Politics

చంద్రబాబుకు మోసం వెన్నతో పెట్టిన విద్య: కోన రఘుపతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుకి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించాల్సిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని.... మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధి. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం కళ్లార్పకుండా ప్రజలకు అబద్దపు హామీలివ్వడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయంప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్.జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే... 2019-24 తర్వాత వైయస్.జగన్ హయాంలో నీతిఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రతిపాదనను అందిపుచ్చుకుని ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వైయస్.జగన్ గారు తీసుకున్న నిర్ణయం మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే... ఏటా మనం ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.3వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం, దానితో పోల్చుకుంటే వీటి నిర్మాణం కష్టం కాదని చెప్పారు.మరోవైపు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను మనం చూశాం. రాష్ట్ర విభజన తర్వాత అత్యాధునిక వైద్యం అందించే ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చెన్నై, బెంగుళూరులో కూడా ఆరోగ్యశ్రీ కింది చికిత్స పొందే అవకాశం కల్పించాం. కానీ శాశ్వతంగా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇదే మంచి సమయం అని ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయించారు.అయినా సొంత మీడియాలో తప్పడు రాతలు..ప్రతి ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో 500 పడకల ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అత్యుత్తమ వైద్య విద్యను, వైద్యాన్ని అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప పనిని ప్రశంసించకపోగా.. తమ చేతిలో మీడియా ఉందని తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు ప్రచారంతో విద్యావంతులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కొంత రుసుముతో పేమెంట్ కోటా తరహాలో చేసి ఆ వచ్చిన మొత్తాన్ని ఆయా కాలేజీల నిర్వహణ, అభివృద్దికి ఉపయోగించాలని ప్రతిపాదన చేస్తే... ఆ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ లు దానిపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు.తాము అధికారంలోకి వస్తే...ఆ విధానాన్ని రద్దు చేస్తాం.. పేదల సీట్లు అమ్ముకుంటారా అంటూ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామనడం ఎంతవరకు సమంజసం. వాస్తవానికి ఇవాల ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రవైటు ఆసుపత్రులన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నియంత్రణలో పనిచేయాలి. కానీ వాటిని మనం ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతున్నామన్న విషయం అందిరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామనడం దారుణం.ఇవిగో మెడికల్ కాలేజీలు.. కళ్లు తెరిచి చూడండి..వైఎస్ జగన్ ప్రభుత్వ నేతృత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీల కోసం అనుమతిలు తెచ్చి, స్దల సేకరణ పూర్తి చేయడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయగా.. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే.. వద్దని ఎంసిఐ కు లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్ మెంట్, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా అందని విధంగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించారు.బాధ్యత గల ప్రభుత్వంగా మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సింది పోయి, వాటిని ప్రైవేటు పరం చేయడానికి... చంద్రబాబు సహా మంత్రులు మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. కనీస హోంవర్క్ చేయకుండా మాట్లాడుతున్న హోం మంత్రి అనిత అయితే కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. విజయనగరంలో అన్ని రకాల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైతే... ఇవేవీ మీ కళ్లకు కనిపించడం లేదా? పైగా ఎల్లో మీడియాలో 10 కొత్త కాలేజీలకు శ్రీకారం అంటూ అబద్దపు వార్తలు వండి వార్చుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే ప్రభుత్వ రంగంలో మంజూరైన కాలేజీలనే... ప్రైవేటు పరం చేస్తూ... మళ్లీ వాటిని తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు రాయడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకోకటుండదు. కళ్లకు పచ్చపాతం సోకిన వ్యక్తులను ఏవరూ ఏం చేయలేదు. కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులు, తటస్థులు వాస్తవాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అప్పుడే నిజాలు తెలుస్తాయి. లేదంటే పచ్చ పత్రికలు రుషికొండ టూరిజం భవనాల తరహాలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తారు.మీరు చేయని పనికి కూడా క్రెడిట్ తీసుకోవడం మీకెప్పుడూ అలవాటే చంద్రబాబూ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి, పూర్తి చేసింది కూడా వైఎస్సారే. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి మీ హయాంలో కనీసం భూసేకరణ కూడా చేయలేదు. కానీ మీరే కట్టామని నిస్సిగ్గుగా కేడర్ తో మాట్లాడతారు. మీరేం చెప్పినా వాటిని ప్రచారం చేసే మాధ్యమాలున్నాయన్న ధీమాతో అబద్దాలను నూరుపోస్తున్నారు. పదే, పదే అబద్దాలు ప్రజలకు నూరుపోసి వాటినే నిజాలని భ్రమింపజేయడం మీకు మొదటి నుంచీ అలవాటే.నంద్యాల మెడికల్ కాలేజీ అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే రండి వెళ్లి చూసి వద్దాం. పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్ధులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ వీటి నిర్మాణం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగమే కాదు వ్యవసాయ రంగం కూడా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రైతులకు మద్ధతు ధర కూడా రావడం లేదు.ప్రతి వేయి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్య విద్యను అభ్యసించాల్సిన పిల్లలను ప్రోత్సహించాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు. 15 నెలల్లో రూ.1.90 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోయాయి. పేదవాడి వైద్యానికి అవసరమయ్యే వైద్య కళాశాలలు కట్టమంటే... డబ్బుల్లేవని బీద పలుగులు పలుకుతున్నావు. పైగా వైయస్.జగన్ హయాంలో రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేస్తే... రూ.10-12 లక్షల కోట్లు అప్పు చేశారని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారు. తీరాచూస్తే అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్ధిక మంత్రే వైఎస్ జగన్ జగన్ హయాంలో రూ.4.67 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి.. సభ బయటకు రాగానే మరలా ఇంకో రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటు. మీ మంత్రి పార్ధసారధి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెబితే... చంద్రబాబు మాత్రం వైయస్.జగన్ హయాంలో ఒక్క కాలేజీ పూర్తి కాలేదు. మేమే తెచ్చాం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు.రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లు అని చెప్పాడు. ఇప్పుడేమో అది ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కేవలం రూ.4 వేల కోట్లు ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టలేవా చంద్రబాబూ? వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు గురించి గగ్గోలు పెడుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన మీరు.. ఓట్లు కోసం సూపర్ సిక్స్ పేరుతో విపరీతమైన హామీలిచ్చారు.తీరా ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మేధావులు, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్చి ఉంది. నిజాలు మీరే క్షేత్రస్ధాయిలో పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఆ తర్వాత మీరే నిజాలు ప్రజలకు తెలియజేయండి.బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి...బాపట్లలో నాడు నేడు కింది అన్ని పీహెచ్ సీలను ఆధునీకరించాం. రూ.3.50 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. కొత్తగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. బాపట్ల ఏరియా ఆసుపత్రిలో గతంలో ఒక ఎమర్జెన్సీ వార్డులో రెండు ఆక్సిజన్ బెడ్స్ ఉండే పరిస్థితి నుంచి కోవిడ్ మహమ్మూరిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాం. ఇప్పుడు 120 ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ వైయస్.జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేశాం. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తే... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు కేటాయిస్తే.. మాకు వద్దు అని లేఖ రాసిన ముఖ్యమంత్రి మీరే చంద్రబాబూ..?వైద్య విద్య కోసం కజికిస్తాన్, యుక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి మన పిల్లలు వైద్య విద్య కోసం వెళ్తుంటే.. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాలేజీలను మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు చంద్రబాబూ ? నిత్యం చంద్రబాబు గ్రాఫిక్స్ చూసి అలవాటు పడిన టీడీపీ కార్యకర్తలు కూడా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైయస్.జగన్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తున్నవి గ్రాఫిక్స్ కాదు... నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజీలు అన్న విషయాన్ని క్షేత్రస్దాయికి వెళ్లి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు రెండో దశలో పిడుగురాళ్లలో 75 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. మార్కాపురంలో లో శరవేగంగా మెడికల్ కాలేజీ పనులు జరుగుతుంటే 15 నెలలుగా వాటి నిర్మాణానికి బ్రేక్ వేశారు.బాపట్లలో మెడికల్ కాలేజీ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. చెరువులో కడుతున్నారని చెబుతున్నారు. నువ్వు చెబుతున్న ఐకానిక్ టవర్ నిర్మాణం నీటిలో మునిగిపోతే.. నీటిని తోడడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు కేటాయించి.. ఆ రైతులను గాలికొదిలి, మరలా మరో 40 వేల ఎకరాలు అవసరం అని చెబుతున్నారు. అంతా మాటల కనికట్టు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కటే విషయం స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వాస్తవాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి మీరే నిజాలు నిగ్గు తేల్చాలని కోన రఘపతి ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

పార్టీ ఫిరాయింపులు.. దానం విషయంలో కీలక ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్లోనే ఉన్నట్టు తెలిపారు.హిమాయత్ నగర్ డివిజన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నారు. నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తానని పట్టుపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సెగ్మెంట్కు రాజీనామా చేసి.. ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని.. అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తురని సమాచారం. ఇక, ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది.

‘జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ‘కూటమి’కి ఉందా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దళితులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపీపై జనసేన నేతలు దాడి చేశారని సుధాకర్బాబు నిప్పులు చెరిగారు.‘‘గతంలో వైఎస్ జగన్ పట్ల లోకేష్, పవన్ అసభ్యంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడిన లోకేష్, పవన్పై ఎందుకు చర్యల తీసుకోలేదు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా’’ అంటూ సుధాకర్బాబు నిలదీశారు.‘‘చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు. ఎస్పీల సమావేశంలో చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని ఎస్పీలకు సూచించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అశాంతి కనిపిస్తుంది. ఆయన అసమర్థ పాలన గురించి జనం మాట్లాడుకోకుండా డైవర్షన్స్ చేస్తుంటారు. అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లకు అనుకూలమైన పోలీసులకే పోస్టింగులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది...రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లకు లేని ఆధారాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. పవన్పై ఒక్క మాట జారిన వ్యక్తిపై కేసులు పెట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారు. గతంలో పవన్ మాట్లాడిన మాటలకు ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలి. వాడు, వీడు.. యూస్ లెస్ ఫెలో అని మాట్లాడిన లోకేష్ పై ఎందుకు కేసులు పెట్టలేదు. మీ ప్రభుత్వంపై ప్రతీ ఒక్కరికీ నమ్మకం పోయింది. బాధితులపై తిరుగు కేసులు పెడుతున్న మీరు పోలీసులను కూర్చోబెట్టుకుని ఏం చెప్తారు’’ అంటూ సుధాకర్బాబు ప్రశ్నించారు.

‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. More than 200 days since the Srisailam Left Bank Canal tunnel collapsed, killing 8 hapless workers due to the criminal negligence of the corrupt Revanth GovtThis inefficient Congress govt couldn’t even retrieve the bodies of 6 victims, and hasn’t paid any compensation to the… pic.twitter.com/Rl11OwVJvf— KTR (@KTRBRS) September 14, 2025
Sports

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. భారత జట్టు ఓటమి
వన్డే ప్రపంచకప్-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఆదివారం ముల్లాన్పుర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో హర్మాన్ సేన పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో సత్తాచాటగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన మూనీ, లిచ్ఫీల్డ్అనంతరం 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.1 ఓవర్లలోనే చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫోబీ లిచ్ఫీల్డ్(80 బంతుల్లో 14 ఫోర్లతో 88), బెత్మూనీ(74 బంతుల్లో 9 ఫోర్లతో 77 నాటౌట్), సదర్లాండ్(51 బంతుల్లో 54 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్17న ముల్లాన్పుర్ వేదికగానే జరగనుంది.

కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ పేస్ ఆల్రౌండర్ తొలి బంతిని వైడ్గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో భారత ఫీల్డర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్తో కలిపి 55 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025

బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన అయూబ్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయూబ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాండ్యా.. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నిచాడు.అయూబ్ షాట్ అద్బుతంగా కనక్ట్ చేసినప్పటికి బంతి మాత్రం నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అయూబ్ తెల్లముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే భారత్ మ్యాచ్కు ముందు అయూబ్ను ఉద్దేశించి పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టెట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు.దీంతో అహ్మద్, అయూబ్ను కలిసి నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భారత్పై కనీసం ఒక్క పరుగు చేయలేకపోయావు, నీవా బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతావని" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా అయూబ్ వెనుదిరగగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మహ్మద్ హరిస్(3) ఔటయ్యాడు. అయితే వీరిద్దరి ఔటయ్యాక ఫఖార్ జమాన్(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉 Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025చదవండి: IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే Saim Ayub is gone! #Pakistan lose their first wicket. 🏏#PAKvIND #INDvsPAK pic.twitter.com/9p3V2jakgd— Maham Awan (@awanmaham_) September 14, 2025

IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
National

విమానం టేకాఫ్ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

Haridwar: అర్ధ కుంభమేళా-2027.. పుణ్య స్నానాల తేదీలివే..
హరిద్వార్ : అఖిల భారత అఖాడా పరిషత్ హరిద్వార్ అర్ధ కుంభమేళా- 2027కు ప్రతిపాదిత తేదీలను ఆమోదించడంతో ఈ ఉత్సవానికి కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరలో అర్ధ కుంభ క్యాలెండర్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు ఈ ఉత్సవం కోసం తరచూ సమావేశమవుతున్నారు. Haridwar | Chief Secretary Anand Bardhan conducted an on-site inspection of the mela area today to ensure that the 2027 Kumbh Mela in Haridwar is organized in a grand and divine manner, and to provide all essential facilities to the visiting devotees along with reviewing the… pic.twitter.com/8hcnP8ZnPe— ANI (@ANI) September 12, 2025హరిద్వార్లో జరిగే అర్ధ కుంభమేళా- 2027కు సంబంధించిన మూడు ప్రధాన పుణ్య స్నానాల షెడ్యూల్ ను అఖాడా పరిషత్ ఖరారు చేసింది. 2027 మార్చి 6, మార్చి 8, ఏప్రిల్ 14 తేదీలలో ఈ షాహీ స్నానాలు జరగనున్నాయని తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అర్ధ్ కుంభమేళా ప్రధానంగా హరిద్వార్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్)లలో జరగుతుంటుంది.

Delhi: 15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. రోజుకొక బహుమతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.అలాగే ఢిల్లీ కంటోన్మెంట్లోని రాజ్పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు.

పాక్తో భారత్ మ్యాచ్.. మోదీకి షాకిచ్చిన పహల్గాం బాధితులు
ఢిల్లీ: ఆసియా కప్ (Asia Cup)లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటన బాధితులు స్పందిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన తమ వారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథా అని అనిపిస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్పై పహల్గాం బాధిత కుటుంబాలు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాక్తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు. మీరు మ్యాచ్ ఆడాలి అనుకుంటే దాడి ప్రాణాలు కోల్పోయిన మా వారిని తీసుకురావాలి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్తో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.ఆపరేషన్ సిందూర్ ఎందుకు?మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందిస్తూ.. భారత్-పాక్ మ్యాచ్పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారు. మిలిగిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాక్తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్ను చూడకుండా బహిష్కరించాలని కోరారు.నా తమ్ముడిని తీసుకురండి: సావన్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సావన్ పర్మార్.. తన తండ్రితో పాటు సోదరుడు కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్పై సావన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథానేమో అనిపిస్తోంది. పహల్గాంలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడటం సరికాదు అని ఘాటు విమర్శలు చేశారు.మా బాధ మీకు పట్టదా?మరోవైపు.. సావన్ తల్లి కిరణ్ యతీష్ పర్మార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇలాంటి సమయంలో భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు జరుగుతోందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఈ మ్యాచ్ జరగకూడదు. నేను ప్రధానమంత్రి మోదీని అడగాలనుకుంటున్నాను. ఆపరేషన్ సిందూర్ ముగియనప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఒకసారి సందర్శించి, వారి బాధ ఎలా ఉందో చూడాలని దేశంలోని ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మా గాయాలు ఇంకా మానలేదు’ అని అన్నారు.
International
NRI

మందలించినందుకు తల నరికేశాడు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు. హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు. అసలేం జరిగింది? చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్లోని డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే హోటల్లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు. ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్ఫోన్ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. మారి్టనెజ్ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. కర్ణాటక వాసి నాగమల్లయ్య నాగమల్లయ్య స్వస్థలం భారత్లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం.

అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..)

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది.

విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ.1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తున్నారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఈరన్న ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకుగాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలో పదవతరగతిలో టాపర్గా వచ్చిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి సహాయం మరువలేనిదని ఈరన్న అన్నారు. తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అవ్వాలని తన కోరిక అని కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని, సహకరిస్తున్న తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లికి ఈ సందర్భంగా రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, మోషన్ రెసిడెన్షియల్ కళాశాల కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.(చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..)
Sakshi Originals

చదువుకొనాల్సిందే!
స్కూల్ ఫీజు అనగానే సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అయితే పెద్దగా భారం అనిపించదు. సమస్యల్లా ప్రైవేటు స్కూళ్లతోనే. ఎందుకంటే అక్కడ చదువు‘కొనాల్సిందే’. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా అవుతున్న సగటు ఖర్చుల్లో తేడా ఎన్నో రెట్లు ఉంటోంది. పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దేశంలో కిండర్గార్టెన్ (కేజీ) విద్య.. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకు ఏటా అయ్యే ఖర్చు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఉంది. ప్రీ–ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా అయ్యే వ్యయం.. గ్రామీణ ప్రాంతాల్లో 21.8 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 16.1 రెట్లు అధికంగా ఉంది. 9, 10వ తరగతులు (సెకండరీ), 11, 12 తరగతుల (హయ్యర్ సెకండరీ) విషయంలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది.కేంద్ర గణాంక శాఖ 2025 ఏప్రిల్–జూన్ మధ్య చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: ఎడ్యుకేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యయం అంటే.. స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ఇతరత్రా కార్యక్రమాలకోసం చేసే ఖర్చు; రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ.. ఇలా విద్యార్థి చదువు కోసం చేసిన మొత్తం ఖర్చు.

డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్

గుర్తుంచుకోండి
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్గా అన్నారట! అలాంటి జ్ఞానులు సాధారణ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీలేదని దీని సారాంశం. అయితే, మామూలు వ్యక్తులు మతిమరుపును అలా తీసేయడానికి వీల్లేదు. దానికి కారణాలేంటో గమనించి.. ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు.. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి.20లలో..25 ఏళ్లు వచ్చేసరికి మెదడు పూర్తిగా వికసిస్తుంది. నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవటం, గుర్తుతెచ్చుకోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ తగ్గుదల దశాబ్దానికి స్వల్పంగా 5% వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. 30లలో..మెదడు కణాల మధ్య సంకేతాలను ప్రసారం చేసే న్యూరో ట్రాన్స్మీటర్లు ముప్పైలలో తగ్గటం ప్రారంభిస్తాయి. జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడే రసాయనమైన డోపమైన్.. వయసు పెరిగే కొద్దీ దశాబ్దానికి 10% మేర తగ్గుతుంది. చేతి రాతే జ్ఞాపక మంత్రం!ఎక్కువ కాలం గుర్తుండాలంటే టైప్ చేయడానికి బదులుగా చేతితో రాయండి. దీనివల్ల మెదడులో జ్ఞాపకశక్తికి, అవగాహనకు అనుసంధానమై ఉండే భాగాలు బాగా పనిచేస్తాయని ‘సైకలాజికల్ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.40లలో..మధ్య వయసు నుంచి జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రారంభమవుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2012)లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. అధిక ఒత్తిడి సమయాల్లో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మెదడులో కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగాలను, ప్రక్రియను దెబ్బతీస్తుంది. ప్రాసెస్డ్ మీట్ వద్దు40 ఏళ్ల వయసులో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులను అతిగా తీసుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గుతోందని ‘న్యూరాలజీ జర్నల్’లో ప్రచురితమైన ఓ పరిశోధన సూచిస్తోంది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతల స్కోర్ ఎక్కువగా ఉందట. మాంసానికి బదులు నట్స్, బీన్స్ తీసుకుంటే ఈ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించుకోవచ్చట.50లలో..మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి వెళ్లి, మీరు దేనికోసం వెతుకుతున్నదీ మర్చిపోయారా? 50 ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమే. ఇందుకు కారణం మెదడులోని ‘రిఫ్రంటల్ కార్టెక్స్’ కుంచించుకుపోవడమే. సాధారణ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యం 45–55 ఏళ్ల మధ్య గరిష్ట స్థాయికి చేరుతుంది. మెనోపాజ్ కారణంగా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు ప్రభావితమవుతాయి. ఈ దశకు ‘బ్రెయిన్ ఫాగ్’ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘క్రాకింగ్ ది మెనోపాజ్’ పుస్తక రచయిత్రి ఆలిస్ స్మెల్లీ పేరుపెట్టారు.సానుకూల భావనతాళాలను ఎప్పుడూ ఒకే చోట పెట్టడం, ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల భావనతో ఉండే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల సారాంశం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు.. పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది.60లలో..ఈ వయసులో తరచుగా.. వ్యక్తుల పేర్లు, పదాలు గుర్తుకురాక సతమతమవుతుంటారు. అంతమాత్రాన వీరు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, కిక్కిరిసిన గ్రంథాలయంలో ఒక పుస్తకాన్ని దొరకపుచ్చుకోవటానికి సమయం పడుతుంది కదా.. అలాగే ఇదీనూ! శారీరక శ్రమక్రమం తప్పకుండా బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలి. వారంలో మూడు రోజులు ఇలా చేసే వృద్ధుల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్ సైజు ఏడాదికి 2% పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (2011) అధ్యయనంలో వెల్లడైంది. 70లలో..కొన్ని పేర్ల జాబితా చదివిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పేర్లు గుర్తుచేసుకునే సామర్థ్యం 20 ఏళ్ల వారితో పోల్చితే 70 ఏళ్ల వారిలో సగానికి తగ్గుతుంది. చిన్ననాటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోగలిగే వీరు.. నిన్న రాత్రి ఏం తిన్నారో మర్చిపోవచ్చు. దీనికి కారణం మెదడులో భావోద్వేగాల కేంద్రమైన ‘అమిగ్డలా’. యుక్తవయసు నాటి అనుభవాలు ఉద్వేగంతో కూడి ఉంటాయి కాబట్టి అమిగ్డలా సాయంతో వాటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు. కొత్త పనులు చేయండి‘ద జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఒకే రకం కాకుండా, కొత్త పనులు ప్రయత్నించే, ఉత్సాహంగా ఉండే వృద్ధుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడించాయి.80లలో..జ్ఞాపకశక్తి వేగంగా తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల సామర్థ్యం తగ్గిపోవటం వల్ల మెదడుకు రక్తప్రవాహం, ప్రాణవాయువు సరఫరా మందగించటమే ఇందుకు కారణం. వినికిడి సమస్య వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతరులు చెప్పేది వినటానికి అధిక శక్తిని మెదడు వినియోగించాల్సి రావటంతో, ఆ విషయాలను గుర్తుపెట్టుకోలేరు. ఒంటరితనం, కుంగుబాటు కూడా జ్ఞాపకశక్తిని క్షీణింపజేస్తాయి.నలుగురితో కలవండిఇతరులతో ఎక్కువగా కలుస్తూ, కలివిడిగా ఉంటే యాక్టివ్గా ఉంటారు. బలమైన సాంఘిక సంబంధాలుండే వృద్ధుల జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం (2015). వినికిడి పరికరాలు వాడని వృద్ధులతో పోలిస్తే, వాడే వారిలో జ్ఞాపకశక్తి 50%కి పైగా మెరుగ్గా ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం (2023).

చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో తదుపరి పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు మరోసారి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. వారితోపాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. – సాక్షి, స్పెషల్ డెస్క్డిజిటల్ బోర్డింగ్ పాస్ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును జోడించి తక్షణమే డిజిటల్ ‘బోర్డింగ్ పాస్’ పొందగలిగేలా నాసా ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. సేకరించిన పేర్లన్నీ ఓరియన్ లోపల ఇన్ స్టాల్ చేసే ఎస్డీ కార్డ్లో నిక్షిప్తం చేస్తారు. మొదటిసారిగా సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ మిషన్ లో వ్యోమగాములతోపాటు మీ పేరూ జాబిల్లిని చుట్టి వస్తుందన్నమాట. సో, సరదాగా గుర్తిండిపోయేలా మీ పేరుతో డిజిటల్ బోర్డింగ్ పాస్ చేజిక్కించుకునేందుకు మీరూ దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ 2026 జనవరి 21. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సామాన్యులనూ భాగస్వాములను చేయడం నాసా ప్రత్యేకత.కీలకమైన అడుగు10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి.. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు చుట్టూ తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు.
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
ఈ పక్షం.. పితృపక్షం
తుఫానులోనూ చెదరని ప్రశాంతత
ఆదిమ నిద్రకళ
అడకత్తెరలో ఇండియా
అభిషేక్, సూర్య మెరుపులు.. పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో
Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?
రిలీజ్కి సిద్ధమైన ధనుష్ 'ఇడ్లీ కొట్టు'
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. భారత జట్టు ఓటమి
ఎలిమినేషన్లో ట్విస్ట్.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఔట్!
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు..వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు
భారత్ తో ట్రంప్ ఎజెండా అమలుకు పని చేస్తా - కాబోయే అమెరికా రాయబారి
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు
Hyderabad: ఈ క్యూ రేషన్ కోసం కాదు, బంగారం కోసం!
ఓటీటీలోకి బోల్డ్ సిరీస్ కొత్త సీజన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
ఎస్తర్ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా?
మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. యత్నకార్యసిద్ధి
అందమైన జీవితానికి అర్థం ఈ దంపతులు..!
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అత్తతో అల్లుడు.. పక్కింటామెతో మామ..!
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
... మనం ఇక్కడ ‘ఏఐ’కే తావులేకుండా చేయాలి!
పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?
క్రైమ్

పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైసూ్కల్ కరస్పాండెంట్ మల్లే ల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైసూ్కల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి పనులకోసం వచ్చి ఇద్దరు ఏలూరు వాసులు గల్లంతయ్యారు. వివరాలు.. ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో పడి నలుగురు మృతిచెందారు. దాబా గ్రామానికి చెందిన మోర్లె నిర్మలాబాయి, ఆమె కుమారుడు గణేశ్, మరో ఇద్దరు బాలికలు వాడై మహేశ్వరి, ఆదె శశికళ శనివారం చికిలి వాగులో ఖాళీ యూరియా సంచులు కడిగేందుకు వెళ్లారు. నిర్మలాబాయి యూరియా సంచులు కడుగుతుండగా ఒక సంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న గణేశ్ ఆ సంచిని తెచ్చేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు అక్కడే ఉన్న బాలికలు శశికళ, మహేశ్వరి కూడా వాగులోకి దిగారు. వారుకూడా నీళ్లలో మునుగుతుండటం గమనించిన నిర్మలాబాయి రక్షించే ప్రయత్నంలో వారితో పాటే మునిగిపోయింది. గమనించిన నిర్మలాబాయి చిన్న కూతురు లలిత అరుస్తూ వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా వాగులో గాలించగా నిర్మలబాయి (33), గణేశ్ (12), మహేశ్వరి (10), శశికళ (8) మృతదేహాలు లభ్యమయ్యాయి. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్, మ«ధుకర్ ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. వాగులో కొట్టుకుపోయి కూలీల గల్లంతు.. వ్యవసాయ పనులు చేసేందుకు వచ్చిన కూలీల్లో ఇద్దరు వా గు ప్రవాహంలో గల్లంతయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు పత్తి పొలంలో కలుపు తీసేందుకు కూలీలను మాట్లాడాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడుకు చెందిన పాలడుగుల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి (55)తోపాటు మరో ఐదుగురు శనివారం వచ్చారు. అయితే, మధ్యాహ్న భోజనం తర్వాత భారీ వర్షం మొదలవడంతో కూలీలంతా ఇళ్లకు బయలుదేరారు. పొలానికి కొద్ది దూరంలోఉన్న అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగు దాటుతున్నా రు. ఈ క్రమంలో ఎగువ నుంచి గుబ్బల మంగమ్మ వాగు, కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో కూలీలు ఒడ్డుకు పరుగులు తీశారు. వీరిలో వెనకాల ఉన్న చెన్నమ్మ, వరలక్ష్మి మాత్రం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అశ్వారా వుపేట ఎస్సై యాయతీ రాజు, అగి్నమాపక శాఖ అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలి వద్ద గాలించినా రాత్రి వరకు కూలీల ఆచూకీ లభ్యం కాలేదు.

నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

అత్తతో అల్లుడు.. పక్కింటామెతో మామ..!
ధర్మవరం అర్బన్: పట్టణంలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం భార్యను భర్త హతమార్చి పాతిపెట్టాడు. కాలనీ వాసుల గుసగుసలతో అప్రమత్తమైన పోలీసులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న వెంకట్రాముడు, సరస్వతమ్మ దంపతులు ఆటోలో చిప్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ పనిలో సహాయకుడిగా ప్రశాంత్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో సరస్వతమ్మ, ప్రశాంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు సరస్వతమ్మ తన కుమార్తె మహాలక్ష్మిని ప్రశాంత్కు ఇచ్చి వివాహం చేసింది.ఆ తర్వాత కూడా ప్రశాంత్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రావడాన్ని వెంకట్రాముడు పసిగట్టాడు. తన భార్యపై అక్కసుతో తాము నివాసముంటున్న కాలనీలోనే మరో మహిళతో వెంకట్రాముడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతమ్మ, అల్లుడు ప్రశాంత్తో కలసి సదరు మహిళ కుమారుడుని కిడ్నాప్ చేసి.. వెంకట్రాముడు కిడ్నాప్ చేసినట్లుగా సదరు మహిళతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రాముడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి రెండు నెలల క్రితం వెంకట్రాముడు బయటకు వచ్చాడు. దీంతో ప్రశాంత్ తన భార్యను పిలుచుకుని అనంతపురానికి మకాం మార్చాడు. ఇంటికి చేరుకున్న వెంకట్రాముడు.. తనను జైలుకు పంపిన భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసి రెండు నెలల క్రితం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడు విజయ్ను పిలిపించుకుని మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనంపై మధ్యలో మృతదేహాన్ని ఉంచుకుని గొళ్లొళ్లపల్లి సమీపంలోని వంకలో పాతి పెట్టాడు. సరస్వతమ్మ కనిపించకపోవడంతో కాలనీవాసులు గుసగుసలాడుకోవడం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంకట్రాముడు, విజయ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహం బయటపడగానే అరెస్ట్ చూపే అవకాశలున్నాయి.
వీడియోలు


Hyderabad: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త


హైదరాబాద్ నగర శివారులో మితిమీరిన గంజాయి బ్యాచ్ ఆగడాలు


తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు


కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్


ఉపఎన్నికలకు జడుస్తున్నారా?


నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు


తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2 రోజులు కుండపోత..!


స్కూల్ కి వెళ్తూ మ్యాన్ హోల్ లో పడిపోయిన బాలిక


హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం


కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం రావడంలేదు: రామచందర్ రావు