హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగుతాయన్నారు. ఈ మేరకు జిల్లాలో 5 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యూలర్ టెన్త్తో పాటు ఓపెన్ స్కూల్, ఇంటర్ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్లో సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: కలెక్టరేట్ గోదావరి భవనంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి డివిజన్, మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారని, అర్జీలను వెబ్వైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని పరిష్కారాలు పొందాలని సూచించారు. అర్జీల స్థితిగతుల వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అంబేడ్కర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ అధ్యక్షుడు చిరంజీవి అమలాపురం రూరల్: జిల్లాలోని నాలుగు డిపోలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అంబేడ్కర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ అధ్యక్షుడు జి.చిరంజీవి అన్నారు. యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి.సత్తిబాబు అధ్యక్షతన ఆదివారం అమలాపురంలో జరిగింది. ఏటా డిజిటల్ చార్టులు మార్చాలని, బస్సుల సంఖ్య పెంచాలని తదితర డిమాండ్లు చేశారు. అవసరమైతే విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దృష్టికి సమస్య తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాలుగు డిపోల అధ్యక్ష కార్యదర్శులు సహా డిపో కమిటీలు పాల్గొని నూతనంగా జిల్లాకు వచ్చిన జోనల్ అధ్యక్షులను జోనల్ జాయింట్ సెక్రటరీ కేవీఎస్ నారాయణను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిపో జిల్లా కార్యదర్శి మేడిది శ్రీనివాసరావుతో పాటు అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కోదాడ రూరల్: ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం బైపాస్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి యోలో ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున కోదాడ సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లలో కూర్చున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్, విజయవాడ వెళ్లారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు. 24కెడిడి501: క్రేన్తో బస్సును రోడ్డు పక్కకు తొలగిస్తున్న పోలీసులు -
తలుపులమ్మ తల్లి భక్తులకు ‘ఆన్లైన్’ కష్టాలు
తుని రూరల్: లోవ దేవస్థానంలో వివిధ సేవలకు ఆన్లైన్ పేమెంట్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో.. తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం 23 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరందరూ పూజా టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవలకు ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు విద్యుత్, ఇంటర్నెట్ మొరాయించడంతో ఆన్లైన్ సేవలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. సిబ్బంది అందుబాటులో ఉండి కొంత మేరకు సమస్యను పరిష్కరించినా.. గ్రా మీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కొంత మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, మరి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో నెట్ సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు ఎదురయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కియోస్కులు పని చేసేలా యూపీఎస్లు ఏర్పాటు చేశామని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. రూ.7 లక్షల ఆదాయం వివిధ సేవలు, విరాళాల రూపంలో దేవస్థానానికి మొ త్తం రూ.703897 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,13,448, పూజా టికెట్లకు రూ.3,67,702, కేశఖండన శాలకు రూ.19,520, వాహన పూజలకు రూ.4,370, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.86,865, విరాళాలు రూ.13,992 చొప్పున ఆదాయం వచ్చిందని వివరించారు. -
టెట్పై టీచర్ల ఫైట్
అమలాపురం టౌన్: టెట్పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఫైట్ చేస్తున్నాయి. 2010 ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని టెట్ నుంచి మినహాయించాలనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేష్లు టెట్ విషయంలో సానుకూలంగా ఇచ్చిన హామీని ఉపాధ్యాయులు విశ్వసించడం లేదు. సూపర్ సిక్స్, పీ–4 హామీల మాదిరిగానే టెట్ హామీని కూడా గాలికొదిలేస్తారా అనే అనుమాన పడుతున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న మాకు ఈ వయసులో అర్హత పరీక్ష ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. 2010లో ఆర్టీఐ చట్టం వచ్చింది. అంతకుముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులను ఆర్టీఐ చట్టం నుంచి మినహాయించాలన్నది వారి మరో డిమాండ్. 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ టెట్ రాయాల్సిందేనని పేర్కొంది. అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టీచర్లు మళ్లీ విద్యార్థులుగా మారాలి! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో టెట్ నిబంధనల మేరకు దాదాపు 7 వేల మందికి పైగా ఈ పరీక్ష రాసి నైపుణ్యాన్ని పరిక్షించుకోవాల్సిందే. దాదాపు 16 ఏళ్ల కిందట ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణత కావడం కష్టమే. 150 మార్కులకు నిర్వహించే టెట్లో ఉత్తీర్ణత కావాలంటే ఓసీలు, బీసీలు, ఎస్సీలు 50 నుంచి 90 శాతం మార్కులు తెచ్చుకుంటేనే గాని ఈ గండం నుంచి గట్టెక్కలేరు. టెట్ పేపర్–1 లో తెలుగు, ఇంగ్లిషు, లెక్కలు, పర్యావరణం, శిశు సంరక్షణలకు చెందిన సబ్జెక్ట్ల కోసం ఉపాధ్యాయులు మళ్లీ విద్యార్థులుగా మారాలి. పేపర్–2లో బయో సైన్స్ ఉపాధ్యాయులు లెక్కలు, తెలుగు పండితులు సాంఘిక శాస్త్రం పేపర్లు విధిగా రాయాల్సి ఉంది. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా స్పందించడం లేదు. టెట్ పాసైతేనే ఆ ఉపాధ్యాయులకు పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయన్న నిబంధనపై కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు టెట్పై మానసిక ఆందోళనకు గురవుతున్న క్రమంలో ఈ గండం నుంచి తప్పించాల్సిన ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై గురువులు గుర్రుగా ఉన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్న నిబంధన టెట్ పాసైతేనే పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయని మెలిక 2010కి ముందు ఇన్ సర్వీస్ ఉన్నవారిని మినహాయించాలని డిమాండ్ -
నాటి విత్తనాలకు నేడు ఫలాలు
● సత్ఫలితాలు ఇస్తున్న జగన్ ప్రభుత్వ విద్యా సంస్కరణలు ● ఇంగ్లిష్ మీడియంతో టెన్త్లో రాణించిన విద్యార్థులు కొత్తపేట: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు తీసుకువచ్చిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేటు స్కూళ్లకు దీటుగా దూసుకు పోతున్నాయి. గతంలో కార్పొరేటు పాఠశాలలు మాత్రమే ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులను ఆకర్షించి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించేవి. నేడు ప్రభుత్వ టీచర్లు తమ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఘనతను వివరిస్తూ చేరికలకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అధిగమించిన ఫలితాలు..: ఈ ఏడాది 12,532 మంది విద్యార్థులకు 11,821 మంది (94.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అయినవిల్లి మండలం నూరు శాతం, 13 మండలాల్లో 96.10 శాతం నుంచి 99.30 శాతం వరకు, 8 మండలాల్లో 87.30 శాతం నుంచి 94.02 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక పాఠశాలల్లో విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనతను చాటి చెబుతూ, వారి పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు వివరిస్తూ ఫ్లెక్సీలతో, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని వివరిస్తూ విద్యార్థులను చేర్పిస్తున్నారు. జిల్లాలో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులు 7,669 మందిని గుర్తించగా నేటి వరకు 3,608 మందిని 1వ తరగతిలో చేర్పించారు. -
దన్నుంటేనే దమ్ము!
● అన్నదాత సుఖీభవలో మొండి చేయి ● నేటికీ రాని మోంథా పరిహారం ● రబీ ధాన్యానికి దక్కని మద్దతు ● ప్రభుత్వ వైఖరితో చేతులెత్తేస్తున్న రైతులు ● సహకరిస్తేనే సాగులోకి అంటున్న వైనం● మరో పక్క వారం రోజుల్లో కాలువలకు నీరు ● ఖరీఫ్కు సిద్ధం చేస్తున్న అధికారులు సాక్షి, అమలాపురం: ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టాలో ఇప్పుడు మొదటి పంట సాగు చేసేందుకే రైతులు వెనకాడుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ సాగు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నెల 30న లేదా జూన్ 1వ తేదీన కాలువలకు నీరు వదిలేందుకు జల వనరుల శాఖ సిద్ధంగా ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. అన్నదాతలు మాత్రం సాగు భరోసా లేక వెనకాడుతున్నారు. జిల్లాలో మొత్తం వరి ఆయకట్టు 2.20 ఎకరాలు. గత ఏడాది ఖరీఫ్లో సుమారు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. రెండేళ్లుగా ఖరీఫ్ పూర్తిస్థాయిలో సాగవడం లేదు. ముంపు భయం, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. గత ఏడాది సుమారు 40 వేల ఎకరాల్లో సాగుకు దూరంగా ఉన్నారని అంచనా. ఈ ఏడాదీ ఇదే కొనసాగుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. బీమా భరోసా లేదు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. సాగు చేసిన 1.69 లక్షల ఎకరాలకు 43,900 ఎకరాల్లో మాత్రమే బీమా వర్తించింది. దీనిలో 90 శాతం బ్యాంకు రుణాలు ఉన్నవారికే. మిగిలిన రైతులు ఉచిత పంటల బీమా వర్తించక, ప్రభుత్వ పరిహారం అందక నష్టపోతున్నారు. సాగుకు దూరం చాలామంది రైతులు తొలకరి పంటకు దూరంగా ఉంటున్నారు. తీర ప్రాంత మండలాలు ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోనల్లో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయడం లేదు. తుపానులు, వరదలకు చేలు ముంపు బారిన పడి నష్టపోవడానికి తోడు పంట నష్టపోతే ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించకపోవడం కూడా కారణం. ఈ ఏడాది అష్టకష్టాలు పడి రబీ పండిస్తే కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకు తగ్గించి అమ్ముకోవాల్సి రావడంతో రైతుల్లో సాగు అంటేనే నిర్లిప్తత చోటు చేసుకుంది. అన్నదాత సుఖీభవ ఎప్పుడు? వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా (టీడీపీ ప్రభుత్వంలో దీనిని అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు) నిధులు విడుదల చేసేవారు. ఖరీఫ్ సాగు ప్రారంభంలోనూ, అక్టోబర్, జనవరిలో ఇలా మూడు దఫాలుగా నిధులు రైతులు ఖాతాలకు జమ చేసేవారు. తాము అధికారంలోకి వస్తే రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. తొలి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రూ.ఆరు వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలకు ఎగనామం పెట్టారు. జిల్లాలో 1,45,899 మంది రైతులకు (మండపేట నియోజకవర్గంతో కలిపి) ఇవ్వాల్సిన రూ.204.25 కోట్లు ప్రభుత్వం ఎగవేసింది. గత ఏడాది జూన్లో ఇవ్వాల్సిన నిధులను ఆగస్టులో గాని విడుదల చేయలేదు. లబ్ధిదారులను 1,33,933 మందికి కుదించి 11,957 మందికి అన్నదాత సుఖీభవ నిధులు ఎగ్గొట్టారు. మోంథా పరిహారం లేదు మోంథా తుపానువల్ల జిల్లాలో సుమారు 73 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. సుమారు 54 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరగగా, 21 ఎకరాల్లోని పంట నీట మునిగింది. 41 వేల మంది రైతులు నష్టపోయారు. హెక్టారుకు రూ.25వేల చొప్పున మొత్తం 29,544 ఎకరాలకు రూ.73.86 కోట్లు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంది. నవంబర్లో పంట దెబ్బతింది. ఆరు నెలలు దాటుతున్నా పరిహారం అందలేదు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆర్డీవో సరళవతి రామచంద్రపురం: రాబోయే వారం రోజుల పాటు డివిజన్ పరిధిలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎ. సరళవతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక హీట్వేవ్ బులెటిన్ ప్రకారం జిల్లాతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దాహం వేయకపోయినా తరచూ తగినంత నీరు త్రాగాలని, శరీరంలో లవణాల సమతుల్యత కోసం మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ఉపయోగించడం, తడి గుడ్డతో తలను కప్పుకోవడం మంచిదన్నారు. అలాగే గాలి సులభంగా తగిలే పలుచని, లేత రంగు పత్తి దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, రైతులు వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లో పనులను తగ్గించుకుని, మధ్య మధ్యలో నీడ ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటూ పనులు కొనసాగించాలని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, నీరసం, తల తిరగడం, వాంతులు, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి, ఎండల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని ఆర్డీవో కోరారు. -
ధర్మం కాదు
20 నుంచి 30 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న వారిపై టెట్ కత్తి వేలాడదీయడం ధర్మం కాదు. 2010 ముందు ఇన్ సర్వీస్లో ఉన్నవారు పరీక్ష రాయాలన్న నిబంధనపై పార్లమెంట్ పునః సమీక్షించాలి. – రాయుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి? అన్ని అర్హతలు గుర్తించే కదా ఆనాడు ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి? మినహాయింపు ఇవ్వాల్సిందే – సరిదే సత్య పల్లంరాజు, ఎస్టీయూ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అమలాపురం పదోన్నతులకు టెట్తో మెలిక సరికాదు ఉపాధ్యాయుల పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు టెట్తో మెలిక పెట్టడం సరికాదు. విద్యా సంస్కరణలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. – దీపాటి సురేష్బాబు, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ ● -
ఎండలతో అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: రానున్న ఐదు రోజులూ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19 మండలాల్లో సుమారు 41 నుంచి 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లరాదన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకూ 48 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. ఫ జిల్లాలో జలధార– జల హారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల హారతి, వివిధ వంతెనల నిర్మాణాలు, రబీ ధాన్యం సేకరణ, డ్రైనేజీల ఆపరేషన్ నిర్వహణ నిధులతో కేటాయించిన పనులు పురోగతిపై సమీక్షించారు. పీఆర్ పర్యవేక్షక ఇంజినీర్ పి.రామకృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బి.రాము తదితరులు పాల్గొన్నారు. ఫ గృహ గణనను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 15,39,357 జనాభా ఉండగా, 87.58 గణన పూర్తయ్యిందన్నారు. పొదుపు అంటే ఇదేనా బాబూ? ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ప్రజలు తమ కార్లు, మోటారు సైకిళ్లు వదిలేసి సైకిళ్ల బాట పడుతుంటే, కూటమి ముఖ్య నేతలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండి.. అలా కంటే రూ. 30 వేలు, రూ.40 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు సంపద సృష్టి, పొదుపు అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇంధన పొదుపు, సంపద సృష్టి అంటూ ప్రకటనలు చేయడం కాదని, ఆచరణలో తాను చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటున్న చంద్రబాబు అలా పుట్టినప్పుడు రూ. వేలల్లో ఇస్తే సరిపోతుందా..? వారి చదువులు, ఉద్యోగాలు వంటివి గాలికొదిలేస్తారా..? అని తల్లిదండ్రులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు నెల నెలా రూ.1500 ఇలాంటి హామీలకు మంగళం పాడిసినట్లేననిపిస్తోందన్నారు. ప్రభుత్వ విధి విధానాలు అన్నదాతలకు శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఆక్వా రైతులు నేడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఇంటర్ పాఠ్య పుస్తకాలు సిద్ధం అమలాపురం టౌన్: వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు అందించేందుకు 10,500 ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈఓ) కె.చంద్రశేఖర్బాబు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలను అమలాపురంలో సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆయా కళాశాలలకు పుస్తకాలు చేర్చామన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. -
అర్హుల ఓట్లు పదిలంగా ఉండాలి
ఫ తొలగిస్తే స్పందించండి ఫ బూత్ లెవెల్ ఏజెంట్లతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి రామచంద్రపురం: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై వైఎస్సార్ సీపీ బూత్ లెవిల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో స్థానిక ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద శనివారం అవగాహన సదస్సు జరిగింది. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఏజెంట్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. ఏజెంట్లకు సులభంగా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)లో విపులంగా వివరించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా కొంత మంది ఓట్లను తొలగించడం ద్వారా, చాలా మంది ఓటమి పాలయ్యారన్నారు. అర్హుల ఓట్లు తొలగించకుండా ఎస్ఐఆర్లో నిబంధనలు పాటించే విధంగా బూత్ లెవిల్ ఏజెంట్లు చూడాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగితే వెంటనే పార్టీ నేతలకు తెలియజేయాలని సూచించారు. అధ్యక్షత వహించిన పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయ్యిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తుందని విమర్శించారు. తాను ఎక్కడికి వెళ్లినా రామచంద్రపురం నియోజకవర్గం తనకు పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడ వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. టాస్క్ ఫోర్స్ సభ్యులు ఒమ్మి రఘురాం, తోరం గౌతమ్, గొల్లపల్లి డేవిడ్, జోన్– 2 బూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్ల కిశోర్, స్టేట్ బూత్ కమిటీ కార్యదర్శి మార్గాని గంగాధర్ పాల్గొన్నారు. పార్టీ రైతు విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాఽథ్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ ఎంపీపీలు అంబటి భవానీ, పంపన నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యా సంస్థల బస్సుల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
అమలాపురం టౌన్: జిల్లాలోని విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో బస్సుల నిర్వహణపై శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో వేసవి సెలవులు ముగిసి విద్యా సంస్థలు పునః ప్రారంభించనున్న క్రమంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు విధిగా కలిగి ఉండాలన్నారు. బస్సుల్లో పరిమితికి మించి నిలబడి విద్యార్థులు ప్రయాణించకూడదన్న ఆంక్షలను యాజమాన్యాలు పర్యవేస్తూ ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో తమ పిల్లల భద్రత, రక్షణను పర్యవేక్షించడానికి కొన్నిచోట్ల తల్లిదండ్రులు, సంరక్షకులను బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతించాలని చెప్పారు. విద్యా సంస్థల బస్సులను విడిచిపెట్టే సమయాల్లో అల్లరి మూకల ఈవ్ టీజింగ్, రేస్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్లపై తమ పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన చమురు ధరలు
ఫ పెట్రోల్పై 97 పైసలు, డీజిల్ 99 పైసల పెంపు ఫ జిల్లాలో రోజుకు రూ.11 లక్షల భారం అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. గడిచిన 13 రోజుల్లో ధరల పెంపు ఇది మూడోసారి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.11 లక్షల అదనపు భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా.. రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోల్, 4.80 లక్షల లీటర్ల డీజిల్ చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఈ పెంపుతో జిల్లాలో వినియోగదారులపై రోజుకు సుమారు రూ.11 లక్షల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.113.86 ఉండగాచ శనివారం ఉదయం 6 గంటల నుంచి రూ.114.86కు పెరిగింది. డీజిల్ లీటరు రూ.100.55 ఉండగా, ఇది రూ.102.55కు ఎగబాకింది. 15న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు లీటరుకు రూ.3.41, డీజిల్ 3.26 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వాహనాల రవాణా చార్జీలు పెరుగుతాయని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే మూడోసారి ధరలు పెంచడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వరుస ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. -
శ్రీవేంకటేశా మనసా స్మరామి
వాడపల్లికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: భానుడు ఉగ్రరూపం దాల్చినా.. భక్తిభావం సడలలేదు.. ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తజనం క్యూ కట్టింది. వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం కిక్కిరిసింది. సుమారు 80 వేల నుంచి లక్ష వరకూ వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి తీవ్రతకు అనుగుణంగా భక్తులకు చల్లని మజ్జిగ, నీరు అందించడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే సత్యసాయి సేవా సంస్థలు సైతం చలివేంద్రాన్ని నిర్వహించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026
అక్రమాలకు ‘బాట’ ఆత్రేయపురం సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక వద్ద గోదావరి మట్టి తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక రైతుల నుంచి ఆందోళన రావడంతో ఏకంగా గౌతమీ గోదావరి ప్రవాహానికి అడ్డుకట్టు వేసి ఆత్రేయపురం మండలం వద్దిపర్రు మీదుగా బాట వేసి మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఊబలంక, మెర్లపాలెం సరిహద్దులలో బొండుమట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రు మీదుగా అక్రమ మట్టి తవ్వకాలకు వీలుగా గౌతమీ గోదావరి మధ్యలో వేసిన బాట కన్నేసి.. కొల్లగొట్టేసి చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరగానే ఆ పార్టీకి చెందిన ప్రముఖుడికి చెందిన మానసాస్ ట్రస్టు భూములను అక్రమార్కులు చెరబట్టారు. వందలాది లారీల ఇసుక తవ్వేశారు. ఇసుకతో పాటు ఇప్పుడు మట్టి తవ్వకాల వంతు మొదలైంది. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం వంటి లంక గ్రామాల్లో ఐదు నుంచి పది అడుగుల లోతున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల నదీ గర్భంలో లంక గ్రామాలు కలిసిపోయే ప్రమాదం ఏర్పడినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. వీరవల్లిపాలెం లంక గ్రామాల్లో కొబ్బరి తోటలను ఆనుకుని మట్టి తవ్వకాలు -
ఉన్నదందా దోచేసి!
రాత్రయితే రైట్ రైట్ ఐ.పోలవరం మండలం మురమళ్ల, ఎదుర్లంక ప్రాంతాల్లో అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి, యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పడవలపై వెళ్లి ఇసుకను తవ్వేస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఈ తవ్వకాలు ఆగడం లేదు. అయినా అధికారులు ఇటువైపు చూడడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. ఇవి కన‘పడవ’ రాజోలులో వశిష్ఠ నదీపాయలో జోరుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిన తవ్వకాలు తరువాత బహిరంగమయ్యాయి. సోంపల్లిలో రేవును ఆనుకుని పడవల మీద ఇసుకను తీసుకువచ్చి అక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. రాజోలు మండలం సోంపల్లిలో పడవలపై ఇసుక రవాణా ఫ ఆత్రేయపురం నుంచి అంతర్వేది వరకూ.. ఫ జిల్లాలో ఇసుక, మట్టి దోపిడీ ఫ చెలరేగిపోతున్న మాఫియా ఫ గోదావరి, సముద్ర తీరాల్లో అక్రమ తవ్వకాలు సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఇసుక.. ఇది కొందరికి కాసులు కురిపిస్తోంది. గోదావరి, సముద్ర తీరాల్లో దోపిడీకి వేదికై ంది.. ఆత్రేయపురం నుంచి అటు వశిష్ఠ నదీపాయ సముద్ర సంగమ ప్రాంతం అంతర్వేది వరకూ.. వైనతేయ కలిసే ఓడలరేవు.. గౌతమీ సంగమ ప్రాంతం బలుసుతిప్ప వరకూ నదీ పాతాలు.. సముద్ర తీరాలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నదీపాయలు, సముద్ర తీరం మధ్యలో దీవిగా ఉన్న కోనసీమ చుట్టూ చేరి ఇసుక, బొండు ఇసుక, మట్టిని తరలించేస్తున్నారు. చివరకు పచ్చని చేలను కూడా వదలడం లేదు. మండు టెండలు కావడంతో గోదావరి లంకల్లో నదీ ప్రవాహానికి అడ్డుగా బాటలు వేసి మరీ ఇసుక, మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో రూ.కోట్ల విలువైన సంపదను తరలించేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు.. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఇసుక దోపిడీలోనూ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు. వారి ఆదేశాలను రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోతుందో తెలుసుకుందాం.. రండి. ఎదుర్లంక వద్ద రాత్రి వేళలో ట్రాక్టర్లపై తరలిపోతున్న ఇసుక (ఫైల్) -
‘అండ’దండ చూసుకుని..
అల్లవరం మండలంలో సముద్ర తీరాన్ని అక్రమార్కులు గుల్లచేస్తున్నారు. ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు, తీరంలో ఇళ్లలో పునాదులు నింపేందుకు ఈ ఇసుకను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. మండలంలో ఓడలరేవు, కొమరగిరిపట్నంలో తీరాన్ని ఆనుకుని ఇసుక దిబ్బలు కనుమరుగయ్యాయి. అడపాదడపా దాడులు చేస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు. కీలక నాయకుల వత్తాసు ఉండడంతో మరింత చెలరేగిపోతున్నారు. నిబంధనలు ‘పట్టా’పంచల్ మండపేట నియోజకవర్గం పరిధిలో కపిలేశ్వరపురం మండలం తాతపూడి, కేదార్లంక, శ్రీరామపురంలో ఇసుక, మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన పట్టా భూములను కూడా కొల్లగొడుతున్నారు. ఈ తవ్వకాలకు మైనింగ్ శాఖ అధికారులు కూడా వంత పాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార తవ్వకాలకు మార్గం కోనసీమ జిల్లా కావడం గమనార్హం. -
ఆరు నెలల చిన్నారి దత్తత
అమలాపురం రూరల్: జిల్లా శిశుగృహలో ఉన్న ఆదిత్య అనే ఆరునెలల చిన్నారిని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ చేతుల మీదుగా కలెక్టరేట్లో శుక్రవారం బెంగళూరుకు చెందిన కృష్ణ ప్రకాష్, నాగజ్యోతి సూర్యకుమార్ దంపతులకు దత్తత ఇచ్చామని ఐసీడీఎస్ పథక సంచాలకులు కె.నాగమణి తెలిపారు. గత డిసెంబర్ 14న గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బాబును వేకువ జామున మండపేట పశువులపాక సమీపంలోని చెత్త కుప్పలో వదిలి వెళ్లారన్నారు. స్థానికులు అమలాపురం శిశు గృహకు అప్పగించారన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న బెంగళూరు దంపతులకు బాబు ఫిబ్రవరి 26న రిజర్వ్ అయ్యాడన్నారు. సీడీపీఓ వైకేడీ రమాదేవి పాల్గొన్నారు. 20 సూత్రాల కమిటీది కీలక పాత్ర కమిటీ చైర్మన్ దినకర్ అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో 20 సూత్రాల కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన 20 సూత్రాల ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యం, విద్య, అమృత్ 2.0. జల జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ – అజీవికా మిషన్ గ్రామీణ పథకాల పురోగతిపై సమీక్షించారు. దినకర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీ–జీ రామ్ జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పని దినాలు 125 రోజులకు పెంచిందన్నారు. ఎంపీ జీఎంసీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు దృష్టి సారించాలన్నారు. జేసీ వైఖోడ్ నైదియాదేవి, డీఆర్వో సుబ్బారావు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల అమలాపురం రూరల్: విద్యార్థులు సమయస్ఫూర్తితో ముందుకు సాగాలని డీఆర్వో వి.సుబ్బారావు అన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం 2026 మే లో నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలపై డీఆర్వో కలెక్టరేట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 25వ తేదీన తెలుగు, 26న హిందీ, 29న గణితం, 30న భౌతిక శాస్త్రం, జూన్ ఒకటిన జీవశాస్త్రం, జూన్ 2న సామాజిక శాస్త్రం, జూన్ 5న ఇంగ్లిష్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. మే 28న బక్రీద్ కారణంగా జూన్ 5న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సామూహిక వివాహాలకు రానున్న ఆధ్యాత్మిక ప్రముఖులురాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలోని పట్టాలమ్మ అమ్మవారి ఆలయప్రాంగణంలో 28వ తేదీన ఆదివాసీల సామూహిక వివాహ మహోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. 170 జంటలు ఒకటి కానున్న ఈ కార్యక్రమాన్ని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఈ వేడుకకు దేశం నలుమూల నుంచి తొలిసారిగా రానున్న వారి పేర్లను ఆ సంస్థ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఈ మహా కార్యక్రమానికి త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్తో పాటు విద్యా నృసింహ భారతి, వీరధర్మజస్వామి, ప్రతాప్ స్వామి, బ్రహ్మశ్రీ కడియాల నవీన్ శర్మ, అరుణానంద స్వామి తదితరులు రానున్నట్లు సంస్థ ప్రకటించింది. -
ఇలాగైతే.. సాగు ఎలా?
● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులు ● వారం రోజుల్లో కాలువలకు నీరు ● ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు ● అందని అన్నదాత సుఖీభవ ● నేటికీ రాని మోంథా పరిహారం ● రబీ ధాన్యానికి దక్కని మద్దతు సాక్షి, అమలాపురం: ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టాలో ఇప్పుడు మొదటి పంట సాగు చేసేందుకే రైతులు వెనకాడుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ సాగు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నెల 30న లేదా జూన్ 1వ తేదీన కాలువలకు నీరు వదిలేందుకు జల వనరుల శాఖ సిద్ధంగా ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. అన్నదాతలు మాత్రం సాగు భరోసా లేక వెనకాడుతున్నారు. జిల్లాలో మొత్తం వరి ఆయకట్టు 2.20 ఎకరాలు. గత ఏడాది ఖరీఫ్లో సుమారు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. రెండేళ్లుగా ఖరీఫ్ పూర్తిస్థాయిలో సాగవడం లేదు. ముంపు భయం, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. గత ఏడాది సుమారు 40 వేల ఎకరాల్లో సాగుకు దూరంగా ఉన్నారని అంచనా. ఈ ఏడాదీ ఇదే కొనసాగుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. బీమా భరోసా లేదు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. సాగు చేసిన 1.69 లక్షల ఎకరాలకు 43,900 ఎకరాల్లో మాత్రమే బీమా వర్తించింది. దీనిలో 90 శాతం బ్యాంకు రుణాలు ఉన్నవారికే. మిగిలిన రైతులు ఉచిత పంటల బీమా వర్తించక, ప్రభుత్వ పరిహారం అందక నష్టపోతున్నారు. సాగుకు దూరం చాలామంది రైతులు తొలకరి పంటకు దూరంగా ఉంటున్నారు. తీర ప్రాంత మండలాలు ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోనల్లో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయడం లేదు. తుపానులు, వరదలకు చేలు ముంపు బారిన పడి నష్టపోవడానికి తోడు పంట నష్టపోతే ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించకపోవడం కూడా కారణం. ఈ ఏడాది అష్టకష్టాలు పడి రబీ పండిస్తే కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకు తగ్గించి అమ్ముకోవాల్సి రావడంతో రైతుల్లో సాగు అంటేనే నిర్లిప్తత చోటు చేసుకుంది. అన్నదాత సుఖీభవ ఎప్పుడు? వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా (టీడీపీ ప్రభుత్వంలో దీనిని అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు) నిధులు విడుదల చేసేవారు. ఖరీఫ్ సాగు ప్రారంభంలోనూ, అక్టోబర్, జనవరిలో ఇలా మూడు దఫాలుగా నిధులు రైతులు ఖాతాలకు జమ చేసేవారు. తాము అధికారంలోకి వస్తే రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. తొలి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రూ.ఆరు వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలకు ఎగనామం పెట్టారు. జిల్లాలో 1,45,899 మంది రైతులకు (మండపేట నియోజకవర్గంతో కలిపి) ఇవ్వాల్సిన రూ.204.25 కోట్లు ప్రభుత్వం ఎగవేసింది. గత ఏడాది జూన్లో ఇవ్వాల్సిన నిధులను ఆగస్టులో గాని విడుదల చేయలేదు. లబ్ధిదారులను 1,33,933 మందికి కుదించి 11,957 మందికి అన్నదాత సుఖీభవ నిధులు ఎగ్గొట్టారు. మోంథా పరిహారం లేదు మోంథా తుపానువల్ల జిల్లాలో సుమారు 73 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. సుమారు 54 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరగగా, 21 ఎకరాల్లోని పంట నీట మునిగింది. 41 వేల మంది రైతులు నష్టపోయారు. హెక్టారుకు రూ.25వేల చొప్పున మొత్తం 29,544 ఎకరాలకు రూ.73.86 కోట్లు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంది. నవంబర్లో పంట దెబ్బతింది. ఆరు నెలలు దాటుతున్నా పరిహారం అందలేదు. -
1న సార్వాకు నీరు విడుదల
ఆత్రేయపురం : రాబోయే సార్వా వరి పంట సాగు కోసం గోదావరి సెంట్రల్ డెల్టా కాలువకు జూన్ నెల మొదటి తేదీన సాగునీరు విడుదల చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక నిపుణులు పవన్ తెలియజేశారు. ఆత్రేయపురంలో సార్వా వరిసాగు కోసం మండల వ్యవసాయ అధికారి జేవి పట్టాభిరామయ్య అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం వ్యవసాయ కార్యాలయంలో జరగాల్సి ఉండగా వేసవి ఉధృతి దృష్ట్యా రైతులు హాజరు కాలేరని వ్యవసాయ అధికారులు భావించారు. దీంతో సమావేశం ఆత్రేయపురం కార్యాలయాల సమీపంలో గల చెట్ల కింద పందిట్లో నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక వ్యవసాయ అధికారి పవన్ మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడుల సాధనకు వ్యవసాయ మెలకువలు పాటించాలన్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు సంఘమిత్ర, అన్నపూర్ణ, అభ్యుదయ రైతులు ముదునూరి వెంకటరాజు, ఎం ఎస్ ఎన్ రాజు, చేకూరి కృష్ణంరాజు, దండు సత్యనారాయణ రాజు, సాగి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి
అల్లవరం: రాత్రంతా కరెంట్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నా విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాడికోన పంచాయతీ పరిధిలోని వీరమ్మ చెరువు గ్రామస్తులు అల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ని శుక్రవారం ముట్టడించారు. మిట్ట మధ్యాహ్నం ఎండను లెక్క చేయకుండా విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి గ్రామంలో కరెంట్ లేకపోతే లైన్మేన్, విద్యుత్ అధికారులు స్పందించలేదని, ఫోన్ చేసినా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఎండ తీవ్రతతో చంటి పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నా కరెంట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ట్రాన్స్కో ఉన్నత అధికారులు లోఓల్టేటీ సమస్య పరిష్కరించారు. -
ఎమ్మెల్యే అనందరావు అవాస్తవాలు మాట్లాడారు
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అమలాపురం రూరల్: దళితులపై దాడులు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కూటమి నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. దళతులపై జరిగిన దాడులపై చర్చలకు ఎమ్మెల్యే, కూటమి నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. శుక్రవారం అమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడుల విషయంలో కూటమి నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ కాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎమ్మెల్యే ఆనందరావుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పల్నాడులోని పిన్నెల్లిలో దళితులపై దాడుల ఘటన, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితుల వెలివేత వంటి ఘటనలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణరాజు ఆకివీడులో 58 మంది దళితులపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టినప్పడు ఎమ్మెల్యే ఆనందరావు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కోనసీమలో గతంలో జరిగిన ఘటనలపై ఆనందరావు స్పందించకపోవడం విచారకరమన్నారు. డాక్టర్ సుధాకర్ మరణంపై తప్పుడు ప్రచారం చేయవద్దని, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేక మృతి చెందారని అన్నారు. దళితులకు నిజమైన అండగా ఉన్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఒక్క పూడికతీత పని అయినా చేశారా? జిల్లాలో పూడికతీత, డ్రైయిన్లు గుర్రప్ప డెక్క తొలగింపు పనులు 480 మంజూరు చేసినట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏప్రిల్ 25న పంట కాలువలు మూసివేయగా మే 23 తేదీ వచ్చినా ఒక్క పనిఅయినా ప్రారంభించారా అని ఎమ్మెల్సీ నిలదీశారు. నియోజకవర్గానికి రూ.3.90 కోట్ల పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారని, వీటిలో ఒక పని కూడా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. -
వడదెబ్బకు 13 మంది మృతి
పిఠాపురం రూరల్/సీతానగరం/ఆత్రేయపురం/కాకినాడ రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో వడగాడ్పులకు గురై గురు, శుక్రవారాల్లో 13 మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజు ఆరుగురు మృతి చెందారు. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన పిల్లి రమణ (55) ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పిఠాపురం సినిమా సెంటర్లో కొల్లు అప్పారావు, స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద ఒక యాచకుడు, పాదగయ క్షేత్రం వద్ద లారీ డ్రైవర్, పిఠాపురం మండలం గోకివాడలో దూలపల్లి అప్పారావు (43), ఎఫ్కె పాలెంలోని బ్రాందీ దుకాణంలో పనిచేస్తున్న కొమ్ము వెంకటరమణ (44) వడదెబ్బకు గురై మృతి చెందినట్టు ఎస్సై ఎస్కె జానీ బాషా తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో పెడూరి చిట్టిబాబు (33) గురువారం రాత్రి మృతి చెందగా, వెలమపేటలో 58 ఏళ్ల వ్యక్తి, పురుషోత్తపట్నం పంచాయతీ పరిధి రామచంద్రపురంలో కండవల్లి మంగమ్మ (88) శుక్రవారం మృతి చెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో వెలిచేరు గ్రామానికి చెందిన కూలి పనులతో జీవించే నాగిరెడ్డి రాముడు(60), నాగిరెడ్డి పనసరాముడు (75) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. కాగా ఉచ్చిలి గ్రామానికి చెందిన మాగాపు శ్రీను (45) వడగాలుల ప్రభావంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అలాగే కాకినాడ రూరల్ మండలం భావనారాయణపురం గ్రామానికి చెందిన గుర్రం అప్పన్న (38) సర్పవరం గ్రామ పంచాయతీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు. విధి నిర్వహణలో వడద్బెకు గురై పడిపోయాడు. స్థానికులు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
సిండికేట్ వ్యవస్థను రూపుమాపాలి
ఆక్వా రైతుల నిరసన అమలాపురం టౌన్: ఆక్వా రైతులు వరుస నష్టాలతో సతమవుతున్న క్రమంలో ఎక్స్పోర్టర్లు, మేతల కంపెనీల యాజమానులు సిండికేట్గా మారి ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ రైతులు అమలాపురంలో శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎర్ర వంతెన సమీపంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు అందజేశారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేతపట్టి ఆక్వా రైతులు నిరసన తెలిపారు. మొన్నటి వరకూ రొయ్యల మేతల ధరలు భారీగా పెంచేసి ఆక్వా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇప్పుడు మేతల ధరలు కొంత మేర తగ్గించారని గుర్తు చేశారు. అటు ఎక్స్పోర్టర్లు, ఇటు మేతల కంపెనీల యాజమానులు సిండికేట్ అయి ఎడాపెడా మోసం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి సిండికేట్ వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రొయ్యల ధరలను పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతు ప్రతినిధులు అల్లూరి రమేష్రాజు, దెందుకూరి దుర్గరాజు, వేగిరాజు వెంకటరాజు, సత్తి శ్రీను, త్సవటపల్లి నాగ భూషణం, అధికారి బాబ్జి, వాసు రాజు, మోటూరి కిరణ్ పాల్గొన్నారు. -
పోలీస్ సమస్యలపై ‘ఎస్పీ –సంపర్క్’
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఎస్పీ రాహుల్ మీనా పోలీసుల సమస్యలపై ‘ఎస్పీ– సంపర్క్’ పేరుతో పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం నిర్వహించిన ఎస్పీ– సంప ర్క్ కార్యక్రమంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తమ వ్యక్తిగత సమస్యలు ఎస్పీకి ఫోన్లో చెప్పుకుని పరిష్కారాన్ని అభ్యర్థించారు. బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్య లు, సర్వీస్ పరమైన ఇబ్బందులను ఎస్పీకి చెప్పుకున్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేలా వారి సంక్షేమం కోసం సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మీనా తెలిపారు. -
రూ.కోటితో భక్తులకు మౌలిక వసతులు
● అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నిర్ణయం ● పలు తీర్మానాలకు ఆమోదం అన్నవరం: భక్తులకు సుమారు రూ.కోటితో మౌలిక వసతులు కల్పించాలని అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) సమావేశం నిర్ణయించింది. చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్లోని ట్రస్ట్ బోర్డు హాలులో గురువారం జరిగిన సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమైన తీర్మానాలు ● భక్తులకు చల్లని తాగునీరు, వాష్ రూముల్లో మెరుగైన సదుపాయాల కల్పించాలి. ● సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, అంతకు మించి విరాళం ఇచ్చే భక్తులకు అన్నదానం బాండుతో పాటు సత్యదేవుని ఫొటో కూడా ఇవ్వాలి. ● రూ.22 లక్షలతో కేశఖండన శాల దిగువన పురుషులకు 40, సీ్త్రలకు 20 కలిపి మొత్తం 60 వాష్ రూములను అధునాతన శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయాలి. ● పశ్చిమ రాజగోపురం ఎదురుగా సెల్లార్లోని వాష్ రూములను రూ.11.48 లక్షలతో ఆధునిక శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయడానికి పిలిచిన లోయెస్ట్ టెండర్కు ఆమోదం. ● దేవస్థానం టోల్గేట్ వద్ద కళాశాల మైదానంలోని ఉచిత డార్మెటరీలు, వాటిల్లోని వాష్ రూముల మరమ్మతులకు రూ.7.02 లక్షల అంచనాతో పిలిచిన టెండర్లలో లోయెస్ట్ వచ్చిన దానికి ఆమోదం. ● రూ.17.52 లక్షల అంచనాతో వివిధ రోడ్ల మరమ్మతులకు పిలిచిన టెండర్లలో తక్కువగా కోట్ చేసిన దానికి ఆమోదం. ● విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయానికి గాను రెండు స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి. ● భక్తులకు వ్రతం, ఇతర సేవా టికెట్లు విక్రయించేందుకు గాను ఒక్కొక్కటి రూ.90 వేలతో కియోస్కుల కొనుగోలు. ఫ్లోరింగ్పై తెలుపు రంగు పెయింట్ పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న నేలపై కార్పెట్లు లేకపోవడంతో లారెస్ విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సులు ఎక్కే భక్తులు సీసీ రోడ్డుపై కాళ్లు కాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 10న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ మర్నాడు అక్కడ కార్పెట్లు వేశారు. దీనికి కొనసాగింపుగా అక్కడ భక్తుల కాళ్లు కాలకుండా ఫ్లోరింగ్పై రూ.11 లక్షలతో తెలుపు రంగు పెయింట్ వేయించాలని ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్లో రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా అంబటి భవాని (రామచంద్రపురం), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీగా కుసుమ శ్రీధర్(రాజోలు), రాష్ట్ర యంగ్ వింగ్ జాయింట్ సెక్రటరీగా నెల్లి సుధీర్ (రాజోలు)ను నియమించారు. సామాజిక న్యాయం కోసమే 20 సూత్రాల అమలు అమలాపురం రూరల్: పేదరిక నిర్మూలనకు, గ్రామీణాభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు జేసీ వైఖోడ్ నైదియాదేవి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఈ పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్య శాఖ అమృత్ 2.0 జలజీవన్ మిషన్, ప్రధాన మంత్రి సూర్య ఘర్, పీఎం కుసుమ, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ మిషన్ ప్రగతి నివేదికలపై సమీక్షించారు. వడగాడ్పులకు కూలీ మృతి అంబాజీపేట: వడగాడ్పులకు ఓ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. పుల్లేటికుర్రు చీకురుమిల్లివారిపేటకు చెందిన చీకురుమిల్లి గోపాలకృష్ణ (35) ఈ నెల 20న కూలి పనికి వెళ్లొచ్చి.. సమీపంలోని బోర్ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో భార్య దుర్గాభవాని వెళ్లి చూడగా, బోర్ వద్ద పడి ఉన్నాడు. వెంటనే స్థానికంగా వైద్య సేవలు అందించి అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ సుభాని తెలిపారు. మడుపల్లిలో మరొకరు.. అయినవిల్లి: మండలంలోని మడుపల్లిలో గురువారం వడగాడ్పులకు కూలీ మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రం బుకారో జిల్లా పిల్పిలోకు చెందిన బచ్చన్ మోహతా ఉపాధి కోసం మడుపల్లి వచ్చాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డ అతను పనులు ముగించుకుని తన నివాసం ఉన్న అయినవిల్లి వెళ్లుతుండగా మార్గ మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. అతని కూడా వచ్చినవారు 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీనిపై అయినవిల్లి పోలీస్ స్టేషన్తో ఫిర్యాదు చేశారు. బచ్చన్ మోహతాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్టీసీ ఎన్ఎంయూ ఉద్యోగుల ధర్నా అమలాపురం రూరల్: ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రభుత్వమే కోనుగోలు చేసి ఉద్యోగులతో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎన్ఎంయూ ఉద్యోగులు అమలాపురం డిపోలో గురువారం రెండోవరోజు ధర్నా నిర్వహించారు. అమలాపురం డిపోలో గ్యారేజ్ గేట్ వద్ద బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పందిరి రాంబాబు, డిపో కార్యదర్శి పితాని మణిరాజు ఆధ్వర్యం వహించారు. పెండింగ్లో ఉన్న ఎరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంటి పన్నులపై 5 శాతం తగ్గింపు అమలాపురం రూరల్: గ్రామాల్లో ఇంటి పన్నులపై ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ముందుస్తుగా ఈ నెల 31 తేదీలోపు చెల్లిస్తే 5శాతం తగ్గింపు వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి డి. శాంతాలక్ష్మి చెప్పారు. అమలాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో డీపీవో మాట్లాడారు. నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. డీఎల్పీఓ బొజ్జిరాజు, ఎంపీడీవో బాబ్జీ రాజు, డిప్యూటీ ఎంపీడీవోలు టీడీఏ శాస్త్రి, ఆర్ఎస్ఎస్ సురపరాజు పాల్గొన్నారు. -
ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం
రావులపాలెం: మండలంలోని రావుడుపాడులో నేషనల్ హైవే పక్కన ఉన్న ఆటోమొబైల్ షాప్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో కొత్తపేట ఫైర్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అమలాపురానికి చెందిన నెల్లి వెంకటేశ్వరరావుకు హైవే పక్కన కోనసీమ ఆటోమొబైల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ షాపు ఉంది. సుమారు ఏడాది నుంచి షాపు మూసివేసి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిపడేసిన సిగరెట్ వల్ల అగ్ని ప్రమాదం సంబంధించిందని అంచనా వేస్తున్నారు. షాపులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వైర్లు, ఆయిల్ డబ్బాలు కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం -
సీసీ కెమెరాలను పెంతుతాం
అమలాపురం టౌన్: రేంజ్ అంతటా సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. నేర పరిశోధనల్లో సీసీ పుటేజీలు కీలకం అవుతున్న క్రమంలో ఈ వ్యవస్థను అన్ని దుకాణాలు, ముఖ్య కూడళ్లు, పోలీస్ స్టేషన్లు వద్ద పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్) జిల్లా కార్యాలయాన్ని ఐజీ అశోక్కుమార్ గురువారం తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం వద్ద గల కమర్షియల్ కాంప్లెక్స్లో ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీ కెమెరాలను సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో పెంచుతామని చెప్పారు. నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్ట్లపై ఇటీవల పోలీస్ శాఖ విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో రేంజ్ పరిధిలో తగ్గు ముఖం పట్టాయని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లపై స్పందించి ఎలాంటి ప్రతి పోస్ట్లు పెట్టవద్దని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో అనవసర యాప్లను, లింక్లను తొందర పడి ఓపెన్ చేయవద్దని సూచించారు. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్పీ సీఐ వి.పుల్లారావు ఆయన వెంట ఉన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ -
ధరల ధడేల్.. క్వాంటమ్ ఫిడేల్
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి అన్ని రకాల వస్తువుల రేట్లు ఆకాన్నంటి జనం అల్లాడిపోతుంటే.. షరా మామూలుగా అమరావతి, క్వాంటమ్ వ్యాలీ, రూ. కోట్ల పెట్టుబడులు అంటూ కాలం వెళ్లదీస్తోంది. సాక్షి, అమలాపురం: వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొందామంటే కూర ‘గాయాలు’ అవుతున్నాయి. పాలు, పెరుగూ ఇలా వంటింట అవసరమైన అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. బయట పరిస్థితులైనా బాగున్నాయా? అంటే అదీ లేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తొలుత ఎగుమతులు నిలిచిపోయాయి. తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అన్నిరకాల వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. ఇల్లు కడదామంటే ఇసుక, కంకర, సిమెంట్, ఐరన్ ఇలా అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి. జిల్లాలో పండించిన వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేద్దామంటే డీజిల్ రేటు పెరిగిందని చెప్పి మినీ వ్యాన్లు, లారీల రవాణా చార్జీలు ఏకంగా 20 శాతం పెంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెండి.. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు చేయాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కూలీ నుంచి మధ్య తరగతి.. ఉన్నత వర్గాల వరకు రూపాయి ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. నింగిలో నిత్యావసరాలు ● ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబంపై నెలకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ అదనపు భారం పడుతోంది. జిల్లాలో 5.13 లక్షల కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల రోజుల వ్యవఽధిలో నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం పెరిగిపోయాయి. ● గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.60 వరకు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.994 వరకు పెంచడంతో ఆ ప్రభావం పరోక్షంగా ప్రజలపై పడింది. దీనివల్ల బయట ఆహార పదార్థాల ధరలను హోటళ్ల యజమానులు పెంచేశారు. ఈ నెలలోనే రెండుసార్లు పెట్రో ధరలు పెంచారు. పెరిగిన రవాణా చార్జీలు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలు పెరగడంతో ఆ మేరకు రవాణా చార్జీలు పెంచేశారు. దీంతో సామాన్యులపై అన్ని రకాలుగానూ భారం పడుతోంది. డీజిల్ లీటర్కు రూ.4.09 వరకు పెరిగిన విషయం తెలిసిందే. వారం రోజులలో రెండు దఫాలుగా ధరలు పెంచితే ఇదే సమయంలో కూరగాయల ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెంచారు. ఆటోల కనీస చార్జీ ప్రదేశాన్ని బట్టి రూ.20 నుంచి రూ.30 వరకూ పెరిగింది. గృహ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడి సొంతింటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రవాణా చార్జీలు పెరగడంతో జిల్లాలో సాగవుతున్న వరి, కొబ్బరి, మామిడి, అరటి, ఆయిల్ పామ్, వక్క, కోకో గింజలు, చేపలు, రొయ్యలు, కోడిగుడ్ల ఎగుమతి రైతులకు, స్థాని వ్యాపారులకు భారంగా మారింది. ఇదే సమయంలో ఎరువుల ధరలు బస్తాకు రూ.75 నుంచి రూ.300 వరకూ పెరిగి అన్నదాత వెన్ను విరిగింది. బతుకు బండికి భారీ కుదుపు తెలిసి వస్తున్న డీజిల్ దెబ్బ కాగుతున్న నూనెలు పెరిగిన రవాణా చార్జీలు, నిత్యావసరాలు ఆందోళనలో సామాన్యులు, వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు -
కులాలు, ఉప కులాల గణన జరగాలి
అల్లవరం: దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న గృహ గణన, జన గణనతో పాటుగా కులాలు, ఉప కులాల గణన జరగాలని, తద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని కులాల జనాభా, వారి స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాలని భావించి, దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. 1931 తర్వాత కుల గణన జరగలేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఉప కులాలు వారీగా కుల గణన జరిగినప్పుడు, దాని ఆధారంగా రిజర్వేషన్ల వర్గీకరణ, శాసీ్త్రయ పంపిణీకి అవకాశం ఉంటుదని తెలిపారు. ఉపాధి కూలీ మృతి అధికారుల నిర్లక్ష్యమే కారణం : వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఉప్పలగుప్తం: మండలంలోని సరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఉపాధి కూలీ మట్టపర్తి అనంతలక్ష్మి మృతి చెందింది. మంగళవారం ఉదయం ఉపాధి పనికి ఇంటి నుంచి బయలుదేరింది. ఇంతలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగి తలకి బలమైన గాయం తగలటంతో ఆమెను అమలాపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. అనంతలక్ష్మి మృత దేహానికి సరిపల్లిలో అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్డర్ పినిపే శ్రీకాంత్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు నివాళులర్పించారు. కో ఆర్డినేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కేవలం అఽధికారుల నిర్లక్ష్యం, అంబులెన్స్ సమయానికి రాకపోవడంతోనే అనంతలక్ష్మి మృతి చెందిందన్నారు. రఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. వదినపై దాడి కేసులో మరిదికి జైలు పి.గన్నవరం: వదినపై దాడి చేసి, గాయపరచిన కేసులో మరిదికి ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ కొత్తపేట జేఎఫ్సీఎం బి.జస్వంతి యాదవ్ గురువారం తీర్పు ఇచ్చారని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. మండలంలోని యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి సీతా మహాలక్ష్మి 2018 ఏప్రిల్ 20న తన కొత్త ఇంటి నిర్మాణం కోసం ఐదు ట్రాక్టర్ల ఇసుకను కొనుగోలు చేశారు. ఆమె ఊరువెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలోగా.. మరిది సిద్దిరెడ్డి నారాయణమూర్తి ఆ ఇసుకను మాయం చేశాడు. దీంతో మరిదిని నిలదీయడంతో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి తన కుమార్తెతో ఇంట్లో ఉండగా మరిది నారాయణమూర్తి తనపై దాడి చేసి గాయపరిచాడని సీతామహలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేశారు. ఫిర్యాది తరఫున కేసును పీపీ ఎన్.ఆనందరావు వాదించారు. ఏరియా ఆస్పత్రిని సందిర్శించిన కేంద్ర బృందం అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని, ఆ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో నడుస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ అండ్ సర్వీస్ సెంటర్ (డైస్)ను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ (పీఆర్సీ) డాక్టర్ రమణ యడ్లతో కూడిన బృందం బుధవారం సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేసింది. ఈ బృందానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమలత పలు విభాగాల పనితీరును వివరించారు. జిల్లాలో జరుగుతున్న ఆర్బీఎస్కే కార్యక్రమాలను, ప్రస్తుత స్థితిగతులను ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమలత పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బృందానికి తెలిపారు. -
వేట నిషేధానికి తూట్లు
● జోరుగా సముద్ర ఉత్పత్తుల విక్రయం ● మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు తాళ్లరేవు: మండల పరిధిలోని మట్లపాలెం ఫిష్ మార్కెట్ వద్ద సముద్ర ఉత్పత్తులను జోరుగా విక్రయిస్తున్నారు. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి సమయంలో వేట చేయరాదంటూ ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు మత్స్యకారులు యధేచ్ఛగా సముద్రంలో వేట సాగిస్తున్నారు. దీంతో మత్స్య సంతానోత్పత్తిపై ఆ ప్రభావం పడుతోంది. సాధారణంగా ఏప్రియల్, మే, జూన్ నెలల మధ్యలో మత్స్య సంతానోత్పత్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యేటా ఏప్రిల్ 15వ తేదీనుంచి జూన్ 15 వరకు చేపల వేటపై నిషేధం విధిస్తుంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం నెలకు రూ.10వేల చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ కొందరు మత్స్యకారులు నిబంధనలను ఉల్లంఘించి సముద్రంలో రహస్యంగా వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండదండలతోనే ఇలా జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం మట్లపాలెం మార్కెట్లో సముద్ర ఉత్పత్తులైన సొరలు, నెత్తళ్లు, పీతల విక్రయం జోరుగా సాగింది. వేట నిషేధం ఉండగా వీటిని ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా, కొందరు మత్స్యశాఖ అధికారుల సహకారంతో దొంగ వేట కొనసాగుతుందని పలువురు మత్స్యకారులు బాహాటంగానే చెప్పడం గమనార్హం. దీనిపై తాళ్లరేవు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లావణ్యను వివరణ కోరగా సముద్రంలో వేటపై నిషేధం ఉందని, దానిని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సముద్ర ఉత్పత్తులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. -
సూరీడి చెడుగుడు
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రచండ భానుడు తీక్షణతకు వాతావరణం నిప్పుల గుండంగా మారుతోంది. గడిచిన రెండు రోజులుగా జిల్లాలో వడగాడ్పులు వీస్తున్నాయి. జిల్లాలో బుధవారం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, 29 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిట్ట మధ్యాహ్న సమయంలో జనం రోడ్ల మీదకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్ర సమయంలో కూడా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఉక్కపోత వాతావరణంతో జనం అల్లాడుతున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనీసం 45 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోనసీమ జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కోనసీమలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత -
డ్రగ్ ట్రేడర్స్ బంద్ విజయవంతం
అమలాపురం టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన మెడికల్ షాపుల బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్తకులు తమ మెడికల్ షాపులను మూసివేసి బంద్ పాటించారు. జిల్లాలో దాదాపు 1,200 మెడికల్ షాపులు బంద్తో మూత పడ్డాయి. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో మెడికల్ వర్తక సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. అనంతరం వారు కలెక్టరేట్కు ప్రదర్శనగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ మహేష్కుమార్కు అందజేశారు. మెడికల్ షాపుల వర్తకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అమలాపురంలో జరిగిన నిరననలో జిల్లా డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీఎస్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మశీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ మందులు అమ్మకాల్లో ఇస్తున్న అనైతిక డిస్కౌంట్ విధానాన్ని విడనాడాలని కోరారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న జీఎస్ఆర్ 220, 817లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొమ్మూరి వీసీహెచ్ ప్రసాద్, ఏఎస్వీ వెంకటేశ్వరరావు, మోకా వెంకట సుబ్బారావు, శిరగం వెంకటేశ్వరరావు, కాళ్లకూరి కృష్ణ ఈ నిరసనలో పాల్గొన్నారు. -
మన్నూమిన్నూ గానక..
సాక్షి, అమలాపురం: గోదావరి పొడవునా అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక దోచేస్తున్నారు. జొన్నాడ ఫ్లై ఓవర్ పేరుతో ఏటా టన్నుల కొద్దీ లంక మట్టిని తవ్వేస్తున్నారు. సముద్ర తీరంలో బొండు ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇవన్నీ సరిపోనట్టుగా ఇప్పుడు పచ్చని డెల్టా పంట చేల మీద పడ్డారు. చేలల్లో మెరక తొలగింపు పేరుతో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నాయకుల కనుసన్నల్లో.. జిల్లాలో మట్టి మాఫియా విజృంభిస్తోంది. కూటమి పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో డెల్టా చేలల్లో టన్నుల కొద్దీ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వందల కొద్దీ ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. డెల్టాలో ఎటుచూసినా చేలల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతూ కనిపిస్తున్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. సాధారణంగా వేసవిలో రైతులు చేలల్లో మెరకను తొలగించే పనులు చేస్తుంటారు. మెరక తొలగించి ఆ మట్టితో చేలగట్లను పటిష్టం చేసుకుంటారు. ఇప్పుడు వాటి స్థానంలో మట్టి అమ్మకాలు మొదలయ్యాయి. అమలాపురం, రామచంద్రపురం పట్టణ శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పొలాలను మెరక చేసేందుకు ఈ మట్టిని ెవినియోగిస్తున్నారు. చేతులు తడపడంతో నోరు మెదపడం లేదా? ఇటీవల డెల్టాలో రైతులు వరిసాగుకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు మళ్లిన విషయం తెలిసిందే. కూరగాయలు, మామిడి, కొబ్బరి వంటి పంటల కోసం పెద్ద ఎత్తున చేలను మెరక చేస్తున్నారు. ఇందుకు మట్టి, తువ్వ ఇసుక అవసరం ఉంది. ఇదే మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. చేలల్లో ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారంటే మట్టి అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం ట్రాక్టరు జిగురు మట్టి చేల వద్ద రూ.900 నుంచి రూ.1,400 వరకు ఉంది. అదే బొండు ఇసుక, ఎర్ర ఇసుక అయితే రూ.1,200 నుంచి రూ.రెండు వేలు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ఈ ధరలు గత ఏడాది కన్నా అధికం కావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మౌనం పాటిస్తున్నారు. మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ మౌనం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెరక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మెరక మట్టిని తొలగించే అనుమతులు ఉన్నా బయటకు తరలించేందుకు అనుమతులు ఉండవు. అయినా రోజూ వందలాది ట్రాక్టర్ల మట్టి తరలిపోతూనే ఉంది. కలసి వచ్చిన కాలువలకు నీటి విడుదల వాయిదా మే 15వ తేదీన డెల్టా పంట కాలువలకు నీరు విడుదల చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసిందే తప్ప నీరు విడుదల చేయలేదు. కనీసం పంట కాలువలకు నీరు వదిలి, కొంతమంది రైతులైనా సాగు మొదలు పెట్టి ఉంటే మట్టి తవ్వకాలు అదుపులోకి వచ్చేవి. ఇప్పుడు నీరు విడుదల చేయకపోవడంతో మట్టి మాఫియా మరింత చెలరేగిపోతోంది. జూన్ 1వ తేదీకి నీరు ఇచ్చినా 15వ తేదీ వరకు జిల్లాలో చేలల్లో మట్టి తవ్వకాలు నిర్విఘ్నంగా సాగనున్నాయి. జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా మొన్న లంక మట్టి.. నిన్న బొండు ఇసుక.. నేడు చేలల్లో మట్టిపై కన్ను మెరక పనుల పేరుతో దందా డెల్టా కాలువలకు నీటి విడుదల వాయిదా మరింత విచ్చలవిడిగా వందలకొద్దీ ట్రాక్టర్లలో తరలింపు ముంపునకు ఇదీ ఒక కారణం భారీ వర్షాలు, తుపానుల సమయంలో డెల్టాలోని తీర ప్రాంత మండలాల్లోనే కాకుండా.. ఐదేళ్లుగా మెరక ప్రాంతాలలో కూడా చేలు ముంపుబారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ముంపునకు భయపడే రైతులు ఏటా సుమారు 40 వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు వదిలేస్తున్నారు. డెల్టాలో మురుగునీటి కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండడానికి తోడు చేలల్లో మట్టి తవ్వకాలు కూడా ముంపునకు కారణమవుతున్నాయి. డెల్టా పంట, మురుగునీటి కాలువ వ్యవస్థ అనేది కాంటూరు వ్యవస్థలో ఉంటాయి. ఒకటి నుంచి రెండు అడుగుల లోతున కాలువలు తవ్వకాలు చేస్తే నీరు పారదు. చేల తవ్వకాలు చేస్తే ముంపు నీరు నిలిచిపోతోంది. ఇటువంటి చోట మట్టి మాఫియా రైతులను మభ్యపెట్టి లోతున తవ్వకాలు చేస్తున్నారు. పై వరుస మట్టి తీస్తామని చెప్పి ఏకంగా జేసీబీలు వంటి వాహనాలు వినియోగించి రెండు అడుగులు లోతున తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల మట్టి తీసిన చేలలోనే కాకుండా ఆయకట్టు ఉన్న సరిహద్దులోని చేలు కూడా ముంపునకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి అనుమతి లేని అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
అమలాపురం రూరల్: ఆర్టీసీలో విద్యుత్ బస్సులు కోనుగోలు చేసి ఉద్యోగులతో నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు అమలాపురం డిపోలో బుధవారం ధర్నా నిర్వహించారు. అమలాపురం డిపోలో గ్యారేజ్ గేట్ వద్ద బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోలకు చెందిన ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పందిరి రాంబాబు, డిపో కార్యదర్శి పితాని మణిరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనలో చేశారు. ఽప్రైవేటీకరణ నిలిపివేయాలని, సీ్త్ర శక్తి జీరో టికెట్ నిలుపుదల చేసి మిగతావారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఏరియర్స్, లీవ్ ఎన్ కాష్మెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ఇవ్వాలని, ఈహెచ్ఎస్ మినహాయించి పాతవ్యై విధానం కొనసాగించాలని, రిటైర్ చనిపోయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ ఎమౌంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ తగదు రామచంద్రపురం: దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం దారుణమని ఎన్ఎంయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎంయూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రపురం ఆర్టీసీ డిపో గేట్ వద్ద రెండు రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో ఆర్టీసీ కార్మికులు, ఎన్ఎంయూ నేతలు బ్యాడ్జీలు ధరించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎంయూ డిపో ప్రెసిడెంట్ సీహెచ్వీ రావు, సెక్రటరీ బండి ముత్యాలరావు, రీజనల్ కమిటీ నాయకులు ఎస్ సీహెచ్ వేంకటేశ్వర్లు జీడీవీ కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆర్టీసీని ప్రైవేటు పరం దిశగా ఈ ప్రభుత్వం తీసుకువెళ్లటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్టీసీని నష్టాల సాకుతో ప్రైవేటు పరం చేయటం తగదన్నారు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, ఎన్ఎంయూ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పోరాటం చేస్తారని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. -
ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి
అమలాపురం రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జాయింట్ కలెక్టర్ నైదియాదేవి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో వినియోగదారుల రక్షణ, జిల్లా పౌర సరఫరాల విజిలెనన్స్ కమిటీ సమావేశాలు ఆమె అధ్యక్షతన నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, వినియోగదారుల హక్కుల రక్షణపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచాలన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీలు చేయాలని వినతి ప్రైవేట్ హాస్పిటల్స్, లాబ్స్, ఫార్మశీలలో ఆరోగ్య శాఖాధికారులు, సివిల్ సప్లై శాఖాధికారులు తనిఖీలు చేయాలని కోకో ఫెడ్ ప్రతినిధులు జేసీని కోరారు. కోనసీమ కోకోఫెడ్ చైర్మన్ అరిగెల బలరామూర్తి, సభ్యులు జిఎల్ఎన్ శర్మ, మాలే శ్రీనివాస నాగేష్ జేసీ నైదియాదేవిని కోరారు. ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచేందుకు స్టోర్ రూమ్ కోనసీమ జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచేందుకు టెస్టింగ్ వంటి సౌకర్యాలకు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వసతుల కల్పనకు స్థలాన్ని కేటాయిస్తామని జేసీ వెల్లడించారు. అమలాపురంలో స్థలం కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులు ఏపీ ఈపీడీసీఎల్ ఇంజినీర్లతో స్థానిక జాయింట్ కలెక్టర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. -
సహాయక జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లా ఎస్జీఎస్డబ్ల్యూ ప్రధాన కార్యాల యంలో ఖాళీగా ఉన్న ఒక సహాయక జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు డిగ్రీ అంతకు మించిన అర్హత ఉండాల న్నారు. దరఖాస్తులు ఈనెల 20, 21 తేదీలలో కలెక్టరేట్లో ఎస్జీ ఎస్డబ్ల్యూ సెక్షన్ కార్యాలయ పనివేళల్లో స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉద్యోగ భర్తీలో ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవని ఆయన తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియజేస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు కమాండ్ కంట్రోల్ రూమ్ అమలాపురం రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి జాన్ 4 వరకు నిర్వహిస్తునట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆయా తేదీల్లో ఆదివారాలతో సహా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 30 థియరీ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, పరీక్షల పర్యవేక్షణకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల స్వీకరణకు ముగ్గురు అధికారులను నియమించినట్టు ఆయన తెలిపారు. జన గణన దేశ వికాసానికి నాంది డీఆర్ఓ సుబ్బారావు అమలాపురం రూరల్: దేశ భవిష్యత్, ప్రణాళిక అధ్యయనానికి జన గణన అత్యంత కీలకమని డీఆర్వో వి.సుబ్బారావు తెలిపారు. మంగళవారం రాష్ట్ర జన గణన సంచాలకుడు జె.నివాస్ అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం డీఆర్ఓ మాట్లాడుతూ తొలి దశలో భాగంగా మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఇళ్ల జాబితా, గృహ గణన హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ ముమ్మ రంగా సాగుతోందని తెలిపారు. స్వీయ గణనలో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్లైన్ ద్వారా ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ధ్రువీకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోనసీమ జిల్లా 79.47 శాతంతో ఏడో స్థానంలో నిలిచిందన్నారు. మహిళా దొంగల ఆచూకీ తెలపండిజగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా దొంగలు ఆటోలో తిరుగుతూ బ్యాగ్లు చోరీ చేయడం, బస్లు ఎక్కేటప్పుడు, వెనక వుండి విలువైన వస్తువులు, హేండ్ బ్యాగ్లు చోరీ చేస్తున్నారని అన్నారు. ఒక ముఠా సభ్యులు ఈ నేరాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తమ వాహనాలను రోడ్లుపై నిలపాలని, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ఆటోలో ప్రయాణించే వారి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, ఎస్సై రఘునాథరావు పాల్గొన్నారు. -
స్వర్ణ దుకాణాల బంద్ విజయవంతం
● స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని నిరసన ● బంగారం కొనద్దన్న మోడీ పిలుపుతో ఆందోళన అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని, బంగారం కొనద్దన్న పీఎం నరేంద్రమోడీ పిలుపుతో స్వర్ణకారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలో దాదాపు 1400, అమలాపురం పట్టణంలో 300 దుకాణాలను మూసివేసి స్వర్ణకారులు బంద్లో పాల్గొన్నారు. జిల్లా విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్లో పాల్గొని అనంతరం స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. అమలాపురం వీధుల్లో వారు సమస్యలపై నినదిస్తూ ర్యాలీ చేసి అనంతరం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బ్యాంకుల్లో బంగారం తాకట్టు మీద రూ.2.50 లక్షలు దాటితే ఇన్కం టాక్స్ రిట్నర్నులు ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసి రూ.10 లక్షల పైబడిన వాటికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. అమలాపురం గోల్డ్ మార్కెట్లో పట్టణ విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. స్వర్ణకార సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చేబ్రోలు చంద్రశేఖర్, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు తాళాబత్తుల అప్పలాచార్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు కట్టోజు సన్నయ్యదాసు, అమలాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మానేపల్లి సత్యప్రకాష్ పాల్గొన్నారు. -
మళ్లీ చమురు వడ్డన
● లీటరుకు 95 పైసల చొప్పున పెంపు ● జిల్లాలో రోజుకు 10.80 లక్షల లీటర్ల విక్రయాలు ● రోజుకు రూ.10.20 లక్షల అదనపు భారం సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రో ధరలు పెంచింది. జిల్లాలో లీటరుకు 96 పైసల చొప్పున పెంచింది. గడిచిన వారం రోజులలో ధరల పెంపు ఇది రెండోసారి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.10.36 లక్షల అదనపు భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోల్, 4.80 లక్షల డీజిల్ చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. ఈ పెంపుతో జిల్లాలో వినియోగదారులపై రూ.10.20 లక్షల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.112.26 ఉండగా, ఇది రూ.113.21కు పెరగనుంది. డీజిల్ లీటరు రూ.100.51 ఉండగా, ఇది రూ.101.46కు పెరిగింది. గత శుక్రవారం 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.3 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వాహనాల రవాణా చార్జీలు పెరుగుతాయని ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
ఎరువు.. ధరవు
పెరవలి (కొవ్వూరు): రైతు సంక్షేమమే ధ్యేయం, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం అండగా నిలవక, పైగా అదనపు భారం మోపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350లు పెరగటం రైతుల్లో కలవరం రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నెత్తిన పెనుభారం మోపి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ రెండేళ్ల కాలంలోనే మూడుసార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే కూలీల మొదలు అన్ని ఖర్చులు పెరిగిపోవటం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు. 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. వీటిలో కొబ్బరి 8,050, కోకో 5,517, పామాయిల్ 20,219, అరటి 7,500, మామిడి 5,500, మొక్కజొన్న 1,500, కూరగాయలు 4,125 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పొగాకు, బొప్పాయి, జామ, బత్తాయి, జీడిమామిడి వంటి పంటలు సాగు చేస్తున్నారు. పెరుగుతున్న వినియోగం పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ ఎరువుల వాడకంతోపాటు పెట్టుబడి కూడా పెరిగింది. ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో టన్నుపై రూ.వేయి నుంచి రూ.4 వేల వరకు ఎరువుల ధరలు పెరగటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే సన్న, చిన్న కారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. పంటలు వచ్చిన తరువాత అసలు, వడ్డీతో అప్పు తీర్చవలసి రావటంతో ఆదాయం ఎరువుల దుకాణాల వద్దే సరిపోతోందని వాపోతున్నారు. నాడు అన్నదాతకు అండదండలు వైఎస్సార్ సీపీ పాలనలో ఒక్కసారి కూడా ఎరువుల ధరలు పెంచలేదు. పైగా పెట్టుబడి సాయం కూడా అందించి రైతులను ఆదుకున్నారు. ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్ట పరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని ఆర్బీకేలో అందుబాటులో ఉంచేవారు. నేడు ప్రభుత్వం విఫలం 2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాలుగుసార్లు ఎరువుల ధరలు పెంచగా, ప్రస్తుత రెండేళ్ల పాలనలోనే మూడుసార్లు పెంచారు. ఈయన పాలనలో తాము పడే పాట్లు వర్ణనాతీతంగా ఉంటాయని, వ్యవసాయాన్ని ఆదుకోనే పనులు చేయటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి ఎరువుల కోటాను రప్పించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఎరువుల కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నా చర్యలు తీసుకోవటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. వ్యవసాయం ఎలా చేయాలి పెంచిన ఎరువుల ధరల వల్ల ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు అదనపు భారం పడుతుంది. వ్యవసాయం ఎలా చేయాలి. – పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350 పెంచిన ప్రభుత్వం చంద్రబాబు పాలనలో ఇప్పటికే మూడుసార్లు పెంపు వైఎస్సార్ సీపీ హయాంలో ఒక్కసారి కూడా పెంచని ప్రభుత్వం జిల్లాలో వరి సాగు 76,941, ఉద్యాన పంటలు 70 వేల హెక్టార్లలో సాగు రైతుకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల అదనపు భారం ఎరువుల వివరం పాత కొత్త పెరిగింది 50కిలోల ధర ధర ధరపొటాష్ 1,850 1,975 125 సూపర్ ఫాస్పేట్ 615 775 160 16–20–13 1,400 1,750 350 20–20–13 1,450 1,800 350 10–26–26 1,950 2,025 75 12–32–16 1,850 1,950 100 16–16–16 1,675 1,950 275 14–35–14 2,150 2,350 200 -
పోలీస్ గ్రీవెన్స్కు 25 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్లు తమ చాంబర్ల నుంచి ఈ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఎస్పీ, ఏఎస్పీలకు ఫిర్యాదు పత్రాలు అందించారు. అర్జీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి పారదర్శంగా దర్యాప్తు చేసి, పరిష్కారం వేగవంతంగా చూపాలని ఎస్పీ మీనా జిల్లాలోని సీఐలు, ఎస్సైలను ఫోన్లలో ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. -
సామాన్యులకు మేలు ఇదేనా?
పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరకులు ధరలు పెరిగి సామాన్యుల బతుకులపై భారం మోపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేస్తాం, సంపద సృష్టిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు భారం మోపుతున్నారు. –పొన్నాడ వెంకట సతీష్కుమార్, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇంధన ధరలను పెంచి భారం మోపారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారో? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువులపై పడనుంది. –పాముల రాజేశ్వరీదేవి, రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్ని వర్గాలపైనా ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తూ సామాన్యులపై మోయలేని భారం వేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమం విషయంలోనే కాదు.. అన్ని రంగాల్లో భారం మోపారు. –డాక్టర్ పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్


