Politics

‘దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలి’.. AICCలో రాహుల్
గాంధీ నగర్ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రెండో రోజు ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దళితులు,ఆదివాసీలు,పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తుంది. కులగణనతో దేశంలో ఓబీసీల సంఖ్య తేలుతుంది. తెలంగాణలో కులగణన చేపట్టాం. జాతీయ స్థాయిలో జనగణన చేసే వరకు పోరాడుతాం. కుల గణనతో ఏ వర్గం జనాభా ఎంత ఉంటుందో తేలుతుందని వ్యాఖ్యానించారు. LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025 గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ప్రారంభమైన ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 1,700 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. తొలిరోజు ఏప్రిల్ 8న విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ, కాంగ్రెస్పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొన్నారు.

లోకేష్ను కలిసిన న్యాయం జరగలేదు.. పెట్రోల్ బాటిల్తో టీడీపీ కార్యకర్త నిరసన
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు.

అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.

ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Sports

నంబర్ వన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మాత్రమే వన్డే సిరీస్ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్లు మాత్రమే మారాయి. బ్యాటింగ్లో టీమిండియా ప్రిన్స్ శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి విరాట్ (5), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో 72 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. భారత్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. పాక్తో సిరీస్లో 3 మ్యాచ్ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్ పేసర్ నసీం షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్తో జరిగిన సిరీస్లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్ బ్రేస్వెల్ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-5లోకి వచ్చాడు.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన రాయల్స్ 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ఆరో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 119 పరుగుల వద్ద రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో శుభమ్ దూబే (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్12.2వ ఓవర్- 116 పరుగుల వద్ద రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (41) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో రాయల్స్7.4వ ఓవర్- 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి దృవ్ జురెల్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. రియాన్ ఔట్6.4వ ఓవర్- 60 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ కేజ్రోలియా బౌలింగ్లో వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. 6 ఓవర్లలో 57 పరుగులు.. ధాటిగా ఆడుతున్న శాంసన్, రియాన్11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రాయల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 57/2గా ఉంది. శాంసన్ (21), రియాన్ (25) ధాటిగా ఆడుతున్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోలోయిన రాయల్స్2.2వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో తొలుత జైస్వాల్ ఔట్ కాగా.. తాజాగా సిరాజ్ బౌలింగ్లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. టార్గెట్ 218.. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్218 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల వద్దనే తొలి వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (6) ఔటయ్యాడు. సంజూ శాంసన్కు జతగా నితీశ్ రాణా క్రీజ్లోకి వచ్చాడు.చెలరేగిన సాయి సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోర్రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్, షారుక్ ఖాన్ తలో 36 పరుగులు చేయగా.. రాహుత్ తెవాతియా 24 (నాటౌట్), రషీద్ ఖాన్ 12, రూథర్ఫోర్డ్ 7, గిల్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔటయ్యాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 18.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 187/5గా ఉంది. తెవాతియా (10), రషీద్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.1వ ఓవర్- 163 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో వికెట్కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి రూథర్ఫోర్డ్ (7) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 156 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో షారుక్ ఖాన్ (36) స్టంపౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (69) జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లోకి వచ్చాడు. రూథర్ఫోర్డ్ వచ్చీ రాగానే సిక్సర్తో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 163/3గా ఉంది.భారీ స్కోర్ దిశగా గుజరాత్ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 124/2గా ఉంది. సాయి సుదర్శన్ 59, షారుక్ ఖాన్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. బట్లర్ ఔట్9.6వ బంతి- 94 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో జోస్ బట్లర్ (36) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సాయి సుదర్శన్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చిన బట్లర్.. 8 బంతుల్లో 4 బౌండరీలుఆరంభంలో నిదానంగా ఆడిన బట్లర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లైన్లోకి వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బట్లర్, ఆతర్వాతి ఓవర్లో కూడా మరో రెండు బౌండరీలు బాదాడు. సాయి సుదర్శన్తో (26 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పాటు బట్లర్ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా టచ్లోకి రావడంతో గుజరాత్ స్కోర్ 8 ఓవర్లలోనే 81 పరుగులకే చేరింది. ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్శుభ్మన్ గిల్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతున్నాడు. సాయి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. సాయికి జతగా బట్లర్ (11) ఉన్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 56/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. కెప్టెన్ ఔట్2.1వ ఓవర్- 14 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (2) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (11) జతగా జోస్ బట్లర్ క్రీజ్లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రాయల్స్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ దూరమయ్యాడు (వ్యక్తిగత కారణాల చేత). అతని స్థానంలో ఫజల్హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది.ఈ సీజన్లో గుజరాత్ తొలి మ్యాచ్లో ఓడి (పంజాబ్), ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు (ముంబై, ఆర్సీబీ, సన్రైజర్స్) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు తొలి రెండు మ్యాచ్ల్లో (సన్రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాత వరుసగా సీఎస్కే, పంజాబ్లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.తుది జట్లు..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే

GT VS RR: నేటి మ్యాచ్లో గెలుపెవరిది.. ఆ స్టార్ బౌలర్ ఆందుబాటులో ఉంటాడా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టాటాన్స్ తమ సొంత మైదానంలో (నరేంద్ర మోదీ స్టేడియం) రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. నేటి మ్యాచ్కు గుజరాత్ స్టార్ పేసర్ కగిసో రబాడ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. రబాడ గత మ్యాచ్కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిపోయాడు. రబాడ ఎప్పుడు తిరిగొస్తాడనే దానిపై టైటాన్స్ యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టి చూస్తే అతను నేటి మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తుంది. రబాడ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి 10.38 ఎకానమీతో కేవలం రెండే వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది అతని స్థాయి కాదు. ఈ సీజన్లో రబాడతో పాటు మరో స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. రషీద్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అయినా గుజరాత్ వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపొందడం విశేషం. రబాడ, రషీద్ ఖాన్ విఫలమవుతున్న వేల సిరాజ్, సాయి సుదర్శన్ చెలరేగిపోతున్నారు. రబాడ, రషీద్ వైఫల్యాలను ఈ ఇద్దరూ భర్తీ చేస్తున్నారు. గుజరాత్ గెలిచిన మూడు మ్యాచ్ల్లో ఈ ఇద్దరు కీలకపాత్రలు పోషించారు. సిరాజ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సాయి సుదర్శన్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తున్నాడు. మరో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ప్రసిద్ద్ కూడా ఓ మ్యాచ్లో తన జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రసిద్ద్, సిరాజ్ చెలరేగడంతో గుజరాత్ వరుసగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సన్రైజర్స్పై అద్భుత విజయాలు సాధించింది. మరోవైపు బ్యాటింగ్లో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ కూడా సత్తా చాటుతున్నారు. సన్రైజర్స్తో జరిగిన గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్కు పని చెప్పాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఓటమి (పంజాబ్) తర్వాత గుజరాత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ప్రతి మ్యాచ్లో ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడుతున్నారు. బౌలర్లు, బ్యాటర్లు సమాంతరంగా రాణిస్తూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయారు. రాజస్థాన్తో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో కూడా విన్నింగ్ రన్ను కొనసాగించాలని గుజరాత్ భావిస్తుంది. ఈ జట్టుకు హోం గ్రౌండ్లో ఆడటం కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు రాజస్థాన్ ఈ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత రెండు వరుస విజయాలు సాధించి గెలుపు ట్రాక్ ఎక్కింది. గత మ్యాచ్లో ఈ జట్టు పటిష్టమైన పంజాబ్కు ఊహించని షాకిచ్చింది. రాయల్స్ తొలి రెండు మ్యాచ్ల్లో సన్రైజర్స్, కేకేఆర్ చేతుల్లో ఓడి, ఆతర్వాత సీఎస్కే, పంజాబ్పై విజయాలు సాధించింది. తొలి మూడు మ్యాచ్లో ఫామ్ ప్రదర్శించలేకపోయిన యశస్వి జైస్వాల్ చివరి మ్యాచ్లో టచ్లోకి రావడం రాయల్స్కు శుభపరిమాణం. కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇప్పటికే పలు మంచి ఇన్నింగ్స్లు ఆడారు. నితీశ్ రాణా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హెట్మైర్, ధృవ్ జురెల్ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బౌలింగ్లో హసరంగ, సందీప్ శర్మ, తీక్షణ పర్వాలేదనిపిస్తుండగా.. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన జోఫ్రా ఆర్చర్ చివరి రెండు మ్యాచ్ల్లో అద్బుతంగా రాణించాడు. ఆర్చర్ గత మ్యాచ్లో పంజాబ్ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. నేటి మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.తుది జట్లు (అంచనా)..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, R. సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, షెర్ఫే రూథర్ఫోర్డ్.రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే/కుమార్ కార్తికేయ

వెస్టిండీస్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025 పోటీలు ఇవాళ (ఏప్రిల్ 9) మొదలయ్యాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రెండు మ్యాచ్లు జరగగా.. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై పాకిస్తాన్, వెస్టిండీస్పై స్కాట్లాండ్ విజయాలు సాధించాయి. ఐర్లాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 44 ఓవర్లలో 179 పరుగలకే కుప్పకూలింది. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.రెండో మ్యాచ్లో పటిష్టమైన వెస్టిండీస్పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ శతకంతో (114) వీరోచితంగా పోరాడినప్పటికీ విండీస్ గెలవలేకపోయింది. అంతకుముందు మాథ్యూస్ బౌలింగ్లోనూ రాణించింది. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనకు గానూ మ్యాచ్ ఓడిపోయినా మాథ్యూస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గత వరల్డ్కప్లో (2022) సెమీస్ వరకు చేరిన విండీస్ ఈసారి వరల్డ్కప్కు (2025) నేరుగా అర్హత సాధించలేకపోగా, క్వాలిఫయర్స్లోనూ పరాభవాన్ని ఎదుర్కొంది.కాగా, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.
National

కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
పాట్నా: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్ సింగ్ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్ రామ్ మాంఝీ బీహార్ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు.

ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కార్గో,ఎక్స్ప్రెస్,ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్లో మరో అదనపు రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 👉పీఎంకేఎస్వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq— ANI (@ANI) April 9, 2025

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే: ఖర్గే
అహ్మదాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి. మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు. బీజేపీ ఆరెస్సెస్లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.ఇక డీసీసీలదే పవర్ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు.
International
NRI

హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
Sakshi Originals

‘ఎర్ర గుంటూరు’ సాగు.. ఎంతో బాగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పంట కొనుగోళ్లలో రాష్ట్రంలోనే 70 శాతం వాటా కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ప్రత్యేకత ఉంది. కానీ ఇక్కడికి వచ్చే పసుపు రకాల విషయానికి వస్తే 99 శాతం ‘ఎర్ర గుంటూరు’(ఆర్మూర్ రకం) ఉండటం విశేషం. నిజామాబాద్ జిల్లా తరువాత.. పసుపు ఎక్కువగా సాగు చేస్తున్న జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఎర్రగుంటూరు రకం వంగడాన్నే అత్యధిక శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ‘దుగ్గిరాల ఎరుపు’రకం వంగడాన్ని తీసుకొచ్చి కమ్మర్పల్లి పరిశోధన కేంద్రంలో మరింత అభివృద్ధి చేశారు. అప్పటినుంచి దీన్ని ఎర్ర గుంటూరు (ఆర్మూర్ రకం)గా పిలుస్తున్నారు. ‘ఎర్ర గుంటూరు’రకం వంగడం ఇక్కడి నేలకు సరిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్ 3 శాతం లోపే ఉంటోంది. కాగా కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే సోనాలి, రాజేంద్రసోని (బిహార్), పీతాంబర్ (ఉత్తరప్రదేశ్) రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. రైతులు మాత్రం స్థానికంగా అభివృద్ధి చేసిన ‘ఎర్ర గుంటూరు’రకం వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం 6 నెలల్లోనే పంట వచ్చే ప్రగతి, ప్రతిభ (కేరళ) పొట్టి రకాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, ఈ రకాల్లో పసుపు బరువు ఎక్కువగా రావడం లేదని రైతులు ఆసక్తి చూపడం లేదు.చూసేందుకు మంచిగా, ధర ఎక్కువగా పలికే ‘ఎర్ర గుంటూరు’రకమే మేలని రైతులు అంటున్నారు. దుంప ఎక్కువగా వచ్చే తమిళనాడు సేలం రకం వంగడాన్ని సైతం నామమాత్రంగానే సాగు చేస్తున్నారు. అయితే చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాజాపురి, సేలం, పీతాంబర్ రకాలను రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ రకాల్లో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా ‘ఎర్ర గుంటూరు’రకం పసుపును దేశీయంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బంగ్లాదేశ్, ఇరాన్, అరబ్ దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. 13 రకాలపై పరిశోధన రాష్ట్రంలో ఏకైక కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం 13 రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక కర్కుమిన్, దిగుబడి ఎక్కువ, తెగుళ్ల నివారణ, కీటకాలు, పురుగు నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో.. పరిశోధనలకు భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్) నుంచి సూచనలు వస్తాయి. కేరళలోని ఆలిండియా కో–ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ స్పైసెస్ (ఏఐసీఆర్పీ)తో సమన్వయం చేసుకుంటూ.. కొన్ని పరిశోధనలు, రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మరికొన్ని పరిశోధనలు ఇక్కడ చేస్తున్నారు. 40 శాతం సాగు నిజామాబాద్ జిల్లాలో.. రాష్ట్రంలో అత్యధికంగా 40 శాతం నిజామాబాద్ జిల్లాలో సాగవుతోంది. తరువాత స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్కు 2019–20లో 10,78,821 క్వింటాళ్ల పసుçపు వచ్చింది. 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021–22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు వచ్చిoది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,74,055 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వచ్చిoది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసుపు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 50 వేల క్వింటాళ్లు, ఏప్రిల్లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్ల పసుపు ఇక్కడి మార్కెట్కు రానున్నట్లు అధికారుల అంచనా. గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిoది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లాలో 22 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు.

కార్నియా.. త్రీడీ ప్రింటింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటిలో కీలకభాగమైన కార్నియా లోపంతో చూపును కోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరైనా కళ్లు దానమిస్తే.. ఆ కంటిని అవయవ మార్పిడి చేసి కార్నియాతో చూపు కోల్పోయిన వారికి వైద్యులు చూపును ప్రసాదిస్తారు. ఇప్పుడు కళ్లను దానం చేసే వారిసంఖ్య పరిమితంగా ఉండగా, కార్నియా అవసరమున్న రోగుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఐఐటీ హెచ్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్)లో ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు కొనసాగుతోంది. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఈ కార్నియాను బయోప్రింటింగ్ చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, సీసీఎంబీ (ది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయోలజీ)లతో కలిసి ఐఐటీహెచ్లోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. ఇది సత్ఫలితాలిస్తుందని ఐఐటీహెచ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగ ఫ్రొఫెసర్ డాక్టర్ ఫాల్గుణి పఠి ‘సాక్షి’కి తెలిపారు. ఈ పరిశోధనల్లో రూపుదిద్దుకున్న త్రీడీ బయో ప్రింటింగ్ కార్నియాను ముందుగా జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కుందేళ్లపై చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చిoది. రానున్న రోజుల్లో ఈ త్రీడీ బయో ప్రింటెడ్ కార్నియాను మనుషులపై ప్రయోగించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందనున్నారు. బయోఇంక్తో త్రీడీ ప్రింటింగ్ రోగుల కళ్ల నుంచి బయోఇంక్ (జెల్ లాంటి పదార్థం)ను సేకరిస్తారు. దీనికి కొన్ని రకాల సెల్లను యాడ్ చేసి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కార్నియాను ప్రింట్ చేస్తున్నారు. సాధారణంగా కార్నియా అనేది 10.8 మిల్లీమీటర్ల నుంచి 12.8 మిల్లీ మీటర్ల సైజులో ఉంటుంది. ఇటీవల కాలంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోంది. భవనాలతోపాటు, జ్యువెలరీ, మానవులు, ఇతర జీవుల అవయవాలు.. ఇలా అనేక రకాల వస్తువులను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూక్ష్మస్థాయిలో 10 మి.మీల నుంచి 12 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ అతి చిన్న మానవ అవయవాన్ని ఇదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించడం గమనార్హం. 4.9 బిలియన్ మందికి అంధత్వం ప్రపంచంలో సుమారు 4.9 బిలియన్ మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నాలుగో వంతు కంటిలోని కార్నియాలోపంతోనే అంధత్వం వస్తున్నట్టు తేలింది. ఈ సమస్యకు కంటి దానమే ఇప్పటి వరకు ఉన్న పరిష్కారం. అయితే కళ్లను దానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అవసరమున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలామంది చూపు లేకుండానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. కళ్ల సేకరణలో ఇబ్బందులు కళ్లు దానమిచ్చిన వారినుంచి కంటి సేకరణ ప్రస్తుతం క్లిష్టతరంగా ఉంది. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నిరీ్ణత సమయంలో కళ్లను సేకరించాలి. సేకరించిన కళ్లను భద్రపరచడం వంటి ప్రక్రియ కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. తగిన వైద్య నిపుణుల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ఒక్కోసారి సేకరించిన కళ్లు పాడైపోయి.. వృథాగా పోతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లకు ఈ పరిశోధనలు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కార్నియా దెబ్బతినడానికి ఇవీ కారణాలు..» ప్రధానంగా ఏమైనా ప్రమాదాలు జరిగి కంటికి గాయాలైతే ఈ కార్నియా దెబ్బతింటుంది. » కంటి ఇన్ఫెక్షన్తో కూడా కార్నియా చెడిపోతుంది. » షుగర్ వ్యాధిగ్రస్తులతోపాటు, బీపీ ఉన్న వారికి కూడా క్రమంగా కార్నియాపై ప్రభావం పడుతుంది. దీంతో చూపుమందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

మూగజీవాలకూ రక్షణ ఇద్దాం!
(సాక్షి స్పెషల్ డెస్క్) : చిన్న, సన్నకారు రైతులు పశుపోషణ ద్వారా సమకూరే ఆదా యంపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. దీంతో పాడి ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, కోళ్ల సంరక్షణ రైతులకు కత్తి మీద సాము లా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డాక్టర్ ఎన్. రాజన్న, శాస్త్రవేత (ఎల్పీఎం) డాక్టర్ సాయి కిరణ్, ‘ఐసీఏఆర్–అటారి’ (జోన్–10) డైరెక్టర్ డాక్ట ర్ షేక్.ఎన్.మీరా రైతులకు సూచనలు ఇస్తున్నారు. ఈ వేసవి మనుషులతోపాటు పశువులకూ గడ్డు కాలమే. తెలంగాణలో సుమారు 3.26 కోట్ల పశు వులు ఉన్నాయి. ఇందులో 42.3 లక్షల ఆవులు 42.26 లక్షల గేదెలు, 1.90 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు 1.78 లక్షల పందులతోపాటు 7.99 కోట్ల కోళ్లు ఉన్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసు కుంటే వేసవిలో పాలు, మాంసం ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవొచ్చు. విదేశీ జాతి, సంకర జాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్ (డి.సె.), దేశీ ఆవులు 33 డి.సె.లు, గేదెలు 36 డి.సె.లు, కుందేళ్లు 30 డి.సె.ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. ఎండ దెబ్బ లక్షణాలు..నాడి వేగంగా, బలహీనంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, పేడ ఉష్ణోగ్రత పెరగడం, అసాధారణంగా సొంగ కారటం, మైకం/అపస్మారక స్థితికి చేరటం, చర్మం చల్లగా, నిస్తేజంగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక తాపం వల్ల సంకర జాతి ఆవుల్లో 15–20%, గేదెల్లో 10–15% పాల దిగుబడితోపాటు వెన్న శాతం పడిపో తుంది. ఉష్ణ తాపానికి గురైన పశువుకు చూలు నిలవదు. ఉదయం 6 –11 గంటలలోపు.. సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు వదలాలి. పచ్చిమేతతోపాటు దాణాను పగలు, ఎండు గడ్డిని రాత్రి పూట వేయాలి. రోజుకు 100 గ్రా. చొప్పున పొటాషి యం అధికంగా ఉండే ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాలి. షెడ్ల ఎత్తు కనీసం 9 అడుగులు పశువుల షెడ్లను తూర్పు–పడమర దిశలో 9 అడుగుల ఎత్తున నిర్మించాలి. పాకల చుట్టూ అవిశె, మునగ, సుబాబుల్ చెట్లు పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగువేసి, ఆపైన గడ్డి, తాటి/ కొబ్బరి /పామాయిల్ ఆకుల్ని కప్పాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటకొకసారి చల్లని నీటితో పశువుల ఒళ్లు తడపాలి. పాకల చుట్టూ గోనె సంచులు/ 20% షేడ్ నెట్ కట్టి, తడుపుతూ ఉండాలి. అధికంగా పాలిచ్చే ఆవులు, ముర్రా గేదెల కోసం ఫ్యాన్ బిగించాలి. గోనె సంచులను నడుముపైన కప్పి, 2–3 సార్లు తడపాలి. షెడ్లపైన స్ప్రింక్లర్లు బిగించాలి. వేసవిలో పశువులకు దాదాపుగా రెట్టింపు తాగునీరు అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోండి..పశువుల ఆరోగ్యం, ఆహారం, నీటిసరఫరా, శరీర పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలి. ఎండదెబ్బ తగిలిన పశువును చల్లని ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో స్నానం చేయించాలి లేదా తడి దుప్పట్లలో చుట్టి, ఫ్యాన్ గాలి అందేలా చూసుకోవాలి. గొర్రెలు, మేకలకు సరైన నట్టల మందులు ఎంచుకోవాలి. వేసవి వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు వేయించాలి. చల్లటి నీటితో స్నానాలు చేయించాలి. చల్లని తాగునీటిని అందించాలి. కోళ్ల పెంపకంలో వేసవి జాగ్రత్తలు..» కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో నిండి ఉంటుంది. వాటి శరీరంలో చమట గ్రంధులు లేవు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే బయటి ఉష్ణోగ్రత పెరిగితే తట్టుకోలేవు. » వేడి ఒత్తిడికి గురైన కోడి పిల్లలు నీరస్తాయి. విరేచనాలవుతాయి. నిలబడ లేవు. వణుకుతుంటాయి. ఈ లక్షణాలుంటే మందులు వేయించాలి. కోళ్లు మెడలు వాల్చి, సన్నగా మూలుగుతూ, కళ్ల నుంచి నీరు కార్చుతున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరుచేసి సరైన చికిత్స అందించాలి. » షెడ్డు ఎత్తు 10 అడుగులుండాలి. దాణా తెల్లవారుజాము, రాత్రి వేళల్లో ఇవ్వాలి. దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంతమేర తగ్గించాలి. సి–విటమిన్ ఎక్కువగా ఇవ్వాలి. » ఒక టన్ను దాణాలో 100 గ్రాముల విటమిన్–సి, 50 గ్రాముల విటమిన్–ఇ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మితియోనైన్ అనే అమైనోఆమ్లం దాణాలో కలిపి ఇవ్వాలి. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25 శాతం ఇస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. » వేసవిలో దాణా, నీటిని 1:2 నిష్పత్తిలో ఇవ్వాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు వంటివి కలిపితే అవి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు చల్లని నీటినే ఇవ్వాలి. షెడ్డుపైన గడ్డి కప్పి, స్ప్రింక్లర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్తో ఎండవేళల్లో అర గంటకొకసారి నీళ్లు చల్లాలి.

ఏఐకి మానవమేధ
మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమమేధ సాధించనుందని గూగుల్ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల్లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్ అనుబంధ డీప్మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్లెగ్ ఒక అంచనాకొచ్చారు. షేన్లెగ్ సహ రచయితగా సేవలందించిన ఒక విస్తృతస్థాయి నూతన పరిశోధన పత్రంలో సంబంధిత వివరాలున్నాయి. మానవాళికి కృత్రిమమేధ పెనుముప్పుగా పరిణమించనుందని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఐతో వినాశనం కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అంటారు. 2030 ఏడాదికల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనా పత్రం అంచనా వేసింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్న ఏజీఐ సృష్టించే పెనుమార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదముందని అభిప్రాయపడింది. ‘‘ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కల్గిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంతమేరకు కోలుకుని మనుగడ సాగించగలదనేవే ఇక్కడ ప్రధానం’’ అని పరిశోధన పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కిచెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమమేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు ఉమ్మడి పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. అంతా అస్తవ్యస్తం అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చు. డేటాను తమకు అనుకూలంగా మార్చేయొచ్చు. దురి్వనియోగం చేయొచ్చు. తప్పులతడకగా డేటాలో మార్పులు చేయొచ్చు. డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దురి్వనియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధన పత్రం ప్రస్తావించింది. ‘‘వచ్చే పదేళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావొచ్చు. అది మానవమేధను మించిపోవచ్చు. అప్పుడది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలనే ఇవ్వొచ్చు’’ అని డీప్మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఏజీఐలను సహేతుకతతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావులేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిïÙగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ‘‘ఏజీఐ అత్యంత సురక్షిత వ్యవస్థగా మాత్రమే ఉండేలా, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏజీఐల కోసం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయనే దానిపై నిఘా ఉండాలి. మానవాళికి సురక్షితం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న వంటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని డెమిస్ గతంలో అన్నారు.ఏమిటీ ఏజీఐ? కృత్రిమమేధ (ఏఐ) మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనమిచ్చిన పనులు, టాస్క్లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకుమించి సొంతంగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమేమున్నాయి వంటివాటిని స్వీయసమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు. తుది ఫలితం పొందడం కోసం మనం ఏజీఐకు ఏదైనా సమాచారమిస్తే అది డేటాను అర్థంచేసుకుని, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని, తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలుపెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవమేధను ఔపోసన పట్టే ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. – సాక్షి, నేషనల్ డెస్క్
టారిఫ్లకు ట్రంప్ బ్రేక్
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
చలనమే విజయం
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ సిద్ధం
ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్: సీఎం రేవంత్
సరైన న్యాయం!
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మేం ఉద్యోగం చేయలేం
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
‘కేకేఆర్ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
అమెరికాకు షాకిచ్చిన చైనా
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్రౌండర్ సంచలన వ్యాఖ్యలు
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
నా స్పీచ్తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
నంబర్ వన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
పాపికొండల్లో అలుగుల సందడి
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
మందులపైనా టారిఫ్లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
17 ఏళ్లుగా పరారీలోనే!
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
చాహల్తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
మియాపూర్లో షెల్టర్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
వెస్టిండీస్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
GT VS RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
ఒకరి వెంట మరొకరు
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
ముందే జాగ్రత్త పడాల్సింది
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్ను రమ్మన్నారు
కొనసాగుతున్న అల్పపీడనం
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్..
యాడ్స్లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్కు ఊరట
కొనేది.. తినేది విషమే!
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్కు మతి పోయింది..!
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
ప్రాణాలు తీస్తున్న సరదా
హైదరాబాద్ నగరంలో మరో సమగ్ర సర్వే
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్ను విమర్శించే స్థాయా నీది?
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
క్రైమ్

తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్నగర్లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజన్తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్స్టేషన్లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు.

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు


రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది: హరీశ్


దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కేసులో నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు


హైదరాబాద్ లో దారుణం.. గర్భవతిపై బండరాయితో భర్త దాడి


భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం


శ్రీరాముడి మాటలు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి


సామాన్యుడి ఇంట్లో సన్న బియ్యం అన్నం తిన్న సీఎం


హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర


శ్రీ సీతారాముల తలంబ్రాల వేడుక


సీతమ్మకు బంగారు చీర


ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలపై రేవంత్ సర్కార్ సీరియస్