Politics
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు.
ఇన్ని లక్షల మందిని ఎందుకు పంపారు?: మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.ఉత్తర 24 పరగణాలలో తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడిన బెనర్జీ.. శాంతిభద్రతలు కాపాడటానికి వచ్చిన సీఆర్పీఎఫ్ సాయుధ వాహనాల వినియోగం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు, రైల్వే వంటి సంస్థలు కూడా పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యాయని అన్నారు.“ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ, ఇది ప్రజలకు హాని చేసే సమయం కాదు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా పోలింగ్ వేళ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తర అనుచరులను కోరారు. సుమారు 2 లక్షల కేంద్ర సిబ్బందిని రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పారు. “ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడం ద్వారా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.బీజేపీకి మమత సవాల్ విసురుతూ.. “సాయుధ వాహనాలకు శక్తి ఎక్కువా లేక ప్రజలకు శక్తి ఎక్కువా చూడాలి. నేను దేనికీ భయపడను. ఇలాంటి సాయుధ వాహనాలను మణిపూర్లో వినియోగించాలి. మణిపూర్లో మూడు సంవత్సరాలుగా అశాంతి కొనసాగుతోంది. బెంగాల్లో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు” అని తెలిపారు.జాతీయ భద్రత అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. “పహల్గామ్లో ఉగ్రవాదులు భారతీయులను హతమార్చినా, కేంద్ర సర్కారు పాకిస్థాన్పై చర్య తీసుకోలేకపోతోంది. కానీ బెంగాల్ ఎన్నికల కోసం మాత్రం అన్ని బలగాలను తీసుకువస్తున్నారు” అని అన్నారు. కాగా, గురువారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.
బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల (152 స్థానాలకు)తో పాటు తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గురువారం (ఏప్రిల్ 23) ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే4న వెల్లడవుతాయి. పశ్చిమ బెంగాల్లో.. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్లో 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 8,000కి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో క్యూలు భారీగా ఉండకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 3,60,77,171 ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వీరిలో మంది 1,84,99,496 పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.మొదటి దశలో పోలింగ్ జరిగే ప్రాంతాలు: మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్ ప్రాంతాలు, అలాగే జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్ భాగాలు ఉన్నాయి.వోటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి వేయాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తమిళనాడులోతమిళనాడులో 5.73 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.ఇందులో 2.93 కోట్ల మహిళా ఓటర్లు, 7,728 ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 249 మోడల్ బూత్లు, 325 మహిళలు నిర్వహించే బూత్లు, 71 దివ్యాంగులు నిర్వహించే బూత్లు ఉన్నాయి.ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) రాష్ట్రవ్యాప్తంగా వినియోగానికి సిద్ధం చేశారు. మొత్తం 1,06,418 బ్యాలట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, 75,064 వివిప్యాట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో ఉంటారు.అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ముందు వచ్చి క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో పబ్లిక్ హాలిడే.బస్సులు, మెట్రో, స్థానిక రవాణా సేవలు సాధారణంగా నడుస్తాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు సౌకర్యంగా ఉంటుంది.పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి.
‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్ ఇచ్చిందే’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.‘‘అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్అండ్టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్ఎల్బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎల్బీసీ పనులు చేపట్టారు...ఎస్బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్లో చెక్డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్ హితవు పలికారు.
Sports
భారత్కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్ఫ్ టోర్నీలో భారత్కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్గిర్లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లలేదు. తమ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్
సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్
ఐపీఎల్-2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే వైదొలిగిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే స్ధానాన్ని సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్తో సీఎస్కే భర్తీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించింది. రూ.30 లక్షల బేస్ప్రైస్కు మధ్వాల్ను చెన్నై జట్టులోకి తీసుకుంది.మధ్వాల్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గతంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్కు దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కూడా ఉంది.ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ జట్టుకు భారంగా మారింది. అంతకుతోడు అద్భుతమైన ఫామ్లో ఉన్న మాత్రే కూడా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది.రూ.28 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో గత రెండు మ్యాచ్లకు వారిని సీఎస్కే బెంచ్కే పరిమితం చేసింది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: SRH: కమిన్స్కు షాక్.. కెప్టెన్గా ఇషాన్ కొనసాగింపు!
ఐపీఎల్ వదిలి ఇక్కడికి వచ్చెయ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026లో ఇంగ్లండ్ తరఫున సత్తా చాటాడు యువ క్రికెటర్ జేకబ్ బెతెల్. టీమిండియాతో సెమీ ఫైనల్లో 105 పరుగులతో దుమ్ములేపాడు. ఓ దశలో సూర్యకుమార్ సేన నుంచి మ్యాచ్ లాగేసుకున్నట్లు అనిపించినా.. ఆఖరికి భారత్ పైచేయి సాధించింది.బెంచ్కే పరిమితంఇక ఈ టోర్నీ తర్వాత బెతెల్ ఐపీఎల్-2026 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో చేరాడు. ఇప్పటికి ఆర్సీబీ ఈ సీజన్లో ఆరు మ్యాచ్లకు నాలుగు గెలిచింది. అయితే, ఇంత వరకు బెతెల్కు మాత్రం ఆడే అవకాశం రాలేదు. తుదిజట్టులో అతడికి ఒక్కసారి కూడా చోటు దక్కనేలేదు.కాగా బెతెల్ సాధారణంగా టాపార్డర్లో ఆడతాడు. ఆర్సీబీలో ఇప్పటికే ఓపెనర్లుగా దిగ్గజ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ పాతుకుపోయారు. ఇతర స్లాట్లు కూడా ఖాళీగా లేవు. ఇక విదేశీ ఆటగాళ్ల జాబితాలో సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్లకే ఆర్సీబీ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బెతెల్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు.ఓపెనర్గా బెస్ట్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ బెతెల్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ను వీడి ఇంగ్లండ్ దేశీ క్రికెట్ ఆడేందుకు తిరిగి రావాలని సూచించాడు. ‘‘సిడ్నీలో బౌలర్ల అటాక్ను ఎదుర్కొని టాపార్డర్లో అతడు అదరగొట్టాడు.ఓపెనర్గా లేదంటే వన్డౌన్ బ్యాటర్గా రాణించగల సత్తా అతడికి ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బెతెల్కు ఓపెనింగ్ చేసే అవకాశం రావడం లేదు. అతడు బెంచ్ మీదే ఉండాల్సిన పరిస్థితి. పూర్తిగా ఖాళీగా ఉంటున్నాడు.తిరిగి వచ్చెయ్స్వదేశానికి తిరిగి వచ్చి కౌంటీ చాంపియన్షిప్లో వర్విక్షైర్ తరపున ఆడితే బాగుంటుంది’’ అని అలిస్టర్ కుక్ ఓ పాడ్కాస్ట్లో భాగంగా తన అభిప్రాయం పంచుకున్నాడు. టెస్టులకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుందన్నాడు.కాగా బెతెల్ ఇంగ్లండ్ దేశీ టోర్నీలో వర్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో వర్విక్షైర్ మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుని డివిజన్ వన్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: SRH: కమిన్స్కు షాక్.. కెప్టెన్గా ఇషాన్ కొనసాగింపు!
రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరపున తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు రవీంద్ర జడేజా. లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు జడ్డూ.కఠినమైన లక్నో పిచ్పై 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 43 పరుగులతో అజేయంగా నిలిచిన జడ్డూ.. రాయల్స్ తరఫున టాప్ రన్ స్కోరర్. ఇక బౌలింగ్ పరంగానూ ఈ స్పిన్ ఆల్రౌండర్ రాణించాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి.. నికోలస్ పూరన్ రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు.రెండేళ్లలో తొలిసారిఇక ఈ మ్యాచ్లో రాజస్తాన్ 159 పరుగులే స్కోరు చేసినప్పటికీ.. బౌలర్ల విజృంభణ కారణంగా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇందులో జడ్డూ కీలక పాత్ర పోషించి.. గత రెండేళ్లలో తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.రివాబాకు అంకితంఈ సందర్భంగా రవీంద్ర జడేజా తన భార్య రివాబాపై ప్రేమ కురిపించాడు. అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘జట్టు విజయం కోసం కృషి చేసి అవార్డు అందుకున్న అనుభూతి చాలా బాగుంది. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖా మంత్రికి అంటే నా భార్య రివాబాకు అంకితం చేస్తున్నా.మ్యాచ్ ఆరంభానికి ముందే.. నేను ఈరోజు అద్భుతం చేయగలగనని ఆమె చెప్పింది. ఆ మాటలే నిజమయ్యాయి. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు. నిజానికి ఈ వికెట్ చాలా కఠినంగా ఉంది.చివరి ఓవర్లోనూ..బంతి బాగా స్వింగ్ అయింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని భావించాను. అందుకు తగ్గట్లే ఆడాను. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. చివరి ఓవర్లోనూ మేము పరుగులు రాబట్టగలిగాము’’ అని జడేజా పేర్కొన్నాడు. కాగా లక్నోతో చివరి ఓవర్లో రాజస్తాన్ 20 పరుగులు రాబట్టింది.Rockstar player, rockstar performance 🎸🔥@imjadeja delivers an all-round masterclass to win his 1st player of the match award for Rajasthan Royals in #TATAIPL. 🩷#TATAIPL #LSGvRR pic.twitter.com/EeQtxbuTl3— Star Sports (@StarSportsIndia) April 22, 2026మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన రాజస్తాన్.. లక్నోను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 40 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. కాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాజస్తాన్కు ఇది ఐదో గెలుపు. చదవండి: సీఎస్కే శిబిరంలో తీవ్ర విషాదం
National
టీవీకే కార్యకర్త అరెస్ట్.. పోలింగ్ కేంద్రంలో ఏం చేశాడంటే..?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు
ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
బీకాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఈరోజు (ఏప్రిల్ 23, గురువారం) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను కంపెనీ వెల్లడించ లేదు. బికాజీ ఫుడ్స్, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, సాంప్రదాయ స్నాక్స్, స్వీట్స్ విభాగంలో కంపెనీని ఒక గుర్తింపు పొందిన బ్రాండ్గా తీర్చిదిద్దడంలో అగర్వాల్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. భుజియా, నమ్కీన్, ప్యాకేజ్డ్ స్వీట్స్ మరియు 'రెడీ-టు-ఈట్' విభాగాల్లో బీకాజీని అగ్రగామిగా నిలబెట్టారంటూ ఆయనకు నివాళులర్పించింది. వ్యవస్థాపకుని ఆశయాలకు అనుగుణంగా సంస్థను నడుపుతామని, వ్యాపార స్థిరత్వాన్ని కొనసాగిస్తామని కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు ప్రకటించారు. సెబీ నిబంధనల ప్రకారం, ఆయన మరణం తర్వాత ప్రమోటర్ గ్రూపులో ఆయన సభ్యత్వం ముగుస్తుందని కంపెనీ తెలిపింది.బీకాజీ ఫుడ్స్ నేపథ్యం:భారతదేశంలోని ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో బీకాజీ ఫుడ్స్ ఒక ప్రముఖ సంస్థ. పట్టణీకరణ, బ్రాండెడ్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఈ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశీయ మార్కెట్తో పాటు, విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా కూడా తన ఉనికిని చాటుకుంది.
బెంగాల్లో భారీగా పోలింగ్ : ఎండ తీవ్రతకు నలుగురు మృతి
సాక్షి,కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మొదటి దశలో భాగంగా ఈరోజు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటa వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పశ్చిమ మేదినిపూర్ 65.77 శాతం పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోలింగ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓటు వేసే ప్రయత్నంలో తీవ్రమైన వేడి, శారీరక శ్రమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఓటర్లు మరణించారు. తూర్పు, పశ్చిమ మేదినీపూర్, మాల్దా, బీర్భూమ్ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఏప్రిల్ మాసంలో తీవ్రమైన వేడి కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఈ నలుగురూ గుండెపోటుకు గురయ్యారు. పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, జరిగిన మరణాలు ఆనాటి కార్యకలాపాలపై నీడను పడేశాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ ఓటర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి.మృతులను తూర్పుమేదినీపూర్ జిల్లాలోని పటాష్పూర్కు చెందిన నృపేంద్ర దాస్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్పూర్కు చెందిన ఇస్రతన్ బీబీ, మాల్దా జిల్లాలోని మాలతీపూర్కు చెందిన ప్రమీలా బాగ్డి, బీర్భూమ్ జిల్లాలోని సూరికి చెందిన అసిమ్ రాయ్గా గుర్తించారు.మాలతీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కందరన్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటరు స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. తన తల్లి, తన సోదరుడితో కలిసి ఓటు వేయడానికి వెళ్లిందనీ, ఆమె ఓటు వేయబోతుండగా స్పృహ కోల్పోందని మృతురాలి కుమారుడు సన్నీ తెలిపాడు. ఆమె పోలింగ్ బూత్లోనే మరణించిందని కంట తడి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏప్రిల్ మధ్య నుంచి వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచించారు.#WATCH | Malda, West Bengal | Woman voter falls unconscious and passes away at a polling booth in Kandaran area of Malatipur assembly constituencyThe deceased woman's son, Sunny, says, "My mother, along with my brother, had gone to cast her vote. Just as she was about to cast… pic.twitter.com/v7xhWKh4R1— ANI (@ANI) April 23, 2026 > కాగా ఉత్తర బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని పలు జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 294 నియోజకవర్గాలలో 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయనున్నారు. కనీసం 80 స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణపై చెలరేగిన రాజకీయ దుమారం , బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు,తిరిగి అధికారం తమదే అని చెబుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠగామారుతోంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు .. రాష్ట్రాలకు NHRC ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు జారీ చేసింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే తమ తమ వద్దే పాఠ్య పుస్తకాలు కోనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
International
NRI
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్తో ఈ ఈవెంట్ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్విల్లేలోని ఎవాన్స్బర్గ్ స్టేట్ పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. హైదరాబాద్ నగరంలోని అల్వాల్కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. ప్రముఖ నటి లయ చేతుల మీదుగా అమూల్య టైటిల్ అందుకున్నారు. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్ను గెలుచుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు.
Sakshi Originals
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా మోహరించింది మాత్రం జపాన్లోనే!!. ఎందుకిలా?.. జపాన్కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..అణుబాంబుల తర్వాత..రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్ అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్. ఆ తర్వాత తన వీక్నెస్ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్ సమూలంగా మార్చుకుంది.1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. 2026 నాటికి జపాన్లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి. చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.అక్కడే ఎక్కువ.. అమెరికా సైన్యం జపాన్లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.అభ్యంతరాలు కూడా..అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్ జపాన్ పేరుతో ఇరు దేశాలు ఎయిర్షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది. సైన్యం ఉంది, కానీ..జపాన్కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు. జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్ ప్రకారం.. జపాన్ “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్డీఎఫ్ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది.
తప్పుడు ప్రకటనలకు గూగుల్ చెక్
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు, మోసపూరిత ప్రకటనలు పెద్ద సవాల్ విసురుతుండగా టెక్ దిగ్గజాలు ఏఐ సాయంతో వాటికి చెక్ పెడుతున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించిన వందల కోట్ల యాడ్స్ను నిలువరించినట్లు సెర్చ్ ఇంజన్ రారాజు గూగుల్ తెలిపింది. 60 కోట్ల మోసపూరిత ప్రకటనలు.. సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు 90 శాతానికిపైగా వాటా ఉంది. గూగుల్ లక్షలకొద్దీ వెబ్సైట్లలో కోట్లకొద్దీ ప్రకటనలను ప్రదర్శిస్తోంది. ఆటోమేటెడ్ తనిఖీలు ఉన్నప్పటికీ ప్రకటనల సంఖ్య విపరీతంగా ఉండటంతో కొన్ని హానికరమైన యాడ్స్ కూడా ప్రదర్శితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది నిబంధనలను ఉల్లంఘించిన 830 కోట్ల ప్రకటనలను గూగుల్ నిరోధించడం లేదా తొలగించడమో చేసింది. అలాగే 2.49 కోట్ల ప్రకటనకర్తల ఖాతాలను రద్దు చేసింది.భారత్లో నిబంధనలకు పాతరేసిన 48.37 కోట్ల యాడ్స్ను గూగుల్ తొలగించింది. 17 లక్షల ప్రకటనకర్తల ఖాతాలను నిలిపివేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, పెద్ద కంపెనీల పేర్లను వాడుకొని అవి నిజమైన కంపెనీలే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, ఇతర కంపెనీల లోగోలు, ఫొటోలు, కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకొని రూపొందించిన యాడ్స్ వాటిలో ఉన్నాయి. తాము చెక్ పెట్టిన యాడ్స్లో స్కామ్లకు సంబంధించిన 60.2 కోట్ల ప్రకటనలు, 40 లక్షల ఖాతాలు ఉన్నాయని కంపెనీ 2025 యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్లో వెల్లడించింది. నేరగాళ్ల చేతిలోనూ ఏఐ..ఇంత భారీ మొత్తంలో ఉన్న మోసపూరిత ప్రకటనలను మనుషులు తనిఖీ చేయడం అసాధ్యం. పైగా ఇటువంటి యాడ్స్ను పెద్ద ఎత్తున సృష్టించడానికి సైబర్ నేరగాళ్లు ఓ అడుగు ముందుకేసి జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. వాటిని రియల్ టైమ్లో గుర్తించి అడ్డుకోవడానికి జెమినై ఏఐ సాయం తీసుకుంటున్నట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఏఐ మోడల్స్ వందల కోట్ల రకాల సంకేతాలను.. అంటే ఒక అకౌంట్ ఎంత పాతది, వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది, ప్రకటనలు ఇచ్చే విధానం వంటి అంశాలను తనిఖీ చేస్తుంది. వైరస్లు లేదా హ్యాకింగ్ ముప్పులు యూజర్లకు చేరకముందే ఈ వ్యవస్థ వాటిని గుర్తించి ఆపేస్తుందని గూగుల్ తెలిపింది. 830 కోట్ల యాడ్స్లో వాటిని ఎవరూ చూడకముందే 99% కంటే ఎక్కువగా నిరోధించినట్లు కంపెనీ వెల్లడించింది.
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి.
పేదల కల చెదిరింది!
శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి మనిషికి జీవితాన్నిస్తుంది..స్వతంత్రుడిగా నిలబెడుతుంది. అందుకే తెలంగాణ ఆత్మ అంతా భూమి చుట్టే తిరుగుతుంది. భూమి కోసమే ఇక్కడ 4 వేల మంది రైతు కూలీలు తొలుత నిజాం, ఆపై భారత సైన్యంతో (1946–51) జరిగిన పోరులో అమరులైతే.. ఇదే నేలపై ఒక్క రక్తం చుక్క చిందకుండా అదే రైతు కూలీలకు భూమి దానంగా ఇచ్చిన సందర్భానికి ఇప్పుడు సరిగ్గా డెబ్బై ఐదేళ్లు. అంటే 1951 ఏప్రిల్ 18న శివరాంపల్లి నుంచి పాదయాత్రగా గాజులపోచంపల్లికి చేరుకున్న వినోబా భావే దళితవాడకు వెళ్లిన సందర్భంలో ‘ఈ ప్రాంత రైతుకూలీలు తుపాకులు ఎందుకు పట్టారని ప్రశి్నస్తే..‘భూమి కోసమే’అంటూ వారు సూటిగా సమాధానం చెప్పారు. ‘మాకు భూమి తప్ప మరో బతుకు లేదు..మా 40 కుటుంబాలకు 80 ఎకరాల భూమిని ఇస్తే మేము స్వతంత్రంగా బతుకుతం..’అంటూ తేల్చిచెప్పారు.ఈ అంశం అదే రోజు భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి చెవిన పడటంతో సాయంత్రం ఊరి మధ్యలో జరిగిన గ్రామసభలో వినోబాను కలిసి తన తండ్రి కోరిక మేరకు 100 ఎకరాల భూదానాన్ని ప్రకటిస్తూ, ఇంగ్లీష్ లో తన చేతిరాతతో రాసిన సంబంధిత పత్రాలను వినోబాకు అందజేశారు. ఈ భూములను అర్హులైన పేదలకు పంచాలని, తాను చేసే భూదానం వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించా. భూదాన యజ్ఞానికి ఇలా పడిన తొలి అడుగు లక్షల మంది రైతు కూలీల్లో భూమిపై ఆశలు నింపింది. పలుచోట్ల వారిని భూయజమానులను చేసింది.గాజుల పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా మార్చింది. కానీ 75 ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని తాజాగా విశ్లేషిస్తే..పోచంపల్లిలో భూదాన్ రామచంద్రారెడ్డి ద్వారా భూములు పొందిన 40 దళిత కుటుంబాల చేతుల్లోనే మెజారిటీ భూములు ఉన్నా.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల భూదాన భూములు ఇప్పుడు పెద్దల స్వాధీనంలోకి వెళ్లాయి. తెలంగాణలో ఇంకా పంచకుండా ఉన్న వేల ఎకరాల భూదాన భూములపై విషనాగుల పడగనీడలు కమ్ముకున్నాయి. భూదాన భూముల పక్కదారి భూదాన్ పోచంపల్లి నింపిన స్ఫూర్తితో ఒక్క రక్తపు చుక్క చిందకుండా..తెలంగాణలోని పేదల కోసం వచ్చిన 1,66,529 ఎకరాల భూదాన భూములిప్పుడు ఏం అయ్యాయి.? పంచినవి నిజంగా పేదల చేతుల్లోనే ఉన్నాయా?, పంచని భూములు ఎన్ని? అవి ఎక్కడ? అని ప్రశ్నిస్తే రద్దు అయిన భూదాన్ బోర్డు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా లేవు. పలు రకాల ఫిర్యాదుల నేపథ్యంలో గత ప్రభుత్వం భూదాన బోర్డును రద్దు చేసే నాటికి ఇంకా 75,182 ఎకరాల భూమి వివిధ కారణాలతో పంపిణీ చేయలేదు. అందులో 10 వేల ఎకరాల భూములు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో ఉండగా, పలు ప్రాంతాల్లోని భూములు మళ్లీ పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ప్రజా ప్రతినిధులు, పెద్దల అధీనంలో.. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 188, 189 సర్వే నంబర్లలో 30 ఎకరాల భూదాన భూమిని ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంఎల్ఏ ఒకరు తమ అ«దీనంలో ఉంచుకోగా, కూకట్పల్లిలో సర్వే నంబర్ 353, 354లలో 17 ఎకరాల భూమి కూడా రాజకీయ నాయకుల చెంతకు చేరింది. దొంతనపల్లి, జన్వాడలోని భూదాన్ భూములను ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ కుటుంబం ఏకంగా తమ ప్రాజెక్టులకు బ్యాంకు గ్యారంటీగా ఇచ్చింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో రంగాపూర్ సర్వే నంబర్ 1 నుంచి 89 వరకు 650 ఎకరాల భూదాన భూమి ఉండాలి.కానీ ఈ భూముల్లో అత్యధికం రియల్ ఎస్టేట్ సంస్థలు విక్రయిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో పేదలకు పంచగా మిగిలిన భూములు ఇంకా 8,327 ఎకరాలు ఉండాలి. కానీ భూదాన్ రికార్డుల్లో అతి తక్కువగా చూపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పేదలకు పంచగా 11, 717, వరంగల్లో 9,632, నల్లగొండలో 13,593, ఖమ్మం జిల్లాలో 22,039 ఎకరాలు భూదాన్ భూములు ఉండాలి. కానీ వీటి లెక్కలు.. భూదాన్ బోర్డు, ప్రభుత్వ రికార్డుల్లో అనేక తప్పుల తడకలతో నిండి ఉండటం గమనార్హం.చట్టం ఉన్నా తూట్లు! భూదాన్ భూములను భూదాన్, గ్రామదాన్ చట్టం 1965లోని సెక్షన్ 14–15 మేరకు భూమిలేని నిరుపేదలకు సాగు కోసం కేటాయించాలి. ఈ భూములు అమ్మడం, కొనటం, బదిలీ, లీజు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టటం నిషేధం. ఒక వేళ ఈ భూమిని సాగు చేయకపోతే సెక్షన్ 17 మేరకు తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంది. కానీ రెవెన్యూ, భూదాన్బోర్డుల ఉదాసీనత కారణంగా వేల ఎకరాల భూములు పెద్దల ఖాతాల్లో చేరిపోయాయి. ప్రాంతాల్లో భూమిని నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్న నిబంధనతో పలుచోట్ల నిరుపేదలకు స్థలాలు ఇచ్చినా, దాన్ని ఆసరాగా తీసుకుని భారీగా అనర్హుల పేర పట్టాలు ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాగా భూదాన్ బోర్డు పునరుద్ధరణే భూముల పరిరక్షణకు మార్గం అని భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి చెప్పారు. సమగ్ర విచారణకు ఆదేశించాలి తెలంగాణలో భూమి కోసం సాయుధ పోరాటం చేసిన ప్రాంతంలోనే.. స్వచ్ఛందంగా భూమిని దానం చేసిన చరిత్ర ఉండటం గర్వకారణం. కానీ ఈ అంశాన్ని సరైన రీతిలో డీల్ చేయలేదు. అందుకే తెలంగాణలో భూమి సమస్య ప్రధానమైంది. ప్రభుత్వం భూదాన్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశించాలి. – హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్బోర్డును పునర్వ్యవస్థీకరించాలి భూదాన్ భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములు కావు.ఈ భూముల పంపిణీ ప్రభుత్వ పర్యవేక్షణలో భూదాన్ బోర్డు ద్వారానే చేపట్టాలి. భూదాన బోర్డును సర్వసేవా సంఘ్ ప్రతిని«ధులతో ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – వెదిరె అరవిందరెడ్డి (వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుడు)
అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు
ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్ ఇదే!
‘రేపు ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరుపుతాం’
అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు
సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
అంబానీ ఇంట్లో చెప్.. రోజుకు 4000 రోటీలు!
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
ముంబైలో స్థిరపడనున్న అల్లు అర్జున్.. స్పందించిన అరవింద్
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
సార్ మనమిప్పుడు తమిళనాడులో ఉన్నాము!
‘మన చంద్రన్న’ పుస్తకంలో ‘అప్పులు’ అంశం ఏ పేజీలో ఉంది సార్!
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
మొన్న 70 ఏళ్ల హీరో.. ఇప్పుడు 35 ఏళ్ల హీరో
భారత్పై మరోసారి విషం కక్కిన ట్రంప్
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ 8 మంది అమ్మాయిలను వదిలేయండి: ట్రంప్
‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
గత ఏడాది వరదల్లో అమరావతి కూడా మునిగిపోయింది కదా!
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్!
క్రైమ్
మంజుల నువ్వు నైటీ వేసుకోవడం నాకు ఇష్టం లేదు..!
సాక్షి,కర్ణాటక: బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. భార్య నిత్యం నైటీ వేసుకోవడం ఇష్టం లేని భర్త కోపోద్రీక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య రగడ పతాకస్థాయికి చేరింది. నైటీ ధరించ వద్దని భార్యకు పదే పదే భర్త సూచించినా పట్టించుకోలేదని ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టామిట్డాడుతోంది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా నందగుండదహళ్లి గ్రామానికి చెందిన కృష్ణాజీ పాటిల్, మంజుల భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి వివాహమైంది. ఏడాది కాలంగా ఇంట్లో భార్య చీరకు బదులుగా నైటీ, గౌన్ వేసుకుంటూ తిరిగేది. నైటీ వేసుకోవద్దని భార్యతో అప్పుడప్పుడు గొడవపడేవాడని స్థానికులు, పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించడంతో 80 శాతం మేర శరీరం కాలిపోయిందని, దీంతో చావుబతుకుల మధ్య మంజుల ఆస్పత్రిలో పోరాడుతోంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్కు సీఐలు..
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ‘నయా హనీట్రాప్’ దందాపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక, హానీట్రాప్ కేసులో లెడీడాన్ రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే, 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హానీట్రాప్ ముఠా.. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి రెండు కోట్లు వసూలు చేసింది.జిల్లాలో హానీట్రాప్ వెలుగులోకి తేవడంతో ఈ దందాపై ఎస్పీ జగదీష్ కొరడా ఝళిపించారు. కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు హనీ ముఠా సభ్యులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదులో అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరినీ వీఆర్కు పంపుతూ బుధవారం డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంకా కొందరు పోలీసులు ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉండడంతోపాటు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఠాలీడరుగా వ్యవ హరించిన రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఎస్పీపై భరోసాతో బాధితులు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.కవ్వించి.. కాటేస్తారు ముఠా లీడర్లు.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వ్యక్తుల కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తారు. తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఏకాంత సమయంలో ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని న్యూడ్గా ఉండేలా చేస్తారు. ఆయన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు. తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. దీంతో బాధి తులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే అదనుగా బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారు.
ప్రేయసి రావే
హైదరాబాద్: పెట్రోల్ క్యాన్తో హైటెన్షన్ టవర్ ఎక్కిన ఓ యువకుడు తన ప్రేయసితో మాట్లాడించాలని.. లేకపోతే పెట్రోల్ పోసుకుని దూకుతానని పోలీసులను బెదిరించాడు. ఇలా దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ముచ్చెమటలు పట్టించాడు. అల్లాపూర్ ప్రాంతానికి చెందిన సాల్మాన్ రాజ్కు ఎస్ఆర్టీనగర్కు చెందిన యువతితో పరిచయమైంది. ఈ క్రమంలో ఇటీవల సాల్మన్రాజ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.ఆ తరువాత ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం పెట్రోల్ క్యాన్తో మోతీనగర్ పార్కులో ఉన్న హైటెన్షన్ టవర్ను ఎక్కాడు. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు సురేందర్తో మాట్లాడాడు. యువతితో మాట్లాడించాలని యువకుడు కోరాడు. అయితే ఆతరువాత బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ మాటల్లోకి దించి దిగివచ్చేలా చేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి!
ప్రొద్దుటూరు క్రైం : తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేందుకు భార్య కిరాయిహంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఈ రాత్రి గడిస్తే కిరాయి హంతకుల చేతిలో భర్త హతమయ్యేవాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్ ఆట కట్టించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. భర్తను చంపేందుకు సుఫారి.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన వాళ్లు రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషిటర్ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సు«ఫారి తీసుకున్న రౌడీషిటర్ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషిటర్ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్ను ప్రొద్దుటూరుకు పిలిపించారు. ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్.. లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారి గ్యాంగ్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు తెలియడంతో అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషిటర్ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
వీడియోలు
ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
సమ్మె దెబ్బ ఆటో రేట్లు పెంచిన డ్రైవర్లు
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
20 మంది నుంచి కోటి వసూలు, సంచలన విషయాలు బయటపెట్టిన అనంతపురం DSP
నాయకుడంటే జగన్ లా ఉండాలి..
మే 1st లోపు తీపికబురు చెబితే మంచిది.. లేకుంటే
మాతో పెట్టుకుంటే గద్దె దింపుతాం.. సర్కార్ కు RTC కార్మికుల వార్నింగ్
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
హనీ ట్రాప్ కలకలం పోలీసులే దగ్గరుండి.. సంచలన ఆడియో లీక్
తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు
