Politics

పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి

ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. తన పాలనను రెఫరెండంగా ఉపఎన్నికలకు వెళ్లేదమ్ము రేవంత్కు ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’అని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కేటీఆర్ ప్రశంసించారు.
Sports

సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బౌలర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్డెర్మాట్, ప్రస్తుత స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్లను వెనక్కు నెట్టాడు.మెక్డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.

టీమిండియా వైపు మరోసారి దూసుకొస్తున్న పృథ్వీ షా.. వరుసగా రెండో మ్యాచ్లో..!
తొలి టెస్ట్లోనే సెంచరీ చేసి భావి భారత తారగా కీర్తించబడిన పృథ్వీ షా.. కొద్ది కాలానికే ఫామ్ కోల్పోయి, ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని, వివాదాల్లో తలదూర్చి భారత క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు.ఈ క్రమంలోనే తనకు గుర్తింపునిచ్చిన ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై తరఫున అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే మకాంను మహారాష్ట్రకు మార్చిన షా.. కొత్త జట్టు తరఫున పూర్వ వైభవాన్ని సాధించే పని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్రం మ్యాచ్లోనే (బుచ్చిబాబు టోర్నీలో ఛత్తీస్ఘడ్పై) సెంచరీ (140 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111) చేసిన షా.. వరుసగా రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరుగుతున్న మ్యాచ్లో 96 బంతుల్లో 9 సొగసైన బౌండరీల సాయంతో 66 పరుగులు చేశాడు. జట్టు మారాక ఆటతీరును కూడా మార్చుకున్న షా.. అద్బుత ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటూ మరోసారి టీమిండియా వైపు అడుగులు వేస్తున్నాడు. చత్తీస్ఘడ్పై సెంచరీ తర్వాతే షాకు సీఎస్కే నుంచి పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. షా ఈ టోర్నీలో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. సీఎస్కే కాకపోతే మరే ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా దక్కించుకోవచ్చు. షాకు ఐపీఎల్ ద్వారా టీమిండియా ఎంట్రీ ఈజీ అవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకే ఆలౌటైంది. పృథ్వీ షా రాణించడంతో మహారాష్ట్ర ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 160 పరుగుల ఆధిక్యంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది.

చరిత్రలో ఒకే ఒక్కడు.. పుజారా సాధించిన అద్బుతమైన రికార్డులు
టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇవాళ (ఆగస్ట్ 24) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లు పాతుకుపోవడం, ఫామ్ కోల్పోవడం వంటి కారణాల చేత గత రెండున్నరేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న పుజారా ఇవాళ సోషల్మీడియా వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.2010, అక్టోబర్ 9న అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పుజారా.. 13 ఏళ్ల తన టెస్ట్ కెరీర్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 103 టెస్టుల్లో 43.60 సగటున 7195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.సౌరాష్ట్రకు చెందిన 37 ఏళ్ల పుజారా భారత తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత పుజారా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. పుజారా బ్యాటింగ్ శైలి ద్రవిడ్ను పోలి ఉండటంతో అందరూ అతన్ని నయా వాల్ అని పిలిచే వారు.పుజారాకు 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ సిరీస్లో పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సిరీస్లో మొత్తం 521 పరుగులు చేసిన అతను.. టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.రిటైర్మెంట్ నేపథ్యంలో పుజారా సాధించిన పలు అబ్బురపడే రికార్డులపై ఓ లుక్కేద్దాంఓ ఇన్నింగ్స్లో 500 పైచిలుకు బంతులను ఎదుర్కొన్న ఏకైక భారత ఆటగాడునిలకడకు మారు పేరైన పుజారా కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇందులో 2017 రాంచీ టెస్ట్లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్లో పుజారా ఏకంగా 525 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఇన్ని బంతులు ఎదుర్కొన్న ఆటగాడే లేడు. ఓ ఇన్నింగ్స్లో 500 పైచిలుకు బంతులను ఎదుర్కొన్న తొలి, ఏకైక భారత ఆటగాడిగా పుజారా చరిత్ర సృష్టించాడు.SENA దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాల్లో భాగమైన భారత ఆటగాడుపుజారా పేరిట ఓ ఘనమైన రికార్డు ఉంది. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక టెస్ట్ విజయాల్లో (11) భాగమైన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ విభాగంలో పుజారా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి, రహానే, పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, సిరాజ్ ఉన్నారు. వీరంతా SENA దేశాల్లో తలో 10 విజయాల్లో భాగమయ్యారు.బీజీటీలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడుఓ బీజీటీ సిరీస్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత ఆటగాడిగా పుజారా పేరిట రికార్డు ఉంది. 2018-19 ఆసీస్ పర్యటనలో పుజారా ఏకంగా 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఆ సిరీస్లో భారత చారిత్రక విజయాన్ని సాధించింది.ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఏకైక భారత ఆటగాడు2017లో ఈడెన్ గార్డన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పుజారా ఐదు రోజులు బ్యాటింగ్ చేశాడు. గడిచిన 40 ఏళ్లలో ఏ భారత ఆటగాడు ఈ ఫీట్ను సాధించలేదు. గడిచిన 40 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

కొత్త జర్నీని ప్రారంభించిన సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ క్రికెట్లో మరో కొత్త జర్నీని ప్రారంభించాడు. 2008లో ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా (2015-2019), బీసీసీఐ బాస్గా (2019-2022), ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా (2019), ఆతర్వాత అదే ఫ్రాంచైజీకి పురుషులు, మహిళల విభాగంలో (డబ్ల్యూపీఎల్) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా (2023-), ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా (కొనసాగుతున్నాడు) పలు పదవులకు వన్నె తెచ్చిన గంగూలీ.. తొలిసారి కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026 ఎడిషన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ప్రిటోరియా క్యాపిటల్స్ గంగూలీని హెడ్ కోచ్గా నియమించింది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన (చివరి నుంచి రెండో స్థానం) అనంతరం ప్రిటోరియా క్యాపిటల్స్ గంగూలీ నియామకాన్ని చేపట్టింది. త్వరలో జరుగబోయే (సెప్టెంబర్ 9న) ప్లేయర్ల వేలంలో గంగూలీ ఆ ఫ్రాంచైజీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నాడు.గంగూలీ నియామకాన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాన్యం ఇన్స్టా వేదికగా ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నుంచి గంగూలీ బాధ్యతలు చేపడతాడు.గంగూలీకి అసిస్టెంట్గా పొలాక్ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాన్యం గంగూలీతో పాటు మరో నియామకాన్ని కూడా చేపట్టింది. గంగూలీకి అసిస్టెంట్గా సౌతాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ షాన్ పొలాక్ను నియమించింది. పొలాక్ వచ్చే సీజన్లో క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తాడు.
National

Bihar: ఓటర్ లిస్టులో ఇద్దరు పాక్ మహిళలు.. దర్యాప్తు షురూ
పట్నా: బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.భాగల్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. #WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD— ANI (@ANI) August 24, 2025కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు.

రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆధునిక ఢిఫెన్స్ వ్యవస్థను పరిశీలించిన డీఆర్డీఓ
భువనేశ్వర్: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)మరో విజయాన్ని సాధించింది. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) తొలి విమాన పరీక్షలను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),… pic.twitter.com/Jp3v1vEtJp— DRDO (@DRDO_India) August 24, 2025ఆపరేషన్ సిందూర్ జరిగిన మూడున్నర నెలల తర్వాత ఈ వాయు రక్షణ వ్యవస్థ విమాన పరీక్షలు నిర్వహించారు. డీఆర్డీఓ ఈ స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థను శనివారం ఉదయం 12:30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది. ఐఏడీడబ్ల్యూఎస్ అనేది వివిధ పొరలతో కూడిన వాయు రక్షణ వ్యవస్థ. ఇది ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థ క్షిపణులు, అధిక శక్తి గల లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ పరీక్షల అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ, సాయుధ దళాలను అభినందించారు.The @DRDO_India has successfully conducted the maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS), on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha. IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air… pic.twitter.com/TCfTJ4SfSS— Rajnath Singh (@rajnathsingh) August 24, 2025

The Masked Warrior: ఉగ్రదాడిలో ముఖం చిద్రమైనా.. వెన్ను చూపని కల్నల్ రిషిరాజలక్ష్మి
న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో లెఫ్టినెంట్ కల్నల్ రిషిరాజలక్ష్మి చూపిన తెగువ ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది. యుద్ధంలో ముఖం ఛిద్రమైనప్పటికీ, ఆయన విధినిర్వహణలో దేనికీ వెనుకడుగు వేయలేదు. అందవిహీనంగా మారిన ముఖానికి మాస్క్ ధరించి, తన సాహస పంధాను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.మూడు బుల్లెట్లు తగిలాక..2017లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర నిరోధక దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ రిషికి మూడు బుల్లెట్లు తగిలాయి. ఒకటి అతని హెల్మెట్లో దూరగా, రెండవది అతని ముక్కును చీల్చింది. మూడవది అతని దవడను ఛిద్రం చేసింది. అంతటి స్థితిలోనూ రిషి పోరాటం కొనసాగించారు. అతని చేతిలోని ఏకే-47 ప్రత్యర్థులపై ఉరుముతూనే ఉంది. 28 సర్జరీల తర్వాత రిషి ముఖ కవచాన్ని ధరించి, తిరిగి విధులకు హాజరయ్యారు. రిషి వీరోచిత గాథ తశివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’లో ప్రముఖంగా కనిపిస్తుంది. రిషి చూపిన తెగువ అతనికి ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ మ్యాన్’ బిరుదును సంపాదించిపెట్టింది.తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా..2024లో, కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడినప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రిషి సైనిక సహాయక చర్యలకు నాయకత్వం వహించారు. వందల సంఖ్యలో బాధితుల ప్రాణాలను కాపాడారు. తన ముఖాన్ని మాస్క్లో దాచుకుని విపత్తు ప్రాంతానికి చేరుకున్న మలయాళీ సైనికుడు అక్కడున్నవారిలో మరింత ధైర్యాన్ని నింపారు. దేశం కోసం తన ముఖాన్ని త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్గా రిషి గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రిషి తొలుత ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. కానీ సైనికునిగా మారాలనే అతని కోరిక అతన్ని ఆ దిశగా నడిపించింది. కుమారుడు దేశానికి సేవ చేయాలనే అతని తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా రిషి తన పేరు పక్కన తల్లి పేరు జోడించుకున్నారు.ఫేస్ మాస్క్ ధరించడం వెనుక..లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ‘ఆపరేషన్ ట్రాల్’ సైనిక ఆపరేషన్కు నేతృత్వం వహించాడు. వారి బృందం ఒక ఇంట్లోకి చొరబడి అక్కడున్న ఉగ్రవాదులను తరిమికొట్టే ప్రయత్నం చేసింది. దాదాపు పది కిలోగ్రాముల ఐఈడీతో రిషి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. దానిని అక్కడ అమరుస్తుండగా, పైఅంతస్తు నుంచి దూసుకొచ్చిన మూడు బుల్లెట్లు అతనిని తాకాయి. అయితే రిషి తన ఏకే-47 తో పోరాడి ఉగ్రవాదులను తరిమికొట్టాడు. నాటి 15 గంటల ఎన్కౌంటర్లో సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. రిషి భార్య కెప్టెన్ అనుపమ ఆర్మీ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్. ఆమె భర్తకు వైద్య సేవలు అందించారు. నాటి దాడిలో కోలుకున్నప్పటి నుంచి రిషి ఫేస్ మాస్క్ ధరించడం ప్రారంభించారు.‘మన లోపాలను అధిగమించాలి’రిషి ధైర్యసాహసాలకు మెచ్చిప ప్రభుత్వం 2024లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉత్తమ సేవా పతకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ 'నా దేశం నాకు ముఖ్యం. మన లోపాలను మనం దాచిపెట్టుకోవాలి. మన ప్రతిభను హైలైట్ చేయాలి. ఇదే భావన నన్ను ముఖాన్ని కప్పి ఉంచేలా చేస్లోంది. దేశం నన్ను హీరోలా చూస్తున్నప్పటికీ నేనేమీ అంత ప్రత్యేకమైనవాడిని కాదు. భారత సైన్యం నుండి పొందిన కఠినమైన శిక్షణతో ఎవరైనా బలంగా తయారుకావచ్చు. వ్యక్తిత్వం కలిగిన యువకులు దేశానికి అవసరం. వైద్యుల నుండి ఇంజనీర్ల వరకు ఎవరైనా సరే సైన్యంలో చేరవచ్చని లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి పిలుపునిచ్చారు.
International
NRI

హ్యూస్టన్లో విజయవంతమైన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరం, అమెరికాలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సాహితీ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేసి, 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని పంచుకున్నారు. హ్యూస్టన్ లో తెలుగు బడి, మన బడి బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి గురువందన సత్కారాలతో మొదలైన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సుని “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా ప్రారంభించగా భారతదేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా చేసిన ప్రధానోపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.కాలిఫోర్నియాలోని ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చమర్తి గారికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చెయ్యాలి అనే కంటే ఉన్న వ్యవస్థలని పటిష్టం చెయ్యాలి అని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునివ్వగా, దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుంది.ఈ సదస్సులో మొత్తం 17 నూతన తెలుగు గ్రంథాలు ఆవిష్కరింపబడగా అందులో 5 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల నిర్వహణలో జరిగిన ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహణలో జరిగిన కవితా చర్చా వేదిక, బుర్ర సాయి మాధవ్ తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజఝ్ఝల నిర్వహించిన సాహిత్య ప్రహేళికల కార్యక్రమాలు, కథా రచన పోటీ మొదలైన ఆసక్తికరమైన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డాలస్ నివాసి, తానా సాహిత్య వేదిక అధ్యక్షులు, అమెరికాలో ప్రముఖ సాహితీవేత్త అయిన డా. తోటకూర ప్రసాద్ గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది.రెండు రోజులపాటు 50కి పైగా వక్తలు పాల్గొన్న వివిధ ప్రసంగ వేదికలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జీ. వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, శారద ఆకునూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్, దయాకర్ మాడా, సత్యం మందపాటి, మద్దుకూరి విజయ చంద్రహాస్, కె గీత, అఫ్సర్, కల్పనా రెంటాల, వ్యాసకృష్ణ, జెపి శర్మ, కొండపల్లి నిహారిణి, విజయ సారథి జీడిగుంట, అత్తలూరి విజయలక్ష్మి, కేతవరపు రాజ్యశ్రీ తదితరులు ప్రసంగించగా, అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి నారాయణస్వామి, భాస్కర్ పులికల్ ప్రసంగించారు.సదస్సు నిర్వహణకి ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలుతెలిపింది. సదస్సు నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, పంకజ్, రామ్ చెరువు, పుల్లారెడ్డి, కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమా దేశభొట్ల, వాణి దూడల తదితరులు వ్యవహరించారు. రెండు రోజుల కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు అమెరికాలో అరుదైన గౌరవం
డాలస్, టెక్సస్: తెలుగు, హిందీ భాషల్లో పీహెచ్డిలు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, రెండుమార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది.టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో నెలకొనిఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లనుండి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు పొందడం తెలుగువారం దరికి గర్వకారణమని పలువురు ప్రవాస భారతీయులు కొనియాడారు. గార్లాండ్ నగర మేయర్ డిలన్ హెడ్రిక్ తో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డా. యార్లగడ్డకు అధికారిక గుర్తింపు పత్రాన్ని మేయర్ స్వయంగా అందచేసి అభినందిం చారు.సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల భారతదేశ వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినదుకుగాను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా టెక్సాస్ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి. మంగళవారం సాయంత్రం ఫ్రిస్కోలో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వీటిని ఆయా నగరాల అధికార ప్రతినిధులు ఆచార్య యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు డా. యార్లగడ్డ ను ఘనంగా సత్కరించారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్కు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పోనంగి, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, ఉదయగిరి రాజేశ్వరి, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, మాధవి లోకిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. తుమ్మల చైతన్య, చినసత్యం వీర్నపు, కాకర్ల విజయమోహన్, అత్తలూరి విజయలక్ష్మి, ఎ. ల్ శివకుమారి, జ్యోతి వనం, మడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లోరిడాలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆత్మీయ సమావేశం
అమెరికాలోని ఫ్లోరిడాలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ వాసుదేవ రెడ్డి.. కాటసాని రాంభూపాల్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టులు వంటి వివిధ రంగాలలో చేసిన అభివృద్ధి కార్యకలాపాలను డాక్టర్ వాసుదేవ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక ఎన్నారై నాయకులకు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని రాంభూపాల్రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా మోహన్ రెడ్డి , డాక్టర్ వాసుదేవ రెడ్డి, సాయి ప్రభాకర్ , డాక్టర్ నరేందర్ రెడ్డి , రఘు , కేశవ్ , జనార్ధన్ , సంజీవ , సురేందర్, వీరారెడ్డి , వంశీ , రమేష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు

లగ్జరీ కారులో పేరెంట్స్ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
Sakshi Originals

అంతరాలు!
డైనింగ్ టేబుల్పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.మనసుల మధ్య ఎడంసాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే..

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
దోమలపెంట/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచి 53,313, హంద్రీ నుంచి 250 మొత్తం 4,70,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఒక్కొక్కటి 18 అడుగుల మేర ఎత్తి.. స్పిల్వే ద్వారా 4,19,314 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,087.. మొత్తం 61,402 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.7 అడుగుల వద్ద 197.4617 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.480 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.750 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా 3,61,322 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,414 క్యూసెక్కులు మొత్తం 3,94,736 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.

అతి వేడి.. ఆరోగ్యానికి హానికరం
వేడివేడి టీలో మనం రంగు, రుచి, వాసనల్ని ఆస్వాదిస్తాం. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు మైమరిచిపోతాం. అందుకు కారణం, వేడి కూడా ఒక రుచిలా మనకు అలవాటై ఉండటం! అయితే ఈ పానీయాల వేడి.. పరిమితికి మించితే దీర్ఘకాలంలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ తాజాగాహెచ్చరించింది! – సాక్షి, స్పెషల్ డెస్క్వేడి పానీయాలు వేడిగానే కదా ఉండాలి! వాటిని వేడిగానే కదా తాగాలి! కాకపోతే, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కాస్త వేడి తక్కువగానో, కొంచెం వేడి ఎక్కువగానో తాగుతారు. మరి వేడి వల్ల కేన్సర్ రావటం ఏంటి? వస్తే ఏ రకం వస్తుంది? గొంతుకు వస్తుందా? ఉదరానికి వస్తుందా? నిజానికి వేడి పానీయాలకు, గొంతు కేన్సర్కు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఆధారాలూ లేవు. అలాగే వేడి పానీయాలకు కడుపు కేన్సర్కు మధ్య సంబంధం కూడా అస్పష్టంగానే ఉంది. ఇదంతా నిజమే కానీ, మితి మీరిన వేడి ఉన్న పానీయాలను సేవించటం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తాము గుర్తించామని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.65 డిగ్రీలు దాటితే డౌటే!2016లో ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్’ జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. వేడి పానీయాలను అతి వేడిగా తాగటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. 70 డిగ్రీల వేడి వద్ద ఎలుకలకు పట్టించిన నీరు, అలా వేడి నీటిని పట్టించని ఎలుకలతో పోల్చి చూస్తే, అధిక వేడి నీటిని పట్టించిన ఎలుకల అన్నవాహికలో ముందస్తుగా కేన్సర్ సంకేతాలు కనిపించాయి.వేడికి ఆమ్లాలు తోడౌతాయి!పానీయాల వేడికి, ‘గ్యాస్ట్రిక్ ఆసిడ్ రిఫ్లెక్స్’ (కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి వెనక్కి తన్ని, వాపును కలుగజేసే పరిస్థితి) తోడై అన్నవాహిక కేన్సర్ అవకాశాలు పెరగడాన్ని కూడా తాజా అధ్యయనంలో పరిశోధకులు గమనించారు. అలా బయటి ద్రవాల వేడి, లోపలి ఆమ్లాలు కలిసి కేన్సర్ వృద్ధికి కారకాలు అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. ‘గుటక’ మోతాదూ విలనే!ఒకేసారి ఎంత వేడిగా తాగుతారు, ఎంత త్వరగా తాగుతారు అనే దానిపైనే కేన్సర్ ప్రమాదం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం ప్రకారం.. వేడివేడి పానీయాలను ఒకేసారి ఎక్కువగా తాగితే ఆ వేడి తీవ్రత వల్ల అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరొక అధ్యయనంలో.. వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేడి వేడి కాఫీ, టీలు తాగే వ్యక్తుల అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు వారు తీసుకున్న ‘గుటక’ మోతాదు, వేడి కంటే కూడా ఎక్కువ దుష్ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. 65 డిగ్రీల వేడి ఉండే కాఫీలో ఒక పెద్ద గుటక (20 మిల్లీ లీటర్లు) అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు పెంచటాన్ని వారు గుర్తించారు. అందువల్ల టీ, కాఫీల వంటి వేడి పానీయాలను త్వరత్వరగా కాకుండా.. కాస్త వేడి చల్లారే వరకు ఉండి, నింపాదిగా తాగాలని సూచిస్తున్నారు.సుఖోష్ణం ఆహ్లాదకరంటీ, కాఫీ వంటి వేడి పానీయాలను అందరూ వేడివేడిగానే తాగుతారు. వీటిలో ఉండే కెఫినన్, థియోఫిలిన్ అనే రసాయనిక పదార్థాల వల్ల కేన్సర్ రాదు. బాగా వేడివేడిగా తాగడం వ్యాధికారకమని కొందరు అంటున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. మన నాలుక, నోరు భరించలేని వేడిని మనం తాగలేం. టీగానీ, కాఫీగానీ నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు మనం తట్టుకోగలిగే వేడి మాత్రమే ఉంటుంది. ఆ మార్పు యాంత్రికంగా జరిగిపోతుంది. జంతువుల మీద ప్రయోగాలు చేసేటప్పుడు ‘గొట్టాల ద్వారా’ వాటి కడుపులోకి వేడి పానీయాలు పంపుతారు. కాబట్టి అధిక వేడి సాధ్యపడవచ్చు. ఇక రెండో విషయం.. ఎంత ప్రమాణంలో తాగాలి, రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు? అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా ఏదైనా ప్రమాదకరమే. అతివేడి, అతి చలవ పదార్థాలు వెంటవెంటనే శరీరానికి తగిలినా, నోటిలోకి వెళ్లినా.. మన కణజాలాలు కాలిపోయి చర్మరోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ వ్యాధులు ముదిరితే కేన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగటం చాలా ప్రమాదకరం. ఆ పేపరు పొర కెమికల్స్తో కూడినది. దానికి ఏమాత్రం వేడితగిలినా.. రసాయనిక చర్య సంభవించి, అవి మన నోట్లోంచి కడుపులోకి వెళ్లి కేన్సర్ వంటి అనేక రోగాలకు దారితీయవచ్చు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, విశ్రాంత అదనపు సంచాలకులు, ప్రిన్సిపాల్, ఆయుష్ విభాగం

భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు.
నేల విడిచిన సమరం
నిలుపుకోవాల్సిన బంధం
రష్యా న్యూక్లియర్ ప్లాంట్పై ఉక్రెయిన్ దాడి
‘సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తాం’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 'టాలీవుడ్' భేటీ..
రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ చిన్న రూల్తో జాగ్రత్త!
బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బౌలర్
డేంజరస్ భిక్షువు!
అమెరికాలో ఇండియా సరుకులు.. చుక్కలు చూపిస్తున్నాయ్..
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. పనుల్లో విజయం
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
సాక్షి కార్టూన్ 23-08-2025
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
చైనా మార్కెట్లలో భారత్కు స్వాగతం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం
సహస్ర తల్లి సంచలన ఆరోపణలు.. వాళ్ల పాత్ర కూడా ఉంది!
కామెరూన్తో ఫస్ట్ లుక్ రిలీజ్?
జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్
వాళ్లకు ‘ఆధార్’ ఆధారమవుతుందని అనుకోలేద్సార్!
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
కొత్త కార్డులకు రేషన్
‘జట్టు నుంచి తప్పిస్తా!.. ద్రవిడ్.. అతడిని నా దగ్గరికి రావొద్దని చెప్పు’
క్రైమ్

భర్తను చంపిన భార్య
మొయినాబాద్: డెయిరీ ఫామ్లో పనిచేస్తున్న ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. శవాన్ని బావి పక్కన పడేసి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన సామ రాజిరెడ్డి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేందుకు ఓ జంట కావాలని బిహార్కు చెందిన పవన్ను సంప్రదించాడు. అతని ద్వారా నెల క్రితం రాజేశ్కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు.గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్కు వెళ్లగా రాజేశ్కుమార్ దంపతులతోపాటు మరో వ్యక్తి కనిపించాడు. అతను తమ బంధువని చెప్పడంతో సరేనని ఊరుకున్నాడు. శుక్రవారం ఫామ్కు వెళ్లిన యజమానికి రాజేశ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడగగా మద్యం తాగివచ్చి, తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడని చెప్పింది. సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పనివాళ్లెవరూ కనిపించలేదు.ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఫోన్ చేసిన పవన్.. పూనందేవి, మహేశ్సాని అలియాస్ గుడ్డు అనే వ్యక్తి కలిసి రాజేశ్ను చంపి, బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాజేశ్కుమార్ మృతదేహం కనిపించింది. రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హాస్టల్లో హుక్కా
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్లో చూసి అవసరమైన సామగ్రి ఆన్లైన్లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా తయారు చేశారు. హాస్టల్లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థికి షాద్నగర్లోని ఓ హోటల్లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ ఇద్దరు విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి, విద్యుత్ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి తెలిపారు. హాస్టల్లో తనిఖీ చేయగా హుక్కా మిషన్తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్ విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం

కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు.
వీడియోలు


Boduppal Incident: వాడిని ఉరి తీయాలి.. స్వాతి తల్లిదండ్రుల డిమాండ్


Boduppal Incident: భార్య శరీర భాగాలను మూసీలో పడేసిన భర్త


బోడుప్పల్ స్వాతి ఘటనపై స్థానికులు బయటపెట్టిన నిజాలు


భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్


Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!


కూకట్పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన


ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం


Traffic Rule: హైదరాబాద్ నగర పోలీసుల వినూత్న ఆలోచన


మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ