Politics
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది.
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు.
అచ్చం ప్రధానిలాగే చేసిన సీఎం
కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు.కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.నందిగ్రామ్ స్థానానికి రాజీనామాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె కంచుకోటలాంటి భవానీపూర్లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు!
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాషాయ దళం సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించనుంది. ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం అనే మూడు ప్రధాన అజెండాలతో ఈ ప్రక్షాళన చేపడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.నితిన్ నబీన్ నుంచే మొదలు బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుల్లో ఒకరిగా నితిన్ నబీన్ ఇటీవలే నియమితులైన విషయం తెల్సిందే. ఆయన దగ్గర్నుంచే సంస్థాగత ప్రక్షాళన దిశగా పార్టీ ముందుకు సాగుతోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్గా తీసుకోవడంతో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కాస్తంత వాయిదాపడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర ఇన్చార్జిలు, మోర్చాల బాధ్యతల్లో పెద్దఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్రంగా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం.కొత్తగా నియమితులయ్యే నాయకుల్లో 55 ఏళ్లలోపు వారే అత్యధికంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇటీవలి కాలంలో పార్టీ 45–56 ఏళ్ల వయస్సున్న నాయకులను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంపిక చేస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వయస్సు 56, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్కు 56 ఏళ్లు, విజయ్ శర్మకు 52 సంవత్సరాలు. ఇక బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి వయస్సు 55. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వయస్సు 50, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వయస్సు 53 ఏళ్లు. గుజరాత్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కేబినెట్ సగటు వయస్సు 59 నుంచి 52కి తగ్గింది. అదే మాదిరిగా పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కీలక మార్పులు ఉంటాయి’ అని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన యువ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం, బూత్ స్థాయి నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొత్తగా చోటుచేసుకునే మార్పుల్లో భావజాలానికి కట్టుబడి పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కేంద్ర కేబినెట్లోనూ మార్పులు? పార్టీ నిర్మాణంతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సైతం చేపట్టే అవకాశమున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని యువత తో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త వారిని కొందరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 2021 నుంచి పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.చదవండి: ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో!మోదీ 2.0 రెండో దఫా ప్రభుత్వంలో చేరిన 34 మంది మంత్రుల్లో 19 మంది కేబినెట్ హోదాతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు, శాఖల పనిభారం, రాజకీయ సమీకరణలపై సమీక్ష చేపట్టి, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సామాజిక వర్గాల సమీకరణ, యువతను ఆకర్షించడం, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతోనే ఈ ప్రక్షాళన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాషాయ దళ నేతల ప్రధాన వ్యూహంగా ఉంటుందని అంటున్నారు.
Sports
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
Punjab Kings vs Mumbai Indians Live updates and Highlights: ఐపీఎల్-2026 సీజన్లో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. ఓమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6.3 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 61/1దూకుడుగా ఆడుతున్న రికెల్టన్3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(24), రోహిత్ శర్మ(4) పరుగులతో ఉన్నారు.చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓమర్జాయ్(17 బంతుల్లో 38), బార్ట్లెట్(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు, బాష్, బావా తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడిన ఓమర్జాయ్అజ్మతుల్లా ఓమర్జాయ్ దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 38 పరుగులు చేసి ఎనిమిదో వికెట్గా వెనుదిరగాడు. అతడి కంటే ముందు జాన్సన్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.పంజాబ్ ఆరో వికెట్ డౌన్పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. కార్భిన్ బాష్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.పంజాబ్ ఐదో వికెట్ డౌన్సూర్యాంశ్ షెడ్గే రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో సూర్యాంశ్ ఔటయ్యాడు.పంజాబ్ నాలుగో వికెట్ డౌన్కూపర్ కొన్నోలీ రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కొన్నోలీ రాజ్ బావా బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 122-4పంజాబ్ మూడో వికెట్ డౌన్పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 11.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 107/3పంజాబ్ తొలి వికెట్ డౌన్50 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. దీపక్ చాహర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.దూకుడుగా ఆడుతున్న ప్రియాన్ష్5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), ప్రభ్సిమ్రాన్ సింగ్(23) ఉన్నారు.3 ఓవర్లకు పంజాబ్ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(9), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.ఐపీఎల్-2026 సీజన్లో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయం కారణంగా దూరంగా కాగా.. ఇప్పుడు పంజాబ్తో మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ముంబై జట్టులోకి శార్ధూల్ ఠాకూర్తో పాటు రఘు శర్మ తిరిగొచ్చారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మూడు మార్పులు చేసిది. హర్ప్రీత్ బ్రాక్, జేవియర్ బార్ట్లెట్, ఓమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లుముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రఘు శర్మపంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
10,000 రన్స్.. 380 వికెట్లు! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ డాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ తన 19 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200 మ్యాచ్లు హాంప్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.2026 కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా హాంప్షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్నమెంట్ మధ్యలోనే అతడు తప్పుకోని అందరికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే డాసన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.వైట్ బాల్ క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది."నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.వైట్-బాల్ క్రికెట్లో నా కెరీర్ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్షైర్ తరపున 200కు పైగా మ్యాచ్లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. ఈ క్రికెట్ క్లబ్తో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో 218 మ్యాచ్లు ఆడిన డాసన్.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
ఈ ఏడాది జూన్లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు.ఇక ఈ జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్లలో 236.56 స్ట్రైక్-రేట్తో 440 పరుగులు సాధించాడు.ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా-ఎ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్లు గాలే వేదికగా జరగనున్నాయి.భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్చదవండి: హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!
హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!
ఐపీఎల్-2026 లీగ్ దశ ముగింపునకు వచ్చింది. ఇంకో పది రోజుల్లో (మే 24) లీగ్ స్టేజీ పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన నివేదిక తెరమీదకు వచ్చింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ముగ్గురు కెప్టెన్లపై వేటు పడనుందని దాని సారాంశం.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలం-2025లో అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆటగాడిగా, కెప్టెన్గా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పూర్తిగా తేలిపోతున్నాడు.చెత్త ప్రదర్శనగతేడాది చెత్త ప్రదర్శనతో జట్టును ఏడో స్థానంలో నిలిపిన పంత్.. తాజా ఎడిషన్లోనూ వైఫల్యాలు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి 11 మ్యాచ్లు పూర్తి చేసుకున్న లక్నో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది.వ్యక్తిగతంగానూ పంత్ ప్రదర్శన బాగాలేదు. పదకొండు ఇన్నింగ్స్లో కలిప కేవలం 251 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కూడా విమర్శల పాలవుతున్నాడు. పన్నెండు మ్యాచ్లలో కలిపి 100 పరుగులే చేసిన ఈ ఆల్రౌండర్.. కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.అక్షర్ అంతంత మాత్రమేలీగ్ దశలో అక్షర్ సేన ఇప్పటికి 12 మ్యాచ్లు పూర్తి చేసుకుని ఐదు గెలిచి పట్టికలో ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను వదులుకుని మరీ.. రహానేకు పగ్గాలు ఇచ్చింది కోల్కతా నైట్ రైడర్స్.రహానేదీ అదే బాటగతేడాది డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్.. పద్నాలుగింట ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటికి పదకొండింటిలో నాలుగు గెలిచి ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక రహానే 11 ఇన్నింగ్స్ ఆడి 237 పరుగులే చేశాడు.వేటుకు రంగం సిద్ధంఈ నేపథ్యంలో ఐపీఎల్ సన్నిహిత వర్గాలు పీటీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ఆఖరి నాటికి వాళ్లు తమ పదవులు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందకు సంబంధించిన ఫ్రాంఛైజీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.అక్షర్ పటేల్, అజింక్య రహానే, రిషభ్ పంత్ గత రెండు సీజన్లలో సారథులుగా విఫలమవుతున్నారు. ఒక్కసారి కూడా జట్లను ప్లే ఆఫ్స్ దిశగా తీసుకువెళ్లలేకపోయారు’’ అని పేర్కొన్నాయి. ముఖ్యంగా పంత్ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. అతడి వ్యూహాలు బెడిసికొట్టడం ఫ్రాంఛైజీకి తలనొప్పిగా మారిందని తెలిపాయి.మరి హార్దిక్ పరిస్థితి ఏంటి?పంత్, అక్షర్, రహానే సంగతి ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా గురించి మాత్రం సదరు వర్గాలు స్పందించలేదు. 2024లో ముంబై కెప్టెన్గా వచ్చిన హార్దిక్ తొలి ఏడాది అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. గతేడాది ప్లే ఆఫ్స్ చేర్చినా.. ఈ ఏడాది పదో స్థానం కోసం ముంబై లక్నోతో పోటీపడుతోంది. ఇప్పటికే గాయం సాకుతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడు. త్వరలోనే అతడిపై వేటు పడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా నివేదికలో అతడి పేరు లేకపోవడం గమనార్హం.చదవండి: బ్లాక్మెయిల్ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్
National
ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్ హీరోలా సంపాదిస్తాడేమో..
హౌరా: పశ్చిమ బెంగాల్ శిబ్పూర్లోని తృణమూల్ కాంగ్రెస్ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.శిబ్పూర్ కేసులో, హెచ్ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్మెంట్లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు. అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. #BengalShocker | TMC leader’s house raided, gold bed and secret basement uncovered!The entire police team was stunned during the raid on TMC leader Shamim Ahmed’s residence in Shibpur, Howrah.Police reportedly discovered a hidden luxury flat through a trap door, featuring a… pic.twitter.com/JGDCVrY0Pu— Organiser Weekly (@eOrganiser) May 14, 2026పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా, శిబ్పూర్లో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే ఇల్లు.👇బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినప్పుడు, మొత్తం బృందం దిగ్భ్రాంతికి గురైంది....ఎందుకంటే టీఎంసీ ఎమ్మెల్యే షమీమ్ అహ్మద్ ఇంట్లో ఒక బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు, రహస్యంగా ఉన్న నేలమాళిగ నుండి… pic.twitter.com/UrXY3uRpIv— JSP Naresh (@JspBVMNaresh) May 14, 2026
బిగ్ క్యాట్, బిగ్ మిషన్ : భారత్కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: బిగ్ క్యాట్లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్క్యాట్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) సమ్మిట్–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్ వీటిని నిర్వహించబోతోంది. భారత్లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పులుల సంరక్షణలో మనమే ఆదర్శంప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ టైగర్’(ఎన్టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్ కార్యక్రమంలో టైగర్ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్ సింహాలు కేవలం భారత్లోనే ఉండటంతో గిర్ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్ లయన్’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు. ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!మనుషుల మధ్యే చిరుతల సహజీవనంభువనేశ్వర్లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్టక్లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్మీదే పెళ్లిచీతాల పునరావాసంలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపుమధ్యప్రదేశ్లోని భోపాల్ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్ క్యాట్ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్కు వేదికగా నిలవనున్నాయి. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఐదు రాష్ట్రాల్లో బిగ్ క్యాట్లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..ఆసియా సింహం – గిర్(గుజరాత్)చీతా – భోపాల్(మధ్యప్రదేశ్)చిరుత – భువనేశ్వర్(ఒడిశా)మంచు చిరుత – గ్యాంగ్టక్(సిక్కిం)పులి – చంద్రపూర్(మహారాష్ట్ర)
లాయర్ మమతా వివరాలు ఇవ్వండి: బీసీఐ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కలకత్తా హైకోర్టు ముందు హాజరైన కొన్ని గంటల తర్వాత ఆమె లాయర్ వివరాలను ఇవ్వాలంలూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ).. రాష్ట్ర బార్ కౌన్సిల్కు లేఖ రాసింది. న్యాయవాదిగా నమోదు, ప్రాక్టీస్ హోదాకు సంబంధించిన వివరాలను కోరింది. అంతకుముందు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కోల్కత్తా హైకోర్టు ముందు హాజరై, బెంగాల్లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఒక కేసులో వాదనలు వినిపించారు. దాంతో మమతా బెనర్జీ మరోసారి హైలైట్ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె న్యాయవాది వృత్తికి సంబంధించిన అన్ని వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ అంశానికి సంబంధించి మే 16వ తేదీ లోగా అంటే శనివారంలోపు ‘లాయర్ మమతా’ పూర్తి వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ బార్ కార్యదర్శికి లేఖ రాసింది బీసీఐ. మమతా లాయర్ దుస్తుల్లో హైకోర్టు ముందు హాజరైన విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది బీసీఐ. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లోమాజీ సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అయితే ఓ కీలక కేసుకు సంబంధించి ఆమె హైకోర్టుకు హాజరైన క్రమంలో మాజీ సీఎం కాస్తా.. లాయర్ మమతాగా అవతారమెత్తారని జనం అనుకుంటున్నారు.
ఆ రోజు సూర్యుడి చూపంతా ఇండియా పైనే!
ఆ రోజు సూర్యుడి చూపంతా ఇండియా పైనే! ఏరోజు? ఎందుకు? ఎలా? ప్రశ్నలన్నీ మనసులోకి వచ్చాయి కదా! ఆగండాగండి. అది ఏప్రిల్ నెలాఖరు 27వ తేదీ. ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఆ రోజు ప్రపంచమంతా సాధారణం కంటే వేడెక్కింది. అయితే, అత్యంత వేడి నగరాల్లో మొదటి 50 నగరాలు ఒక్క మన దేశంలోనే నమోదయ్యాయి. గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ సంస్థ ఈ విషయం వెల్లడించింది. యూపీలో ఎక్కువ...ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా నగరం ఏక్యూఐ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగానే ఇక్కడ వేసవిలో తీవ్రమైన వేడి ఉంటుంది. ఇక, ఏప్రిల్ 27న బాందాలో ఉష్ణోగ్రతలు 115.16 ఫారహీట్స్కు, అంటే 46.2చేరుకున్నాయి. ఆ రోజు భూగోళంపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఆ రోజు తెల్లవారుజామునే బాందాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 34.72222 డిగ్రీలు. అయితే ఒక్క రోజు డేటాను ఒక ధోరణిగా పరిగణించకపోయినా... దేశం మాత్రం వాతావరణ సంక్షోభం ఎదుర్కొంటోందని వాతావరణ శాస్త్రవేత్త మాక్సిమిలియానో హెర్రెరా తెలిపారు. ముందే వచ్చిన వేసవి.. అయితే వేసవిలో ఎండలు సాధారణమే. కానీ ఈసారి మాత్రం అసాధారణ ఎండలున్నాయి. గతంలో కంటే మన దేశంలో వేసవి ఈసారి ముందుగానే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన వేడి నమోదైంది. ఇది కాలానుగుణ సగటు కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువ. రానురాను దేశంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా అంటే... 2050 నాటికి ఆరోగ్యవంతులైన మనుషులు కూడా తట్టుకుని జీవించలేని స్థాయికి చేరుకుంటుందని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ వేడి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమ వుతారని చెబుతున్నారు. ఈ నెల చివరలో మధ్య, తూర్పు భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హీట్ ఇండెక్స్ 122 నుంచి 140 డిగ్రీల ఫారన్హీట్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని స్థాయని హెర్రెరా హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
International
NRI
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt)
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్గా పనిచేస్తున్నారు.
Sakshi Originals
అమ్మ అంటే.. అంతులేని బలం
ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా. మరి అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? నిజానికి అమ్మకు అసలు సిసలు గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఆమె చెప్పిన మాటను పాటించడం. అలా పాటిస్తే... మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అమ్మ మాటను విజయానికి బాటగా చేసుకున్నారు. ‘అమ్మ నా వెనుక ఉంది’ అనుకుంటే వారికి ఎంతో బలంగా ఉండేది. ‘అమ్మ నాతో ఉంది’ అనుకుంటే ఎంతో సందడిగా, సంతోషంగా ఉండేది. ‘అమ్మ ఆశీర్వచనం ఉంది’ అని గుర్తు తెచ్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగేది. విజయం చేరువయ్యేది. ఎందరో మహానుభావులు... అందరికి వెనుక అమ్మ ఉంది...నా ప్రపంచం అమ్మకు మాత్రమే తెలుసు!ప్రఖ్యాత శా్రçస్తవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకంలో తన తల్లి గురించి ఇలా కవితాత్మకంగా రాశారు...‘నాకు పదేళ్ల వయసున్న ఆరోజు ఇంకా గుర్తుందిఅన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అసూయపడేలా....నీ ఒడిలో నిద్రిస్తున్నప్పటి సంగతి. అది ΄పౌర్ణమి రాత్రి.నా ప్రపంచం నీకు మాత్రమే తెలుసు అమ్మా... నా అమ్మా!అర్ధరాత్రి, నా మోకాళ్లపై కన్నీళ్లు జారుతుండగా... నేను మేల్కొన్నప్పుడు...నీ బిడ్డ బాధ నీకు తెలుసు, నా అమ్మా నీ శ్రద్ధగల హస్తాలు నా బాధను సున్నితంగా తుడిచివేశాయినీ ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ నాకు బలాన్ని ఇచ్చాయి.అమ్మకు ఇచ్చిన మాటగాంధీజీ లా చదవడం కోసం ఇంగ్లాండ్కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడైన ఆంగ్లేయుడు పరిచయం అయ్యాడు. కొన్ని మాటల తరువాత మాంసం ప్రస్తావన వచ్చింది.‘నేను తినను’ అని చెప్పారు గాంధీజీ‘ఇంగ్లాండ్లో ఎంతో చలిగా ఉంటుంది. అక్కడ మాంసం లేకుండా బతకడం అసాధ్యం’ అన్నాడు ఆంగ్లేయుడు.‘అక్కడి ప్రజలు మాంసం లేకుండా కూడా జీవించగలరని విన్నాను’ అన్నారు గాంధీజీ.‘పచ్చి అబద్ధం. మాంసం తినకుండా అక్కడ జీవించడం అసాధ్యం. అది లేకుండా మీరు జీవించలేరు’ అన్నాడు ఆంగ్లేయుడు.‘మీ సలహాకు థ్యాంక్స్. కాని నేను మా అమ్మకు మాంసం తినను అని మాట ఇచ్చాను. ఒకవేళ అది లేకుండా జీవించడం అసాధ్యం అని తేలితే నేను భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడతాను’ అన్నారు గాంధీజీ.తియ్యటి ఆ పిలుపు ఎప్పుడూ గుర్తుంటుంది! సచిన్ తెందూల్కర్ తల్లి పేరు...రజని.‘ఆమె ప్రోత్సాహం, ప్రార్థనలు నాకు వెన్నుదన్నుగా ఉన్నాయి. అమ్మ నా బలం’ అనేవారు సచిన్.చిన్నప్పుడు సచిన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు...‘సచిన్... సచిన్’అంటూ పిలిచేవారు రజని.‘సచిన్... సచిన్ అనే అమ్మ పిలుపు తీయగా ఉంటుంది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది’ అంటారు సచిన్.‘ప్రతి తల్లి తన బిడ్డ ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరుకుంటుంది. సచిన్ విషయంలో నేను కూడా అంతే’ అనేవారు రజని.
నేటి అమ్మ మేటి యోధ
వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.నాకు నేను మిగలాలిపెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.80శాతం తృప్తి చాలుఆఫీసులో ప్రమోషన్ కోసం మీటింగ్ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్ చేసుకుంటోంది. ‘గిల్ట్’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్ ఉమన్’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.నా శరీరం నా కవచండెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్ మీడియాలో ‘ఫిట్ మామ్’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది. వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్ హెల్త్’ తన టార్గెట్ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.నేను ముద్దాయిని కానుపిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్ చేస్తోంది.నా రేపటి చూపుపిల్లాడి స్కూల్ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్లైన్లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్ డిస్కస్ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.నా టాలెంట్ నా కల పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్ అవ్వాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్ క్లాస్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా. అమ్మా... మము కన్నందుకు పాదాభివందనందేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్ డే’ అని చెప్పి స్టేటస్ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు.
మీ వంటింట్లోని ప్లాస్టిక్ ప్రాణాంతకమా
మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్ నుంచి లంచ్ బాక్సుల వరకు ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగున ఒక చిన్న త్రిభుజం.. అందులో ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? అసలు ఆ నంబర్లు దేనిని సూచిస్తాయి? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం? ఎంత వరకు ప్రమాదకరం? ఈ ఆసక్తికర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వర్గీకరణ.. సొసైటీ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ (ఎస్పీఐ) అనే సంస్థ 1988లో ప్లాస్టిక్ను ఏడు రకాలుగా వర్గీకరించింది. ఈ వర్గీకరణ వ్యవస్థను రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ (ఆర్ఐసీ) అని పిలుస్తారు. ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటికున్న రీసైక్లింగ్ సామర్థాన్ని బట్టి వాటికి 1 నుంచి 7 నంబర్లను కేటాయించారు.1 పీఈటీ: సాఫ్ట్ డ్రింక్ సీసాలు, వాటర్ బాటిళ్ల తయారీకి ఈ రకం ప్లాస్టిక్ని వాడతారు. వాటిని పదేపదే ఉపయోగిస్తే యాంటిమోనీ అనే హానికర రసాయనాలు వెలువడవచ్చు. అత్యధికంగా రీసైకిల్ అవుతున్న ప్లాస్టిక్ ఇది. 2హెచ్డీపీఈ: పాల డబ్బాలు, షాంపూ బాటిళ్లు, డిటర్జెంట్ డబ్బాలకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. రసాయనాల విడుదల తక్కువ. సులభంగా రీసైకిల్ చేయవచ్చు. 3 పీవీసీ (వినైల్): పైపులు, పిల్లల బొమ్మలు, క్లింగ్ ఫిల్ములు (గాలి చొరబడకుండా గిన్నెలపై మూతలుగా వాడే ప్లాస్టిక్ షీట్స్) తయారు చేసేందుకు వాడతారు. అయితే దీన్ని ‘పాయిజన్ ప్లాస్టిక్’అంటారు. ఇందులో కేన్సర్ కారక డయాక్సిన్లు, థాలేట్లు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. 4 ఎల్డీపీఈ: ప్లాస్టిక్ కవర్లు, బ్రెడ్ ప్యాకెట్లకు వాడతారు. ఇది కూడా కొంతవరకు సురక్షితమైనదే. కొన్ని అవసరాలకు మాత్రమే రీసైకిల్ చేస్తారు. 5 పీపీ: పెరుగు కప్పులు, సిరప్ బాటిళ్లు, వేడి ఆహార కంటెయినర్లకు వాడతారు. వేడిని తట్టుకుంటుంది. దీనిని కూడా సురక్షితమైన రకంగానే పరిగణిస్తారు. రీసైక్లింగ్ సాధ్యమే. 6 పీఎస్ (పాలీస్టెరీన్): ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, టీ–కప్పులు, ప్యాకింగ్ మెటీరియల్, ఎగ్ కార్టన్స్, ధర్మోకోల్ తయారీకి వాడతారు. వేడి తగిలితే స్టెరీన్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా దీనిని రీసైకిల్ చేయరు. చేయడం కూడా కష్టం. 7 ఇతర ప్లాస్టిక్లు: నైలాన్, సన్ గ్లాసెస్, బేబీ బాటిల్స్ (కొన్ని రకాలు) తయారు చేస్తారు. ఇది మిశ్రమ ప్లాస్టిక్. రీసైక్లింగ్ దాదాపు అసాధ్యం.పర్యావరణ నిపుణుల సూచనల ప్రకారం 2, 4, 5 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వాడటం కొంత వరకు సురక్షితం. కానీ 3, 6, 7 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారాన్ని ఓవెన్లో వేడి చేయడం లేదా వేడి పదార్థాలను ఉంచడం మానుకోవాలి. ఈసారి మీరు కొనే ప్లాస్టిక్ బాటిల్ అడుగున నంబర్ చూడటం మర్చిపోకండి!
అమ్మ ప్రేమకో నూలుపోగు
చిన్నప్పుడు అమ్మ మన చేయి పట్టుకుని బజారుకు తీసుకెళ్లి ఎన్నో కొని పెట్టి ఉంటుంది. మనం అమ్మకు ఏదైనా కొని పెట్టి ఎంతకాలం అయ్యింది? అమ్మ ఏమీ అడగదు... పిల్లలకు ఇబ్బంది అని. కాని చిన్నప్పుడు మన ప్రతి ఇబ్బందిని వెయ్యి కళ్లతో చూసి దూరం చేసి ఉంటుంది. మే 10 మదర్స్ డే. ఇక్కడున్న బహుమతులన్నీ మీరు అమ్మకు ఇవ్వొచ్చు. అన్నీ కలిపినా పదీ పదిహేను వేలు మించవు. అమ్మ ప్రేమ ముందు ఆ విలువ దిగదుడుపు కదూ.1. ఎలక్ట్రికల్ హాట్ వాటర్ బ్యాగ్మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో అమ్మ రాత్రిళ్లు నిద్రపోదు. కాపడం పెట్టుకోవడానికి గ్యాస్ మీద నీళ్లు కాచి పొయ్యి దగ్గర నిలబడే ఓపిక ఉండదు. మనందరం ఆమె ఇంటి సభ్యులమే. కాని ఎవరు ఏ పనిలో ఉన్నారో అని అమ్మ డిస్ట్రబ్ చేయదు. మౌనంగా నొప్పులు భరిస్తుంది. ఆమెకు ఈ హాట్ వాటర్ బ్యాగ్ కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ బ్యాగ్ను అయిదు నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటలు వేడిగా ఉంటుంది. రాత్రి పక్కలో పెట్టుకుంటే వెన్ను నొప్పి మాయం, హాయిగా నిద్ర. ‘వీడు నా నొప్పిని గుర్తుపెట్టుకున్నాడు’ అమ్మ తృప్తి పడితే ఎంత సంతోషం! వెల: రూ.300 నుంచి.2. నాన్–స్లిప్ స్లిప్పర్స్ + బాత్రూమ్ హ్యాండిల్ బార్‘అమ్మా జాగ్రత్త‘ అని ఫోన్ లో చెప్తాం కానీ బాత్రూమ్లో జారి పడితే లేపడానికి ఉండం. ఈ స్లిప్పర్స్ వేసుకుంటే తడి నేల మీద కూడా జారదు. గోడకి ఒక హ్యాండిల్ బార్ బిగిస్తే పట్టుకుని లేవొచ్చు, అమ్మ కోసం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మ నిద్ర పోయే ముందు ఆమె పాదాలు నొక్కుతూ కూర్చునే టైమ్ ఉండటం లేదు. కనీసం ఈ స్లిప్పర్స్తో అయినా కొంత పరిహారం చేసుకోవచ్చు. వెల: రూ.800 నుంచి3. బిగ్ బటన్ ఫోన్ విత్ ఎస్.ఓ.ఎస్స్మార్ట్ఫోన్ ఇస్తే అమ్మకి కన్ ఫ్యూజన్. లాక్ తియ్యడం, వాట్సాప్ చేయడం... ఒక్కోసారి రాంగ్ నంబర్కి కాల్ వెళ్తుంది. అదే ఈ ఫోన్ లో అయితే నంబర్లు పెద్దగా కనిపిస్తాయి. పైగా మూడు ఫోటో బటన్లు ఉంటాయి. మన ఫోటో నొక్కితే డైరెక్ట్గా మనకే కాల్ వస్తుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అయిదు నంబర్లకి కాల్, మెసేజ్ వెళ్తుంది. అమ్మకు మనం గుర్తు పెట్టుకుని ఫోన్ చేయకపోయినా అమ్మ మనల్ని గుర్తు పెట్టుకొని ఫోన్ చేయడానికి ఇదే మంచి కానుక. వెల: 1200 నుంచి.4. రీడింగ్ గ్లాసెస్అమ్మకు కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఆమెకు కొత్త అద్దాలు మార్చి ఎంత కాలం అయ్యింది? మంచి రీడింగ్ గ్లాసులు కొని పెడితే ఆమె చదువుకునే గీత, రామాయణం స్పష్టంగా కనపడతాయి. న్యూస్పేపర్ హాయిగా చదువుకోవచ్చు. టీవీ సీరియల్ కంటే ఈ పుస్తకం మనశ్శాంతి ఇస్తుంది, టైమ్పాస్ అవుతుంది. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, రాముడి కథ చెప్పి నిద్రపుచ్చింది. ఇవాళ మనం ఇచ్చిన కళ్లజోడు ఆవిడకి కథల పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడి నిద్ర పుచ్చుతాయి. రూ. 500 నుంచి.5. వాకింగ్ స్టిక్ విత్ ఎల్.ఇ.డి. లైట్ ప్లస్ సీట్ఒక వయసుకు వచ్చాక గుడికి వెళ్లాలన్నా, మార్కెట్కి వెళ్లాలన్నా ‘తోడు ఎవరున్నారు‘ అనే భయం అమ్మకు. ఈ స్టిక్ పట్టుకుంటే ఆసరాగా ఉంటుంది. అలిసిపోతే మడత విప్పి సీట్ మీద కూర్చోవచ్చు. రాత్రి కరెంట్ పోయినా ఎల్ఇడి లైట్ వెలిగిస్తే దారి కనపడుతుంది, కాలు జారదు. ‘అమ్మా, నువ్వు నడవలేవులే‘ అని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ‘ఈ స్టిక్ పట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు‘ అని ధైర్యం ఇస్తే అదే అసలైన గిఫ్ట్. రూ. 1000 నుంచి.6. మెడిసిన్ ఆర్గనైజర్ బాక్స్ విత్ అలారంషుగర్, బీపీ, కీళ్ల నొప్పులు... రోజుకి నాలుగు రకాల మాత్రలు. ‘వేసుకున్నానో లేదో‘ అని అమ్మ కన్ ఫ్యూజ్ అవుతుంది. ఒకోసారి రెండుసార్లు వేసుకుంటుంది. ఈ బాక్స్లో ఏడు రోజుల మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లెక్కన విడివిడిగా సర్దొచ్చు. టైమ్కి అలారం మోగితే తిప్పలు లేకుండా వేసుకుంటుంది. మనకు జ్వరం వస్తే అర్ధరాత్రి లేచి మరీ మాత్ర వేసిన అమ్మకు ‘అమ్మా, నీ ఆరోగ్యం నాకు గుర్తుంది‘ అని చెప్పే కానుక ఇది. రూ.700 నుంచి.7. ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్‘తలనొప్పిగా ఉంది... కళ్లు తిరుగుతున్నాయి’... అని అమ్మ అంటే వెంటనే హాస్పిటల్కి పరుగెత్తక్కర్లేదు. చేతికి కట్టి బటన్ నొక్కితే 30 సెకన్లలో బి.పి, పల్స్ రీడింగ్ ఇస్తుంది. డాక్టర్కి ఫోన్ లో చెప్పొచ్చు, వైద్య సలహా తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం జారి పడితే అమ్మ గుండె వేగం పెరిగేది, ఇవాళ ఆవిడ గుండె లయ తప్పకుండా చూసే బాధ్యత మనది. ‘అమ్మా, నీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది, ఇదిగో మిషన్ పెట్టి చూస్తున్నా’ అని భరోసా ఇవ్వొచ్చు. వెల: రూ.15008. మెత్తటి కాటన్ నైటీలు – 2 జతలుఅమ్మ ఇంట్లో వేసుకునే బట్టల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టామా? చిరిగిపోయిన, వెలిసిపోయిన, బిగుతుగా ఉండే నైటీతోనే రాత్రిళ్లు నిద్రపోతుంది. ‘నాకు కొత్త బట్టలేందుకురా, ఉన్నవి చాల్లే‘ అంటుంది. కానీ మెత్తటి, లూజ్గా, చెమట పీల్చే కాటన్ నైటీ వేసుకుంటే ఆవిడకి హాయిగా నిద్రపడుతుంది. ముఖ్యంగా వేసవిలో. లేత రంగు, పెద్ద సైజు, ముందు జిప్ లేదా బటన్స్ ఉన్న రెండు జతల నైటీలు కొనివ్వండి. చిన్నప్పుడు స్కూల్ యూనిఫాం మాసిపోకుండా, మడత నలగకుండా అమ్మే ఇస్త్రీ చేసి వేయించేది. ఇవాళ ఆవిడ సౌకర్యంగా ఉండటానికే అమ్మ ప్రేమకో నూలుపోగు. వెల: రూ.1200 నుంచి 2 జతలకి.కె.
పంత్కు షాక్.. కిషన్కు జాక్పాట్!
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం
ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక
మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే
అయోధ్యలో భూమి కొన్న రణబీర్ కపూర్: ధర ఎంతంటే?
అరవింద్ కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ చర్యలు
జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
కేరళ కాంగ్రేస్ సీఎం ఎంపికపై కొనసాగుతున్న సంక్షోభం
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
ఎక్కడా లేని కొత్త వింతలు ఆలకించండి సార్!
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
‘నాన్నని వద్దంటున్న అమ్మ’.. కలెక్టర్ను కలిసిన చిన్నారులు
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పదోన్నతి అవకాశాలు
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ప్రధాని మోదీ కీలక నిర్ణయం
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
క్రైమ్
నా భర్త సరైనోడు కాదు..!
బనశంకరి: బెంగళూరులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టి.. బ్లాక్మెయిల్ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో సాధనాశెట్టిని కార్తీక్పుతా లైంగికంగా వేధించాడని అతని భార్య హర్షిత జయనగర పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. అసలు దోషి తన భర్తే అని.. అక్రమ సంబంధాలు దాచి పెట్టేందుకు సాధనాశెట్టిపై ఫిర్యాదు చేశాడని ఆరోపించింది. వివరాలు.. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టిని వ్యాపార ప్రచారం కోసం మేకప్ క్లినిక్ యజమాని కార్తీక్పుతా కలిశాడు.తొలుత వీరి మధ్య ప్రారంభమైన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. అనేకచోట్ల ఇద్దరూ తిరిగారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లైంగికంగా వాడుకున్నాడంటూ సాధనాశెట్టి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసింది. గత ఏడాది హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో కార్తీక్పుతా.. సాధనాశెట్టి మొబైల్ చోరీకి పాల్పడ్డాడు. అంతేకాక లైంగిక సంబంధం దాచిపెట్టడానికి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పెట్టుకుని హనీట్రాప్కు పాల్పడుతోందని ఆరోపిస్తూ జయనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సాధనాశెట్టిపై కార్తీక్పుతా ఫిర్యాదు చేశాడని భార్య హర్షిత చెబుతోంది. కార్తీక్పుతా బిజినెస్మెన్ కాదు. కాస్మోటిక్ మార్కెటింగ్ చేసేవాడు. యువతి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని హనీట్రాప్ అంటూ ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడని భార్య చెబుతోంది.
వివాహేతర సంబంధం.. భర్త, మామను హత్య చేసిన కోడలు..!
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు. ఉలిక్కిపడిన బెల్లారంపల్లి వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు. భర్త జమ్మూకశ్మీర్లో ఉంటే..మాదేష్ జమ్మూకశ్మీర్లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.
నీట్ పేపర్ లీక్.. సంచలన విషయాలు
నాసిక్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన వివరాలు, సోషల్ మీడియాలో లభించిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.నాసిక్ పోలీసుల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ కలిగివున్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని అతడు నడుపుతున్నాడు. నిందితుడు రూ. 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్ను రూ. 15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు.“మంగళవారం మధ్యాహ్నం నాసిక్లోని నందగావ్, ఇందిరా నగర్లో నిందితుడిని అరెస్టు చేశాం. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు. అతను లీకైన పేపర్ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారుచేసి, వైద్య ప్రవేశ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్ను రూ.15 లక్షలకు విక్రయించాడ''ని నాసిక్ పోలీసులు వెల్లడించారు. ఈ పేపర్ లీక్ నెట్వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని వారు తెలిపారు.ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్?కాగా, నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ప్రశ్నాపత్రం లీకయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తొలుత రాజస్తాన్లోని జైపూర్కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికల ద్వారా చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఓ అనుమానిత వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.చదవండి: నీట్ పేపర్ లీకేజీ.. ఎలా బయటపడింది?గెస్ పేపర్ లేదు: డీఎస్పీనీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 15 మంది వరకు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్లోనూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిల్లో తమకు ఎలాంటి ప్రశ్నపత్రం గానీ, గెస్ పేపర్ గానీ లభించలేదని రాజ్గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కేవలం నగదు లావాదేవీలకు సంబంధించిన చాట్లు మాత్రమే బయటపడ్డాయని వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలునీట్-యూజీ 20026 పరీక్ష లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళన చేపట్టాయి. కేరళంలోని పాలక్కాడ్, కన్నూరుయ ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి వారిని పోలీసులు నిలువరించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం
బీహార్లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బీహార్కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన తమ తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు. "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.సోదరుడితో సంజు చివరి మాటలు మే 13న అమ్మాయికి పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్తో ఫోన్లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్ ఆరోపించాడు.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?హత్య , హడావిడిగా అంత్యక్రియలు సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
వీడియోలు
రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు
హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్
బండి భగీరథ్ అరెస్ట్!బెయిల్పై హైకోర్టులో విచారణ..
బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే బాగుంటుందన్న ప్రధాని
PMJ జ్యువెలరీ దోపిడీ కేసు.. AI ని యూజ్ చేసి..
పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
SI సురేష్ పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్ ని...
బండి భగీరథ్ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్రమంతా గాలింపు
పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ
