breaking news
Dr B R Ambedkar Konaseema
-
దేవస్థానం మాజీ చైర్మన్ మృతి
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పి.గన్నవరం నియోజకవర్గ ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రిక్రూట్మెంట్ డ్రైవ్కు 86 మంది హాజరు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ బుధవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇంటర్ూయ్వలు నిర్వహించిన అనంతరం వీరిలో సంస్థకు అవసరమైన వారిని ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. 2024–25లో బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ పూర్తి చేసి, పదో తరగతి నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్కి హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై తే బీఎస్సీ వారికి రూ.2.10 లక్షలు, ఎంఎస్సీ వారికి రూ.2.60 లక్షలు వార్షిక వేతనంగా చెల్లిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: ప్రస్తుత రిజిస్ట్రేషన్ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరగవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా సీహెచ్ జానకీదేవి అన్నారు. డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలు వల ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రయ విక్రయదారుల ఆధార్కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి తప్పులు జరగవన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఎటువంటి లోపాలు లేకుండా వేగవంతంగా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఐజీగా జానకీదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ, కోనసీమ రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తదితరులు కలిశారు. -
వానొస్తే.. అవస్థే..
సాక్షి, అమలాపురం: గుంతలు లేని రోడ్లు.. గోతులు లేని రోడ్లు.. కొత్త కొత్త రోడ్లు.. సాఫీగా సాగిపోయే ప్రయాణం అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకూ, చోటా నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని రోడ్లకు మరమ్మతులు చేసి మొత్తం జిల్లాలోని రోడ్లు అన్నీ తీర్చిదిద్దామని గొప్పలకు పోతున్నారు. ఆర్అండ్బీ పరిధిలో రూ.32 కోట్లతో రోడ్లను ఆధునీకరించామన్నారు. అయితే ఏడాది కూడా కాకుండానే పూడ్చిన గోతులకు తోడు, కొత్త గోతులు వచ్చి చేరాయి. రెండు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలోనూ గోతుల్లో నీరు చేరి ప్రయాణం నరక ప్రాయంగా మారింది. ఇక పంచాయతీరాజ్ రోడ్లను నిధుల కొరత పట్టి పీడిస్తోంది. ఉపాధి పథకంలో వీధుల్లో వేసిన సీసీ రోడ్లకు సొమ్ములు లేవు. దీనితో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో మండలాల వారీగా రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టుఅమలాపురంఅమలాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధాన ఆర్అండ్బీ, పీఆర్ రోడ్లు గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసముండే హౌసింగ్ బోర్డుకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. నల్ల వంతెన – ఎర్ర వంతెనల మధ్య ఉన్న ఈ రోడ్డుపై గోతులు లెక్క పెడితే గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేస్తారనే స్థాయిలో ఈ రోడ్డు ఉందని సామాజిక మాధ్యమాలలో సైటెర్లు వస్తున్నారు. కానీ ఈ రోడ్డు కనీస మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు.ఎమ్మెల్యే ఆనందరావు సొంత మండలం ఉప్పలగుప్తంలో రోడ్లు దుస్థితికి ఉప్పలగుప్తం నుంచి మునిపల్లి, చినగాడవిల్లి మీదుగా ఉప్పూడి వెళ్లే ప్రధాన రహదారి ఒక మచ్చుతునక. మునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పొడవునా వర్షం నీటితో చెరువును తలపిస్తోంది. చినగాడవిల్లి వద్ద స్థానికులు కొంత వరకు ఉన్న పీఆర్ రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నారు. అక్కడ మినహా మిగిలిన చోట్ల నీటితో నిండిపోయింది.ఆలమూరు ఆలమూరు మండలం కొత్తూరు నుంచి వెదురుమూడి వెళ్లే ఆర్అండ్బీ రహదారి అధ్వానంగా మారింది. పేరుకు రోడ్డు గానీ అన్నీ గోతులే. గోతులు పూడ్చిన రహదారిపై గోతులు పడ్డాయి. వర్షం కురిసి రోడ్డు మునిగితే ఎక్కడ గొయ్యి ఉందోకూడా తెలియని పరిస్థితి నెలకొంది.అయినవిల్లిఅయినవిల్లి మండలం ముక్తేశ్వరం నుంచి కె.జగన్నాథపురం మీదుగా ముమ్మిడివరం వెళ్లే రహదారి గోతులతో నిండిపోయింది. సుమారు 10 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరగా మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మరిన్ని గోతులు పడడంతో ప్రయాణం చేసే పరిస్థితి లేదు. -
నానో అభ్యుదయ రైతులకు సన్మానం
ముమ్మిడివరం: నానో ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు అన్నారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లా నానో అభ్యుదయ రైతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోసుబాబు మాట్లాడుతూ గత రెండు సీజన్లలో నానో ఎరువులు ఉపయోగించి అభ్యుదయ రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇఫ్కొ నానో బాటిల్ కొనుగోలుపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉచితంగా అందిస్తుందన్నారు. నానో అభ్యుదయ రైతులైన మండపేట వెలగతోడుకు చెందిన ఎం.రామసురేష్, తాపేశ్వరానికి చెందిన డి.సతీష్, అలమూరు మండలానికి చెందిన బి.అబ్బులు చౌదరి, ముమ్మిడివరం మండలం ఠానేల్లంకకు చెందిన పోలిశెట్టి బోస్ శ్రీనివాసరావులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహయ సంచాలకులు ఎంఏ షంశీ, వ్యవసాయాధికారులు ఏ.అచ్యుతరావు, ఎస్.ప్రశాంత కుమార్, ఇఫ్కొ జిల్లా మేనేజర్ శ్యామ్ ప్రసాద్బాబు, రైతులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై ఏకాదశి పూజలు
● స్వామివారిని దర్శించిన 20 వేల మంది ● దేవస్థానికి రూ.20 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన, అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ పూజలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. -
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బుధవారం డీఎస్ఏ టీటీ(టేబుల్ టెన్నిస్) హాల్లో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ టీటీ చాలా వేగవంతమైన క్రీడ అన్నారు. ఎంతో ఏకాగ్రత ఉంటేనే గాని టీటీలో రాణించలేమన్నారు. టీటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టీటీ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 120 మంది బాలబాలికలు ఎంపికలకు హాజరయ్యారు. అనంతరం టీటీ ఆడి డీఎస్డీఓ శ్రీనివాస్కుమార్ ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ నిర్వహణ కార్యదర్శి రవిరాజు, పీడీలు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 మహిళా కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
ముగిసిన టీఓటీల శిక్షణ
సర్టిఫికెట్లు అందజేసిన వైస్ ప్రిన్సిపాల్ సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని టీఓటీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ–జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం–పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు కావసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సుశీల, కేఆర్ నీహారిక, ఎస్ఎస్ శర్మ, శ్రీనివాసరావు, ఎం.చక్రఫణిరావు పాల్గొన్నారు. -
కక్షతోనే హత్యాయత్నం
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్ వద్ద పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో సీ–4 ప్లాట్లో డీజిల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్ హౌస్లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం ఎస్సై శ్రీనివాస్కుమార్ వివరాల ప్రకారం నిందితుడు వ్యక్తిగత కక్షతోనే 14న అర్ధరాత్రి సీ–4 ప్లాట్లో నివాసం ఉంటున్న పిల్లి సత్తిబాబుపై హత్యాయత్నం చేసేందుకు ప్లాట్ హాలులో డీజిల్ పోసి నిప్పు పెట్టాడని ఎస్సై తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఏ హానీ జరగలేదని, అయితే హాలులో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయిందన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
● రేపు కామనగరువులో ఆందోళన ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రామచంద్రపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటుకు తలపెట్టి, ఐదు కళాశాలలను పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ నేపథ్యంతో పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలోని కామనగరువులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామన్నారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు, యువజన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలిరావాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పోలినాటి వర ప్రసాద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మాదిరెడ్డి పృథ్వీ రాగ్, కె.గంగవరం మండలం యువజన విభాగం అధ్యక్షుడు మేడిశెట్టి గోవింద రాజు, రామచంద్రపురం టౌన్ యువజన విభాగం అధ్యక్షుడు సెలగాల మధు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లంక నవీన్, ఎ.దొరబాబు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి తాళ్లరేవు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని హుండీలను 27 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,15,09,966, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.34,11,312తో మొత్తం రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అలాగే 28 గ్రాముల బంగారం, రెండు కేజీల 180 గ్రాముల వెండి, కానుకలుగా వచ్చాయన్నారు. నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవదాయశాఖ అధికారి, ఏసీ సత్యనారాయణ వ్యవహరించారు. దేవదాయ ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, వెలిచేరు గ్రూపు దేవాలయాల ఈఓ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 10 నుంచి బ్రహ్మోత్సవాలు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వస్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుంచి జరగనున్నాయని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రం భక్తుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. -
విద్యుత్ ఉద్యోగుల ధర్నా
అమలాపురం రూరల్: రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర, డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు బుధవారం అమలాపురంలోని ఈపీడీసీఎల్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని డివిజన్ల యూనియన్లు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ఉద్యోగులు హాజరై, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ చైర్మన్ ఎంవీ రమణ, జిల్లా కన్వీనర్ ఎ.రాజారత్నం మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని, ప్రభుత్వంలో సీపీఎఫ్ కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులకు వర్తింప చేయాలని, కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్పింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
శంషాబాద్ బస్సుల వేళల్లో స్వల్ప మార్పులు
అమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదారాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఏసీ బస్సుల సమయాలను బుధవారం నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ తెలిపారు. అమలాపురం నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరే సర్వీస్ ( 2456)ను 5 గంటలకు, 7.30 సర్వీస్ (23545)ను 7 గంటలకు, మధ్యాహ్నం 12.30 సర్వీస్ (23507)ను 12 గంటలకు మార్పు చేశామన్నారు.బార్ల లైసెన్సులకు దరఖాస్తులు నిల్అమలాపురం టౌన్: జిల్లాలోని బార్ల లైసెన్సులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జిల్లా ఇన్చార్జి ఎకై ్సజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని పది బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం (17వ తేదీ) ఆఖరి గడువన్నారు. కానీ రాత్రి 7.30 గంటల వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్పారు. కాగా.. జిల్లాకు మొత్తం 11 బార్లు కేటాయించారు. వీటిలో రెండు గీత కులాలకు ఇచ్చారు. అయితే గత నెల 29న ఇవే బార్లకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా అమలాపురంలోని మూడు బార్లకు గాను ఒక బార్కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో మిగిలిన పదింటికి రెండో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వీటికి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.విశ్వకర్మకు నివాళిఅమలాపురం రూరల్: సమాజంలో ప్రతి పనికీ విశ్వకర్మ ప్రేరణ ఉందని, ఆయన స్ఫూర్తి ప్రదాత అని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను విశ్వకర్మ స్ఫూర్తితో చేపట్టాలన్నారు. డీఆర్వో మాధవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కాశీ విశ్వేశ్వరరావు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.స్మార్ట్ కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దడానికి చర్యలుఅమలాపురం రూరల్: కొన్ని స్మార్ట్ రేషన్ కార్డుల్లో జిల్లా పేరు తూర్పుగోదావరిగా నమోదు కావడంతో దాన్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభిమానులు, ప్రజలు, సామాజిక సంఘాల ప్రతినిధుల మనోభావాలు, ఆవేదనను జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా మార్పు చేశామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇది కనిపిస్తుందన్నారు. ఎడిట్ ఆప్షన్ రాగానే భౌతికంగా కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపిందన్నారు.ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో మిగిలిన సీట్లకు నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీజే వర్మ బుధవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఏదైనా ఆన్లైన్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను కాకినాడ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు 29వ తేదీన, ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశాలకు 30వ తేదీన హాజరుకావాలని, ఇతర వివరాలకు 94404 08182 నంబరుకు సంప్రదించాలన్నారు.20న జాబ్మేళాబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కృష్ణప్రభాస్ పేపర్ లిమిటెడ్ 25, టీమ్లీజ్ సంస్థ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, పదో తరగతి అపై ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నెంబరుకు సంప్రదింవచ్చన్నారు. -
మందకొడిగా ఈ–క్రాప్
● 1.61 లక్షల ఎకరాల్లో నమోదు ● మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు ● ఈ నెలాఖరు వరకు గడువు ● నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు కొత్తపేట: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతోంది. రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన పంట నమోదు (ఈ–క్రాప్) మాత్రం అనుకున్నట్లు సాగడం లేదు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 50 శాతం కూడా పంట నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వీఏఏలపై ఒత్తిడి చేస్తున్నారు. వీఏఏలకు పని ఒత్తిడి, గ్రామాలకు కొత్తవారు కావడం, ఎరువుల పంపిణీతో పాటు కొన్ని నిబంధనలు మార్చడంతో అనుకున్నట్లుగా పంట నమోదు జరగడం లేదు. రైతుల మేలు కోసం గత ప్రభుత్వం ఈ–క్రాప్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వర్తింపజేసింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3,90,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరితో పాటు ఉద్యానవన పంటలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 30వ తేదీ లోగా నమోదు చేయాలి. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా పూర్తి చేయాలని అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సకాలంలో పంట నమోదు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పంట నమోదు సక్రమంగా కాకపోతే పండిన ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వస్తాయి. ఎరువులు సక్రమంగా ఇవ్వకపోగా ధాన్యం విక్రయానికి కూడా ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మారిన నిబంధనలతో అవస్థలు గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ–క్రాప్ నమోదులో ఈ ఏడాది కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చింది. గతంలో 200 మీటర్ల దూరం నుంచి ఈ–క్రాప్ నమోదుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 20 మీటర్లకు కుదించారు. విధిగా వీఏఏలు ప్రతి కమతం దగ్గరకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 25 సెంట్ల లోపు ఉన్న కమతాల్లో ఈ–క్రాప్ నమోదు చేసేందుకు కమతం వద్దకు వెళ్లకపోయినా ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే అయిపోయేది. ఫొటో అప్లోడ్ తప్పనిసరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్ తొలగించారు. మరోపక్క యూరియా పంపిణీలో వీఏఏలు బిజీగా ఉండటంతో. ఈ–క్రాప్ అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఈ–క్రాప్ నమోదు బాధ్యత మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ)దే. వారు వీఏఏలను సమన్వయం చేసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రయోజనాలు D&{M>‹³ ¯]lÐðl*-§ýl$¯]l$ {糆 OÆð‡™èl* ^ólƇ$$…-^èl$MøÐé-Í. C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, C¯ŒS-ç³#sŒæ çܼÞyîl, ç³…rÌS Ñ{MýS-Ķæ*-°MìS, A¯]l²-§é™èl çÜ$T-¿ýæÐ]l ç³£ýlM>°MìS D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ™èlç³µ-°çÜ-Ç. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ {糿¶æ$™èlÓ ç³£ýl-M>Ë$ A…§éÌS¯é² ç³…r ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-Mø-Ðé-Í. hÌêÏÌZ° 22 Ð]l$…yýl-ÌêÌZÏ Ððl¬™èl¢… Ð]lÅÐ]lÝëĶæ$, E§éů]l ç³…rË$ 3,90,708 GMýSÆ>ÌS ÑïÜ¢Æý‡~…ÌZ ÝëVýS$ AÐ]l#™èl$…yýlV> D ¯ðlÌS 15Ð]l ™ól© ¯ésìæMìS 1,60,578 GMýS-Æ>ÌZÏ D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. త్వరితగతిన పూర్తి చేయాలి ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు మండల స్థాయి అధికారుల (ఏఓ) పర్యవేక్షణలో గ్రామ స్థాయిలో వీఏఏలు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చాం. మారిన నిబంధనలకు అనుగుణంగా వీఏఏలు తమ పరిధిలోని అన్ని పంటలనూ నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంట నమోదు ప్రక్రియపై సమీక్ష చేస్తుండాలి. – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట -
ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్
గ్యాస్ సరఫరా నిలిపివేత, తప్పిన ప్రమాదం తాళ్లరేవు: స్థానిక గమిని ఐస్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ పైపులైన్ లీకై న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఫ్యాక్టరీ సిబ్బంది తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న భూగర్భజల శాఖ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ ప్రసన్న, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెంకటేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ రామచంద్రమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ టి.సూరిబాబు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది ఫ్యాక్టరీని బుధవారం సందర్శించి పరిస్థితిని క్షణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని తెలిపారు. అనుమతులు తీసుకునేవరకు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా నడుపుతున్న ఐస్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాలేదని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్ఎం మూర్తి తదితరులు కాకినాడలో జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు డీఎస్ఏలో జరుగుతున్న ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీలో ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 బాలికల విభాగంలో పి.సంజన, జె.జ్వాలరాజేశ్వరి, అండర్–14 బాలుర విభాగంలో బి.పవన్, సీహెచ్ రాజు, అండర్–17 బాలుర విభాగంలో గోపాల్సాయి, బాలికల విభాగంలో బి.కుసుమ, నాగ నందిని, అండర్–19 హాకీలో జి.స్వరూప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారన్నారు. బుధవారం పాఠశాలో జరిగిన కార్యక్రమంలో పీడీలు వర ప్రసాద్, బి.శ్రీను, ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యాయులు రత్నప్రసాద్, విద్యార్థులు అభినందించారు. మలికిపురం: ఈ నెల 16న కాకినాడ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో గుడిమెళ్లంక ఉన్నత పాఠశాల విద్యార్థి కోసెట్టి తనూజ్ విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అక్టోబర్లో కాకినాడ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున తనూజ్ పాల్గొంటాడని హెచ్ఎం కె.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా వెయిట్లిఫ్టర్లు కాకినాడ క్రైం: అండర్–19 రాష్ట్ర స్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 మంది వెయిట్లిఫ్టర్లు ఎంపికయ్యారు. కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో బుధవారం కోచ్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మందిలో 19 మంది ఎంపికయ్యారు. జయసూర్య, ఎ.రాహుల్, ఐ.మణికంఠ, డి.కారుణ్యముఖేష్, బి.రిషబ్, కె.సాయిదుర్గాప్రసాద్, జి.సుబ్రహ్మణ్యం, ఎ.సహస్ర, బి.ఇందిరాప్రియాంక, హాసిని, మాధురి, సీహెచ్ శ్రీసాద్విక, ఎండీ రహం, నిషాతో పాటు అండర్–17లో ఎం.దుర్గాప్రసాద్, సీహెచ్ సంతోష్కుమార్, బి.గాయత్రి, ఎం.నవ్యశ్రీ ఉన్నారు. -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులకు వేద పండితులు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) కుమార్తె గాదె సత్యవెంకటకామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.46 గంటలకు వినాయకపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర పూజలు చేశారు. అనంతరం పందిరి రాట వేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా కళాశాల కరస్పాండెంట్ పెద్దపాటి సత్యకనకదుర్గ, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గర్జించే సింహం కన్నా గాయపడినది ఇంకా ప్రమాదకరం
● జగనన్న 2.0 చూడబోతున్నారు ● ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహమే ప్రమాదకరమని చంద్రబాబు గుర్తించుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితో కాకాణి మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ నాలుగు ప్రధానమైన మూలస్తంభాల ఆధారంగా ప్రజాస్వామ్య సంరక్షణకు అంబేడ్కర్ రాజ్యాంగం రచిస్తే, చంద్రబాబు.. ఆయన తనయుడు నారా వారి రెడ్ బుక్తో నాలుగు వ్యవస్థలను ఏర్పరచుకుని రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీలో ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎటువంటి కేసులు పెట్టాలి. జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలి, అనుకూల మీడియాతో ప్రజల్లోకి ఎలా తప్పుడు సంకేతాలు పంపాలనే నాలుగింటిపై పాలన జరుగుతోందన్నారు. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల మీ శాడిజాన్ని తీర్చుకోగలరేమో కానీ మిథున్రెడ్డి వ్యక్తిత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి 86 రోజులు జైలులో పెట్టి నిర్బంధించిందన్నారు. జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మమ్మల్ని ఆపలేరన్నారు. రెండో విడత జగనన్న 2.0 చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతులు యూరియా, విత్తనాల కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఏర్పడ్డాయా అన్నారు. చంద్రబాబు తెచ్చిన లక్షల టన్నుల యూరియా రైతులకు అందకుండా ఏమైందన్నారు. యూరియా బ్లాక్ లో అమ్ముకోవడానికి రూ.250 కోట్లు చేతులు మారాయన్నారు. ఈ నెల 19వ తేదీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపుమేరకు రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీల వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాటసాని రామ్గోపాల్రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగంలో ఏ నాయకుడి మీదైనా కేసు పెట్టొచ్చన్నారు. ఈ విధమైన పరిపాలన, పోలీసు వ్యవస్థలను తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానన్నారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఆధారాలు లేని అభియోగాాలు మోపి జైల్లో పెట్టారని మిథున్రెడ్డి చెబుతున్నారన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ జగనన్న వేసిన పునాదిపై సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. -
13 రోజుల తరువాత చేరిన మృతదేహం
మలికిపురం: ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశమైన దుబాయికి వెళ్లిన రామరాజులంక గ్రామానికి చెందిన రాపాక విజయభారతి ఈ నెల 3న దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెందింది. 13 రోజుల తరువాత మంగళవారం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరింది. దుబాయ్లోని సమీప బంధువులు, అడ్వకేట్ నల్లి శంకర్ కృషితో తగిన విదేశీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, నల్లి శివకుమార్ తదితరులు ఆమె మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
కౌలుకోలేక..
ఫ దూసుకుపోతున్న పొగాకు ధరలు ఫ వచ్చే ఏడాది లీజులపై పడనున్న పెరుగుదల ఫ ఎకరాకు కౌలు రూ.80 వేలు ఫ బ్యారన్ల లీజుకు రెక్కలు ఫ లబోదిబో మంటున్న కౌలు రైతులు దేవరపల్లి: పొగాకు ధరలు రోజురోజుకూ అంచనాలకు అందని రీతిలో పెరుగుతున్నాయి. రైతులు మునుపెన్నడూ ఊహించని విధంగా కిలోకు గరిష్టంగా రూ.430కి లభిస్తోంది. ఈ ధర ఇటు రైతులు.. అటు కౌలు రైతులకు కాసులు కురిపిస్తోంది. ఈ పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ఈ ప్రభావం 2025–26 ఏడాది సాగుపై పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ పెరగడంతో భూ యజమానులు వారి భూముల కౌలు, బ్యారన్ల లీజులు, బ్యారన్ల లైసెన్సు ధరలను అమాంతం పెంచేశారు. దీంతో రానున్న ఏడాదికి సాగుచేసే కౌలు రైతులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే భూముల కౌలు స్వల్పంగా పెరిగినప్పటికీ బ్యారన్ల లీజు, లైసెన్సు ధర పెరగడమే ఇందుకు కారణం. పొగాకు సాగు చేసే రైతుల్లో 80 శాతం కౌలుదారులే ఉన్నారు. కౌలు భూములు, లీజు బ్యారన్లు ఇప్పటి నుంచే కౌలు రైతులు హడావుడి పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు భూములను కౌలుకు, బ్యారన్లను లీజుకు తీసుకుని సిద్ధమవుతున్నారు. జీడిమామిడి, మామిడి, కొబ్బరి, ఆయిల్పామ్ తోటలను తొలగించి పొగాకు సాగు చేయడానికి భూములను సిద్ధం చేస్తున్నారు. ఎకరం కొబ్బరితోటపై ఆదాయం రూ.30 వేలు, జీడిమామిడి తోటపై రూ.20 వేలు, ఆయిల్పామ్ పంటపై రూ.50 వేలకు మించి ఆదాయం రావడం లేదని, భూములను కౌలుకు ఇస్తే శ్రమ లేకుండా ఎకరాకు రూ.70 నుంచి 80 వేలు వస్తోందని రైతులు అంటున్నారు. పెద్ద రైతులంతా పొగాకు వ్యవసాయానికి స్వస్తి చెప్పి బ్యారన్లను లీజుకు ఇచ్చి భూముల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. గణనీయంగా పెరగనున్న సాగు 2025–26 సంవత్సరానికి జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 2024–25 పంట సీజన్లో రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో సుమారు 29 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 2023–24 ఏడాదిలో తూర్పు, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 27 వేల హెక్టార్లలో పంట సాగు చేసినట్టు అధికారులు తెలిపారు. బోర్డు అనుమతించిన దానికంటే అదనంగా సుమారు 20 నుంచి 25 వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2023–24 సీజన్లో 58.25 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 80 మిలియన్ కిలోలు పండించారు. 2024–25 సీజన్లో 49 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా 67 మిలియన్ కిలోలు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఎన్ని నిబంధనలు విధించినా వచ్చే ఏడాది 100 మిలియన్ల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యారన్ లైసెన్స్ ధర రూ.10.50 లక్షలు మార్కెట్లో పొగాకు ధర అనూహ్యంగా పెరగడంతో బ్యారన్ లైసెన్సు ధర రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. 2022లో బ్యారన్ లైసెన్సు ధర రూ.2.60 లక్షలు, 2023లో రూ.4 లక్షలు ఉండగా, 2024–25లో రూ.10.50 లక్షలు, ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతోంది. గతంలో బ్యారన్లు అమ్ముకున్న రైతులు ప్రస్తుత ధరను చూసి లబోదిబో మంటున్నారు. గత ఏడాది బ్యారన్ లీజు రూ.60 నుంచి 70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.1.70 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.2.10 లక్షలు పలుకుతుందని రైతులు తెలిపారు. గత రెండేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు ప్రస్తుతం అద్దె పలుకుతుందని రైతులు తెలిపారు. రెట్టింపు పలుకుతున్న కౌలు సాగు భూమి కౌలు ధర రెట్టింపు పలుకుతుంది. గత ఏడాది ప్రాంతాన్ని బట్టి కౌలు ధర పలుకుతుంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల్లో ఎకరం కౌలు రూ.80 వేలు పలుకుతుండగా, దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెం, యర్నగూడెం గ్రామాల్లో రూ.75 వేలు, దేవరపల్లిలో రూ.70 వేలు కౌలు ధర పలుకుతుందని రైతులు తెలిపారు. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో నల్లరేగడి భూముల కౌలు రూ.70 వేలు పలుకుతున్నట్టు రైతులు తెలిపారు. 2022లో ఎకరా కౌలు రూ.25 వేల నుంచి 30 వేలు ఉండగా, 2023–24లో రూ.35 వేల నుంచి 42 వేలు పలికింది. 2024–25లో రూ.60 నుంచి 70 వేలు పలికిన కౌలు ప్రస్తుతం రూ.70 నుంచి 80 వేలు పలుకుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. -
అంతర్ జిల్లాల మోటార్సైకిల్ దొంగల అరెస్ట్
26 వాహనాల స్వాధీనం పెరవలి: ఇళ్ల వద్ద ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలించడంలో ఆరితేరిన అంతర్ జిల్లాల నేరస్తులను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. తూర్పు, పశ్చిమ, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాల్లో దొంగిలించిన 26 మోటార్ సైకిళ్లను దొంగల నుంచి పోలీసులు రికవరీ చేసి వారిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ పెరవలి పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లాల్లో 26 మోటార్ సైకిళ్లను దొంగిలించారని వీటి విలువ రూ.40 లక్షలని తెలిపారు. ఈ దొంగతనాలకు పాల్పడిన యువకులు పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మగంటి ధనుష్, నెక్కంటి యువరాజు, వనచర్ల రాజు, కూనపురెడ్డి వీరబాబు ఉండగా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్, అబ్బిరెడ్డి పాపారావు ఉన్నారన్నారు. ఈ దొంగతనాల్లో ప్రధాన నిందితులు తుమ్మగంటి ధనుష్, విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్లని తెలిపారు. ప్రస్తుతం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నామని విశ్వనాధుల దేవిశ్రీప్రసాద్ పరారీలో ఉన్నాడని ఇతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్లు తిరుగుతున్నారని చెప్పారు. మోటార్ సైకిళ్ల చోరీ కేసులో పెరవలి, కొవ్వూరు, నిడదవోలు పోలీసులు ఎంతో చాకచక్యంగా నేరస్తులను పట్టుకుని వారి నుంచి 26 మోటార్సైకిళ్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకున్న పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, ట్రైనీ ఎస్సై కె.సౌజన్యను అభినందించారు. ఈ కేసును త్వరితగతని చేధించడానికి కారణమైన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐ పీవీజీ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు. సర్పవరంలో ఒకరి అరెస్టు..కాకినాడ రూరల్: సర్పవరం పోలీసులకు మోటారు సైకిళ్ల దొంగ పట్టుబడ్డాడు. 20 ఏళ్ల వయసులోనే చాకచక్యంగా బైక్ల చోరీల్లో ఆరితేరాడు. సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన పెంకే తేజను సోమవారం నిందితుడిని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్సై శ్రీనివాస్కుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. నిందితుడి నుంచి రూ.6.5 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన క్రైమ్ సిబ్బంది హెచ్సీలు సత్తిబా బు, రాజు, గణేష్, పీసీలు రవి, శ్రీనివాస్, అనిల్, చిన్నబాబు, కిశోర్లను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
రైఫిల్ షూటింగ్లో రాష్ట్రస్థాయి పోటీలకు రిషిత
రాజోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు శివకోటి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యడ్ల రిషిత అర్హత సాధించిందని ప్రధానోపాధ్యాయుడు ఎన్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో రిషిత ప్రతిభ చూపింది. సర్పంచ్ నక్కా రామారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్ తదితరులు అభినందించారు. జేవీవీ రాష్ట్ర పర్యావరణ కమిటీ కన్వీనర్ల ఎంపిక కంబాలచెరువు(రాజమహేంద్రవరం)/కడియం: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర పర్యావరణ కమిటీ ముగ్గురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మణరావు, టి.సురేష్ మంగళవారం ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి కన్వీనర్గా కేవీవీ.సత్యనారాయణ, కో కన్వీనర్లుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లాకు చెందిన జి.సుధాకర్లను ఎంపిక చేశారు. ఎంపికై న ముగ్గురూ జనవిజ్ఞాన వేదికలో గత మూడు దశాబ్దాలుగా వివిధ కేడర్లలో విశేషమైన సేవలు అందించారు. -
ఆర్టీసీ కండక్టర్పై ప్రయాణికుడి దాడి
గోకవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండక్టర్పై ఓ ప్రయాణికుడు దాడికి దిగడంతో చేతి వేలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల ప్రకారం గోకవరం డిపోకు చెందిన సింగిల్ స్టాప్ రాజమహేంద్రరంలోని గోకవరం బస్టాండ్ నుంచి 67 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో గోకవరం బయలుదేరింది. గోకవరానికి చెందిన ఓ ప్రయాణికుడు రూ.105 ఇచ్చి టికెట్ కొనుగోలు చేయగా కండక్టర్ గరగా పాండురంగ టికెట్ ఇచ్చి మిగిలిన చిల్లర రూ.60 తిరిగి ఇచ్చాడు. ఈ క్రమంలో రూ.50 నోటు బాగా లేదని సదరు ప్రయాణికుడు కండక్టర్పై దాడికి దిగడంతో కండక్టర్ వేలికి తీవ్ర గాయమైంది. దీంతో డ్రైవర్ బస్సుని గోకవరం పోలీస్స్టేషన్ వద్ద ఆపి ప్రయాణికుడు రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. అనంతరం కండక్టర్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా చేతి వేలు విరిగిపోయిందని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ సంఘటనతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది భారీ సంఖ్యలో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని కండక్టర్ని గాయపరిచిన ప్రయాణికుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ని సంప్రదించగా సిబ్బందిపై దాడి ఘటన దురదృష్టకరమన్నారు. -
పంట కాలువలో గూడ్స్ వాహనం బోల్తా
ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు జట్టు కార్మికులు పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో మొండెపులంక గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జట్టు కార్మికులతో వెళ్తున్న గూడ్స్ వ్యాన్ అదుపుతప్పి పంట కాలువలో పడిపోయింది. ప్రమాదం నుంచి వ్యాన్లో ఉన్న ఐదుగురు జట్టు కార్మికులు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన జట్టు కార్మికులు మంగళవారం జగ్గన్నపేటలో ఇంటికి శ్లాబు వేశారు. శ్లాబు పనులు ముగిసిన అనంతరం సంబంధిత సామాన్లు, మిల్లర్తో సహా వ్యాన్లో పలివెల గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ మొండెపులంక వద్ద కుడివైపున ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వ్యాన్లో ఉన్న వారిని బయటకు తీసారు. వ్యాన్లో ఉన్న వైబ్రేటర్లు, ఇతర సామాన్లు నీట మునిగాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులకు స్థానికులు సహాయం అందించారు. రోడ్డుకు ఎడమవైపు ఉన్న ప్రధాన పంట కాలువలోకి వ్యాన్ పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు వివరించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
సృజనాత్మకత వెలికితీసేందుకే వారధి పోటీలు
అమలాపురం టౌన్: విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు, సృజనాత్మకత వెలికి తీసేందుకే వారికి వారధి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. అమలాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వారధి పోటీలను బాషా మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు డీఈవో బాషా, జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.మమ్మీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమగ్ర శిక్షా కో ఆర్డినేటర్ మమ్మీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ఇలాంటి పోటీల వల్ల బయటకు వస్తాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆర్.వెంకటేశ్వరరావు, ఏవీఎల్ నరసింహారావు, పీవీఎల్ఎన్ శ్రీరామ్, కాలే దుర్గాభవాని, ఉదయ శంకర్, సీహెచ్ఎల్జీ నరసింహారావు, జి.సీతారామలక్ష్మి, ఎస్.బాబు వ్యవహరించారు. ప్రలోభాలకు లొంగలేదన్న కక్షతోనే ఆరోపణలు అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ నుంచి కౌన్సిలర్గా నెగ్గిన మీ తల్లిని మున్సిపల్ చైర్పర్సన్ చేయడం కోసం మా పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు మా పార్టీ కౌన్సిలర్లు, నాయకులు అవినీతిపరులని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. స్థానిక వాసర్ల గార్డెన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్లు తిక్కిరెడ్డి వెంకటేష్, రుద్రరాజు నానిరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు మాట్లాడారు. మంత్రి సుభాష్ పార్టీ కౌన్సిలర్లను రూ.లక్షల్లో బేరం ఆడడమే కాకుండా విల్లాలు ఇస్తానని ప్రలోభపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ ీసీపీ కౌన్సిలర్లు ఈ ప్రలోభాలకు లొంగలేదన్న కక్షతో నేడు పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. అమలాపురం జెడ్పీ హైస్కూల్లో జరిగిన రూ.కోటి అవినీతిలో తనకు సంబంధం ఉందని, విచారణ చేయిస్తానని మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని పట్టణ పార్టీ అధ్యక్షుడు బులినాని అన్నారు. ఇందులో తనకు, తన కుటుంబానికి సంబంధం ఉందని మంత్రి రుజువు చేస్తే నీ చెప్పు నా మెడలో వేసుకుంటాను, రుజువు చేయకపోతే నా చెప్పు నీ మెడలో వేసుకోవాలని బులినాని మంత్రి సుభాష్కు సవాల్ విసిరారు. మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, చిత్రపు రామకృష్ణ, పార్టీ నాయకులు కుడుపూడి భరత్భూషణ్, కట్టోజు రాము, విత్తనాల మూర్తి, దొంగ చిన్నా, వాసర్ల సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్రసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణతో వంద మందిలో నలుగురికే లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు, రేవంత్రెడ్డిలు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నారని, అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులను ఎస్సీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. -
కొబ్బరి చెక్కల వేలం రూ.7.06 లక్షలకు ఖరారు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో (2025–26) ఏడాది కాలానికి కొబ్బరి చెక్కలు పోగుచేసుకునేందుకు రూ.7.06 లక్షలకు వేలం ఖరారైంది. అలాగే తలనీలాలు తీసుకునేందుకు రూ.71 వేలకు పాడుకున్నారు. ఆలయ ఆవరణలో అధికారుల సమక్షంలో మంగళవారం ఈ వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ మొదటి ఏడాది ఈ విధంగా ఉండగా, 2026 – 27లో ప్రస్తుతం పాడిన పాటపై 10 శాతం పెంచి సొమ్ములు కట్టించుకుంటామన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది రూ.7,76,600 వస్తుందన్నారు. ఈ వేలం పాటలో గత ఏడాది కంటే రూ.2,73,500 ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి జి.సత్యప్రసాద్ నేతృత్వంలో గ్రామ పెద్దలు రంగినీడి కట్లయ్య, బొలిశెట్టి ప్రసాద్ తదితరుల సమక్షంలో వేలం నిర్వహించారు. -
దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులు
● ఏడాది కాలంలో 24 మంది రైతుల ఆత్మహత్యలు ● వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక రైతులు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక పంటను రోడ్ల పక్కన పారవేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్నూలు, కడప జిల్లాలో ఉల్లి కేవలం కిలో రూ.3, టమాటా రూ.1.50కు దక్కే పరిస్థితి ఉందన్నారు. ఈ రేటుతో రైతులకు కూలీ ఖర్చులు వస్తాయా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బత్తాయి, అరటి, పొగాకు, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉల్లికి మద్దతు ధర లేక అనంతపురం జిల్లాలో కౌలు రైతు కురవా రామచంద్రుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇదే జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిందని తెలిపారు. పల్నాడు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బీబీసీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ జిల్లా వ్యవసాయాధికారి చెప్పారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాళ్వా పంట ధాన్యం డబ్బు రైతులకు జమ అయ్యేంత వరకు పోరాటం చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. యూరియా కోసం రోడ్కెక్కిన రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తేనే గాని ఈ ప్రభుత్వం స్పందించలేదన్నారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, అమలాపురం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కాండ్రేగుల జవహర్ తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్
అమలాపురం టౌన్: ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లోప భూయిష్టమైన 2.0 విధానం వల్ల ప్రజలకు, దస్తావేజు లేఖర్లకు విపరీమైన అసౌకర్యం, ఇబ్బంది కలుగుతోందని దస్తావేజు లేఖర్లు ఆందోళన బాట పడుతున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ చేసి ఆందోళనకు దిగుతున్నారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని దస్తావేజు లేఖర్లు మంగళవారం సమావేశమై ఈ ఆందోళనపై చర్చించారు. ఈ విధానంలో ఓటీపీలు బహిర్గతం చేసేందుకు ప్రజలు సంకోచిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఆటో మ్యుటేషన్ సిస్టమ్ను తాము స్వాగతిస్తున్నా డిపార్ట్మెంట్లో సమన్వయ లోపం వల్ల చాలా ఇబ్బందులు అనివార్యమవుతున్నాయని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోపాలను సరిదిద్దాలని వారు డిమాండు చేశారు. ఈ రెండు రోజుల్లో తాము పెన్డౌన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశం తీర్మానించింది. ఈ రెండు రోజుల్లో అమలాపురం దస్తావేజు లేఖర్లు తమ (డీడబ్ల్యూఎస్)లను మూసివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలని సమావేశం పిలుపునిచ్చింది. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్కు తమ డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు దస్తావేజు లేఖర్లు తెలిపారు. సమావేశంలో అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సంఘం గౌరవాధ్యక్షుడిగా గుంటు ఫణిప్రసాద్, అధ్యక్షుడిగా జిన్నూరి సురేష్, ఉపాధ్యక్షుడిగా వెణుతురుపల్లి సుబ్బు, కార్యదర్శిగా పందిరి హరి, కోశాధికారిగా గుమ్మళ్ల నరేష్, సంయుక్త కార్యదర్శిగా దుర్గేష్ ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని సంఘ ప్రతినిఽధి మట్టపర్తి రాము తదితరులు అభినందించారు. 19, 20 తేదీల్లో ఆందోళనకు సిద్ధం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
సమాజంలో ఇంజినీరింగ్ వ్యవస్థ కీలకం
అమలాపురం టౌన్: సమాజంలో ఇంజినీరింగ్ వ్యవస్థ కీలకంగా ఉండి రోడ్లు, వంతెనల నిర్మాణాలకు మూల కారణం అవుతోందని జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) ఇంజినీరింగ్ ఆఫీసర్ పులి రామకృష్ణారెడ్డి అన్నారు. అమలాపురం ఎన్టీ ఆర్ మార్గ్లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఇంజినీర్స్ డే, ఇంజినీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమాల్లో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తొలుత ఆ కార్యాలయ ఆవరణలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పీఆర్ ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ మహానీయుని సేవలను కొనియాడారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు మాట్లాడుతూ కోనసీమలో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురి ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పీఆర్ అధికారులైన ఇంజినీర్లు మెమెంటోలు అందించి అభినందించారు. విశ్రాంత ఇంజినీర్ సీహెచ్ రామకృష్ణ తదితర ఇంజినీర్లను సత్కరించి వారికి ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మరో డీఈఈ పీఎస్ రాజ్కుమార్ మాట్లాడుతూ ఇలా ఇంజినీర్ల ప్రతిభ గుర్తించి అభినందిస్తే వారిలో పోటీతత్వం పెరిగి సమాజానికి నాణ్యమైన ఇంజినీరింగ్ వ్యవస్థ సాకారమవుతుందన్నారు. డీఈఈ శ్రీనివాస్, ఏఈఈలు కొండలరావు, సత్యనారాయణ, సంపన్న, సంధ్యతో పాటు 120 మంది పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొని ఇంజినీర్స్ డే జరుపుకొన్నారు. -
ఇలా వెలుగుబెట్టారు
కానరాని కంటి వెలుగు ఈ ప్రభుత్వంలో కంటి వెలుగు అనేది కనిపించడం లేదు. ఎక్కడా కంటి వెలుగు శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. గత ప్రభుత్వంలో కంటి వెలుగు పేరుతో మా ప్రాంతంలోనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. మా లాంటి పేదోళ్లకు ఏదైనా కంటి జబ్బులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అంటే డబ్బులు కూడా అయిపోతున్నాయి. – బీర అర్జునరావు, సావరం, అమలాపురం ఈఐ సెంటర్లను మళ్లీ నిర్వహించాలి గత ప్రభుత్వంలో ఉచిత కంటి వైద్యం కోసం అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి ఈఐ సెంటర్లను మళ్లీ ఇప్పుడు నిర్వహించాలి. ఈఐ సెంటర్లు ఇప్పుడు లేకపోవడంతో చాలా మంది పేదవారికి కంటి వైద్యం ప్రభుత్వపరంగా అందడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈఐ సెంటర్ల ఏర్పాటుతో పాటు వైద్య శిబిరాలు గ్రామాల్లో ప్రజలకు చేరువలోనే నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు అప్పుడప్పుడు శిబిరాలు నిర్వహిస్తున్నా కంటి వైద్య శిబిరాలు తక్కువగానే నిర్వహిస్తున్నారు. – ఆకుల ఈశ్వరరావు, వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం ● అటకెక్కిన కంటి వెలుగు ● నిలిచిపోయిన ‘ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు’ ● కంటి వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్న రోగులు ● కూటమి ప్రభుత్వంలో కానరాని ఉచిత కంటి వైద్యం ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే ఇంద్రియాలన్నింటిలో కన్ను ప్రధానమైనదని అర్థం. కంటి విలువను గుర్తించే అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యలతో బాధపడకూడదనే సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ ద్వారా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి లోపాలుంటే కంటి శస్త్రచికిత్సలకు సిఫారసు చేసేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ముందుచూపు కొరవడి ఎంతో ఉపయోగమైన ‘కంటి వెలుగు’ పథకాన్ని అటకెక్కించింది. అమలాపురం టౌన్: మనిషికి కంటి చూపు అతి ముఖ్యం. కళ్లకు ఏదైనా అస్వస్థతగా ఉంటే రోగులు తక్షణమే ఆస్పత్రులకు వెళ్లి నయం చేయించుకుంటారు. అందుకే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటి వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఉచిత వైద్య శిబిరాల ద్వారా కంటి వెలుగు విషయంలో అప్రమత్తంగా ఉండేవారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా కంటి సమస్యలు ఉన్న రోగులకు ఎప్పటికప్పుడు ఉచిత వైద్యం అందేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కంటి వెలుగు మసక బారింది. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు నిలిచిపోయాయి. కంటి వెలుగు కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాల ఊసే లేదు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణ ఒక ప్రైవేటు సంస్థ పర్యవేక్షించేది. ఒక్కో కేంద్రంలో ఒక ఆప్తమాలజీ అసిస్టెంట్, ఓ ఎక్వీప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండి సేవలు అందించేవారు. ఈ కేంద్రాల ద్వారా అధునాతన ఆటోమేటిక్ రిఫ్రాక్షన్ మీటర్, కంటి లోపలి భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంటి కంప్యూటీకరణతో పరీక్షించే విధానం ఉండేది. కంప్యూటీకరణ ద్వారా డీఆర్, గ్లకోమా, కేటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్ టెన్షన్ తదితర పరీక్షలు జరిగేవి. అవసరమైన కంటి రోగులకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసేవారు. తొలిదశలోనే కంటి సమస్యల గుర్తింపు గత ప్రభుత్వంలో కంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించే ఉచిత వైద్య ప్రక్రియ అందుబాటులో ఉండేది. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం ద్వారా కంటి రోగానికి వైద్యం జరిగితే మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే ఆ రోగిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తలించి పూర్తి ఉచిత వైద్యం అందించే పరిస్థితి ఉండేది. కాంట్రాక్ట్ సంస్థతో ముగిసిన ఎంవోయూ గడువు ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఎవరికై నా కంటి సమస్య తలెత్తితే ఉచిత వైద్యం అందించే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కానరావడం లేదు. అదే గత ప్రభుత్వంలో జిల్లా నుంచి దాదాపు 90 వేల మంది కంటి రోగులు ప్రభుత్వ వైద్యం ద్వారా ఉచిత సేవలు పొందారు. ఒక్కో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం ద్వారా రోజుకు సగటున 30 నుంచి 50 మంది కంటి రోగులు ఉచిత పరీక్షలు చేయించుకునే వారు. జిల్లాల్లోని 9 కమ్యూనిటీ ఆస్పత్రులు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లు, 77 పీహెచ్సీల్లో ఐఈ కేంద్రాలు పని చేసేవి. గత ఏడాది ఈ ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలను పర్యవేక్షించే కాంట్రాక్ట్ సంస్థతో ఎంఓయూ గడువు ముగిసిపోవడం, మరలా దానిని రెన్యువల్ చేయకపోవడంతో ఈ వ్యవస్థ నిలిచిపోయింది. గతంలో కంటి సమస్యలకు ఉచిత వైద్యం అందుకున్న ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ ఉచిత వైద్యం గగనం కావడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వ్యవ ప్రయాసలకోర్చి వెళుతున్నారు. కన్సల్టింగ్ ఫీజు, మందుల కొనుగోలు, కళ్లజోళ్ల కొనుగోలు తదితర వాటికి రూ.1000 నుంచి రూ.2 వేలు ఖర్చు అవుతోందని రోగులు అంటున్నారు. పేద రోగులు కంటి వైద్యం కోసం అంతంత ఖర్చు పెట్టాల్సి రావడంతో వారు ఆర్థికంగా ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నాం ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు కంటి సమస్యలపై స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నామని అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కంటి వైద్య మెడికల్ ఆఫీసర్ ఎ.హేమలత తెలిపారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు నిలిచిపోయాయని చెప్పారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆప్తమాలజీ విభాగం ద్వారా ఉచిత సేవలు అందుతున్నాయన్నారు. -
వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేను స్వాగతిస్తున్నాం
అమలాపురం టౌన్: వక్ఫ్ చట్టం–2025పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర తీర్పు(స్టే)ను ముస్లింలు స్వాగతిస్తున్నారని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడినప్పటికీ ఈ చట్టానికి వ్యతిరేకంగా వందలకు పైగా కేసులు వేయడంతో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిందని చెప్పారు. అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివాదాస్పద చట్టం గురించి వివరించారు. కోర్టు ఇచ్చిన స్టేను అనుసరించి కింది స్థాయిలో అధికారాలను డీనోటిఫై చేసేందుకు అనుమతించలేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారానే జరగాలన్న నిబంధన విధించిందని చెప్పారు. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించే అంశంపై కూడా కోర్డు స్టే ఇవ్వడంపై ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణలో అనేక లొసుగులు ఉన్నాయని ఆనాడే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు జగన్ పార్లమెంట్ ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయించి ముస్లిం పక్షపాతిగా నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా ముస్లిం సమాజం మైనార్టీల పట్ల ఏ పార్టీ ప్రేమాభిమానాలు చూపిస్తుందో గ్రహించాలని ఖాదర్ హితవు పలికారు. మెరుగైన వైద్య సేవల కోసమే ‘స్వస్థనారీ’ పథకం సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, తద్వారా సమాజాన్ని బలోపేతం చేసే దృఢమైన లక్ష్యంతో ‘స్వస్థ నారీ–సశక్త్ కుటుంబ అభియాన్’ను కేంద్రం రూపకల్పన చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 17న ప్రారంభించనున్నారని అదే రోజున ముఖ్యమంత్రి విశాఖపట్టణంలో రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ మందిరాలు, పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్య శిబిరాలు, అవగాహన శిబిరాలు సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు అందిస్తారన్నారు. ఈ శిబిరాల్లో పోషకాహారం, ఆరోగ్య అవగాహన, కుటుంబ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ’పోషణ మహా’ నిర్వహణ ద్వారా పిల్లలు, మహిళలకు పోషణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 560 శిబిరాలు ఈ 15 రోజుల పాటు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్వో దుర్గారావుదొర, డాక్టర్ సుమలత, ఏడీఎంఅండ్హెచ్ఓ సీహెచ్ భరతలక్ష్మి పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలి
రాజానగరం: ఆదికవి నన్నయ అందించిన జ్ఞానం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన శ్రద్ధ నుంచి ప్రేరణ పొంది, నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో ‘అద్విక–25’ ఇంజినీరింగ్ ఫెస్ట్ని సోమవారం దీపారాధనతో ప్రారంభించారు. తొలుత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు భారతదేశంలో ఇంజినీరింగ్ నైపుణ్యానికి బంగారు బాటలు వేశాయన్నారు. ఇంజినీరింగ్ అంటే సమీకరణలు, గణనాలు కాదని, దృష్టి, సమగ్రత, పరివర్తన ప్రభావం గురించి అనే ఆలోచనలకు ఆయన జీవితం ఒక నిదర్శనమన్నారు. అద్విక–25లో విద్యార్థులకు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్ క్విజ్, ప్రాజెక్టు ఎక్సోపో, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, స్కిల్ హౌస్ వంటి సాంకేతిక పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వరరావు వ్యవహరించగా రూరల్ వాటర్ సప్లై విభాగం ఈఈ బి.వెంకటగిరి, డీఈఈ టి.శ్రీనివాసబాబు, ఏఈ వి.అవినాష్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్కుమార్, ఏపీ ట్రాన్స్కో ఈఈ రవికుమార్, ఐసీఐ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ కేవీ నరసింహారావు, ఓఎన్జీసీ రిటైర్డ్ ఈఈ జీఏవీ ప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసింగ్పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతా
అమలాపురం టౌన్: పోలీసింగ్పై జిల్లా ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచి శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తానని జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులపై జరిగే వేధింపులు, గంజాయి తాగడం, కలిగి ఉండంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తరహా నేరాల అదుపునకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు చేపడతానని చెప్పారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించానని, ఆ ప్రణాళిక అమలు దిశగా ఈ రోజు నుంచే పనిచేస్తానని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో పలు చోట్ల రౌడీయిజం, సెటిల్మెంట్లు జరుతున్నాయన్న సమాచారంపై కూడా ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు మరింత అవగాహన కల్పించి వారిలో పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలుగజేస్తానన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, చోరీల అదుపునకు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం సేకరించి ఆ దిశగా చర్యలు చేపడతానన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న జాతీయ రహదారుల్లో ఉన్న గ్రామాలకు ఉన్న రోడ్డు మార్జిన్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. తమ పోలీస్ శాఖ, జాతీయ రహదారుల శాఖ సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపతానని ఎస్పీ తెలిపారు. -
శానిటరీ సిబ్బంది ఆకలి కేకలు
● 15వ తేదీ వచ్చినా అందని ఆగస్టు నెల జీతాలు ● 350 మంది సిబ్బందికి రూ.59 లక్షల బకాయిలు అన్నవరం: ఒక నెలలో వచ్చిన సమస్య మరుసటి నెల రాకుండా చూసుకోవడమే మంచి పరిపాలనకు నిదర్శనం. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మాత్రం అదే సమస్య ప్రతి నెలా పునరావృతమవుతోంది. ప్రతి నెలా రెండో వారం దాటినా శానిటరీ సిబ్బందికి జీతాలు రాని పరిస్థితి. మా జీతాలు ఎప్పుడిస్తారని ఆ సిబ్బంది ఎదురుచూడడంతోనే సరిపోతోంది. గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. దేవస్థానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సెప్టెంబర్ 15వ తేదీ వచ్చినా ఆగస్టు నెల జీతం ఇంకా అందకపోవడంతో 350 మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నెలకు రూ.పది వేలు వచ్చే జీతం రెండు వారాలు గడచినా రాకపోతే వారి పరిస్థితి ఏంటనేది ఊహించొచ్చు. గత ఆరు నెలలుగా జీతాలు ఆలస్యం అవడం దేవస్థానంలో రివాజుగా మారిపోయింది. అయితే ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు 25న 350 మంది సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ చెల్లించి ఆ చలానాలు ఈ నెల రెండో తేదీనే దేవస్థానానికి అందజేసినట్టు శానిటరీ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గా మేన్పవర్ సంస్థ ప్రతినిధి తెలిపారు. 16 మంది కొత్త సిబ్బంది విషయం పక్కన పెట్టి మా 350 మంది శానిటరీ సిబ్బంది జీతాలైనా వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఈవో వీర్ల సుబ్బారావును వివరణ కోరగా త్వరలోనే జీతాలు వారి అకౌంట్లలో పడేలా చూస్తామన్నారు. -
ఆదిత్యలో అట్టహాసంగా వేద–2కే25
గండేపల్లి: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఉత్తమ సాధన, నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరమని కాకినాడ జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ విద్యార్థులనుద్దేశించి అన్నారు. మండలంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సోమవారం ఇంజినీరింగ్ డే సందర్భంగా వేద–2కే25 పేరిట జాతీయస్థాయి సాంకేతిక సింపోజియంకు మొదటిరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భవిష్యత్కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డి మాట్లాడుతు జాతీయస్థాయిలో సాంకేతిక ప్రతిభ, ఆవిష్కరణలు పెంపొందించే వేదికగా వేద రూపుదిద్దుకుంటుందున్నారు. ఈ ఏడాది 14,340 మంది విద్యార్థులు సాంకేతిక పోటీలకు, ఈవెంట్లలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రో ఎంబీ శ్రీనివాస్, ప్రో వైస్ చాన్సలర్ ఎస్.రమాశ్రీ, ఆదిరెడ్డి రమేష్, రవి తంగజన్, వేద కన్వీనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్లో ఓజోన్
రాయవరం: ఎండ, వాన నుంచి మనకు గొడుగు ఎలా రక్షణ ఇస్తుందో కంటికి కనిపించని ఓజోన్ పొర కూడా భూమిపై జీవరాశిని అలానే కంటికి రెప్పలా కాపాడుతోంది. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పోషిస్తుండడం వల్ల ఓజోన్ పొరకు నేడు ప్రమాదం ఏర్పడింది. తుపానులో సుడిగాలికి చేతిలోని గొడుగు అల్లాడినట్లు కాలుష్యం తాకిడికి ఓజోన్ రక్షణ ఛత్రం విలవిల్లాడుతుతోంది. ఇది చిల్లులు పడినా జల్లెడలా తయారైందంటే జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వనాలు పెంచి.. కాలుష్యాన్ని తుంచి ఓజోన్ పొరను రక్షించుకుంటేనే.. అది మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ రక్షిత..రక్షితః అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబరు 16న ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు. దుష్ఫలితాలివీ.. ’ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరుతున్నాయి. ’ఫలితంగా మనుషుల్లో చర్మ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, కంటి సంబంధ వ్యాధులు, చర్మ, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంది. జంతువులపై ఇవి మరింత తీవ్ర పరిణామాలు చూపుతున్నాయి. ’మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గి మొక్కల ఆహార తయారీలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ’సముద్ర జీవజాలంపై పరోక్షంగా ఈ ప్రక్రియ ప్రభావితం చూపిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ’ఉష్ణోగ్రతలు పెరిగి, భూమి అగ్నిగోళంలా మారుతుందనే హెచ్చరికలు లేకపోలేదు. ఆకాశం నీలంగా కనిపించడానికి.. పగటి సమయంలో ఆకాశం నీలంగా కనిపించడానికి ప్రధాన కారణం ఓజోన్ పొర. సూర్యుని నుంచి బయలుదేరిన కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ సూర్య కిరణాల్లో జీవావరణానికి ఉపయోగపడే కిరణాలతో పాటు జీవరాశికి వినాశనం కలిగించే అతి నీలలోహిత (ఆల్ట్రా వయోలెట్) కిరణాలు కూడా ప్రసరిస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమికి చేరినట్లయితే దాని వల్ల జరిగే రసాయన చర్య వల్ల భూమండలం మొత్తం రేడియేషన్ వ్యాపిస్తుంది. తద్వారా జీవుల మనుగడ కష్టమవుతుంది. భూమి నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎటువంటి రంగు లేకుండా రక్షణ కవచంలా ఉన్న పొరనే ఓజోన్ పొర అంటారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను ఈ పొర అడ్డుకోవడం వల్ల మనకు పగటి సమయంలోనూ ఆకాశం నీలి రంగులో కన్పిస్తుంది. సూర్యుడు తొలగిన వెంటనే ఎటువంటి నీల లోహిత కిరణాలు ఈ పొరపై ఉండవు. కాబట్టి ఈ పొరగుండా మనం నక్షత్రాలను చూడగలుగుతున్నాం. అభివృద్ధి పేరిట వినాశనం అభివృద్ధి పేరిట ఈ భూమిపై మానవులు వినాశనం సృష్టిస్తున్నారు. కాలుష్యం మూలంగా ఈ ఓజోన్ పొర నెమ్మదిగా కరిగి రంధ్రాలు పడుతున్నట్లు పర్యావరణ నిపుణులు గుర్తిస్తున్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఈ ఓజోన్ పొరపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. ఆధునిక జీవనం పేరిట రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వాడకం పెరగడం కూడా పొరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి నుంచి వెలువడే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు పర్యావరణ వినాశనం కావున ఓజోన్ పొరకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇదీ ప్లాస్టిక్ వాడకం, వాయు కాలుష్య నివారణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడవులు పర్యావరణానికి ఎంతో రక్షణగా నిలుస్తాయి. ఉమ్మడి జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా, 336 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. జిల్లా విస్తీర్ణంలో 32 శాతం అడవులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణలో 7 టెర్రిటోరియల్ రేంజ్లు, 42 టెర్రిటోరియల్ సెక్షన్లు, 95 బీట్లు ఉన్నాయి. మానవ తప్పిదాలే అధికం మానవ తప్పిదాల వల్లే ఓజోన్ పొరకు చిల్లులు పడే ప్రమాదం కలిగింది. దీని నుంచి సమస్త జీవరాశి మనుగడ సాగించాలంటే ప్లాస్టిక్, విష వాయువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. – జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పశు పక్ష్యాదులపై దుష్ప్రభావం ఓజోన్ పొరను రక్షించుకోకుంటే ఆ ప్రభావం సమస్త మానవాళితో పాటు పశుపక్ష్యాదులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఓజోన్ పొరను కాపాడుకుంటే భూతాపాన్ని కాపాడుకోవచ్చు. – నల్లమిల్లి సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆలమూరు సమష్టి బాధ్యతగా చేపట్టాలి మొక్కలు నాటడంతోనే సరికాదు. వాటిని సంరంక్షించుకున్నప్పుడే అడవులు పెరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అనేది సమష్టి బాధ్యతగా చేపట్టాలి. అప్పుడే అడవుల విస్తీర్ణం పెరిగి, పర్యావరణ సమతుల్యత ఉంటుంది. – ఎంవీ ప్రసాదరావు, జిల్లా అటవీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యావరణ పరిరక్షణకు నిర్లక్ష్యమే కారణం దెబ్బతింటున్న వాతావరణ సమతుల్యత కాలుష్యంతో ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు ప్రపంచ ఓజోన్ దినోత్సవం -
అర్జీలు పునరావృతమైతే అధికారులే బాధ్యత వహించాలి
అమలాపురం రూరల్: అర్జీల పరిష్కారంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని అర్జీలు పునరావృతమైతే సంబంధిత జిల్లా స్థాయి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని (జాయింట్ కలెక్టర్) జేసీ టి.నిషాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించి సుమారు 260 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. డీఆర్వో మాధవి మాట్లాడుతూ అర్జీలు పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యత ఉండాలని ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ వేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ మధుసూదన్, సమగ్రశిక్ష ఏపీసీ జి.మమ్మీ, ఎస్టీసీ పి.కృష్ణమూర్తి, డీఎల్డీవో వేణుగోపాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 23 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 23 అర్జీలు వచ్చాయి. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాహుల్ మీనా తొలిసారి పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదు అందగానే నిర్ణీత గడువులోగా ఆ సమస్యను పరిష్కరించి పోలీసింగ్పై అర్జీదారులకు సంతృప్తి, నమ్మకం కలిగేలా చేయాలని సూచించారు. తన వద్దకు వచ్చిన అర్జీదారులలో ఎస్పీ వారి సమస్యపై ముఖాముఖి చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉండడంతో ఎస్పీ వారితో కౌన్సెలింగ్ తరహాలో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు. గ్రీవెన్స్ను పర్యవేక్షించే మహిళా ఎస్సై గంగాభవాని కూడా పాల్గొన్నారు. తపాల శాఖలో ఆధార్ సేవలు మరింత విస్తృతం అమలాపురం టౌన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలోని ఆధార్ కౌంటర్ సేవలను మరింత విస్తృతం చేసిందని విశాఖపట్నం రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ వీఎస్ జయశంకర్ అన్నారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఈ ఎక్స్టెన్షన్ ఆధార్ కౌంటర్ను జయశంకర్ సోమవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ కౌంటర్ ఇక నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రెండు షిఫ్టుల్లో పనిచేస్తుందన్నారు. గతంలో ఉన్న కౌంటర్ పనిచేసే సమ యాన్ని మరింత పెంచి ఈ సేవలు అందిస్తున్నా మని వివరించారు. కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ అసిస్టెంట్ సూప రింటెండెంట్ కె.శ్రీధరం, పోస్ట్ మాస్టర్ బి.వెంకన్నతో పాటు తపాలా సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీలో ఒకే గ్రామం నుంచి ఏడుగురి ఎంపిక మలికిపురం: ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు ఎంపికయ్యారు. మలికిపురం మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన అడబాల రత్నదయాకర్ (ఇంగ్లీష్), బోనం నాగదేవి (తెలుగు), అడబాల పుష్పలత (బీఎస్), బెజవాడ సాయిలక్ష్మి (పీఎస్), యెరుబండి రవిప్రసాద్ (ఎస్జీటీ), బొరుసు నాగేంద్రబాబు (ఎస్జీటీ), అడబాల దుర్గాదేవి(ఎస్జీటీ)లో ఎంపికయ్యారు. ఉత్తమ సేవలు అందించాలి ఏలూరు టౌన్: జిల్లా ఎస్పీలుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా కృషి చేయాలని ఐజీ సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు
తుని రూరల్: ఈనెల 27 నుంచి మూడు రోజులు ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల బాలికలు ఎంపికై నట్టు ఆ పాఠశాల వి.కొత్తూరు ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి సోమవారం తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో జూనియర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో తమ విద్యార్థినులు ప్రతిభ ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నటుట్ట ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 100 మీటర్ల పరుగు, షాట్పుట్లో హర్షిణి ప్రథమస్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 క్రీడా పోటీల్లో చదరంగంలో వైష్ణవి (ప్రథమ), మణి (6వ), యోగాలో పి.అనురాధ (ప్రథమ), కె.అక్షయ కీర్తి (ద్వితీయ), ఎస్.మేఘనశ్రీ (తృతీయ), ఎం.విజీన (నాలుగో) స్థానాల్లో నిలిచారన్నారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, పీడీ ఆర్.విజయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు. -
రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్గా సాత్విక్
అమలాపురం టౌన్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ స్థానం సాధించాడని జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీల్లో 140 మంది క్రీడాకారులు పాల్గొనగా సాత్విక్ బ్లిట్జ్ చెస్లో 7 రౌండ్లకు 6.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. త్వరలో త్రిపుర రాష్ట్రంలో జరగనున్న నేషనల్ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో సాత్విక్ మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించనున్నాడు. నంద్యాలలో చాంపియన్ షిప్ నిర్వాహకుల నుంచి విజేత సాత్విక్ రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్గా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. రాష్ట్ర విజేత సాత్విక్ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వెంకట సురేష్ అభినందించారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక
అమలాపురం రూరల్: ప్రభుత్వం ఇటీవల కాకినాడలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్న కేదారి సాయిదుర్గ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. సోమవారం సాయిదుర్గను కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి సుబ్బరాజు, తాతా అవధాని, పరిపాలనాధికారి ఎ.వెంకటపతిరాజు, ప్రిన్సిపాల్ వడలి సుబ్బారావు, పీడీ సురేష్కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. సెపక్తక్రాలో నలుగురి ఎంపిక అల్లవరం: కోడూరుపాడు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు ఎంపికయ్యారని పీడీ బూల చిరంజీవి సోమవారం తెలిపారు. విజయవాడలో అక్టోబర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. కొడమంచిలి షణ్ముఖ, పీడీవీ సత్యలావణ్య రెగ్యులర్ క్రీడాకారులుగా, సత్యశ్యామల, ఉమ్మడిశెట్టి రత్నకుమారి స్టాండ్ బైగా ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను సర్పంచ్ నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అభినందించి వారికి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏఎస్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ముమ్మడివరపు సుధీర్, పిల్లా ప్రసాద్ తదితరుల సహకారంతో క్రీడాకారులకు షూ అందజేశారు. -
డీఎస్సీ తుది జాబితా విడుదల
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1349 పోస్టుల భర్తీ ● దసరా సెలవుల తర్వాత కొలువుదీరే అవకాశం ● ఈ నెల 22 నుంచి కొత్త టీచర్లకు 8 రోజుల శిక్షణ రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సోమవారం ఉదయం డీఎస్సీ–2025 తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. క్యాడర్ల వారీగా ఎంపికై న ఉపాధ్యాయుల జాబితాను ఆన్లైన్లో విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,349 పోస్టులకు టీచర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ స్టేట్ రీసోర్స్ పర్సన్స్(ఎస్ఆర్పీ)కు గుంటూరు జిల్లా పరిధిలోని విట్ యూనివర్శిటీ, ఎస్జీటీ ఎస్ఆర్పీలకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్లో శిక్షణ ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం కొత్త టీచర్లు కొలువు దీరే అవకాశముంది. ఐదు నెలల అనంతరం డీఎస్సీ–2025 ఫలితాలను సుమారు ఐదు నెలల అనంతరం విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,241 మైదాన (ప్లెయిన్ ఏరియా) పోస్టులకు, 112 ఏజెన్సీ ఏరియా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1,352 పోస్టులకు 63,004 మంది దరఖాస్తు చేయగా, జూన్ 6వ తేదీ నుంచి సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షలకు 38,617 మంది హాజరయ్యారు. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా, ఫైనల్ కీ జూలై 31న ఫైనల్ కీ విడుదల చేశారు. ఆగస్టు 23న మెరిట్ లిస్ట్ విడుదల చేయగా, ఆగస్టు 28న ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాలుగు విడతల్లో చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సోమవారం డీఎస్సీ–2025 రాష్ట్ర కన్వీనర్ తుది ఎంపిక జాబితాను వెబ్సైట్లో ఉంచారు. ఎంపికయిన పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 421 కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్ స్టడీస్, బయాలజీ పోస్టులు మూడంకెల సంఖ్యలో ఉండగా, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, పీఎస్ సబ్జెక్టులు రెండంకెల్లో ఉన్నాయి. సంస్కృతం కేవలం ఐదు పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 112 పోస్టులకు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎస్జీటీలు 104, ఫిజికల్ సైన్స్ మూడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి, బయోలాజికల్ సైన్స్ నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. ఎస్జీటీ విభాగంలో స్థానిక సంస్థల్లో ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కో పోస్టు వంతున భర్తీ కాలేదు. అలాగే సంస్కృతం విభాగంలో స్థానిక సంస్థల మేనేజ్మెంట్లో రెండు పోస్టులు భర్తీ కాలేదు. అర్హత ఉన్న అభ్యర్థులు లేక.. డీఎస్సీ–2025లో వివిధ క్యాటగిరీలకు చెందిన నాలుగు పోస్టులు అర్హత ఉన్న అభ్యర్థులు లేక భర్తీ కాలేదు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం పోస్టులు రెండు భర్తీ కాలేదు. గ్రీవెన్స్లో ఫిర్యాదుల స్వీకరణ డీఎస్సీ–2025 ఫైనల్ సెలక్షన్ జాబితాలో సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు తాము ఎందుకు అర్హత కోల్పోయామో తెలుసుకునేందుకు కాకినాడ డీఈవో కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు (ఫైల్)క్యాడర్లు, మేనేజ్మెంట్ వారీగా ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలు క్యాడర్ సబ్జెక్టు ఎంపికైన టీచర్ల సంఖ్య ఎస్ఏ ఇంగ్లీషు 95 ఎస్ఏ హిందీ 78 ఎస్ఏ సంస్కృతం 05 ఎస్ఏ తెలుగు 58 ఎస్ఏ బయాలజీ 103 ఎస్ఏ గణితం 64 ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 71 ఎస్ఏ సోషల్ స్టడీస్ 132 ఎస్జీటీ ఎస్జీటీ తెలుగు 421 -
జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా బాధ్యతల స్వీకరణ
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీగా రాహుల్ మీనా ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు జిల్లా అదనపు ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగానే ఆయనను అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్తో పాటు జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలసి పరిచయం చేసుకున్నారు. స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాసరావు, సోషల్ మీడియా సీఐ జి.వెంకటేశ్వరరావు, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, రూరల్ సీఐ డి.ప్రశాంత్కుమార్ తదితరులు నూతన ఎస్పీని కలిశారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.50 వేల సమర్పణ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం రాజమహేంద్రవరానికి చెందిన దాత అఖండం వెంకట రమణ మూర్తి, కుటుంబ సభ్యులు రూ.50 వేల విరాళం సమర్పించారు. పైమొత్తాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్కు ఇచ్చారు. దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాలు, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. 17 నుంచి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అమలాపురం రూరల్: ప్రధాని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న నరేంద్ర మోదీ స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించి అక్టోబర్ 2 వరకూ నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, గ్రామ హెల్త్ సెంటర్లలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తామన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మహా కార్యక్రమాలు పాటిస్తామన్నారు. తలుపులమ్మతల్లి ఆదాయం రూ.6.14 లక్షలు తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మతల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో లోవ జనసంద్రమైంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు లోవ దేవస్థానానికి చేరుకున్నారు. క్యూలైన్లు ద్వారా 16 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,11,095, పూజా టికెట్లకు రూ.2,35,580, కేశఖండనశాలకు రూ.16,160, వాహన పూజలకు రూ.8180, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.95,792, విరాళాలు రూ.46,440 వెరసి మొత్తం రూ.6,14,247 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు. -
స్మార్తమే అపర కర్మలకు మూలం
అపర విద్వత్సభలో ఘనపాఠీలు అమలాపురం టౌన్: స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు మాట్లాడుతూ వేదాల నుంచే స్మార్త, ఆగమ, అపర కర్మల విధానాలు జన్మించాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం విద్వాంసులు యీవని వెంకటరామచంద్ర సోమయాజి మాట్లాడుతూ వేదాలకు మూలం స్మార్తం అయితే, ఆ స్మార్తమే అపర కర్మలకు మూలమని అన్నారు. వైఖాసన ఆగమ పండితుడు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకుడు వాడపల్లి శేషాచార్యులు అపర కర్మలు నిర్వహించే విధానాలను వివరించారు. కృష్ణ యజుర్వేద పరీక్షాధికారి, పిఠాపురానికి చెందిన మహంకాళి దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ కాలమాన పరిస్థితుల దృష్ట్యా షోడశ కర్మల నిర్వహణలో చిన్న చిన్న మార్పులు అనివార్యమైనా కర్మల ప్రాధాన్యం, విలువ ఏ మాత్రం తగ్గలేదన్నారు. యజుర్వేద, రుగ్వేద, అపర పండితులు భగవతి నారాయణశాస్త్రి, శైవాగమ పండితులు నవూలూరి దీక్షితులు, వాస్తు జ్యోతిష పండితులు గరిమెళ్ల భాస్కర గంగాధరశాస్త్రి మాట్లాడుతూ స్మార్త పండితులు పలు సందర్భాల్లో 16 కర్మలు నిర్వహిస్తున్నప్పుడు కర్మలు చేయించుకునే వారి సంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శ్రీకోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్వత్సభలో సభ ప్రతినిధులు యేడిది సుబ్రహ్మణ్యశర్మ, శిష్టా భాస్కర్, ఆదిరాజు భాస్కరశర్మలు స్మార్త పండితులకు సత్కార సేవలు అందించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హాజరైన 150 మంది స్మార్త, ఆగమ, అపర పండితులు పాల్గొని వేద ఘనపాఠీలు వివరించిన స్మార్త నిబంధనలు విన్నారు. సభ చివర్లో ఇటీవల రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆకెళ్ల వెంకట నారాయణ అవధానిని వేదశాస్త్ర సన్మాన సభ తరఫున ఘనంగా సత్కరించారు. వేదాభిమాని పుత్సా కృష్ణ కామేశ్వర్ తదితరులు సేవలు అందించారు. -
గుణపాఠం చెప్పాలని..
ఫ కూటమి ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు ఫ ఉపాధ్యాయ సమస్యలపై శ్రీరణభేరిశ్రీకి సిద్ధం ఫ నేటి నుంచి 20 వరకూ ఉమ్మడి జిల్లాలో జాతా ఫ 25న విజయవాడలో బహిరంగ సభ కపిలేశ్వరపురం: అక్షరాలు దిద్దించే గురువులకు ఆపసోపాలు తప్పడం లేదు.. భావితరం రాతను మార్చే ఉపాధ్యాయుల తలరాత మారడం లేదు.. సమాజ నిర్ధేశకులుగా పిలిచే ఆ బోధకుల బాధను ప్రభుత్వం తీర్చడం లేదు.. చెప్పి చెప్పి విసిగిపోయిన వారు ప్రభుత్వానికి గుణ్ఙపాఠంశ్రీ చెప్పేందుకు సిద్ధమయ్యారు.. ప్రభుత్వ విద్యను కాపాడే కార్యాచరణలో భాగంగా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో శ్రీరణభేరి జాతాశ్రీ పేరుతో విద్యారంగ పరిరక్షణకు కార్యాచరణ చేపట్టారు. సోమవారం నుంచి ఈ నెల 20 వరకూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కోనసీమ జిల్లాలో 5,800, కాకినాడ జిల్లాలో 6,500, తూర్పుగోదావరి జిల్లాలో 5,700 బోధకులు పని చేస్తున్నారు. వీరు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూనే ఉన్నాయి. అయినా స్పందన లేక ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రధానంగా 12వ పీఆర్సీని అమలు చేసే లోపు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేసి ఉపాధ్యాయులకు డిప్యూటీ డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అనేక సార్లు విన్నవించారు. ఆ మేరకు వివిధ సంఘాల ద్వారా వినతి పత్రాలను అందజేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. శ్రీరణభేరి జాతాశ్రీ ఎక్కడెక్కడంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యపై కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆందోళనకు దిగుతున్నామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ప్రకటించారు. పాఠశాల విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా సోమవారం నుంచి 20 వరకూ సాగే జాతా ద్వారా ఉపాధ్యాయులు, ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. 15న కాకినాడ జిల్లా, 16న అల్లూరి సీతారామరాజు మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో, 17న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, 18న పశ్చిమ గోదావరి, 19న ఏలూరు జిల్లాల్లో జాతా సాగుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జాతాలతో పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి, తూర్పు రాయలసీమలో ఒకటి, పశ్చిమ రాయలసీమలో ఒకటి కలపి మొత్తం ఐదు జాతాలు తిరుగుతాయన్నారు. చివరిగా ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ ద్వారా కూటమి ప్రభుత్వంపై డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి తీసుకొస్తామని యూటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. విన్నపాలు వినలే.. తమ సమస్యలు పట్టించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు అనేక సార్లు ఉద్యమించారు. ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 5 వరకూ నిరసన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ 2న తమకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్తో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్ 2న కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట యాప్ల భారం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులకు వివిధ రకాలుగా రూ.25 వేల కోట్ల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయినా పట్టించుకోక పోవడంతో జాతాకు కార్యచరణ చేశారు. భాగస్వాములు కావాలి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రణభేరి జాతాను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలనే సామాజిక బాధ్యతతో జాతాతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించాం. ఈ జాతాలో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలి. –పి.సురేంద్ర, యూటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు బోధన.. అవస్థల మాటున విద్యార్థులకు విద్యాబుద్ధులను చెప్పే పనిని చేయనీయకుండా కూటమి ప్రభుత్వం తమ ప్రచార యావను గురువులపై రుద్దుతోంది. మెగా పీటీఎం 2.0 పేరుతో జూలై 10న నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ను తల్లికి వందనం పథకం ప్రచార కార్యక్రమంగా నిర్వహించింది. ఏడాది ఎగ్గొట్టి అరకొరగా మాత్రమే ఇచ్చిన సాయానికి అంత ప్రచారం అవసరమా అనే వాదన అందరిలో వినిపించింది. కార్యక్రమం నిర్వహణకు 17 కమిటీలు వేసి పండగలా నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు ఒత్తిడికి గురిచేసింది. బోధనేతర పనుల నుంచి టీచర్లను మినహాయించాలని కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పీ–4 నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలన్న డిమాండ్ను ఉద్యమంతో సాధించుకున్నారు. యాప్ల భారం తగ్గించాలని కోరగా, పని భారాన్ని ఏమాత్రమూ తగ్గించకుండా చేశామన్న పేరుకు ప్రభుత్వం అన్ని యాప్లను ఒకే వేదికకు మాత్రమే చేర్చింది. ప్రశ్నించే ఆయుధం నిర్వీర్యం ప్రజాస్వామ్య పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయంలోకి ఇతరులు ప్రవేశించరాదంటూ అప్రజాస్వామిక జీఓను జారీ చేసింది. ప్రభుత్వ జీఓ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఆయుధాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుందని విద్యార్థి సంఘాలు నేతలు అంటున్నారు. పాఠశాలల్లో అసౌకర్యాలు ఉన్నా ఎవరూ అడగకుండా ఉండాలనేది ప్రభుత్వ ముఖ్యోద్దేశంగా ఉందని విమర్శిస్తున్నారు. -
పొంతన లేని సమాధానాలు మానుకో..
ఫ కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం ఫ మంత్రి సుభాష్పై వైఎస్సార్ సీపీ శెట్టిబలిజ నేతల ధ్వజం అమలాపురం టౌన్: శెట్టిబలిజిలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అన్యాయం గురించి అడిగితే మంత్రి వాసంశెట్టి సుభాష్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీకి చెందిన జిల్లా శెట్టిబలిజ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ శెట్టిబలిజ నేతలు అమలాపురంలోని వాసర్ల గార్డెన్లో ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి సుభాష్ అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొక్కా వెంకటలక్ష్మి, కోనసీమ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరాసాహెబ్ శెట్టి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని బులినాని, కొత్తపేట జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, శెట్టిబలిజ యువజన అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాసరావు తదితరులు మంత్రి సుభాష్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. శెట్టిబలిజలకు ఈ ప్రభుత్వం సుమోటోగా గౌడ (శెట్టిబలిజ) అని కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న అన్యాయంపై కలెక్టర్కు పార్టీ సామాజిక వర్గం తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ద్వారా వినతి పత్రాలు అందించామన్నారు. అందుకు మంత్రి సుభాష్ మొదట సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని, మరోసారి ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని పొంతన లేని మాటలు చెప్పారని గుర్తు చేశారు. అంతే కాకుండా తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై, జగ్గిరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంత్రి సుభాష్కు రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందన్నారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే గౌడ (శెట్టిబలిజ) అని కుల ధ్రువీకరణ పత్రం జారీకి జీఓ ఇచ్చారని అన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లేని ఈ సమస్య ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నించారు. అంటే చంద్రబాబుతో పాటు సుభాష్ ఎక్కడున్నా కులాల కుంపటి రాజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కులాలను విడదీయడం, వారు తన్నుకుంటుంటే చూసి ఆనందిండచం పైశాచికత్వంగా మారిందని విమర్శించారు. మంత్రి వర్గంలో 25 మంత్రులుంటే ముఖ్యమంత్రి వారికి రా్యాంకులు ఇచ్చినప్పుడు సుభాష్కు 25వ ర్యాంక్ ఇవ్వడంతోనే సుభాష్ మంత్రి పదవిని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలిసిందని అన్నారు. శెట్టిబలిజల పరువు తీసేలా సుభాష్ ప్రవర్తించడం బాధాకరంగా ఉందన్నారు. అసలు శెట్టిబలిజల సామాజిక వర్గం కోటా వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై తమ పార్టీ అధినేత జగన్ గురించి, తమ పార్టీ నేతల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రూ. కోటి జమ ఏమైంది..?శెట్టిబలిజల వన సమారాధన వేదికపై తాను శెట్టిబలిజ యూత్ ఫోర్స్ తరఫున రూ.కోటి జమ చేసి ఆ నిధులను తమ సామాజికవర్గ యువతకు స్కిల్ డెవలప్మెంట్తో ఉపాధి మార్గాలు చూపిస్తానని గతంలో మంత్రి సుభాష్ చెప్పిన మాటలను పట్టణ పార్టీ అధ్యక్షుడు బులినాని గుర్తు చేశారు. ఇంత వరకూ రూ.కోటి జమ చేయలేదని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీకి చెందిన శెట్టిబలిజ నేతలు విత్తనాల శేఖర్, కముజు రమణ, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కుడుపూడి భరత్ భూషణ్, విత్తనాల మూర్తి, కాండ్రేగుల గోపి, వాసర్ల సుబ్బారావు, దొంగ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
భజే గణనాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో తెల్లవారు జామున స్వామివారికి మేలుకొలుపు సేవ, గరిక పూజ పూజ చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 60 మంది, పంచామృతాభిషేకాల్లో ఒక జంట, లక్ష్మీగణపతి హోమంలో 19 జంటలు, పంచామృతాభిషేకాల్లో ఇరువురు దంపతులు పాల్గొన్నారు. ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశన, నలుగురికి తులాభారం నిర్వహించారు. 17 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,100 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.2,44,843 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
మళ్లీ పెరుగుతున్న వరద
పి.గన్నవరం: గోదావరి ఎగువ ప్రాంతాల వస్తున్న వరద నీటితో జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమీ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ వరద రావడంతో లంక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు వచ్చిన వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన చెందుతున్నారు. నాలుగో సారి వరద రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రెండు నెలలుగా పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. వరద ఉధృతి పెరగడంతో పడవలు దాటే సమయంలో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
మంత్రి సుభాష్ వ్యాఖ్యలు.. ఖండించిన శెట్టిబలిజ నేతలు
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను శెట్టిబలిజ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్, జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్నారు.పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని విషయం మరిచిపోకూడదని సూర్యప్రకాష్ అన్నారు. శెట్టిబలిజ జాతికి సుభాష్ చేసిందేమీ లేదు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని సూర్య ప్రకాష్ అన్నారు. -
లోక్ అదాలత్లో 377 కేసుల పరిష్కారం
అమలాపురం టౌన్: స్థానిక కోర్టుల భవనాల సముదాయంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 377 కేసులు పరిష్కారమయ్యాయి. అమలాపురం రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పి.గోవర్ధన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరిగింది. 13 సివిల్ కేసులు, 311 క్రిమినల్, 20 వాహన ప్రమాద, 21 బీఎస్ఎన్ఎల్, 12 బ్యాంక్ కేసులతో కలపి మొత్తం 377 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.2,37,18,700 విలువైన కేసులు పరిష్కారమైనట్లు కోర్టు కార్యాలయం తెలిపింది. లోక్ అదాలత్లో సివిల్ జడ్జి పి.రమణారెడ్డి (సీనియర్ డివిజన్), ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎండీ రహమతుల్లా (జూనియర్ డివిజన్)తో పాటు అదాలత్ సభ్యులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఆయ్.. అదరగొడుతున్నారు..
ఫ జిల్లాలో సెపక్ తక్రాకు ఆదరణ ఫ జాతీయ పోటీల్లో క్రీడాకారుల సత్తా ఫ పాఠశాల స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు సాక్షి, అమలాపురం: చేతులతో వాలీబాల్ ఆడడమే చాలా కష్టం.. అటువంటిది కేవలం కాళ్లు, తల, మొండెంతో మాత్రమే ఆడాలంటే ఇంకెంత కష్టమో కదా. కానీ వీరు కాళ్లతోనే సర్వీసు చేస్తారు. లిఫ్ట్ చేస్తారు. బలంగా షాట్ కూడా కొడతారు. మినీ వాలీబాల్ను తలపించే సెపక్ తక్రా ఆటను కాళ్లు, మొండెం, తలతో మాత్రమే ఆడాల్సి ఉంది. ఇది సాధారణమైన ఆట కాదు. క్రీడాకారులు తలపడుతున్న తీరు చూస్తుంటే జిమ్నాస్టిక్స్ విన్యాసాలు గుర్తుకు వస్తాయి. మైదానంలో వారు ఆడుతుంటే సర్కస్ ఫీట్లు కనిపిస్తాయి. ఇటువంటి అరుదైన ఆటలో కోనసీమ క్రీడాకారులు రాణిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు.. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణిస్తున్నారు. సత్తాచాటి పతకాలు సాధిస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో సుమారు మూడొంతుల మంది అమలాపురం నుంచి ఎంపికై న వారే ఉన్నారు. జిల్లాలో 2002లో ఈ క్రీడ మొదలు కాగా, ఇప్పటి వరకూ జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టుకు 44 సార్లు ఎంపికై న ఘనత ఇక్కడి క్రీడాకారులకు దక్కుతోంది. 160 సార్లు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. స్థానికంగా కానిస్టేబుల్గా పనిచేస్తున్న యాండ్ర గౌతమ్ కోచ్గా ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకు వస్తున్నారు. జిల్లాలో అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, పేరూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ క్రీడకు ఇటీవల ఎస్జీఎఫ్, ఏషియన్ గేమ్స్, ఆల్ ఇండియా, ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో ప్రవేశం కల్పించడంతో ఆడేవారి సంఖ్య పెరిగింది. సెంట్రల్ డిపార్ట్మెంట్ కోటాలో ఏపీ నుంచి నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని కోచ్ గౌతమ్ చెబుతున్నారు. దేశం తరఫున ఆడాలన్నదే లక్ష్యం నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నాలుగేళ్ల నుంచి ఈ క్రీడలో తర్ఫీదు పొందుతున్నా. ఇప్పటి వరకూ నాలుగు సార్లు రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. మూడు సార్లు బ్రాంజ్ మెడల్ సాధించాను. దేశం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. –చిట్టూరి శశిధర్, అమలాపురం నాలుగు సార్లు పథకాలు పొందా.. పన్నెండేళ్లుగా సెపక్ తక్రా ఆడుతున్నాను. ఇప్పటికి 16 సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. నాలుగు సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాను. భారత జట్టులో సెంటర్ స్థానానికి ఎంపిక కావాలన్నది నా ఆశయం. అందుకు తగినట్టుగా సాధన చేస్తున్నాను. –కేతా సతీష్ ఇసుకపూడి నుంచి జాతీయ పోటీలకు.. నేను ఇసుకపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. అదే పాఠశాలలో శిక్షణ పొందుతూ ఇప్పటి వరకూ రెండుసార్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యా. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలో జరిగిన జాతీయ స్థాయి అండర్– 14 సెపక్ తక్రా క్రీడా చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ టీం తరఫున ఆడాను. –పూర్ణ లక్ష్మీప్రసన్న, ఇసుకపూడి, అంబాజీపేట మండలం షూటర్ కావాలని.. గత మూడేళ్లుగా సెపక్ తక్రా ఆడుతున్నా. మూడు సార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై , రెండు సార్లు బ్రాంజ్ మెడల్ సాధించాను. ఈ ఏడాది జనవరిలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్–14 స్కూల్ గేమ్స్లో ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యా. భారత జట్టు షూటర్గా ఎంపిక కావాలనేదే లక్ష్యం. –గోసంగి కృష్ణ సందీప్, అమలాపురం ఖేలో ఇండియాలో సత్తా చాటి.. నేను ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో సత్తా చాటాను. గత జనవరిలో డామన్ డయ్యూలో జరిగిన ఆల్ ఇండియా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాను. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మరింత రాణించేందుకు సాధన చేస్తున్నాను. –మంచాల చందు, రోళ్లపాలెం, అమలాపురం రూరల్ ప్రోత్సాహం మరింత అవసరం ఉమ్మడి జిల్లాలో సెపక్ తక్రా క్రీడకు మా వంతు ప్రో త్సాహం అందిస్తున్నాం. మరింత మంది ప్రోత్సహిస్తే తూర్పు క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తారు. పాఠశాల స్థాయి నుంచి ఈ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీలు, చమురు సంస్థలు ఈ క్రీడను ప్రోత్సహించాలి. –జవ్వాడి తాతబాబు, సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం ఆటకు జీవం పోస్తూ.. నేను సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. కోచ్గా సెపక్ తక్రా క్రీడకు జీవం పోయాలనేదే నా ఆశయం. పదిహేను సార్లు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నాను. 2012 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోచ్గా సేవలందిస్తున్నాను. నా సారథ్యంలో ఇప్పటి వరకూ 42 సార్లు జాతీయ పోటీలకు, 120 సార్లు రాష్ట్ర పోటీలకు ఉమ్మడి తూర్పు క్రీడాకారులు ఎంపికయ్యారు. తూర్పు క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు పంపించాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాను. –యాండ్ర గౌతమ్, కోచ్ -
రణభేరి జాతాను విజయవంతం చేయండి
అమలాపురం టౌన్: పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ యూటీఎఫ్ నిర్వహించనున్న రణభేరి జాతాను విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కిశోర్కుమార్, జ్యోతిబసు పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్లైన్లో అప్లోడ్, గ్రీన్ పాస్పోర్టు మొదలైన బోధనేత పనులతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించనున్న రణభేరి జాతాలో ఈ సమస్యలన్నీ యూటీఎఫ్ నేతలు ఎలుగెత్తుతారని వారు స్పష్టం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఏటీవీఏఎస్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు, సహాధ్యక్షులు జీవీ రమణ, సీతాదేవి, కోశాధికారి సీహెచ్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
వేడుకుందామా.. ఏడు వారాల స్వామిని..
● గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి ● ఒక్కరోజు ఆలయ ఆదాయం రూ.80.04 లక్షలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని క్షేత్రం వాడపల్లి శనివారం భక్తజన కోలాహలంతో నిండిపోయింది. స్వామి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తున్న వారి గోవింద నామస్మరణతో వాడపల్లి పులకించింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉపచారాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని వీక్షించిన భక్తులు తన్మయులయ్యారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వమిని దర్శించున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలను, సేవలను పరిశీలించారు. పెరిగిన ఆదాయం ప్రతి శనివారం కంటే ఈ వారం అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దానికి అనుగుణంగానే ఆదాయం కూడా పెరిగింది. ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశార్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.80,04,451 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఫ 15న ఎంపిక జాబితా విడుదలయ్యే అవకాశం ఫ 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ఫ దసరా సెలవుల తర్వాత విధుల్లోకి.. రాయవరం: డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. ఈ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ తదితర ప్రామాణికాల ఆధారంగా అర్హత పొందిన వారిని గుర్తించి, కాల్ లెటర్లు పంపించారు. ఆ అభ్యర్థులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,241 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో తుది జాబితా రూపొందించినట్లు సమాచారం. ఈ జాబితాను జిల్లా కమిటీ ఆమోదం కోసం పంపించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రోస్టర్, మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేసిన అనంతరం ఎంపిక జాబితాను ఈ నెల 15 సాయంత్రానికి రాష్ట్ర అధికారులు ప్రకటించే అవకాశముంది. కొలువుల్లో చేరేవారికి శిక్షణ కొత్తగా చేరనున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంపిక కానున్న 1,241 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి 29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. పీజీటీలు, టీజీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ క్యాడర్లో ఎంపిక కానున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెసిడెన్షియల్ విధానంలో ఇచ్చే శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనువైన విద్యా సంస్థలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరే అవకాశముంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీలివే.. కేటగిరీ ప్రభుత్వ/ జెడ్పీ/ మున్సిపల్ మేనేజ్మెంట్ ఎస్జీటీ 423 ఎస్ఏ తెలుగు 65ఎస్ఏ హిందీ 78 ఎస్ఏ ఇంగ్లిష్ 95ఎస్ఏ గణితం 64ఎస్ఏ పీఎస్ 71 ఎస్ఏ బయాలజీ 103 ఎస్ఏ సోషల్ 132 ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210 -
మహిళలపై అత్యాచారాలు అరికట్టాలి
అమలాపురం టౌన్: మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, గృహ హింసలు అధికమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా బాధ్యురాలు డి.ఆదిలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో అమలాపురం డివిజన్ ఐద్వా ముఖ్య బాధ్యుల సమావేశాన్ని ఐద్వా ప్రతినిధి ఆర్.సుశీల అధ్యక్షతన నిర్వహించారు. నేడు మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. నేటి యువత గంజాయి, మద్యం వంటి వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆదిలక్ష్మి అన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, యువత మాదక ద్రవ్యాల బారిన పడి తప్పుతోవ పడుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించి అదుపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఐద్వా ప్రతినిధులు జి.దైవకృప, కె.బేబీ గంగారత్నం, బి.ఎస్తేరురాణి, పి.అమూల్య, సుబ్బలక్ష్మి, హైమావతి, మణిమాల, మరియమ్మ, పూర్ణిమ, తులసీగౌరి, విజయలక్ష్మి, ఉమా సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో యువతదే కీలక పాత్ర
మలికిపురం: వైస్సార్ సీపీలో యువతదే కీలక పాత్ర అని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పిల్లి సూర్య ప్రకాష్ అన్నారు. నియోజకవర్గ యువజన విభాగం సమావేశం శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ విభాగం అధ్యక్షుడు గుర్రం జాషువా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సూర్యప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్హన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగాలను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. గ్రామాలలో సైతం పార్టీ యువత క్రియాశీలకంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నివాలని సూచించారు. అధికార పార్టీ వేధిస్తే తీవ్రంగా ప్రతిఘటించేందుకు పార్టీ యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్ మాట్లాడుతూ పార్టీ అధినేత ఆదేశాలను పాటించేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. పార్టీ అన్ని యువజన విభాగాల పదవులను భర్తీ చేశామని పేర్కొన్నారు. జిల్లా యువజన విభాగం నాయకులు బొంతు రమేష్, కొంబత్తుల మున్నా, బాబూరావు, నల్లి సుధీర్, మండల స్థాయి యువజన విభాగాల అధ్యక్షులు ఏగడెల చిట్టిబాబు, కొప్పిశెట్టి రాము, వాసంశెట్టి శ్రీహరి, ఉచ్చుల మోహన్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు తాడి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ -
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
రూ.2 లక్షల ఆస్తి నష్టం అయినవిల్లి: మండలంలోని నేదునూరు గౌతమీనగర్లో శుక్రవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించి ఓ పూరిల్లు కాలి బూడిదైంది. దీనికి సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నేదునూరు గౌతమినగర్కు చెందిన ఇసుకపట్ల నాగ వెంకట రమణకు చెందిన పూరిల్లు శుక్రవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇంటిలోని పర్నిచర్, బీరువా, దుస్తులు, పిల్లలకు పుస్తకాలు మొదలైనవి కాలి బూడిదైయ్యాయి. సుమారుగా రూ.2లక్షల ఆస్థినష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆదుపు చేశారు. అమలాపురం అగ్రిమాపక అధికారి రాజా, స్థానిక తహశీల్దార్ సీహెచ్ విద్యాపతి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితలకు తహశీల్దార్ విద్యాపతి ప్రభుత్వం నుంచి ముందస్తు సాయంగా 25 కిలోల బియ్యం అందజేశారు. వీరి వెంట స్థానిక సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు ఇండుగుల వెంకట్రామయ్య, కళ్లేపల్లి సుబ్బరాజు, ఆర్ఐ రాయుడు తదితరులు ఉన్నారు. -
జిల్లా పేరే మార్చేశారు.. స్మార్ట్గా!
అమలాపురం టౌన్: అత్యంత ఆధునిక, సాంకేతిక, పారదర్శకతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకులను పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం వాటి ముద్రణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విస్మరించింది. జిల్లాలో పంపిణీకి సిద్ధమైన 5,31,926 స్మార్ట్ కార్డుల్లో కొన్నింటిపై జిల్లా పేరు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్డులపై ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మరీ ఈ తప్పిదానికి పాల్పడడం శోచనీయం. జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇప్పటికి మూడేళ్లు దాటినా జిల్లా పేరుకున్న గౌరవాన్ని తగ్గించేలా ఇంకా తూర్పుగోదావరి జిల్లాగా వాటిపై ముద్రించడం శోచనీయం. ఇప్పటికే ఈ కార్డుల పంపిణీ మొదలైంది. వాటిపై జిల్లా పేరు తప్పుగా పడడం వల్ల తమకు రేషన్ ఇస్తారో లేదోనని లబ్ధిదారులు కంగారు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడం ఇష్టం లేక తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారా అని జిల్లాకు చెందిన కొందరు ఎస్సీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే కార్డులపై తమ జిల్లా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే సమయంలో ఆధార్ ఆధారంగా ఓటీపీ లేదా బయోమెట్రిక్తో పొందే వీలుంటుదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.దయ భాస్కర్ చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన కొన్ని కార్డుల్లో మాత్రమే తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారని, ఈ తప్పిదాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. దీనివల్ల స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.రేషన్ కార్డుల్లో పేరు మార్పుపై లబ్ధిదారుల ఆందోళన -
కూనమ్మల కళా కౌశలం!
● నాటక, దృశ్య కళల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలు ● ఆకట్టుకున్న కళా ఉత్సవ్ 2025 ● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 80 మంది హాజరు ● ఘనంగా ముగిసిన ఉత్సవాలు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో కళా ఉత్సవ్ 2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఐదు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటక, దృశ్య కళలు, వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం డీఎంహెచ్ స్కూల్ 9వ తరగతి దివ్యాంగ విద్యార్థి మహబూబ్ కిజర్ మహమ్మద్ మాస్టర్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో పోటీలలో విజేతలకు డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకులు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా పీపీఎస్ జోగన్న శాస్త్రి, ఎం.శ్రీనివాస్, పుప్పాల బాపిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోప్యాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు నాటక కళల బృంద విభాగంలో కె.విమల, సీహెచ్ కళ్యాణి, జి.చరణ్ తేజ, జి.అజయ్ కుమార్ (ఎంఎస్ఎన్సీ ఎయిడెడ్ హైస్కూల్, కాకినాడ), దృశ్య కళల (2డి) వ్యక్తిగత విభాగంలో ఏ.ప్రియదర్శిని, (నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం), శిల్ప కళ (3డి) వ్యక్తిగత విభాగంలో డి.దుర్గా జగదీష్, (జెడ్పీహెచ్ఎస్, రావులపాలెం), దృశ్యకళల బృంద విభాగంలో కేఆర్ఏ కుమారి (పీఎస్సీఎం జడ్పీహెచ్ఎస్, మండపేట). సంప్రదాయ కథా కథనంలో బి.పరిమళ (విజ్ఞాన్ జూనియర్ కళాశాల, రాయవరం) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
కొబ్బరి మరింత ప్రియం
– వెయ్యికాయల ధర రూ.26 వేలు సాక్షి, అమలాపురం: కొబ్బరి కాయ ధర మరింత పెరిగింది. దసరా ఎగుమతులు జోరుగా సాగుతుండడంతో కాయకు అంచనాలకు మించి ధర వస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో శుక్రవారం సాయంత్రం వెయ్యికాయల ధర రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు పలికింది. గోదావరి లంక గ్రామాల కాయను రూ.27 వేలు చేసి కొంటున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయకు గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో ధర పెరుగుతున్న విషయం తెలిసిందే. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటోంది. కాయకు రూ.20 ధర రావడమే రైతులు ఊహించలేదు. అటువంటిది ఇప్పుడు ఈ ధర చూసి రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. దసరా, తరువాత దీపావళి, ఆపై కార్తిక మాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. మహారాష్ట్ర నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర ఈస్థాయిలో ఉంది, లేకుంటే రూ.28 వరకు వచ్చేదిని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా కొబ్బరికాయ గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు అధికంగా ఎగుమతి అవుతోంది. సమన్వయంతో దసరా ఉత్సవాలు జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ అమలాపురం రూరల్: అమలాపురం పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలోనూ, సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఉత్సవ కమిటీలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా, డివిజన్స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవదాయశాఖ అధికారులు ఉత్సవ కమిటీ పెద్దలతో సమీక్షించారు. ప్రాచీన కళల్లో ఒకటైన తాలింఖానాను ఏటా స్థానికంగా నిర్వహిస్తూ వీరత్వానికి, ఐకమత్యానికి క్రమశిక్షణకు సూచికగా నిలుస్తున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు ముందస్తు ఏర్పాటు చర్యలపై ఈ నెల 26న సమావేశం నిర్వ హిస్తామన్నారు. అధికారులు, కమిటీ పెద్దల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఏడు వీధుల ప్రదర్శనల వివాద రహితంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.మాధవి ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ యాప్ రూపొందించండి పదో తరగతి విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల జీవిత పథాన్ని ప్రభావితం చేస్తాయని అందువల్ల పాఠశాలల గోడలపై కెరీర్ గైడెన్స్ ట్రీ ప్రదర్శన, కరపత్రాలు, సామాజిక మాధ్యమ యాప్ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం మామిడికుదురు జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థి ప్రతాపనేని నవీన్, హెచ్ఎం చిరంజీవితో సమావేశం నిర్వహించి కెరీర్ కౌన్సెలింగ్ ట్రీ కరపత్రం ప్రచురణ కెరీర్ గైడు, స్టూడెంట్ యాక్టివిటీ, కెరీర్ కౌన్సెలింగ్ గైడెన్స్ యాప్ రూప కల్పనపై సమీక్షించారు. డిసెంబరు నాటికి వివిధ ప్రచార అంశాలపై కసరత్తు పూర్తి చేసి జనవరి నుంచి కెరీర్ కౌన్సెలింగ్ను అమలులోకి తీసుకురావాలన్నారు. ఇంటర్ తరువాత ఏ వైపు వెళ్లాలనే విషయమై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. -
గౌరవానికి భంగం!
గౌరవ వేతనం విడుదల చేయాలి ఇమామ్లకు, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం సొమ్ముల వెంటనే విడుదల చేయాలి. పేద ఇమామ్లు, మౌజన్లు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మసీద్ల నిర్వహణ సొమ్ముల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి. – ఎండీవై షరీఫ్, రాజోలు కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది ఇమామ్, మౌజన్లకు కూటమి ప్రభుత్వం 11 నెలల నుంచి గౌరవ వేతం ఇవ్వకపోవడం వల్ల వారి కుటుంబాలు గడవడం చాలా ఇబ్బందిగా మారింది. ఆదాయాలు లేని మసీదుల నిర్వహణ కష్టతరంగా మారింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి మూడు నెలలకు గౌరవ వేతనాలు అందేవి. ఈ ప్రభుత్వం వాటిని తక్షణం విడుదల చేయడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – వి.ఖాదర్ బాషా, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు, అమలాపురం సాక్షి, అమలాపురం: సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన శ్రీసూపర్ సిక్స్శ్రీ హామీలనే కాదు.. అంతకు మించి హామీలు గుప్పించింది. సూపర్ సిక్స్ హామీలనే పూర్తి స్థాయిలో అమలు చేయని కూటమి ప్రభుత్వం మిగిలిన హామీలను కూడా అరకొరగా అమలు చేస్తూ లబ్ధిదారులను మోసం చేస్తోంది. ఇందుకు ఉదాహరణ ఇమామ్, మౌజన్, పాస్టర్లకు ఇస్తానన్న గౌరవ వేతనాల పంపిణీ ఒక్కటి. నెలల తరబడి బకాయిలు ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమ జిల్లాలో ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాల కోసం లబ్ధిదారులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తుండగా ఎనిమిది నెలల పాటు గౌరవ వేతం ఇవ్వాల్సి ఉంది. దీనితో పాటు ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు గౌరవ వేతనం రావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో సాంకేతిక కారణాల వల్ల వీరికి రావాల్సిన సొమ్ములు ఆగిపోయాయి. ఈ రెండు కలిపితే మొత్తం 11 నెలల పాటు వారికి గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. జిల్లాలో 125 వరకు చిన్న మసీదులున్నాయి. వీటిలో ఒక ఇమామ్, మౌజన్ల చొప్పున సేవలందిస్తున్నారు. ఇమామ్లకు నెలకు రూ.పది వేల చొప్పున ఒక్కొక్కరికీ రూ.1.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. మొత్తం జిల్లాలో 125 మందికి కలిపి మొత్తం రూ.1.37 కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే మౌజన్లకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికీ రూ.55 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.68.75 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వీరిద్దరికీ కలిపి మొత్తం రూ.2,05,75,000 చెల్లించాల్సి ఉంది. ఇదే కాకుండా ఎన్నికల ముందు మైనార్టీలకు చెందిన మసీదుల నిర్వహణ నిమిత్తం కూడా నెలకు రూ.ఐదు వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని మసీదులనేది స్పష్టత లేకున్నా కనీసం చిన్న మసీదుల నిర్వహణకు సొమ్ములు ఇచ్చినా నెలకు రూ.ఐదు వేల చొప్పున జిల్లాలోని 125 మసీదులకు సంబంధించి నెలకు రూ.6.25 లక్షల చొప్పున అందించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలానికి రూ.87.5 లక్షలు అందించాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. షాదీ తోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్నారు. ఈ హామీకి సైతం కూటమి ప్రభుత్వం గ్రహణం పట్టించింది. చిన్న చర్చిలలో పనిచేస్తున్న పాస్టర్లకు సైతం గౌరవ వేతనం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరికి నెలకు ఐదు వేల చొప్పున ఏడు నెలలు వేతనాలు అందడం లేదు. వీరికి ఒక్కొక్కరికీ రూ.35 వేల చొప్పున అందించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా. వైఎస్సార్ సీపీ హాయంలో మొదలు ఆదాయం తక్కువగా ఉండే చిన్న మసీదులపై ఆధారపడి జీవించే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం అనేది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొదలైంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి క్రమం తప్పకుండా గౌరవ వేతాన్ని చెల్లించేవారు. ఇవే కాకుండా వైఎస్సార్ బీమాను వర్తింప చేయడంతో పాటు ఇమామ్లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు అందజేశారు. వీరితో పాటు క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన పాస్టర్లకు సైతం నెలకు రూ.ఐదు వేల చొప్పున అందించడం కూడా ప్రారంభించారు. వీరికి కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం గమనార్హం. ఈ కారణంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీరు చూసి గత ప్రభుత్వంలో జరిగిన మేలును వారు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశిస్తున్న ఇమామ్, మౌజన్, పాస్టర్లు వేతన బకాయిల కోసం ఎదురు చూపులు జిల్లాలో మసీదులకు రూ.2.06 కోట్ల వరకు బకాయి షాదీ తోఫాను విస్మరించారు పేద పాస్టర్లను ఆదుకోవాలి ప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతం రూ.ఐదు వేలు వెంటనే విడుదల చేయాలి. పేద పాస్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం ఇవ్వకపోవడం వల్ల పేద పాస్టర్లు ఇబ్బంది పడుతున్నారు. – బిషప్ ఎం.స్పర్జన్రాజు, సియోను ప్రార్థనా మందిరం, రంగాపురం, అమలాపురం మండలం -
చేనేత.. సమస్యల కలబోత
చేనేతను ఆదుకోవడం సామాజిక బాధ్యత చేనేత వృత్తి పరిరక్షణ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా పరిగణించాలి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర అంగర చేనేత సహకార సంఘం సొంతం. అటువంటి సొసైటీకి ఆప్కో నుంచి రూ.కోటి పైగానే బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము విడుదల కాకుంటే సంఘం మూతపడే ప్రమాదం ఉంది. – గుడిమెట్ల శివరామకృష్ణ, మాజీ చైర్మన్, శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం, అంగర సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేనేత కుటుంబాలు బకాయిల గుదిబండతో చితికిపోతున్నాయి. గడచిన 10 నెలలుగా పైసా కూడా విదల్చక పోవడంతో చేనేత సహకార సంఘాలు మూత వేసుకునే దుస్థితి ఏర్పడింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అన్ని పథకాలు అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. సూపర్ సిక్స్ అమలుమాట దేవుడెరుగు కనీసం అప్పులు కూడా పుట్టక చేనేత రంగం కుదేలైందని చేనేత కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ గద్దె నెక్కి 14 నెలలు దాటిపోయినా బకాయిలు విడుదల చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చేనేతలు చేతిలో చిల్లిగవ్వ లేక నూటికి రూ.8ల వడ్డీతో అప్పుల కోసం రోడ్డెక్కే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సంప్రదాయంగా చేనేత ఉత్పత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముందుకు వెళదామంటే నుయ్యి, వెనక్కు వద్దామంటే గొయ్యి అన్న సామెత చందంగా నేతన్నల పరిస్థితి తయారైంది. అనేక చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచి పోరాడుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఈ ప్రాంతంలో చేనేతల జీవితం కష్టాలు, కన్నీళ్లు కలబోతగా మారింది. ఈ దుస్థితికి కూటమి ప్రభుత్వం నిర్వాకం కూడా కారణమని చేనేత సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఉత్తిమాట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 పైబడే చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో చేనేత కుటుంబాలు ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, అంగర, పులుగుర్త, వడిశలేరు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ముమ్మిడివరం, క్రాపచింతలపూడి శివారు కె జగన్నాథపురం, బండార్లంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల పరిధిలో జరిగే లావాదేవీలపై సుమారు 13వేల చేనేత కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉమ్మడి తూర్పున పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్లో సంఘాలు మనుగడ సాగిస్తాయనేది నిర్వివాదాంశంగా పేర్కొటున్నారు. గతంలో మాదిరిగా సంఘాలు ఇక ముందు కూడా సక్రమంగా నడవాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కలిసి సంఘాలకు రావాల్సిన రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటున్నారు. తనతోనే చేనేత రంగం ప్రగతిబాటలో పయనించిందని గొప్పలకు పోతోన్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బకాయిలు విడుదల చేసి మాట్లాడాలంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వినియోగం వరకు విద్యుత్ ఉచితమని చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నంగా 100 యూనిట్లకు పైబడి వినియోగించిన వారికి విద్యుత్ బిల్లులు సెప్టెంబర్ నెలలో చేతిలో పెట్టారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. పెట్టుబడులు పెట్టే స్తోమత లేక.. ఉమ్మడి జిల్లాలో ఒకో సంఘానికి తక్కువలో తక్కువ రూ.ఏడెనిమిది లక్షల నుంచి రూ.90 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని ఒక్క అంగర చేనేత సహకార సంఘానికే రూ.90 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు అవార్డు దక్కిన అంగర చేనేత సహకార సంఘం దుస్థితి ఇలా ఉంటే మిగిలిన సంఘాల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ సంఘాలలో సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి తమ పొట్టకొడుతోందని చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయక, పెట్టుబడులు పెట్టే స్థోమత లేక, బయట మార్కెట్లో రూ.8ల వడ్డీకి అప్పులు తెచ్చే సాహసం చేయలేక చివరకు సొసైటీలను మూసేసే దుస్థితి దాపురించిందని నేతన్నలు అంటున్నారు. ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్. గద్దె నెక్కి 14 నెలలు దాటినా అమలు చేయకుండా సర్కారు దగా చేసింది. సాధారణ మగ్గాలపై ఉచిత విద్యుత్ను మరో 100 యూనిట్లకు పెంచుతున్నామని చెప్పారే తప్ప ఆచరణలో అమలుకునోచుకోలేదు. కానీ గత నెల7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా సెప్టెంబర్ నెలలో 100 యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లులు చేతిలో పెట్టి ఉచిత విద్యుత్ అమలుచేయకుండా కూటమి సర్కార్ మోసం చేస్తోందని నేతన్నలు విమర్శిస్తున్నారు. ఈ పథకం అమలుచేయకపోవడంతో ఏడాదిగా సుమారు రూ.4కోట్ల రాయితీ ఎగ్గొట్టేసిందని చేనేత ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ముడినూలు కొనుగోలు సమయంలో చేనేత కార్మికులు 5శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఈ కారణంగా చీరల ధరలు పెంచడంతో మార్కెట్లో విక్రయాలు మందగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమే 5శాతం జీఎస్టీ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా సర్కార్ నమ్మించి మోసగించిందని, జీఎస్టీ చెల్లించలేదంటున్నారు. ఇందుకు తోడు త్రిఫ్ట్ ఫండ్ మాటే వినిపించడం లేదంటున్నారు. సహకార సంఘాల్లో నేత కార్మికుల ఆదాయంలో 8శాతం మినహాయించి సొసైటీలో జమ చేస్తుంటారు. ఆ మొత్తానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వం త్రిఫ్ట్ఫండ్ జతచేసి మూడు నెలలకు ఒకసారి కార్మికుల ఖాతాలకు జమ చేస్తుంటుంది. ఈ త్రిఫ్ట్ ఫండ్ రూ.5 కోట్లు విడుదల చేశామని సంబంధిత మంత్రి సవిత ఆరు నెలల క్రితం ప్రకటించడమే తప్ప ఆ సొమ్ము ఎక్కడా తమ ఖాతాల్లో జమ కాలేదని సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఒక విడత నేతన్న నేస్తం రూ.24వేలు జమ అయ్యేదంటున్నారు. మూసివేత దిశగా సొసైటీలు ‘బాబు’ బకాయి రూ.7 కోట్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఊసే లేదు అమలు కాని ఉచిత విద్యుత్ హామీ బకాయిలు విడుదల చేయాలి బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీ మూతే వేసే పరిస్థితి. సొసైటీలు మనుగడ సాగించేందుకు 11 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ప్రొక్యూర్మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదు. – ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు, ఆదివారపుపేట, రామచంద్రపురం మండలం ఎన్నికల హామీలు అమలు చేయాలి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలి. సంఘాలకు ఎన్నికలు జరపాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7కోట్లు ఆప్కో ద్వారా సహకార సంఘాలకు బకాయిలను చెల్లించింది. – జాన జగదీష్ చంద్ర గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, కోనసీమ జిల్లా -
అనధికార క్వారీల్లో తనిఖీలు
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల సర్వే నెంబరు 15లో అనధికారికంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి చేపట్టిన ఈ తనిఖీలో రెండు చోట్ల అనధికార క్వారీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు క్వారీల్లో పనిచేస్తున్న రెండు జేసీబీలు, ఒక లారీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనధికారికంగా నల్లరాయి క్వారీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్రలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో పోలేకుర్రు పంచాయతీ సుంకటరేవులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగబత్తుల షడ్రక్కు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామానికి చెందిన షడ్రక్ ద్విచక్రవాహనంపై కాకినాడ వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో షడ్రక్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్వేజనా ఆరోగ్యమస్తు..
● జిల్లాలో ఎన్సీడీ 4.0 సర్వేకు చర్యలు ● ఆరోగ్య సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ● ముందస్తు గుర్తింపుతో సరైన వైద్యానికి అవకాశం రాయవరం: క్యాన్సర్.. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మారి. చాలా మందికి ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మృత్యువు సింహద్వారం వద్ద నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముుందుగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఏటా జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) ప్రోగ్రామ్ను చేపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధులను నాన్ కమ్యూనికల్ డిసీజెస్గా పిలుస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ, గుండె తదితర జబ్బులను ముందుగానే పసిగట్టడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎన్సీడీ 4.0 సర్వేకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. నాలుగేళ్ల నుంచి సర్వే: 2021 అక్టోబరులో తొలిసారిగా ఎన్సీడీ సర్వే చేపట్టింది. రెండో విడత 2022 అక్టోబర్ 2 నుంచి, మూడో విడత 2024 నవంబరులో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. మూడో విడత సర్వేలో.. గతేడాది జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 14,68,723 మందిలో 11,29,412(77శాతం) మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,06,666 మందికి బీపీ (18.30 శాతం), చక్కెర వ్యాధిగ్రస్థులు 1,41,508 (12.53 శాతం) మంది ఉన్నట్టు గుర్తించారు. నోటి సంబంధ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గతంలో 215 మంది ఉండగా ఈ సర్వేలో 4,172 అనుమానిత కేసులు గుర్తించారు. అలాగే గతంలో 466 మంది రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ సర్వేలో 2,090 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్యాన్సర్ నిర్థారణ అయ్యింది. సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్కు గురైన వారు గతంలోనే 283 మంది ఉండగా, 1,894 మంది అనుమానిత కేసులు గుర్తించారు. నాలుగో సర్వేకు ఏర్పాట్లు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్సీడీ నాలుగో సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నిర్వహించే సర్వేలో క్యాన్సర్పై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. నోటి సంబంధిత, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రధానంగా సర్వే ఉంటుంది. సర్వేలో 110 మంది వైద్యులు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 527 మంది మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఆగస్టు 25న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 18వ తేదీతో పూర్తికానుంది. పరీక్షలు ఇలా: వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల నిండిన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి వివరాలు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు నమోదు చేయడం ద్వారా క్యాన్సర్ దశను ప్రాథమిక అంచనా వేస్తారు. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆరోగ్యశ్రీ కింద ఇతర నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఇక బీపీ, షుగర్ తదితర వ్యాధులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెలుగు చూస్తున్న వ్యాధులు ఈ పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యల్లో బీపీ ముందు వరుసలో, తర్వాత స్థానంలో మధుమేహం ఉంటోంది. అనుమానిత జాబితాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము, నోటి క్యాన్సర్ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోకుంటే శరీరంలో ప్రధాన భాగాలైన కళ్లు, కిడ్నీ, గుండె, నరాలు తదితర భాగాలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం, పొగతాగడం, గుట్కాలు తదితర వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ను గుర్తించేందుకు నాలుగో విడత సర్వే ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. మూడో విడత సర్వే మాదిరిగానే నాల్గవ విడత సర్వేకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సుమలత, ఎన్సీడీ జిల్లా నోడల్ అధికారి, కోనసీమ జిల్లా ముందుగా గుర్తిస్తే నయం మారిన జీవనశైలి, ధూమ, మద్యపానాలు, పొగాకు సేవనంతో పాటుగా వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి నయం చేసే అవకాశం ఉంది. సర్వే చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.– డాక్టర్ దుర్గారావు దొర, డీఎంహెచ్ఓ, కోనసీమ జిల్లా -
క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు
● విద్యాశాఖ ఏఓ షరీఫ్ ● రాష్ట్ర స్థాయికి 106 మంది ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఏఓ షరీఫ్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురువారం పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 విభాగంలో క్రీడాకారుల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) కార్యదర్శి కనకాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏఓ షరీఫ్, గౌరవ అతిథులుగా రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, అర్బన్ ఎంఈఓ రవి హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను షరీఫ్, ఎస్జీఎఫ్ఐ జెండాను రవి ఆవిష్కరించారు. రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, చేయూత సంస్థ అధ్యక్షుడు రవి, హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్, మాజీ ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో అండర్ 14, 17 విభాగంలో ఆర్చరీ, ఘట్కా, సపక్ తక్రా క్రీడల్లో నిర్వహించిన ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 350 మంది హాజరయ్యారు. వీరి నుంచి రాష్ట్ర స్థాయికి 106 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ మాజీ కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సునీల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ ప్రతినిధి మాచరరావు, ఆర్చరీ కోచ్ లక్ష్మణ్, మాజీ పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, పట్టాభి, గిరి, గాంధీ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఎంపికలను పాఠశాల క్రీడా సమాఖ్య సంయుక్త కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
22 నుంచి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయదుర్గా పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 8.19 గంటలకు గురుహోరలో కలశస్థాపన జరుగుతుందన్నారు. పీఠంలోని కొలువైన విజయదుర్గా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారు దర్శనమిస్తారిలా.. ఈ నెల 22న బాలాత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న రజిత కవచ అలంకృత విజయదుర్గాదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న విజయదుర్గాదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్దని, 2న రాజరాజేశ్వరి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ పీఠాధిపతి గాడ్ సమక్షంలో అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబి తదితరులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పీఠాధిపతి గాడ్ తదితరులు -
మూతపడే దుస్థితికి చేనేత సంఘాలు
రామచంద్రపురం రూరల్: చేనేత సహకార సంఘాల నిధులన్నీ ఆప్కో బకాయిల రూపంలో స్తంభించిన కారణంగా సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితికి సంఘాలు చేరుకున్నాయని లివరీ ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హసన్బాద చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లివరీ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సత్య ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలలుగా బకాయిలు పేరుకు పోయాయన్నారు. బ్యాంకుల నుంచి మంజూరు కాబడిన నిధులు పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో సంఘాల బ్యాంకు ఖాతాలన్నీ ఎన్పీఏలోకి వెళుతున్నాయన్నారు. కొన్ని సంఘాలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆప్కోకు ఎన్నికలు నిర్వహించి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హసన్బాద, ఆదివారపుపేట, శివల, అద్దంపల్లి, నేలటూరు, ముమ్మిడివరం, తమ్మవరం, మురారి, నల్లూరు తదితర చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్నం పెట్టిన ఇంటికే ద్రోహం
● కాకినాడ చోరీ కేసులో పనిమనిషి అరెస్టు ● వివరాలు వెల్లడించిన సీఐ కాకినాడ క్రైం: కాకినాడలో జరిగిన చోరీ కేసులో పనిమనిషే దొంగ అని తేలింది. అన్నం పెట్టిన ఇంటికే ఆమె ద్రోహం చేసింది. సీఐ నాగ దుర్గారావు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ చెరువు జంక్షన్ సమీపంలోని కొమ్మిరెడ్డివారి వీధిలో నివాసముంటున్న బత్తుల కనకదుర్గ ఇంట్లో కొద్ది రోజులుగా వనమాడి జగదాంబ అనే మహిళ పనిచేస్తోంది. ఈ నెల 2వ తేదీన యజమాని ఇంటి నుంచి 277 గ్రాముల బంగారం, రూ.లక్ష దొంగిలించింది. ఈ విషయాన్ని గుర్తించిన కనకదుర్గ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులతో పాటు క్రైం సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా పనిమనిషి నిర్వాకం బయటపడింది. దీంతో జగదాంబను పోలీసులు గురువారం మధ్యాహ్నం జగన్నాథపురం మరిడమ్మపేటలోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఆమె నుంచి 183 గ్రాముల బంగారంతో పాటు రూ.లక్ష మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
పనితీరుతో ఉద్యోగులకు గుర్తింపు
● పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు ● ఈటీసీలో ఎంపీడీఓల శిక్షణ పరిశీలన సామర్లకోట: ఉద్యోగులు మంచి పనితీరుతో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరావు అన్నారు. సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రానికి (ఈటీసీ) గురువారం ఆయన విచ్చేశారు. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల్లోని ఎంపీడీఓలకు జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రతిచోటా ఎదురయ్యే సమస్యలను నైపుణ్యంతో సమర్థంగా అధిగమించాలన్నారు. అంతకు ముందు జరిగిన ఈటీసీ నిర్వహణ కమిటీ సమావేశానికి కమిషనర్ ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. ఈటీసీలో జరుగుతున్న శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కావాల్సిన అవసరాలపై ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. జీఎస్డబ్ల్యూ, వైద్యం, విద్య, ఇంజినీరింగ్ వంటి ఇతర శాఖల శిక్షణలు కూడా ఈటీసీలో జరిగేలా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం విస్తరణ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, డీడీఓలు శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు. -
అయోధ్యకు తరలిన విల్లు, బాణం
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలో నిర్మిస్తున్న కల్యాణ రాముని ఆలయానికి సమర్పించేందుకు దాత విల్లు, బాణం తయారీకి మండపేటలో ఆర్డర్ చేశారు. మండపేటలోని రామకృష్ణా బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ నిర్వాహకుడు, శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ గోల్డ్ కోటింగ్తో వీటిని రూపొందించారు. అయోధ్యకు చెందిన వంశవృక్షం అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ శాస్త్రి, గాయత్రి దంపతులు రూ.1.80 లక్షలతో తయారు చేయించారు. వాటిని గురువారం చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య నుంచి మండపేటకు వచ్చి తీసుకెళ్లారు. కళాకారుడు వాసా శ్రీనివాస్ నైపుణ్యాన్ని ఆయన ప్రసంశించారు. -
ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ అకాడమీలో గురువారం జిల్లా స్థాయిలో చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు ఉత్కంఠగా జరిగింది. ఈ జిల్లా చెస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి ర్యాపిడ్ విభాగంలో బండారు నానిబాబు ప్రథమ, ద్రాక్షారపు సాత్విక్ ద్వితీయ స్థానాలు, బ్లిట్జ్ విభాగంలో ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ, పనిశెట్టి సాయి అవినాష్ ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ మాట్లాడుతూ విజేతలు ఈ నెల 13 నుంచి నంద్యాలలో జరిగే రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఇద్దరి ఎంపిక రావులపాలెం: రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ అండర్–19 విభాగానికి డాన్ బాస్కో హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆర్.పవన్ కుమార్, ఎ.వినయ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జె.విద్యాసాగర్ గురువారం తెలిపారు. కర్నూలులో ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 10న జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర విభాగంలో జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపారన్నారు. జూదరులకు జరిమానా కిర్లంపూడి: పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వారిని గురువార ంప్రత్తిపాడు కోర్టుకు హాజరు పర్చామన్నారు. ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున జరిమానా విధించారన్నారు. మరోసారి పేకాట ఆడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కళకాలం నిలిచేలా..
● డైట్లో కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 మంది విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: ఎప్పుడూ పుస్తకాల్లోని పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో సత్తా చాటి శభాష్ అనిపించుకున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణసంస్థ (డైట్)లో గురువారం కళా ఉత్సవ్ 2025 పేరిట జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యం అంశాల్లో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు జరిగాయి. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 35 పాఠశాలల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. సృజనాత్మకతకు వేదిక ప్రారంభోత్సవంలో డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచి వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వతకు, మనో వికాసానికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. శుక్రవారం సోలో(2డి), సోలో(3డి), గ్రూపు (2డి/3డి), థియేటర్ ఆర్ట్స్, సంప్రదాయ కథనాలకు సంబంధించి గ్రూపు విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. బహుమతుల ప్రదానం తొలిరోజు జరిగిన పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్ ఆర్జేడి రాజు చేతులమీదుగా సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. వీరందరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా కేటీ సుబ్బరాయన్, ఎం.నాగేశ్వరరావు, డి. రవి కిరణ్ వ్యవహరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● గాత్రం వ్యక్తిగత విభాగంలో కె.షర్మిల, బృంద విభాగంలో ఎన్.సుమశ్రీ, ఆర్.భారతి, ఈ.నాగజ్యోతి, కె.శిరీష (అంబేడ్కర్ గురుకులం, ఏలేశ్వరం) ● వాయిద్యం వ్యక్తిగత విభాగానికి సంబంధించి స్ట్రింగ్లో టీవీకే దేవీ ప్రియాంక (భాష్యం స్కూల్, కాకినాడ), పెర్కషన్లో కె.కార్తికేయ హిమాన్షు (కలాం జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం). ● నృత్యం వ్యక్తిగత విభాగంలో సీహెచ్ హేమసత్య (చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాల), బృంద విభాగంలో సీహెచ్ త్రిలోచన, పి.జ్యోతి లహరి, జి.చరణ్ సాత్విక్, ఎం.పవన్ కుమార్ (గాంధీపురం మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం). -
ప్లీనరీ సెషన్లో ‘ఆదిత్య’ సతీష్ రెడ్డి
గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్మెంట్ కన్వెన్షన్లో నిర్వహించిన ప్లీనరీ సెషన్లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్మెంట్, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్ ఆట్రోలే (చీఫ్ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్ కుమార్ సింగ్ (డైరెక్టర్, స్ట్రాటజీ, ఎక్స్టర్నల్ రిలేషన్స్, జిందాల్ స్టీల్ లిమిటెడ్), సంజయ్ నారాయణ్ (చీఫ్ జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు. -
రసాయన రహిత ఉత్పత్తులు అందించాలి
అమలాపురం రూరల్: వినియోగ దారులకు రసాయన రహిత ఆహార ఉత్పత్తులను అందించాలని రైతులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్ అమలులో భాగంగా గురువారం కలెక్టరేట్లో సేంద్రియ వ్యవసాయం పద్ధతులపై వ్యవసాయ అనుబంధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారా మానవుని సగటు జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ రూపొందించబడిందన్నారు. డీఆర్డీఏ అధికారులు మరింత మంది డ్వాక్రా సంఘాలకు ప్రకృతి సేంద్రియ కషాయాల తయారీలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. దీనిలో భాగంగా ఈ నెల 20 నాటికి మండలాల వారీగా ప్రకృతి సేద్య విధానాల అమలుపై కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి సమర్పించాలన్నారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం శ్రీనివాసు, అదనపు డీపీఎం సత్యనారాయణలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 15 వరకు గాలికుంటు టీకాలు పశువులకు గాలికుంటు నివారణ టీకాలను ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ అందించాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలిసి ఆ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో టీకాలు వేస్తూ పశు వ్యాధులను నియంత్రించాలన్నారు. పశుసంపదను పెంచడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణకు పశు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. నాలుగు నెలల వయసు దాటిన పశువులకు తప్పని సరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని అధికారులకు ఆదేశించారు. -
సంస్కృతుల వారధి.. సమైక్య సారథి
● దేశంలో హిందీ భాషకు ఎంతో ప్రాధాన్యం ● జాతీయ భాషగా గుర్తింపు ● ఈ నెల 14న జాతీయ హిందీ దివస్ రాయవరం: భారతదేశం వివిధ సంస్కృతులు, విభిన్న భాషలు, నాగరికతలకు నెలవు. ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునేందుకు, మాట్లాడేందుకు భాష అవసరం. ప్రతి రాష్ట్రానికి ప్రాంతీయ భాష ఉంటుంది. దాదాపు 3,372 పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతుండగా, వాటిలో అధికారికంగా 24 భాషలను గుర్తించినప్పటికీ జాతీయ భాషగా హిందీని భావిస్తున్నాం. 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని జాతీయ అధికారిక భాషగా గుర్తించింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్గా జరుపుకొంటున్నారు. హిందీ నేపథ్యం పర్షియన్ పదం ’హింద్ ’ నుంచి హిందీ పుట్టుకొచ్చింది. ఇండస్ నది పారుతున్న నేలలో మాట్లాడే భాష అని దీని అర్థం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు భాషల్లో హిందీ ఒకటి. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉంది. భారత్తో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, న్యూజిలాండ్, యూఏఈ, ఉగాండా, గయానా, ట్రినిడాడ్, మారిషస్, దక్షిణాఫ్రికాల్లో హిందీని ఎక్కువగా మాట్లాడుతారు. విశిష్ట సేవలు అందిస్తున్న ప్రచారక్లు హిందీ భాషపై, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగింది. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో హిందీ ప్రచారక్లు ముందుకు వచ్చి హిందీ ప్రాథమిక స్థాయి పరీక్షల నుంచి ఉన్నత స్థాయి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులను తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఈ కోర్సులు పూర్తి చేసి, అనంతరం ప్రభుత్వ కొలువులు పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలను జనాభాపరంగా పరిశీలిస్తే ఇంగ్లిషు, చైనా భాషల తర్వాతి స్థానం హిందీదే. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ అడ్రస్లు రూపొందించడానికి ఉపయోగిస్తున్న ఏడు భాషల్లో హిందీ ఒకటి. హిందీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దా హిందీ భాష ద్వారా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. దీన్ని నేర్చుకున్న చాలామంది దేశ, విదేశాల్లో ఉపాధి పొందారు. వందల మంది హిందీ ప్రచార సభ ద్వారా శిక్షణ పొంది హిందీ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. – మహ్మద్ అబ్దుల్ హమీద్, విశ్రాంత టీచర్, కేంద్ర వ్యవస్థాపక్, హిందీ ప్రచార సభ, మలికిపురం. హిందీ భాషతో ఉపాధి చాలా మంది పది, ఇంటర్ తర్వాత హిందీ సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ చేస్తున్నారు. తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.హిందీ భాషకు సంబంధించి ప్రస్తుతం ట్యూషన్ సెంటర్లు ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ఎంతో మందితో పరీక్షలు రాయిస్తున్నాను. – పి.చిట్టి రుక్మిణి, విశ్రాత గ్రేడ్–1 హిందీ టీచర్, రామచంద్రపురం వారసత్వ సంపద హిందీ భాష భారతీయులందరికీ వారసత్వ సంపద లాంటిది. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి ఈ భాషకు ప్రాముఖ్యత ఉంది. ఈ భాషాభివృద్ధికి విద్యార్థి దశ నుంచే ప్రోత్సాహం అందించాలి. భాషపై ఏకాగ్రత ఉంచితే నేర్చుకోవడం చాలా సులభం. – మద్దింశెట్టి రాంబాబు, హిందీ టీచర్, పసలపూడి, రాయవరం మండలం -
పత్రికా స్వేచ్ఛను హరించడం అన్యాయం
పత్రికా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. పత్రికలు, ఎడిటర్లు, జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ద్వారా ఎంతో మంది తమ అభిప్రాయాలను ధైర్యంగా చెబుతారు. వార్తలు తప్పు అని భావిస్తే వాటిని ఖండించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా నిజం చెప్పినా, దానిని ప్రచురించినా కేసులు పెట్టే సంస్కృతి ఎక్కువైంది. ఇలాగే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం అత్యంత దుర్మార్గం.– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రిమీ తప్పిదాలపై వార్తలు రాస్తే కేసులా?కూటమి ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలపై వార్తలు రాస్తే పోలీసు కేసులు పెట్టి వేధిస్తారా?, ఇదెక్కడి దారుణం. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం విధానపరంగా కాకుండా కక్ష సాధింపు ధోరణిలోనే వెళుతోందని అనిపిస్తోంది. దీనిని కూటమి ప్రభుత్వం అనడం కన్నాకుట్ర, కుతంత్రాల ప్రభుత్వం అంటేనే బాగుంటుంది.– పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం -
చమురు సంస్థలపై చర్యలు తీసుకోని కూటమి
అమలాపురం టౌన్: ఏ రాష్ట్రంలో తమ అన్వేషణ, కార్యకలాపాలకు భూములను తవ్వుతారో ఆ ప్రాంతానికి చమురు సంస్థలు రాయల్టీ చెల్లించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు గుర్తు చేశారు. కానీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం చమురు సంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తోందన్నారు. ఈ మేరకు గురువారం అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. అంబానీ, ఆదానీలకు వ్యతిరేకంగా చమురు సంస్థలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. దీని వల్లే జిల్లాలో ఓఎన్జీసీ వ్యతిరేక పోరాట సమితి చేస్తున్న పోరాటాలను కొంతకాలంగా చమురు సంస్థలు పట్టించుకోవడం లేదన్నారు. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ, రిలయన్స్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (వేదాంత) తదితర చమురు సంస్థలు విచ్చలవిడిగా ఆయిల్ నిక్షేపాల కోసం తవ్వేయడం వల్ల ఈ ప్రాంత భూములు కుంగి పోతూ, నిస్సారమవుతున్నాయని గుర్తు చేశారు. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో జిల్లా ప్రజాప్రతినిధులు.. ఓఎన్జీసీ అధికారులపై ధ్వజమెత్తడం, మీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పడం స్వాగతించే విషయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అటు ప్రభుత్వం, ఇటు చమురు సంస్థలు ముందుకు రావడం లేదన్నారు. ఎంపీ మిథున్రెడ్డికి స్వాగతం సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్పై తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చిన ఎంపీ మిథున్రెడ్డికి కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు స్వాగతం పలికారు. వారిలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి జి.శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం ఎంపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కాలేజీల పేరిట కూటమి దందా అల్లవరం: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం దందాకు పాల్పడుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, వాటిలో కొన్నింటిని నిర్మాణం చేశారన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. తమ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే సంపదను సృష్టించే పనిలో ఉందన్నారు. చంద్రబాబు అండ్ కో ప్రభుత్వ భూములను విచ్చిన్నం చేసి ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ఖజానాలో డబ్బు లేదని మెడికల్ కాలేజీలను నిర్వహించలేమని డ్రామాలాడుతున్న చంద్రబాబు.. తన బినామీలకు ఒక్కో మెడికల్ కాలేజీని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 14 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిన ఆయన.. మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు. ఇది ముమ్మాటికి పేద వైద్య విద్యార్థులను మోసం చేయడమేనన్నారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మూడు సార్లు పరిపాలించిన చంద్రబాబు తన పాలనతో ఒక్కటైనా మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. వినాయకునికి వెండి పళ్లెం సమర్పణఅయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి విశాఖపట్నం తగరపు వలసకు చెందిన కటకం అవినాష్, సాహిత్య శృతి దంపతులు గురువారం వెండి పళ్లెం సమర్పించారు. 1050 గ్రాములు బరువైన ఈ పళ్లెం విలువ రూ.1,35,000 ఉంటుంది. దాతలు దీన్ని ఆలయ అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తికి అందజేశారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు, వేద పండితులు సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● అధికారులకు నేడు వినతులు అందిస్తాం ● ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు అమలాపురం టౌన్: ఎన్నికల సమయంలో తమకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శుక్రవారం కలెక్టర్, మండలాల తహసీల్దార్లకు ఆటో యూనియన్ల సభ్యులు వినతి పత్రాలు అందించాలని ఆంధ్ర ఆటోవాలా యూనియన్ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు పిలుపునిచ్చారు. అమలాపురంలోని ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పినట్టు ఆటో డైవర్లకు ఏటా రూ.15 వేలు చొప్పున.. రెండేళ్లకుగాను వాహన మిత్ర పథకం కింద రూ.30 వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు దాటిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా పింఛన్ అందించాలని, ఆటోలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆటో వాలా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, కోశాధికారి మోకా శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి వంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి తదితరులు పాల్గొన్నారు. ఆటోల బంద్ తాత్కాలికంగా వాయిదా కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించిన కారణంగా జిల్లాలో శుక్ర, శనివారాల్లో తలపెట్టిన ఆటోల బంద్, సామూహిక నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సత్తిరాజు ప్రకటించారు. జిల్లాలోని ఆటో డ్రైవర్లు వాయిదా విషయాన్ని గమనించాలన్నారు. -
కౌంట్డౌన్
సాక్షి, అమలాపురం: ఆక్వా రైతులను వరస కష్టాలు వెంటాడుతున్నాయి. మొదటి పంటకు సుంకాల వాత, రెండో పంటపై వైరస్ దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వనామీకి అమెరికా, యూరప్ దేశాల నుంచి క్రిస్మస్ ఆర్డర్లు మొదలయ్యాయి. అమెరికా సుంకాల భారం పడుతున్నా డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లో వనామీ రొయ్యల ధరలు కొంత వరకు పర్వాలేదు. అయితే వైరస్ల వల్ల తక్కువ సైజులో రొయ్యలు చనిపోతుండడంతో ఆక్వా రైతులు పెరిగిన మార్కెట్ను అందుకోలేకపోతున్నారు.ధరల పతనంఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన ప్రతిసారి ఏదో ఒక ఉపద్రవం రావడం, ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ వైరస్ కాటుతో వనామీకి భారీ నష్టాలు వస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 77 వేల ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతోంది. దీనిలో కాకినాడ జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 15 వేల ఎకరాలు చొప్పున సాగవుతున్నాయి.సంక్షోభంఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశాజనకంగా ఉన్న వనామీ సాగు ఆ తర్వాత తీవ్ర సంక్షోభంలో పడింది. మార్చిలో స్థానిక ఎగుమతిదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేశారు. దేశీయ ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకాల విధించడంతో వనామీ రొయ్యల ధరలు కౌంట్కు వచ్చి కేజీకి రూ.40 నుంచి రూ.60 ధరలు తగ్గించడంతో ఆక్వా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాలోని వినియోగదారులపై పడాల్సిన భారాన్ని ఎగుమతిదారులు ఇక్కడ రైతులపై మోపారు. ఆ తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్కు రూ.15 మాత్రమే ధర పెంచడం విశేషం. రెండోసారి సుంకాల విధింపు ప్రకటన వచ్చిన తర్వాత మరోసారి ధరలు పతనమయ్యాయి.కాపాడిన క్రిస్మస్అమెరికాతో పాటు యూరప్ దేశాలలో ఈ నెలాఖరు నుంచి క్రిస్మస్ సందడి మొదలు కానుంది. ఇందుకు ఆయా దేశాల నుంచి ఆర్డర్లు రావడంతో ధరలు కొంత వరకు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యల) ధర రూ.405 వరకు ఉంది. 40 కౌంట్ రూ.350, 45 కౌంట్ రూ.340, 50 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.290, 80 కౌంట్ 265, 90 కౌంట్ రూ.245, 100 కౌంట్ రూ.235 చొప్పున ఉంది.ధర పెరగక..అమెరికా రెండోసారి సుంకాలను 50 శాతానికి పెంచడంతో 50 కౌంట్ నుంచి 30 కౌంట్ వరకు ధరలు భారీగా తగ్గుతాయని రైతులు, ఎగుమతిదారులు భయపడ్డారు. అయితే క్రిస్మస్ ఎగుమతులు కారణంగా ధరలు కొంత వరకు నిలబడ్డాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు ఈ సీజన్లో ఎగుమతి అయ్యే రొయ్యల కన్నా ఇప్పుడు ఎగుమతి అయ్యే రొయ్యలు తక్కువగా ఉన్నా ఆ లోటును యూరప్ దేశాలు భర్తీ చేస్తున్నాయి. దీని వల్ల ధర నిలకడగా ఉంది. అయితే 100 కౌంట్ స్థానిక రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన మేత, రొయ్య పిల్లలు, విద్యుత్ భారం వల్ల 100 కౌంట్ ఉత్పత్తికి రూ.240 వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. దేశీయంగా ఈ కౌంట్కు మంచి డిమాండ్ ఉన్నా ధర పెరగక పోవడం వెనుక ఎగుమతి దారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.రెండో పంటకు వైరస్ఒక వైపు ధరలతో సతమతమవుతున్న రైతులను వనామీ రొయ్యలకు వస్తున్న వైరస్లు ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రధానంగా వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్పీలు అధికంగా సోకుతున్నాయి. వీటి దాడులతో వనామీ విలవిలాడుతోంది. చాలా చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో రొయ్య పిల్లలు వదిలిన 30 నుంచి 60 రోజుల వ్యవధిలో ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆ సమయానికి రొయ్య పిల్ల బరువు మూడు గ్రాముల నుంచి పది గ్రాముల లోపు ఉంటోంది. రొయ్యల కౌంట్ 100 నుంచి 140 కౌంట్ మధ్యలో వైరస్ సోకి చనిపోతున్నాయని, దీని వల్ల అధికంగా నష్టపోతున్నామని అమలాపురం మండలం సమనసకు చెందిన దొరబాబు ‘సాక్షి’ వద్ద వాపోయారు.రొయ్యల పెరుగుదలలో వ్యత్సాసంఈహెచ్పీ అధిక నష్టాలను మిగులుస్తోంది. ఈ వైరస్ వల్ల రొయ్యల పెరుగుదలలో వ్యత్యాసం అధికంగా ఉంటోంది. ఒకే చెరువులో రొయ్యల పట్టుబడులు చేస్తుంటే కొన్ని 100, మరికొన్ని 120, 150 కౌంట్ వస్తున్నాయి. దీని వల్ల నష్టం తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో రైతులు జూలై నుంచి రెండో పంట మొదలు పెట్టారు. ఈ సమయంలో పంట మొదలు పెట్టిన 40 శాతం చెరువులు వైరస్ బారిన పడ్డాయని అంచనా. ఇదే వనామీ రైతులను కుంగదీస్తోంది. కొన్ని హేచరీల నుంచి వైరస్ సోకిన రొయ్య పిల్లలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.. -
టీడీపీ, జనసేన నాయకుల వాగ్వాదం
అయినవిల్లి: తొత్తరమూడిలోని షాపు నంబర్ 28లో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సభకు స్థానిక సర్పంచ్ వార జయసావిత్రి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. వేదికపైకి టీడీపీ నాయకులను పిలిచి, జనసేనకు చెందిన వైఎస్ ఎంపీపీ అడపా నాగభూషణాన్ని పిలవలేదు. దీంతో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసువచ్చారు. కాగా. ఈ సభను ముక్తేశ్వరం – శానపల్లిలంక రహదారి చెంతన నిర్వహించారు. రహదారి పైనే సభ నిర్వాహకులు కుర్చీలు వేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సభకు ఎమ్మెల్యే రెండు గంటలు ఆలస్యంగా రావడంతో లబ్ధిదారులు, అధికారులు అవస్థలు పడ్డారు. -
లక్ష్మీనరసింహస్వామికి రూ.35,62 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ.35,62,444 ఆదాయం సమకూరింది. ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 11 వరకూ 83 రోజులకు గాను ఈ మొత్తం సమకూరింది. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,07,678, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.14,679, అన్నదానం హుండీల ద్వారా రూ.40,087 లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అలాగే 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి లభించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్ బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
పనులకు కదలిక
● వీరేశ్వరస్వామి ఆలయం పరిశీలన ● పునర్నిర్మాణానికి సూచనలుఐ.పోలవరం: వర్షం వస్తే నీటి వెతలు.. ఆపై మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కానరాని చర్యలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రూ.నాలుగు కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినా పనులు ప్రారంభించకపోవడం, ఆపై వర్షం వస్తే ఆలయంలో ముంపు సమస్యలపై ‘స్వామీ.. నీ చెంత నీరేమీ’ అనే శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ స్థపతి, అసిస్టెంట్ స్థపతి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలసి బుధవారం ఆలయాన్ని పరిశీలించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, గాలి గోపురం, చండీశ్వరస్వామి, నవగ్రహ మండపాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి చేసిన ప్లాన్ను వారు పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. -
ఏమైందో ఏమో!
● పెద్దేవంలో గేదెల మృత్యువాత ● 15 రోజుల్లో 25 మరణించిన వైనం ● ఆందోళనలో పాడి రైతులుతాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో పాడి పశువులు (గేదెలు) వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో సుమారు 25 వరకూ గేదెలు మరణించాయి. ఆకస్మాత్తుగా నీరసపడి, రెండు రోజులకే అవి మేత మేయక చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సాయిబాబా, ఇతర ఆలయాల సమీపంలో సుగంది చెరువు ఉంది. దీని నీటిని పశువులు తాగుతాయి. అయితే చెరువు నీరు కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్లే చనిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో తాగునీటికి ఉపయోగించిన ఈ చెరువు నేడు గుర్రపు డెక్క పేరుకుపోయి అధ్వానంగా మారింది. దానిలో మలమూత్ర విసర్జనలు, మృత కళేబరాలను వేస్తున్నారు. కాగా.. తమ గ్రామంలో పశువులు ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదని రైతులు జమ్ముల శ్రీను, బెల్లంకొండ సోమన్న, యాండపల్లి లక్ష్మణరావు, నామన సుబ్బారావు తదితరులు ఆందోళన చెందుతున్నారు. నమూనాల సేకరణ పశుసంవర్ధకశాఖ మండల అధికారి బాలాజీ బుధవారం పెద్దేవంలో పర్యటించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు వచ్చిన రోగ లక్షణాలు కొత్తగా ఉన్నాయని, కిడ్నీ, లివర్ దెబ్బతింటున్నాయన్నారు. తీసుకునే ఆహారం కానీ, తాగే నీరు కానీ కలుషితమై ఉండచ్చన్నారు. గడ్డి, నీరు, రక్త నమూనాలను పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చాక విషయం తెలుస్తుందన్నారు. -
మీడియాపై అక్రమ కేసులు సరికాదు
మీడియాపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. ‘సాక్షి’ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేసి ఎడిటర్, రిపోర్టర్లపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాసిన కథనాల్లో పొరపాట్లు ఉంటే వివరణ ఇవ్వాలని న్యాయపరంగా వెళ్లాలి. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – మండెల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే, తూర్పుగోదావరి ● -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ● కాకినాడలో స్థాయీ సంఘ సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడసిటీ): క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు చైర్మన్ వేణుగోపాలరావు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి. వీటికి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు చేశాయి. తొలుత రామచంద్రపురం మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు ఆగస్టులో మృతి చెందిన నేపథ్యంలో సభలో మౌనం పాటించారు. ● అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ పోశయ్యలతో కలిసి గౌరవ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్లకు కాలువల ద్వారా నీరు సక్రమంగా పంట పొలాలకు అందేలా చూడడంతో పాటు అకాల వర్షాల వల్ల పొలాలు ముంపునకు గురి కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని గౌరవ సభ్యులు అధికారులను కోరారు. ● వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్య అధికారులు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు. ● రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అధికారులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారని, ఈ అంశంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ● అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉండేలా శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. -
నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) నిర్వహణ కమిటీ సమావేశం పంచాయతీరాజ్ కమిషనర్ రేవు ముత్యాలరావు అధ్యక్షతన గురువారం జరుగుతుందని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సీఈఓలు, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 కొత్త జిల్లాల్లోని డీపీఓలు, ఎన్ఐఆర్డీ రాష్ట్ర సమన్వయకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి ఈటీసీ ప్రిన్సిపాల్ కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణలు, అభివృద్ధి పనులను సమీక్షించడం, వార్షిక శిక్షణ ప్రణాళికను ఆమోదించడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారన్నారు. 13న కాకినాడ జిల్లా కబడ్డీ జట్ల ఎంపికసామర్లకోట: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కాకినాడ జిల్లా జట్లను ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కళాశాల ఇండోర్ కబడ్డీ కోర్టులో జూనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. దీనికి హాజరయ్యే క్రీడాకారులు 2006 డిసెంబర్ 31 తర్వాత పుట్టిన వారై ఉండి, బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై నవారు ఈ నెల 22 నుంచి 25 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితాతో రావాలని కోరారు. తాటాకిల్లు దగ్ధంకొత్తపల్లి: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి తాటాకిల్లు దగ్ధమైన సంఘటన కొండెవరంలో జరిగింది. బాధితుడు పెంకే సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తిబాబు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో వారందరూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో తాటాకిల్లు, దానిలోని గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పిఠాపురం ఇన్చార్జి అగ్నిమాపక అధికారి పి.హరిప్రసాద్, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పేకాట శిబిరంపై దాడిబిక్కవోలు: పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశామని అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపారు. కొమరిపాలెంలోని ఒక చావిడిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో బుధవారం తెల్లవారుజామున బిక్కవోలు ఎస్సై రవిచంద్ర, సిబ్బందితో దాడి చేశామన్నారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురితో పాటు, చావిడి యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, రూ.34,790 స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. హోటల్లో తనిఖీలుగండేపల్లి: జిల్లా గూడ్స్, సర్వీస్ టాక్స్ జిల్లా ఇంటిలిజెన్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక హోటల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మల్లేపల్లి శివారు రాయుడు గారి మిలటరీ హోటల్లో (ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్) అధికారులు సుమారు ఉదయం 11.45 నుంచి తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలకు వచ్చిన అధికారులే స్వ యంగా వినియోగదారుల నుంచి బిల్లులు తీసుకున్నా రు. తనిఖీ జరుగుతున్నంతసేపు మీడియాను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు తనిఖీ చేసిన అధికారు లు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత గోప్యత ప్రదర్శించి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కాగా వారంతా జీఎస్టీ వివరాలు తని ఖీ చేసేందుకు వచ్చినట్టు స్థానికంగా భావిస్తున్నారు. -
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు ప్రణాళిక
అమలాపురం రూరల్: చమురు సంస్థల సీఎస్ఆర్ నిధులతో తీర ప్రాంతంలో మత్స్య సంపద అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం రాజమహేంద్రవరం ఓఎన్జీసీ క్షేత్రస్థాయి ఇంజినీర్ కేవీకే రాజు, గ్రీన్ యూనిట్ ఎన్జీఓ దుర్గేష్ గుప్తాలు, స్థానిక అధికారులతో కలసి చెయ్యేరులో తాగునీటి చెరువు అభివృద్ధి పనులు, కూనవరం సముద్ర మొగ పూడికతో డ్రైన్ల మురుగునీరు సముద్రంలో కలవక తరచూ పంటలు ముంపు బారిన పడడం, సముద్ర తీర ప్రాంత రక్షణకు మడ అడవుల అభివృద్ధి, మత్స్య సంపద అభివృద్ధి, తీర ప్రాంతం వెంబడి పర్యావరణ హితంగా గ్రీన్బెల్ట్ ఏర్పాటు వంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అమలాపురం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ిసీఎస్ఆర్ నిధుల ద్వారా తీర ప్రాంత ప్రజలకు జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు. తీర ప్రాంత రక్షణలో భాగంగా కందికుప్ప, వాసాలతిప్ప ప్రాంతాల్లో మడ అడవుల అభివృద్ధికి చేపడుతున్న కార్యాచరణ పనులతో తదుపరి సమీక్షకు హాజరు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. కూనవరం మొగ నుంచి మురుగు పోయేలా ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలన్నారు. డీఆర్వో కొత్త మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్రావు, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అధికారి శ్రీహర్ష, ఆర్డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
ట్యాబ్.. స్విచ్చాఫ్
● బోధనకు కూటమి మంగళం ● గత ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ ● పట్టించుకోని ప్రస్తుత పాలకులుపునరుద్ధరించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్యాబ్ విద్యాబోధనను కొనసాగించాలి. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ప్రస్తుతం అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇచ్చిందన్న కారణంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఈ విధానం సరైంది కాదు. ట్యాబ్ విద్యాబోధనను వెంటనే పునరుద్ధరించాలి. – నేరేడుమిల్లి నరేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కొత్తపేట మండల అధ్యక్షుడు, గంటి నెరవేరని లక్ష్యం గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. దేశంలో మరెక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వాటిని సాంకేతికతతో రూపొందించారు. 2023–24లో ట్యాబ్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. అయితే వారి వద్ద ఉన్న ట్యాబ్లు పనిచేయక గత ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది. – కేపీసీహెచ్ సూర్యారావు, యూటీఎఫ్ కొత్తపేట మండల అధ్యక్షుడు కొత్తపేట: ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. దానిలో భాగంగానే ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యావ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ముఖ్యంగా సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా పథకాలు అమలు చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వాటి ద్వారా విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాబ్లతో విద్యాబోధనకు మంగళం పాడింది. జగన్ ముద్ర కనిపించకుండా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను గమనిస్తే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి, వాటి ముద్ర కనిపించకుండా చేసే లక్ష్యంతోనే పరిపాలన సాగిస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజన పథకాలను కొనసాగించి, హుందాగా వ్యవహరించడానికి బదులు రాజకీయాలకు పాల్పడుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళుతోందన్నారు. పేద విద్యార్థులపై చిన్నచూపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022–23 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ ప్రారంభించింది. రెండేళ్ల పాటు అందజేసింది. ఉపాధ్యాయులు ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో పాఠ్యాంశాలు బోధించేవారు. వాటితో విద్యార్థులు చక్కగా చదువుకునేవారు. ట్యాబ్ల వినియోగం కోసం పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం, బైజూస్ ఒప్పందం ముగియడం, మళ్లీ రెన్యువల్ చేసుకోకపోవడం ద్వారా ట్యాబ్ విద్యాబోధనను నిర్వీర్యం చేసింది. ఫలితంగా అవి మూలనపడ్డాయి. ఒక్కో ట్యాబ్కు రూ.32 వేల ఖర్చు గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందజేశారు. వాటిలో బైజూస్ కంటెంట్తో కూడిన వీడియోలు పొందుపరిచారు. ఇవి పదో తరగతి వరకూ ఉపయోగపడేలా రూపొందించారు. దీని కోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.32 వేలు ఖర్చు చేశారు. 2023–24లో ట్యాబ్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.కోనసీమ జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,266 ప్రాథమికోన్నత పాఠశాలలు 45 ఉన్నత పాఠశాలలు 252 మొత్తం పాఠశాలలు 1,563 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 89,672 రెండేళ్లలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు 30,379 ట్యాబ్లకు ఖర్చు చేసిన మొత్తం రూ.97.21 కోట్లు -
పెన్షనర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాయి వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణం ఏవీఆర్ నగర్లోని జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పే కమిషన్ నియమించి, 30 శాతం ఇంటిరీయం రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పే రివిజన్ ఎరియర్లు చెల్లించకపోవడంతో రూ.లక్షల ఎరియర్లు అందకుండానే చాలా మంది పెన్షనర్లు కాలం చేస్తున్నారన్నారు. సీనియర్ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ తగ్గింపు దారుణమని అన్నారు. పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీఎస్ఎస్సీహెచ్ కృష్ణమూర్తి పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జిల్లా కార్యదర్శి కేకేవీ నాయుడు సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం పాలెపు మాణిక్యాంబ జ్ఞాపకార్థం ఆమె సోదరులు పాలెపు సత్యనారాయణ, వెంకటరమణ సౌజన్యంతో 80 ఏళ్లు పైబడిన ఎనిమిది మంది సీనియన్ ఉపాధ్యాయ పెన్షనర్లను సత్కరించారు. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఈ ఎనిమిది మందిని సత్కరించడమే కాకుండా అందుకు శాశ్వత నిధి సమకూర్చుతామని పాలెపు సోదరులు ప్రకటించారు. ివిశ్రాంత ఉపాధ్యాయులు ఐవీ శ్రీనివాసరావు, కట్టా రామకృష్ణ, కె.సత్యనారాయణాచార్యులు, గుర్లింక సత్యనారాయణ, వై.పాండురంగారావు, జి.భీమరాజు, ఎస్.జగన్మోహనరావు, డీఎల్ఎన్ సోమయాజుల దంపతులను సత్కరించారు. సమావేశంలో పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు మండలీక ఆదినారాయణ, కలిగినీడి ఉదయ భాస్కర్, శిష్టా శ్రీహరి, మెహబూబ్ సహీరా తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా రమాదేవి
కొత్తపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా కొత్తపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పీడీ ఏఎస్ఎస్ రమాదేవి నియమితులయ్యారు. గత నెల 26న అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు నిర్వహించిన ఇంటర్వ్యూకు రమాదేవి హాజరు కాగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ప్రొసీడింగ్స్ పంపారు. ఆ మేరకు 2025–26 విద్యా సంవత్సరం ఎస్జీఎఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. రమాదేవిని ఎంఈఓలు మట్టపర్తి హరిప్రసాద్, కె.లీలావతి, జెడ్పీజీహెచ్ఎస్ హెచ్ఎం ఎన్.సత్యనారాయణ, పీడీలు, పీఈటీలు అభినందించారు. శనైశ్చరుని ఆలయంలో హుండీల ఆదాయం లెక్కింపు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ 10,06,005 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి, సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ అమలాపురం, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓ సురేష్బాబు ఆధ్వర్యంలో బుధవారం హుండీలను తెరిచారు. వారి సమక్షంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు నగదును లెక్కించారు. 8 నెలల 11 రోజులకు హుండీ ద్వారా రూ.8,80,131, అన్నప్రసాద ట్రస్ట్కు రూ.85,357, దేవస్థానం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.40,517 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. మందపల్లి ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు సాదు చెంచయ్య, గ్రామ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, కొత్తపేట వీఆర్వో యు.సీతాసుభాషిణి తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి మలికిపురం: వైద్య కళాశాలలు ప్రైవేట్పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షు డు బూశి జాన్మోషే డిమాండ్ చేశారు. బు ధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైద్య విద్యను దూరం చేయడానికి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో బహుజన విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన పీపీపీ విధానం ఆయన సామాజిక వర్గానికి ప్రయోజనంగా ఉందే తప్ప, దీనివల్ల బహుజనులకు ప్రయోజనం లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరిధిలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మెడికల్ సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తుంటారని, తను క్యాబినెట్లో ఉన్న మంత్రి నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నవారికి మెడికల్ కళాశాలను ధారాద త్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు. క్రీడా పోటీలకు ఎంపికలు అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాల బాలికలకు ఈ నెల 12, 19 తేదీల్లో క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. 12న ఫెన్సింగ్ ఎంపికలు సఖినేటిపల్లి మండలం మోరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 19న మాల్కంబ్ క్రీడలో ఎంపికలు మలికిపురం మండలం గుడిమెళ్లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు ఎస్జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు– 93469 20718, ఎన్ఎస్ రమాదేవి – 94400 34084 ఫోన్ నంబర్లలో సంప్రందించాలని అన్నారు. -
ప్రభుత్వం మెడలు వంచుదాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి రావులపాలెం: హామీలు అమలు చేయకుండా, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచి పథకాలు సాధిద్దామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గంలో సుమారు 1,355 ఇళ్లకు తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పీడీఎఫ్ అప్లోడ్ చేసినందుకు ఆ నియోజకవర్గం రాష్ట్రంలో 4వ ర్యాంకు, జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాజోలు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావును, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల పార్టీ పరిశీలకునిగా నియమితులైన కర్రి పాపారాయుడును జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి బుధవారం రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించారు. -
కక్ష సాధింపు చర్యలు దారుణం
‘సాక్షి’ ఎడిటర్పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ పత్రికా ప్రధాన కార్యాలయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు కల్పించలేదనే విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో పోలీసులు ఆ కార్యాలయంలో అర్ధరాత్రి హడావుడి చేయడం తగదు. తగిన ఆధారాలు, వాస్తవాలు ఉంటే కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరసగా కేసులు నమోదు చేసి వేధించడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్టే. – ఎమ్మెన్వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అమలాపురం ● -
చదువుల సరస్వతి.. దుర్గాదేవి
హోమియోపతి వైద్య విద్యలో ట్రిపుల్ ధమాకా రాయవరం: హోమియోపతి వైద్య విద్యలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన గుంటూరి దుర్గాదేవి ప్రతిభ కనబర్చింది. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్) పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో దుర్గాదేవి బీహెచ్ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. బీహెచ్ఎంఎస్ కోర్సు పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో మూడు అవార్డులు కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఫస్టియర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకూ ప్రథమ స్థానంలో నిలిచినందుకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్కూడెంట్ అవార్డుగా న్యాపతి వెంకట శ్రీనివాసరావు బంగారు పతకాన్ని పొందారు. ఫస్టియర్ నుంచి ఫైనలియర్ వరకూ అధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ సూరపనేని చంద్రమౌళి ఎండోమెంట్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ఫస్ట్ ఎటెంప్ట్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించినందుకు దివంగత డాక్టర్ ఎం.గురురాజు సిల్వర్ మెడల్ను సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. నా తల్లి బాలనాగకోటేశ్వరి ఇచ్చిన ధైర్యం, పట్టుదలతో ముందడుగు వేశాను. తండ్రి కృష్ణ చిన్న హోటల్ వ్యాపారం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహం, గురువులు చూపిన మార్గదర్శకత్వంతోనే ఈ విజయాలు సాధించాను. ప్రస్తుతం జయసూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీ) కోర్సు చేస్తున్నాను. నా భర్త కొప్పినీటి మణిబాబు స్ఫూర్తితో పీజీ కోర్సును అభ్యసిస్తున్నాను. –గుంటూరి దుర్గాదేవి, బీహెచ్ఎంఎస్ (ఎండీ హోమియో), సోమేశ్వరం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
అశ్వత్థానికి అగచాట్లు!
అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అనాలోచిత చర్యలు ఆలయ ఆవరణలోని త్రిమూర్తి స్వరూపమైన భారీ అశ్వత్థ వృక్షానికి (రావిచెట్టు) చేటు చేస్తున్నాయి. ఆలయ ఆవరణలో సుమారు 50 ఏళ్లు పైబడిన ఉన్న ఆ వృక్షం చుట్టూ భక్తులు అవునేతితో దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు. నిత్యం తెల్లవారు ఝాము నుంచి సాయంత్రం వరకు సాధారణ రోజుల్లో ఐదు వేల నుంచీ పర్వదినాల్లో 25 వేలకు పైబడి దీపాలు ఆ వృక్షం చుట్టూ వెలిగిస్తుంటారు. దీంతో సాధారణంగానే ఆ చెట్టు మాను తీవ్రంగా వేడెక్కిపోతుంది. ఈ నేపథ్యంలో దీపాలను ఆ వృక్షానికి ఇబ్బంది లేనంత దూరంలో వెలిగించుకునే ఏర్పాట్లను అధికారులు చేయాల్సి ఉంది. గతంలో మాను చుట్టూ రేకు ఏర్పాటు గతంలో దీపాల సెగ వృక్షం మానుకు తగలకుండా చుట్టూ రేకు అమర్చేవారు. అలాగే మాను మొదట్లో నీరు పోసి తడిపే వారు. ఇప్పుడు ఆ చర్యలేమీ లేవు. ఇప్పటికై నా ఆ చర్యలను పునరావృతం చేసి మానుకు వేడి తగలకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే దీపాలు కొండెక్కాక వాటిని అక్కడి నుంచి తొలగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. -
‘నిర్కా’కు సీఎస్ఆర్ ప్రాజెక్టు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని ఐకార్ – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా)కు న్యూఢిల్లీకి చెందిన ఎం/ఎస్ ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి మొదటి సీఎస్ఆర్ ప్రాజెక్టు లభించింది. ఈ విషయాన్ని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మా గంటి శేషుమాధవ్ బుధవారం ప్రకటనలో తెలి పారు. ఈ ప్రాజెక్టును తాను, క్రాప్ మేనేజ్మెంట్ డివిజన్ హెడ్ డాక్టర్ కొరడ రాజశేఖరరావు, బహుశాఖ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ముందుకు తీసుకువెళతామన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద ఉన్న ఐకార్–నిర్కా ప్రాంతీయ కేంద్రంలోని పది ఎకరాల పొలంలో సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 500 మంది రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. సెన్సార్లు, డ్రోన్లు రెండు మార్గాల సమాచార వ్యవస్థల ద్వారా పంట, పురుగుల వాతావరణాన్ని పర్యవేక్షించి రైతులకు తక్షణ సలహాలు అందించడం లక్ష్యమన్నారు. దీని ఫలితంగా నీటి వినియోగం 40–50 శాతం తగ్గడం, ఎనర్జీ వ్యయం 30–40 శాతం తగ్గడం, ఎరువుల సామర్థ్యం పెరగడం, ఉత్పాదకత మెరుగుపడడం, డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన పెరుగుతుందన్నారు. -
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
కాకినాడ లీగల్: న్యాయవాదులు వృత్తిలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. కోర్టు ఆవరణలో రూ.3 లక్షలతో నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వాటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రికెట్ నెట్ ద్వారా న్యాయవాదులు తమ క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ బౌలింగ్ చేయగా, జడ్జి ఆనంది బ్యాటింగ్ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, చెక్కపల్లి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్, తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సరకులే సరఫరా చేయాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నాణ్యమైన బియ్యం, పప్పులు, ఇతర దినుసులను సరఫరా చేయాలని టెండర్ దారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ సూచించారు. ఇటీవల దేవస్థానానికి బియ్యం, పప్పులు, ఇతర దినుసులు సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయగా సుమారు పది మంది టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లు తెరవడానికి ముందు దేవస్థానంలో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ మాట్లాడుతూ సరఫరాదారులు పంపించిన సరకుల్లో నాణ్యమైనవని తమ పరీక్షల్లో తేలితేనే, వాటిని దేవస్థానంలో ఉపయోగించేందుకు అనుమతిస్తామన్నారు. లేకపోతే వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.కేశవ్ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి బ్రేక్.. స్థానికులకు షాక్..
● రాజోలు దీవిలో వంద ఆయిల్, గ్యాస్ బావులు ● ఉత్పత్తులను తరలిస్తున్న ఆయిల్ కంపెనీలు ● స్థానికులకు ప్రాధాన్యం కరువు ● బయటి వారికే పెద్దపీట ● యువతకు కొరవడిన ఉపాధి మలికిపురం: రాజోలు దీవి నుంచి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలను తరలించుకు పోతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగం తాండవం చేస్తోందన్నారు. నిక్షేపాలు అధికంగా ఉన్న చోట అభివృద్ధిని సాధించాల్సింది పోయి, యువత ఉపాధి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని సుమారు 100 బావుల ద్వారా ప్రతి రోజూ 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, అదే స్థాయిలో చమురు నిక్షేపాలను ఓఎన్జీసీ, గెయిల్ తరలించుకుపోతున్నాయి. కానీ ఈ సంస్థలు ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి చూపడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇక్కడి వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పరిశ్రమలకు దక్కని ప్రాధాన్యం రాజోలు దీవిలో గతంలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో తూర్పుపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, అలాగే తూర్పుపాలెంతో పాటు కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వాటికి లోప్రెజర్ గ్యాస్ను తక్కువగా అందించేవారు. భవిష్యత్తులో గ్యాస్ మరింత అందిస్తారని, రాయితీ కూడా వస్తుందని నిర్వాహకులు ఆశించారు. అయితే రానురాను పరిస్థితి దిగజారింది. గ్యాస్ సరఫరాను పెంచలేదు, రాయితీ ఇవ్వలేదు సరికదా, అప్పటి వరకూ సరఫరా చేసిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశాయి. దీంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా పరిశ్రమలను యజమానులు మూసివేశారు. తూర్పుపాలెం ఐస్ ఫ్యాక్టరీతో పాటు, విద్యుత్, స్టీల్ పరిశ్రమలు, కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ మూతబడ్డాయి. దీంతో నిర్వాహకులు రూ.కోట్లు నష్టపోయారు. స్థానిక యువత ఉపాధి లేక సతమతమవుతున్నారు. స్థానిక పరిశ్రమలకు రాయితీలు, గ్యాస్ సరఫరా చేయని ఆయా సంస్థలు.. ఇతర చోట్ల పరిశ్రమలకు ఇవ్వడం దారుణమైన అంశమని స్థానికులు మండిపడుతున్నారు. లోప్రెజర్ గ్యాస్ను తక్కువ ధరకు నియోజకవర్గంలో పరిశ్రమలకు అందించని ఒక సంస్థ.. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి శివకోడులోని ఓ బావిని ధారాదత్తం చేయడం గమనించదగ్గ విషయం. వరస లీకేజీలు రాజోలు దీవిలో వారానికోసారి గ్యాస్, ఆయిల్ బావులు లీకవుతాయి. ప్రజలు బెంబేలెత్తి, తీవ్ర భయాందోళనలు చెందుతారు. కానీ ఆయా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాయి. శిథిలమైన పైపులైన్లు, బావుల పరికరాలకు మరమ్మతులు చేయపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కనీసం ఓఎన్జీసీ కార్యకలాపాల పనులు, కాంట్రాక్టులు కూడా ఆయా సంస్థలో పరిచయం, పలుకుబడి ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల సంస్థలు, వ్యక్తులకే ఇస్తున్నారనే వాదన ఇక్కడ బలంగా ఉంది. అనేక నష్టాలు రాజోలు దీవిలో గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం గుల్లవుతోంది. ఇక్కడి భూసారంతో పాటు పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. అలాగే గ్యాస్ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ పైపులైన్ల లీకేజీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయిల్ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. -
ట్రంప్ సుంకాలతో ఆక్వా అతలాకుతలం
అమలాపురం టౌన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో మన రాష్ట్రంలోని ఆక్వా రంగం అతలాకుతలం అవుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 11న విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతు సదస్సుకు జిల్లా నుంచి ఆక్వా రైతులు హాజరు కావాలని కోరారు. స్థానిక ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో మంగళవారం రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఈ విషయంపై సమావేశమయ్యారు. అనంతరం విజయవాడ ఆక్వా రైతు సదస్సుకు హాజరుకావాలంటూ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులను స్వయంగా కలసి మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు ఆక్వా రైతులను సదస్సుకు ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే ఈ సుంకాల విధింపుపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 12, 13 తేదీల్లో ఆటోల బంద్ అమలాపురం టౌన్: సీ్త్ర శక్తి పథకం పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు కలుగుతుండడంతో జిల్లాలోని ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా తమ జేబులకు నల్ల బ్యాడ్జీలు, ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. అలాగే ఈ నెల 12, 13వ తేదీల్లో ఆటోలను పూర్తిగా నిలిపివేసి బంద్ పాటించనున్నారు. ఆ రెండు రోజులూ 24 గంటల పాటు సామూహిక నిరాహర దీక్షలు చేపడతారు. ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల ఆటోలు ఉన్నాయి. మెప్మా కార్యకలాపాలపై సమీక్ష అమలాపురం టౌన్: జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అమలు చేస్తున్న కార్యకలాపాలపై స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని మెప్మా కార్యాలయంలో ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) డి.పెంచలయ్య మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో డ్వాక్రా సంఘాల సభ్యులకు అందేలా మెప్మా సిబ్బంది కృషి చేయాలన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో తీసుకునే రుణాలు, లైవ్లీ హుడ్ యూనిట్ల రికవరీపై చర్చించారు. సమావేశంలో ఐబీ మోహన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, నాలుగు మున్సిపాలిటీల సీఎంఎంలు , సీవోలు, డీఈవోలు, డీఆర్పీలు పాల్గొన్నారు. 11 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా రేషన్ డిపోల వద్ద ఈ నెల 11 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సుమారు 5,31,926 కార్డులు వచ్చాయని, వాటిని సంబంధిత తహసీల్దార్లకు అప్పగించామన్నారు. రేషన్ డీలర్లు, సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో ఈ నెల 11 నుంచి సంబంధిత మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల సమక్షంలో డిపోలకు పంపిణీ చేస్తారన్నారు. తదుపరి రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. అరుణాచలంకు ప్రత్యేక బస్సు రాజమహేంద్రవరం సిటీ: అరుణాచలం, రామేశ్వరం యాత్రకు రాజమహేంద్రవరం డిపో నుంచి మంగళవారం స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు 30 మంది భక్తులతో బయలుదేరి వెళ్లిందని డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. ఈ యాత్రలో 9 రోజులపాటు కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, కోయంబత్తూర్, కుంభకోణం, చిదంబరం, గురువాయూర్, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూరు వంటి 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి 18వ తేదీ రాజమహేంద్రవరం డిపోకు చేరుకుంటుందన్నారు. -
ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన
అమలాపురం రూరల్: జిల్లా ప్రజలు ప్రకృతి వైపరీత్యాల నుంచి జాగ్రత్త పడేందుకు వీలుగా భారత వాతావరణశాఖ (ఐఎండీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యోచన చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం భారత వాతావరణశాఖ అధికారులు భట్నవెల్లిలోని ఒనువులమ్మ దేవాలయం వద్ద సేకరించిన 50 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఓండీ కార్యాలయం ఏర్పాటుకు 50 సెంట్లు స్థలం అనువుగా ఉందని అధికారులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు అందుతాయన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా అప్రమత్తం కావచ్చన్నారు. వర్షం, ఎండ, చలి, తుపానులు, వడగండ్ల వాన, భూకంపాల వంటి వాటికి ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. -
గాలికుంటు.. తరిమికొట్టు
● 15 నుంచి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ● జిల్లాకు చేరుకున్న 1.25 లక్షల డోసులు ● వర్షాకాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువరాయవరం: గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు దున్నాలన్నా, దుక్కి చేయాలన్నా ఎద్దులు, దున్నల అవసరం తప్పనిసరి. వీటితో పాటు పాడి పశువులు బాగుంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అయితే ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) సోకే ప్రమాదం ఉంది. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. దీని బారిన పడిన పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. తద్వారా పశు పోషకులకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులు, జీవాలను ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవచ్చని పశువైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. వ్యాధి లక్షణాలు ● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. వేడిని తట్టుకోలేవు. ● ఈ వ్యాధికి గురైన గేదె, మేక, గొర్రె వంటి జీవాల్లో తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది. పాల దిగుబడి తగ్గడం, నోరు, మూతి, కాళ్లు, పొదుగు మీద పుండ్లు, బొబ్బలు కనపడటం, కాళ్లు కుంటడం, నోటి నుంచి విపరీతంగా నురగ కారడం వంటి లక్షణాలు ఉంటే గాలికుంటు వ్యాధి సోకినట్టు గుర్తించాలి. ● ఆగస్టు, సెప్టెంబర్, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. దీని వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్థ్యం తగ్గుతుంది. జ్వరం తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారన్ హీట్ వరకు పెరిగిన పశువులు నీరసిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ● నోటి ఎపిథీలియం (పైపొర), పళ్లు, చిగుళ్లు, నాలుక, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడతాయి. అవి 24 గంటల్లో చితికి పోవడం వల్ల పశువులు నొప్పితో మేత తినవు. నోటి నుంచి చొంగ కారుతుంది. ● చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కొక్కసారి పొదుగువాపు సంభవిస్తుంది. పశువులు శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ ఎండవేడిమికి తట్టుకోలేక నీరసిస్తాయి. వ్యాప్తి చెందే విధానం నోరు, కాలు వ్యాధికి గురైన పశువుల అంతస్రావాల (లాలాజలం, పుండ్ల నుంచి కారే రసి) వల్ల మిగతా పశువులకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధి బారిన పడతాయి. జిల్లాలో పరిస్థితి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,65,368 పశువులు ఉన్నాయి. వీటికి 7వ రౌండ్ బూస్టర్ డోస్ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ ఉచితంగా వేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి నెలాఖరు వరకు ఏడాది లోపు దూడలకు బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాకు 1.65 లక్షల డోసులు అవసరం కాగా, 1.25లక్షల డోసులు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. గతంలో 40 వేల డోసుల నిల్వలు ఉన్నాయి.నివారణ ఇలా.. పశువులు బాగా బలహీనంగా ఉంటే గ్లూకోజ్ రక్తంలోకి ఇవ్వాల్సి ఉంటుంది. నోటిలో పుండ్లు వలన మేత మేయవు కనుక వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి. జావ, జొన్న, అన్నం, బెల్లంతో కలిపి ప్రతిరోజూ తాగించడం ద్వారా బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. వాటి మలమూత్రాలను గడ్డిలో కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చాలి. ఆబోతులు, దున్నల వీర్యం ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. అందువల్ల వ్యాధి సోకిన వాటిని సుమారు మూడు నెలల వరకు సంపర్కానికి వినియోగించకూడదు. కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాలతో కడిగి నీమ్లెంట్, వేపనూనె పూయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్ చల్లి గ్లిజరిన్ కలిపి రాయాలి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి. -
ఎయిడ్స్పై అవగాహనకు 5 కె రన్
అమలాపురం రూరల్: ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సీహెచ్వీ భరతలక్ష్మి తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా మంగళవారం అమలాపురంలోని భట్నవిల్లి జంక్షన్ నుంచి రోళ్లపాలెం వరకూ 5 కె రన్ నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడుతూ జిల్లా యువతకు హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న 105 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పురుషులలో ప్రఽథమ బహుమతిని ఎన్.నాగేంద్ర మురళి (అమలాపురం ఎస్కేవీటీ డిగ్రీ కాలేజీ), ద్వితీయ బహుమతిని బీఎస్ఆర్ రాజు (కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), మహిళల్లో ప్రఽథమ బహుమతిని జి.రమ్య (రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), ద్వితీయ బహుమతిని వైపీఎన్డీ సంతోషి (కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) గెలుపొందారు. కార్యక్రమంలో టీబీ అధికారి పి.బాలాజీ, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎ.బుజ్జిబాబు, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎంవీ రత్నరాజు పాల్గొన్నారు. -
క్లోరిన్ గ్యాస్ లీకై పలువురికి అస్వస్థత
యానాం: కనకాలపేట రక్షిత తాగునీటి పథకం ట్రీట్మెంట్ ప్లాంట్లో మంగళవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ఆధ్యర్యంలో కనకాలపేటలోని ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందిస్తుంటారు. ఈ నీటిని శుభ్రపరిచేందుకు సుమారు 900 కేజీల క్లోరిన్ గ్యాస్ సిలిండర్ను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మార్చాలి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది సిలండర్ను మార్చతుండగా ఒక్కసారిగా దానిలోంచి గ్యాస్ లీకై బయటకు వ్యాపించింది. దీంతో అక్కడే ఉన్న సుమారు తొమ్మిది మంది సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కనకాలపేటలోని కోనవారివీధి, పాతబడివీధి, జమ్ముబాడువ తదితర గ్రామాల్లోకి గ్యాస్ వ్యాపించడంతో దాని వాసనకు పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీడబ్ల్యూడీ ఈఈ నాగరాజు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం నాగరాజు, జేఈ పెదపాటి సంతోష్, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు వచ్చిన ఫైర్మన్ కోన కృష్ణారావు (బాబీ) తదితర తొమ్మిది మంది సిబ్బందితో పాటు 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అశోక్, ఆర్ఏవో అంకిత్ కుమార్ పరామర్శించారు. గ్యాస్లీక్ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
రామచంద్రపురం: కె.గంగవరం మండలం అద్దంపల్లి సమీపంలో ఈనెల 3న దారి దోపీడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఎం.వెంకట నారాయణ వెల్లడించారు. పట్టణంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్రాక్షారామకు చెందిన యండమూరి శ్రీనివాస్ ఈ నెల 3న తాను పనిచేస్తున్న నగల దుకాణాన్ని మూసివేసి సుమారు రాత్రి 11 సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అద్దంపల్లి గ్రామం దేవాంగుల శ్మశాన వాటిక సమీపానికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని ఇనుప పైపుతో కొట్టి కళ్లలో కారం చల్లారు. సుమారుగా 10 గ్రాముల పాతబంగారం, సెల్ఫోన్ రూ.5 వేలు, షాపునకు సంబంధించిన రశీదులు, స్కూటర్తో పాటు సుమారు రూ.78 వేలు విలువైన వస్తువులు దోచుకుపోయారు. దొంగలకు మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ మేరకు ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం ఏరియా బైపాస్ రోడ్డులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తాళ్లరేవు మండలం గాడిమెగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు, సంగాడి రాజు, పత్తిగొంది గ్రామానికి చెందిన కళ్లేపల్లి ప్రసాద్గా గుర్తించారు. -
విద్యుత్ షాక్తో సెంట్రింగ్ కూలీ మృతి
కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కూలి వాసంశెట్టి శ్రీనివాస్ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్ సెంట్రింగ్ పనికి వెళ్లాడు. శ్రీనివాస్ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్కుమార్ తెలిపారు. వ్యాన్ కింద పడి.. ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు బస్సు ఢీకొని.. గండేపల్లి: మల్లేపల్లికి చెందిన మడపాటి సూరిబాబు (34) తాళ్లూరు సమీపంలోని సామిల్లు వద్ద తాపీపనికి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన నిలుచున్న అతడిని విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. పింక్ మూన్తో ‘నన్నయ’ ఒప్పందంరాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు. రూ.1.15 లక్షల ఎరువుల సీజ్అంబాజీపేట: నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన రూ.1.15 లక్షల విలువైన 5.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎస్.తాతారావు, మండల వ్యవసాయ అధికారి కె.ధర్మప్రసాద్ తెలిపారు. మాచవరంలోని సుభూషణ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.1,15,370 విలువైన ఎరువులను సీజ్ చేశారు. తనిఖీలో డీసీటీవో ఎ.నవీన్ కుమార్, కానిస్టేబుల్ శివకుమార్, ఏఈఓ జాజెబ్ శాస్త్రి పాల్గొన్నారు. -
వీధి ఆవుకు అత్యవసర శస్త్రచికిత్స
ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు అమలాపురం టౌన్: అమలాపురంలో ఓ వీధి ఆవుకు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి సోమవారం అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. స్థానిక ఫైర్స్టేషన్ వద్ద ఓ వీధి ఆవు కదలేని పరిస్థితుల్లో ఉండి నోరు, ముక్కు వెంబడి తిన్న ఆహారం బయటకు వచ్చేస్తుందని గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు డాక్టర్ విజయరెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే ఆయన పశువుల అంబులెన్స్–1992 వాహనంలో తన సిబ్బందితో వీధి ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ విజయరెడ్డి తక్షణమే ఆవు కడుపు భాగంలో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గో ప్రేమికులు స్వామి, పుల్లయ్య, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, యశ్వంత్ తదితరులు సహకారం అందించారు. -
వరద ముంచేను
ఫ గోదావరి తగ్గడంతో కోలుకుంటున్న లంకలు ఫ పంటల సంరక్షణకు జాగ్రత్తలు అవసరం ఆలమూరు: వరద వచ్చింది.. నిండా ముంచేసింది.. లంకలను అతలాకుతలం చేసింది.. చివరికి వెనక్కి తగ్గినా బురదే మిగిల్చింది.. ఈ ఏడాది గోదావరికి మూడు సార్లు వరద వచ్చింది.. లంకల్లో వందల ఎకరాల పంటలను నీట నాన్చింది. చాలాచోట్ల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. మిగిలిన పంటలను రక్షించుకునేందుకు ఉద్యాన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గోదారమ్మ శాంతించడంతో ఇప్పుడిప్పుడే లంక భూములు కోలుకుంటున్నాయి. వరద తాకిడికి గురైన ఉద్యాన పంటలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నష్టం తప్పదు. ఒక్కోసారి వివిధ రకాల తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన పంటను ఏవిధంగా సంరక్షించుకోవాలో వివరిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూర ల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల కూరగాయల పంటలు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పంట భూముల్లో వరద నీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడంతో జింక్, పొటాష్, నత్రజని పోషకాలతో పాటు ఇనుము ధాతు లోపం ఏర్పడుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉద్యాన పంటలను కాపాడుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి పీవీ రమణ వివరించారు. ● ఆకుముడత: వరదల వల్ల కూరగాయ మొక్కల ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే చీడపీడలు ఆశించినప్పుడు కూడా ఈ తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ● చీడపీడలు: వరదల వల్ల పొలాల్లో తేమ పెరిగి చీడపీడలు పెరిగి పంటలు నాశనమవుతాయి. ● వేరుకుళ్లు: వరద నీరు రోజుల తరబడి పొలాల్లో ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిలీంధ్ర తెగులు వస్తుంది. కరవు సంభవించిన సమయంలో కూడా ఈ తెగులు ప్రభావం ఉంటుంది. ● కాండం కుళ్లు: స్ల్కీ రోషియం ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల కూరగాయల మొక్క కాండం కుళ్లిపోయి పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ● కీటకాల వృద్ధి: వరదలు సంభవించిన తరువాత ఉద్యాన పంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పాటు అగ్ని చీమలు, దోమలు, బొద్దింకలు వృద్ధి చెందుతున్నాయి. ఈ కీటకాలు మొక్కల ఆకులను తినేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. నివారణ చర్యలు ఫ లంక భూమి వాలును అనుసరించి పొలాల్లోంచి వరద నీరు పోయే విధంగా అరడుగు వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఫ నీరు ఇంకిపోయిన తరువాత వీలైనంత మేర నేలను ఆరనివ్వాలి. ఫ జింక్ లోప నివారణకు 0.2 శాతం జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. నత్రజని లోప నివారణకు ఒక గ్రాము కార్బన్డైజమ్ లేదా రెండు గ్రాముల కార్బన్డైజమ్తో పాటు మాంకోవెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఫ ఇనుము ధాతులోపం నివారణకు 0.2 శాతం పెర్రస్ సల్ఫేట్ను వేయాలి. ఫ పొటాష్, నత్రజని లోపాల నివారణకు పంట దశను అనుసరించి 0.5 శాతం నుంచి 1.0 శాతం పొటాష్ నైట్రేట్ను పిచికారీ చేయవచ్చు. దొండ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వరదల సమయంలో దొండ సాగు పట్ల ఉద్యాన రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా వరద నీరు నిల్వ ఉండటం వల్ల దొండ పాదుల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా బూజు, బూడిద తెగులు ఆశించే ప్రమాదముంది. బూజు తెగులు నివారణకు మాంకోజెల్ లేదా మెటాలాక్సిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ట్రైడీమార్ఫ్ లేదా డైనోకాప్ ఒక మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి వేయాలి. సోకే తెగుళ్లువరద నీటిలో చిక్కుకున్న కూరగాయ పంటలకు సాధారణంగా ఆకుముడత, చీడపీడలు, వేరుకుళ్లు, కాండం కుళ్లు తదితర తెగుళ్లు సంభవించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలను సస్యరక్షణ చర్యల ద్వారా కాపాడుకోవచ్చు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఆటోవాలాలను రోడ్డుకీడ్చారు..
విశాఖ నుంచి అమరావతికి డ్రైవర్ పాదయాత్ర తొండంగి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆటోవాలాలను రోడ్డుకీడ్చిందని విశాఖ కంచరపాలేనికి చెందిన ఆటోవాలా చింతకాయల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర సాగిస్తున్నాడు. అతని పాదయాత్ర సోమవారం తొండంగి మండలం జాతీయ రహదారి నుంచి సాగింది. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత పథకాలతో పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించిన కూటమి నేతలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి ఆటోవాలాల జోవనోపాధిపై దెబ్బకొట్టారన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు, మధ్య వయస్కులు ఎందరో ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్లు, బీమా, అప్పుడప్పుడు ఫైన్లు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ప్రస్తుతం ఆటోవాలాలంతా రోడ్డున పడ్డారన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించానని, తమ మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతానని వివరించారు. -
ఆటో కార్మికుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం
ఆర్డీఓ కార్యాలయం ఎదుట డ్రైవర్ల ధర్నా అమలాపురం టౌన్: సీ్త్రశక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తెచ్చిన కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందని ఆంధ్రా ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు దుయ్యబట్టారు. సీ్త్రశక్తి పథకాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులను నడిరోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనలు ఉధృతం చేసేందుకు రూపొందించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో జిల్లాలోని ఆటోలన్నీ బంద్ చేసి సామూహిక నిరాహార నిరసన దీక్షలు చేపట్టనున్నామని అన్నారు. జిల్లాలోని ఆటో కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ నిరసన ద్వారా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ నెల 18, 19 తేదీల్లో ఆటో యూనియన్ల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సీ్త్రశక్తి పథకం వల్ల ఆటో కార్మికులకు ఉపాధిపరంగా జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని సత్తిరాజు తెలిపారు. ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, ఆటో యూనియన్ల ప్రతినిధులు రాయుడు ప్రసాద్, బొలిశెట్టి శంకర్, బొక్కా నాని, బొమ్మి ఫణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో.. అమలాపురం రూరల్: మహిళలకు ఉచిత బస్సు పఽథకం వల్ల ఆటో, క్యాబ్, టాటా ఏస్ కార్మికులు ఉపాధి కోల్పోయారని ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, వైఎస్ ఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యల్లమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. అలాంటి కార్మికులను ప్రభుత్వం కుంగదీయడం సరికాదన్నారు. కార్యక్రమంలో గుత్తుల మల్లిబాబు, బొంతు శ్రీనివాసరావు, యల్లమల్లి చంటి, గుత్తుల సుబ్రహ్మణ్యం, మద్దా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే గౌరవ వేతనాలు అందించండి
అమలాపురం రూరల్: జిల్లాలోని మసీదుల ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతన బకాయిలను తక్షణం విడుదల చేయాలని అమలాపురం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 11 నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమామ్లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మైనారిటీలకు మసీదు మెయింటెనెన్స్ నిమిత్తం ప్రతి నెలా రూ.5 వేలు, షాదీతోఫా కింద రూ.లక్ష ఇస్తామని హామీలు ఇచ్చి, మైనారిటీల ఓట్లు దండుకుని కనీసం మసీదు పెద్ద, చిన్న గురువులకు గౌరవ వేతనం కూడా వేయలేని పరిస్థితి తెచ్చారన్నారు. కార్యక్రమంలో రాజోలు, అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ వై.షరీఫ్, షేక్ ఖాజాబాబు, అన్వర్ తాహిర్ హుస్సేన్, మీర్జా ఆదం బేగ్, అమలాపురం టౌన్ మైనారిటీ సెల్ కార్యదర్శి హుస్సేన్, ఎండీ జుబేర్, ఎండీ నౌషాద్, ఎండీ యూసుబ్ తదితరులు పాల్గొన్నారు. తెరచుకున్న సత్యదేవుని ఆలయ ద్వారాలు అన్నవరం: చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూత పడిన సత్యదేవుని ఆలయాన్ని సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు, నిత్యకల్యాణం, ఆయుష్య హోమం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, రాత్రి పవళింపుసేవ యథావిధిగా నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు మాత్రమే స్వామివారి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వందలు జరిగాయి. -
ఎంపీడీఓలు జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీలను సొంత వనరులతో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఎంపీడీఓలకు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన 50 మందికి రెండో బ్యాచ్లో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలను వైస్ ప్రిన్సిపాల్ పరిచయం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత వనరుల సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పనులు నిర్వహించే సమయంలో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదన్నారు. ఎంపీడీఓలు విధుల నిర్వహణలో మండల పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తొలిరోజు ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, డి.శ్రీనివాసరావు, కె.సుశీల శిక్షణ ఇచ్చారు. -
ఫీజు బకాయిలు చెల్లించాలని ధర్నా
అమలాపురం రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 31 మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ న్యాయం చేయాలని ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు పోలమూరి మోహన్బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టు తరఫున గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ ఛత్తీస్ఘడ్, నారాయణపూర్లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కె.ప్రభాకరరావు, హెచ్ఎం పి.షాలిని సౌజన్య, ఉపాధ్యాయులు, పీఈటీ సయ్యద్ షఫీ ప్రోత్సాహమే తన విజయానికి కారణమని లక్ష్మీశ్రీసాయి తెలిపింది. సోమవారం పాఠశాల క్రీడా సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెను మెమెంటోతో సత్కరించారు. -
కొత్త కోటపాడులో డయేరియా
రంగంపేట: మండలంలోని కొత్త కోటపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పలువురు మంచాన పడ్డారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో నమోదైన డయారియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్త కోటపాడులో ప్రత్యేక వైద్య బృందంతో శిబిరం నిర్వహించి, బాధితులకు చికిత్స అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో పారిశుధ్య చర్యలు చేపట్టగా, నీటిలో క్లోరినేషన్ పనులు చేయించారు. కొత్త కోటపాడులో 234 ఇళ్లలో 973 జనాభా ఉండగా, నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి నియంత్రణలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా వచ్చి ఉండవచ్చని చెప్పారు. -
అప్పనపల్లిలో దర్శనాలు పునః ప్రారంభం
మామిడికుదురు: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు, నిత్య కై ంకర్యాల అనంతరం భక్తుల దర్శనాలు పునః ప్రారంభించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమం జరిపారు. స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి అమలాపురం రూరల్: ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 200 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ప్రజల పెట్టుకున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి మాట్లాడుతూ నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.మాధవి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఎస్డీసీ పి.కృష్ణమూర్తి, డీఎల్డీఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 23 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 23 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉండడంతో ఎస్పీ కృష్ణారావు వారితో ముఖాముఖి చర్చించి పరిష్కారానికి సూచనలు చేశారు. గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఎస్పీ ఆదేశించారు. నేడు 5కే మారథాన్ అమలాపురం రూరల్: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ, ఎయిడ్స్పై యువతలో అవగాహన పెంచేందుకు 5కే మారథాన్ రన్ను మంగళవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అమలాపురం కలెక్టరేట్లో టీషర్ట్లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా స్థాయి మారథాన్ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ 5కే రన్ను భట్నవిల్లి జంక్షన్ నుంచి రోళ్లపాలెం వరకూ ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల మధ్య జరుపుతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొనాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. మొదటి విజేతకు రూ.10 వేలు, రెండో స్థానానికి రూ.7 వేలు ఇస్తామని, మహిళలు, పురుషులకు వేర్వేరుగా 5కే రన్ ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబును 90003 97803 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. -
ఆటిజం.. అవగాహనతో దూరం
● బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ● ప్రతి వంద మందిలో ఇద్దరికి వచ్చే అవకాశం ● జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు రాయవరం: పేరు పెట్టి పిలిచినా పలకక పోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వైపు చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, మిగిలిన చిన్నారులతో కలవక పోవడం వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాలతో మన దేశంలో ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరు ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆటిజం లక్షణాలు ఉన్న చిన్నారులు అధికమయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాల ఆధ్వర్యంలో ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాలో 22 మండలాల్లో ఇప్పటికే 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. వారిలోనూ నైపుణ్యాలు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలా ఉండమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్నవారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఈ చిన్నారుల్లో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. భవిత కేంద్రాల తరహాలో.. జిల్లా పరిధిలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపట్టారు. ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రాల్లో తరహాలోనే ఈ కేంద్రాల్లో ఆటిజం బాధితులకు సేవలు అందిస్తారు. బాధిత చిన్నారులను పూర్వపు స్థితికి తీసుకువచ్చి అందరిలో కలిసేలా చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే వీటికి ప్రత్యేక భవనాలు నిర్మించడంతో పాటు సిబ్బందిని నియమించే అవకాశముంది. ఒక్కో భవనానికి రూ.27.75 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నిధులతో రెండు గదులు నిర్మిస్తారు. ఫిజియోథెరపీ, ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం(బస్టాండ్) ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మానసిక పరిస్థితి మెరుగు ప్రస్తుతం భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడే చిన్నారులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు, ఆటిజం బాధితులకు ఒకేచోట సేవలు అందించడం ఇబ్బందిగా మారడంతో ఆటిజంకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీచ్ లాంగ్వేజ్, వ్యక్తిగత ప్రవర్తన, ఆక్యుపేషనల్, మ్యూజిక్ థెరపీ శాసీ్త్రయంగా సాధన చేయించనున్నారు. ప్రాథమిక దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఏర్పాటు చేస్తాం జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే చిన్నారులకు అనువుగా సెంటర్లను ఎంపిక చేయనున్నాం. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ -
బస్తామే సవాల్
● బ్లాక్ మార్కెట్లోకి యూరియా ● బస్తా రూ.330 నుంచి రూ.390 వరకూ అమ్మకాలు ● సహకార సంఘాల వద్ద కొని విక్రయిస్తున్న ఏజెన్సీలు ● దోపిడీ చేస్తున్నా పట్టించుకోని ‘కూటమి’ ● నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ సాక్షి, అమలాపురం: కష్టాలు తీర్చరు.. ముందుకు ‘సాగు’నివ్వరు.. గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటకు రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా కనీసం చూడరు.. ఇదీ కూటమి ప్రభుత్వంలో తీరు.. తొలుత పెట్టుబడులకు సొమ్ము అందక, తర్వాత ప్రకృతి సహకరించక అష్టకష్టాలు పడిన రైతులు కీలక సమయంలో యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు తదితర పంటలు సాగుచేసే రైతులే కాదు కొబ్బరి, అరటి, పోక, కోకో, కంద, పువ్వులు వంటి ఉద్యాన పంటలు వేసిన కర్షకులు యూరియా దొరకక అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఏ మండలంలో ఏ ఆయకట్టులో రైతును కదిపినా కొందామంటే ఒక్క యూరియా బస్తా కూడా లేదని ఘొల్లుమంటున్నారు. జిల్లాలో యూరియా కొరత ప్రస్తుతం కొంత వరకూ తగ్గింది. వారం పది రోజుల కిందట రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు పడ్డారు. ఇతర జిల్లాల్లో యూరియా కొరతను బూచిగా చూపించి ఇక్కడ ప్రైవేట్ ఎరువుల దుకాణ యజమానులు యూరియాను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా 45 కిలోల బస్తాను రూ.266.70కు విక్రయించాల్సి ఉంది. కానీ ప్రైవేట్ దుకాణదారులు రూ.330 నుంచి రూ.390కు అమ్ముతున్నారు. ఆర్ఎస్కే, పీఏసీఎస్ల వద్ద యూరియా అమ్మకాలకు ఆధార్ లింక్ చేయడం, ఎకరాకు అర బస్తా మాత్రమే ఇస్తామనే నిబంధనలతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. ఒక విధంగా ఇది కృత్రిమ కొరత సృష్టించడమే. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. అలాగే 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి, మరో 50 వేల ఎకరాల్లో అరటి, కంద, కోకో, పోక, కూరగాయ, ఇతర వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్లో అంటే జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 16,812 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా గత నెల ఐదో తేదీ వరకూ 17,364 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో మరింత యూరియా అందుబాటులోకి వచ్చిందని వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన దానికన్నా యూరియా వినియోగం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ఎక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అమ్ముకున్నారు. మరికొంత మంది హోల్సేల్ డీలర్లు యూరియా కావాలంటే గుళికలు, లేదా జింక్ కొనాలని పట్టుబడుతున్నారు. యూరియా దిగుమతి చేయకపోవడానికి ఇదో కారణమని డీలర్లు చెబుతున్నారు. వచ్చిందే తడవుగా.. ● ఉప్పలగుప్తం మండలంలో వారం పది రోజుల తర్వాత ఆర్ఎస్కేలకు 20 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాలకు 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 90 మెట్రిక్ టన్నుల చొప్పున తాజాగా వచ్చింది. దీంతో ఏఓ కార్యాలయం వద్ద స్లిప్లు కోసం రైతులు ఎగబడుతున్నారు. కొబ్బరి రైతులకు పంపిణీ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ● అల్లవరం పీఏసీఎస్కు సోమవారం పది టన్నులు రాగా, మధ్యాహ్న సమయానికి అయిపోయాయి. గూడాల పీఏసీఎస్కు శనివారం రాత్రి పది టన్నులు రాగా అది కూడా అమ్మకాలు జరిగిపోయాయి. మరెక్కడా యూరియా లేదు. ● కొత్తపేట మండలంలో ఆదివారం 20 టన్నుల వరకు యూరియా వచ్చింది. ప్రైవేట్ డీలర్ల వద్ద తక్కువగా ఉంది. దాడులకు భయపడి డీలర్లు నిల్వలు చేయడం లేదు. ● ఐ.పోలవరం మండలం మొత్తానికి ఆదివారం కేవలం పది టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో లేక రైతులు మండిపడుతున్నారు. విజయవంతం చేయండి కొత్తపేట/రావులపాలెం: కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా దగాపడిన రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోవడం, యూరియా కొరతపై రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ‘అన్నదాత పోరు’ పేరిట నిరసన కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందేనన్నారు. జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల వారు అమలాపురంలో, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల వారు కొత్తపేటలో, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల వారు రామచంద్రపురం డివిజన్ కేంద్రాలకు తరలివెళ్లి నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఆర్డీఓలకు వినతులు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. అదనపు ధరకు కొంటున్నాం యూరియా సకాలంలో దొరకడం లేదు. పీఏసీఎస్, ఆర్ఎస్కేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అరకొరగా దొరుకుతుంటే అదనంగా ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. సాగులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – గుబ్బల దుర్గాప్రసాద్, కేశనకుర్రు, ఐ.పోలవరం ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు యూరియా స్థానికంగా దొరకడం లేదు. దీనికోసం రోజుల తరబడి ఎదురు తెన్నులు చూడాల్సి వస్తోంది. ఎరువుల కొరత గతంలో లేదు. మా ఇబ్బందులు అర్థం చేసుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – చీకురుమల్లి రత్నప్రసాద్, రైతు, పల్లంకుర్రు, కాట్రేనికోన మండలం నేడు ‘అన్నదాత పోరు’కు సన్నద్ధం ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైఎస్సార్ సీపీ అన్నదాత పోరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల వారీగా మంగళవారం అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రైతన్నకు బాసటగా వైఎస్సార్ సీపీ నిలబడుతోందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ల వారీగా అన్నదాత పోరు నిర్వహిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీపీ శ్రీనివాస్ సస్పెండ్
ఫ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణం ఫ ప్రలోభాలకు తలొగ్గని వారే పార్టీలో ఉంటారు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి కపిలేశ్వరపురం (మండపేట): మండపేట రూరల్ మండలం ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ను వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు. మండపేట విజయలక్ష్మినగర్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, యువనేత తోట పృథ్వీరాజ్, నాయకులు కురుపూడి రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ పట్ల ఎంపీపీ శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుపై మండలంలోని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకుల అభిప్రాయాలను స్వీకరించామన్నారు. వారి అభిప్రాయాలను పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికార కూటమి పార్టీలోకి చేరుదామంటూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ శ్రీనివాస్ ప్రలోభ పెట్టారన్న విషయాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించిందన్నారు. తల్లిలాంటి పార్టీకి నష్టం చేసే కార్యాచరణకు పాల్పడితే సహించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంటే సంక్షేమం ఏ స్థాయిలో సామాన్యులకు అమలవుతుందో చరిత్ర చెబుతుందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి నాయకుల మోచేతి నీళ్లు తాగేందుకు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరన్నారు. ప్రలోభ రాజకీయాలు చేయడం మాని ప్రజాస్వామ్యయుతంగా పాలించాల్సిన అవసరాన్ని కూటమి నాయకులు గుర్తించాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ అనీ ఆ పార్టీకి వెన్నుపోటు పొడవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రజల్లో కనుమరుగు కాక తప్పదన్నారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు దూలం వెంకన్నబాబు, ఎంపీటీసీ సభ్యులు మండ సుమలత, వనుం సత్యవేణి, అన్నందేవుల కృష్ణారావు, చంద్రమల్ల పోతురాజు, చొల్లంగి సత్యవేణి, పంపన లక్ష్మి, తాతపూడి ఉష, పట్నాల నాగ వెంకట సుబ్బారావు, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు అడబాల బాబ్జి, నాయకులు పోతుల ప్రసాద్, పలివెల సుధాకర్, అద్దంకి రమణ, వాసిరెడ్డి అర్జున్ పాల్గొన్నారు. -
నాడు రక్ష.. నేడు కక్ష
ఆలమూరు: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.. ప్రభుత్వ పారదర్శకత పాలనకు నిలువుటద్దం.. కోవిడ్–19 సమయంలో ప్రాణాలకు తెగించి గ్రామ వలంటీర్ల వ్యవస్థతో కలసి ప్రజలకు విస్తృత సేవలను అందించిన చరిత్ర గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉంది. క్షేత్రస్థాయిలోని ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన దుస్థితిని ప్రజా సంకల్పయాత్రలో గుర్తించిన వైఎస్ జగన్ ఆ మేరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2019 మే 30న అధికారం చేపట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వానికి భారమైన లెక్క చేయకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం 2019 అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. ఒక్కో గ్రామ సచివాలయంలో 11 నుంచి 14 మంది ఉద్యోగులను నియమించి మండల, జిల్లా కేంద్రాల్లో లభించే సేవలను కూడా గ్రామ సచివాలయాల్లో అందించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా తమ యథావిఽధి పనులకు భంగం కలగకుండా సమాంతరంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా పాలనను సులభతరం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎటువంటి అవినీతికి, ఆర్థిక దుర్వినియోగానికి తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలను అందిస్తూ జవాబుదారీతనం కల్పించిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుంది. దీర్ఘకాలిక ఉద్యమం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచైనా సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై పక్షపాత వైఖరిని మానుకోకుంటే భవిష్యత్లో దీర్ఘకాలిక ఉద్యమం తప్పదని జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఐక్యవేదిక ప్రకటించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులను నిర్వహించడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, పనిభారాన్ని తగ్గించాలని మండల, గ్రామ స్థాయి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఏ విధమైన ఒత్తిడి తీసుకువచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్ గవర్నెన్స్ వంటి ప్రజలకు ఉపయోగం లేని వృథా సేవలను అందించలేమని తేల్చి చెప్పింది. మానసిక వ్యధరాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఓ పక్క గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, మరో పక్క జీవనాధారమైన ఉద్యోగాన్ని వదులుకోలేక మానసిన వ్యధను అనుభవిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ బాధ్యతలతో పాటు గతంలో నలుగురు గ్రామ వలంటీర్లు చేపట్టే విధులను కూడా అప్పగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఐదున మళ్లీ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెండు గంటలకు ప్రగతిని, లక్ష్యాన్ని సెల్ఫోన్ ద్వారా గూగుల్ ద్వారా నిక్షిప్తం చేయాలని సూచించింది. ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మంది ఉద్యోగులు పని ఒత్తిడి, వేధింపులతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మూడంకెల వేతనాన్ని పొందుతున్నా సర్కార్ కొలువు కావడంతో పాటు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి మీద ఉన్న నమ్మకంతో అరకొర వేతనానికే ఉద్యోగాల్లో చేరామని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం మారింది.. పాలన తిరోగమించింది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలోని ప్రజలకు సక్రమంగా అందే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 515 గ్రామ, వార్డు సచివాలయాలుండగా అందులో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 3992 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై ఉన్న అక్కసును ప్రతీకారంగా మార్చుకుంది. రేషనలైజేషన్ పేరిట జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు బదిలీలు చేపట్టింది. ఒక్కో సచివాలయంలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు లేదా మూడు గ్రామ సచివాలయాల బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా తొలగించిన 8972 మంది గ్రామ వలంటీర్ల బాధ్యతలను కూడా సచివాలయ ఉద్యోగులకు అప్పగించి విపరీతమైన పనిభారాన్ని ప్రభుత్వం పెంచేసింది. ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆధార్ నుంచి అనేక సేవలను అందిస్తుండగా ఇది చాలదన్నట్టు మళ్లీ సుమారు 500 రకాల వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అలుసుగా తీసుకున్న మండల స్థాయి అధికారులు మూడు లేదా నాలుగు క్లస్టర్లను మ్యాప్ చేసి ఒక్కో సచివాలయ ఉద్యోగికి అప్పగించింది. ఒక్కో సచివాలయ పరిధిలో 20 నుంచి 50 మంది గ్రామ వలంటీర్లు చేసే పనినంతా కేవలం ఐదు నుంచి 11 మంది ఉద్యోగులపై భారం వేసి ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తుంది. కుటుంబానికి సేవలు అవసరం ఉన్నా లేకపోయినా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన కల్పించాలని లేదా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రస్థాయి అధికారులే నేరుగా తమ అనధికార ఆదేశాలతో భయపెడుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సచివాలయాల ద్వారా అందుతున్న ప్రధాన సేవలు 01) సామాజిక పింఛన్ల పంపిణీ 02) జియో ట్యాగింగ్ సర్వే 03) నాన్ ఏపీ రెసిడెంట్స్ సర్వే 04) అప్డేట్ ఈ–కేవైసీ 05) చిల్డ్రన్ వితౌట్ ఆధార్ 06) మన మిత్ర 07) ఇది మంచి ప్రభుత్వం 08) వాహన్ ఆధార్ సీడింగ్ 09) మేండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ 10) యోగాంధ్ర 11) వర్క్ ఫ్రం హోమ్ సర్వే 12) పీ–4 సర్వే 13) కౌశలం సర్వే 14) రేషన్ కార్డు (ఈ–కేవైసీ) 15) రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ వలంటీర్ వ్యవస్థను తొలగించింది మొదలు.. వారు చేసే పనులన్నీ సచివాలయ ఉద్యోగులపైనే వేశారు. జగన్మోహన్రెడ్డి హయాంలో నాడు ఎంతో రక్షణగా పని నిర్వర్తించే ఉద్యోగులు.. నేడు ఆ సర్వేలు, ఈ సర్వేలు అంటూ కూటమి కక్ష కట్టి ఊరంతా తిప్పుతోంది. కూటమి వచ్చి ఏడాది కాగానే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన ఉద్యోగులతో పాటే ఐదేళ్లు పూర్తయిందనే సాకుతో వీరినీ పక్క మండలాలకు బదిలీలు చేశారు. పీ–4 అంటూ ఎన్నో బాధ్యతలు నెత్తిన పెట్టారు. కానీ ఇవ్వాల్సిన, రావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడితే మాత్రం వాటిపై యథా బాబు.. తథా డాబు అంటూ సతాయిస్తున్నారు. ఇలా మానసిక వ్యథ అనుభవిస్తూ ఉద్యోగాలను ఈడ్చుకొస్తున్నారు. ఫ సచివాలయ వ్యవస్థపై ఎందుకంత కక్ష ఫ రోజురోజుకూ పని భారం పెంచేస్తున్న ప్రభుత్వం ఫ సర్కార్ సేవల కంటే పార్టీ ప్రచారానికే ప్రాధాన్యం ఫ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాటలో ఉద్యోగులు -
క్షణికావేశం.. తీరని శోకం
ఫ ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలు ఫ సమస్య ఏదైనా చావు పరిష్కారం కాదు ఫ ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుందంటున్న నిపుణులు ఫ 10న ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం రాయవరం: సరిగ్గా చదవడం లేదని తండ్రి మందలించాడన్న కారణంతో మండలంలోని పసలపూడి శివారు సర్వారాయతోటలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి చెప్పిన మాటలను అర్థం చేసుకుని, ఆలోచించి ఉంటే జీవితం నిలబడేది. భర్త బలవన్మరణాన్ని తట్టుకోలేక కాకినాడకు చెందిన మహిళ జీవితంపై విరక్తితో జూలై 31న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తను లేకుంటే కుమారుడి పరిస్థితి ఏమవుతుందోనని భావించి కుమారుడికి కూడా పురుగుల మందు పట్టించింది. దీంతో ఇరువురు చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఇలా ప్రతిరోజూ చిన్న చిన్న సమస్యలకే పరిష్కార మార్గాలను అన్వేషించకుండా చావుతో ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు, వ్యసనాలకు బానిసలై మరికొందరు, బాధ్యతలు మోయలేక ఇంకొందరు, పంట చేతికి రాకున్నా.. పరీక్షల్లో తప్పినా.. ప్రేమ విఫలమైనా.. పెద్దలు కోప్పడినా కూడా మరణమే శరణ్యమంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్య ఎంత జటిలమైనా ఒక్క క్షణం పాటు ఆలోచిస్తే.. పరిష్కార మార్గమో.. ప్రత్యామ్నాయమో కనిపిస్తుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. తమపై ఆధారపడ్డ వారి గురించి.. బంధువులు, ఆత్మీయుల గురించి ఆలోచిస్తే ఆత్మహత్య ఆలోచన నుంచి మనసు మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రధానంగా రెండు కారణాలు చావుకు టాప్–10 కారణాల్లో ఆత్మహత్య కూడా ఒకటి. యువతీయువకుల్లో ఆత్మహత్యలు టాప్–3లో ఉంటాయి. వీరిలో ఆత్మహత్యలు చాలా కామన్గా ఉంటాయి. ఆత్మహత్యలకు పైకి కన్పించే కారణాలు, కన్పించని కారణాలు ఉంటాయి. ప్రేమవివాహాలు, ఆర్థిక పరిస్థితులు, మానవ సంబంధాలు తదితరాలతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కొంతమందికి కన్పించని కారణాలు ఉంటాయి. మెదడులో శిరోతోనిన్ అనే జీవరసాయన పదార్థంలో చోటుచేసుకునే మార్పుల కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది చనిపోవడానికి నిర్ణయించుకుని చనిపోయిన వారు కొందరైతే, నేను ఎంత బాధపడుతున్నానో.. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అనే మెసేజ్ను ఇవ్వడానికి కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా తమకు కావలసిన వారిలో సానుభూతి రప్పించడం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజంగా ఆత్మహత్యలు చేసుకునే వారి కంటే ఇటువంటి వారు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా చికిత్స డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనజీమ జిల్లా కేంద్రం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో మానసిక రుగ్మతలతో బాధపడే వారి కోసం కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్కు ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడేవారు వస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు నెలకు సుమారుగా 500 నుంచి 600 మంది వరకు కౌన్సెలింగ్ పొందుతున్నట్లు ఏరియా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు కూడా వారికి తెలియకుండానే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. కేవలం చిన్న చిన్న కారణాలకు, ఒత్తిడిని భరించలేని స్థితిలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధానంగా ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, వ్యసనాలకు బానిస కావడం, పరీక్షలు, ఓటమి భయం, ఒంటరితనం, సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పులు తదితర కారణాలన్నీ ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేందుకు ఇష్టపడని వారు 14416 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి బేసిక్ కౌన్సెలింగ్ను పొందే వీలుంది. పురుషులే అధికంఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషుల మరణాలే అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 52.8 శాతం మంది పురుషులు, 47.1 శాతం మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. 33.3 శాతం మంది దిగులు, ఇతర కారణాలు, 10.6 శాతం పరీక్షలు, పని ఒత్తిడి, ప్రేమ విఫలం తదితర ఒత్తిడి కారణంగా, 11.4 శాతం మంది నిద్రలేమి కారణంగా, 10.6 శాతం మంది భయం, కంగారు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 3.6 శాతం ఆత్మహత్యలు 12 సంవత్సరాల లోపు వారు, 6.3 శాతం మంది 13–17 సంవత్సరాల మధ్య వయస్సు వారు, 67.6 శాతం మంది 18–45 సంవత్సరాల వారు, 17.4శాతం మంది 46–64 మధ్య వయస్సు వారు, 5.1 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఒక్క క్షణం ఆగితే ప్రపంచం మీదే చనిపోయినంత మాత్రాన సమస్య తీరదు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. బాధ్యతలు మోస్తున్నప్పుడు సమస్యలు రాక మానవు. అలాంటి సమయంలో ఇతరుల నుంచి సహాయాన్ని తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలను అన్వేషించాలి. ఆత్మహత్యలకు పాల్పడడం పిరికితనమే. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగితే ప్రపంచం మీదే. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం మానసిక సమస్యలతోనే ఆత్మహత్యలు ఆత్మహత్యాయత్నం ఓ మానసిక సమస్య. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారిని ముందుగా గుర్తించి చికిత్స చేయించడం అత్యవసరం. వారిని నెమ్మదిగా నలుగురిలోకి తీసుకువెళ్లాలి. జీవితంపై ఆసక్తి కలిగించేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు. – డాక్టర్ సౌమ్య, సైక్రియాటిస్ట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం 07ఎండీపీ121ఎ:07ఎండీపీ121 -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా తులసీ కుమార్
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జెడ్పీటీసీ గుబ్బల తులసీ కుమార్ను అనపర్తి నియోజకవర్గానికి నియమించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
సాయమందజేసీ
అమలాపురం రూరల్: ఉద్యోగం పేరుతో మోసానికి గురై, చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో చిక్కుకున్న దివ్యాంగుడు, అతడి కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ నిషాంతి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శంకర్రావు అనే వ్యక్తి నమ్మించాడు. చైన్నెలో ఉద్యోగం ఉందంటూ చెప్పి నాగేశ్వరరావు, అతడి భార్య, పిల్లలను తీసుకువెళ్లాడు. చైన్నెలోని సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత, వారి దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యాడు. వెంటనే నాగేశ్వరరావు.. జేసీ నిషాంతికి ఫోన్ చేసి, తన పరిస్థితిని వివరించాడు. భార్యాపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన జేసీ.. వెంటనే చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడి, నాగేశ్వరరావు కుటుంబానికి రైలు టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. ఖర్చు కోసం తన సొంత డబ్బును పంపించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ● ఉద్యోగం పేరుతో మోసపోయిన దివ్యాంగుడు ● భార్యాపిల్లలతో సహా చైన్నెలో చిక్కుకున్న వైనం ● రక్షించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి -
పాఠశాల 150 ఏళ్ల వేడుకకు హాజరు కావాలి
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నవంబర్లో నిర్వహించనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు స్వయంగా ఆహ్వానించారు. విజయవాడ సమీపంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ భవనంలో ఉన్న ఆయన్ని ఎమ్మెల్సీ కలసి ఆహ్వాన పత్రాన్ని శనివారం అందించారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరూ కలసి చదువుకున్నారు. యూనివర్సిటీ లా కాలేజీలో వారు విద్యార్థులుగా ఉన్న సమయంలో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శిగా సూర్యనారాయణరావు ఎన్నికయ్యారు. అప్పట్లో వీరిద్దరూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన పోరాటంలో పాలు పంచుకున్నారు. ఈ చనువు, స్నేహంతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 ఏళ్ల వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు తెలిపారు. తన ఆహ్వానం మేరకు విధిగా హాజరవుతానని అన్నారన్నారు. అలాగే ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వెంకన్నాయుడు, హరిబాబు, తాను ఆంధ్ర యూనివర్సిటీలో చదివామన్నారు. -
ఆహారం.. ఆరోగ్యం
రాయవరం: ఆరోగ్యకర జీవనంలో పోషకా హారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిలో ఎలాంటి లోపాలున్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో పోషకాహార లోపాలు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారతాయి. పోషకాహార లోపాల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి సీ్త్ర, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి అక్టోబర్ 11 వరకూ 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2025 నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,546 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషణ్ అభియాన్–మిషన్ పోషణ్ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఊబకాయం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, మెన్ స్ట్రీమింగ్ – ఇన్వాల్వింగ్ మెన్ ఇన్ న్యూట్రిషన్ అండ్ కేర్ గివింగ్ తదితరఅంశాలను వివరిస్తారు.కోనసీమ జిల్లా పరిధిలో..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,726 అంగన్వాడీ కేంద్రాల్లో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, 901 మంది ఆరు నెలల లోపు చిన్నారులు, 7,017 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు, 8,041 మంది 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉన్నారు.విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలుకోనసీమ జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా 1,81,759 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 70,254 మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించగా, 16,680 మంది ఎనిమిక్గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కంటి వైద్య పరీక్షల అనంతరం 3,300 మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశారు. 1,204 మంది చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించగా, 100 మందికి హియరింగ్ ఎయిడ్స్ అందజేశారు. 10 మందికి గ్రహణం మొర్రి ఉన్నట్లుగా గుర్తించగా, వీరిలో 9 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జూలైకు సంబంధించి 7,303 మంది గర్భిణులు ఉండగా, వారిలో 542 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మొత్తం గర్భిణుల్లో 7.42 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి టీహెచ్ఆర్ పంపిణీ చేస్తున్నారు.పోషకాహారంపై అవగాహనఅందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబర్లో జాతీయ పోషకాహార వారోత్సవాలను అమలు చేస్తున్నారు. గతంలో వారం రోజుల పాటు నిర్వహించగా, వీటిని ఇప్పుడు నెల రోజులకు పొడిగించారు. కోవిడ్ 19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్ ఏ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్ – 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్త పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కల్పించనున్నారు.ప్రణాళికాబద్ధంగా నిర్వహణచిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాల నివారణకు పోషణ మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా ఐదు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో లయన్ డిపార్ట్మెంట్లతో కలిసి కార్యక్రమాలు చేపడతాం. ముందుగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళతాం.– వై.విజయశ్రీ, ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రావులపాలెం: స్థానిక అమలాపురం రోడ్డులోని కాలువ గట్టు వద్ద శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. సీఐ శేఖర్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హైస్కూల్ దాటిన తర్వాత రోడ్డు పక్కనే కాలువ చెంత 35 నుంచి 40 ఏళ్ల వయసున్న పురుషుడి మృతదేహం ఉంది. అతడి ఒంటిపై చారల టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
220 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
సాక్షి, పార్వతీపురం మన్యం/పాచిపెంట: విజయనగరం, పార్వతీపురం మన్యం మీదుగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా లారీలో తరలిస్తున్న 220 టన్నుల రేషన్ బియ్యాన్ని పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు సమీపంలో శనివారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లంపూడి నుంచి ఒడిశాలోని నౌగాంకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. చెక్పోస్టు వద్ద విజిలెన్స్ సీఐ సింహాచలం, సిబ్బందితో కలిసి లారీని పట్టుకున్నారు. విచారణ అనంతరం స్థానిక సీఎస్డీటీ హేమలతకు అప్పగించారు. బియ్యాన్ని మంచాడవలస జీసీసీ గోదాంలో భద్రపరిచారు. పట్టుకున్న సరకు విలువ సుమారు రూ.11.53 లక్షలు ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్సై రామారావు, హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు, కానిస్టేబుల్ తిరుపతిరావు ఉన్నారు. లారీపై జనసేన గుర్తులు బియ్యాన్ని తరలిస్తున్న లారీపై పెద్ద అక్షరాలతో జనసేన పేరుతో పాటు, ఆ పార్టీ గుర్తులు ఉన్నాయి. జనసేనకు చెందిన నాయకుడి వాహనంగా తెలుస్తోంది. ఆ బియ్యం తరలింపులో పార్టీ వారి పాత్ర ఉందా? లేకుంటే కేవలం లారీనే ఇచ్చారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. -
గోదావరిలో వృద్ధురాలి గల్లంతు
పి.గన్నవరం: ఆ వృద్ధురాలికి ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ గోదావరిలోకి దూకి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై నుంచి వైనతేయ నదిలోకి దూకి గల్లంతైంది. వివరాల్లోకి వెళితే. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎల్.గన్నవరం వైపున అక్విడెక్టు పార్కులోని గణేశ్ ఆలయం వద్ద ఏర్పాటు వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని భక్తులు నదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు కొద్ది సేపు సుమారు 75 ఏళ్ల వయసున్న ఆ వృద్ధురాలు ఆ ప్రాంతంలో తిరిగింది. వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని కూడా దర్శించుకుంది. నిమజ్జనం జరుగుతున్న సమయంలో అక్విడెక్టుపై చెప్పులు విడిచి నదిలోకి దూకి గల్లంతైంది. ఆమె ఎరుపు, నలుపు రంగులతో ఉన్న చీర ధరించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. -
కిడ్నీ బాధితుడికి రూ.1.61 లక్షల ఆర్థిక సాయం
పెదపూడి: కిడ్నీ బాధితుడికి వైద్య ఖర్చుల కోసం సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రూ.1,61,162 ఆర్థిక సాయం అందజేశారు. ఆ అసోసియేషన్ ఫౌండర్ కం చైర్మన్ వడ్డి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సంపర గ్రామానికి చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లి, అక్కడ ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు చల్లపల్లి సతీష్కు కేవలం 20 ఏళ్ల వయసులోనే రెండు కిడ్నీలు పాడై, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు ఆర్థిక సాయం కోసం తమ సొంత ఊరు సంపరలోని ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులను ఆశ్రయించాడు. స్పందించిన సభ్యులు రూ.1,61,162 సేకరించి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోషన్ చేతుల మీదుగా శనివారం మధ్యాహ్నం నాగేశ్వరరావుకు అందజేశారు. అలాగే కలెక్టర్ షణ్మోషన్.. సంపర అసోసియేషన్ కార్యక్రమాలను పరిశీలించి, అభినందించి బాధితుడి తండ్రికి మరో రూ.10 వేలు తన సొంత సొమ్ములు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కుందూరి వెంకట సుబ్బారావు కొమ్మన శ్రీనివాసరావు, యానాల మౌళి తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్రెడ్డి విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్రెడ్డి విడుదలయ్యారు. మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చిన కోర్టు.. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదే రోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది.ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. మిథున్రెడ్డి పిటిషన్కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
గురువుకు విగ్రహం!
గురుభక్తిని చాటుకున్న పూర్వ విద్యార్థులు రాజోలు: తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవాలు అనే మాటలను నిజం చేసి తమకు పాఠాలు బోధించిన గురువు విగ్రహాన్ని శిష్యులు గురువు ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు చింతలపల్లి గ్రామంలో స్వర్గీయ ఉపాధ్యాయుడు గుబ్బల గంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన బోధించిన పాఠాలు, వ్యక్తిత్వ వికాసాలు, జీవిత మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకున్న పూర్వ విద్యార్థులు ఆయన ఇంటి ఆవరణలో గంగారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురుభక్తిని చాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గంగారావు గణిత బోధనలో గొప్పవారిగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం శిష్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి, నాయకులు దంతులూరి చంటిబాబు, పెదబాబు, పి.గన్నవరం వైస్ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోటసత్తెమ్మ ఆలయం రేపు మూసివేతనిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం కోటసత్తెమ్మ అమ్మవారికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు మూసివేసి తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన పేర్కొన్నారు. -
వినాయక లడ్డూ రూ.36,500
అమలాపురం రూరల్: మండలంలో బండారులంక, మట్టపర్తివారిపాలెంలో నిలబెట్టిన సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి 15 కేజీల మహాలడ్డును వేలంపాటలో రూ.36,500లకు డి.రవితేజ, వెంకటలక్ష్మి, తులసి అర్జున్, దివ్య దంపతులు దక్కించుకున్నారు. పాటదారులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు సత్కరించి లడ్డూను అందించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడలి రాజు, కడలి రావకృష్ణ, బొంతు శ్రీనుబాబు, మట్టపర్తి అజయ్ కుమార్, మామిడిశెట్టి విష్ణు ప్రసాద్, మట్టపర్తి రాంబాబు, మట్టపర్తి కృష్ణ నాగేంద్ర, రాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముమ్మరంగా పొగాకు నారుమడులు
● 65 హెక్టార్లలో నర్సరీలు ● దసరా నుంచి నాట్లకు సన్నాహాలు ● ట్రే నర్సరీలపై రైతుల ఆసక్తి ● 70 వేల ఎకరాల్లో పంట సాగు దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2025–26 పంట కాలానికి పొగాకు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన నారును నర్సరీల్లో విత్తనం వేసి పెంచుతున్నారు. బోర్డు నిబంధనల మేరకు రైతులు, వ్యాపారులు నారుమడులు కట్టి పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నారుమడి దశ నుంచి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే రైతులు తప్పనిసరిగా బోర్డులో నర్సరీని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంది. పొగాకు పంట సాగు చేసే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు, రైతుల నుంచి నారు కొనుగోలు చేయవలసి ఉంది. నారు అమ్మిన రైతు నుంచి నారు కొనుగోలు సమయంలో రశీదు తీసుకుని బోర్డు కార్యాలయంలో మొక్క ఫారంతో పాటు అధికారులకు అందజేయవలసి ఉంది. ప్రస్తుతం పొగాకు నారుమడులు ముమ్మరంగా కడుతున్నారు. నర్సరీల విస్తీర్ణం పెరిగే అవకాశం దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 65 హెక్టార్లలో పొగాకు నర్సరీలు వేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో సుమారు 34 హెక్టార్లు కమర్షియల్, 21 హెక్టార్లు డొమెస్టిక్ నర్సరీలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు నర్సరీల విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, దేవరపల్లి, బందపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో ఎక్కువగా పొగాకు నారుమడులు కడుతున్నారు. పల్లంట్ల, దేవరపల్లి, లక్ష్మీపురం, బందపురం గ్రామాల్లో కమర్షియల్ నర్సరీలు కడుతున్నారు. కమర్షియల్ నర్సరీలు కట్టేవారిలో 90 శాతం కౌలుదారులు ఉన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు, కాపవరం, ధర్మవరం, తాళ్లపూడి మండలం మలకపల్లి, ప్రాంతాల్లో కమర్షియల్ నారుమడులు కడుతున్నారు. ఇక్కడ వేసిన నారుకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళతారు. ఎకరం విస్తీర్ణంలో పెంచిన నారు సుమారు 1,200 ఎకరాల్లో సాగుకు సరిపోతుందని రైతులు తెలిపారు. ట్రే నారుపై రైతుల ఆసక్తి ట్రేలలో పెంచిన నారుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ట్రే నారు ఆరోగ్యకరంగాను, ధృడంగా ఉండి నాటిన అనంతరం చీడపీడలను తట్టుకుంటుందని రైతులు తెలిపారు. పొగాకు సాగు చేసే రైతులంతా ట్రే నారుపై మొగ్గు చూపుతున్నారు. ట్రే నారు ధర ఎక్కువగా ఉన్నప్పటికి రైతులంతా దీనినే కొనుగోలు చేస్తారు. ఏటా దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. అధిక దిగుబడుల వంగడాలు సాగు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలను సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు రైతులకు సరఫరా చేస్తున్నాయి. కిలో విత్తనాలకు వంగడాన్ని బట్టి రూ.15 వేలు ధర ఉంది. ఎల్వీ–7, 1353 వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు సుమారు 10 నుంచి 13 క్వింటాళ్లు పొగాకు దిగుబడి వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు బోర్డు నిబంధనలు ఉల్లంఘించి పొగాకు నర్సరీలు వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది నర్సరీ దశ నుంచి నిబంధనలు కఠినతరం చేశాం. నర్సరీ వేసే ప్రతి రైతు బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నర్సరీల తనిఖీకి బోర్డు బిజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి రైతులు నారు కొనుగోలు చేయాలి. నారు అమ్మిన వ్యాపారి నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలి. రశీదు పుస్తకాలను బోర్డు ద్వారా నర్సరీ యజమానులకు అందజేస్తున్నాం. అక్టోబర్ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
ఇలా తగ్గి.. అంతలోనే అంతై ముంపు..
● 20 రోజులుగా వరద పరిస్థితి ఇదీ.. ● అవస్థలు పడుతున్న లంక వాసులు ఐ.పోలవరం: గోదావరి వరద లంకవాసులతో దోబూచులాడుతోంది. గత నెల ఆగస్టు 15 నుంచి శుక్రవారం వరకు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని లంక గ్రామాల వాసులు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నివాసిస్తున్న వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. సుమారు 20 రోజులుగా గోదావరి వరద ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని 10 గ్రామాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. గోదావరికి ఈ ఏడాది జూలై 26వ తేదీన స్వల్పంగా వరద వచ్చింది. తరువాత ఆగస్టు 15వ తేదీన మరోసారి వరద రాగా అది తగ్గే సరికి ఆగస్టు 22వ తేదీ నుంచి మరోసారి వరద వచ్చింది. నాటి నుంచి శుక్రవారం వరకు వరద తగ్గుతూ.. పెరుగుతూ.. తగ్గుతూ లంక వాసులు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న సామాన్యులతో దోబూచులాడుతూనే ఉంది. దీని వల్ల వైనతేయ, గౌతమీ, వృద్ధ గౌతమీ నదీపాయలను ఆనుకుని ఉన్న లంక గ్రామాలు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న గ్రామాలు పలు సందర్భాలలో ముంపుబారిన పడుతున్నాయి. ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. రోడ్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లు, తోటల్లో వరద నీరు చేరింది. గోదావరి వరద ఎగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతోంది. కానీ దిగువన ఉన్న ముమ్మిడివరం మండల పరిధిలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠాన్నేల్లంక, ఐ.పోలవరం మండల పరిధిలో మురమళ్ల, కేశనకుర్రు పంచాయతీ శివారు పల్లిగూడెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం వాసులు వరద ప్రభావాన్ని నేరుగా చూశారు. వరదల వల్ల స్థానిక రైతులు విలువైన కూరగాయ పంటలను కోల్పోయారు. అరటి, బొప్పాయి, కంద, వంగ, బీర, బెండ, టమాటాతో పాటు పందిరి కూరగాయలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే మత్స్యకారులకు గడిచిన 20 రోజులుగా మత్స్య సంపద లభ్యం కాకపోవడం వల్ల జీవనోపాధికి గండి పడి పస్తులుంటున్నారు. ఇప్పటికీ వరద పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో వారు కష్టాలు వీడలేదు. -
ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్న చంద్రబాబు
● జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీల్లో 10 అమ్మేయడం ఏమిటి? ● ప్రభుత్వ తీరుపై మాజీ భరత్రామ్ మండిపాటు రాజమహేంద్రవరం సిటీ: అపారమైన అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాకుండా జగనన్న తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చూడటం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ ిసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి, ఏ ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని మినహాయించి, లేని ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో రాజమహేంద్రవరం వంటి ఐదు ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమయ్యాయన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా 35 ఎకరాల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ప్రారంభిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిన్నర కాలంలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మొదటి బ్యాచ్ పూర్తయి డాక్టర్లు బయటకు వచ్చే సమయానికి కూడా భవన నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం 99 ఏళ్లకు అమ్మేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాయడానికి చంద్రబాబుకి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఎవరైనా మెడికల్ కాలేజీలు పెడతామన్నా, సీట్లు పెంచుతామన్నా ఆనందంగా ముందుకు వస్తారని, అయితే చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచొద్దని లేఖ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నిర్వీర్యం చేసి, తద్వారా పేదలకు వైద్యం అందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉందని భరత్రామ్ ధ్వజమెత్తారు. -
భావోద్వేగాల బంధానికి బైబై!
15 పైసల పోస్టు కార్డు.. ఇన్లాండ్ కవర్.. కవరింగ్ లెటర్.. రిజిస్టర్డ్ పోస్టు.. టెలిగ్రాం.. ఇలా ఎన్నో సేవలు సుదీర్ఘ కాలం అందించిన తపాలా శాఖ కొన్ని బంధాలను వదిలించుకుంటోంది. కారణం.. కాలంతో పరుగులు తీయాలనుకోవడమే. సాంకేతికత రాకెట్ వేగంతో సాగుతుంటే కనీసం బుల్లెట్ ట్రైన్లా అయినా ముందుకు సాగకపోతే తన ఉనికికే ప్రమాదమని గ్రహించింది ఆ శాఖ. ఎస్సెమ్మెస్ మొదలైన దగ్గర నుంచి ఊపందుకున్న సాంకేతికత నేడు చాలా వేగంగా విస్తరించి అతి తక్కువ వ్యవధిలో పెద్ద పెద్ద ఫైళ్లను సైతం ఈ మెయిల్ రూపంలో చేరవేస్తోంది. ఇవన్నీ చూస్తున్న నాటి తరం కొంత నిట్టూర్పు విడుస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షణ అనంతరం తాము అందుకున్న ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులను గుర్తు చేసుకుని ఇక ఆ సేవలు కనుమరుగు కానున్నాయని తెలియడంతో కాస్త మనస్తాపానికి గురవుతున్నారు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ సేవల విస్తరణ కోసం సరి కొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దు కాగా, సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టుసేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టల్) బాక్స్ను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతికతకు పోస్టల్ డిపార్టుమెంట్ అప్గ్రేడ్ అవుతోంది. రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం పోస్టల్శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడింది. తాజాగా బ్రిటీషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పోస్టు మాస్టర్లకు ఇప్పటికే శాఖాపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్డ్ పోస్టు మాత్రమే అందుబాటులో ఉండేది. సుమారు 171 ఏళ్లుగా.. పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ శాఖ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో మందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిష్ అధికారి లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్) పొందడం ఒక ప్రత్యేకత, చట్ట పరంగా సైతం ఎంతో విలువైనది. స్పీడ్ పోస్టులో విలీనం రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్ పోస్టు సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఆ శాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవల క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్పోస్టులో రిజిస్టర్డ్ పోస్టు విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్ పోస్టు అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్పోస్టులో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతంగా గమ్యాన్ని చేరనున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత.. వాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీ మెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి చాలా వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం సాగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్లను పరిశీలిస్తే 25 శాతం పడిపోయాయి. స్పీడ్ పోస్టు, ఇతర కొరియర్ల సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్టు డిమాండ్ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా స్పీడ్ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్ పోస్ట్ కనీస చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం మొయకతప్పదు. రెడ్ పోస్టు బాక్స్ ఎత్తివేత ఊహగానమే.. రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్పోస్టు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో పోస్టల్ శాఖ అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా.. నిశ్శబ్దంగా.. నిశ్చలంగా.. విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఒక ఊహాగానమేనని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్బాక్సును ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఆదేశాలు లేవు.. పోస్టుబాక్స్లు ఉండవని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం కేవలం ఉహాగానమే. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలగింపునకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కేవలం రిజిస్టర్ పోస్టు మాత్రమే నిలిపివేశారు. – దాసరి నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ తపాలా సేవలపై అయోమయం ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్ట్ సేవల నిలిపివేత తాజాగా లెటర్ రెడ్ బాక్స్ ఎత్తివేత ప్రచారం అదేమీ లేదంటున్న ఆ శాఖ అధికారులు ఈ–సేవ విస్తరణలో పోస్టల్ శాఖ నిమగ్నం -
ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు
● కలెక్టర్ మహేష్ కుమార్ ● జిల్లాలో 64 మందికి ఉత్తమ పురస్కారాల ప్రదానం అమలాపురం రూరల్: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు, సమాజ నిర్మాణ శిల్పులని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు జీవిత మార్గదర్శకులు, సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు. తల్లి, తండ్రి, గురువు నిత్యం పూజ్యనీయులన్నారు. గురి, లక్ష్యం, దిశ, మార్గం చూపే వారే గురువు అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. విశిష్ట సేవలతో విద్యారంగాన్ని అలంకరించిన దిగ్గజ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేయడం అభినందనీయమన్నారు. 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన పత్రాలతో సత్కరించారు. డీఆర్ఓ కొత్త మాధవి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైనదిగా భావించి విద్యాబోధన చేసేవారన్నారు. అందుకే ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం విశేషమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ భారతదేశ మొట్ట మొదటి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి గొప్ప తత్వవేత్తగా భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారన్నారు. డీఈవో షేక్ సలీం బాషా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దు కుంటుందన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణ సమాజానికి, విద్యార్థులకు మార్గదర్శి ఉపాధ్యాయుడన్నారని పేర్కొన్నారు. తన జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడని, విలువలు, దేశభక్తిని నేర్పుతాడని ఆదర్శంగా జీవిస్తాడన్నారు. అందుకే గురువు స్థానం వెలకట్టలేనిదన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న ట్టు విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయుల వద్ద ఓనమాలు నేర్చుకున్న వారేనని అందుకే వారికి సముచిత గౌరవం దక్కు తుందన్నారు. ఏపీసీ జి.మమ్మి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని, అజ్ఞానాన్ని పారదోలి జ్ఞాన మా ర్గంలో నడిపించడం గురువుకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పందిరి శ్రీహరిరామ్ గోపాల్, డీసీసీబీ సభ్యులు బి.హనుమంతరావు, డీఎస్ఓ జీవీఎస్ సుబ్రహ్మణ్యం సీఎంఓ సుబ్రహ్మణ్యం, ఏఎంవో రాంబాబు, ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
అధరకొడుతున్న కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలలుగా రైతుల అంచనాలకు మించి ధరలు నమోదవుతున్నాయి. కురిడీ కొబ్బరి కొత్త రికార్డులు నమోదు చేస్తుండగా.. పచ్చి కాయలు సైతం ఆల్టైమ్ హైకి చేరాయి. తొలుత పచ్చి కొబ్బరికాయ ధర రూ.15 ఉండగా.. ఆ తర్వాత అది రూ.17కు చేరడంతో రైతులు సంబరపడ్డారు. అది కాస్తా రూ.19కి.. ఆపై రూ.20కి, రూ.22కి.. ఇప్పుడు ఏకంగా రూ.24కు చేరింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకు పలుకుతోంది. ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి. దీంతో అంబాజీపేట మార్కెట్లో జోష్ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 130 లారీల కొబ్బరికాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కురిడీకి భలే డిమాండ్.. కురిడీ కొబ్బరి ధరలు కూడా భారీగా పెరిగాయి. పాతకాయలలో గండేరా రకానికి(పెద్ద కాయ) చెందిన వెయ్యి కాయల ధర రూ.31,500 ఉంది. అదే గటగటా రకం(చిన్నకాయ) రూ.30 వేలు పలుకుతోంది. ఇక కొత్తకాయలో గండేరా రకం రూ.30 వేలు.. గటగటా రకం రూ.28,500 వరకు ధర ఉంది. కోనసీమ జిల్లా నుంచి రోజుకు 40 లారీల కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు దక్షిణాదిలో ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు తగ్గాయి. కేరళలో 40 శాతం, తమిళనాడు, కర్ణాటకలో 30 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. దీంతో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తున్నారు. అలాగే వరుస పండగలు కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే వినాయకచవితి వేడుకలు జరుగుతుండగా.. నెలాఖరు నాటికి దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ వెంటనే కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొబ్బరికి ఎక్కువగా ఆర్డర్లు వస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించారు. అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేలు కురిడీ కొబ్బరి రూ.31,500కు చేరిక ఆరు నెలలుగా రికార్డు స్థాయిలో ధరలు వరుస పండగల ప్రభావం -
యూరియా బ్లాక్ మార్కెట్పై ఉద్యమిద్దాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనకు పిలుపు అమలాపురం రూరల్: జిల్లాలో రైతులకు యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్కు తరలించడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ అధ్వర్యంలో ఉద్యమం చేయనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. అమలాపురం మండలం భట్నవిల్లిలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి పినిపే విశ్వరూప్ నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూరియాకు ప్రభుత్వం కృతిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తోందన్నారు. యూరియా పేరుతో ప్రతిపక్ష పార్టీలు, రైతులు ధర్నా చేస్తే జైల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని సీఎం ప్రకటిస్తే దానిని రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు వ్యాపారులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని చెప్తున్నారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి అర్బీకేల ద్వారా యూరియాను రైతులకు సరఫరా చేశారని గుర్తు చేశారు. అమలాపురం, కొత్తపేట , రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాల్లో నియోజకవర్గ కోర్టినేటర్ల అధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలిపి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. వరదలు, వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలేదన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ జిల్లాలో యూరియా బస్తా రూ.370 నుంచి 400 విక్రయిస్తున్నారని తెలిపారు. యూరియాను బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న విషయం అధికారులకు తెలుసని అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ అధినేత జగ్గన్మోహన్రెడ్డి పోరాటానికి పిలుపునిచ్చారని అన్నారు. నియోజకవర్గ కో ఆర్టినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ యూరియా కొరతపై జరిగే అందోళన విజయంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, నియోజకవర్గ కోఆర్డినేటర్ల డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు ఎంపీపీ కూడుపూడి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సర్ రెడ్డి నాగేంద్రమణి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షుడు సంసాని నాని, గుత్తుల చిరంజీవిరావు, కొనుకు బాపూజీ, నాయకులు నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్, కూడుపూడి బాబు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులకు అండగా వైఎస్సార్ సీపీ
అమలాపురం రూరల్: క్రైస్తవులకు వైఎస్సార్ సీపీ ఎప్పడూ అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం పార్టీ జిల్లా సెల్ అధ్యక్షురాలు ఈదా సంధ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెస్లీ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బలోపేతానికి గ్రామాల్లోని క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు కృషిచేయాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండడంతోనా పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశ్వాసాన్ని ఉంచి పార్టీని మందుకు తీసుకెళ్లాలన్నారు. అలాగే క్రైస్తవులకు పార్టీ ఎప్పడూ అండగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా అంతా కృషిచేయాలని సూచించారు. కష్టపడిన వారికి పార్టీలో ఎప్పుడూ సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి అనుగుణంగా గ్రామస్థాయిలో కార్యకర్తలకు నియోజకవర్గ నాయకునిగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేలా అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. ఆయన సూచనలతో జిల్లాలో జరిగే కార్యక్రమాలకు అంతా హాజరై పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ద్వారా క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ శామ్యూల్ సాగర్, స్టేట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు కుండా జాన్ వెస్లీ, అమలాపురం మండల కోఆప్షన్ సభ్యుడు మొసలి స్పర్జన్ రాజు, అల్లవరం మండల కోఆప్షన్ సభ్యుడు పల్లి జేమ్స్ రాజు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి సుందర విజయం, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చారి సునీల్ శాస్త్రి, జిల్లా కమిటీ నాయకుడు కుంచే సత్యనారాయణ (పేతురు), జిల్లా మాజీ అధ్యక్షుడు కనపాల బాబూరావు, అల్లవరం, అయినవిల్లి మండల అధ్యక్షుడు పేరూరి రత్నంరాజు, పినిపే జయరాజు, పాకా జాన్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ -
అయినవిల్లిలో ముగిసిన నవరాత్ర ఉత్సవాలు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో చవితి మహోత్సవాల ముగింపు కార్యక్రమాలు గురువారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గ భవాని ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి విశేష అభిషేకాలు, పూజలు, లక్ష గరిక పూజ, పంచామృతాభిషేకాలు, శ్రీలక్షీగణపతి హోమం నిర్వహించారు. స్వామికి విశేషాలంకారాలు చేశారు. సాయంత్రం పంచహారతులు, గ్రామోత్సవం జరిపారు. అనంతరం ప్రసాదంగా ఉండ్రాళ్లు పంచారు. కేరళ వాయిద్యాలు, గరగ నృత్యాలు, వివిధ చిత్ర విచిత్ర వేషధారణలు ఏర్పాటు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ భవాని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మట్టి గణపతి విగ్రహాన్ని సమీప పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సోమవారం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. -
7న వాడపల్లి ఆలయం మూసివేత
కొత్తపేట: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఆదివారం రాత్రి 9.55 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. గ్రహణ సమయానికి ముందుగానే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 7.01 గంటలకు ఆలయాన్ని తెరిచి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. 64 మంది గురువులకు జిల్లా ఉత్తమ పురస్కారాలు నేడు కలెక్టరేట్ ఆవరణలో ప్రదానం రాయవరం: గురు స్థానానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 64 మంది ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాలు సాధించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ ఆవరణలోని గోదావరి భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈ మేరకు గురుపూజోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో తమదైన శైలిని కనబర్చిన వివిధ క్యాడర్లకు చెందిన 64 మంది ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. తగ్గినట్టే తగ్గి.. పెరిగిన వరద ఐ.పోలవరం/పి.గన్నవరం: గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు తగ్గుతున్న వరద తరువాత పెరిగింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో 8,25,573 క్యూసెక్కుల వరద నీటిని దిగువునకు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి నీటి విడుదల 9,11,254 క్యూసెక్కులకు పెరిగింది. తరువాత కూడా వరద పెరుగుతూనే ఉంది. జిల్లాలోని లంక గ్రామాల్లో వరద నెమ్మదిగా తగ్గుతోంది. కాజ్వేలను, రోడ్లను వరద వీడింది. దీనితో పడవల మీద ప్రయాణాలు చాలా వరకు నిలిపివేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబియం కాజ్వేల మీద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. -
ఊరేగింపులో ముగ్గురిపై కత్తిపోట్లు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఘటన అల్లవరం: గణేష్ ఉరేగింపులో జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురైన ఘటన మండలం కొమరగిరిపట్నంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, వివరాలు ప్రకారం వినాయకచవితి సందర్భంగా గుర్రం వారి వీధిలో వినాయక విగ్రహాన్ని గురువారం ఊరేగించారు. విగ్రహం శివాలయం వద్దకు వచ్చే సరికి వారిలో వారికి ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తిక్కిరెడ్డి మోహిత్ మణికంఠ చెడీ తాళింఖానా చేసే కత్తితో సుంకర సురేష్, కొమ్మూరి శంకర్లను వెనుక నుంచి పొడిచాడు. మణికంఠ ఇద్దరిపై కత్తితో దాడి చేసిన విషయాన్ని గమనించిన తెలగరెడ్డి హరీష్ అడ్డుపడ్డాడు. దీంతో హరీష్పై మణికంఠ దాడి చేసి కత్తితో పోడిచాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై రక్తపు మడుగులో ఉన్న ముగ్గురినీ స్థానిక సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురంలోని కిమ్స్కు తరలించారు. ఈ వివాదంలో స్వల్పగాయాల పాలైన మణికంఠను కిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్సై సంపత్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కిమ్స్ ఆస్పత్రిలో బాధితుల నుంచి పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు. -
గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి
నా తొలి గురువులు తల్లిదండ్రులు షేక్ మీరాబి, కరీమ్. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవరచి చదువులో బాగా ప్రోత్సహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు ఎస్ఎంఎన్బీ మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు హెచ్ఎం కె.నాగేశ్వరరావు నాపై చెరగని ముద్ర వేశారు. గురువుల దయతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. టీచర్ ప్రవర్తన విద్యార్థుల జీవితాలకు స్ఫూర్తిదాయకం కావాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిత్యం మననం చేసుకుంటాను ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానమార్గంలో నడిపించడం గురువుకే సాధ్యం. గురువు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాకినాడ ఐడియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో డాక్టర్ చిరంజీవినీకుమారి చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పారు. సమాజానికి ఉపయోగపడేలా చదువుకోవాలని చెప్పిన మాటలు నేటికీ మననం చేసుకుంటాను. – దేవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా రవాణా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వారి ప్రభావం ఎంతో ఉంది నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో సాగింది. ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ పద్మజ, ప్రిన్సిపాల్ శశి ప్రభావం నాపై ఎక్కువుగా ఉంది. వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. వారిచ్చిన స్ఫూర్తితోనే పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది. సాంకేతికంగగా ఎంత ఎదిగినా ఉపాధ్యాయుల పాత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం -
4 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం
ఇద్దరి అరెస్టు ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్ల బెల్లాన్ని గురువారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని అంబాగుబా గ్రామం నుంచి కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి మినీ గూడ్స్ వేన్లో నల్లబెల్లం రవాణా జరుగుతోంది. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళికి అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తమ సిబ్బందితో వెళ్లి ధర్మవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ వేన్తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేన్ డ్రైవర్లు సామర్లకోటకు చెందిన తుమ్మల వీర వెంకట సూర్యతేజ, పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన నక్కా చినవీర్రాజులను అరెస్టు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి దాడి లోవరాజుపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తెలిపారు. ఈదాడిలో ప్రత్తిపాడు ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్ తదతర సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
తొండంగి: మండలంలోని ఒంటిమామిడి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంటిమామిడిలో ఆగస్టు 11న బొమ్మదేవ్ సారధి ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండుగులు బంగారు, వెండి నగలు, కొంత నగదు చోరీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి బుధవారం నిందితులను అనకాపల్లి జిల్లా రేవుపోలవరానికి చెందిన చేపల నాని అలియాస్ స్టైలిష్ నాని, యు.కొత్తపల్లికి చెందిన బొండు శివలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి స్కూటీ కొనుగోలు చేయగా ఆ వాహనంతో పాటు కొంత నగదును రికవరీ చేశామన్నారు. రికవరీ సొత్తు విలువ రూ.2.4 లక్షలు ఉంటుందన్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పీసీలు సీహెచ్ మణి వీరకంఠ, సీహెచ్ దొర, పి.శివ, కేఆర్వీ సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఆర్.కిశోర్లను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారని తెలిపారు.