Politics
మంత్రి అచ్చెన్నాయుడుకు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?. ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు.
బాబుది చారిత్రక తప్పిదం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. .. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్ ఖాతాలో కోరారాయన. పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025 భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కిషన్ రెడ్డి.. మీకేం తెలుసు: అజారుద్దీన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అజారుద్దీన్ కౌంటరిచ్చారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తనను దేశ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి అజారుద్దీన్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కిషన్ రెడ్డి.. మీరేం మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు. నేను హిందూ, ముస్లిం అన్ని వర్గాల వాడిని.. అందరివాడిని. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన నేను దేశ ద్రోహినా?. నా దేశభక్తిపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం ఏ శాఖలు ఇచ్చినా సంతోషమే.. నాకు ఇవి ఇవ్వాలని నేను అడగడం లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.కిషన్రెడ్డి ఆరోపణలు.. ఇక, అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అజారుద్దీన్పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడి భారత్కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.టీపీసీసీ విమర్శలు..మరోవైపు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. తాజాగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు. అజార్కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Sports
భారత్ ఆశలన్నీ రిషబ్ పంత్ పైనే..
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న తొలి అనాధికారిక టెస్టు రసవత్తరంగా మారింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఎ టీమ్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో భారత్ విజయానికి ఇంకా 156 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్(64), ఆయూష్ బదోని(0) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో పంత్ నిరాశపరిచినప్పటికీ (17 పరుగులు).. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతమైన నాక్ ఆడుతున్నాడు. భారత్ ఆశలన్నీ పంత్ పైనే ఉన్నాయి. పంత్తో పాటు బదోని కూడా రాణించాల్సిన అవసరముంది. వీరిద్దరూ ఔటైతే తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్లు ఎవరూ లేరు.30/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా-ఎ టీమ్.. అదనంగా 169 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో లెసెగో సెనోక్వానే (37), జుబేర్ హంజా (37) రాణించారు.సత్తాచాటిన తనుశ్ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత-ఎ జట్టు మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో తీవ్ర నిరాశపరిచింది. భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదన్పించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు
సెమీస్లో గెలిస్తే సంబరమే..! కానీ ఫైనల్లో ఆ తప్పులు చేశారంటే?
భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి మనం మహిళల క్రికెట్లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.ఫీల్డింగ్ మారుతుందా?ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి.. ఫీల్డింగ్, బౌలింగ్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్కు మ్యాచ్కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటివరకు 18 క్యాచ్లు జారవిడిచింది. అత్యధిక క్యాచ్లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన అగ్రస్దానంలో నిలిచింది.ఆసీస్తో సెమీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సునాయస క్యాచ్ను జారవిడించింది. మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మన అమ్మాయిల జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ ఈవెంట్లో ఇప్పుటివరకు భారత్ మొత్తం 74 మిస్ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవర్త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్లో మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.డెత్ బౌలింగ్ కష్టాలు..బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీ చరణి మినహా మిగితా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది.రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికి ఆరంభంలో పిచ్ స్వింగ్కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైనల్లో హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్ను పక్కన పెట్టిమరి రాధా యాదవ్ను తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ ఆడపదడప ప్రదర్శనలు చేస్తున్నప్పటికి.. ఫైనల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కన్పిస్తోంది.భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం తేటతెల్లమైంది. 251 పరుగుల లక్ష్య చేధనలో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భారత్ బౌలర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ మ్యాచ్లో భారత్ అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్లో అదే సౌతాఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్, ఫీల్డింగ్లో భారత్ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక బ్యాటింగ్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.అదేవిధంగా లీగ్ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్లో విఫలమైంది. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు
సెలక్టర్లకు వార్నింగ్.. మళ్లీ శతక్కొట్టిన టీమిండియా స్టార్
రంజీ ట్రోఫీ-2025 సీజన్లో టీమిండియా వెటరన్, కర్ణాటక స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న నాయర్.. మరో అద్బుతమైన ఫస్ట్ క్లాస్ సెంచరీతో చెలరేగాడు.రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ నాయర్ శతక్కొట్టాడు. కేవలం 163 బంతుల్లోనే తన 26వఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అతడు అందుకున్నాడు. నాయర్ ప్రస్తుతం 116 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా విదర్భ తరఫున ఆడిన కరుణ్ నాయర్.. ప్రస్తుత రంజీ సీజన్లో తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన నాయర్(73).. ఆ తర్వాత గోవాతో జరిగిన మ్యాచ్లో భారీ శతకం(174)తో కదం తొక్కాడు. ఇప్పుడు కేరళపై కూడా మూడంకెల స్కోరును అందుకున్నారు.కరుణ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి సెలక్టర్లు తొలగించారు. అతడి స్థానంలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్కు అవకాశం కల్పించారు. అయితే జట్టు నుంచి తొలగించడంపై కరుణ్ నాయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఒక సిరీస్ కంటే ఎక్కువ అవకాశాలకు అర్హుడిని అని చెప్పుకొచ్చాడు. మళ్లీ టీమిండియాలోకి వస్తానిని ఈ కర్ణాటక బ్యాటర్ థీమా వ్యక్తం చేశాడు.చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్కు ఘోర పరాభవం.. 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న
భారత టెన్నిస్ దిగ్గజం, రెండుసార్లు గ్రాండ్స్లామ్ విజేత రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికాడు. 45 ఏళ్ల బోపన్న సోషల్ మీడియా మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఇది కేవలం వీడ్కోలు మాత్రమే.. ముగింపు కాదు. నా జీవితానికి అర్థాన్ని ఇచ్చిన ఈ ఆటను నేను ఎలా వదులుకోగలను? నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ణాపకాలు ఉన్నాయి. అయితే నా రాకెట్ను పక్కటన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ టెన్నిస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాశాను. కర్ణాటకలోని కూర్గ్ అనే చిన్న పట్టణం నుంచి నా జర్నీని ప్రారంభించి.. ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు, కోచ్లకు, అభిమానులు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ను ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నాడు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో కజకిస్తాన్కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్తో కలిసి ఆడారు. అయితే ఈ జోడీ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో జాన్ పీర్స్- జేమ్స్ ట్రేసీ చేతిలో 5-7, 6-2, 10-8 తేడాతో ఓడిపోయింది.రోహన్ తన కెరీర్లో ఎన్నో ఘనతలు అందుకున్నాడు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రోహన్కు ఇదే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్. తద్వారా తిపెద్ద వయసులో గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్గా బోపన్న రికార్డులకెక్కాడు.2017 ఫ్రెంచ్ ఓపెన్లో గాబ్రియల్ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. టూర్ స్థాయి డబుల్స్ టైటిళ్లు 26 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు ఆరు గెలిచాడు.చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే
National
ఇంగ్లీష్, హిందీపై సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోమారు బాషలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ, కన్నడను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్, హిందీపై అతిగా ఆధారపడుతున్న కారణంగా, రాష్ట్రంలోని పిల్లల సహజ ప్రతిభ క్షీణిస్తున్నదని సిద్దరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై కొనసాగుతున్న వివాదం మధ్య సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బెంగళూరులో జరిగిన రాజ్యోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఫెడరల్ ప్రభుత్వం కర్ణాటకపై నిర్లక్క్ష్య వైఖరిని చూపుతోందని ఆరోపించారు. తాము కేంద్రానికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, ప్రతిఫలంగా చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే పొందుతున్నామని పేర్కొన్నారు. హిందీ, సంస్కృతం ప్రోత్సాహానికి ఉదారంగా గ్రాంట్లు మంజూరు చేస్తున్నప్పటికీ, కన్నడతో సహా ఇతర భారతీయ భాషలను పక్కనపెడుతున్నారని సీఎం ఆరోపించారు.అభివృద్ధి చెందిన దేశాలలోని పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు.. నేర్చుకుంటారు..కలలు కంటారు.. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంగ్లీష్, హిందీ బాషలు ఇక్కడి పిల్లల ప్రతిభను బలహీనపరుస్తున్నాయని సిద్దరామయ్య పేర్కొన్నారు. ప్రారంభ పాఠశాల విద్యలో మాతృభాష విద్యను తప్పనిసరి చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ఇది కూడా చదవండి: Bengaluru: రోడ్లపై చెత్తవేస్తే.. ‘అంతకన్నా అవమానం ఉండదు’
Bengaluru: రోడ్లపై చెత్తవేస్తే.. ‘అంతకన్నా అవమానం ఉండదు’
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పరిశుభ్రత పక్కదారి పడుతుండటంతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ తాజాగా ‘గార్బేజ్ డంపింగ్ ఫెస్టివల్’ను ప్రారంభించింది. రోడ్ల మీద చెత్త పడేసి, చేతులు దులుపుకుని వెళ్లే నగర పౌరుల తీరుకు చెక్ పెట్టేందుకు నడుంబిగించింది. బెంగళూరు మున్సిపల్ అథారిటీ.. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. ముందు మనం మారాలి అనే నినాదంతో చెత్త డంపింగ్ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టింది. ఎవరైనా రోడ్ల మీద చెత్త పారవేస్తే, అదే చెత్తను వారికి రిటర్న్ గిఫ్ట్గా పంపిస్తామని హెచ్చరిక చేసింది. సీసీ కెమెరాల ద్వారా చెత్త పడేసే వారిని గుర్తించి, వారి చెత్తను వారి ఇంటి ముందే డంప్ చేస్తామని తెలిపింది. అలాగే వారికి రెండు వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తామని పేర్కొంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ), బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎంఎల్) సంయుక్తంగా ఈ ‘చెత్త డంపింగ్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ముందుగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది వీధులు, ఫుట్పాత్లు, ఖాళీ స్థలాలలో చెత్తను వేసే వ్యక్తులను గుర్తిస్తారు. తరువాత వారు ఆ చెత్తను వారి ఇళ్ల వెలుపల పోస్తారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడేవారికి రూ.రెండు వేలు జరిమానా విధిస్తారు. ఈ విధంగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం తొలి రోజున 218 ఇళ్ల ముందు చెత్తను వేసి, వారి నుంచి రూ. 2.8 లక్షల జరిమానాలు వసూలు చేశారు. ఈ ప్రచారం తొలుత నగరంలోని బనశంకరిలో ప్రారంభమైంది. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.బహిరంగ వ్యర్థాల తొలగింపు, ప్రజా జవాబుదారీతనం పెంపొందించేందుకు బెంగళూరు మున్సిపల్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. దీనిని కొందరు బెంగళూరువాసులు మెచ్చుకుంటుండగా, మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అధికారులు బెంగళూరు అంతటా ఈ ప్రచారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Egypt: ‘నాలుగో పిరమిడ్’ లేచింది.. ‘వారెవ్వా’ అనాల్సిందే!
కాశీబుగ్గ తొక్కిసలాట: రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పరిధిలోగల కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై‘ఎక్స్’ పోస్ట్లో ‘ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…— PMO India (@PMOIndia) November 1, 2025రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ ‘తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చావులే.. వారికి డబ్బులు పుట్టించే మెషిన్లు!
ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం తిట్లు వింటూ ఉంటాం. కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉంటూ.. లంచాలు తెగమేసి బతకడానికి అలవాటుపడిన దుర్మార్గులు.. ఈ తరహా అమానవీయ పోకడల విషయంలో ఎంతటి మాస్టర్ డిగ్రీలు చేశారో అర్థమవుతుంది.తాము లంచాలు కాజేయడం మాత్రమే వారికి ప్రయారిటీ! సందర్భం ఏదైనా సరే వారికి పట్టింపులేదు. అవతలి వారు ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో, ఎంతటి వేదనలో ఉన్నారో కూడా వారికి అక్కర్లేదు. లంచాలు మింగడం మాత్రమే కాదు.. వేదనలో ఉన్న వారిని పరుషవ్యాఖ్యలతో నొప్పించడం వారి దుర్మార్గానికి మరింత పరాకాష్ట. ఆధునిక సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయని మనం చెప్పలేం. కాకపోతే.. ఇలాంటి ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రం ఆ మానవీయతకే తీరని కళంకం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఒక వేదనాభరితమైన దుర్ఘటన చోటుచేసుకుంది. బీపీసీఎల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్గా పనిచేసిన 64 ఏళ్ల కె శివకుమార్ జీవితంలో చోటుచేసుకున్న విషాదం అది. ఆయనకున్న ఏకైక కూతురు అక్షయ శివకుమార్ (34). ఐఐటీ నుంచి బిటెక్ చేసింది, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీయే చేసింది. ఓ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విషాదం ఏంటంటే.. ఇటీవల ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో దుర్మరణం పాలైంది. అసహజ మరణంగా గుర్తించడంతో మెడికో లీగల్ కేసు నమోదు అయింది. ఒక చావు సంభవిస్తే.. అనుబంధాలను పెనవేసుకున్న వందల వేల హృదయాలు దుఃఖిస్తాయి. ఇలాంటి చావు సంభవించినప్పుడు.. దాని నుంచి డబ్బులు ఏరుకోవడానికి పదుల సంఖ్యలో పరాన్నభుక్కుల వంటి కుక్కలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి దుర్మార్గాలు, శివకుమార్కు వరుసగా స్వానుభవంలోకి వచ్చాయి.అంబులెన్సులో ఆస్పత్రికి, శ్మశానానికి తరలించే వాడికి ఓ రేంజి లంచం, కేసు రిజిస్టరు అయింది గనుక.. బెలందూరు పోలీసు వారికి లంచం, అంతా పూర్తయి కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే.. బెంగుళూరు నగరపాలిక సంస్థ వారికి లంచం.. ఈ వ్యవహారాలతో అసలే దుఃఖంలో ఉన్న ఆయన మరింతగా క్షోభకు గురయ్యారు. లంచాలు డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో ఉంటే.. లంచం కోసం బెలందూరు పోలీసులు దూషించిన తీరు కూడా ఆయన క్షోభను మరింతగా పెంచింది. ఈ గోడు మొత్తం వెళ్లగక్కుతూ ఆయన ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఇలాంటి వారి బారిన పడి.. ఎన్ని వేల లక్షల హృదయాలు ఎంతగా క్షోభిస్తూ ఉంటాయో.. ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. పోలీసు పెద్దలు కొంచెం జాగ్రత్త పడి.. బెలందూరు స్టేషన్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు.లంచగొండితనం అనేది ఇవాళ్టి సమాజంలో ఒక యాక్సెప్టబుల్ వ్యవహారం అయిపోయింది. గవర్నమెంటుతో ముడిపడిన ఈ పని మనకు ఉన్నా.. తృణమో పణమో అడక్కముందే సమర్పించేసుకోవడం సాధారణ జనానికి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా పుట్టే డబ్బులు పుట్టెడు ఉంటాయి. అలాగని ఒకరో ఇద్దరో దారిద్ర్యంలో పడి అలమటిస్తున్న వారు.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. ఈ లంచగొండులు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో, బాధాకరమైన వేళల్లో కూడా తమ దందా తాము సాగించాలనే అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.‘నేనంటే డబ్బున్న వాణ్ని గనుక.. అందరికీ అడిగినంత లంచాలు ముట్టజెప్పాను. డబ్బులేని పేదల పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆ శివకుమార్ తన పోస్టులో ప్రశ్నించిన తీరు.. సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఈసడించుకున్నంత మాత్రాన.. కించిత్తు కూడా ఈ లంచగొండి అవతారాల్లో మార్పు రాదన్నది నిజం. ఎందుకంటే.. ఆస్పత్రుల్లో లంచాలు, తప్పుడు చికిత్సలు, పోలీసుల లంచాలు, నీతిమాలిన వైనం గురించి.. కొన్ని వందల సినిమాల్లో ఘాటుగా చర్చిస్తూనే వచ్చారు. ఏం మారింది సమాజం? అలా లంచం తీసుకోవడాన్ని ఒక లాంఛనంగా, అధికారిక క్రతువులాగా మార్చేసుకుంటున్నారు. కేవలం ఒకటిరెండు సస్పెన్షన్లతో ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడుతుందా? ఆ అంబులెన్సు డ్రైవరూ, ఆ ఆసుపత్రి సిబ్బంది, శ్మశానం సిబ్బందీ, బెంగుళూరు కార్పొరేషన్ పెద్దలూ, పోలీసు మహానుభావులూ అందరివీ పత్రికల్లో పెద్దపెద్ద ఫోటోలు వేసి.. చావుల మీద లంచాల డబ్బులు ఏరుకుంటున్న నీచులు వీళ్లేనని తగుమాత్రం ప్రచారం కల్పించాలి. సోషల్ మీడియా లో ఫోటోలతో సహా వారి నీచత్వాన్ని డప్పు కొట్టి మరీ చెప్పాలి. నగరమంతా పోస్టర్లు వేయాలి. వారి బతుకుల్లో సిగ్గు పుట్టించాలి. లేకపోతే ఇలాంటి అరాచకత్వాలకు నిష్కృతి లేదు...ఎం.రాజేశ్వరి
International
NRI
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
Sakshi Originals
పేదరికాన్ని కొలిచేదెలా?
కేరళ రాష్ట్రం పేదరికాన్ని జయించిందట. రాష్ట్రంలో కడు పేదలు అసలు లేరని ఆ రాష్ట్రం గొప్పగా ప్రకటించుంది. అంటే.. ఇక్కడ అందరూ ధనవంతులనేనా అర్థం? కాదు. పేదరికం అంటే డబ్బుల్లేకపోవడం మాత్రమే కాదు. కడు పేదరికం లేదా దుర్భర దారిద్ర్యం అనేదానికి నిర్వచనం వేరు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై ఏం చెబుతుందంటే... మనిషి బతికేందుకు అత్యవసరమైన కనీస అవసరాలు తీరకపోవడమే కడు పేదరికం అని!. తినేందుకు తిండి, తాగేందుకు సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఉండేందుకు ఒక గూడు, విద్య వంటివి ప్రాథమిక మానవ అవసరాలని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల మంది కడు పేదరికంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, యుద్ధం, ఆర్థిక అస్థిరతల వంటివి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 తరువాత అంతర్జాతీయంగా పేదరికం మళ్లీ పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరే.. మరి ఎంత ఆదాయం ఉంటే పేదరికాన్ని దాటినట్టు?. ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం... రోజుకు 1.90 డాలర్ల సంపాదన ఉన్న వారు అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు. ఈ లెక్క 2016 నాటిది. 2024 నాటి లెక్కల ప్రకారం రోజుకు 2.66 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారు కటిక దరిద్రంలో ఉన్నట్టు. ఈ మొత్తం పర్చేసింగ్ పవర్ పారిటీకి తగ్గట్టుగా అంటే వివిధ దేశాల్లోని కాస్ట్ ఆఫ్ లివింగ్ను పరిగణలోకి తీసుకుని లెక్కించింది. కనీస అవసరాలను కూడా అందుకోలేనంత పేదలు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ఈ లెక్క ఉపయోగపడుతుందని అంచనా. ప్రాముఖ్యత ఏమిటి?నిజజీవిత ఉదాహరణ ఒకదాన్ని పరిశీలిద్దాం... ఓ పల్లెలో అత్యధికులు రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పల్లెలోని కుటుంబాలు పోషకాహారం పొందలేరు. ఫలితంగా పోషకాహాల లోపాలు వస్తాయి. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం అందుబాటులో లేకపోతే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి పనికెళ్లే అవకాశం ఉంటుంది. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి పేదరికం తొలగింపును సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా నిర్ధారించింది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పేదరిక నిర్మూలన అనేది కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతోనే జరిగిపోదు. వీలైనంత ఎక్కువమంది పేదలకు పని కల్పించడం పేదరిక నిర్మూలనకు చాలా కీలకం. అయితే పని చేసేందుకు అవసరమైన పరిస్థితులు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 63 కోట్ల మంది కార్మికులుంటే.. వీరిలో 20 శాతం మంది ఆదాయం తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన విషయంలో మానవ, కార్మిక హక్కుల పరిరక్షణ కూడా ముఖ్యమవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
తిరుపతితో మొదలు.. అసలేందుకీ తొక్కిసలాటలు?
దేశ చరిత్రలోనే 2025 ఏడాది ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. మునుపెన్నడూ లేని రీతిలో.. ఈ యేడు వరుసగా తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని అత్యంత విషాదకరమైనవిగా నిలిచాయి. అధిక జనసమూహం, భద్రతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. ఆ ఘటనలను పరిశీలిస్తే.. తిరుపతి తొక్కిసలాట.. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 8వ తొక్కిసలాట జరిగి.. ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు కౌంటర్ల వద్ద భారీగా గుమికూడారు. ఆ సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో గేట్ను తెరిచారు. దీంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కుంభమేళాలో మహా విషాదం.. జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య పుణ్యస్నాన దినాన లక్షలాది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి చేరుకున్నారు. అయితే.. చీకట్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో స్పష్టత కొరవడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో.. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. రైల్వే అనౌన్స్మెంట్లో తీవ్ర గందరగోళం, అప్పటికే ప్లాట్ఫారమ్ 14, 15 వద్ద అధిక జనసంచారం, రైలు రాకతో ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుంటూ ప్లాట్ఫారమ్లపైకి చేరడంతో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపమే ఈ ఘటనకు కారణమని తర్వాత తేలింది.బెంగళూరు స్టేడియం బయట.. జూన్ 4వ తేదీన బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా నెగ్గడంతో.. విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. అంచనాలకు మించి అభిమానులు రావడం.. వాళ్లను అదుపు చేయలేకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.కరూర్ ఘటన.. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. నిర్వహణ లోపమని, విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న జనం గందరగోళానికి గురై తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ కుట్ర అంటూ టీవీకే ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు నడుస్తోంది.కాశీబుగ్గ ఆలయం వద్ద.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.
పోక్సో నేరగాడికి సుప్రీంకోర్టు క్షమాభిక్ష!
దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అరుదైన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 142వ నిబంధన మేరకు తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి మరీ పోక్సో కేసులో నేరస్తుడిగా నిరూపితమైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించింది. జైలుశిక్ష రద్దు చేసింది. ఆ వ్యక్తి నేరం చేసిన మాట వాస్తవమైనప్పటికీ తరువాత బాధితురాలిని పెళ్లి చేసుకోవడం.. పుట్టిన బిడ్డతో కలిసి సంసారం కొనసాగిస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని తామీ నిర్ణయానికి వచ్చినట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెస్సీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు..తమిళనాడుకు చెందిన కృపాకరన్ అనే వ్యక్తి 2017లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. న్యాయ విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి ఐపీసీ సెక్షన్ 366 (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఒక నేరానికి ఐదేళ్లు, ఇంకోదానికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పును కృపాకరన్ మద్రాస్ హైకోర్టులో సవాలు చేశాడు. బాధితురాలిని తాను పెళ్లి చేసుకున్నానని, బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కానీ 2021 సెప్టెంబరులో హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కృపాకరన్ చెబుతున్న విషయాలను నిర్ధారించుకునేందుకు సుప్రీంకోర్టు తమిళనాడు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని పురమాయించింది. బాధితురాలు కూడా కోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ... తాను కృపాకరన్పై ఆధారపడ్డానని, అతడితోనే సంసారం చేయాలని తీర్మానించుకున్నానని స్పష్టం చేసింది. బాధితురాలి తండ్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరవడమే కాకుండా... కృపాకరన్ నేరాన్ని, శిక్షను రద్దు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. తమిళనాడు లీగల్ సెల్ అథారిటీ ఉన్నతాధికారి కూడా కృపాకరన్, బాధితురాలు సుఖంగానే ఉన్నారని, సంసారం బాగానే గడుస్తోందన్న నివేదిక అందడంతో భార్యపిల్లలను బాగా చూసుకోవాలని, ఏ రకమైన ఇబ్బంది పెట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అతడి నేరాన్ని, శిక్ష రెండింటినీ రద్దు చేసింది. సామాజిక సంక్షేమం కోసమే..కృపాకరన్ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టాలనేవి సామాజిక సంక్షేమం కోసమే’’ అన్న జస్టిస్ బెంజిమన్ కార్డోజో (అమెరికా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి) వ్యాఖ్యతోనే తీర్పును ప్రారంభించడం విశేషం. కృపాకరన్ చేసింది తీవ్రమైన నేరమే అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలను, వాటి ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ తీర్పునిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకే పోక్సో లాంటి చట్టాలను రూపొందించారని, శిక్షలను ఖరారు చేశారని తెలిపింది. అయితే, ఈ శిక్షలను యథాతథంగా అమలు చేసే ముందు వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అన్నింటికీ ఒకేతీరున కాకుండా.. ఆయ కేసులను బట్టి ఈ న్యాయస్థానం తీర్పులు ఇస్తుందని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో కఠినంగానే కాకుండా.. కరుణతోనూ తీర్పులుంటాయని న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెసీల ధర్మాసనం వివరించింది. కృపాకరన్ కేసులో నేరం జరిగింది కామంతో కాకుండా ప్రేమతో అన్న అంచనాకు రావడం వల్ల తాము రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో అతడి నేరాన్ని, శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
దేశానికి 'పెళ్లి కళ'
ఈ ఏడాది ఆఖరు రెండు నెలల్లో దేశవ్యాప్తంగా జరగనున్న 46 లక్షల వివాహాల ద్వారా రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సి.ఎ.ఐ.టి.) అంచనా వేస్తోంది. దాని ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. ఈసారి స్వదేశీ ‘డెస్టినేషన్’లు దేశానికి సరికొత్త పెళ్లి కళ తేబోతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గత ఏడాదికీ, ఈ ఏడాదికీ పెళ్లిళ్ల సంఖ్యలో పెద్ద తేడా లేనప్పటికీ, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మాత్రం ఈసారి గణనీయంగా పెరగవచ్చని సి.ఎ.ఐ.టి. చెబుతోంది. ఆదాయాల్లో పెరుగుదల; ఆర్థిక రంగం పరుగులు తీయడం, పండుగ సీజన్లో రికార్డు స్థాయి కొనుగోళ్లు.. తదితర అంశాలన్నీ కలిసి భారీగా పెళ్లిళ్ల బిజినెస్కు దోహదం కావచ్చునని సి.ఎ.ఐ.టి. భావిస్తోంది. ప్రధాని పిలుపునకు స్పందనసంపన్న భారతీయులు తమ వివాహాలను దేశంలోనే, దేశవాళీ ఉత్పత్తులతోనే నిర్వహించుకోవాలని గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ‘వెడ్ ఇన్ ఇండియా’ పేరిట పిలుపు ఇచ్చారు. ఆ నేపథ్యంలో కూడా దేశవాళీ పెళ్లిళ్ల బిజినెస్లో భారీ పెరుగుదల కనిపించనుందని దేశంలోని 75 ప్రధాన నగరాల్లో సి.ఎ.ఐ.టి. నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని సంపన్నుల్లో (కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టదగిన ఆస్తులు ఉన్నవారు) 80–85 శాతం మంది ఈసారీ స్వదేశీ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారట. వాటిల్లో రాజస్థాన్ ప్యాలెస్లు, గోవాలోని రిసార్ట్లతో పాటు.. కొత్తగా వయనాడ్, కూర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్ల వంటి కొత్త ప్రాంతాలు ఉన్నాయని ప్రముఖ ట్రావెల్ సంస్థ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. ‘లోకల్’ క్రేజ్వివాహ వేడుకల కొనుగోళ్లలో రానున్న రెండు నెలల్లో 70 శాతం వరకు దేశీయ ఉత్పత్తులు ఉంటాయని సి.ఎ.ఐ.టి. అంచనా వేస్తోంది. సంప్రదాయ కళాకారులు, ఆభరణాల వ్యాపారులు, దుస్తుల తయారీ యూనిట్లు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు పొందుతున్నట్లు పేర్కొంది. రాజస్థాన్కు సూపర్ డిమాండ్రాజస్థాన్లో సాంస్కృతిక వారస్వత వైభవం కలిగిన వేదికలు వివాహాలకు అత్యధిక డిమాండ్లో ఉన్నాయి. అక్కడి చాలా హోటళ్లు ముందే బుక్ అయిపోయాయి కూడా. ఈ హోటళ్లు ఈసారి 20–30 శాతం ఎక్కువగా ఆదాయాన్ని చూడబోతున్నాయి. లగ్జరీ రైలు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ కూడా గత ఏడాది నుండి అందుబాటులోకి రావటంతో ‘డెస్టినేషన్’ పెళ్లిళ్లకు రాజస్థాన్ మరింత ఆకర్షణీయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో..తెలుగు పంచాంగాల ప్రకారం సుమారుగా నవంబరు ఆఖరి వారంలో శుక్ర మూఢమి ప్రారంభమై దాదాపు 80 రోజులకుపైగా ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు చేయకూడదన్నమాట. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ నవంబరులో భారీగా వివాహాలు జరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఏటా పెరుగుతున్న వ్యయంసి.ఎ.ఐ.టి. డేటా ప్రకారం.. వివాహాలకు భారతీయులు చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతోంది. 2022లో 32 లక్షల వివాహాలకు రూ.3.75 లక్షల కోట్ల ఖర్చు అయితే.. 2023లో 38 లక్షల వివాహాలకు రూ.4.74 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2024లో 48 లక్షల వివాహాలకు రూ.5.9 లక్షల కోట్లు వెచ్చించారు.
‘వక్క’సారి నాటితే వందేళ్లు
కులవివక్షను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం
తొక్కిసలాటలు తప్పించే టెక్నాలజీ త్వరగా కనిపెట్టండి సార్!
తగ్గుతున్న వేతన అంతరం
పరేశ్ రావల్ (నటుడు) రాయని డైరీ
ఎంత ఖర్చయినా ధరిస్తాం
సీతావనం
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
డేట్ ఫిక్స్
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు
మోదీ ఫోన్ సార్! తుపాన్ను పాకిస్తాన్కు మళ్లించి పుణ్యం కట్టుకోండని అడుగుతున్నార్సార్!!
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగం
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
మా ఓటమికి కారణమదే: సూర్య కుమార్
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు..?
బంగారం ధర మళ్లీ తగ్గినా..
సాక్షి కార్టూన్ 01-11-2025
ఇదేం ‘టెట్’రా బాబు!
శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు బ్రేక్..
క్రైమ్
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్విుల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచి్చంది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
శ్రీవారి కల్యాణకట్టలో ఆకతాయికి దేహశుద్ధి
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం కల్యాణకట్ట (కేశఖండన శాల)లోని స్నానపు గదుల్లో మహిళలు స్నానం చేస్తుండగా చూస్తున్న ఓ ఆకతాయిని కల్యాణకట్ట, సెక్యూరిటీ సిబ్బంది శుక్రవారం పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీస్స్టేషన్లో అప్పగించారు. స్వామివారి కల్యాణకట్టలో మొక్కుబడులు తీర్చుకున్న తరువాత మహిళలు ప్రత్యేకంగా ఉన్న గదుల్లో స్నానాలు చేసి, వ్రస్తాలు మార్చుకుంటారు. గతనెల 25న ఓ భక్తురాలు స్నానం చేస్తుండగా బాత్రూం వెంటిలేటర్ (ఎగ్జాస్ట్) ఫ్యాన్ రంధ్రాల్లోంచి ఎవరో చూస్తున్నారని అక్కడి సిబ్బందికి చెప్పారు. పరిశీలించిన సిబ్బందికి ఎవరూ కనిపించలేదు. అలాగే గతనెల 27న మరో భక్తురాలు ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ యువకుడు కల్యాణకట్ట వెనుక భాగంలో తచ్చాడుతూ కనిపించాడు. వెంటనే దేవస్థానం, సెక్యూరిటీ సిబ్బంది ఆకతాయిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. ఫొటోలు, వీడియోలు తీశాడేమోనన్న అనుమానంతో అతడి సెల్ఫోన్ను పరిశీలించగా, అందులో ఏమీ లేవు. రెండు చోరీ కేసుల్లో నిందితుడు.. ఆకతాయి విజయనగరం జిల్లా తెర్ల మండలంలోని పెరుమాళ్ల గ్రామానికి చెందిన మైలపల్లి పైడిరాజుగా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే రెండు చోరీ కేసులు ఉన్నట్టు నిర్ధారించారు. కల్యాణకట్ట వద్ద జరిగిన ఘటనపై దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జీవీఎస్ పైడేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బాత్రూమ్లలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించి, వాటి రంధ్రాలు, దుస్తులు మార్చుకునే గదుల్లో కిటికీలను సైతం మూసివేశారు. కల్యాణకట్ట వెనుక నుంచి ఎవరూ లోపలికి వచ్చేందుకు వీలు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్/కాణిపాకం: ల్యాబ్ రికార్డుల విషయంలో అధ్యాపకులు దురుసుగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు నగరానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గంగాధర నెల్లూరు మండలం సనివిరెడ్డిపల్లికి చెందిన ఎన్.నందిని(19) సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్ (సీఈసీ బ్రాంచ్) మూడో సంవత్సరం చదువుతోంది. ‘నందిని ల్యాబ్ రికార్డులను అధ్యాపకులు తీసుకోకుండా వ్యక్తిగతంగా దూషించి ల్యాబ్ రూమ్ బయట నిలబెట్టారు. అందువల్లే తీవ్ర మనస్తాపానికి గురైన నందిని కళాశాలలో తరగతులు జరుగుతుండగానే ఉదయం 11.20 గంటల సమయంలో అడ్మిని్రస్టేటివ్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది’ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నందినిని వెంటనే అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై సీతమ్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డీన్ శరవణన్ను ‘సాక్షి’ సంప్రదించగా, ఒక్కొక్క విద్యార్థి ఒక్కో విధంగా చెబుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని ముందుగానే నందిని తన సెల్ఫోన్ స్టేటస్లో పెట్టుకున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణ చేస్తున్నారని వెల్లడించారు.
Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీడియోలు
Kasibugga: పెరుగుతున్న మృతుల సంఖ్య ఇది పక్కా ప్రభుత్వ నిర్లక్ష్యమే..!
Kasibugga: దేవుడి దర్శనానికి వచ్చి తిరిగిరాని లోకాలకు..
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు రియాక్షన్
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన YSRCP బృందం
కాశీబుగ్గలో తొక్కిసలాటపై అచ్చెన్నాయుడుపై బాధితులు ఫైర్
Kashibugga Temple: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది
కాంగ్రెస్ సేఫ్ గేమ్.. సీఎం రేవంత్ పబ్లిక్ వార్నింగ్
హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
బాలకృష్ణే చేయిస్తున్నాడా? చిరంజీవిపై DeepFake వెనుక టీడీపీ
Warangal: బాధితులతో ఇళ్లల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న సీఎం
