Politics
కోలుకోలేని షాక్.. మమతా కోటలో మహువా చిచ్చు..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, తాజాగా ఆ పార్టీ ఫైర్బ్రాండ్, లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపాయి.బీజేపీ అగ్రనేత,పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై ఆమె అసాధారణ రీతిలో ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి, సువేందు అధికారితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని బహిరంగంగా పంచుకున్నారు.2014 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు లోక్సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ క్లిష్ట సమయంలో సువేందు అధికారి నన్ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. 2016 కరీంపూర్ శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం సువేందు ఎంతో కృషి చేశారని, తన తరఫున మొదటి రాజకీయ ప్రచార ర్యాలీని ఆయనే నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరి రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ.. ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ను నేనెప్పటికీ మర్చిపోలేనని ఆమె స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరంతరం విరుచుకుపడే నేతగా మహువా మొయిత్రాకు గుర్తింపు ఉంది. అలాంటి ఫైర్బ్రాండ్ లీడర్, ఇప్పుడు తృణమూల్ పార్టీ ప్రధాన శత్రువుగా భావించే సువేందు అధికారిని ప్రశంసించడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె కూడా టీఎంసీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నచర్చ మొదలైంది. ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీ ఇప్పటికే బలహీనపడుతుండగా, మహువా మొయిత్రా కూడా త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారా అనే చర్చకు ఈ ఇంటర్వ్యూ తెరలేపింది.
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు.
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు.
Sports
గెలుపు + రన్రేట్పై గురి
మాంచెస్టర్: పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై ఘన విజయాలతో టి20 ప్రపంచకప్ను గొప్పగా ప్రారంభించిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా తమ పరిస్థితిని కాస్త సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు తర్వాతి పోరులో బలహీన జట్టు బంగ్లాదేశ్పై చెలరేగి గెలిస్తే జట్టు ముందంజ వేసే అవకాశాలు మెరుగవుతాయి. నేడు జరిగే ఈ మ్యాచ్లో విజయంతో పాటు మంచి రన్రేట్ కూడా హర్మన్ప్రీత్ బృందానికి అవసరం. ఓవరాల్గా బంగ్లాదేశ్పై 20–3 రికార్డుతో భారత్దే పైచేయి అయినా... ఉదాసీనత కనబరిస్తే బంగ్లాదేశ్ కూడా షాక్ ఇవ్వగలదు. గత పోరులో పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జోరు మీదుంది. భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి 150కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించి శుభారంభం ఇస్తున్నారు. అయితే జెమీమా, హర్మన్, యస్తిక తడబాటుతో భారీ స్కోరు సాధించడం జట్టుకు కష్టంగా మారుతోంది. 3 మ్యాచ్లలో కలిపి జెమీమా 32 పరుగులే చేసింది. లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడటం సానుకూలాంశం. గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన లెగ్స్పిన్నర్ ప్రేమ రావత్ విఫలం కావడంతో ఆమె స్థానంలో రాధ యాదవ్కు అవకాశం దక్కవచ్చు. బంగ్లాను పదునైన పేస్తో ఇబ్బంది పెట్టే వ్యూహంతో క్రాంతి గౌడ్ను తుది జట్టులో చేర్చాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎడంచేతి వాటం స్పిన్నర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి నిలకడగా రాణిస్తోంది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్లో ఓపెనర్ ఫిర్దోస్, కెపె్టన్ నిగార్ సుల్తానాలపై ఆధారపడుతుండగా... బౌలింగ్లో మారుఫా అక్తర్, నాహిదా అక్తర్ కీలకం కానున్నారు. గ్రూప్ ‘1’లో ఆడిన నాలుగు మ్యాచ్లూ గెలిచి ఆ్రస్టేలియా సెమీఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. నేటి మ్యాచ్లో నెదర్లాండ్స్తో, ఆ తర్వాత బంగ్లాదేశ్తో సఫారీ టీమ్ ఆడాల్సి ఉండగా... భారత్ చివరి పోరులో ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. కాబట్టి రన్రేట్లో దక్షిణాఫ్రికాతో పోటీ పడాలంటే హర్మన్ బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా!
ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తన పేరు లేకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా డిమాండ్ చేస్తోంది. కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించిన మనిక... ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా ప్లేయర్గానూ రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో రెండుసార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... అర్జున, ఖేల్రత్న వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకున్న మనిక... ఏ నిబంధనల ప్రకారం ఆసియా క్రీడలకు జట్టును ఎంపిక చేశారో తెలపాలని కోరుతోంది. తనకు జట్టులో చోటు కల్పించాల్సిన అవసరం లేదని... కానీ ఎంపిక ప్రక్రియపై మాత్రం స్పష్టత ఇవ్వకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతానని అంటోంది. ఈ నేపథ్యంలో మనిక డిమాండ్ పూర్వాపరాలను ఓసారి పరిశీలిస్తే.... న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తన పేరు లేకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వకపోతే... చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా హెచ్చరించింది. తనకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటులు అక్కరలేదని... కానీ ఏ లెక్కల ప్రకారం జట్టును ఎంపిక చేశారనే అంశంపై మాత్రం సమగ్ర సమాచారం కావాల్సిందే అని పట్టుబట్టింది. ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనుండగా... దాని కోసం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఇటీవల జట్టును ప్రకటించింది. అయితే అందులో ప్రపంచ 51వ ర్యాంకర్, భారత మహిళల రెండో ర్యాంకర్ మనికకు చోటు దక్కలేదు. దీంతో తనను ఎంపిక చేయకపోవడానికి గల సహేతుక కారణాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాలను సామాజిక మాధ్యమాల వేదికగా కోరింది. తనకు ఎలాంటి మినహాయింపులు అక్కరలేదని... కేవలం తన ప్రశ్నలకు జవాబులు కావాలని మనిక అంటోంది. మరోవైపు నిర్దేశిత దేశవాళీ టోర్నీల్లో పాల్గొనలేదనే కారణంగా టీటీఎఫ్ఐ మనికను ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన తుది జట్టులో చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మనిక సెలక్షన్ ప్రక్రియపై పలు సందేహాలు లేవనెత్తింది అవి ఆమె మాటల్లోనే.... » జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియలో పారదర్శకత అన్నిటికంటే ముఖ్యం. ప్రతి ఒక్కరికీ జావాబుదారీతనం తప్పనిసరి. నాకు జట్టులో చోటు దక్కలేదనే కారణంగా ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటే పొరబాటే. నన్ను ఎంపిక చేయమని కోరడం లేదు. కేవలం నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని అడుగుతున్నా. » నన్ను ప్రత్యేకంగా చూడండి అని నేనెప్పుడూ అనలేదు. కానీ జట్టు ఎంపిక ప్రమాణాలు ఏంటి... దేన్ని ఆధారంగా చేసుకొని ఏషియన్ గేమ్స్కు టీమ్ను ఎంపిక చేశారో మాత్రం అందరికీ తెలియాల్సిందే. సెలక్షన్ ప్రక్రియపై స్పష్టమైన వివరణ ఇస్తారని ఆశిస్తున్నా. సంతృప్తికర సమాధానాలు లభించకపోతే... చట్టపరంగా ముందుకు వెళ్లడం తప్ప నాకు మరో దారిలేదు. » ప్రస్తుతం నేను ప్రపంచ 51వ ర్యాంక్లో ఉన్నాను. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రతీవారం ర్యాంక్లను సవరిస్తుంటుంది. మరి ఆసియా క్రీడలకు ఎంపిక చేసేందుకు ఏ మార్క్ను పరిగణనలోకి తీసుకున్నారో నాకు తెలియాలి. గత నాలుగేళ్ల ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారా... లేక ఏడాది ప్రదర్శననా... లేక మూడు నెలల ఆటతీరునా... లేక కేవలం గత వారం ర్యాంక్లను దృష్టిలో పెట్టుకొని జట్టు ఎంపిక జరిగిందా? » సుదీర్ఘ కాలంగా టాప్–50లో ఉన్న ప్లేయర్ కేవలం ఒకటీ రెండు వారాల కోసం 51వ ర్యాంక్కు చేరితే ఆమెను జట్టుకు ఎంపిక చేయరా? ఈ ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. » దేశవాళీ టోర్నీలపై నాకు అపార గౌరవం ఉంది. వాటిలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తా. కానీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం దక్కడం లేదు. గ్లోబల్ క్యాలెండర్, ప్రయాణాలు, గాయాలు, రికవరీ, ప్రతిష్టాత్మక పోటీల కోసం ప్రాక్టీస్... ఇలా తీరిక దొరకడం లేదు. ఇక మీద జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విషయంలో మరింత శ్రద్ధ వహిస్తాను. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. » ఆసియా క్రీడల కోసం జట్లను ఎంపిక చేసేటప్పుడు ప్రస్తుత ఫామ్ను పరిగణనలోకి తీసుకోవాలని క్రీడా శాఖ సూచిస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే నా ఒక్కదానికే కాదు... ఐహిక ముఖర్జీకి కూడా అన్యాయం జరిగింది. 2022 ఆసియా క్రీడల డబుల్స్లో చారిత్రక పతకం నెగ్గిన ఐహికను ఈసారి ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్లకు జట్టులో చోటు కల్పించనప్పుడు... ఎంపిక ప్రమాణాలపై సహజంగానే అనుమానాలు రేకెత్తుతాయి. జట్టు ఎంపిక ప్రక్రియ ఓటింగ్ ద్వారా జరిగిందని తెలిసింది. అదే నిజమైతే... ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన తీసుకున్నారో తెలియాలిలి. ఓ ప్లేయర్ భవితవ్యాన్ని ఓటు ద్వారా నిర్ణయించడం సరైనదేనా అనేది కూడా తేలాలి.సెలక్షన్ కమిటీకి అర్హత ఉందా? నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లను ఎవరు ఎంపిక చేస్తున్నారనే అంశంపై స్పష్టత కావాలి. సెలక్షన్ కమిటీలో ఎంతమందికి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఆడిన అనుభవం ఉంది. ప్యానెల్లో ఎంతమంది దేశం తరఫున ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు వంటి అత్యున్నత స్థాయి టోర్నీల్లో పాల్గొన్నారు? ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగి ఉంటే... దానికి గల కారణాలు తెలియాలి. అందుకే ఈ ఎంపిక ప్రక్రియపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని కోరుతున్నా. నన్ను ఎంపిక చేయలేదనో, లేక నాకు జట్టులో చోటు దక్కాలనో ఈ ప్రయత్నం చేయడం లేదు. సెలక్షన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నా.
రెండో స్థానానికి గిల్
దుబాయ్: ఇటీవల అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో సత్తా చాటిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. అఫ్గాన్తో రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్కు దిగిన గిల్ 238 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న గిల్ 791 పాయింట్లతో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి (768 పాయింట్లు), రోహిత్ శర్మ (754 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా... న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (815 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ (651 పాయింట్లు) 11వ స్థానానికి చేరగా... శ్రేయస్ అయ్యర్ (638 పాయింట్లు) 14వ ర్యాంక్లో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో రషీద్ ఖాన్ (682 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... భారత్ నుంచి అత్యుత్తమంగా కుల్దీప్ యాదవ్ (614 పాయింట్లు) ఏడో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. రూట్ 12వ సారి... ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్వన్ స్థానానికి చేరాడు. సుదీర్ఘ కెరీర్లో రూట్ ‘టాప్’ ర్యాంక్కు చేరడం ఇది పన్నెండోసారి కావడం విశేషం. తాజాగా న్యూజిలాండ్తో రెండో టెస్టులో బెన్ స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన రూట్... ఈ సిరీస్లో బ్యాట్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు స్థానాలు పురోగతి సాధించిన అతడు... 871 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్కే చెందిన హ్యారీ బ్రూక్ (866 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... టీమిండియా నుంచి గిల్ (743 పాయింట్లు), యశస్వి జైస్వాల్ (733 పాయింట్లు) వరుసగా ఏడు, ఎనిమిది ర్యాంక్ల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో 11 వికెట్లతో విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (870 పాయింట్లు), భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. తద్వారా 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ‘టాప్’ ర్యాంక్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ నుంచి గతంలో జాక్ కొవీ (1947), రిచర్డ్ హాడ్లీ (1984–1990) మాత్రమే ఈ ఘనత సాధించారు.
‘వైభవ్ కోసం ఎదురు చూస్తున్నారు’
బెల్ఫాస్టట్: భారత్, ఇంగ్లండ్ మధ్య రేపు తొలి టి20 మ్యాచ్ సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ (స్టోర్మోంట్)లో జరగనుంది. ఈ మైదానం సామర్థ్యం దాదాపు 7 వేలు మాత్రమే! అయితే సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో తాత్కాలిక ఏర్పాట్లతోనైనా సీట్ల సంఖ్యను పెంచాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వైభవ్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తే అది కొత్త చరిత్ర అవుతుందని భారత్–ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎంవీ నరసింహారావు (బాబ్జీ) అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వైభవ్ గురించే చర్చ సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘బెల్ఫాస్ట్లో వైభవ్ మేనియా మొదలైంది. అతను తొలి మ్యాచ్ బరిలోకి దిగితే కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇంతటి ఆసక్తిని మేం ఊహించలేదు. గత కొద్ది రోజులుగా మ్యాచ్ గురించి చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. యూరోప్లోని పారిస్ తదితర ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది మ్యాచ్ను చూడాలని భావిస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం నిర్వాహకుల బాధ్యత. అయితే మ్యాచ్ జరిగే స్టేడియం సామర్థ్యం 7 వేలు మాత్రమే. చాలా మంది టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కాబట్టి ఏదో రకంగా అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సిందే’ అని నరసింహారావు అన్నారు. వైభవ్ ఆటపై ప్రశంసలు కురిపించిన ఆయన... ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘వైభవ్ అద్భుతమైన బ్యాటర్. ఐపీఎల్లో అతను ప్రదర్శనను చూశాను. కాస్త నెమ్మదిగా ఉండే ఐర్లాండ్ పిచ్లపై కూడా అతను ప్రభావం చూపించగలడు. అయితే బంతి బాగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్లో అతనికి అసలు సవాల్ ఎదురవుతుంది. అతని కొన్ని షాట్లు చూస్తే గ్యారీ సోబర్స్ను కూడా గుర్తుకు తెస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అన్ని రకాల షాట్లు ఆడగలుగుతున్నాడు. ఆ ప్రతిభ దేవుడు ఇచ్చిన బహుమతి. సచిన్ టెండూల్కర్ తరహాలోనే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాలతో పాటు తీవ్ర సాధన, ఫిట్నెస్, క్రమశిక్షణను కొనసాగించాలనేది నా సలహా’ అని నరసింహారావు సూచించారు. మైదానంలో గంట మోగించనున్న ‘బాబ్జీ’... సన్నిహితుల ద్వారా ‘బాబ్జీ’గా గుర్తింపు పొందిన హైదరాబాద్ క్రికెటర్ ఎంవీ నరసింహారావు 1978–79లో భారత్ తరఫున 4 టెస్టులు ఆడారు. అయితే ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆయనకు మంచి రికార్డు ఉంది. 108 మ్యాచ్లలో 9 సెంచరీలు సహా 4845 పరుగులు చేసిన బాబ్జీ...లెగ్స్పిన్నర్గా 245 వికెట్లు కూడా పడగొట్టారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986–87 సీజన్లో హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. బాబ్జీ కెప్టెన్సీలోనే జట్టు ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ మళ్లీ రంజీ టైటిల్ గెలవలేకపోయింది. హైదరాబాద్లో తొలి క్రికెట్ కోచింగ్ అకాడమీ (సెయింట్ జాన్స్) పెట్టి వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్లాంటి స్టార్ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఐర్లాండ్కు వెళ్లి అక్కడే స్థిరపడిన నరసింహారావు ఆ దేశం తరఫున కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. అక్కడే కోచ్గా పలువురు ఐర్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, కెవిన్ ఓబ్రైన్, పోర్టర్ఫీల్డ్, బల్బర్నీలను తీర్చిదిద్దడంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. ఈ సేవలకుగాను ఐర్లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎంబీఈ పురస్కారంతో సత్కరించింది. ఈ నెల 28న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్కు ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గంట (రాయ్ టారెన్స్ బెల్)ను బాబ్జీ మోగించనున్నారు. ఇరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.
National
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
చప్పట్లు కొట్టే ప్రేక్షకులు లేరు. పెద్ద వేదిక లేదు. కానీ చేతిలో వయోలిన్, హృదయంలో సంగీతం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీధుల్లో దశాబ్దాలుగా వయోలిన్ వాయిస్తూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఆయన పరిస్థితికి చలించి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఈ కథ మరింత మందికి చేరింది.పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన భగవాన్ మాలిక్.. యుక్తవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే తండ్రి నేర్పించిన సంగీతమే ఆయనకు ఆధారం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీధుల్లో వయోలిన్ వాయిస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు 80 దాటినా, కంటి చూపు మందగించినా, చేతిలోని వయోలిన్ పాతబడిపోయి శిథిలావస్థకు చేరినా ఆయన సంగీత ప్రయాణం మాత్రం ఆగలేదు.ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో వయోలిన్ వాయిస్తూ కనిపించే మల్లిక్ రోజుకు వంద రూపాయల వరకే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయన భార్య కూడా తరచూ పక్కనే కూర్చొని తోడుగా ఉంటోంది. అద్దె ఇంట్లో జీవిస్తున్న ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని.. కంటెంట్ క్రియేటర్ ఆరాధనా చటర్జీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కథనం వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందిస్తూ, “ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా సాయం చేయాలనుకుంటున్నాను. ఆయనకు ఎలా సహాయం చేయాలో వివరాలు కావాలి” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన స్పందనతో మరింత మంది భగవాన్ మల్లిక్ పరిస్థితి గురించి తెలుసుకుని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev— anand mahindra (@anandmahindra) June 24, 2026ఇప్పటికే ఆరాధనా చటర్జీ మల్లిక్కు కొత్త వయోలిన్ను బహుమతిగా అందించడమే కాకుండా, ప్రజల సహకారంతో లక్ష రూపాయల నిధులు కూడా సమీకరించినట్లు వెల్లడించారు. ఒక సాధారణ వీడియోతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వానికి నిదర్శనంగా మారింది. దశాబ్దాలుగా జీవన పోరాటంలో సంగీతాన్ని ఆయుధంగా మార్చుకున్న భగవాన్ మల్లిక్ కథ... ప్రతిభకు వయసు అడ్డుకాదని, నిజమైన కళాకారుడు పరిస్థితులు ఎంత కఠినమైనా తన కళను వదలడని మరోసారి గుర్తు చేస్తోంది.
యూపీ పీఠంపై అఖిలేష్ కన్ను.. అమల్లోకి 2024 ఫార్ములా!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే ఏడాది (2027) జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తమకు భారీ విజయాన్ని అందించిన ‘పీడీఏ’ (పిఛ్డా, దళిత్, అల్పసంఖ్యాక్ -వెనుకబడిన, దళిత, మైనారిటీ) ఫార్ములాను మరింత విస్తరిస్తూ, ఈసారి అసెంబ్లీ పోరులో సరికొత్త ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. లీక్లకు భిన్నంగా సామాజిక సమీకరణాలను మార్చేస్తూ.. ఈసారి రాష్ట్రంలోని పలు సాధారణ (జనరల్) నియోజకవర్గాల్లో సైతం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యర్థులను బరిలోకి దించేందుకు సమాజ్వాదీ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహరచన చేస్తోంది.ఫైజాబాద్ సూపర్ హిట్ మోడల్గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చేసిన సాహసోపేతమైన ప్రయోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్ జనరల్ సీటు నుండి దళిత సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ను అఖిలేష్ బరిలోకి దించారు. రామమందిర సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, ఆయన బీజేపీ అభ్యర్థిపై 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయం సాధించారు. అదేవిధంగా మీరట్ జనరల్ సీట్లో దళిత మహిళా నేత సునీతా వర్మను నిలబెట్టగా, అక్కడ బీజేపీ ఘనపాటి అరుణ్ గోవిల్ కేవలం 10 వేల ఓట్ల స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈ విజయాల స్ఫూర్తితోనే, 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ 'ఫైజాబాద్-మీరట్ మోడల్'ను పెద్ద ఎత్తున అమలు చేయాలని ఎస్పీ నిర్ణయించింది.పశ్చిమ యూపీపై ప్రత్యేక నజర్సాధారణ స్థానాల్లో దళిత అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎస్పీ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. 2012 తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఓటు బ్యాంక్ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. ఒకప్పుడు మాయావతికి అండగా నిలిచిన పశ్చిమ యూపీ దళిత ఓటర్లు ఇప్పుడు చెల్లాచెదురయ్యారు. ఈ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా తిరుగులేని సామాజిక కూటమిని నిర్మించాలని అఖిలేష్ భావిస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతంలో యువ దళితులను ఆకర్షిస్తూ పుంజుకుంటున్న చంద్రశేఖర్ ఆజాద్కు చెందిన ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ ప్రభావాన్ని ముందే అడ్డుకోవడం కూడా ఎస్పీ ముఖ్య ఉద్దేశం.నిపుణుల విశ్లేషణ ఏంటి?సాధారణ స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులను నిలబెట్టడం వల్ల దళిత ఓటర్లలో ఒక రకమైన భావోద్వేగ, రాజకీయ బంధం ఏర్పడుతుందని లక్నోకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు డాక్టర్ నోమిత పి. కుమార్ అభిప్రాయపడ్డారు. కుల ప్రాతినిధ్యం కీలక పాత్ర పోషించే యూపీ లాంటి రాష్ట్రంలో, దళితులను తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఎస్పీ ఆశించిన విజయం సాధించాలంటే ముస్లింలు, ఓబీసీలు, దళితులను ఒకే వేదికపై ఎంతవరకు సమన్వయం చేస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.సర్వే బాధ్యతల్లో రిటైర్డ్ ఐఏఎస్ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అఖిలేష్ యాదవ్ ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆలోక్ రంజన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సర్వే బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. నియోజకవర్గాల్లో వ్యతిరేకత లేని ప్రస్తుత ఎస్పీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు దక్కడం దాదాపు ఖాయమే అయినా, కొత్త అభ్యర్థుల ఎంపిక మాత్రం కేవలం సర్వే రిపోర్ట్, మెరిట్ ఆధారంగానే జరుగుతుందని అఖిలేష్ స్పష్టం చేశారు.కాంగ్రెస్తో పొత్తు సమీకరణలురాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనుసరించాల్సిన సీట్ల సర్దుబాటుపై ఆలోక్ రంజన్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దీని ప్రకారం కాంగ్రెస్కు 70 నుండి 75 కి మించి సీట్లు ఇవ్వకూడదని నివేదిక పేర్కొంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 71 స్థానాల్లో కాంగ్రెస్ ప్రదర్శన చాలా పేలవంగా ఉందని, అందుకే ఆ స్థానాలపై ఈసారి ఎస్పీ గట్టి పట్టుబట్టాలని సూచించింది. అయితే పశ్చిమ యూపీలోని సహారన్పూర్, అమ్రోహా వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాస్త క్లిష్టంగా మారే అవకాశం ఉంది.రిజర్వ్డ్ స్థానాల్లో మహా సంగ్రామంఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 86 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 84 ఎస్సీ స్థానాలు కాగా, 2 ఎస్టీ స్థానాలు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాల్లో ఎస్పీ 7, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ 86 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు, సాధారణ స్థానాల్లోనూ దళిత అభ్యర్థులను వ్యూహాత్మకంగా బరిలోకి దించితే 2027 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ మార్కును (202 సీట్లు) సులభంగా దాటవచ్చని సమాజ్వాదీ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.
పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ.. ప్రభుత్వం కొత్త ప్లాన్
ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్ భత్ఖాల్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.
రిజర్వేషన్ల అంతమే బీజేపీ అసలు లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో రిజర్వేషన్లను రద్దుకే భారతీయ జనతా పార్టీ లోక్సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. దేశ యువత నిరాశా నిస్పృహలే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వ్యక్తమవుతున్నాయన్న ఆయన వారు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు. బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ యువ నేతలను మళ్లీ కాంగ్రెస్లోకి చేర్చుకోరాదని, మాలాంటి వారికి అది అవమానకరమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. పీటీఐ వీడియోస్కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమేశ్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ల బిల్లు నెపంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు జరిగిన ప్రయత్నం కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకేనని ఆరోపించారు చిత్తశుద్ధి ఉంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల ఆధారంగానే, ’నారీ శక్తి వందన్’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో ‘‘అబ్ కి బార్... 400 పార్’’అని బీజేపీ నినదించినప్పుడే తాము అది రిజర్వేషన్లను అంతం చేసేందుకు ఉద్దేశించిందని చెప్పామని, అప్పటి నుంచి ఇప్పటివరకూ టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఆ మాటలను నిజం చేస్తున్నాయని వివరించారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్తోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తున్న విషయంపై మాట్లాడుతూ ‘దీనికి కారణం ఒక్కటే. ఏప్రిల్ 17న ‘చాణక్యుడు’(అమిత్ షా) ఎదుర్కొన్న అవమానం. నియోజకవర్గ పునరి్వభజన బిల్లులు మూడూ ఆమోదింపజేస్తానని ఆయన మోడీకి మాటిచ్చారు. కానీ 298 కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయారు’’అని వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఆయన వ్యూహం ఫలించకపోవడంతో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో పార్టీలను చీల్చే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అయితే.. విపక్షాలు పునరి్వభజన యత్నాన్ని మాత్రమే వ్యతిరేకించాయని, మహిళా రిజర్వేషన్లను కాదని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగంపై నమ్మకం లేదని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. మోజార్టీ అసాధ్యం.. టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చడం ద్వారా బీజేపీ బలం 298 నుంచి 324కు చేరుకున్నా ప్రస్తుత లోక్సభలో మూడింట రెండొంతుల మెజార్టీ మార్కు అందుకోవడం ఆ పార్టీకి అసాధ్యమని జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా వారికి ఈ మెజార్టీ రాదని, రాజ్యాంగ సవరణే వారి లక్ష్యమన్నది దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు బాగా తెలుసునని రమేశ్ వివరించారు. నియోజకవర్గాల పునరి్వభజన ద్వారా ఎంపీల సంఖ్యను 815కు పెంచాలని అనుకుంటున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. కుల గణన తర్వాతే పునిర్వభజన జరగాలని, వచ్చే లోక్సభ ఎన్నికలను 543 స్థానాలతోనే నిర్వహించి, అందులో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయాలను ప్రస్తావించిన జైరామ్ రమేశ్.. అవన్నీ దేశ యువతలో పేరుకుపోయిన నిరాశ, నిస్పృహల అభివ్యక్తీకరణ మాత్రమేనని అన్నారు. యువత ఈ రకమైన సందేశం ఇవ్వడంలో తప్పులేదు కానీ చివరకు రాజకీయ పార్టీలే ఆయా అంశాలను అజెండాగా మార్చుకోవాలని చెప్పారు. సీజేపీ ఉద్యమాన్ని ఎవరో స్పాన్సర్ చేస్తున్నారనడం సరికాదన్న ఆయన అది రాజకీయ పార్టీ కూడా కాదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో మంచి గుర్తింపు మాత్రం లభించిందని చెప్పారు. ఉద్యమాల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలతో ముఖ్య భూమికని గుర్తుచేశారు.
International
NRI
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు
ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, ఫెయిర్గ్రౌండ్స్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా కలర్ఫుల్గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్తో ఆహూతులను అలరించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు.ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితెందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల విజయానికి కీలకమైన పాత్ర వహించాయని 'మాటా' నిర్వహకులు ప్రకటించారు.సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
ఉత్తర అమెరికాలో తెలుగు భాషాభివృద్ధిలో మరో మైలురాయి
ఉత్తర అమెరికాలో తెలుగు భాషా బోధనకు అంకితభావంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మరోసారి తన విద్యా ప్రస్థానంలో విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయులలో నిర్వహించిన వార్షిక తెలుగు విద్యా పరీక్షలకు మొత్తం 3,037 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పర్యవేక్షించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులలో 98.74% శాతం మంది ఉత్తీర్ణత సాధించడం, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల పిల్లల్లో తెలుగు భాషా పరిరక్షణ, ప్రచారం కోసం సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషికి గొప్ప గుర్తింపుగా నిలిచింది. పరీక్షల నిర్వహణ కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.మునిరత్నం నాయుడు, పరీక్షల నియంత్రణాధికారి డా.ముసుగు శ్రీనివాసరావు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 56 కేంద్రాల్లో పరీక్షలు అమెరికా, కెనడా వ్యాప్తంగా ఉన్న 56 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న తెలుగు పిల్లలు తమ మాతృభాషను నిబద్ధతతో నేర్చుకోవడం ఎంతో ఆనందదాయకమని మునిరత్నం నాయుడు అన్నారు. 3,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం, వారిలో దాదాపు 99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం, అలాగే సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల నాణ్యతకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. మాతృభాషను తరతరాలకు అందించే ఈ యజ్ఞంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను సత్కరిస్తూ, అమెరికా, కెనడాలోని 17 ప్రాంతాల్లో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, టెక్సాస్లోని డల్లాస్, మిచిగన్, వర్జీనియా ప్రాంతాల్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు డా. మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించారు. ఏరియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి డా. మృణాళిని చుండూరి, లాస్ ఏంజెలెస్, సిలికాన్ వ్యాలీలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్, ప్రెసిడెంట్ చమర్తి రాజు మాట్లాడుతూ ‘‘మనబడి ప్రారంభమైన నాటి నుంచి ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలకు మాతృభాషను చేరువ చేయడమే మా లక్ష్యం. ఈ సంవత్సరం సాధించిన 98.74 శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల కృషికి, తల్లిదండ్రుల అంకితభావానికి, మా స్వచ్ఛంద ఉపాధ్యాయుల సేవాభావానికి ప్రతిఫలం. తెలుగు భాషను కేవలం నేర్పడం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని తదుపరి తరాలకు అందించాలనే సంకల్పంతో మనబడి ముందుకు సాగుతోంది’’ అని తెలిపారు.
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్నగర్కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్లు ఆనందం వ్యక్తం చేశారు.
Sakshi Originals
‘రాబందు’ రాజసం!
రెక్కల నిండా స్వేచ్ఛను నింపుకొంది. దిక్చక్రాల సరిహద్దులు దాటింది. ఆకాశాన్నే సామ్రాజ్యంగా మార్చుకుందా రాజ విహంగం. పంజరాల గోడల మధ్య పుట్టి పెరిగినా, ప్రకృతి పిలుపు అందుకోగానే అడవి బాట పట్టింది. మహారాష్ట్ర కొండల్లో రెక్కలు విప్పిన ఓ రాబందు.. మధ్యప్రదేశ్ వనసీమలను దాటుకుంటూ, ఏకంగా మూడు వేల కిలోమీటర్ల అవతల ఉన్న రాజస్థాన్ రాజకోటను ముద్దాడింది. అంతరించిపోతున్న తన జాతి మనుగడకు సరికొత్త ఆశల రెక్కలు తొడుగుతూ.. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక అద్భుతమైన ‘మహా యాత్ర’ను లిఖించింది..మూడు రాష్ట్రాల మీదుగా.. వన్యప్రాణి సంరక్షణలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని మేల్ఘాట్ అడవుల్లో శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా విడిచిపెట్టిన ‘ఎక్స్–67’ (ఎక్స్67) అనే ఐదేళ్ల ఆడ రాబందు.. కేవలం 27 రోజుల్లో మూడు రాష్ట్రాల మీదుగా ఏకంగా 3,334 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రాజస్థాన్లోని ప్రసిద్ధ రణథంబోర్ టైగర్ రిజర్వ్కు చేరుకుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిశోర్ రీథే బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. మానవ సంరక్షణలో పెరిగి, అడవిలోకి వెళ్లిన పక్షులు.. మనుషుల సాయం లేకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కోగలవని, ప్రకృతి శైలికి అద్భుతంగా అలవాటుపడగలవని ఈ ఘనత నిరూపించింది. భారతదేశంలో వేగంగా అంతరించిపోతున్న రాబందుల జనాభాను తిరిగి పెంచేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇది పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.అడవుల నెట్వర్క్లోనే బసఈ ఏడాది జనవరి 2న మేల్ఘాట్ నుంచి సోలార్ ట్రాకింగ్ ట్యాగ్లు అమర్చి వదిలిన 15 రాబందులలో ఈ ‘ఎక్స్–67’ ఒకటి. మొదట నాలుగు నెలల పాటు స్థానిక అడవుల్లోనే తిరుగుతూ ప్రకృతికి అలవాటుపడిన ఈ పక్షి.. మే 28న తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్, భోపాల్ ప్రాంతం, చిరుతలను పునరుద్ధరించిన కునో నేషనల్ పార్క్లలో తాత్కాలికంగా బస చేస్తూ.. మంగళవారం నాటికి రాజస్థాన్ రణథంబోర్ చేరుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్
ఐఎస్ఎస్ను సముద్రంలో ముంచేస్తారా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సముద్రంలో కూల్చేయనున్నారా? సుమారు ముప్పై ఏళ్లుగా పలు శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన ఈ భారీ అంతరిక్ష కేంద్రం ఇక గత చరిత్ర కానుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవునని అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా). అయితే వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరమేమొచ్చింది? భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఈ 450 టన్నుల బరువైన కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తే ప్రమాదమేమీ లేదా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఎప్పుడో 1998లో రష్యా మొదలుపెట్టిన ఐఎస్ ఎస్ నిర్మాణం అమెరికాతోపాటు అనేక ఇతర దేశాల భాగస్వామ్యంతో 2000లో పూర్తయింది. ఆ తరువాత దశల వారీగా ఒక్కో పరిశోధన కేంద్రాన్ని జోడించుకుంటూ విస్తరించింది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా అందులో అనేకానేక ముఖ్యమైన ప్రయోగాలు జరిగాయి. వైద్యం, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో పంటలెలా పండుతాయి? పదార్థాల ధర్మాలు ఎలా మారతాయి? అన్న విషయాలతోపాటు భూమిని నిత్యం పరిశీలించేందుకు కూడా ఐఎస్ఎస్ ఎంతో ఉపయోగపడింది. అయితే 1998లో తొలి మాడ్యూల్ను ప్రారంభించినçప్పుడు ఐఎస్ఎస్ వయసు 15 ఏళ్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇది అంతకు రెట్టింపు సమయం సేవలందించింది. ఫలితంగా ఈ నిర్మాణం అంత సురక్షితమైంది కాదన్న అంచనాలు ఉన్నాయి. పైగా మరమ్మతు చేయడం మరింత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే 2030 నాటికల్లా ఐఎస్ఎస్ను నెమ్మదిగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్రంలో కూల్చేయాలని నాసా ప్రతిపాదిస్తోంది. ఉపగ్రహ శ్మశానంలో... ఐఎస్ఎస్ ఒక చివర నుంచి ఇంకో చివర వరకూ ఉన్న దూరం సుమారు 358 అడుగులు. వెడల్పు 239 అడుగులు. ఎత్తు 66 అడుగులు. ఇంత భారీ సైజున్న ఐఎస్ఎస్ను కూల్చేయడం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పొరబాటున జనావాసాలున్న చోట కూలితే ఇక అంతే సంగతులు. అందుకే నాసా దీన్ని పాయింట్ నీమో వద్ద సముద్రంలో పడేలా చేస్తామంటోంది. కాలం చెల్లిన, అదుపు తప్పిన ఉపగ్రహాలన్నింటినీ కూల్చే ప్రాంతమే ఈ పాయింట్ నీమో. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో న్యూజిల్యాండ్, దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది ఇది. అక్కడి నుంచి కనీసం 2,688 కిలోమీటర్ల దూరం వెళితే గానీ మనిషి అన్నవాడు కనిపించడు. పైగా ఈ ప్రాంతలో నౌకలు తిరిగేది కూడా చాలా తక్కువ. ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చే వ్యోమగాములు కూడా ఈ ప్రాంతంలోనే భూమ్మీదకు చేరుతూంటారు. ఒకవేళ అనుకోని విధంగా ఐఎస్ఎస్ ముక్కలు ముక్కలైనా ఈ నిర్మానుష్య సముద్ర ప్రాంతంలో పడటం వల్ల ఎవరికీ అపాయం జరగదన్న అంచనాతో నాసా దీన్ని ఎంచుకుందన్నమాట. పర్యావరణవేత్తల ఆందోళన... ముందుగా చెప్పుకున్నట్లు ఐఎస్ఎస్ బరువు సుమారు 450 టన్నులు. రకరకాల లోహాలు, ప్లాస్టిక్ పదార్థాలతో తయారైంది. అంతేకాకుండా... బోలెడన్ని రసాయన అవశేషాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ పర్యావరణానికి ముఖ్యంగా సముద్ర జలచరాలకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఐఎస్ఎస్ను పాయింట్ నీమో వద్ద కూల్చాలన్న ప్రతిపాదనపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాన్ని వ్యర్థాలను పడేసే చెత్తకుప్ప మాదిరిగా చూడొద్దని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కూల్చేయడం కంటే... ఐఎస్ఎస్లో పనికొచ్చే వ్యవస్థలు, ఇంజిన్లు, మోటార్లను అక్కడే మరమ్మతు చేసి వాడుకోవాలని... ఎలాగైతే ఒక్కో భాగాన్ని జోడించి ఐఎస్ఎస్ను సిద్ధం చేశారో.. అదే పద్ధతిలో దశలవారీగా విడగొట్టి అత్యవసరం అనుకున్న భాగాలను మాత్రమే కూల్చేయాలని సూచిస్తున్నారు. శకలాల కారణంగా ఏ దేశానికైనా నష్టం జరిగితే ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం పరిహారం చెల్లించాలని 1972 నాటి స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ చెబుతోందని, దురదృష్టవశాత్తూ ఈ నియమం సముద్రాలకు వర్తించదని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ఓషన్ ఫౌండేషన్’అధ్యక్షుడు మార్క్ స్పేడ్లింగ్ చెబుతున్నారు. ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. మనుషులకు దూరంగా కూల్చేస్తున్నారని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతానికీ ఎంతో కొంత విలువ ఉంటుందన్నది గుర్తించాలని చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో? ఎలా కూలుస్తారంటే... → 2028లో ఐఎస్ఎస్ కూల్చివేత ప్రక్రియ మొదలవుతుంది. ఐఎస్ఎస్కు వెన్నెముక లాంటి జార్యా (రష్యా మాడ్యూల్) కక్ష్యను క్రమ పద్ధతిలో తగ్గిస్తారు. భూమి సహజ ఆకర్షణ శక్తికి గురయ్యేలా చేస్తారు. → 2029లో స్పేస్ ఎక్స్కు చెందిన డీ ఆర్బిటింగ్ అంతరిక్ష నౌక ఒకటి ఐఎస్ఎస్కు అనుసంధానమవుతుంది. సుమా రు 46 థ్రస్టర్లను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో ఐఎస్ఎస్ను పాయింట్ నిమోకు చేరుస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్
సూపర్ ఎల్నినో వెనుక బంగారు రహస్యం!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న "సూపర్ ఎల్నినో" పేరు వినగానే కరువు, వరదలు, పంటనష్టం, ఆహార సంక్షోభమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వాతావరణ దృగ్విషయం అందరికీ శాపమేనా? ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలకు మాత్రం సూపర్ ఎల్నినో బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడో పంటలు ఎండిపోతుంటే.. మరెక్కడో రికార్డు దిగుబడులు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఆనకట్టలు నిండిపోతాయి. ప్రకృతి సృష్టించే ఈ అసమాన సమీకరణంలో విజేతలు ఎవరు? ఓటమిపాలయ్యే దేశాలు ఏవి?.ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన ఘటనల్లో ఎల్నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఎల్నినో ఏర్పడుతుంది. ఈ వేడిమి మరింత తీవ్రరూపం దాల్చినప్పుడు దానిని "సూపర్ ఎల్నినో"గా పిలుస్తారు. 1982-83, 1997-98, 2015-16లో నమోదైన సూపర్ ఎల్నినోలు ప్రపంచవ్యాప్తంగా వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు. మనం ఉదయం తాగే కాఫీ నుంచి సాయంత్రం తినే చాక్లెట్ వరకు, రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వాతావరణ నిపుణులు సూపర్ ఎల్నినోను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి’గా అభివర్ణిస్తుంటారు.అయితే ప్రకృతి ఇక్కడే తన విచిత్రాన్ని చూపిస్తుంది. ఒకే వాతావరణ పరిణామం కొన్ని దేశాలకు విపత్తుగా మారితే, మరికొన్ని దేశాలకు అది వరంలా మారుతుంది. ముఖ్యంగా అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే వంటి వ్యవసాయాధారిత దేశాలు ఎల్నినో సంవత్సరాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీ పంట దిగుబడులను నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమల ఉత్పత్తి పెరగడంతో ఈ దేశాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వీటికి మరింత డిమాండ్ పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుంది.ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రాంతాలకు కూడా ఎల్నినో కొన్నిసార్లు ఊరటనిస్తుంది. సాధారణంగా కరువుతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో వర్షపాతం పెరిగి జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వ్యవసాయ రంగానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. హైడ్రోపవర్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఎల్నినో ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చేస్తుంది. ఒక దేశంలో పంటలు విఫలమైతే, మరో దేశం ఆ కొరతను భర్తీ చేస్తూ భారీ ఎగుమతుల ద్వారా లాభపడుతుంది. 1997-98 సూపర్ ఎల్నినో సమయంలో కొన్ని దక్షిణ అమెరికా దేశాల వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే ఈ లాభాల వెనుక కూడా ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలో పంటలు బాగా పండినా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరత ఏర్పడుతుంది. సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార ధరలు పెరగడం వంటి పరిణామాలు చివరికి లాభపడిన దేశాలపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు, వర్షాభావం, పంట నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్లో రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడితే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా ఎల్నినో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దశాబ్దాలకు ఒకసారి కనిపించే తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని అర్థం ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని వాతావరణ షాక్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట.చివరగా.. సూపర్ ఎల్నినో అనేది కేవలం సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి. ఎక్కడో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే, మరో దేశంలో అదే వర్షాలు బంగారు పంటలుగా మారతాయి. ఎక్కడో ఆనకట్టలు ఎండిపోతుంటే, మరెక్కడో నీరు పొంగిపొర్లుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎల్నినోను ప్రకృతి నిర్వహించే ప్రపంచ స్థాయి లాటరీగా అభివర్ణిస్తారు. కానీ ఈ లాటరీలో కొందరు గెలిచినా, చివరికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం మొత్తం ప్రపంచానిదే.
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్కు చెందిన జంట.. హనీమూన్కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం
ఇక ఫోన్లతో పనిలేదు.. కళ్లద్దాలతోనే కాల్స్, ట్రాన్స్లేషన్స్!
సోమాజిగూడలో ప్లాస్టిక్ ఫుట్పాత్..
సమంత తన భర్తని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
కు.ని. పనీ.. స్త్రీలదే!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లే టాప్ గెయినర్లు
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
థానా రామయ్య... నువ్వు చాలా గ్రేటయ్యా!
బాహ్య సౌందర్యం.. ఆత్మ సౌందర్యం.. ఏది మిన్న?
‘ధర్మన్’ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్.. కొత్త సినిమాపై హైప్ పెంచిన రజనీకాంత్
టమాటాకు ‘సెంచరీ’ ఫీవర్.. రంగంలోకి ప్రభుత్వం!
యోగాతో ప్రపంచ శాంతి : మోదీ
గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు!
హీరోయిన్ త్రిష సర్ప్రైజ్.. సీఎం విజయ్కు విషెస్..!
సార్ విజన్ సూపర్! ఒకపక్క పనులు సాగదీస్తూ.. మరోపక్క మట్టితో సంపాదిస్తున్నారు. సంపద సృష్టి అంటే ఇదే!!
రేపటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
సూపర్ ఎల్నినో వెనుక బంగారు రహస్యం!
ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
శుభవార్త.. తల్లిదండ్రులయిన టాలీవుడ్ హీరోహీరోయిన్
ఎమ్మెల్సీగా తిలక్ వర్మ స్నేహితుడు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’..
మోదీ కేబినెట్లో భారీ మార్పులు?
ఆరు అడుగుల గిరినాగు హల్చల్
ముప్పు ఉన్నది మన ఉద్యోగులకే.. సంస్థలకు కాదు!
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సమంత
సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష
మనం కనిపిస్తే చాలు భయపడి పారిపోతున్నార్సార్!
ఒక్క స్పీచ్.. చిరంజీవిపై ట్రోలింగ్
‘ఒకరు వదిలించుకున్నారు.. మరొకరు ఓపికతో దక్కించుకున్నారు’
క్రైమ్
అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర
బనశంకరి: కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన సొహైల్(20) ఉపాధి కోసం హరిహరకు వచ్చి పెయింటింగ్ పని చేస్తున్నాడు. ఇతడు ఇన్స్టా్రగామ్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తున్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కేంద్ర ఇంటెలిజన్స్ విభాగాలు గుర్తించాయి. దావణగెరె పోలీసులకు సమాచారం చేరవేశాయి. దాంతో డీఎస్పీ బసవరాజ్ నేతృత్వంలో పోలీసులు మంగళవారం సొహైల్ నివాసంపై దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నెలరోజుల క్రితం తుమకూరు నగరంలో జమీర్ఖాన్, అల్లాబక్ష్ అనే ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో సొహైల్కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సొహైల్ అద్దె ఇంటిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడి మొబైల్ఫోన్ని పరిశీలించగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని వెల్లడించారు. 15 రోజుల క్రితమే ఇతరులతో కలిసి ఒక బృందంగా ఇక్కడికి చేరుకున్నాడని, మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలియజేశారు. అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాంబులు పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల ఎదుట సొహైల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అతడి మొబైల్ ఫోన్లో పాకిస్తాన్ కోడ్ కలిగిన గ్రూపులు, ఆయుధాల చిత్రాలు లభ్యమయ్యాయి. అనేక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సభ్యులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. పాకిస్తానీ వ్యక్తి ఫోన్ నంబర్ను రాణా బాయ్ అనే పేరుతో తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. దేశద్రోహ కార్యకలాపాల్లో సోహైల్ చురుగ్గా పాల్గొంటున్నట్లు గుర్తించారు. పలు ఉగ్రవాద సంస్థల వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లోనూ ఇతడు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోటవద్ద రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కాబోయే కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ కుటుంబం చివరికి కాబోయే కోడలి క్రూరత్వానికి బలైపోయింది. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని తీవ్ర ఆవేదన మిగిల్చింది.కన్నతల్లి ఆవేదన.. ఆఖరి మాటలుకొడుకు మరణవార్త విన్న కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గుండెకోత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతున్నారు. తనే పంపించానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అసలు ఆ రోజు లోహగఢ్ కోట ట్రిప్కు వెళ్లమని కేతన్ను ఒప్పించింది అతని తల్లే. దాంతో కొడుకును మృత్యుపాశంలోకి తానే నెట్టేసానని తల్లి తల్లడిల్లిపోతోంది. ఆమె తీరని ద్రోహం చేసింది. మా యింటి పిల్ల అనుకున్నాం. కలిసి షాపింగ్లు చేశాం, కలిసి భోంచేశాం కానీ ఇంత దారుణానికి తెగ బడుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కాబోయే కోడలి గురించి తల్లి, కొడుకుతో చెప్పిన చివరిమాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు."My son is no more. Siya betrayed us. We treated her like family, went shopping and had dinners together, but never imagined this," said Ketan Agarwal's grieving mother. 💔 Meanwhile, Ketan's father has appealed for a fast-track trial and the strictest punishment for the… pic.twitter.com/ebQ5MkWggS— Megh Updates 🚨™ (@MeghUpdates) June 24, 2026చివరి మాటలుకేతన్ ట్రిప్కు బయలుదేరే ముందు తల్లి రాఖీ అగర్వాల్ అతనికి చెప్పిన చివరి మాటలు.. ‘‘సియాను జాగ్రత్తగా చూసుకో. ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టకు’’ అని కొడుకు ప్రాణాలు తీయబోయే అమ్మాయి గురించే ఆ తల్లి ఆఖరి నిమిషం వరకు అంతగా తాపత్రయపడటం అందరినీ కలచివేస్తోంది.35 ఏళ్ల బంధంఅగర్వాల్, గోయల్ కుటుంబాల మధ్య 35 ఏళ్ల పరిచయం అందుకే రాఖీ అగర్వాల్ కాబోయే కోడలు సియాను తన సొంత కూతురిలా చూసుకున్నారు. అలాంటి సియానే తన కొడుకును చంపడానికి కుట్ర పన్నిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయారు.తండ్రి మరో వాదనకేతన్ తండ్రి పుణేలో ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ ఈ హత్యకు సంబంధించిన మరికొన్ని భయంకరమైన వివరాలను పంచుకున్నారు. కేతన్ను కోట పైనుంచి కిందకు నెట్టేయడానికి ముందే.. సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి పదునైన ఆయుధంతో కేతన్ తలపై బలంగా కొట్టారు. అతడు స్పృహ తప్పేలా లేదా కనీసం తప్పించుకోలేనంత బలహీనపడేలా చేసిన తర్వాతే పైనుంచి కిందకు నెట్టేసి చంపేశారని వాపోయారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలిపోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు త్వరగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయడమే నా ఏకైక డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక కావాలి అని తండ్రి విశాల్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.బర్త్డే వేడుక కోసం స్టార్ హోటల్లో 70 రూములు తన కుమారుడి కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకను మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ మహాబలేశ్వర్లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, సియా మనసులో తన కుమారుడికి సంబంధించి ఒక భయంకరమైన పథకం ఉందని ఆయనకు తెలియదు.జూన్ 20న మహాబలేశ్వర్లో సియా పుట్టినరోజును కేతన్, సియా, కుటుంబాలు కలిసి జరుపుకోవాలని అనుకున్నాయి. ఇందుకోసం కేతన్ తండ్రి ఆ హిల్ స్టేషన్లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. అయితే, ఆ ప్లాన్ను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ఒంటరిగా వెళ్లేలా సియా కేతన్ను ఒప్పించింది. ప్రియుడితో కలిసి తన ప్లాన్ను పక్కాగా అమలు చేసిన కేతన్ను హతమార్చింది.రూ. 17 కోట్ల పెళ్లి వేడుక.. అంతలోనే విషాదంకేతన్ (26), సియా (20) ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్లోని ఒక ప్యాలెస్ను రూ. 17 కోట్ల భారీ బడ్జెట్తో బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకురావడానికి రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కొడుకు ముస్తాబులో చూడాలనుకన్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారిపోవడం కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్ఎవరీ కేతన్ అగర్వాల్కుటుంబ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'సక్సెస్ గ్రూప్'కు డైరెక్టర్గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO)గా ఉండేవారు. పూణేలో నివసించేవారు.ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంటర్ప్రెన్యూర్షిప్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు. సింబయాసిస్ యూనివర్సిటీ నుండి బీబీఏ డిగ్రీని కూడా పొందారు. కేతన్ లింక్డ్ఇన్ బయో ప్రకారం, సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉండటమే కాదు, కేవలం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా, పచ్చని భవిష్యత్తుకు దోహదపడే ప్రాజెక్టులపై దృష్టి సారించారు.ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!కాగా కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది, నవంబర్లో వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న, సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కేతన్ లోయలో పడి మరణించాడు. సియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించినప్పటికీ, విచారణలో సియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఎత్తు నుండి కిందకు తోసేశారని తేలింది. ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోట హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ సినిమా లాంటి సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) కేసు దర్యాప్తులో పోలీసుల విచారణ ద్వారా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో సి ప్రియుడు చేతన్ చౌదరి సంచలన విషయాలను వెల్లడించాడు.హత్య కుట్రకు గల కారణంపోలీసుల విచారణలో నిందితుడు చేతన్ చౌదరి అసలు విషయాన్ని అంగీకరించాడు. "కేతన్ను చంపే బదులు, మీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా?" అని పోలీసులు ప్రశ్నించగా చేతన్ సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, చేతన్తో కలిసి పారిపోవడం సియా గోయల్కు ఇష్టం లేదనీ, అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని ఆమె భయపడిందని తెలిపాడు. కుటుంబ పరువు కోసం పెళ్లి ఆపలేక, ప్రియుడితో కలిసి జీవించడం కోసం కేతన్ను పూర్తిగా వదిలించుకోవడమే దారి అని భావించి ఈ హత్యకు ప్లాన్ చేశామని వెల్లడించాడు. ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!జూన్ 18న కేతన్ లోహగఢ్ కోట పైనుంచి కాలుజారి పడిపోయాడని సియా అందరినీ నమ్మించింది. తన కాబోయే భర్త మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం, పొంతన లేని సమాధానాల కారణంగా కేతన కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అలా మొదలైన దర్యాప్తులో సియా, చేతన్ కుట్ర బట్టబయలైంది. ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.33 డిగ్రీల సెల్సియస్ ఎండలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సియా, చేతన్ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్ను వెంబడించి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్
కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్కు గురిచేసింది.తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.సోదరి అనుమానంతో గుట్టు రట్టుకానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.6 నెలల్లో 2004 కాల్స్సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.మండుటెండలో హుడీసీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.మరో సీసీటీవీ ఫుటేజ్లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్అపుడే తోసేసింది..కానీ కేతన్, సియాలు మే 31, జూన్ 14 , జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్పోర్ట్ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది. అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, 'ప్లాన్ సి' (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్లో చేతన్కు ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్ ఎంగేజ్మెంట్కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలోజరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం.
వీడియోలు
తెలంగాణలో SIR షురూ
మహా న్యూస్ వంశీ పై కేసు
తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలపై మొదలైన పోటీ
ఈ రాష్ట్రంలో మరో 5 రోజులు భారీ వర్షాలు
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం ఇద్దరు సజీవదహనం
వాహనాలు తనిఖీ చేస్తుండగా DTOపైకి దూసుకెళ్లిన లారీ
తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు
అటు కోహ్లి.. ఇటు చంద్రబాబు
ఆరోజు నాకు ఫోన్ చేసి రాధా గాయత్రి ఏం చెప్పిందంటే..?
వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

