Politics
![Kadapa Mla Madhavireddy Waterplant Politics In Ap](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Madhavi%20reddy.jpg.webp?itok=091UhS3F)
మాధవిరెడ్డి రివేంజ్ పాలిటిక్స్..!
సాక్షి,వైఎస్సార్జిల్లా:కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మళ్లీ వాటర్ప్లాంట్ రాజకీయాన్ని ప్రారంభించారు. ప్రజలేమైపోయినా పర్లేదని వైఎస్సార్సీపీ నేతల మీద కక్ష సాధించడానికి కడపలోని వాటర్ప్లాంట్లను మూసేయిస్తున్నారు. మొన్న కడప 26వ డివిజన్ కార్పొరేటర్ త్యాగరాజు వాటర్ప్లాంట్ కూలదోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే భంగపడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య వాటర్ప్లాంట్ సీజ్ చేయించారు.అన్ని అనుమతులున్నా ప్లాంట్ను పాఠశాల భవనం అంటూ సాకు చూపి అధికారులతో సీజ్ చేయించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నిధులతో వాటర్ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డట్టు చెబుతున్నారు. అంతకుముందు 26వ డివిజన్ వాటర్ప్లాంట్ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే కూల్చివేతకు ఆదేశించినప్పటికీ అధికారులు,పోలీసులు వెనక్కి తగ్గారు.ఎమ్మెల్యేగా ఉండి వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చాలి కానీ..ఇలా వాటర్ప్లాంట్లపై పగబట్టడం మాధవిరెడ్డికే చెల్లిందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత ఆదిత్య వాటర్ప్లాంట్ సీజ్పై చట్టప్రకారం కోర్టులను ఆశ్రయిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.
![Chief Minister Devendra Fadnavis React To Allahbadia Comments Row](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Fadnavis.jpg.webp?itok=1eDS0HfU)
ఇది సమాజం.. తలదించుకునే పనులు చేయకండి: సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
ముంబై : భారత్లో ప్రముఖ యూట్యూబర్, బీర్ బైసెప్స్గా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రణవీర్ అలహాబాదియాకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఇది సమాజం.. తలదించుకునేలా వ్యవహరించకండి అని సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇంతకి ఏం జరిగిందంటే?ఇండియాస్ గాట్ టాలెంట్లో యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా నోరు జారారు. దీంతో అలహాబాదియాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాస్ గాట్ టాలెంట్లో రణ్వీర్ అలహాబాదియా ఓ కంటెస్ట్తో రాయలేని భాషలో ఓ జోకు వేశాడు. ఆ జోక్తో అలహాబాదియాతో సహా పక్కనే ఉన్న గెస్ట్లు, న్యాయనిర్ణేతలు సైతం పగలబడి నవ్వారు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కామెంట్స్ చెలరేగింది. పలువురు న్యాయవాదులు సైతం అలహాబాదియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలహాబాదియా చేసిన కామెంట్స్పై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.‘ అలహాబాదియా చేసిన కామెంట్స్ గురించి నాకు సమాచారం అందింది. అయితే నేను ఆ వీడియోను చూడలేదు. చాలా అసభ్యకరంగా మాట్లాడారని, అలా మాట్లాడటం తప్పే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనం ఇతరుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి. ఎవరైనా వాటిని దాటితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ క్షమాపణలుఓ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా క్షమాపణలు తెలిపాడు. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు రావడంతోపాటు ముంబయిలో పోలీసు కేసు నమోదు చేశారు. హద్దులు దాటినవారిపై చర్యలు తప్పవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ హెచ్చరించిన క్రమంలో రణ్వీర్ అలహాబాదియా క్షమాపణలకు చెప్పక తప్పలేదు.#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD— ANI (@ANI) February 10, 2025
![BRS MLC Kavitha Satirical Comments On Revanth Reddy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/BRS-MLC-Kavitha.jpg.webp?itok=0tY6gqdT)
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
![KSR Comments On YS Jagan Speech Over Chandrababu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/YS-Jagan-Speech-Over-Chandrababu.jpg.webp?itok=FDkM1F5b)
చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన జగన్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి సర్కార్ పనితీరును ఉతికి ఆరేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అరటి పండు ఒలిచి పెట్టినట్లు వివరించారు. పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకి లెక్కలతో కాకుండా.. పక్కా సమాచారంతో, అంకెలతో తన వాదన వినిపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడిగా ప్రజల ముందు నిలబెట్టారు.దాదాపు రెండు గంటలపాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ అనేక అంశాలపై మాట్లాడారు. స్థూలంగా వీటిని నాలుగు విడతలుగా చెప్పవచ్చు కానీ.. అన్నింటినీ ఒకేసారి విడమరచి చెప్పడం ద్వారా ఆయన ప్రజలపై ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా చేసిన దావోస్ యాత్ర.. తరువాతి పరిణామాలు, ఆ టూర్కు ఎల్లోమీడియా ఇచ్చిన బిల్డప్ వంటి అంశాలన్నింటినీ ఈనాడు పత్రిక పాత క్లిప్పింగ్స్ సాయంతోనే వివరించిన తీరు ఆసక్తికరం. ఆనాటి ఈనాడు కథనాలు చూస్తే.. ఏపీకి పరిశ్రమలు వెల్లువలా వచ్చేస్తున్న భ్రమ కలుగుతుంది. వీటిపై వైఎస్ జగన్ వివరిస్తూ ‘2016లో చంద్రబాబు దావోస్ సమ్మిట్కు వెళ్లి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ప్రముఖ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఏపీకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అది రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. ఆ తర్వాత చంద్రబాబు మూడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. అయినా ఆ కంపెనీ ఏపీకి వచ్చింది లేదు.అలాగే, 2017లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం ఏపీకి రాబోతోందని, 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తోందని, 2019లో జెన్ప్యాక్ట్ సంస్థ ఏర్పాటు కాబోతోంది అని ఎల్లోమీడియా గొంతు చించుకుందని ఆధారసహితంగా వివరించారు. ఇవే కాదు.. అప్పట్లో ఏపీకి ఏకంగా 150 సంస్థలు వచ్చేస్తున్నాయని ఈనాడు దినపత్రిక కథనాన్ని ఇచ్చింది. మరో పెద్ద సంస్థ అలీబాబా, ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ మొదలైనవి ఏపీ వైపు చూస్తున్నాయని ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. దావోస్లో ఎవరైనా పారిశ్రామికవేత్తతో చంద్రబాబు బృందం భేటీ అయితే చాలు.. ఆ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కావడమే తరువాయి అన్న చందంగా ఊదరగొట్టేవారు. కానీ, వాటిలో 90 శాతం కంపెనీలు రానేలేదు. ఒకటి, అరా వచ్చాయేమో చెప్పలేం.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రిక, టీవీలు చూసేవారికి చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ భూతల స్వర్గం కాబోతున్నట్లు అనిపించేలా వార్తలు వస్తుంటాయి. అదే వైఎస్ జగన్ అధికారంలో ఉంటే అంతా చీకటే కనిపిస్తుంది. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వచ్చినా అవేవీ వీరికి కనిపించేవి కావు. ఎల్లో మీడియా సరిగ్గా అదే పద్దతిని చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుత టర్మ్లో కూడా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ల రెడ్బుక్.. పారిశ్రామివేత్తలను భయపెడుతోందని, జిందాల్ అంతటి పెద్ద పారిశ్రామికవేత్తపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే, తరిమేస్తే, ఇక్కడ వేరే వారు పరిశ్రమలు పెట్టాలంటే భయపడరా? అని జగన్ ప్రశ్నించడం కరెక్ట్. ఇక చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడుగా జగన్ అభివర్ణించిన తీరు వింటే ఏపీ ప్రజలను మోసం చేసి కూటమి పాలన చేస్తోందా అన్న భావన కలగక మానదు.వైఎస్ జగన్ తన హయాంలో చేసిన అప్పులు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులను పోల్చి చెప్పారు. తాను పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా, అభివృద్ది కూడా జరిగిందని పోర్టులు, వైద్య కళాశాలలు, గ్రామగ్రామాన ప్రభుత్వ భవనాలు నిర్మించానని జగన్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్లో అనుమతించిన అప్పులు చేశారని, బడ్జెట్తో సంబంధం లేకుండా మరో రూ.50వేల కోట్ల అప్పు తెస్తున్నారని జగన్ విడమరిచి చెప్పారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ లేదా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్లు ఎవరైనా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడదు. సూటిగా జవాబు ఇవ్వకుండా ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేసి డైవర్షన్ రాజకీయాలు సాగించడమే కూటమి నేతలు తమ వైఖరిగా పెట్టుకున్నారు. కేశవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిధుల మంజూరులో ఆయనది నామమాత్రపు పాత్రే. ఢిల్లీ వెళ్లి నిధులను టాప్ చేసే అవకాశం ఆయనకు లేదు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సూచన మేరకు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి నిధులు సంపాదించుకు వచ్చిన తీరును ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పోల్చితే ఈ ఏడాది కూటమి సర్కార్కు తక్కువ నిధులు అందాయని, అలాగే ఆర్థిక సంఘం నిధులు కూడా సరిగా రావడం లేదని అధికారులు చంద్రబాబుకు వివరించారట. ఇది ఒక కోణం అయితే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నీతి ఆయోగ్ నివేదిక అంటూ తనకు అనుకూలమైన అంకెలను చెప్పి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానికి జగన్ దిమ్మదిరిగే జవాబు ఇచ్చారు.మొత్తం ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణకు, 2014-19 టర్మ్లో ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులకు పోల్చుకుందామా అని సవాల్ చేశారు. పోనీ ఈ ఏడాది చేసిన అప్పులపై చంద్రబాబు వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న వేశారు. నిజంగానే చంద్రబాబు గత టర్మ్లో దాదాపు రూ.3.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. చిత్రమేమిటంటే ఆ అప్పులను కూడా కలిపి జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వారు దుష్ప్రచారం చేశారు. ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ దుర్మార్గంగా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించి అప్పుడేమో కాని, ఇప్పుడు మాత్రం అప్పుల్ని రూ.14 లక్షల కోట్లకు తీసుకు వెళ్లేలా ఉన్నారని విమర్శించారు.రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ హయాంలో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్న సంగతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు టైమ్లో అలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు అధ్వాన్నంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు అన్నదానికి ఆన్సర్ దొరకదు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అంటూ ఒక్కో పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎగవేసింది జగన్ వివరించారు. అందుకే బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జగన్ అందుకున్నారు.ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, ఒక్క నెల తప్ప, మిగిలిన ఏ నెలలో అయినా మొదటి రోజు జీతాలు చెల్లించారా అని జగన్ అడిగారు. ఇది ఆశ్చర్యకరమే. అటు స్కీములలో ఒక్కటీ అమలు చేయక, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తీర్చకుండా, జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తయారైందో అర్థం కాదు. జనం సంగతి పక్కనపెట్టి, టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ద వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల లక్షల ఉద్యోగాలు తొలగించారని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం షాపులలో సుమారు 18వేల మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరికి ఉద్యోగాలు పోయాయి.రెండున్నర లక్షల మంది వలంటీర్లకు పది వేల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్లో పీహెచ్డీ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని వైఎస్ జగన్ స్పష్టంగా వివరించగలిగారు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Sports
![Rohit Sharma-led India to depart for ICC Champions Trophy on Feb 154](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Team%20india.jpg.webp?itok=558NXtOs)
ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ప్రయాణానికి ముహూర్తం ఖరారు!?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు కౌంట్డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. పాక్ జట్టు ఈసారి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్బోర్డు భావిస్తోంది.అయితే భారత్ ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ సెమీఫైనల్, ఫైనల్కు చేరినా ఈ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఈవెంట్లో పాల్గోనే ఆ దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను సైతం ప్రకటించాయి. ఈ మినీ వరల్డ్కప్ కోసం అన్ని దాదాపు అన్ని తమ సన్నాహకాల్లో బీజీబీజీగా ఉన్నాయి. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ట్రైసిరీస్లో తలపడుతున్నాయి.ముహూర్తం ఖరారు..కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టు దుబాయ్ వెళ్లేందుకు ముహర్తం ఖారారైంది. ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుబాయ్కు పయనం కానుంది. భారత జట్టు ప్రస్తుతం మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేల ముగియగా.. ఆఖరి వన్డే బుధవారం(ఫిబ్రవరి 12) జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మెగా టోర్నీలో పాల్గోనేందుకు రోహిత్ సేన వెళ్లనుంది.అదేవిధంగా స్పోర్ట్స్ టాక్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ప్రతీ ఐసీసీ ఈవెంట్కు ముందు ఆయా జట్లు కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడుతాయి.తొలుత భారత్ కూడా యూఏఈ లేదా బంగ్లాదేశ్తో ఓ వార్మాప్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ జట్ల బీజీ షెడ్యూల్ కారణంగా వార్మాప్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఐసీసీకి వీలుపడలేదు. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
![Surya Kumar Yadav Out For 70 Runs In Ranji Trophy Quarter Final Vs Haryana5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/sky.jpg.webp?itok=g0Z3xZ_v)
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్
గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) భాగంగా హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే ఔటైన స్కై.. రెండో ఇన్నింగ్స్లో 86 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తన జట్టు (ముంబై) కష్టాల్లో ఉన్నప్పుడు (100/3) బరిలోకి దిగిన స్కై.. కెప్టెన్ ఆజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్కు 129 పరుగులు జోడించాడు. అనూజ్ థక్రాల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన స్కై.. ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానేకు (71) జతగా శివమ్ దూబే (7) క్రీజ్లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ముంబై ఆధిక్యం 252 పరుగులుగా ఉంది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే 31, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, అనూజ్ థక్రాల్, జయంత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే సహా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, రహానే 31, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది.చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్యాదవ్ చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్కై.. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. టీ20ల్లో గత 9 ఇన్నింగ్స్ల్లో స్కై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతేడాది అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20లో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ మార్కును తాకాడు. వన్డేల్లో కూడా స్కై పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్కప్కు ముందు ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్ల ఆ సిరీస్లో స్కై.. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్కప్లో స్కై దారుణంగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో స్కై ఆడిన ఏడు మ్యాచ్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్పై చేసిన 49 పరుగులే స్కైకు అత్యధికం.
![Ireland Beat Zimbabwe By 63 Runs In One Off Test6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/irleand.jpg.webp?itok=egsvgZjv)
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్కు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 127 పరుగులు జోడించారు. మెక్బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్కార్తీ 4, ఆండీ మెక్బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి.
![PV Sindhu Injured Out Of Badminton Asia Mixed Team Championships7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/pv.jpg.webp?itok=qlXxEDe6)
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్లు గెలిచి చాంపియన్గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు.
National
![10 February History Today Establishment of Democracy in India4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/history-main.jpg.webp?itok=C8kIXlvl)
Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఫిబ్రవరి 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజును ప్రజాస్వామ్యంలో పండుగ రోజుగా అభివర్ణిస్తారు. దేశంలోని పౌరులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలు పెద్ద సవాలుగా నిలిచాయి.1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూవచ్చారు. 1952 ఫిబ్రవరి 10.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారింది. ఆరోజు నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ లోక్సభలోని 489 సీట్లలో 249 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఈ ఎన్నికలు విజయబావుటా ఎగురవేశాయి.ఫిబ్రవరి 10న భారత్తో పాటు ప్రపంచ చరిత్రలో ప్రముఖంగా నిలిచిన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం.1818: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో బ్రిటిష్ సైన్యం, మరాఠా సైన్యం మధ్య మూడవ, చివరి యుద్ధం జరిగింది.1921: మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు.1921: బ్రిటిష్ పాలకుడు కన్నాట్ డ్యూక్ ఇండియా గేట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.1952: స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది.1990: గెలీలియో అంతరిక్ష నౌక బృహస్పతి వైపు వెళుతూ, శుక్ర గ్రహం ముందునుంచి వెళ్లింది.1996: చదరంగం ఒక మైండ్ గేమ్గా పేరొందింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్- డీప్ బ్లూ మధ్య ఫిబ్రవరి 10న ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో కాస్పరోవ్ 4-2 తేడాతో గెలిచారు. మరుసటి సంవత్సరం ఈ పోటీలో డీప్ బ్లూ విజయం సాధించించారు.2005: బ్రిటన్ యువరాజు చార్లెస్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా పార్కర్తో వివాహాన్ని ప్రకటించారు.2009: ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2008 నవంబర్లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.2010: పాకిస్తాన్లోని పెషావర్ సమీపంలోని ఖైబర్ పాస్ ప్రాంతంలో పోలీసు అధికారుల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 13 మంది పోలీసు అధికారులతో పాటు మొత్తం 17 మంది మృతిచెందారు.2013: అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. 39 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
![ASIC a Guide on Brand Endorsements by Celebrities and Social Media Influencers5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/social-media-main.jpg.webp?itok=5zlPokbf)
వినియోగదారుడా మేలుకో.. ఇన్ఫ్లుయెన్సర్ల మాయాజాలమిదే..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉంటోంది. వీరు ఫేస్బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram) యూట్యూబ్ (YouTube) తదితర డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చేసే పోస్టులకు మంచి రీచ్ వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగదారులపై తమ ఉత్పత్తుల ప్రచారంతో విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే వీరిలోని కొందరు చేసే అడ్వెర్టైజ్మెంట్లు, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఏఎస్సీఐ గతంలో సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన ప్రకటించింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఏఎస్సీఐ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.1. పారదర్శకత: ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్లకు సంబంధించిన వస్తుపరమైన ప్రయోజనాలను బహిర్గతం చేయాలి. ఆ వస్తువు లేదా సేవలకు సంబంధించిన చెల్లింపులు, బహుమతులు, ఉచిత ఉత్పత్తులు లేదా పరిహారం లాంటివి తప్పనిసరిగా వెల్లడించాలి.2. సరైన వివరణ: ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్ గురించి చెబుతున్నప్పుడు అది వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. హ్యాష్ట్యాగ్లు లేదా టెక్స్ట్లో అంతర్గతంగా దాచివుంచకూడదు. ఆ వివరాలు వినియోగదారునికి తెలిసేలా ఉండాలి3. స్పష్టత: ఎండార్స్మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, భాషలో ఉండాలి. అది అడ్వెర్టైజ్మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ లాంటి పదాలను ఉపయోగిస్తూ స్పష్టతవ్వాలి.4. వివిధ ప్లాట్ఫారాలు: ఏఎస్సీఐ వివిధ ప్లాట్ఫారాలకు నిర్దిష్ట రూపంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఇన్ఫ్లుయెన్సర్లు వాటిని గమనించి, ఆ నిర్దిష్ట నియమాలను పాటించాలి.5. ప్రస్తావన: ఇన్ఫ్లుయెన్సర్ మొదటి పోస్ట్లో మాత్రమే కాకుండా, స్పాన్సర్ చేస్తున్న ఉత్పత్తి లేదా సేవను గురించి ప్రస్తావించిన ప్రతిసారీ పారదర్శకత పాటించాలి.6. చట్టపరమైన సమ్మతి: ఇన్ఫ్లుయెన్సర్లు వారుంటున్న ప్రాంతంలోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఈ మార్గదర్శకాలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)లు రూపొందించి, అమలు చేస్తున్నాయి.7. పరిణామాలు: ఇన్ఫ్లుయెన్స ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది. వారికి జరిమానా కూడా విధిస్తారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మార్థదర్శకాలను ఉల్లంఘించినప్పుడు అని వారి ఖ్యాతిని దెబ్బతీస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను కోల్పోతారు. ఏఎస్సీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడం వలన ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్లో నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
![300 Km Long Traffic In Maha Kumbh Mela Road6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/traffic2.jpg.webp?itok=zIpdVQvf)
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్ జామ్ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है? प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025 ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సర్కార్పై సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు. అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల జనజీవనం స్తంభించింది.అందుకే ఉత్తర ప్రదేశ్లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు.
![PM Narendra modis Foreign Visits Complete Timeline 11 Years 86 Foreign Trips7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/modi-main.jpg.webp?itok=-vE9gY7m)
11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
భారదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశంగా ఎంతో కృషి చేస్తున్నారు. గడచిన దశాబ్ధ కాలంలో ప్రధాని మోదీ పలు దేశాలతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. ఈ నేపద్యంలో భారత్ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 10, 2025) ఫ్రాన్స్లో మూడు రోజుల పర్యటనకు బయల్దేరివెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు మోదీ. #WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves for France to co-chair the AI Action Summit. From France, PM Modi will proceed on a two-day visit to the United States at the invitation of President Donald Trump. pic.twitter.com/oxElBtrIDY— ANI (@ANI) February 10, 2025 అయితే గడచిన 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 86 విదేశీ పర్యటనలు జరపడం విశేషం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల జాబితాభూటాన్ (జూన్ 15, 2014 నుండి జూన్ 16, 2014 వరకు)బ్రెజిల్( జూలై 13, 2014 - జూలై 17, 2014)నేపాల్ (ఆగస్టు 03, 2014 - ఆగస్టు 04, 2014)జపాన్ (ఆగస్టు 30, 2014 - సెప్టెంబర్ 03, 2014)అమెరికా(26, 2014 - సెప్టెంబర్ 30, 2014)మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ (నవంబర్ 11, 2014 - నవంబర్ 19, 2014)నేపాల్ (నవంబర్ 25, 2014 - నవంబర్ 27, 2014)సీషెల్స్, మారిషస్, శ్రీలంక (మార్చి 10, 2015 - మార్చి 14, 2015)సింగపూర్ (మార్చి 29, 2015 - మార్చి 29, 2015)ఫ్రాన్స్, జర్మనీ, కెనడా (ఏప్రిల్ 10, 2015 - ఏప్రిల్ 18, 2015)చైనా, మంగోలియా, దక్షిణ కొరియా (మే 14, 2015 - మే 19, 2015)బంగ్లాదేశ్ (జూన్ 06, 2015 - జూన్ 07, 2015)రష్యా(జూలై 06, 2015 - జూలై 13, 2015)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ఆగస్టు 16, 2015 - ఆగస్టు 17, 2015)ఐర్లాండ్ , అమెరికా ( సెప్టెంబర్ 23, 2015 - సెప్టెంబర్ 29, 2015)యునైటెడ్ కింగ్డమ్, టర్కీ(నవంబర్ 12, 2015 - నవంబర్ 16, 2015)మలేషియా, సింగపూర్(నవంబర్ 21, 2015 - నవంబర్ 24, 2015)ఫ్రాన్స్(నవంబర్ 29, 2015 - నవంబర్ 30, 2015)రష్యా(డిసెంబర్ 23, 2015 - డిసెంబర్ 24, 2015)బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా(మార్చి 30, 2016 - ఏప్రిల్ 03, 2016)ఇరాన్ (మే 22, 2016 - మే 23, 2016)ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో (జూన్ 04, 2016 - జూన్ 08, 2016)ఉజ్బెకిస్తాన్ (జూన్ 23, 2016 - జూన్ 24, 2016)మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా(జూలై 07, 2016 - జూలై 11, 2016)వియత్నాం, చైనా(సెప్టెంబర్ 02, 2016 - సెప్టెంబర్ 05, 2016)లావోస్(సెప్టెంబర్ 07, 2016 - సెప్టెంబర్ 08, 2016)జపాన్(నవంబర్ 11, 2016 - నవంబర్ 12, 2016)శ్రీలంక (మే 11, 2017 - మే 12, 2017)జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్(మే 29, 2017 - జూన్ 03, 2017)కజకిస్తాన్(జూన్ 08, 2017 - జూన్ 09, 2017)పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్(జూన్ 24, 2017 - జూన్ 27, 2017)ఇజ్రాయెల్, జర్మనీ(జూలై 04, 2017 - జూలై 08, 2017)చైనా, మయన్మార్(సెప్టెంబర్ 03, 2017 - సెప్టెంబర్ 07, 2017)ఫిలిప్పీన్స్(నవంబర్ 12, 2017 - నవంబర్ 14, 2017)దావోస్ (స్విట్జర్లాండ్)(జనవరి 22, 2018 - జనవరి 23, 2018)జోర్డాన్, పాలస్తీనా, యుఎఈ, ఒమన్(ఫిబ్రవరి 09, 2018 - ఫిబ్రవరి 12, 2018)స్వీడన్, యూకె, జర్మనీ(ఏప్రిల్ 16, 2018 - ఏప్రిల్ 20, 2018)చైనా (ఏప్రిల్ 26, 2018 - ఏప్రిల్ 28, 2018)నేపాల్(మే 11, 2018 - మే 12, 2018)రష్యా (మే 21, 2018 - మే 22, 2018)ఇండోనేషియా, మలేషియా, సింగపూర్(మే 29, 2018 - జూన్ 02, 2018)చైనా(జూన్ 09, 2018 - జూన్ 10, 2018)రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా(జూలై 23, 2018 - జూలై 28, 2018)నేపాల్(ఆగస్టు 30, 2018 - ఆగస్టు 31, 2018)జపాన్(అక్టోబర్ 27, 2018 - అక్టోబర్ 30, 2018)సింగపూర్(నవంబర్ 13, 2018 - నవంబర్ 15, 2018)మాల్దీవులు(నవంబర్ 17, 2018 - నవంబర్ 17, 2018)అర్జెంటీనా(నవంబర్ 28, 2018 - డిసెంబర్ 03, 2018)దక్షిణ కొరియా(ఫిబ్రవరి 21, 2019 - ఫిబ్రవరి 22, 2019)మాల్దీవులు, శ్రీలంక (జూన్ 08, 2019 - జూన్ 09, 2019)కిర్గిజ్స్తాన్(జూన్ 13, 2019 - జూన్ 14, 2019)జపాన్ పర్యటన (జూన్ 27, 2019 - జూన్ 29, 2019)భూటాన్(ఆగస్టు 17, 2019 - ఆగస్టు 18, 2019)ఫ్రాన్స్, యూఎఈ, బహ్రెయిన్(ఆగస్టు 22, 2019 - ఆగస్టు 27, 2019)రష్యా (సెప్టెంబర్ 04, 2019 - సెప్టెంబర్ 05, 2019)అమెరికా(సెప్టెంబర్ 21, 2019 - సెప్టెంబర్ 28, 2019)సౌదీ అరేబియా(అక్టోబర్ 28, 2019 - అక్టోబర్ 29, 2019)థాయిలాండ్(నవంబర్ 02, 2019 - నవంబర్ 04, 2019)బ్రెజిల్(నవంబర్ 13, 2019 - నవంబర్ 15, 2019)బంగ్లాదేశ్(మార్చి 26, 2021 - మార్చి 27, 2021)అమెరికా(సెప్టెంబర్ 22, 2021 - సెప్టెంబర్ 25, 2021)ఇటలీ, స్కాట్లాండ్(అక్టోబర్ 29, 2021 - నవంబర్ 02, 2021)జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ (మే 02, 2022 - మే 05, 2022)నేపాల్ (మే 16, 2022 - మే 16, 2022)జపాన్ (మే 23, 2022 - మే 24, 2022)జర్మనీ, యూఏఈ(జూన్ 26, 2022 - జూన్ 28, 2022)ఉజ్బెకిస్తాన్( సెప్టెంబర్ 15, 2022 - సెప్టెంబర్ 16, 2022)జపాన్(సెప్టెంబర్ 27, 2022 - సెప్టెంబర్ 27, 2022)ఇండోనేషియా(నవంబర్ 14, 2022 - నవంబర్ 16, 2022)జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా(మే 19, 2023 - మే 25, 2023)అమెరికా, ఈజిప్టు(జూన్ 20, 2023 - జూన్ 25, 2023)ఫ్రాన్స్, యూఏఈ(జూలై 13, 2023 - జూలై 15, 2023)దక్షిణాఫ్రికా, గ్రీస్(ఆగస్టు 22, 2023 - ఆగస్టు 26, 2023)ఇండోనేషియా (సెప్టెంబర్ 06, 2023 - సెప్టెంబర్ 07, 2023)దుబాయ్ పర్యటన (నవంబర్ 30, 2023 - డిసెంబర్ 01, 2023)యూఏఈ, ఖతార్(ఫిబ్రవరి 13, 2024 - ఫిబ్రవరి 15, 2024)భూటాన్(మార్చి 22, 2024 - మార్చి 23, 2024)ఇటలీ(జూన్ 13, 2024 - జూన్ 14, 2024)రష్యా, ఆస్ట్రియా(జూలై 08, 2024 - జూలై 10, 2024)పోలాండ్, ఉక్రెయిన్(ఆగస్టు 21, 2024 - ఆగస్టు 23, 2024)బ్రూనై,సింగపూర్(సెప్టెంబర్ 03, 2024 - సెప్టెంబర్ 05, 2024)అమెరికా(సెప్టెంబర్ 21, 2024 - సెప్టెంబర్ 24, 2024)లావోస్(అక్టోబర్ 10, 2024 - అక్టోబర్ 11, 2024)రష్యా(అక్టోబర్ 22, 2024 - అక్టోబర్ 23, 2024)నైజీరియా, బ్రెజిల్, గయానా(నవంబర్ 16, 2024 - నవంబర్ 22, 2024)ప్రధాని మోదీ కువైట్ పర్యటన (డిసెంబర్ 21, 2024 - డిసెంబర్ 22, 2024)ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
International
NRI
![Relief for H-1B Trump citizenship order blocked indefinitely2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/H1BVisa.jpg.webp?itok=lxZJNy93)
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్
![Adopt A Street And Beauty And Protect Event By NATS Dallas Chapter3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/nats1.jpg.webp?itok=_gY4T4mM)
టెక్సాస్లో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం..!
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తన సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 2 వ తేదీ ఆదివారం నాడు ప్రిస్కో, టెక్సాస్లో అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 50 మందికి పైగా స్వచ్చంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, టీల్ & లెగసీ మధ్య రెండు మైళ్ల దూరం ఉన్న ఫీల్డ్స్ పార్క్వే వీధిని శుభ్రం చేశారు. అందులో సగం మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం విశేషం. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు నేర్పించగలగటం ముఖ్య ఉద్దేశ్యమని టెక్సాస్ నాట్స్ సభ్యులు పేర్కొన్నారు. డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ , శ్రవణ్ నిడిగంటి లు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారరందరికి కృతజ్ఞతలు తెలిపారు. డల్లాస్ చాప్టర్ వారు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, డల్లాస్ టీం అడ్వైజర్ కవిత దొడ్డ, నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, డల్లాస్ చాప్టర్ సభ్యులు బద్రి బియ్యపు, పావని నున్న, కిరణ్ నారె, శివ మాధవ్, వంశీ కృష్ణ వేనాటి, సాయిలక్ష్మి నడిమింటి మరియు ఇతర నాట్స్ డల్లాస్ సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ సమాజ సేవలో ముందుండి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి ప్రశంసించారు. అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అందరిని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.(చదవండి: ట్రంప్ దెబ్బకు..పీడ కలగా అమెరికా చదువు..!)
![Donald Trumps Immigration Policy Mar Indian Study Abroad Aspirations4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/3/us-study.jpg.webp?itok=soDnYHgO)
ట్రంప్ దెబ్బకు..పీడ కలగా అమెరికా చదువు..!
అమెరికాలో చదువుకోవడం అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. అందుకోసం ఎన్నో ప్రయాసలుపడి, అప్పులు చేసి అమెరికాకు వస్తారు. ఎలాగోలా కష్టపడి మంచి యూనివర్సిటీలో సంబందిత కోర్సుల్లో జాయిన్ అయ్యి చదువుకుంటారు. అలాగే తల్లిదండ్రులకు భారం కాకుండా తమ ఖర్చుల కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాక..గ్రీన్కార్డ్ కోసం పాట్లుపడి ఏదోలా అక్కడే స్థిరపడేవారు. అలా అమెరికాలో జీవించాలనే కోరికను సాకారం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప దెబ్బకు భారత విద్యార్థులకు ఆ ధీమా పోయింది. అసలు అక్కడ చదువు సజావుగా పూర్తి చేయగలమా అనే భయాందోళనతో గడుపుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు కచ్చితంగా పనినిబంధనలు పాటించాలనే కొత్తి ఇమ్మిగ్రేషన్ చట్టాల నేపథ్యంలో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. అస్సలు అక్కడ ఉండాలో వెనక్కొచ్చేయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది విద్యార్థులు. అసలెందుకు ఈ పరిస్థితి..? భారతీయ విద్యార్థులు ఈ సమస్యను ఎలా అధిగమించొచ్చు తదితరాల గురించి తెలుసుకుందాం..!.ఇంతకుమునుపు వరకు అమెరికాలో చదువుకోవాలనుకునే చాలామంది భారతీయ విద్యార్థులు బ్యాంకు రుణం తీసుకునేవారు. ఆ తర్వాత జీవన ఖర్చులను భరించడానికి పార్ట్టైమ్గా పనిచేయడం, ఏదోలా ఉద్యోగం పొందడం, H-1B వీసా పొందడం వంటివి చేసేవారు. ఇక ఆ తర్వాత తమ విద్యా రుణాన్ని తిరిగి చెల్లించి అక్కడే స్థిరపడేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇదంతా చూడటానికి చాలా సింపుల్గా కనిపించినా..అందుకోసం మనవాళ్లు చాలా సవాళ్లనే ఎదుర్కొంటారు. అది కాస్తా ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని మరింత కఠినంగా మారిపోయింది. అసలు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏంటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అగ్రరాజ్యంలో చదువుకోవడానికి వచ్చిన చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి పంపిస్తే వచ్చినవారే. వారంతా తమ ఖర్చులు కోసం తామే చిన్న చితకా ఉద్యోగాలు చేసి చదుకోవాల్సిందే. ఇప్పుడేమో ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం ..చదువుకునే విదేశీ విద్యార్థులంతా పని నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి. పైగా స్టూడెంట్ వీసాలు కఠినమైన పరిమితుల కిందకు వచ్చాయి. ఇంతకుమునుపు ఎఫ్1 వీసా ఉన్నవారు సాధారణంగా విద్యా నిబంధనల సమయంలో వారానికి 20 గంటలు, సెలవులు, విరామ సమయాల్లో వారానికి 40 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధన ప్రకారం..పరిమితలుకు మించి పనిచేయడం లేదా క్యాంపస్ వెలుపల అనధికార ఉపాధి చేపడితే విద్యార్థి హోదాను కోల్పోవడం తోపాటు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు..సజావుగా స్టడీస్ పూర్తి చేయాలంటే..విద్యార్థులు అమెరికాలో తమ స్టడీస్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే..తమ వీసా స్థితికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. విద్య నాణ్యత, కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉండే టైర్ 1 లేదా టైర్ 2 లాంటి విద్యా సంస్థలలో చదువుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ట్యూషన్ ఖర్చులు విషయమై ఆందోళన చెందకుండా క్యాంపస్లోనే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే చదువుకు సంబంధంలేని ఉపాధి చేయడానికి లేదనే నిబంధన ఉంది కాబట్టి వీసా నిబంధనను ఉల్లంఘించకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేయపోవడమే మంచిది. అలాగే విద్యార్థులు తమ విద్యా సంస్థలోని అంతర్జాతీయ విద్యార్థి కార్యాలయాన్ని సంప్రదించడం లేదా సందేహం వచ్చినప్పుడు న్యాయ సలహ తీసుకోవడం వంటివి చేస్తే.. వీసా సంబంధిత కఠిన సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. అలాగే అక్కడ వసతికి సంబంధించిన అంతరాయలను కూడా సులభంగా నివారించుకోగలుగుతారు. కఠినతరమైన సమస్యలు, ఆంక్షలు అటెన్షన్తో ఉండి, నేర్పుగా పని చక్కబెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తాయే గానీ భయాందోళనలతో బిక్కుబిక్కుమని గడపటం కాదని నిపుణులు చెబుతున్నారు.-చిట్వేల్ వేణుగమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్ఆర్ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.(చదవండి: ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
![Vasavi Mata Agnipravesha Day celebrations in Dublin Ireland5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/1/NRI-Vasavi-1.jpg.webp?itok=bQ45DTq4)
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వందమందికి పైగా వాసవి మాత భక్తులు ,కార్యక్రమ నిర్వాహక సభ్యులు, స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కొరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో అమ్మవార్ని అలంకరించారు. పల్లకి సేవ అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనము, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.హాజరైన భక్తులందరికీ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికి బోజనాలను వడ్డించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, , రేణుక మరియు శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ మరియు మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు, నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.
Sakshi Originals
![Tech Layoffs: Layoffs at US tech companies in 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/AP22.jpg.webp?itok=kvOqU0yf)
బాబూ.. బయటకు దయచెయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా టెక్ కంపెనీల్లో(US tech companies) ఉద్యోగుల కోత(Layoffs) కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్ఫోర్స్, వాల్మార్ట్, స్ట్రైప్ తదితర సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్కు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో యూఎస్లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49,795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82,307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కనీసం 25 కంపెనీలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3,53,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందజేశాయి. యూఎస్లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. వరుస కట్టిన సంస్థలు.. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్లలోని కన్సాలిడేషన్లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరి్మనేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు. గూగుల్లో స్వచ్ఛందంగా.. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్ట్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది.
![Sakshi Special Story About Jadala Ramalingeswara Swamy Temple](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/jadala.jpg.webp?itok=Ksb_rJRK)
పరశురామ ప్రతిష్ఠిత.. జడల రామలింగేశ్వరుడు
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ
![Memes galore as BJP defeats AAP to win Delhi elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/M-4.jpg.webp?itok=ICvNx9VU)
మీమ్స్ వరద...
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గత రెండు పర్యాయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ మీమ్స్ వెల్తువెత్తగా ఈసారి మీమ్స్ సృష్టికర్తల దృష్టంతా ఆప్ మీదనే పడింది. దీనికి తగ్గట్లు ఆప్ను, కేజ్రీవాల్ నేతగణాన్ని విమర్శల జడివానలో ముంచేస్తూ కుప్పలు తెప్పలుగా మీమ్స్.. సామాజిక మాధ్యమ సంద్రంలోకి కొట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2023లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి కాస్తంత హాస్యం జోడించి వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో జనం షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ పలు రకాల కుట్రలు పన్నుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెగ కలలు కంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ను ఓడించలేరని బీజేపీ నేతలకు సైతం తెలుసు. ప్రధాని మోదీకి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’’అని కేజ్రీవాల్ అన్నారు. 2017లోనూ కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ఢిల్లీ రాష్ట్రానికి రాజకీయ పెద్దలం అంటే మేమే. మీమిచ్చే ఆదేశాలనే ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఢిల్లీని మేమే పరిపాలిస్తాం’’అని కేజ్రీవాల్ ఆనాడు అన్నారు. ఇంత బీరాలు పోయిన కేజ్రీవాల్నే బీజేపీ మట్టికరిపించిందంటూ కొత్త మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఆప్ అటు, కాంగ్రెస్ ఇటు పరుగు పోటీలో అభ్యర్థులకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు తగిలించి కొందరు నెటిజన్లు కొత్త మీమ్ సృష్టించారు. అందులో బీజేపీ, ఆప్ ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ వెనక్కు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు సరదా ఫొటోను సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సున్నాగా నమోదవడం తెల్సిందే. దీనిని గుర్తుతెచ్చేలా పెట్రోల్ బంక్ వద్ద వాహనదారునికి సిబ్బంది ‘‘పెట్రోల్ కొడుతున్నా. ముందు మీటర్ రీడింగ్ సున్నా వద్దే ఉంది. చెక్చేసుకోండి సర్’’అన్నట్లు ఒక ఫొటోను రూపొందించారు. అయితే ఆ పెట్రోల్లో రాహుల్గాంధీ పనిచేస్తున్నట్లు సరదా మీమ్ను సృష్టించారు. ఆప్ వైఫల్యాలకు తగు కారణాలను పేర్కొంటూ ఇంకెన్నో మీమ్స్ వచ్చాయి. ఆప్ మాజీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ను కేజ్రీవాల్ సహాయకుడు చితకబాదగా ఓటర్లు ఆప్ను చావుదెబ్బ తీశారని మరో మీమ్ వచి్చంది. ఐక్యత సున్నా విపక్షాల ‘ఇండియా’కూటమి అంటూ ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు తీరా ఢిల్లీ ఎన్నికల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకోవడంపైనా మీమ్స్ వచ్చాయి. రెజ్లింగ్ రింగ్లోకి కేజ్రీవాల్ యమా హుషారుగా దూసుకొచ్చి తొడ కొడుతుంటే ఒక్క దెబ్బతో మోదీ ఆయనను మట్టి కరిపించి బరి ఆవలికి విసిరేసినట్లు చూపే మరో మీమ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్గా మారింది. బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న తనను ఎవరూ మెచ్చుకోవట్లేదని స్వాతి మలివాల్ బాధపడుతుంటే దూరంగా నిల్చుని చూస్తున్న మోదీ వెంటనే అభినందనలు తెలుపుతున్నట్లు ఒక మీమ్ వీడియోను సృష్టించారు. ఎన్నికల క్రీడలో బీజేపీ, ఆప్సహా అన్ని పారీ్టలు గెలుపు కోసం ఆడుతుంటుంటే కాంగ్రెస్ మాత్రం తనకేం అక్కర్లేదన్నట్లు ఒక బెంచీపై కూర్చుని సరదాగా చూస్తున్నట్లు మరో మీమ్ను సృష్టించారు. మాకే ఎక్కువ ఆనందం ఈసారి గెలిచినందుకు మాకు ఆనందంగా ఉందని మోదీ, అమిత్ షా ఇద్దరూ నవ్వుకుంటుంటే.. మీ కంటే ఎక్కువ ఆనందం మాకే ఉందని అన్నా హజారే, స్వాతి మలివాల్, మరో మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్ శర్మ చెబుతున్నట్లు ఉన్న మరో మీమ్ సైతం బాగా షేర్ అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ఎన్నికల్లో ఓడిన ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్లు బాధతో బనియన్, టవల్ మీద ఉన్న కేజ్రీవాల్కు పర్లేదులే అంటూ ఆనందంగా తీసుకొస్తున్న మీమ్ తెగ నవి్వంచేలా ఉంది. అనార్కలీలాగా ఆప్ నాయకురాలు అతిశీ సింగ్ నేలపై పడిపోతే సలీమ్లాగా కేజ్రీవాల్ వచ్చి లేపుతూ.. ‘‘లే అనార్కలీ. ఇప్పుడు మనం మన ఓటమికి ఈవీఎంలో అక్రమాలే కారణం అని కొత్త పల్లవి అందుకోవాలి’’అని ఆమెను తట్టిలేపుతున్నట్లు మరో మీమ్ ఇప్పుడు బాగా నవ్వు తెప్పిస్తోంది. గతంలో జనాన్ని కేజ్రీవాల్ తన చీపురుతో తరిమికొడితే, ఇప్పుడు జనం చీపురుకు నిప్పు పెట్టి కేజ్రీవాల్ను కొడుతున్నట్లు రూపొందించిన మరో మీమ్ ఇప్పుడు సోషల్మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. పార్టీ ఓటమితోపాటు ఆప్ అగ్రనేతలూ ఓటమిని చవిచూశారంటూ.. ‘‘గుడిలో ప్రసాదంగా ఏమైనా పెడతారని లోపలికి వెళితే అప్పటికే పొంగళి అయిపోయింది. సర్లే అని బయటికొస్తే అప్పటికే చెప్పులూ పోయాయి’’అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నట్లు మరో వ్యంగ్య వీడియోను నెటిజన్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశారు.
![Kejriwal alone is to be blamed for AAP defeat in Delhi Assembly Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/220120251446-PTI01_22_2025_.jpg.webp?itok=4XFffNVW)
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్
నాగచైతన్య తండేల్.. మహిళ అభిమాని ఫుల్ ఎమోషనల్
టాటా బోయింగ్ అరుదైన ఘనత: 300వ AH-64 అపాచీ ఫ్యూజ్లేజ్
హ్యాట్సాఫ్ పోలీస్ మూవీకి అంతర్జాతీయ అవార్డులు
రంగరాజన్పై దాడి..పోలీసుల కీలక ప్రకటన
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి
ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
‘లక్కీ భాస్కర్’.. కరీంనగర్ టు దుబాయ్.. వయా జగిత్యాల
పోన్లెండి! కలిసి ఓడిపోయారు!
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
వచ్చే ఎన్నికల్లో నోటాను కూడా కలుపుకొనిపోదాం కామ్రేడ్!
జేఈఈ మెయిన్లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్మెంట్స్కి వెళ్లలేదు..
‘రైతు భరోసా’ వద్దట
సస్పెక్ట్ షీటర్ దారుణహత్య
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
ట్రంప్తో ట్రబుల్సే.. అక్కడెందుకిక.. ఇంటికొచ్చేయక
క్రైమ్
![One Person Arrest In Banjara Hills police](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/132323.jpg.webp?itok=s6SkAMW8)
Banjara Hills: అక్కా అంటూ పరిచయం చేసుకుని...
బంజారాహిల్స్(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్గా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. అదే కంపెనీ బిల్డింగ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్పై నిద్రకు ఉపక్రమించింది. అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![50 percent injured person](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/221.jpg.webp?itok=cqrllGgq)
భార్యతో గొడవపడి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
రాంగోపాల్పేట్ (హైదరాబాద్) : భార్యతో గొడవ పడిన భర్త..ఆమె పనిచేసే దుకాణానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమలగూడ తాళ్లబస్తీకి చెందిన శ్రవణ్కుమార్ రాణిగంజ్లోని బేరింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆమెపై అనుమానంతో కొట్టడం, తిట్టడం చేస్తుండటంతో ఎనిమిదేళ్లుగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. శ్రవణ్కుమార్ తాళ్లబస్తీలో ఉంటుండగా మౌనిక దోమలగూడలో నివసిస్తూ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్్క్సలో రెండున్నరేళ్లుగా క్యాషియర్గా పని చేస్తోంది. విడివిడిగా ఉంటున్నా ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. అలాగే కుమార్తె కూడా గత 8 నెలల నుంచి శ్రవణ్కుమార్ వద్దే ఉంటోంది. పెట్రోల్ బాటిళ్లతో వచ్చి.. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్్క్సకు కుమార్తెతో సహా వచి్చన శ్రవణ్కుమార్ భార్యతో గొడవ పడ్డాడు. షాపులో పనిచేసే సిబ్బంది అతడిని వారించి బయటకు పంపించారు. మళ్లీ 8.15 గంటలకు షాపు వద్దకు వచి్చన శ్రవణ్కుమార్ తనతో పాటు వాటర్ బాటిళ్లలో పెట్రోల్ తీసుకుని వచ్చాడు. రావడం రావడమే ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బాటిల్లోని పెట్రోల్ను కింద పోశాడు. సిబ్బంది అతడిని వారిస్తుండగానే చేతిలో ఉన్న లైటర్తో నిప్పంటించాడు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అతనికి అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొన్ని చీరెలు, సామగ్రితో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లు కాలిపోయాయి. 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి... సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, మార్కెట్ పోలీసులు, షోరూం సిబ్బంది కలిసి మంటలను ఆరి్పవేశారు. సకాలంలో మాల్లోని సిబ్బంది తమ దగ్గర ఉన్నఅగ్నిమాపక పరికరాలతో మంటలను కొద్దిగా అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రవణ్కుమార్ 50శాతంకు పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహంకాళి ఏసీపీ సర్ధార్సింగ్, మార్కెట్ ఎస్ఐ శ్రీవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
![Huge Hawala Angle in GBR Crypto Case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/12122.jpg.webp?itok=WZm0_97s)
‘లక్కీ భాస్కర్’.. కరీంనగర్ టు దుబాయ్.. వయా జగిత్యాల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) పేరిట అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ‘లక్కీ భాస్కర్’(Lucky Baskhar) సినిమా తరహాలో దేశం దాటిపోదామనుకున్న రమేశ్గౌడ్ (Ramesh Goud) కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు వసూలు చేసిన మొత్తంలో దాదాపు రూ.40 కోట్ల వరకు హవాలా ద్వారా దుబాయ్కి పంపినట్లు తెలిసింది. ఇందుకోసం అతను పలువురు హవాలా వ్యాపారులను ఆశ్రయించినట్లు సమాచారం. మొత్తం వసూలు చేసిన డబ్బును జగిత్యాల, వరంగల్ జిల్లాలోని హవాలా వ్యాపారుల సాయంతో హైదరాబాద్ మీదుగా దుబాయ్కి పంపారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో జీబీఆర్ రమేశ్గౌడ్ (Ramesh Goud) తాను ఎక్కడా దొరకకూడదన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. డబ్బుకు ఆశపడి అతడి మాటలు నమ్మిన బాధితులు వెంటనే తేరుకున్నారు. అతని ప్రతీ కదలిక, ప్రతీ లావాదేవీలను ఎప్పటికపుడు కనిపెట్టి సీఐడీకి అప్పగించారు. ఇందులో భాగంగానే ఇటీవల కరీంనగర్ సీఐడీ డీఎస్పీ పలుమార్లు రమేశ్గౌడ్తో రహస్య సమావేశాల వివరాలు కూడా ఉన్నతాధికారులకు అందించారు. దీంతో అతనిపై వేటు పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంతకాలమైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ బాధితులు త్వరలో కరీంనగర్ సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నా చేసే ఆలోచనలో ఉన్నారు.ఆధునిక విధానంలో వసూలుక్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న పెట్టుబడి కావడంతో సహజంగానే బాధితులు అతని మాటలు నమ్మారు. పైగా రామోజీ ఫిలింసిటీ, గోవా, సింగపూర్, మలేసియా, దుబాయ్ దేశాల్లో ఖరీదైన ఈవెంట్లు పెట్టడంతో కస్టమర్లు అతని జీబీఆర్ క్రిప్టోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇక్కడే రమేశ్గౌడ్ చాలా ఆధునికంగా ఆలోచించాడు. కస్టమర్ల నుంచి తొలుత దాదాపు రూ.30కోట్లకుపైగా డబ్బును కస్టమర్లు నగదు రూపంలో చెల్లించారని తెలిసింది. కస్టమర్లు మరీ అధికంగా డబ్బులు కడుతుండటంతో ఐటీకి చిక్కుతామని తెలివిగా వ్యవహరించాడు. అప్పటి నుంచి కస్టమర్ల నుంచి పెట్టుబడులను క్రిప్టో కాయిన్స్ అయిన బీఎన్బీ, యూఎస్డీటీ, క్రిప్టో వ్యాలెట్లు అయిన ట్రస్ట్వ్యాలెట్, బినాన్స్, వజ్రిక్స్ తదితర వాలెట్ల ద్వారా సేకరించాడు.రూ.10 నోటు ద్వారానే అధికంవిదేశాల్లో వ్యక్తులకు అడిగినంత డబ్బును అందజేయడానికి హవాలా వ్యాపారులు ఉంటారు. ఉదా: రూ.కోటిని దుబాయ్కి పంపాలనుకుంటే.. అక్కడ తమ కమీషన్ మినహాయించుకుని మిగిలిన డబ్బును వారు చెప్పిన వ్యక్తికి అందిస్తారు. అది ఇవ్వాలంటే రూ.10 నోటును చింపి ఇస్తారు. విదేశాలకు వెళ్లి చినిగిన ముక్కను ఇస్తే.. మిగిలిన డబ్బు అందిస్తారు. ఇదే తరహాలో రమేశ్గౌడ్ తనకు రావాల్సిన డబ్బును హవాలా మార్గంలో సేకరించాడు. తాను చెప్పిన హవాలా వ్యాపారి వద్ద డబ్బులు కట్టించాడు. ఆ డబ్బును తాను ఇండియాలో కాకుండా తెలివిగా దుబాయ్లో డ్రా చేసుకున్నాడు. అలా హవాలా, క్రిప్టో వ్యాలెట్ల ద్వారా డబ్బును దుబాయ్లో డాలర్ల రూపంలోకి మార్చుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.40 కోట్ల డాలర్ల వరకు డ్రా చేసుకుని అలా అక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు. అలా అక్కడ పదేళ్ల వరకు నివసించేలా వీసా సంపాదించడాన్ని సీఐడీ అధికారులు కూడా గుర్తించిన విషయం తెలిసిందే. దేశం దాటిపోయిన బాధితుల డబ్బును తిరిగి తీసుకురావడం సీఐడీకి సవాలుగా మారింది. మనీలాండరింగ్ జరిగిన నేపథ్యంలో కేసు సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.Hyderabad: అవినీతి మకిలి.. అధ్వానపు పాలన
![Student ends life in Nalgonda](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/6455.jpg.webp?itok=lA2vN3n9)
చిన్న కారణానికే ఎంత దారుణం
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్నగర్లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రెండో కుమారుడు చౌటుప్పల్లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలుపోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు.
వీడియోలు
![KTR Comments On Congress Govt1](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ktj.jpg.webp?itok=JbBZeu3g)
![KTR Comments On Congress Govt1](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ktj.jpg.webp?itok=JbBZeu3g)
KTR: దుర్యోధనుడు పాలించినట్లు కాంగ్రెస్ పాలన!
![Disqualification Of Defector MLAs Case Hearing Postponed In Supreme Court2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/o.jpg.webp?itok=meslo352)
![Disqualification Of Defector MLAs Case Hearing Postponed In Supreme Court2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/o.jpg.webp?itok=meslo352)
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
![Big Twist In Telangana Panchayat Elections 3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/31.png.webp?itok=YYCK1u_m)
![Big Twist In Telangana Panchayat Elections 3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/31.png.webp?itok=YYCK1u_m)
తెలంగాణలో ఏకగ్రీవ ఎన్నికలకు బ్రేక్
![Supreme Court To Hearing Defection Postponed4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/30.png.webp?itok=xzx_2dzO)
![Supreme Court To Hearing Defection Postponed4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/30.png.webp?itok=xzx_2dzO)
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
![BRS Rythu Maha Dharna At Kosgi5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/21.png.webp?itok=K7Z0C_tT)
![BRS Rythu Maha Dharna At Kosgi5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/21.png.webp?itok=K7Z0C_tT)
BRS రైతు మహాధర్నా
![BRS No-Confidence Motion Against Hyderabad Mayor Gadwal Vijayalakshmi6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/20.png.webp?itok=zfXOP2sh)
![BRS No-Confidence Motion Against Hyderabad Mayor Gadwal Vijayalakshmi6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/20.png.webp?itok=zfXOP2sh)
నేటితో GHMC పాలకమండలి ఏర్పడి నాలుగేళ్లు పూర్తి
![Party Changed MLAs Disqualification Petition 7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/19.png.webp?itok=EtBH7M06)
![Party Changed MLAs Disqualification Petition 7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/19.png.webp?itok=EtBH7M06)
ఫిరాయింపు MLAలపై సుప్రీంకోర్టు విచారణ
![Massive Fire Incident In Old City8](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/11.png.webp?itok=1ySfyqds)
![Massive Fire Incident In Old City8](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/11.png.webp?itok=1ySfyqds)
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
![Supreme Court Hearing On MLA Disqualification Petition9](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/10_0.png.webp?itok=DMysm0IA)
![Supreme Court Hearing On MLA Disqualification Petition9](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/10_0.png.webp?itok=DMysm0IA)
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ
![BRS MLA Padi Kaushik Reddy Exclusive Interview 10](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/8.png.webp?itok=dGg9Z-bc)
![BRS MLA Padi Kaushik Reddy Exclusive Interview 10](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/8.png.webp?itok=dGg9Z-bc)
బీఆర్ ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ