breaking news
Palnadu
-
అత్యవసర చికిత్సకు గుంటూరు వెళ్లాల్సిందే..
నరసరావుపేట మండలం లింగంగుంట్లకు చెందిన కల్యాణి మూర్చవ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంటిపై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయాయ్యయి. సమీపంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని, గుంటూరుకు తీసుకెళ్లమని సూచించారు. ఆమె బంధువులు అప్పటికప్పుడు 108 సాయంతో జీజీహెచ్కు తరలించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అత్యవసర సేవలు కూడా అందుబాటులో లేకపోవడం రోగులకు భారంగా మారింది. మరోవైపు కార్డియాలజీ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా ఉండే పల్నాడు జిల్లా లో కీలకమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నరసరావుపేట వైద్యశాల నుంచి గుంటూరు జీజీహెచ్కు బాధితురాలు కల్యాణి తరలింపు -
మందులు బయటే...
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురంకు చెందిన తుమ్మరి కోటేశ్వరరావు అనారోగ్యంతో ఏరియా వైద్యశాలకు వచ్చాడు. ఆయాసం ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాడు. రక్తపరీక్షలు అవసరమని మూడవ అంతస్తుకు వెళ్లమని సూచించారు. ఆయాసంతో బాధపడుతున్న కోటేశ్వరరావు మూడవ అంతస్తుకు మెట్ల మీద నుంచి ఎక్కడం కష్టంగా మారింది. ఇబ్బందులు పడుతూ మూడవ అంతస్తుకు చేరి రక్తపరీక్షలు చేయించుకొని వైద్యున్ని సంప్రదించాడు. కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపిన వైద్యుడు అవసరమైన మందుల చీటిని చేతిలో పెట్టాడు. ఫార్మసీకి వెళ్లిన కోటేశ్వరరావుకు ఒక రకం మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన రెండు రకాలు బయట తీసుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆసుపత్రిలో ప్రాంగణంలోనే ఉన్న జనరిక్ మెడికల్ షాపులో డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. -
వాగులోకి కారు బోల్తా
దాచేపల్లి: తిరుమలకు బయలుదేరిన కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో కారు వేగంగా డివైడర్ని ఢీకొట్టి వాగులో దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గోపవరం శ్రీనివాసరెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి కారులో తిరుపతికి బయలుదేరారు. దాచేపల్లిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో కారు బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డు మార్జిన్లోకి కారును దింపే క్రమంలో రోడ్డు డివైడర్ని ఢీకొట్టి వాగులోకి పల్టీలు కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్నారు. కారు తలుపులు, అద్దాలు పగులగొట్టి అందులో చిక్కుకున్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శ్రీనివాసరెడ్డి, అతని భార్య, కుమారుడు అద్విత్, కుమార్తె అద్వితి, మామ కృష్ణారెడ్డి, అత్త సుమతీలు గాయపడ్డారు. వీరిలో కృష్ణారెడ్డి, సుమతీ, అద్విత్కు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరుగురికి గాయాలు -
పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు
తాడేపల్లిరూరల్ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు. నరసరావుపేట రూరల్: పదవ తరగతి పరీక్షలు పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా నోడల్ అధికారి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పి.శైలజ తెలిపారు. కేసానుపల్లిలోని ఎంఏంఎం కళాశాలలో బుధవారం మండల స్థాయి అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఏ ఒక్క విద్యార్థి నేల మీద కూర్చుని పరీక్ష రాయకూడదని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ సీఎస్, డీవోలు పోలీస్స్టేషన్ నుంచి పాఠశాలకు ప్రశ్నపత్రాలు తరలించే క్రమంలో పోలీసు ఎస్కార్ట్తో వెళ్లాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే నోడల్ అధికారికి తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఉపవిద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్ అండ్ క్లే క్రాఫ్ట్స్ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
పోలీసుస్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
మాచర్ల: కన్నకూతురు పది రోజులుగా అదృశ్యమైంది. పట్టణానికి వచ్చిన తమ కుమార్తెను గుర్తు తెలియని యువకుడు తీసుకెళ్లాడని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ పోలీసులను దంపతులు పది రోజుల కిత్రం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా ‘విచారణ చేస్తున్నాం. మీ అమ్మాయిని తీసుకొస్తామంటూ’ కాలం గడుపుతున్నారు. పది రోజులైనా తమ కుమార్తె ఆచూకీ తెలుసుకోవటానికి పోలీసులు ప్రయత్నం చేయటం లేదని ఆవేదన చెందిన ఆమె తల్లిదండ్రులు కామనబోయిన చంద్ర శ్రీను, గంగలు బుధవారం రాత్రి పోలీసు స్టేషన్కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుమార్తె ఆచూకీ విషయం పట్టించుకోకుండా పట్టణ సీఐ వెంకటరమణ నిర్లక్ష్యం వహించటం వల్లనే తమకు ఆవేదన మిగిలిందని వాపోయారు. పైగా దురుసుగా మాట్లాడారని, చేయి పట్టుకొని తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేశారని గంగ ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను అదుపులోకి తీసుకున్నాక బంధువులను రానివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. ఈ విషయమై గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కావాలని పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ కుమార్తెను ఇప్పటికే గ్రామానికి చెందిన వారే హత్య చేసి ఉంటారని చంద్రశ్రీను ఆవేదనతో చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా పోలీసులు తమను మభ్యపరుస్తూ విచారిస్తున్నామని పేర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలకుపైగా పట్టణ పోలీసు స్టేషన్ ముందు తల్లిదండ్రులు వేచి ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై ఇన్చార్జి డీఎస్పీ మాట్లాడుతూ యువతి అదృశ్యంపై కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలను ఆచూకీ కనుగొంటామన్నారు. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ ఆందోళన -
పురాధీశులు
చిలకలూరిపేటకు జేసీ సంజనా సింహ... స్థానికం ఇప్పట్లో లేనట్లేనా? అవిశ్వాసంతో .. విశ్వాసం కోల్పోయి.. చిలకలూరిపేట ప్రత్యేకాధికారిగా జేసీ సంజనా సింహ పిడుగురాళ్లకు గుంటూరు ఆర్డీఎంఏ హరికృష్ణ వినుకొండకు పులిచింతల ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రమేష్ మాచర్ల, సత్తెనపల్లికి ఆర్డీఓలు మురళీకృష్ణ, శ్రీరాములు ఈ నెల 16తో ముగియనున్న పాలకవర్గాల పదవీ కాలం ప్రత్యేక పాలనపై ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ‘స్థానిక’ఎన్నికల నిర్వహణకు టీడీపీ ప్రభుత్వం వెనుకంజ -
భార్యను హత్య చేసిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యను భర్త హత్య చేసిన ఘటన మండలంలోని ములకలూరులో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్కు చెందిన యాటగిరి వెంకయ్య, అదరత్తమ్మ(41)లు గత ఆరు సంవత్సరాలుగా పట్టణంలో పాతసామగ్రి సేకరించి విక్రయిస్తూ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఇస్సపాలెం తిరునాళ్ల సందర్భంగా ఇరువురు గ్రామానికి వెళ్లారు. మంగళవారం ఉదయం ములకలూరు సమీపంలోని వాగు దగ్గర అదరత్తమ్మ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలపై గాయం ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో అదరత్తమ్మ తలపై రాయితో మోది హత్య చేసినట్టు విచారణలో వెంకయ్య వెల్లడించినట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం
నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి వద్ద శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు పి. లక్ష్మీనారాయణ, కన్నా శాస్త్రి భక్తుల గోత్రనామపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమాలను మాజీ సర్పంచ్ వలేటి హిమంతరావు, గణపవరం మద్ది లక్ష్మయ్య కంపెనీ ముఠాకూలీలు, కార్మికులు, సిబ్బంది పర్యవేక్షించారు. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరు గ్రామ దేవతలు ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ, పరివార దేవతల ఆవరణలో మంగళవారం అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల రెండవ మంగళవారం జరపతలపెట్టిన కార్యక్రమంలో భాగంగా భక్తులు, వివిధ భజన మండలి వారు పాల్గొని చాలీసా పారాయణం చేశారు. స్వామి వారికి పూజలు చేశారు. తెనాలి: మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతర ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామభక్త హనుమాన్ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి అన్నప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్):అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.సౌజన్య, ఎ.ఉషాకిరణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ సర్వీసుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
మామాఅల్లుళ్లను మింగేసిన కంటైనర్
నకరికల్లు: కంటైనర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై బోల్తా పడడంతో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జిల్లా గురుమూర్తి (55), గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) వరుసకు మామాఅల్లుళ్లు. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని మామిడితోటకు మందు పిచికారీ చేయించి స్కూటీపై గుత్తికొండకు బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి పిడుగురాళ్ల వైపు అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి స్కూటీపై బోల్తా పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది వచ్చి స్థానికుల సహాయంతో క్రేన్ ద్వారా కంటైనర్ని పక్కకు తీయించారు. కంటైనర్ కిందనున్న మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. భారీగా నిలిచిన ట్రాఫిక్ అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై కంటైనర్ బోల్తా పడడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైవేపై వెళ్లే వాహనాలతోపాటు నరసరావుపేట–పిడుగురాళ్ల వైపు రాకపోకలు సాగించేవి కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మండుటెండ కావడంతో ప్రయాణికులు వేచి ఉండలేక రెండుగంటల పాటు అవస్థలు పడ్డారు. కంటైనర్ను వెలికితీసిన పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బైకుపై వెళ్తుండగా వాహనం పడి మృతి -
పురపాలక సంఘాలకు ప్రత్యేకాధికారులు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఈ నెల 17వ తేదీతో పాలకవర్గ కాలం ముగియనున్న పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేడ్–2 పురపాలక సంఘాలైన పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, వినుకొండలకు వరుసగా గుంటూరు ఆర్డీఎంఏ, గురజాల ఆర్డీఓ, సత్తెనపల్లి ఆర్డీఓ, డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, చిలకలూరిపేట సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరందరూ ఆరు నెలలు లేదా నూతన పాలకవర్గం ఏర్పడే వరకు వాటికి ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. నకరికల్లు: మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో వినాయకుని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతంలో క్లూస్టీం, డాగ్స్క్వాడ్ మంగళవారం ఆధారాలు సేకరించాయి. గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పాఠకులకు విదితమే. మంగళవారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది గ్రామానికి చేరుకొని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డ్వాగ్స్క్వాడ్ సహాయంలో పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ పి.కిరణ్ మాట్లాడుతూ ఘటనపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
పట్టణ ప్రణాళికపై ఏసీబీ కన్ను
నగరంపాలెం: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రధాన కార్యాలయ ఆవరణలోని పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు ఏసీబీ అధికార, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలో నలుగురు సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు, ముగ్గురు ఎస్ఐలు సిబ్బంది ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి ఉదయం 11 గంటల తర్వాత గుంటూరు జీఎంసీకి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లారు. అందులో కార్యాలయపు రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆన్లైన్ ఫిర్యాదులను పరిశీలించారు. ఎక్కువగా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగపు సిటీ ప్లానర్ రాంబాబుతో మాట్లాడారు. ఇటీవల ఆన్లైన్, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై సిటీ ప్లానర్ను ఆరాతీశారు. కీలక రికార్డులు స్వాధీనం అప్పటికే కార్యాలయంలో కూర్చుని ఉన్న ఇద్దరితో మాట్లాడారు. ఓ పని నిమిత్తం వచ్చానని, గతంలో ఒకరికి కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సదరు అధికారి ఎవరనేది ఫిర్యాదు చేప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేగాక పట్టణ ప్రణాళిక విభాగపు అధికార, సిబ్బందితోనూ ఏసీబీ అధికారులు చర్చించారు. వివిధ ఫైళ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పలువురు అధికారులను విచారించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనలు, వరుస ఫిర్యాదుల దృష్ట్యా కార్యాలయపు సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. బుధవారం సైతం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యాహ్నా వేళ ఏసీబీ జేడీ (విజయవాడ) సురేష్బాబు గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చారు. ఏఎస్పీ మహేంద్ర మత్తేతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏఎస్పీకి సిబ్బందికి జేడీ పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు దాదాపు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీలతో జీఎంసీ ఆవరణలోని మిగతా విభాగపు అధికార, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
బిడ్డా.. మూగబోయావా
సెల్ ఫోన్ వద్దన్నందుకు బాలుడి బలవన్మరణం నరసరావుపేటటౌన్: తల్లి మందలించిందని కుమారుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నరసరావుపేట పట్టణంలో కలకలం రేపింది. ఇస్లాంపేటకు చెందిన షేక్ రిహాన్ (11) ప్రకాష్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో సెల్ఫోన్న్తీసుకొని గంటల కొద్ది ఆన్లైన్ గేమ్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. అనేక సార్లు తల్లిదండ్రులు వారించినా వినలేదు. సోమవారం సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్న కుమారుడిని చూసి తల్లి మందలించింది. దీంతో అలిగి డాబా పైరూంకి వెళ్లిన బాలుడు ఎంతసేపటికీ కిందకు రాలేదు. దీంతో పైకి వెళ్లి చూడగా ఫ్యానన్కు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఒక్క మాట అనకుండా ఉండాల్సింది అంటూ బోరున విలపించింది. రిహాన్ మృతితో పాఠశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఆందోళనకరంగా సెల్ఫోన్ వినియోగం.. ఇటీవల కాలంలో యువతకు సెల్ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు. సెల్ఫోన్ వినియోగం విపరీతంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. మొబైల్ లేకుండా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, ఆన్లైన్ గేమ్లకు యువత పూర్తిగా ఆకర్షితులౌతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన కొందరు యువకులు గంటల కొద్ది అదే ప్రపంచంలో మునిగిపోతున్నారు. అదే విధంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల్లో ఆర్థికంగా నష్టపోయి అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ సమయం సెల్ఫోన్కే.. చదువుకు కేటాయించాల్సిన విలువైన సమయాన్ని మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమం పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది. అన్నం తినాలన్నా, పుస్తకం పట్టాలన్నా చివరకు నిద్రపోవాలన్నా కాసేపు ఫోన్ పట్టే పరిస్థితి ప్రతి ఇంటా ఉంటుంది. ఎక్కువ సేపు సామాజిక మధ్యమాల్లో గడపటంతో చదువుపై ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఫలితంగా విద్యలో వెనుకబడటమే కాక మానసికంగా కూడా దెబ్బతింటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోగా, వర్చువల్ ప్రపంచమే అసలు జీవితంలా మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కోపం, నిరాశ ఆవేశం పెరిగి తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. పిల్లలు మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రులు మందలిస్తే దాన్ని అర్థం చేసుకోలేని కొందరు యువకులు క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు కుటుంబాలను శాశ్వతంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. మొబైల్ఫోన్ అవసరమైన సాంకేతిక సాధనమే అయినప్పటికీ అధిక వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు రోజంతా సెల్ఫోన్తో గడపకుండా తల్లిదండ్రులు స్పష్టమైన సమయపరిమితి పెట్టాలి. సెల్ఫోన్కు అలవాటు పడ్డ పిల్లల నుంచి ఒక్కసారిగా ఫోన్ తీయకుండా, క్రమంగా తగ్గించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాడ్లాడి వారి భావాలు, సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల వచ్చే అనర్థాల గురించి వివరిస్తూ చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై అవగాహన కలిగించాలి. చదువు, ఆటలు, విశ్రాంతి అన్ని సమతుల్యంగా ఉండేవిధంగా చూడాలి. – డాక్టర్ అత్తిలి సతీష్, మానసిక వైద్య నిపుణులు -
బరితెగిస్తున్న
గ్రానైట్ లారీలను తెలంగాణ తరలించే క్రమంలో మరో సీటీఓ(కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)పై దాచేపల్లి మండలం పొందుగల వద్ద మాఫియా సభ్యులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. తమ లారీలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని, చేస్తే అంతుచూస్తామని, దిక్కున్నవారికి చెప్పుకోమంటూ బెదిరించారట. దీనిపై సదరు అధికారి దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పి పంపారట. దీంతో ఆ అధికారులు ఇద్దరు చేసేదేమిలేక తమ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డొచ్చి, బెదిరిస్తున్నా పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకపోతే ఎలా అనే విమర్శలొస్తున్నాయి. సాక్షి, నరసరావుపేట: అధికార మదంతో రెచ్చిపోతున్న ‘పచ్చ’ మాఫియా సహజ వనరులను కొల్లగొట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రానైట్, ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ్ముళ్ల జేబుల్లోకి తోస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను బెదిరించి, భయపెట్టి దౌర్జన్యంగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. సోమవారం, మంగళవారం పల్నాడు జిల్లా మీదుగా వెళ్తున్న అక్రమ గ్రానైట్ లారీలను ఆపి పత్రాలను పరిశీలించే ప్రయత్నం చేసిన కమర్షియల్ టాక్స్ అధికారులపై గ్రానైట్ మాఫియా దౌర్జాన్యానికి దిగింది. ● సోమవారం రాత్రి మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలోని పిల్లుట్ల రోడ్డులో ఆపి ఉన్న రెండు గ్రానైట్ లారీలను ఓ మహిళా అధికారి పరిశీలించి పత్రాలను చూపమని అడిగారు. దీంతో ఆమైపె మాఫియా సభ్యులు దౌర్జన్యానికి దిగారు. పత్రాలు చూపాలని ఆడిగినందుకు తాము గురజాల ఎమ్మెల్యే యరపతినేని అనుచరులమని బెదిరింపులుకు దిగారట. మహిళా అధికారి కారుకు గ్రానైట్ మాఫియా కారు అడ్డుగా పెట్టి లారీలను అక్కడి నుంచి దౌర్జన్యంగా తరలించారు. దీనిపై సదరు అధికారి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. మంగళవారం ఆ అధికారి మాచవరం పోలీసుస్టేషన్ ముందే పడిగాపులు కాసినా కేసు నమోదు చేయకుండా అధికార పార్టీ నేతలతో చర్చించి వారి అక్రమ రవాణాకు సహకరించాలని పోలీసులు సలహా ఇచ్చారట. దీంతో చేసేదేమి లేక మాచవరం నుంచి ఆ మహిళా అఽధికారి వెళ్లిపోయారు. ‘సాక్షి’ విలేకరి ఆమెను ప్రశ్నించగా మళ్లీ మాచవరం పోలీసుస్టేషన్కు వస్తానని, అప్పుడు సమాధానం చెబుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లా మీదుగా మార్టూరు నుంచి నిత్యం పదుల సంఖ్యలో అక్రమ గ్రానైట్ లారీలు జిల్లా సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్రమ గ్రానైట్ లారీలు ప్రయాణించే దారిలో ఉన్న ప్రజాప్రతినిధులకు నెలవారీ ముడుపులు సైతం భారీ మొత్తంలో ముట్టజెబుతున్నట్టు సమాచారం. ఇందులో కొందరు ప్రభుత్వ అధికారులకు సైతం మూమూళ్ల అందుతున్నాయి. అయితే ఈ వాటాల పంచాయితీలో వచ్చిన తేడాలతో తామే గ్రానైట్ అక్రమ రవాణా చేస్తామని గురజాలకు చెందిన అధికారపార్టీ నాయకులు అక్రమ రవాణా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లారీలను అడ్డుకుంటున్న అధికారులపై గురజాలకు చెందిన అక్రమ రవాణా బ్యాచ్ దౌర్జన్యాలకు దిగి బెదిరిస్తున్నట్టు సమాచారం. వారి ఆగడాలు శృతిమించి పోలీసుస్టేషన్కు చేరడంతో అధికారులతో స్థానిక టీడీపీ నేతలు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. చూసీచూడనట్టు పోతూ అక్రమరవాణాకు సహకరించాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
హత్య కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పెదకాకాని రైల్వే స్టేషన్లో ఈనెల 4వ తేదీన జరిగిన హత్యకేసు మిస్టరీని గుంటూరు రైల్వే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు అరెస్టు చూపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4వ తేదీన పెదకాకాని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ చివర భాగంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి హత్యకు గురి అయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశ ంలో మృతి చెందిన వ్యక్తిని పరమడం అనీష్(40) అలియాస్ బ్లేడ్గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును డీఎస్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రైళ్లలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని మృతుడి పై చైన్నె, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన కేసులు నమోదు అయినట్లు విచారణలో తెలిసింది. మృతుడు అనీష్ తనతో కలిసి దొంగతనాలు చేసే తోటివారిని నిత్యం వేధిస్తుండటం.. ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరందరినీ పలు రైల్వే స్టేషన్లలో బ్లేడ్ బ్యాచ్గా పిలుస్తారని, మృతుడు అనీష్ దొంగతనం చేసిన సొత్తులో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని, తోటి సహచరులపై ఒత్తిడి తేవడం వారిని కూడా పలు మార్లు బ్లేడ్తో కోస్తా అని బెదిరించడం వల్ల ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనీష్ వేధింపులను తాళలేక ఈనెల 4వ తేదీన హతమార్చేందుకు పథకం రూపొందించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎఫ్.కుమార్ అలియాస్ అంతోని కుమార్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న దీపేష్ ఎం.ఎస్, అలియాస్ మెంటల్ భాయ్, అనంతపురంకు చెందిన కొప్పుల వెంకటేష్ అలియాస్ వెంటి, అలియాస్ వెంగీ భాయ్లు పెదకాకాని రైల్వే స్టేషన్లో అనీష్పై బ్లేడ్లతో దాడి చేసి అతి కీరాతకంగా హతమార్చి పరారయ్యారు. ఈనెల 9వ తేదీన సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్–1లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని జీఆర్పీ సీఐ అంజిబాబు పట్టుకుని స్టేషన్కు తరలించి విచారించగా అనీష్ను హత్య చేసినట్లు అంగీకరించారు. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసును ఛేదించిన జీఆర్పీ సీఐ జి.అంజిబాబు, ఆర్పీఎఫ్ ఎస్ఐ మహబూబు సుభాని, కానిస్టేబుల్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, శంకర్, ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని డీఎస్పీ, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో తృతీయస్థానం
సత్తెనపల్లి: కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన 3వ రాష్ట్రస్థాయి మినీ బాల, బాలికల రగ్బీ పోటీలలో పల్నాడు జిల్లా బాల,బాలికల జట్లు తృతీయ స్థానం సాధించాయని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.డానియేల్ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ యం.ప్రకాష్లు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ జట్టుకి కోచ్గా యం.బాలాజీ వ్యవహరించారన్నారు. నాగార్జుననగర్లో వివాహిత బలవన్మరణం సత్తెనపల్లి: వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగార్జుననగర్కు చెందిన జెల్లి ఆదిలక్ష్మి (28) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మ రణానికి పాల్పడింది. మృతురాలికి భర్త నాగరాజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వివాహం కాగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆదిలక్ష్మీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురౌతూ బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఎవరు కారకులు కాదని, భర్త, అత్త,మామలు మంచి వాళ్ళు అంటూ ఆమె లేఖ రాసింది. బలవన్మరణానికి గల కారణం ఏమిటనేది రాయలేదు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ పి. పవన్కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కిలారి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం నకరికల్లు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మండలంలోని కండ్లకుంట సమీపంలోని గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తించినట్లు ఎస్ఐ కె.సతీష్ మంగళవారం తెలిపారు. గుర్తించిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. లేత ఆకుపచ్చ రంగు నిక్కరు, సిమెంట్రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసీపీ పవర్ప్లాంటు–4 వద్ద మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు 9440796246, 9966460427 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రకృతి వ్యవసాయంలో బయో రిసోర్స్ సెంటర్లు కీలకపాత్ర
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ విస్తరణలో బయో రిసోర్స్ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. జిల్లాలోని ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 35 ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు జరుపుతున్నట్టు తెలిపారు. రాబోవు రెండు నెలల్లో బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా 30 రకాల విత్తనాలతో 15 కిలోల బరువు ఉండే ప్యాకెట్లను సిద్ధంచేసి రైతులకు అందజేస్తామని తెలిపారు. రబీ పంట కోత అనంతరం రైతులు ఈ విత్తనాలను పొలాల్లో చల్లడం ద్వారా వివిద రకాల వేరు వ్యవస్థలు భూమిలో ఏర్పడి భూసారం పెరుగుతుందని వివరించారు. భూమిలో నీటిని నిలుపుకునే సామర్ధ్యం పెరగడంతో పాటు ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. రాబోవు ఆరు నెలల్లో మరో 100 ప్రకృతి వనరుల కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజు, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వాలి
అమరావతి: మండలంలో 8 గ్రామాల్లో భూ సమీకరణలో భూమి కోల్పోతున్న రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారిని ఆదుకోవాలని సీపీఎం పలనాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, లేమల్లె, కర్లపూడి గ్రామాల్లో భూమి మొత్తాన్ని రాజధాని అవసరాలు నిమిత్తం రెండో విడత భూ సమీకరణ, ఔటర్ రింగ్ రోడ్డు అవసరాల కోసం ధరణికోట, లింగాపురం గ్రామాల్లో భూమిని భూ సమీకరణ చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరానికి మించి భూమిని 250 మీటర్లు వెడల్పులో సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని వెడల్పున 70 మీటర్లకు తగ్గించాలన్నారు. రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వటానికి, అదేవిధంగా కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆదుకోవటానికి ఆయా గ్రామాలలో గ్రామసభలను జరిపి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, వారికున్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో అభివృద్ధి అవసరాల కోసం ఉపాధి హామీ పనులను కొనసాగించాలన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు మురుగు కాలువలు తాగునీరు సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి. సూరిబాబు, రూరల్ శాఖ కార్యదర్శి సయ్యద్ మోహిద్దీన్, నండూరి వెంకటేశ్వరరాజు, షేక్ నాగుల్ మీర పాల్గొన్నారు. -
కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి
మంగళగిరి టౌన్: కాలువలోకి ఈతకు దిగి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాజ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందినబొడ్డు వెంకటరమణ (22) సోమవారం మధ్యాహ్నం సమయంలో తోటి స్నేహితులు మహేష్, శ్రీనివాస్లతో కలసి మోటారు సైకిల్పై బయటకు వెళ్లారు. అనంతరం కాజ గ్రామ చెరువు వద్దకు చేరుకున్నారు. బహిర్భూమికి వెళ్లిన అనంతరం వెంకట రమణ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. చెరువులోని కొంతదూరం వెళ్లాక రెండు చేతులు పైకి ఎత్తి కనబడడంతో స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. చుట్టపక్కల ఉన్న రైతులు చెరువు వద్దకు చేరుకుని మునిగిన వెంకట రమణను బయటకు తీసుకు వచ్చారు. అప్పటికే వెంకటరమణ మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన ఘటనపై వెంకటరమణ భార్య మంజుల మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి మంగళగిరి టౌన్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేరారు. 2005లో ఏఆర్ కానిస్టేబుల్గా, 2019లో సివిల్ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్గా ఉంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలోని డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్ వేశారు. 2011లో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో పీపీటీ టెస్ట్లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వివిధ ఎయిడెడ్ పాఠశాలల్లో పలు ఉపాధ్యాయ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని బాపూజీ ఎయిడెడ్ హైస్కూల్, శాస్త్రి మెమొరియల్ ఎయిడెడ్ యూపీ స్కూల్, గుంటూరు శ్రీనివాసరావు పేటలోని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాల, అరండల్ పేట 10/4 లోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్, బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో ప్ర భుత్వ అనుమతి మేరకు వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాల కరెస్పాండెంట్కు వ్యక్తిగతంగా, పోస్టు ద్వారా పంపాలని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీఎస్//సీఎస్ఈ.ఏపీ.ఇన్ను సందర్శించాలని సూచించారు. -
ఏఎన్యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు: సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ (అనంతపూర్), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్( మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ ఐసెట్ 2025లో అర్హులకు మినహాయింపు.. ఏపీ ఐసెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్ పేర్కొన్నారు. -
అందుబాటులో టెన్త్ దూరవిద్య హాల్టికెట్లు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష అభ్యర్థుల హాల్టికెట్లు అందుబాటులో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సోమవారం తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్లు, వాట్సాప్ (9552300009), మన మిత్ర ద్వారా పొందవచ్చని వివరించారు. అలాగే దూరవిద్య వెబ్సైట్ httpr://www.apope nrchoo.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్టికెట్లో వివరాలు పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకరావాలని తెలిపారు. అమరావతి: నదిలో స్నానానికని వెళ్లి విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం దిడుగులో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దిడుగు గ్రామానికి చెందిన శీలం నందగోపాల్ మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన ఏడుగురులో శీలం నందగోపాల్ లోతుకు వెళ్లటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఐ అచ్చియ్య తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి వరకు ఎంతగా గాలించినా నందగోపాల్ జాడ తెలియలేదు. చీకటి పడి గాలింపు చర్యలు కష్టంగా ఉండటంతో మంగళవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. నందగోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు నదిఒడ్డున గుండెలవిసేలా విలపించటం గ్రామస్తులను కలచివేసింది. -
అమ్మవారికి రూ.3లక్షల విరాళం
పెనుగంచిప్రోలు: అమ్మవారికి ఆభరణాలు చేయించేందుకు మధ్యవర్తి ద్వారా ఇచ్చిన విరాళం ఎట్టకేలకు ఆలయానికి చేరింది. ఆయా వివరాలను దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులుసోమవారం విలేకరులకు వివరించారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న తిరుపతమ్మవారికి వెండి ఆభరణాలు చేయించేందుకు మొక్కుకున్నారు. ఏడాదిన్నర కిందట రూ.3లక్షలతో మూడు కేజీల వెండితో అమ్మవారికి ఐదు వస్తువులు తయారుచేయించేందుకు హైదరాబాద్కు చెందిన తయారీదారులతో అంచనా వేయించారు. ఈక్రమంలో శ్రీతిరుపతమ్మ ఆలయంలో సత్యనారాయణ అనే ఉద్యోగి ద్వారా అవే వస్తువులు తయారుచేయించేందుకు దాతలు, తెనాలికి చెందిన ఆభరణాల తయారీదారుడు కృష్ణారెడ్డికి రూ.3లక్షలు అందజేశారు. అయితే ఏడాదిన్నరగా ఆయా వస్తువులను అప్పగించలేదు. ఈ విషయంపై తయారీదారుడు కృష్ణారెడ్డిని తొమ్మిదినెలల కిందట దాతలు నిలదీయడంతో ఐదు వెండి వస్తువులకుగాను ఓ కిరీటం అందజేశాడు. ఆ కిరీటాన్ని అమ్మవారికి అలంకరిస్తే సరిపోకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చారు. అప్పట్నుంచి ఆయా వస్తువులను తయారుచేసి ఇవ్వకుండా తయారీదారుడు తమను తిప్పుకుంటున్నారంటూ దాతలు మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సమస్యను నాలుగురోజుల కిందట గ్రామ పెద్దలు, ఆలయ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో గ్రామపెద్దలు, ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడంతో సదరు తయారీదారుడు కృష్ణారెడ్డి రూ.3లక్షలను దాతలకు పంపించారు. ఈ మేరకు ఆ నగదును మన్నం వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు సోమవారం ఆలయ ఉత్సవ కమిటీసభ్యులు చుంచు రమేష్బాబు సమక్షంలో ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయంలోని అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడం పనులకు వినియోగించాలని కోరారు. ఏడాదిన్నర తర్వాత ఆలయానికి చేరిన విరాళం -
వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం
రేపల్లె: పట్టణంలోని పెదకూరగాయల మార్కె ట్ సమీపంలో వేంచేసియున్న శ్రీసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవలతో పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసంత ర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలి: శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఈనెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు బుర్రిపాలెంరోడ్డులోని శ్రీమహాత్మ సేవాశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి, ఆశ్రమవాసులకు అన్నదానం చేయటానికి నిర్ణయించినట్టు సంఘ నాయకులు వేజండ్ల శివన్నారాయణ, నిమ్మలూరి కమలాకరరావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. శాలివాహన సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణప్రసాద్, నాంచార య్య, అయ్యవార్లు, క్రిష్టరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి.జ్వాలారావు, వి.నాగరాజు, ఎం.శ్రీనివాసరావు తదితరులున్నారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సోమవా రం గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్లు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. గుంటూరువెస్ట్: జి. రామ్. జి – గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పమని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. వికసిత్ భారత్– జి. రామ్. జి పోస్టర్ను సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. జేసీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీగా జి రామ్ జి నిలుస్తుందన్నారు. 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం వంటి అంశాలను ఇందులో చేర్చారన్నారు. -
ప్రత్యేక దృష్టి పెట్టండి
అర్జీల పరిష్కారంపై 131 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ క్లినిక్లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 131 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 22 అర్జీలు రాగా అందులో నరసరావుపేట మండలం నుంచి 15, గురజాల నుంచి ఐదు, సత్తెనపల్లి నుంచి రెండు అర్జీలు అందుకున్నారు. డీఆర్ఓ నారదముని, డీపీఓ నాగేశ్వరనాయక్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
పాలనపై చిత్తశుద్ధి ‘ఖాళీ’
జిల్లాలో ఖాళీగా కీలకమైన అధికారుల పోస్టులు సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక జిల్లాగా పేరొందిన పల్నాడు జిల్లాలో పరిపాలన కుంటుపడుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలలో పరిపాలన పరంగా కీలకమైన పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడమే అందుకు కారణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. డీఆర్వో, ఆర్డీఓ, డీఎస్పీ వంటి కీలక పదవులు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. తద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారుల నియామకం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. భర్తీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కలెక్టరేట్లో ముందుకు కదలని ఫైళ్లు... జిల్లా రెవెన్యూ పరిపాలనలో కీలకమై డీఆర్వో పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. డీఆర్వోగా పనిచేస్తున్న మురళిని లంచం తీసుకుంటుండగా కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెండు నెలల కిందట పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆ స్థానంలో ఎవర్ని నియమించకపోవడంతో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి నారదమునికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. పనుల కోసం అర్జీదారులు, కిందస్థాయి రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డివిజన్లలోనూ అదే పరిస్థితి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో ఆర్డీఓలది కీలకపాత్ర. నరసరాావుపేట, సత్తెనపల్లి ఆర్డీఓలు హైకోర్టు తీర్పు కారణంగా బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో ఎవర్ని నియమించలేదు. జిల్లా మీదుగా కీలకమైన జాతీయ రహదారులకు భూసేకరణ జరుగుతున్న సమయంలో వీరు లేకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన పల్నాడులో ఎన్న డూ లేనివిధంగా అధికార సంక్షోభం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్డీఓల పర్యవేక్షణ కొరవడంతో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు పెట్టి వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు. ఎనిమిది నెలలుగా డీఎస్పీ లేరు.. పల్నాడు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూనే ఉంది. గత సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు నరసరావుపేట నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రౌడీ మూకలు దాడులకు తెగబడ్డారు. జిల్లా కేంద్రంలో నిత్యం ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వినుకొండ, నరసరావుపేటలో నడిరోడ్లపై హత్యలు, కిడ్నాపులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పాశవికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా జిల్లాలో కీలకమైన పోలీసు అధికారుల పోస్టులు ఇన్చార్జిలతో నడిపిస్తున్నారు. గతేడాది జూలై నెలలో నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన కె.నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 8 నెలలుగా ఆయన రెండు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలోనే పెద్దదైన నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 13 పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఉన్నాయి. ఇక్కడ డీఎస్పీ పోస్టు భర్తీ కాకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. హైకోర్టు తీర్పుతో మూడు గ్రూప్–1 పోస్టులు ఖాళీ... పల్నాడు జిల్లాలో ఇప్పటికే అధికారుల కొరత వేధిస్తుండగా అంతలోనే హైకోర్టు తీర్పుతో మరో మూడు ముఖ్యమైన పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. 2018 గ్రూప్–1 ఉద్యోగాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ బ్యాచ్కు చెందిన వారిని అ ప్రధాన పోస్టులకు బదిలీ చేయమని హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 బ్యాచ్కు చెందిన ముగ్గురు అధికారులు జిల్లాలో ఉండగా, వారిలో గురజాల డీఎస్పీ జగదీశ్, నరసరావుపేట ఆర్డీఓ మధులత, సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్రెడ్డిలు జిల్లా నుంచి బదిలీ మీద వెళ్లారు. జిల్లాలో ఉన్న నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్లలో డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో సత్వర న్యాయం, విచారణలో జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ నియామకంలో తీవ్రజాప్యం జరుగుతోంది. కమిషనర్ జస్వంతరావును బదిలీ చేసి మూడు నెలలవుతున్నా ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవర్ని నియమించలేదు. ఇన్చార్జి కమిషనర్గా ఎంఈ రవికుమార్ వ్యవహరిస్తున్నారు. ఓ వైపు పాలకవర్గం లేకపోవడంతో స్పెషలాఫీసర్గా నరసరావుపేట ఆర్డీఓ వ్యవహరిస్తుండగా, ఆమె ఇటీవల బదిలీ అవ్వడంతో స్పెషలాఫీసర్ స్థానం సైతం ఖాళీ ఏర్పడింది. స్పెషల్ ఆఫీసర్, కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలపై నిర్ణయాలు తీసుకునే అధికారులు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బుల్లెట్ బైక్ చోరీ
వెంబడించి పట్టుకున్న యువకులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెంట్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్ టెస్టింగ్ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ను బంగారు ఆభరణాలపై మిషన్ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్ అధికారి వివేక్రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో లైసెన్సులు లేకుండా హాల్మార్క్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్ మార్క్ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్ మిషన్, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మీడియాపై దాడి... బీఐఎస్ అధికారులు సన గోల్డ్టెస్టింగ్ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. దుకాణ షట్టర్లు పగలగొట్టి రూ. 50 వేలు అపహరణ నరసరావుపేట టౌన్: ప్రకాష్నగర్లో వరుసగా ఉన్న నాలుగు దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు నగదు అపరించుకు వెళ్లిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి స్కూల్ సమీపంలో వరుసగా ఉన్న నాలుగు దుకాణాలను యజమానులు ఆదివారం రాత్రి యథావిధిగా తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చి చూడగా మెడికల్ దుకాణంలోని కౌంటర్లో ఉన్న రూ.50వేల నగదు కనిపించలేదు. పక్కనే ఉన్న టైలరింగ్ షాప్లో కొంత నగదు అపరించుకు వెళ్లారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. -
పాము కాటుకు గురై వివాహిత మృతి
నకరికల్లు: గుర్తుతెలియని దుండగులు వినాయకస్వామి రాతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. రూపెనగుంట్ల గ్రామం శివారులో పొలాల మధ్యన వినాయకస్వామి ఆలయం ఉంది. కాగా గుర్తుతెలియని దుండగులు రాత్రివేళ విగ్రహాన్ని ఆలయం వెనుకభాగంలోని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. విగ్రహం గుర్తించిన ప్రాంతంలో గోతాలు, మంటలు వేసిన ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. దీంతో పురాతన ఆలయం కావడంతో నిధులు నిక్షేపాల కోసం అత్యాశపరులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఏర్పాట్లు పూర్తి చేశాం
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, విద్యుత్ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం. పరీక్ష కేంద్రాలను నో సెల్ఫోన్ జోన్లు గుర్తించాం. ఎవరూ పరీక్ష కేంద్రాలలోకి ఫోన్లు తీసుకవెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షలను విజయవంతం చేసేందుకు సహకారం కోరాం. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. –పీవీజే రామారావు, డీఈఓ -
వైద్యశాలలో మురుగు మయం
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో మురుగు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉపశమనం లభించాల్సినచోట అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలకటం ఆందోళన కలిగిస్తుంది. ఉన్నరోగాలకు తోడు కొత్త వ్యాధులు వస్తాయని రోగు లు కలవరపాటు చెందుతున్నారు. దీంతో అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు వారి సహాయకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వైద్యశాల్లో రోగులు వినియోగించిన నీరు మురుగు కాల్వ లో పారక ఎక్కడికక్కడే ని లిచిపోతుంది. ఆ నీరు పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతుంది. నెలల తరబ డి మురుగు నిల్వ ఉండ టంతో దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నా యి. కొన్ని నెలలుగా డ్రైనేజ్ సమస్యపై అనేక ఫిర్యాదులు వచ్చినా అధి కారులు స్పందించిన దాఖలాలు లేవు. సాయంత్రం సమయాల్లో ఉండలేక పోతున్నామని రోగులు వాపోతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధ పడుతూ మరో వైపు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు. రోగులు ఉండే గదుల పక్కనే మురుగు కాల్వ ఉండటం అసౌకర్యంగా మారింది. గదుల్లోకి దుర్వాసన వస్తుండటంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అభివృద్ధి పనులు జరుగుతున్న డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుకు అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వైభవంగా నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ల
తరలివచ్చిన భక్తులు దుర్గి: పల్నాట ప్రసిద్ధిగాంచిన నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి 79వ తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని, పొంగళ్లు పొంగించారు. ఆలయ అధికారులు భక్తులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. పలువురు దాతలు మజ్జిగ, అన్నదానాన్ని, పులిహోర పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి పటం, నైవేద్యం అందజేశారు. అడిగొప్పల, ఓబులేశునిపల్లె, నరమాలపాడు, దుర్గి నుంచి 25కుపైగా కుంకుమ బండ్లు సాయంత్రం నుంచి ఆలయానికి చేరుకున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. చైర్మన్ యాగంటి వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శి ఆదిశేషు నాయుడు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వాధికారులు వారి విధులను సక్రమంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. -
విజయకీల్రాదిపై హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠాపన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్టి, విశేష తదియారాధనలతో కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, భక్తు లు పాల్గొని స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్: కాకినాడలో ఈనెల 11వ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏకలవ్య విగ్రహాలకు ఆదివారం ఆయన రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్లతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ గోరెబాబు, ఈపూరి ఆదాం, కట్టెపోగు నాగభూషణం, గొర్నిపూడి శుభాకర్, మాతంగి బాబు, కలకోటి చక్రవర్తి, బుర్రా శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి: పాలనాదక్షుడు కొత్త రఘు రామయ్య ను స్మరించుకుంటూ నూతనోత్తేజంతో ముందుకు వెళదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణం విజయవాడ రోడ్డులోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన ప్రముఖ పార్లమెంటేరియన్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థం లేని రాజకీయాలు నడిపిన రఘురామయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రమేష్బాబులను అభినందించారు. కార్యక్రమంలో విగ్రహదాతలు, ఎన్నారైలు పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుటుంబసభ్యులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కొత్త హరికుమార్, కొత్త కృష్ణకుమార్, కొత్త శేషుబాబు, బసవయ్య, జెట్టి గుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత రఘురామయ్య విగ్రహా నికి పుష్పాంజలి ఘటించారు. హోటల్ గౌతమ్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రఘురామయ్య సంస్మరణ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. -
ప్రకృతి దోబూచులాట...
యడ్లపాడు: ప్రకృతి తన పరదాలను వింతగా మార్చుకుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో కాలాలు దోబూచులాడుతున్నాయి. పగటి వేళ భానుడు భగభగలాడుతూ సెగలు గక్కుతుంటే, రాత్రి కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ‘చలిపులి’ పంజా విసురుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటపొలాల పరిసరాల్లో తెల్లవారుజామున దృశ్యాలు కాశ్మీరాన్ని తలపిస్తున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మంచు తెరల వల్ల జాతీయ రహదారిపై ప్రయాణం సాహసంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనం ఆనవాలు కూడా తెలియని రీతిలో మంచు ముసుగు పరుచుకోవడంతో వాహనదారులు దీపాలు వెలిగించుకుని అతి జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు మంచు కురుస్తున్న వేళ ప్రకృతి సోయగం కనువిందు చేస్తున్నా, మరోవైపు వాహనదారులకు మాత్రం అది ఒక సవాలుగా మారింది. ఎండలు మండుతున్నా తగ్గని ఈ పొగమంచు తీవ్రత, నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పగలు సెగలు.. రాత్రి హిమపాతం.. వెరసి చిలకలూరిపేట నియోజకవర్గంపై వాతావరణం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రకృతి కావ్యంలా ఆవిష్కృతం అవుతోంది. -
పల్నాడు
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026భక్తి గుడారం.. స్తుతి నైవేద్యం అట్టహాసంగా ముగిసిన 49వ గుడారాల పండుగ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,316 క్యూసెక్కులు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కొమ్మూరు కాలువకు 733 క్యూసెక్కులు వదిలారు.అమరావతి: మంచి గంధం చెక్కకు ఎన్ని కోతలు చేస్తే, అంత సుగంధం వెదజల్లినట్లు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్రైస్తవ్యంలో ఉన్న కీస్తు విశ్వాసులు ప్రపంచాన్ని, దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటారని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం అన్నారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ చివరి రోజైన ఆదివారం పగటి పూట ముగింపు ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట దేవుడు నడిచి వారిపై తన ఆశీర్వాదాలను విస్తారంగా కురిపిస్తాడన్నారు. నాలుగు రోజులపాటు చేసిన ప్రార్థనలకు అనుగుణంగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని తోడు మనతో ఉండాలన్నారు. పోగొట్టుకున్న వాటిన్నింటినీ దేవుని ఆశీర్వాదంతో రెట్టింపుగా పొందుతామన్నారు. అందరికీ కృతజ్ఞతలు.. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులు పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంలో సహకరించిన వారందరికీ పాస్టర్ అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏడాది అనుభవాలతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది 50వ గుడారాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ గుడారాల పండుగ ఎంతో ఘనంగా జరగటానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలుతున్నామని పేర్కొన్నారు. నిరంతర స్తుతి అవసరం.. తొలుత చివరి రోజు సభలకు పాస్టర్ జేమ్స్ ప్రారంభ ప్రార్థన నిర్వహించారు. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ ప్రసంగిస్తూ ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని తెలిపారు. మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు ఇస్తాడన్నారు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఆయన కృప ఉన్నప్పటికీ ఎవరైతే స్తుతిస్తూ తమ హృదయాలను బలిపీఠంగా చేస్తారో వారిపై ఆయన ప్రత్యేక కృప కనబరుస్తాడన్నారు. లోకమంత దేవుని కృపతో నిండియున్నప్పటికీ దానిని అందిపుచ్చుకోవటానికి ప్రతి ఒక్కరూ దేవుడిని నిరంతరం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. హోసన్నా మినిస్ట్రీస్ దైవ జనులు రమేష్, ఫ్రెడ్డీ పాల్ దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రార్థనలలో ఆదివారం కావటంతో దాదాపు 20 లక్షల మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రసంగిస్తున్న దైవజనులు చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం -
కేంద్రానికెళ్లడమే పెద్ద పరీక్ష!
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు వారం రోజులే వ్యవధి ఉంది. పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులకు 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిరునామాలు లేకుండా జారీ హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల విడుదల చేసింది. వాటిపై పరీక్ష కేంద్రం కోడ్ నంబరు, పేరు ముద్రించి వదిలేశారు. ఆ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రాలను కనుక్కోవడమే విద్యార్థులకు పెద్ద పరీక్షగా మారింది. ఒకే పేరుతో ఉన్న పాఠశాలల క్యాంపస్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కనిపెట్టడం మరింత ఇబ్బందిగా మారింది. కేంద్రం కోడ్తోపాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలో కొన్ని చోట్ల ప్రాంతాల పేర్లు లేకుండా కేవలం పాఠశాల పేరుతో హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. ఆ పాఠశాలే లేదు గుంటూరు నగరంలో సెంటర్ కోడ్ 54036తో నారాయణ ఇంగ్లిషు మీడియం స్కూల్ పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేశారు. సంబంధిత కేంద్రంలో పరీక్ష రాసేందుకు వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది విద్యార్థులను కేటాయించారు. బృందావన్ గార్డెన్స్ 4వ లైను చిరునామాతో జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఆధారంగా అక్కడకు వెళ్లిన విద్యార్థులు అవాక్కయ్యారు. నారాయణ స్కూల్ బదులుగా ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ఉంది. నారాయణ స్కూల్ ఇక్కడి నుంచి పాఠశాలను తరలించి ఏళ్లు గడుస్తున్నా ఏటా ఇదే పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా నిలుస్తోంది. గుంటూరులో సెంటర్ కోడ్: 54002, 54003తో భాష్యం హైస్కూల్ చంద్రమౌళీనగర్ పేరుతో హాల్ టికెట్లు జారీ చేశారు. ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఉండటంతో వాటిని తె లుసుకోవడం ఇబ్బందిగా మారింది. చంద్రమౌళీనగర్ 3వ లైను అని ముద్రించడంతోపాటు ఏ, బీ సెంటర్లు అని పేర్కొనాల్సి ఉంది. జీకేఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రం చిరునామా హాల్టిక్కెట్లపై ముద్రించలేదు. ఆ పేరుతో ఏటీ అగ్రహారం, పట్టాభిపురంలో వేర్వేరుగా క్యాంపస్లు ఉన్నా యి. ‘సెంటర్ కోడ్ 54019, ఎస్ఎస్ఎన్వో హైస్కూల్, బ్రాడీపేట’ పేరుతో జారీ చేసిన హాల్ టకెట్లపై చిరునామా అస్పష్టంగా ఉంది. ’శ్రీశారదానికేతన్ ఓరియెంటల్ హైస్కూల్, బ్రాడీపేట 2/14’గా పేర్కొనాలి. సెంటర్ కోడ్ 54046తో జారీచేసిన హాల్ టికెట్పై హెచ్సీహెచ్ఎస్, గుంటూరు పేరుతో ముద్రించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిని మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ’సంటర్ కోడ్: 54047, కేఎస్సార్ మున్సిపల్ హైస్కూల్’ పేరుతో జారీ చేసిన హాల్ టిక్కెట్ చిరునామా కేవీపీ కాలనీగా మార్చుకోవాలి. -
అందరికీ సాగర్మాత దీవెనలు
విజయపురిసౌత్: భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి సాగర్మాత అని ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్ ఉద్బోధించారు. రెండో రోజైన ఆదివారం ఆయన సాగరమాత ఆలయంలోని జపమాల క్షేత్రంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమష్టి దివ్యబలిపూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవ భక్తులంతా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నారు. సాటివారిని ఆదరించడం, ప్రేమను పంచిపెట్టడం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. సృష్టికర్త సహితం అమ్మ ద్వారానే ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. మరియమాత మన మధ్యలో నిలిచి మనల్ని కాపాడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను ఆచరించాలని సూచించారు. సాగరమాతపై భక్తిభావంతో మెలిగి దైవకృపకు పాత్రులు కావాలని కోరారు. క్రీస్తును నమ్ముకుని సత్ప్రవర్తనతో మెలిగేవారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ● ఉదయం 5 గంటలకు గురుశ్రీ కె.ఎలీషాచే, 6కు గురుశ్రీ బి. మేఘానంద్చే, 7కు గురుశ్రీ రాచకొండ రాజుచే, 8కి గురుశ్రీ గోవిందు బాలస్వామిచే దివ్యబలిపూజ, 9.30 గంటలకు గురుశ్రీ బెన్నీచే భక్తుల ఆహ్వానం, జపమాల, స్తుతి ఆరాధన, వాక్యపరిచర్య, ఉదయం 11.30గంటలకు దివ్యబలిపూజ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 2 గంటలకు వాక్యపరిచర్య, స్వస్థతా ప్రార్థనలు, సాయంత్రం 4 గంటలకు కోలాటం, 5.30 గంటలకు ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్చే జపమాల క్షేత్రంలో సమష్టి దివ్యబలిపూజ, రాత్రి 7.30గంటలకు కొవ్వుత్తులతో తేరు ప్రదక్షిణ, 8 గంటలకు సాగర్మాత బృందం వారిచే సాగర్మాత మహిమలు బుర్రకఽథ, 9 గంటలకు శిరిగిరిపాడు కళా నాట్య మండలి ప్రతినిధులచే శిలువ ధారి బైబిల్ నాటకం ప్రదర్శించారు. -
మహిళల ఆరోగ్యం, అభ్యుదయంతోనే అభివృద్ధి
నరసరావుపేట: మహిళా ఆరోగ్యం, అభ్యుదయం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని పెరేడ్ గ్రౌండ్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర శాసనసభ విప్ జీవీ ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పోలీస్ అధికారి బి.కృష్ణారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి గురించి తెలియజేస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ను పరిశీలించారు. బ్యాంకు ద్వారా మంజూరు చేసిన ఆటోలను జిల్లా కలెక్టర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీ్త్ర నిధి, మెప్మా గ్రూపులకు రుణ మెగా చెక్కులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు మహిళల ఆర్థిక పురోగతి కోసం ఏర్పాటు చేసిన తరుణంలో ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా స్థిరపడాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందున వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ ద్వారా జరిగే అంశాలను తెలుసుకోవాలి అంటే తప్పని సరిగా చదువు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కొంతమంది మాత్రమే వారి వారి ఆర్థిక పురోగతి గురించి తెలిపారని, రాబోయే మహిళా దినోత్సవం నాటికి వందలాదిమంది ఆర్థిక పురోగతి సాధించాలని కోరారు. కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, పలు విభాగాల మహిళా అధికారులతోపాటు పలు రంగాల్లో విశేష సేవలు అందజేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు అలరించాయి. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఏపీఎం కమలకుమారి, డీసీ హెచ్ఎస్ ప్రసూన, ఐ అండ్ పీఆర్ డీడీ దీప్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సుమారు 3 వేల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విశ్వాసులకు తప్పక విజయం
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అప్పగించిన పనిని పూర్తిచేస్తే విశ్వాసులను విజయం తప్పక వరిస్తుందని హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రమేష్ అన్నారు. లేమల్లె హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ మూడవరోజు శనివారం రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాదిమంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మనం సమాజాన్ని ప్రభావితం చేయాలంటే క్రీస్తును స్తుతించటమే మార్గమన్నారు. తొలుత హోసన్నామినిస్ట్రీస్ అధ్యక్షుడు ఫాస్టర్ అబ్రహాం, చీఫ్పాస్టర్ జాన్వెస్లీ, రమేష్లు స్తుతి గీతాలాపన చేశారు. రెండవ వర్తమానంలో ఒంగోలుకు చెందిన పాస్టర్ రాజు మాట్లాడుతూ దేవుడిని సంపూర్ణసిద్ధితో ఆరాధించాలన్నారు. ఏసుక్రీస్తు వాక్యాలను హృదయాలలో స్థిరపరుచుకుని నిరంతరం ధ్యానించాలన్నారు. పాస్టర్ల బృందం, సిస్టర్ల బృందం స్తుతి గీతాలు అలపించారు. హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న బైబిల్ సెమినార్లో 2025లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ ప్రార్థనలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది హోసన్నా ఆరాధికులు తరలివచ్చారు. ప్రసంగిస్తున్న దైవజనులు పాస్టర్ రాజు ప్రసంగిస్తున్న దైవజనులు పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రమేష్ -
దరఖాస్తుల ఆహ్వానం
జెట్టిపాలెం(రెంటచింతల): జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్)లో 6వ తరగతి ప్రవేశానికి ఽ2026–27 విద్యాసంవత్సరానికి మార్చి 31 వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. పాపయ్య కోరారు. శనివారం ఆయన పాఠశాలలో మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాలకు ఫోన్ నంబరు 91829 58496 సంప్రధించాలని ఆయన కోరారు. భర్తతో కలిసి తల్లి ఇల్లు ఫోర్జరీ పత్రాలతో స్వాధీనం మంగళగిరి టౌన్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తున్నాయి. చివరకు కని, పెంచి ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తోంది. వృద్ధాప్యంలో కాస్తంత ఆదరవుగా ఉండి, ఆశ్రయం ఇవ్వాల్సిన కుమార్తె తన భర్తతో కలిసి ఫోర్జరీ సంతకాలతో కన్నతల్లిని మోసం చేసి ఇంటిని తనపేరిట రాయించుకుని ఆమెను ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం జరిగింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు. కొన్ని నెలల క్రితం చిన్న కూతురు, అల్లుడు ఆదిలక్ష్మి ఇంటికి వచ్చి, ఆమెతోపాటు ఉంటూ ఆదిలక్ష్మి ఉంటున్న ఇంటిని ఫోర్జరీ పత్రాలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. శనివారం వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడంతో మంగళగిరి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమార్తెను, అల్లుడిని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. -
రేపటి నుంచి ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఏఎన్యూ (పెదకాకాని): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చును. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మార్చి 9, 10 తేదీలలో బాలికలకు, మార్చి 12,13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళ అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలానే ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. -
రాష్ట్రంలో జంగిల్ రాజ్.. గురజాలలో గూండారాజ్
పిడుగురాళ్ల: శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన వీరారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బతుకు తాను బతుకుతున్న వీరారెడ్డిని నిన్న సాయంత్రం మాట్లాడాలని తెలుగు దేశం పార్టీ నాయకులు పిలిచి అతి దుర్మార్గంగా కొట్టటం జరిగిందన్నారు. అతణ్ణి హత్య చేసేందుకు యత్నించగా గాయాలతో బయటపడ్డాడన్నారు. -
ఘనంగా సాగర్మాత మహోత్సవాలు ప్రారంభం
విజయపురి సౌత్: శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, వాత్సల్యాలను భక్తులకు ప్రసాదించాలని నల్గొండ పీఠాధిపతులు మహాఘన డాక్టర్ కరణం ధమన్కుమార్ ప్రార్థిచారు. మాచర్ల మండలం విజయపురిసౌత్లో శుక్రవారం ప్రారంభమైన సాగర్మాత మహోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సమష్టి దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్మాత(మరియమ్మ) ఆశీస్సులు అందరిపైనా ఉంటాయని తెలిపారు. మహోత్సవాల సందర్భంగా ఆలయాలను, జపమాల క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం సాగర్మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్, గురుశ్రీ కాకుమాను కిరణ్సాగర్, గురుశ్రీ రాజవరపు అనిల్కుమార్లచే దివ్యబలిపూజ, గురుశ్రీ మధు జపమాల, స్తుతి ఆరాధన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, గురుశ్రీ మధుచే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం మహా ఘన డాక్టర్ కరణం ధమన్కుమార్చే జపమాల, నవదిన జపములు, దివ్యబలిపూజ, రాత్రి కొవ్వొత్తులతో తేరు ప్రదక్షిణ, సాగర్మాత కళాకారుల బృందంచే యేసేపు చరిత్ర బుర్రకథ, ఽభక్త యోబు బైబిల్ నాటక ప్రదర్శన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో విజయపురిసౌత్ కళకళలాడింది. స్థానిక లాంచీస్టేషన్ సెంటర్ నుంచి సాగర్మాత దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా తినుబండారాల విక్రయ కేంద్రాలు, ఫ్యాన్సీషాపులు, వివిధ రకాలైన ఆటబొమ్మల దుకాణాలు వెలిశాయి. సాగర్మాత ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగులరాట్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు
గుంటూరుఎడ్యుకేషన్: సమాజాభివృద్ధిలో మహిళలు కీలకంగా మారారని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం గర్వకారణమని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళ్ళగలుగుతున్నారంటే అది వారికున్న ఆత్మ విశ్వాసమన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. మైహోం గ్రూప్స్ అధినేత శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ఆంజనేయుని అనుగ్రహాన్ని, శ్రీస్వామి వారి మంగళశాసనాలని పొందారని పేర్కొన్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరేరామనామ సంకీర్తన, హనుమద్ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మంగళగిరి టౌన్: మంగ ళాద్రిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు వటపత్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా, అలంకార ఆస్థాన కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన మేళ్లచెరువు సీతామహాలక్ష్మి వ్యవహరించారు. గుంటూరుఎడ్యుకేషన్: జోన్–3 పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. హెచ్టీటీపీఎస్://డీఈఓగుంటూరుబ్లాగ్స్పాట్.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ప్రకాశంస్కూల్ఈడీయూ.కామ్, హెచ్టీటీపీఎస్://డీఈఓనెల్లూరు.50వెబ్స్.కామ్ లో ఉంచిన సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఈనెల 13లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. -
మహిళల కోసం పనిచేయటం సంతోషం
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతుంది. తొలిసారిగా మహిళా మణులు పల్నాడు జిల్లాను పాలిస్తున్నారు. కలెక్టర్గా డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహ జిల్లా నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. జిల్లాకు నాల్గవ కలెక్టర్గా డాక్టర్ కృతికా శుక్లా నియామకం జరిగి నాలుగు నెలలవుతుంది. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలోని పలు విభాగాల బాధ్యులుగా ఎక్కువ మంది మహిళలే నియమించబడ్డారు. పౌరసంబంధాల శాఖ డీడీగా దీప్తి మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. జిల్లా ఫారెస్టు ఆఫీసర్గా కృష్ణప్రియ, సోషల్ వెల్ఫేర్ డీడీగా రాజ్యలక్ష్మి, డీఆర్డీఏ పీడీగా ఝాన్సీరాణి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కో ఆర్డినేటర్గా డాక్టర్ ప్రసూన, సర్వే ఏడీగా భానూకీర్తి, ఆర్టీసీ ప్రజా జిల్లా రవాణా అధికారిగా టి.అజితకుమారి, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా గీతారాణి, జిల్లా లైబ్రరియన్గా రాధ, లీగల్ అడ్వయిజర్గా న్యాయవాది అమూల్య, డ్రగ్ ఇన్స్పెక్టర్గా మంగమ్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా రమాదేవి వ్యవహరిస్తున్నారు. తమ విధుల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక మహిళగా తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ విభాగాల అధ్యక్షులుగా కూడా సమర్థంగా కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... సంజనా సింహ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ ఒక మహిళగా మహిళాభివృద్ధి కోసం పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో 36 వేల గ్రూపుల క్రింద 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారిని తయారు చేయాలనే ఆదేశంతో ప్రతి వారికి అవసరాన్ని బట్టి రుణాలు ఇచ్చాం. ఎదో ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుచేసుకొని లాభం గడించే విధంగా మా వంతు కృషిచేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి 50 వేల మందిని చిరు వ్యాపారులుగా ప్రోత్సహించటమే లక్ష్యం. ఆరోగ్యం, పోషణ కింద కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుచేసి వాటిలో పండే కూరగాయలనే కుటుంబ అవసరాలకు వినియోగించుకునేవిధంగా ప్రోత్సహిస్తున్నాం. –ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ -
దయతో వైద్య సేవలందించాలి
గుంటూరు మెడికల్: వైద్యులు దయతో రోగులకు వైద్య సేవలందించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఎంబీబీఎస్ 2020 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యూయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ● వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య వృత్తి చాలా ఉన్నతమైందని, సేవ చేసే అవకాశం వైద్యులకే దక్కుతోందన్నారు. మంచిగా సేవ చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. గతేడాది గుంటూరు రూరల్ మండలంలో మెలోడేస్ మరణాలు సంభవించాయని, మంత్రి పెమ్మసాని చెప్పారు. అలాంటి మరణాలను కేస్ స్టడీగా తీసుకుని పరిశోధనలు చేయవచ్చన్నారు. ● వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి మాట్లాడుతూ డాక్టర్ పట్టా పొందడం విజయం కాదని, ఇది విజయానికి ప్రారంభమని చెప్పారు. వైద్యులుగా వృత్తిలో రాణించాలంటే విలువలు పాటించాలని, నిజాయితీగా, హుందాగా ఉండాలని, క్యారెక్టర్ పెంపొందించుకోవాలన్నారు. డాలర్స్ కోసం పరుగులు తీయవద్దని, కుటుంబ సభ్యుల మాదిరిగా రోగులను ఆదరించాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్శ్రీధర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మధుర క్షణాలతో కళ్లు మెరిశాయి ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా చేతికొస్తుందన్న ఆనందంతో పలువురు వైద్య విద్యార్థులు గ్రాడ్యూయేషన్ డే వేడుకలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డాక్టర్ డిగ్రీ పట్టాలు చేతికి అందిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు, బంధువుల కళ్లు ఆనంద భాష్పాలతో మెరిశాయి. డాక్టర్ పట్టా తీసుకునే మధుర సన్నివేశాలను వెయ్యి కళ్లతో చిత్రీకరించేందుకు పలువురు కెమెరాలు తీసుకుని పోటీ పడ్డారు. కళాశాల అంతా గ్రాడ్యుయేషన్ డే కోర్టులు ధరించి కలియతిరిగి వైద్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన కళాశాల బోధనా సిబ్బందితో జీవితాంతం గుర్తుండేలా డిగ్రీ పట్టాలు అందుకున్న 250 మంది వైద్య విద్యార్థులు గ్రూఫ్ ఫొటోలు దిగారు. పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఆడిటోరియం అంతా రంగుల హల్లులతో అదిరిపోయింది. వైద్య విద్యార్థుల డిగ్రీ పట్టా తీసుకునే సమయం పండుగలా మారాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశోధనల వైపు దృష్టి సారించాలి ఘనంగా గుంటూరు వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యూయేషన్ డే వేడుకలు -
మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
చీరాల: యువత భవిష్యత్ను చిదిమేస్తున్న గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు. జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు శనివారం మెగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజిలీపేట, హరిప్రసాద్ నగర్, దండుబాడు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోతో సహా మొత్తం 27 వాహనాలను సీజ్ చేశారు. గంజాయిని కూకటి వేళ్లతో పెకలించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు. -
మహిళల కోసం వన్ స్టాప్ టూ సెంటర్
మాచర్ల: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు సేవలందించేందుకు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వన్ స్టాప్ టూ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎం.ఉమాదేవి తెలిపారు. మాచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ టూ సెంటర్ పరిశీలించేందుకు శనివారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇంటి నుంచి తప్పిపోయిన బాలికలు, ఆపదలో ఉన్న మహిళలు, కుటుంబ కలహాలతో బయటకు వచ్చిన వారికి, ప్రేమ వివాహాలు చేసుకుని విడిపోయన మహిళలకు, రన్వే బాలికలకు వైద్య, ఆర్ధిక సహాయం, షెల్టర్ ఇచ్చేందుకు వన్ స్టాప్ సెంటర్ను మాచర్లలో ఆదివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం వర్చువల్ ద్వారా సెంటర్ను ప్రారంభిస్తారన్నారు. ఒంటరి మహిళలు, ఇబ్బందులకు గురైన మహిళలకు ఐదురోజులపాటు ఈ సెంటర్లో వసతి కల్పించడంతోపాటు, భోజనం, వైద్య సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. కుటుంబ కలహాలు ఉన్నవారికి కౌన్సెలింగ్ చేయడం జరుగుతోందన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళల రక్షణ కోసం ఈ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చిలకలూరిపేట: త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు నిర్మాణ పనుల్లో సిబ్బంది సమన్వయలోపం కారణంగా భారీ గడ్డర్ నేలకొరిగింది. చీరాల వాడరేవు నుంచి పల్నాడు జిల్లా నకరికల్లు వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. వాడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి వరకు 47 కిలో మీటర్ల మేర ఒక నిర్మాణ సంస్థ, ఇక్కడి నుంచి నకిరికల్లు వరకు మరో నిర్మాణ సంస్థ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో వాడరేవు నుంచి చిలకలూరిపేటలోని బొప్పూడి వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో ఎన్హెచ్16 పై ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. రోడ్డు వేసేందుకు అవసరమైన ఫిల్లర్లు, వాటిపై పీయర్క్యాప్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫిల్లర్లపై ఐరన్ రాడ్స్, సిమెంట్తో నిర్మాణం చేసిన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. శనివారం రెండు భారీ క్రేన్ల సహాయంతో 43 మీటర్ల పొడవైన గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో క్రేన్కు అమర్చిన ఇరన్రోప్లు జారడంతో వందల టన్నుల బరువైన సిమెంట్, ఐరన్తో నిర్మించిన గడ్డర్ నేలకొరిగింది. భారీ శబ్దంతో గడ్డర్ నేలకొరగడంతో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వాహనదారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. పిల్లర్లపై గడ్డర్ను అమర్చేందుకు అప్పటికే ట్రాఫిక్ను మళ్లించిన నేపథ్యంలో పెనుముప్పు తప్పినట్లైంది. కూలిన గడ్డర్ జేసీబీకు సంబంధించిన ట్రాలీపై పడి పోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గడ్డర్ శిథిలాలను గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది తొలగిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నేలకొరిగిన భారీ గడ్డర్ -
మహంకాళి సేవలో జిల్లా కలెక్టర్
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి 51వ తిరునాళ్ల మహోత్సవాలు రెండవ రోజుకు చేరాయి. శనివారం భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్లు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ ఈవో మాధవిదేవి స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి పొంగళ్లు పొంగించారు. ఆలయ అభివృద్ధి, తిరునాళ్ల ఏర్పాట్లుపై ఆలయ అధికారులతో సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం జాగరణ ఉంటుందని ఈవో తెలిపారు. ‘అగ్నివీర్ ర్యాలీ’ని సద్వినియోగం చేసుకోండి నరసరావుపేట: భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లాలోని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల తొమ్మిదవ తేదీన గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా రావచ్చునని తెలిపారు. -
సన్మార్గదర్శిని దివ్యఖురాన్
చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్. దివ్యఖురాన్ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోపానం ఈ దివ్యగ్రంథం. పవిత్ర ఖురాన్ అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనికి దివ్యఖురాన్ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, ఎవరితో ఎలా మసలుకోవాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, నిత్య జీవితం ఎలా గడపాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, సాటివారితో ఎలా మసలుకోవాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసరమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రవక్త అనుసరించిన గ్రంథం పవిత్ర ఖురాన్లో సూచించిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్లో 114 సూరాలు, 6,666 ఆయాత్లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్ మాసంలో తరావి నమాజు కింద పూర్తి పఠనం గావిస్తారు. అవతరించిన నాటి నుంచి చిన్న మార్పు కూడా లేని గ్రంఽథంగా ప్రాచుర్యం పొందింది. మంచి మార్గంలో నడిపేలా... దైవం దివ్య ఖురాన్ను ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారు చీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పని సరి అన్న సూచన అందుతోంది. చదువు విలువను ఈ భాగం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషిని ఉత్తముడిగా మార్చేందుకు ఎన్నో సూచనలు ఉన్నాయి. రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్, ఫిత్రాలను కచ్చితంగా అందజేస్తే రంజాన్ ఈద్ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రబోధిస్తుంది. ముఖ్యంగా సీ్త్రలను బానిసలుగా చూడకూడదని, పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని, వాటి రక్షణ బాధ్యత పురుషుడే వహించాలని సూచిస్తుంది. అనాథలు, వితంతువులకు సహాయకారులుగా ఉండాలని చెబుతుంది. ఖురాన్ గ్రంథం ఎంత పవిత్రమైనదో అంత శాసీ్త్రయమైనది కూడా అని ప్రపంచ మేధావులు కొనియాడుతున్నారు. ప్రకృతిలో చెట్టు ఎంత విలువైనదో ఈ గ్రంథంలో కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఖురాన్ను చదివి దానిని అమలు పరిచేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించే వారికి ప్రశాంతతోపాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం. దివ్యఖురాన్ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పఠించటం ముఖ్యమే. అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించటం ముక్తిదాయకం. ఖురాన్ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు అందరికంటే ఉన్నతులు. – మౌలానా మొహమ్మద్ అబ్బాస్ఖాన్ నద్వి, ఇస్లామిక్ పండితుడు -
బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నాదెండ్ల: డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ పి. సుభాష్ చెప్పారు. గణపవరం బొడ్డురాయిసెంటర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. బ్యాంక్ జీఎం (విజిలెన్స్) హరీష్బేతా, జీఎం (స్ట్రాటజీ) రాజశేఖరమ్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకు శాఖను ప్రారంభించారు. స్ట్రాంగ్ రూమ్ను గ్రామ మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందరరావు, లాకర్ రూమ్లను ఉపాధ్యాయురాలు కట్టా రమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆర్ఎం సుభాష్ మాట్లాడుతూ తమ బ్యాంకు వ్యాపార, వ్యవసాయ రుణాలతోపాటు విద్య, తనఖా, కారు, గృహ, సోలార్, ముద్ర తదితర రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కన్నా తమ బ్యాంకు అరశాతం అధిక వడ్డీ అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,351 శాఖల్లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ బ్యాంకు ఖాతాదారుడేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు తమ బ్యాంకు లక్షల మందికి దరి చేరుస్తోందన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ వి. సురేష్, భవన యజమాని నన్నపనేని శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 11 మండలాలలో 40 గ్రామాలలో సుమారు 6 వేల ఎకరాల భూములు సేకరించనున్నట్లు అధికారులు తెలియజేశారని తెలిపారు. ముందుగా ఆయా రైతులకు సమాచారం తెలపకుండా, గ్రామ సభలు జరపకుండా, కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా 250 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మాణం చేయనున్నట్లుగా ప్రకటించడంతో ఆయా మండలాలు గ్రామాలలోని రైతులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువను ఆధారం చేసుకుని నష్టపరిహారం సరికాదని, మూడు పంటలు పండే సారవంతమైన భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. -
9 నుంచి జాతీయ సదస్సు
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ రూసా 2.0 సౌజన్యంతో నెక్ట్స్ జనరేషన్ డ్రగ్ డిస్కవరీ లెవరేజింగ్ అండ్ టూల్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ ఇన్నోవేషన్ అనే అంశంపై జాతీయ స్థాయి వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య కె. గంగాధరరావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారన్నారు. సంబంధిత బ్రోచర్ను శుక్రవారం వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధర్రావు, రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలం చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫార్మా కళాశాల ప్రిన్సిపాల్, కార్యక్రమ కన్వీనర్లు ప్రొఫెసర్ కె. తేజ మూర్తి, డాక్టర్ షేక్ మస్తానమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఖబరస్తాన్ వివాదంపై అంజుమన్ ట్రస్ట్ బోర్డు మౌనం
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని ఖబరస్తాన్ వివాదంపై అంజుమన్ ట్రస్ట్ బోర్డు మౌనం వహిస్తోందని ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు విమర్శించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సిద్ధిక్ మజ్జిద్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంజుమన్ ట్రస్ట్బోర్డు పవిత్ర ఖబరస్తాన్ స్థలం విషయంలో నిర్లక్ష్యం వహించడం ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులు, ఖబరస్తాన్ల వంటి పవిత్ర వక్ఫ్ ఆస్తులను సంరక్షించాలనే మహోన్నత లక్ష్యంతో అంజుమన్ సంస్థను పెద్దలు స్థాపించారని గుర్తుచేశారు. పవిత్ర స్థలాలను కాపాడతామని బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అంజుమన్ ట్రస్ట్బోర్డు సభ్యులు ఖబరస్తాన్ వంటి ధార్మిక విషయాల్లో మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని విమర్శించారు. ఖబరస్తాన్పై ఎలివేటెడ్ బ్రిడ్జి ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు బహిరంగంగా చర్చిస్తున్నప్పటికీ అంజుమన్ నుంచి నేటికీ స్పష్టమైన స్పందన రాకపోవడం ఆందోళనకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఖబరస్తాన్ పరిరక్షణ వ్యక్తిగత, రాజకీయ అంశం కాదని, ముస్లిం సమాజానికి సంబంధించిన ధార్మిక బాధ్యత అని స్పష్టంచేశారు. అంజుమన్ ట్రస్ట్బోర్డు తక్షణమే మౌనం వీడి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, దీనిపై చర్చించేందుకు సభ్యులందరితో కలసి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన స్పందన రాకపోతే తదుపరి ప్రజా కార్యాచరణపై ముస్లిం సమాజంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మహమ్మద్ యూసఫ్, తబ్లీగ్ జమాత్ అధ్యక్షులు రఫీ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్, అహ్లెసున్నతువల్ జమాత్ అధ్యక్షులు మునీర్, జమీయతే అహ్లే హదీస్ అధ్యక్షులు రఫి, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం యువసేన అధ్యక్షులు ఇస్మాయిల్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన వ్యక్తం చేసిన ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ -
మత్స్య అవతారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి ఆస్థాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో కోగంటి సునీల్కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన ఇనుమన మిళ్లూరి వెంకట శ్రీరామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. నేడు స్వామివారు వటపత్రశాయి అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని హ్యాపీ హోమ్స్ సమీపంలోని పొలాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిలకలూరిపేట పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, కొంతకాలంగా ఈ ప్రాంతంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు సీఐ పి. రమేష్ తెలిపారు. నరసరావుపేట టౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వలంటీర్లగా వ్యవహరించటానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని 13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్బాబు శుక్రవారం తెలిపారు. సామాన్య ప్రజలకు, న్యాయసేవల సంస్థలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారధిగా వలంటీర్లు ఉంటారన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలు, న్యాయ వ్యవస్థపై శిక్షణ పొంది అవగాహన కల్పిస్తారన్నారు. ఎటువంటి ఆదాయం ఆశించకుండా సేవా దృక్పథంతో పనిచేసేవారు ముందుకు రావాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజెన్లు, అంగన్వాడీ కార్యకర్తలు, న్యాయ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు స్థానిక మండల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2025 అక్టోబరు, నవంబరు నెలలో జరిగిన బీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఎంబీఏ(హాస్పటల్ మేనేజ్మెంట్) మూడో సెమిస్టర్కు 28 మంది హాజరు కాగా 23 మంది, ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) మూడో సెమిస్టర్కు 52 మంది హాజరు కాగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ రెండో సెమిస్టర్కు 56 మంది హాజరు కాగా వారిలో 51 మంది, బీఎ, బీబీఏ, ఎల్ఎల్బీ నాల్గవ సెమిస్టర్కు 47 మంది హాజరు కాగా వారిలో 44 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 16 చివరి తేదీ కాగా రీవాల్యుయేషన్ దరఖాస్తులను 17వ తేదీలోగా పీజీ కో ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రీవాల్యుయేషన్ ఫీజు రూ.1860 కాగా పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను చూడాలని ఆలపాటి సూచించారు. తెనాలి రూరల్: గంజాయి కలిగి ఉన్న కేసులో నిందితుడికి జైలు శిక్ష , జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ... ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ డ్రైవ్లో భాగంగా 2022 ఏప్రిల్ 24న అప్పటి సెబ్ ఇన్స్పెక్టర్ ఎ. వెంకటాచలం మండలంలోని సోమసుందరపాలెం ఆటోనగర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ టింబర్ డిపో వద్ద పుల్లల వ్యాపారం చేసే కురగంటి ప్రసాద్ వద్ద 120 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు శుక్రవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన తెనాలి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎ. పవన్కుమార్... నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్కుమార్ వాదించారు. గుంటూరు రూరల్: బ్రెయిన్ స్ట్రోక్తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగళాయపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... వెంగళాయపాలెం గ్రామానికి చెందిన మన్నవ మనీష (30) చైన్నెలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గత కొంత కాలంగా వర్క్ ఫ్రం హోం తీసుకుని ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్ద విధులు నిర్వహిస్తుండగా తలనొప్పిగా ఉండటంతో కొంతసేపు నిద్రించింది. ఎంత సేపటికీ లేవకపోవటంతో తల్లిదండ్రులు చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మనీషాను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిందని తెలిపారు. సంఘటనపై మృతురాలి తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
యాడా...కంది బేడ..!
టీడీపీ ప్రభుత్వం కోతలకు పెద్దపీట వేస్తోంది. ఓవైపు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా .. మరోవైపు నిబంధనలతో పథకాలకు పేదలను దూరం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే రేషన్ డిపోల ద్వారా అన్ని రకాల సరుకులు ఇస్తామని హామీలు ఇచ్చి .. తీరా కందిపప్పుకు ఎగనామం పెట్టారు. బహిరంగ మార్కెట్లో ధర బాగా ఉండటంతో పేదలు పప్పు అన్నానికి నోచుకోవడం లేదు. నిరుపేదలకు కందిపప్పు కట్ జిల్లాలో చౌకధరల దుకాణాలు 1,289 సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో కందిపప్పు కలేనా అంటూ నిట్టూరుస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. కందిపప్పు ధర అయితే ఏనాడు లేని విధంగా పెరిగిపోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కందిపప్పును వినియోగించుకుందామని తెల్ల రేషన్ కార్డుదారులు ఆలోచిస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జనవరి నెలలో కొద్దిమందికి నామమాత్రంగా కంది పప్పు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో బియ్యంతో పాటు కొంతమందికి పంచదార పంపిణీ చేసి సరిపెట్టేశారు. మార్చిలో అయినా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. ఈ నెలలో కూడా సరఫరా చేయకపోవడంతో తెల్లబోయారు. బియ్యంతో సరి పెట్టుకో... ప్రతినెల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత బియ్యం మాత్రమే అందజేస్తున్నారు. ప్రతి నెలా ఇచ్చే సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. బియ్యం, చక్కెర తప్ప మిగిలిన సరుకులు ఇవ్వకపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కందిపప్పు ఇవ్వకపోవడంతో స్థానికులు చౌకదుకాణాల డీలర్లను నిలదీస్తున్నారు. కందిపప్పు సరఫరా లేదని, పంచదార ఇచ్చిన మేరకు అయిపోయిందని స్టాక్ రావాల్సి ఉందని వారు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. పేదలపై చిన్న చూపు... జిల్లాలో 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,43,453 రైస్ కార్డులు ఉన్నాయి. ఇందులో అధిక శాతం కూలి పనులు చేసుకునే పేదవర్గాల వారే. ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసరాలే వారికి ఆధారం. ఇందులో కందిపప్పు పూర్తిగా నిలిపివేశారు. పంచదార కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా అరకొరగా పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలపై చిన్న చూపు చూస్తోంది. కందిపప్పు గతంలో బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 నుంచి రూ.160 వరకు ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా కిలో రూ.67కే పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా అరకొరగా కందిపప్పు పంపిణీ చేసి చేతులెత్తేయడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారేమోనని చూస్తే అక్కడ కూడా నో స్టాక్ అంటూ చెప్పేస్తున్నారు. జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 6,43,453 పల్నాడు జిల్లా సమాచారం తెల్లరేషన్ కార్డుల్లోని సభ్యులు 18,57,768అవసరమైన కందిపప్పు (ఒక కిలో చొప్పున) 643 టన్నులు -
మత్తు కాదు..అంతకు మించి
గంజాయి, డ్రగ్స్కు బానిసవుతున్న యువత నరసరావుపేట టౌన్: బంగరు భవితకు బాటలు వేసే పుస్తకాలు పట్టాల్సిన చేతులు వైటనర్ మత్తులో వణుకుతున్నాయి. ఉత్సాహంగా ఉరకలెత్తాల్సిన యువత అర్థంగాని మత్తులో తడబడుతోంది. 20 ఏళ్లు కూడా నిండకుండానే నూరేళ్ల జీవితాలను చీకట్లు కమ్మేస్తున్నాయి. ఎదిగిన కొడుకుని చూసి మురిసిపోవాలనుకున్న తల్లిదండ్రుల కలలపై కన్నీళ్ల ముసురుకుంటున్నాయి. యువతను మత్తులో ముంచేసే వైట్నర్, సొల్యూషన్ల విక్రయాలపై నిఘా వర్గాలు నిద్ర మత్తులో జోగుతున్నాయి. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండలేదు.. బాగా మాసిన దుస్తులు, చెదిరిన జుట్టు, చేతిలో గుడ్డలో తెల్లని ద్రవ పదార్థం.. రోడ్డుపై నడుస్తుంటే కాళ్లు తడబడుతున్నాయి. కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో భవితను ఛిద్రం చేసుకున్న యువత నిత్యం ఇలా కనిపిస్తుంటారు. డ్రగ్స్ మహమ్మారికి బానిసై నిండు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన వైట్నర్, సొల్యూషన్స్ను పీలుస్తూ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నారు. ఏమిటీ వైట్నర్, సొల్యూషన్స్ ? గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో యువత మత్తుకు బానిసగా మారుతోంది. మత్తుకు బానిసైన వారు పనులకు వెళ్లకపోవడంతో డబ్బుకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో గంజాయి కంటే ఎక్కువ మత్తు ఇచ్చే వైట్నర్ (పేపర్ పై పెన్నుతో రాసిన అక్షరాలను కనిపించకుండా చేసేది), సైకిల్ షాపుల్లో పంచర్లకు వాడే సొల్యూషన్న్స్ను వినియోగిస్తున్నారు. ఇవి మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరకడంతో కొనుగోలు చేస్తున్నారు. ఒక గుడ్డ ముక్కలో కొంచెం వైట్నర్ వేసుకుని పీల్చితే మత్తుగా ఉంటుంది. వీటి విక్రయాలపై నియంత్రణ లేకపోవటంతో యథేచ్ఛగా కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అనేక మంది యువత ఇలాంటి మత్తులో పడి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. తక్షణ మత్తు.. ప్రాణాలకు ముప్పు వైట్నర్లో రబ్బర్, సిమెంట్లలో వాడే టోల్యూయిన్, హెక్సేన్వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి పీల్చిన వెంటనే తలతిరగడం, తాత్కాలిక ఉల్లాసం, మాట తడబడటం వంటి ప్రమాదాలు కనిపిస్తాయి. అదే సమయంలో గుండె కొట్టుకోవడంలో మార్పులు, శ్వాస ఆడకపోవడం వంటి తీవ్రమైన ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఇటువంటి రసాయనాలు పీల్చటం వల్ల ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. టోల్యూయిన్ వంటి వాయు రసాయనాలు గుండైపె తీవ్ర ప్రభావం చూపి మరణాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడు, కాలేయంపై తీవ్ర ప్రభావం.. వైట్నర్ , సొల్యూషన్న్స్ తరచూ వినియోగిస్తే మెదడు కణాలు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చదువులో వెనకబడతారు. మానసిక అస్థిరత, డిప్రెషన్, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. కాలేయం, మూత్రపిండాలు కూడా ప్రభావితమవుతాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వ్యసనపరులు చౌక రసాయనాల వైపు మళ్లి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా వినియోగించిన వారు తమ విచక్షణ కోల్పోతారు. ఆ సమయంలో వారి ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తారని వైద్యులు అంటున్నారు. నియంత్రణ ఎక్కడ ? తక్కువ ధరలో సులభంగా వైట్నర్, సొల్యూషన్స్ లభిస్తుండటంతో మత్తుకు బానిసైన వారు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చట్టపరంగా కఠిన నియంత్రణ లేకపోవటంతో యువత ఎక్కువగా ఆకర్షితులై మత్తులో విలువైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. మానసిక ఒత్తిళ్లు, చెడు స్నేహాల ప్రభావం కారణంగా వాడకం పెరుగుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పల్నాడు జిల్లాకు డి–అడిక్షన్ సెంటర్ మంజూరు అయింది. మొదటి జనవరి నెలలో 15 కేసులు నమోదు కాగా, ఫిబ్రవరి నెలలో 28 కేసులు నమోదయ్యాయి. రకరకాల మానసిక జబ్బులు రావటానికి మత్తు పదార్థాలే ముఖ్య కారణం. 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అనుమానం ఉంటే డి–అడిక్షన్ సెంటర్కు తీసుకురావాలి. –డాక్టర్ అత్తిలి సతీష్, మానసిక వైద్య నిపుణులు -
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్
నరసరావుపేటరూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాయలంలో శుక్రవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థినులు అధిక సంఖ్యలో ఓపెన్ హౌస్ను సందర్శించారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే తుపాకులు, పిస్టల్స్, ఆధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, సెప్టీ గాడ్జెట్, మిషనరీ సామగ్రిలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థిను ల కు వివరించారు. మహిళా భద్రత గురించి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయరక్షణ పద్ధతులు, హెల్ప్లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. నైతిక విలువలు, ధైర్యసాహసాలు, లైంగిక వేధింపుల ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలకు శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈనెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుభాషిణి పాల్గొన్నారు. -
వైభవంగా తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల
కోనూరు(అచ్చంపేట): మండలంలోని కోనూరులో గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు గురువారం అర్ధరాత్రి వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచి ప్రారంభమైన మహోత్సవాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. వైఎస్సార్సీపీకి చెందిన విద్యుత్ ప్రభ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రభను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు తమ్మ విజయప్రతాపరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై విఘ్న విమోచక హనుమాన్ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 108 కలశాలతో పంచగవ్య శుద్ధి, సాయంత్రం విశేష తదీయారాధనతో కార్యక్రమాలు ముగిశాయి. మైహోం గ్రూప్స్ అధినేత జూపర్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిరోజూ సుందరకాండ పారా యణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయ ణ, అఖండ హరేరామ నామ సంకీర్తన, హనుమద్ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం నుంచి అక్రమంగా తరలిపోతున్న మూడు మట్టి లారీలను నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం సీజ్ చేశారు. అనంతరం ఆ లారీ యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. డీఎస్పీ మురళీకృష్ణ ఒక కేసు విషయమై ఉండవల్లి నుంచి వస్తుండగా వరుసగా మట్టి లారీలు పెద్దపెద్దగా హారన్లు కొట్టుకుంటూ అధిక వేగంతో రావడంతో ఆ లారీలను క్రాస్ చేసి ఉండవల్లి సెంటర్ లో నిలిపివేశారు. మూడు లారీల వద్ద సరైన ప త్రాలు లేకపోవడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్ కు పంపించి విచారణ చేయాలని ఆదేశించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఇంటర్మీడియెట్బోర్డు కార్యదర్శి, కమిషనర్ పి.రంజిత్బాషా శుక్రవారం పరిశీలించారు. బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆన్సర్ షీట్ల వాల్యూయేషన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్జేడీ జె.పద్మ, ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. -
పది పరీక్షలను విజయవంతంగా నిర్వహిద్దాం
నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతంగా నిర్వహించాలని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. ఈనెల 16 నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పీఎన్సీ అండ్ కెఆర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని నో సెల్ఫోన్ జోన్గా గుర్తించామనీ, సీఎస్తో సహా ఎవరికీ సెల్ఫోన్ను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. డిప్యూటీ డీఈఓలు షేక్ సుభానీ, వి.ఏసుబాబు, జిల్లా విద్యాశాఖ ఏడీ పి.వెంకటరమణ, డీసీఈబీ సెక్రటరీ ఐ.కృష్ణానాయక్, రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 538.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 19,672 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. ముగిసిన బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):పెదపులివర్రులో భూ–నీళా సమేత వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూజాదికాలను సృజన్కుమార్ నిర్వహించగా, ఈవో సాంబయ్య పర్యవేక్షించారు. ఘనంగా మహిళా దినోత్సవం నరసరావుపేట: జిల్లా కేంద్రంలో ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ నుంచి డీఆర్ఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమానికి మూడు వేల మంది మహిళలు పాల్గొనున్నారని, అందుకు సంబంధించిన మినిట్స్ తయారు చేయాలని, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు మూడు వేల మంది మహిళలను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా మెగా చెక్కు పంపిణీ చేయాలని ఆయా విభాగాల పీడీలకు సూచించారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, మహిళ పారిశ్రామికవేత్తలను సన్మానించడానికి, వారి విజయ గాధలను వారే వివరించేలా ఏర్పాట్లు చేయాలని, సీ్త్రశక్తి, డీఆర్డీఎ, మెప్మా, సంక్షేమ, పరిశ్రమలు, పోలీస్ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మహిళలకు అందించే పథకాలకు సంబంధించినవి పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు. తుది ఓటరు జాబితా తయారు చేయండి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈనెల 7న గ్రామస్థాయిలో ప్రక్రియ పూర్తిచేసి తొమ్మిదిన పల్నాడు జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని అన్నారు. జిల్లా గ్రామపంచాయితీ అధికారి ఎస్.వి.నాగేశ్వర్ నాయక్, సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి, జిల్లాలోని అందరు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనాబా గణన ప్రక్రియ నరసరావుపేట రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కేసానుపల్లిలోని ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. I -
● రెండో రోజు కొనసాగిన గుడారాల పండుగ ● నిరంతర ప్రార్థనతో విజయం వరిస్తుందన్న పాస్టర్ అబ్రహాం
అమరావతి: పరిశుద్ధ ప్రభువైన ఏసు క్రీస్తు మన వెంట ఉండి నడిపించటానికి ప్రతి ఒక్కరూ నిరంతరం దైవ ప్రార్థన చేయాలని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు అబ్రహాం అన్నారు. అమరావతి మండల పరిధిలోని లేమల్లెలో ఉన్న హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. రాత్రి పూట ప్రార్థనలలో ఆయన ఆరాధికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాడైన మన బతుకులను మార్చుకోవటానికి పరిశుద్ధమైన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుని దర్శనం కలుగుతుందన్నారు. ఏసయ్యను నిష్కళంకమైన మనస్సుతో ప్రార్థిస్తే మంచి జరుగుతుందన్నారు. విశ్వాసుల జీవితాలలో సమస్యలు తొలగిపోవాలంటే ప్రభువు ఏసయ్యపై సంపూర్ణమైన నమ్మకం ఉంచాలన్నారు. గుడారాల పండుగ అంటే దేవుని వాక్యాల పండుగ, ఆరాధనల పండుగ, వర్తమానముల పండుగ అన్నారు. తొలుత హోసన్నా సేవకులు, సిస్టర్ల బృందం దేవుని స్తుతి గీతాలు ఆలపించారు. సండే స్కూల్ చిన్నారుల నృత్యాలు విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ మాట్లాడుతూ మానవునికి, దేవునికి మధ్య సంబంధం ఆరాధన మాత్రమే అన్నారు. దేవని కృప పొందాలంటే నిరంతర ఆరాధన పరిశుద్ధమైన మనస్సుతో చేయాలన్నారు. దేవుని పట్ల విశ్వాసులు భయభక్తులు కలిగి ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే కష్టాలు దరిచేరవన్నారు. రాత్రి ప్రార్థనలలో దైవజనులు రాజన్న ముగింపు ప్రార్థనలు చేశారు. గుడారాల పండుగల రెండో రోజు రాత్రి ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. దయాక్షేత్రం విశ్వాసులతో కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
కిల్కారీ సేవల అమలు తీరు పరిశీలన
పెదకాకాని: బాలింతలు, గర్భిణులు ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు అన్నారు. మండలంలోని వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కొప్పురావూరు సబ్సెంటర్ను గురువారం జిల్లా కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు అందుతున్న కిల్కారీ సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిల్కారీ కాల్ నెంబర్ 911600403660 ని గర్భిణీలు మరియు బాలింతలు మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని సూచించారు. మరల వినాలి అనుకుంటే 14423 లేక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కిల్కారి కాల్ని కేంద్ర ప్రభుత్వం మాత శిశు మరణాలు తగ్గించడానికి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కిల్కారి కాల్ నెలకు ఒకసారి వాయిస్ ద్వారా తల్లి బిడ్డల సంరక్షణ గురించి చెబుతారన్నారు. ఈకాల్లో గర్భిణులు, బాలింతలు తీసుకోవలిసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి, హై రిస్క్ గురించి, బర్త్ ప్లాన్, టీకాలు గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, రక్తహీనత గురించి అతి ప్రాముఖ్యమైన సలహాలు, సూచనలు అందజేయడం జరుగుతుందన్నారు. కిల్కారి కాల్స్ గర్భిణి అయిన 4 వ నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకూ వస్తాయన్నారు. డాక్టర్ రామాంజిరెడ్డి, పీహెచ్ఎన్ భవాని, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, ఏఎన్ఎం నాగమణి, ఆశలు పాల్గొన్నారు. -
మహిళల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాడాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ మంగళగిరి టౌన్: మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారి రక్షణకు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి మండలం యర్రబాలెంలో గురువారం ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మద్యం, మాదక ద్రవ్యాలే నేరాలకు మూలమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతేస్థాయిలో వారిపై అణచివేత, హింస, వివక్ష పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో ఎక్కువ శాతం మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల మత్తులోనే జరుగుతున్నాయని విమర్శించారు. మార్చి 8న గుంటూరులో భారీ ర్యాలీ సదస్సు జరుగనున్నట్లు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే ఈ సదస్సుకు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు హాజరుకానున్నారని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ గతంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి 8 గంటల పనివిధానాన్ని సాధించుకున్నారని, నేటి పాలకులు పని గంటలు పెంచుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకులు ఆదిలక్ష్మి, పార్వతి, మేరి, రమాదేవి, అంజలి, తిరుతమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణదారుల చెర నుంచి పేదల స్థలాలను కాపాడండి
బాపట్లటౌన్: మండలంలోని కేబీపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 866/2బి, 791/1ఎలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం 295 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు అందజేశారు. గత రెండు రోజుల నుంచి కొంతమంది భూ కబ్జాదారులు జగనన్న కాలనీలోకి ప్రవేశించి స్థలాలను కబ్జా చేయడంతోపాటు స్థలాల్లో ఉన్న తుమ్మ, సుబాబుల్ చెట్లను అక్రమంగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మల్లెల పవన్, మార్పు లక్ష్మణ, పల్లెకొండరాజు, యారం కై లాష్ మహార్షి, తోకల చిట్టి, తోకల రాముడు, కొండ్రు బాబురావు, తోకల అంబేడ్కర్, తోకల చంటి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల కలెక్టర్కు కేబీపాలెం వాసుల వినతి -
సత్తెమ్మతల్లి గుడిబోర్డు మెంబర్ల నియామకంలో అన్యాయం
మాదిపాడు(అచ్చంపేట): సత్తెమ్మతల్లి గుడి బోర్డు సభ్యుల నియామకంలో ఇస్తామన్న మూడు పోస్టులు తమకు ఇవ్వకుండా కేవలం ఒకరికి మాత్రమే అవకాశం కల్పించి, మిగిలిన మొత్తం టీడీపీ సభ్యులు తీసుకున్నారని, తమకు ఇస్తామన్న కోటా ఇవ్వకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని మాదిపాడు జనసేన కార్యకర్తలు గురువారం వీడియో ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ తొలుత అనుకున్నట్లు సత్తెమతల్లి గుడి బోర్డు మెంబర్లుగా జనసేన తరఫున ముగ్గురు పేర్లను సత్తెనపల్లి పార్టీ ఇన్చార్జి యర్రంసెట్టి రామకృష్ణ, మాదిపాడు గ్రామ అధ్యక్షుడు కన్నాశ్రీను, ఉపాధ్యక్షుడు వెంకట్రావుల ద్వారా ప్రతిపాదించినట్లు తెలిపారు. అయినప్పటీకీ ఒక్కరికే అవకాశం కల్పించి మిగతా ఇద్దరికీ ఇవ్వలేదన్నారు. అదీగాక ప్రతిపాదించిన వారి పేర్లు కూడా పెట్టలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న ముగ్గురు సభ్యులకు బోర్డులో అవకాశం కల్పించకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
అల్పాహారమో రామచంద్రా..
సత్తెనపల్లి: విద్యార్థులకు పదో తరగతి ఎంతో కీలకం. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వంద శాతం ఉత్తీర్ణత, ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి వస్తున్నారు. తిరిగి వెళ్లడానికి సాయంత్రం 6 నుంచి 7 గంటలకుపైగా అవుతుంది. ఈ క్రమంలో నీరసించిపోయి చదువులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. వారికి సాయంత్రం అల్పాహారం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. 26,400 మందికిపైగా విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 183 జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 26,400 మంది పైగా పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్తోపాటు ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు.వంద శాతం ఉత్తీర్ణతతోపాటు ఉత్తమ ఫలితాలు కూడా సాధించాలని ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు సాయంత్రానికి నిరసించి పోతున్నారు. వారికి సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చు అవుతుంది. పౌష్టికాహరానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీంతో మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తింటున్న భోజనం తప్ప మరే ఆహారం లేకపోవడంతో సాయంత్రానికి విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు. నీరసిస్తున్న బాలలు సుదీర్ఘంగా గంటలపాటు చదువుకోవడం వల్ల విద్యార్థులు శారీరక శక్తిని కోల్పోతున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినకపోవడంతో చాలామంది విద్యార్థులు నీరసానికి గురవుతున్నారు. కనీసం సాయంత్రం వేళల్లో బిస్కెట్లు, పాలు లేక ఏదైనా అల్పాహారం అందుబాటులో లేకపోవడంతో వారు చదువుపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఆకలి కడుపులతో పాఠాలు వినడం, చదవడం పెద్ద సవాలుగా మారింది. దాతలు ముందుకు వస్తేనే... విద్యార్థుల పరిస్థితిని గమనించిన విద్యాశాఖ అధికారులు దాతల సహాయాన్ని కోరుతున్నారు. సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు నిధుల కొరత ఉందని అధికారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి స్నాక్స్ పంపిణీ చేయాలని చెబుతున్నారు. జిల్లా సమాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు : 172 మున్సిపల్ ఉన్నత పాఠశాలలు : 07 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 04 టెన్త్ విద్యార్థుల సంఖ్య : 26,400 -
ఆయిల్ మిల్లులపై దాడులు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా గురువారం దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు, వాటికి అనుబంధంగా ఉన్న గోదాముల్లో తనిఖీలు నిర్వహించి నూనె నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ పరిమితికి మించి ఉన్న లూజు పామాయిల్ను గుర్తించి శాంపిళ్లను సేకరించామన్నారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా కొన్ని బ్రాండెడ్ ఆయిల్ ప్యాకెట్లను కూడా గుర్తించి వాటి నమూనాలు కూడా సేకరించామన్నారు. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ బరంపేటలోని వాహిని ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ను తనిఖీ చేపట్టామన్నారు. పెద్ద మొత్తంలో నిల్వ ఉన్న బ్రాండెడ్ ఆయిల్ నిల్వలను గుర్తించామన్నారు. కాగా అధికారుల దాడులతో యజమానులు కొన్ని ఆయిల్ మిల్లులకు తాళాలు వేసి వెళ్లటం గమనార్హం. -
ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని బాలిక దుర్మరణం
చీరాల రూరల్: ౖరెలు ఢీకొనడంతో బాలిక దుర్మరణం చెందిన సంఘటన చినగంజాం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. చినగంజాం మున్నంవారిపాలేనికి చెందిన చంద్రశేఖర రెడ్డి కుమార్తె హేమ శివస్మృతి (16)తన నాయనమ్మ ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో దిగువలైన్లో రైలు పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో బాలిక రైలుబండిని గమనించకపోవడంతో ఒంగోలు వైపు నుంచి విజయవాడ వెళ్లే బిలాస్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలిక పుట్టకతోనే మానసిక దివ్యాంగురాలని ఎస్సై చెప్పారు. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు తాడేపల్లి రూరల్: కృష్ణానది కనకదుర్గ వారధిపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళగిరి వెళుతున్న మంగళగిరి డిపో బస్సు 38 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈక్రమంలో కనకదుర్గ వారధి మధ్యలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక అద్దం పగలడంతో పాటు వెనుక సీట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అద్దాల ముక్కలు లోపల పడడంతో లారీ ఢీకొన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై ఆర్టీసీ డ్రైవర్ తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం.రాజామోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. రైల్వే స్టేషన్లో గుండెపోటుతో వృద్ధుడు .. ఈపూరు మండలం గుండే పల్లి గ్రామానికి చెందిన పాతపోతుల మల్లయ్య(85) గురువారం నరసరావుపేట రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేట పరిసర ప్రాంతాల నుంచి క్రాంతి, హతీబ్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం సేకరించి తరలిస్తుండగా, గురువారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు. ఆటోలో తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఇరువురితోపాటు, డ్రైవర్పై కూడా కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపగా రిమాండ్ విధించారు. సీఐ చరమందరాజు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ మోహన్బాబు తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్ మాబు, గుంటూరు సిటీకి చెందిన షేక్ రిహాజ్గా గుర్తించారు. వారిని విచారించగా బైక్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ టౌన్తో పాటు గుంటూరులోని నగరపాలెం, పట్టాభిపురం, మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరు బైక్లు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని రిహాజ్ అమ్మమ్మ ఊరైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో దాచిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
అనుమానం పెనుభూతమై..
పసిబిడ్డలు అనాథలై..చిలకలూరిపేట టౌన్: పదేళ్ల కిందట మూడు ముళ్ళతో మొదలైన ఆ సంసార నావ, అనుమానం అనే సుడిగుండంలో చిక్కుకుని చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ముగ్గురు పసిబిడ్డలకు అమ్మ ప్రేమను దూరం చేస్తూ, వివాహిత బలవన్మరణం చెందిన తీరు స్థానికులను కలచివేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం కట్టబడివారిపాలెంలో క్వారీ పనులు చేసుకునే మక్కె వీరాంజనేయులుకు పట్టణంలోని పురుషోత్తమపట్నంకు చెందిన యువతి తిరుమలతో పదేళ్ల కిందట వివాహమైంది. మొదట సంతోషంగానే ఉన్న దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె మనస్తాపానికి గురైంది. కన్నబిడ్డల భవిష్యత్ కంటే, పడుతున్న అవమానమే పెద్దదిగా భావించి, గత నెల 28వ తేదీ సాయంత్రం శీతల పానీయంలో ఎలుకల మందు కలుపుకొని తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు పెద్దాసుపత్రికి తరలించినప్పటికీ, వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందింది. ఈ ఘటనతో అటు పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు విషాదంలో మునిగిపోయాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన ఆ పసిపాపలు, ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. తన కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.అనిల్కుమార్ తెలిపారు. -
మహిళా రక్షణ చట్టాల పోస్టర్ల ఆవిష్కరణ
మంగళగిరి టౌన్ : మహిళా రక్షణ చట్టంపై మరింత అవగాహన పెంచాలని, వాటి దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రూపొందించిన మహిళా రక్షణ చట్టాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్నారు. అన్యాయానికి గురైన మహిళలు వెంటనే ఫిర్యాదు చేసేలా చట్టాలను తెలియజెప్పాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు సేవతోపాటు చట్టాలను గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు వివరించి చైతన్యపరచాలని కోరారు. మహిళా భద్రత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. తాడేపల్లి రూరల్ : ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారులు జి. శాంతకుమారి, డి. నాగేశ్వరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాడేపల్లి పరిధిలో రాష్ట్ర సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రవేశానికి 5 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలని, మార్చి 10వ తేదీ వరకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సీఎస్ఇ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. 25 శాతంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ పిల్లలకు 6 శాతం చొప్పున ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో నాంచారమ్మ తల్లి తిరునాళ్ల గురువారం వైభవంగా జరిగింది. రెండు రోజులుగా గ్రామంలోని మహిళలు, భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పరవశించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారి ఆలయం కళకళలాడింది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణ పరిసరాలలో భారీ విద్యుత్ ప్రభలను అలంకరించి అందర్నీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. -
మూగబోయిన నాదస్వరం
చిలకలూరిపేట: దేశ విదేశాల్లో తన నాదస్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సుస్వరాలు మూగబోయాయి. చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం ఉన్న పద్మశ్రీ షేక్ మహబూబ్ సుభాని (71) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం నాదస్వర విద్వాంసులకు పుట్టినిల్లు. ఈ విద్వాంసుల కుటుంబానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం. పెరిగింది, నాదస్వర విద్య నేర్పించి చిలకలూరిపేట పట్టణంలోని ఆయన తాత నాదబ్రహ్మ, నాదస్వర గాన కళాప్రపూర్ణ బిరుదాంకితుడు షేక్ చినపీరు సాహెబ్ ఇంట. నాదస్వరంలో ఎందరినో విద్వాంసులుగా తీర్చిదిద్దిన చినపీరు సాహెబ్కు మగ సంతానం లేకపోవడంతో ఆయన అల్లుడు మీరాసాహెబ్ చిలకలూరిపేటలోని తన గురువు, మామగారైన పీరుసాహెబ్ ఇంటిలోనే ఉండటంతో సుభాని బాల్యం, నాద విద్యకు తొలి అడుగులు ఇక్కడే పడ్డాయి. అలాంటి మహబూబ్ సుభాని మరణ వార్త స్థానికులను ఎంతోగానోకలిచివేసింది. సంగీత ప్రస్థానం... దక్షిణభారత శైలి కర్ణాటక సంగీతంలో విశిష్ట స్థానం కలిగిన నాదస్వరం అత్యంత మంగళప్రదమైనది. దేవాలయాలు, మత, సామాజిక పరమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉండవలిసిన వాద్యం నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించే వాద్యం కూడా ఇదే. నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చిన ఘనత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నాదస్వర విద్వాంసులకు దక్కుతుంది. దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు. వారి సుమధుర నాదం ఎన్నో దేవాలయాల్లో సుప్రభాత సేవలకు ఆధ్యాత్మిక శోభ సంతరింపజేస్తుంది. ఈ వంశంలో ఎనిమిదో తరానికి చెందిన విద్వాంసులైన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులకు నాదస్వరమే సర్వస్వం. అలాంటి కళకు అంకితమైన ఈ నాద ద్వయానికి కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ ఎనిమిదో తేదీన పద్మశ్రీ పురస్కారం అందజేసి గౌరవించింది. బాల్యం నుంచి .... ఏడేళ్ల వయస్సు నుంచే మహబూబ్ సుభాని ఆయన తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. అలాగే షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్ సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వారి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారద సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె. చంద్రమౌళి వద్ద కొంతకాలం నాదస్వరం అభ్యసించారు. అనంతరం గానకళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద తంజావూర్ బాణీలో పదేళ్లపాటు శిక్షణ పొందారు. కాలం గడిచేకొద్దీ శాసీ్త్రయ సంగీతానికి ఆదరణ తగ్గటంతో శాసీ్త్రయ సంగీతానికి నేటికీ పెద్ద పీటవేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి ఎందరో కళాకారులు తరలివెళ్లిన తీరుగానే మహబూబ్ సుభాని, కాలేషాబీ దంపతులు వెళ్లారు. అక్కడ శ్రీరంగంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు షేక్ ఫిరోజ్బాబు కూడా సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మహబూబ్ సుభాని తన జీవిత కాలంలో ఇప్పటికే అబుదాబి, బ్రెజిల్, దుబాయ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్ తదితర విదేశాలతోపాటు భారత దేశ వ్యాప్తంగా కచేరీలు చేసిన ఘనత దక్కించుకున్నారు. పద్మశ్రీతోపాటు మరెన్నో పురస్కారాలు తన జీవిత భాగస్వామి కాలేషాబి, కుమారుడు ఫిరోజ్బాబుతో కలసి దక్కించుకున్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు. -
9న సీనియర్, అండర్–23 క్రికెట్ జట్ల ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్, అండర్–23 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 9న తేదీ ఉదయం 07.30 గంటలకు అరండల్పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తామని యు.మహతి శంకర్ గురువారం ఒక ప్రటకటనలో పేర్కొన్నారు. అండర్–23 బాలురు 01–09–2003 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్ జట్టుకు వయస్సు పరిమితి లేదన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ బ్యాగ్తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో రిపోర్ట్ తప్పనిసరన్నారు. చీరాల రూరల్: ఎస్పీ ఉమామహేశ్వర్పై అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్న చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, దళిత మహాసభ మాచవరపు జూలియన్లు డిమాండ్ చేశారు. బాలకోటిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలంటూ గురువారం వారు తమ అనుచరులతో కలిసి చీరాల ఒన్టౌన్ పోలీసు స్టేషన్లో సీఐ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడారు. బాలకోటిరెడ్డిపై చుండూరు చుట్టు పక్కల పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నాయని, అతనిపై రౌడీషీటు కూడా ఉందని తెలిపారు. సెటిల్మెంట్లు, దందాలు, కోడి పందేలు, పేకాట, ఇసుక వంటి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ చివరకు పోలీసులపైనే దాడులకు దిగడం వారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా వీడియోలు పెట్టడం దారుణమన్నారు. వారిపై అవినీతి, అసత్య ఆరోపణలు చేయడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ పెద్దలు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అటువంటి సంఘ విద్రోహ శక్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమతా సైనిక్దళ్ అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు, చీరాల, బాపట్ల నాయకులు పులిపాటి బాబురావు, మల్లెల బుల్లిబాబు, దార్ల శాస్త్రి, దేవరపల్లి బాబురావు, పండ్లూరి వినోద్, గోసాల అశోక్ తదితరులుపాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిమ్స్లో సమస్యలను అధిగమించే అంశంపై గతంలో రివ్యూల్లో సమీక్షించామని పేర్కొన్నారు. ఎయిమ్స్ను ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకడమిక్ ఇనిస్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి దాదాపు 500 పోస్టులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఎయిమ్స్లో గతంలో 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా నేడు 87 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలకు ఆలస్యం అవుతుందని, మిగతా అన్ని పరీక్షలు త్వరగానే రిపోర్టులు వస్తున్నాయని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఫార్మసీ కౌంటర్లు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో బస్ షెల్టర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం సాంతాసింగ్, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు. -
హోసన్నా.. జయము!
గుడారాల పండుగల మొదటిరోజు లక్షలాదిగా హాజరై ఆరాధిస్తున్న విశ్వాసులుఅమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక వేదికపై దైవజనులు ఆశీనులు కాగా స్తుతి గీతాలు వీనుల విందుగా ఆలపించారు. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రసంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ప్రభువైన క్రీస్తు ఏసు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు పునరుజ్జీవం కలగాని ప్రార్థిస్తున్నామన్నారు. దేవుడు ఒక్కమాట సెలవిస్తే మనజీవితాలలో అద్భుతాలు జరగుతాయని.. అందుకోసం నిరంతరం విశ్వాసులు దేవుని నామాన్ని స్తుతించాలన్నారు. దయాక్షేత్రంలో అడుగుపెట్టిన రోగులు, వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలగాలని క్రీస్తు ఏసును ప్రార్ధిద్దామన్నారు. ఈ నాలుగురోజుల పాటు జరిగే గుడారాల పండుగలో ప్రార్ధనాత్మతో ప్రతి క్షణం దేవుని స్తుతించాలన్నారు. ● హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ.. గుడారాల పండుగలు గతంలో 17సంవత్సరాలు దైవజనులు ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో నిర్వహించటం జరిగిందన్నారు. ● ఈసందర్భంగా చైన్నెకి చెందిన దైవజనులు మోహన్ సీ లాజరస్ మాట్లాడుతూ విశ్వాసులందరూ ప్రభువైన ఏసు క్రీస్తును పరిశుద్ధాత్మతో స్తుతించాలన్నారు. ఏసుక్రీస్తు మనుషులను పాప సంకెళ్ల నుంచి విడిపించి, స్వతంత్రులుగా చేయటానికి దిగి వచ్చారన్నారు. తొలిరోజు దైవజనులు అబ్రహాం, జాన్వెస్లీ, రమేష్, ఫ్రెడ్డీపాల్, రాజులు స్తుతి గీతాలాపనలు చేశారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి విశ్వాసులు లక్షలాదిగా తరలివచ్చారు సౌందర్యపూర్ణుడా పాటల పుస్తకం ఆవిష్కరణ దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రములు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయ పతాకంలోని మూడు రంగుల బెలూన్లను, పావురాళ్లను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం స్తుతిగీతాల పుస్తకమైన హోసన్నా సౌందర్యపూర్ణుడా పాటల పుస్తకాన్ని ఏలూరుకు చెందిన జ్యోతిరాజ్, స్పర్జన్ రాజ్లు ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన దైవజనుడు ఎర్నెట్పాల్ ప్రార్థనతో సౌందర్యపూర్ణుడా స్తుతిగీతాల అల్బమ్ను ఆవిష్కరించారు. -
గుడారాల పండుగ ప్రారంభం
అమరావతి: పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది విశ్వాసులు తరలివచ్చారు. దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్తుతి గీతాలతో ఆరాధించారు. ఈ సందర్భంగా హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన విశ్వాసులకు క్రీస్తు కృపాకటాక్షాలు నిత్యం ఉండాలని ప్రార్థించారు. తొలుత దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువామోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసుల కరతాళ ధ్వనుల మధ్య భారత జాతీయ పతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి పండుగను ప్రారంభించారు. అనంతరం విశ్వాసులు ఆలపించిన క్రీస్తు స్తుతిగీతాలు ఆకట్టుకున్నాయి. ‘‘హోసన్నా సౌందర్యపూర్ణుడా..’’ అనే పాటల పుస్తకాన్ని ఏలూరుకు చెందిన జ్యోతిరాజ్, స్పర్ధనరాజ్ ఆవిష్కరించారు. స్తుతి గీతాల వీడియో ఆల్బమ్ను అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్పాల్ ఆవిష్కరించారు. తొలిరోజు దైవజనులు అబ్రహం, జాన్వెస్లీ, రమేష్, ప్రెడ్డిపాల్, రాజు ఆలపించిన స్తుతిగీతాలు విశ్వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. -
ఆన్లైన్ మోసాలు అరికట్టండి
బ్యాంకు అధికారులకు ఎంపీ, కలెక్టర్ల సూచన నరసరావుపేట: మ్యూల్ ఖాతాల ద్వారా జరుగుతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలేజీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు చెల్లించి మరీ మోసాలకు వాడుతున్న విధానాన్ని నిరోధించేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బ్యాంకులు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారిలో 80 శాతం మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. సూర్య ఘర్ పథకం కింద సబ్సిడీ రుణాల వితరణ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రికవరీ సమస్యలున్న డ్వాక్రా రుణాల అకౌంట్ల వివరాలు డీఆర్డీఏ అందించాలన్నారు. విద్యార్థులకు హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చుల వినియోగానికి విద్యారుణాలు అందించాలన్నారు. దీనిపై కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రుణ వితరణ లక్ష్యాలు చేరుకోని బ్యాంకుల నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జూన్, జూలై నాటికి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందించి పంట రుణ వితరణ జరిగేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పశు పెంపకందారులకు కేవలం నాలుగు శాతం వడ్డీతో ఒక్కో పశువుపై రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకూ అందించే రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి మూడో వారంలోగా క్లస్టర్ విధానంలో మండలాలవారీగా ఏర్పాటు చేసిన క్లస్టర్ల అభివృద్ధికి రుణాలు అందించాలని తెలిపారు. డీసీసీబీ చైర్పర్సన్ మక్కెన మల్లికార్జునరావు, ఎల్డీఎం రామ్ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు, బాలలకు ఇచ్చే పౌష్టికాహారం కుటుంబంలోని అందరూ వినియోగించకుండా చూడాలన్నారు. మండలానికి రూ.90 లక్షల చొప్పున గ్రామాల్లో పన్ను వసూళ్లు చేయాలని డీపీవోను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు పూర్తి చేయాలన్నారు. ఇన్చార్జి డీఆర్ఓ నారదముని, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఉమాదేవి, డీపీఓ వి.నాగేశ్వరరావు నాయక్ పాల్గొన్నారు. భూసేకరణపై సమావేశం నకరికల్లు–చీరాల వాడరేవుకు (167/ఏ) సంబంధించి జిల్లా పరిధిలో భూ సేకరణ ప్రక్రియపై కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. రహదారి కోసం భూములు కోల్పోయిన కేసానుపల్లి, జొన్నలగడ్డ, గుంటగార్లపాడు, నరసరావుపేట, రావిపాడు గ్రామాలకు చెందిన రైతులకు ఇచ్చే నష్టపరిహారానికి సంబంధించిన అవార్డును పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. రహదారి పనులను మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీవో మురళీకృష్ణ, జాతీయ రహదారుల ఈఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ వేణుగోపాల్ హాజరయ్యారు. -
కండె రాదు.. కనీస ధర దక్కదు
సాక్షి, నరసరావుపేట : మొక్కజొన్న పంటతో గత ఏడాది రైతులకు ఎంతో కొంత మేలు కలగడంతో ఈ ఏడాది పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో సాగు చేశారు. విత్తన సమయంలో విత్తనాలు దొరక్క నానా ఇబ్బందులు పడి అధిక ధరలకు కొందరు రైతులు సాగు చేయగా, మరికొందరు విత్తన కంపెనీలు అందించే సీడ్తోనే సాగు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి సరఫరాపై కనీస శ్రద్ధ పెట్టకపోవడంతో మొక్కజొన్న పంట చివరి దశలో నీరు సరిగా అందలేదు. దీంతో నరసరావుపేట మండలం ములకలూరు వద్ద రహదారిపై బై బైఠాయించి తమ గోడును వెళ్లడించారు. ఇన్ని కష్టాలు పడి పండించిన రైతు నకిలీ మొక్కజొన్న విత్తనాలు దెబ్బతో తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి తగ్గి ఓ వైపు మరోవైపు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతుల వెతలు వర్ణనాతీతం. మిర్చి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వైపు మళ్లిన రైతులకు ఈ ఏడాది చిక్కులు తప్పడం లేదు. దోచుచుంటున్న దళారులు... పల్నాడు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు పైగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేయడంతో ఏ రైతు వద్ద చూసినా మొక్కజొన్న బస్తాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. మొక్కజొన్నకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందన్న సాకుతో ధరలను అమాంతరం తగ్గించేశారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు కేవలం రూ.1,700కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాకుండా నష్టపోతున్నారు. ఈ చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విత్తన కంపెనీలు ఒప్పందం చేసుకున్న మొక్కజొన్న రైతులకు క్వింటా మొక్కజొన్నకు రూ.3 వేలకు పైగా దక్కుతోంది. అయితే కొందరు రైతులు డిమాండ్కు మించి సాగు చేయడంతో మొత్తం పంటను కొనుగోలు చేయమంటూ రైతులతో కంపెనీల ప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. ఎంఎన్సీ కంపెనీలు కాకుండా స్థానికంగా కొన్ని కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన విత్తనాలు సరిపడా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు, మేళవాగు, గరికపాడు, లింగంగుంట్ల తండా గ్రామాలకు చెందిన రైతులు నకిలీ విత్తనాలతో ఇబ్బందిపడి పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కారు. వారితో సదరు కంపెనీ ప్రతినిధులు మాట్లాడి నష్టపరిహారంపై చర్చించినట్టు సమాచారం. తక్కవ పెట్టుబడి, చీడపీడల బాధ తక్కువగా ఉంటుందని ఇప్పుడిప్పుడే మొక్కజొన్న పంట వైపు వెళుతున్న రైతుల శ్రేయస్సును ప్రభుత్వం పట్టించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న ఎకరం సాగు చేయడానికి సుమారు రూ.40 వేలు ఖర్చు అవుతోంది. కౌలు రైతుకై తే మరో రూ.10 వేలు అదనం. గతేడాది ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది కొందరు రైతులు నకిలీ విత్తనాల బారిన పడటం, ప్రభుత్వం కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా చేయకపోవడంతో పంట దిగుబడి భారీగా పడిపోయింది. కొందరు రైతులు ఏకంగా ఎకరానికి 10 క్వింటాళ్ల మొక్కజొన్న మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు పండిన అరకొర పంటనైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400కు అమ్ముదామంటే అది కుదరడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి ఉంటే రైతులకు మద్దతు ధర దక్కేది. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
వైభవంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అరండల్పేటలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం 31వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకంగా కనకాంబరాలు, మల్లెలు, తులసి మాలలతో కల్యాణమూర్తులను అలంకరించారు. విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్యభారతి స్వామి పుష్పాభిషేకం నిర్వహించి, ప్రత్యేక హారతులతో కల్యాణమూర్తులను సేవించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో చంద్రగ్రహణానంతరం బుధవారం అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం జలాలతో అమరేశ్వరునికి అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మ వారికి, ఉపాలయాలలో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పించారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి అనంతరం హుండీల లెక్కింపును దేవదాయశాఖ ప్రత్యేక అధికారి దాసరి చంద్రశేఖర్ సమక్షంలో దేవాలయంలో ఉన్న 10 హుండీలతో పాటు తాత్కాలిక హూండీలను తెరచి భక్తులచే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లాడుతూ హుండీల ఆదాయం మొత్తం రూ.41,42,621వచ్చినట్లు తెలిపారు. మంగళగిరి టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. బుధవారం రాత్రి స్వామి వారికి ధ్వజారోహణం, కేళిగుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం జరిగిన స్వామివారి చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకొంటూ పురవీధుల్లో విహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
ఉపాధికి కొత్త రూపు
సత్తెనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ గా(వీబీజీరీమ్జీ) మార్చి కొత్త చట్టం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరం దేశ వ్యాప్తంగా నూతన ఉపాధి హమీ చట్టం అమల్లోకి వచ్చింది. వేతనదారుల హాజరు నమోదుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ఎంఎంఎస్ యాప్ను తీసుకొచ్చారు. ఈ విధానం వచ్చిన తర్వాత పనులకు హాజరవుతున్న వేతనదారులకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తప్పనిసరిగా ఫొటో మస్టర్(ఫేషియల్ అటెండెన్న్స్) వేయాలి. ఈ విధానం వేతనదారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా 12,499 మంది కూలీల డిమాండ్ ఉండగా 7,604 మంది మాత్రమే మస్టర్లు నమోదయ్యాయి. ఉదయం పనులు ముగిసిన తరువాత మండుటెండలో ఫొటో మస్టర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి పలు గ్రామాల్లో నెలకొంది. ఎన్ఎంఎంఎస్ యాప్కు సంబంధించిన సర్వర్లో సాంకేతిక సమస్యల వల్ల గడిచిన రెండు రోజుల్లో సగం కట్టే తక్కువ మంది వేతన దారులు హాజరు నమోదు అవుతుంది. దీంతో వేతన దారులు తమకు వేతనం వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఏడాదికి 125 రోజులు పని దినాలు... ఈ పథకం కింద కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కేటాయించారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. రోజువారీగా రూ. 311 వేతనం సైతం అందించనున్నారు. గతంలో పని అడిగితే వచ్చే విధానం ఉండేది. ప్రస్తుతం నూతన చట్టంలో గ్రామపంచాయతీలో కూలీలను బట్టి బడ్జెట్ కేటాయించనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులు చేశారు. మౌలిక వసతులపై ఫిర్యాదులు... ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతంలో కూలీలకు కనీస మౌలిక వసతులు లేకుంటే నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. పనుల వద్ద తాగునీరు, పనిముట్లు, మెడికల్ కిట్లు వంద శాతం ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇవి లేకుంటే కూలీలు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వ్యవసాయ పనులు ఉండే సీజన్లో 60 రోజులపాటు పనులకు విరామం ప్రకటించే విధంగా చట్టాన్ని రూపొందించారు. వీబీ జీరామ్జీ చట్టంలో సమూల మార్పులు చేపట్టారు. నూతన సాంకేతిక విధానంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఇందుకోసం కూలీల బయోమెట్రిక్ జియో ట్యాగింగ్, రియల్ టైం డ్యాష్ బోర్డులతో సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్టర్లలకు కాలం చెల్లినట్టే. పనిచేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాకింగ్ చేస్తారు. అక్కడికి వెళ్లి కూలీలు బయోమెట్రిక్ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతోపాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరో మారు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేసింది. -
రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వార్డు సచివాలయంలో ఎమినిటీస్ సెక్రటరీ కె.శ్రీనివాస్పై మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం ఇటీవల నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడాన్ని నిరసిస్తూ సచివాలయాల ఉద్యోగులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం.. ఎన్ఆర్టీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు షేక్ మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ.. ఒకవైపు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారుల తీరులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. సభ్యసమాజం వినలేని విధంగా మున్సిపల్ డీఈఈ ఫోన్లో దూషణలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేళ్ల కాలంలో ఇప్పటికి వందమంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండెపోటుతో మృతిచెందారన్నారు. మున్సిపల్ డీఈఈ తీరు తరచూ ఇలాగే ఉంటోందని.. ఐదు నెలల కిందట మరో సచివాలయ ఉద్యోగిపట్ల కూడా ఆయన ఇలాగే వ్యవహరించారని షేక్ మొహమ్మద్ ఆలీ మండిపడ్డారు.మూడు నెలలుగా సర్వేల పేరుతో ఒత్తిడిఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మాలపాటి ప్రతాప్కుమార్ మాట్లాడుతూ.. బానిసలపట్ల కూడా ఇంత అవమానకరంగా ఎవరూ మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సర్వేల పేరుతో ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎందరో ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వోద్యోగం అంటే గౌరవంగా ఉంటుందని భావించి వచ్చామని.. కానీ, పై అధికారుల వేధింపులు, తిట్లు తట్టుకోలేకే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత డీఈఈపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన విషయం తెలుసుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అక్కడికొచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, తమ ఆందోళన విరమించేదిలేదని వారు స్పష్టంచేసి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబుకు వినతిపత్రం అందజేశారు. -
జంతు సంరక్షణ కోసమే హనుమాన్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకు నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -
8న టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి నరసరావుపేట ఈస్ట్: సతైనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్ లీగ్ పోటీల్లో భాగంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్, డబుల్స్, మిక్సడ్ డబుల్ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్సైట్ లో తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్టర్ కావాలని తెలిపారు. రిజిస్టర్ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. 9న కలెక్టరేట్ వద్ద ధర్నా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం తగదని, తక్షణమే సమస్యల పరిష్కారానికి రూట్మ్యాప్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్ 1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నరసింహారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్–1938 రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు వి.సూర్యం, సహాధ్యక్షులు ఓ.నాగార్జున, జిల్లా అదనపు కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జీఎస్ఎస్ ప్రసాద్, నగర నాయకులు వై.మనోజ్ కుమార్, ఎన్.మీనాక్షి, వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా -
ఇద్దరు మహిళలు అరెస్ట్
నరసరావుపేట టౌన్/నకరికల్లు: అక్రమంగా నాటుసారా కలిగి ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సోమయ్య మంగళవారం తెలిపారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. అక్కడ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్ల ధ్వంసం కేసులో నిందితుడికి రిమాండ్ మంగళగిరి టౌన్ : ఫిబ్రవరి 27వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి రెండు కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్కు పంపినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లు పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నీలాద్రికి 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. వన్ టౌన్ సర్కిల్ పరిధిలో బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న ఏడు బస్తాల(50 కిలోల చొప్పున) రేషన్బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. కూలీల ఆటో బోల్తా ఒకరు మృతి..నలుగురికి గాయాలు తాడికొండ: కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి దుగ్గిరాల కాల్వలోకి దూసుకెళ్ళడంతో పనులకు వెళుతున్న ముఠా మేసీ్త్ర మృతి చెందడంతో పాటు నలుగురికి గాయాలైన ఘటన తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల నుంచి కూలీ పనుల నిమిత్తం ఆటోలో మహిళలు తెల్లవారుజామున పెదపరిమి గ్రామానికి వస్తుండగా రోడ్డు మార్జిన్లో ఆటో జారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూలీలను తీసుకొని వెళుతున్న ముఠా మేసీ్త్ర వేమినేని వెంకటేశ్వరమ్మ(50) ఘటనా స్థలంలోనే మరణించగా డ్రైవర్తో సహా నలుగురికి గాయాలు కావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు. శివాలయం తలుపులు మూసివేత పెదకాకాని: చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం పెదకాకాని శివాలయం తలుపులు మూసివేశారు. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు అభిషేకాలు యతఆవిధిగా కొనసాగాయి. అనంతరం ఆలయ తలుపులకు తాళాలు వేశారు. బుధవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఉదయం 7 గంటల నుంఛఇ దర్శనం ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలకు అనుమతించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. ఆటోను ఢీకొట్టిన లారీ ఇంకొల్లు(చినగంజాం): ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఘటన ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు దుద్దుకూరు ఉత్తరపు పొలాల్లో శనగ కోసే పనులు పూర్తి చేసుకొని ఒకే ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారికి సమాంతరంగా వస్తున్న సిమెంట్ లోడు లారీ ఆటోను కుడివైపున బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో కుడివైపును కూర్చొన్న ఇరువురు దునిమిద్దుల తిమోతి (25), గుంటూరు గౌరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గాయాలపాలైన వారిలో తిమోతికి అతనికి ఎడమ వైపున మెడ వద్ద పుట్టుకతో వచ్చిన గడ్డ పగలడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు గౌరి కుడి కాలు, కుడి చేయి విరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జీ సురేష్ తెలిపారు. -
పోలీసుల సహకారంతోనే అంబటి ఇంటిపై దాడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : పోలీసుల సహకారంతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబుని మంగళవారం సాయంత్రం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాంబాబు నోటి వెంట అనుకోని మాట ఒకటి వచ్చిందని, తప్పుగా వచ్చిన పదాన్ని ఆసరా చేసుకుని దాదాపు ఏడెనిమిది గంటలకుపైగా విధ్వంసకాండ జరపడం దారుణమని అన్నారు. పొరపాటున నోరు జారిన మాటకు వెంటనే క్షమాపణ చెప్పారని తెలిపారు. అయినప్పటికీ అప్పటికప్పుడే ఫోన్ కాల్స్ చేసుకుని, విడతల వారీగా వచ్చేసి దాడి చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇంట్లోని మహిళలు, చిన్నారులను చూడకుండా ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని పోలీసులు నిలువరించకపోవడం దారుణమని అన్నారు. పోలీస్ వ్యవస్థ దాడులకు తెగబడిన వారిని ప్రోత్సహించడం ఎక్కడా చూడలేదన్నారు. గుంటూరు –2 ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త స్వయంగా వచ్చి దాడుల్లో పాల్గొనడం దారుణమని మండిపడ్డారు. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, రాష్ట్ర నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి -
పల్నాడు
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026అంగన్వాడీలపై ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 బాపట్ల 6.21 5.077సత్తెనపల్లి: అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై అరెస్టులా? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగటం అన్యాయమా? అని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్ నుంచి 29 మంది అంగన్వాడీలను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్కు మంగళవారం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆ 29 మంది అంగన్వాడీ మహిళల్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బ రావమ్మలు మీడియాతో మాట్లాడారు. ● సోమవారం విజయవాడ ధర్నాచౌక్లో మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీంతో అంగన్వాడీలు తమ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు. రాత్రి కూడా ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ మహిళలు అధిక సంఖ్యలో పట్టు వదలకుండా అక్కడే ఉండిపోయారన్నారు. అక్కడే నిద్రించారన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఐసీడీఎస్ జేడీ ధర్నా వద్దకు వచ్చి మీరు వెంటనే టెంట్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారన్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వచ్చి హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, పోరాటం విరమించేది లేదని తేల్చి చెప్పామన్నారు. ● ఆ రాత్రి అక్కడే అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు సుమారు 500 మంది పోలీసులు మూకుమ్మడిగా వచ్చి సైడ్ వాల్ క్లాత్తో నిద్రిస్తున్న తమను చుట్టుముట్టి దాడి చేశారన్నారు. కరెంటు తీసివేశారన్నారు. ఆ చీకట్లో అంగన్వాడీల బ్యాగులు ఎక్కడున్నాయో! కళ్లజోళ్లు ఎక్కడున్నాయో! సెల్ఫోన్లు ఎక్కడున్నాయో! చెప్ప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఈ దాడిలో తనకు ఎడమ చేయి విరిగిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి వాపోయారు. ఒక్కొక్కరిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లో ఎక్కించారన్నారు. ఎవరెవరిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని, 29 మంది అంగన్వాడీలతో ఉన్న మా వ్యాను ముందుగా గుంటూరు తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత నరసరావుపేట తీసుకువెళ్లి అక్కడి నుంచి సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చారన్నారు. టాయిటెట్స్కూ అనుమతించలేదు... సత్తెనపల్లి వచ్చే వరకు ఈ మధ్యలో టాయిలెట్స్కు వెళ్లాలన్నా పోలీసులు అనుమతించలేదన్నారు. మేం చేసిన తప్పేమిటి? అరకొర వేతనాలతో, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరామే తప్ప ఆస్తులు ఇవ్వాలని, పదవులు మాకు ఇవ్వాలని మేం కోరామా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పుడు రాతపూర్వకంగా ఇచ్చిన మినిట్స్ కాపీలో హామీలను అమలు చేయాలని కోరామని వారు తెలిపారు. పోలీసుల దాడిలో చెయ్యి విరిగి ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి మంత్ర ముగ్ధం చిలకలూరిపేట: విజయవాడ ధర్నా చౌక్లో తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లలో సుమారు 30 మంది వివిధ జిల్లాలకు చెందిన వారిని మంగళవారం చిలకలూరిపేట అర్బన్ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు, స్థానిక అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు వారికి సంఘీభావంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. కర్నూలు, తూర్పు గోదావరి, పోలవరం, కోనసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 30 మంది అంగన్వాడీలను విజయవాడ దీక్షా శిబిరంలో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. తెల్లవారుజామున మహిళలను అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు చిలకలూరిపేట పోలీస్స్టేషన్కు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకొనే అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.9,700, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది. మాచర్ల: రాధాకృష్ణ భక్త బృందం సభ్యులు మంగళవారం మాచర్లలో ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు. భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ పర్యటించారు. తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు అండర్పాస్ వద్ద మంగళవారం జేసీబీ అదుపుతప్పి డ్రైన్లో బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిద్రిస్తున్న అంగన్వాడీలపై తెల్లవారుజామున దాడులు అంగన్వాడీ వర్కర్స్ నాయకురాలిచెయ్యి విరగ్గొట్టిన విజయవాడ పోలీసులు మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఇది.. సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ అరెస్టు చేసి విజయవాడ ధర్నా చౌక్ నుంచి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు 29 మందిని తరలించిన పోలీసులు సత్తెనపల్లి పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు పోలీస్ స్టేషన్కు వచ్చి అంగన్వాడీలను విడుదల చేస్తున్నామని, ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అంగన్వాడీలు తమను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడకు విజయవాడ తీసుకువెళ్లి వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి సీఐ నాగమల్లేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తాలూకా సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. -
నృసింహుని ఆలయం ద్వారబంధనం
మంగళగిరి టౌన్ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం తలుపులకు మంగళవారం ద్వారబంధనం చేశారు. ఎగువ, దిగువ, ఉపాలయాలను రథోత్సవం అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారి సునీల్కుమార్ ఆధ్వర్యంలో దేవస్థాన పురోహితులు తలుపులు మూసివేశారు. గ్రహణ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. నరసరావుపేట రూరల్: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని సిబ్బంది మూసివేశారు. శైవాగమ ప్రకారం సంప్రోక్షణ కార్యక్రామాన్ని నిర్వహించిన అనంతరం బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి
యూటీఎఫ్ పిలుపు గుంటూరు ఎడ్యుకేషన్ : రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అడ్మిషన్ క్యాంపెయిన్ చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యావర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నాయకులతో కలసి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవింద్, టి.ఆంజనేయులు, కె.రంగారావు, బి.ప్రసాదు, కె.కేదార్నాథ్, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. టెట్ విధానం రాకముందు ఎంపికై న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. టెట్ నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు ఛలో ఢిల్లీ వాల్పోస్టర్ను మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు కృష్ణారావు, ఇబ్రహీం, దమ్మాటి శ్రీనివాసరావు, ప్రజామూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల చేయాలి
చిలకలూరిపేట: మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు విడుదల చేయడంలో జాప్యం చేయడాన్ని ఎస్టీయూ తీవ్రంగా విమర్శిస్తుందని వెల్లడించారు. 13 వేల మంది ఉపాధ్యాయులు 59 అర్బన్ లోకల్ బాడిలలో పనిచేస్తున్నారని చెప్పారు. వీరిని 2022లో విద్యాశాఖలో విలీనం చేసినా నేటికీ సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టు లేని కారణంగా పదోన్నతులు, బదిలీల సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వి అక్కయ్య, షేక్ జమీర్బాష, ఎం కోటేశ్వరరావు, వి జయప్రకాశ్, కాలేషా పాల్గొన్నారు. -
కంచరగుంట రైతుల కన్నెర్ర
దుర్గి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో రైతుల కళ్ల ముందే పంటలు ఎండిపోవటంతో ఆందోళన చెందిన రైతులు సబ్స్టేషన్ ముట్టిడించి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన మండల పరిధిలోని కంచరగుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే కోలగోట్ల సబ్స్టేషన్ పరిధిలోని కంచరగుంట గ్రామంలో రైతాంగం మిర్చి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో రైతులు బోరు బావుల మీద ఆధారపడ్డారు. నెల రోజుల్లో పంట చేతికి వస్తున్న దశలో గత 15 రోజులుగా అరకొర విద్యుత్ సరఫరా అవుతోంది. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆందోళన చెందిన రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించి ధర్నా నిర్వహించారు. దుర్గి, ముటుకూరు ప్రధాన రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి సమస్యను స్థానిక విద్యుత్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. తమకు పగటిపూట తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ అందజేయాలని కోరినా ఆలకించలేదన్నారు. రాత్రిపూట మూడు గంటలు, పగటి పూట రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల క్రితం మొంథా తుపానుతో కొంత పంట దెబ్బతిని అప్పుల పాలమయ్యామని రైతులు చెప్పారు. ఇప్పుడు ఉన్న పంటను కూడా కాపాడుకోలేకపోతే తమకు ఆత్మహత్యలు శరణ్యమని వారు తెలిపారు. ధర్నా కారణంగా భారీగా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ఎల్. సుధీర్బాబు తమ సిబ్బందితో ఘటనా స్ధలానికి చేరుకొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను 24గంటల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో గామానికి చెందిన రైతులు, కూలీలు, మహిళలు పాల్గొన్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయం చుట్టూ రైతులు తమ పశుసంపదను ప్రదక్షణలు చేయించారు. భక్తులు పొంగళ్లు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. వీరబ్రహ్మేద్రస్వామి వారి భజన కార్యక్రమాలు చేశారు. రాత్రికి గ్రామస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు బండి మల్లేశం నిర్వహించారు. పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. పెదపులివర్రు(భట్టిప్రోలు): శ్రీ భూ–నీళా సమేత శ్రీ వరద రాజ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామి వార్లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, బలిహరణ జరిగింది. రాత్రి మూజు వాణి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కార్యక్రమంలో భాగంగా దివ్య రథోత్సవం జరిగింది. తెనాలి: స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు, ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. గత రెండురోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపుగౌరి అలంకారంతో నగర సంచారం జరిగింది. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాలపొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పించి, పసుపు గౌరీ దర్శనం చేసుకున్నారు కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారీ జరిపారు. అనంతరం నృత్యప్రదర్శనలు జరిగాయి. గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు దాదాపు ఐదు వేల మందికిపైగా పాల్గొని ప్రతిష్ఠామహోత్సవ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారి నుంచి 163 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 24 అర్జీలు స్వీకరించారు. నరసరావుపేట 15, గురజాల 5, సత్తెనపల్లి డివిజన్ నుంచి 4 అర్జీలు అందుకున్నారు. కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ శిబిరాన్ని సందర్శించి కొందరు అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు అర్జీలు అందజేసేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించారు. సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ నారదముని, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గోవుల అక్రమ రవాణా అడ్డగింత
యడ్లపాడు: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు సోమవారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్న్కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, యడ్లపాడు మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ నేతృత్వం వహించగా, వంకాయలపాటి వంశీధర్, వి. నాగేశ్వరరావు, పి. మహేష్, బందెల శ్రీనివాసరావు, నక్క శ్రీనివాసరావు, నేలటూరి ఏసురత్నం, షేక్ సుభాని, తోట చందు, శ్రీరామ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు. -
అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
సత్తెనపల్లి: అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మల్లెల రాజు (37) ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాజుకు భార్య శ్రీనిధి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఫిట్స్ వస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ. 5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాక కుమారుడికి కూడా నిత్యం జ్వరం వస్తుండడంతో కొంత అప్పులు అయ్యాయి. వీటికి తోడు బ్యాంకులో గృహ నిర్మాణ లోన్ రూ. 10 లక్షలు తీసుకోవడంతో ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో రెండు ఈఎంఐలు పెండింగ్లో ఉండడంతో ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఆత్మహత్య శరణ్యమంటూ భావించాడు. గత నెల 27న ఊరి చివర పురుగుల మందు సేవించి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో భార్య ప్రశ్నించింది. దీంతో అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదని, దీనికి తోడు కుమార్తె, కుమారుడు అనారోగ్యం అర్ధంకాక గడ్డి మందు సేవించానని భార్య శ్రీనిధికి చెప్పి విలపించాడు. ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య శ్రీనిధి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా స్వామి వారి రథోత్సవం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్న్స్లోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిత్యపూజలు, వేంకటేశ్వర సహస్రనామ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందం చేపట్టారు. సుమారు 400 మందికిపైగా సువాసినులతో విష్ణుసహస్ర నామపారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, లక్ష్మీ అష్టతోత్తర పారాయణం చేయించి పుష్పాలతో సత్కరించారు. భక్తులకు అన్నసంతర్పణ చేయగా, సువాసినులకు చీరల పంపిణి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆధ్యాత్మిక సభలో భాగంగా విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు (హంపి) విద్యారణ్య భారతిస్వామి, శృంగేరి విరూపాక్ష పీఠం నుంచి పరమశివానంద భారతీస్వామి, మాత శివచైతన్యానంద స్వామి (తపోవనం నులకపేట) నిర్వికల్పానందస్వామిలు అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డి.ఎన్.దీక్షితులు, ముప్పవరపు సింహాచలశాస్త్రి ఉపన్యాసించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె.జి.శంకర్, పూర్వ ఆచార్యులు డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంక విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు. -
8న ఉమెన్ పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గోరంటల్లోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా పికిల్ బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కె.అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను స్కూల్ ఆవరణలో వైజయంతి డెంటల్ కేర్ అధినేత డాక్టర్ వైజయంతి, శశిధర్, నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కె.శ్రీకాంత్ బాబు, కె.శ్రీవిద్య, జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్లు ఆవిష్కరించారన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో అండర్–15 బాలికలు, ఓపెన్ కేటగిరి, సింగిల్స్, ఓపెన్ డబుల్ ఈవెంట్లు జరుగుతాయన్నారు. ఎస్కే మన్సూర్ వలి, ఆనంద్ కుమార్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జి.జె.కిషోర్ పాల్గొన్నారన్నారు. -
నిదానంపాటి అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు
దుర్గి: అడిగొప్పల నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ. 21,17,900ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె ఆదిశేషనాయుడు తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లిఖార్జునరావు, దేవదాయశాఖ సత్తెనపల్లి ఇన్స్పెక్టర్, భక్తులు సమక్షంలో 47 రోజుల పాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్లటౌన్: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో మహిళా పోలీస్ కర్రి లక్ష్మి ప్రసన్న 2025 అక్టోబర్ 29న స్కూటీపై పోతనకట్టవారిపాలెం వెళ్తుండగా దుండగులు మెడలోని చైన్ లాక్కెళ్ళారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు నిర్వహించగా గుంటూరు జిల్లా నల్లపాడులోని చల్లావారిపాలెం గ్రామానికి చెందిన పట్నాల వెంకట దుర్గాప్రభు అలియాస్ అఖిల్, గుంటూరులోని శారద కాలనీకు చెందిన షేక్ రాజాలను గుర్తించి అదుపులోకి విచారించామన్నారు. విలాసాల కోసమే నేరాలు .. నిందితుడు అఖిల్ ఎంబీఏ పూర్తిచేసి గుంటూరు పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజాతో కలిసి మహిళలనే టార్గెట్ చేసుకొని మెడలో గొలుసులు దొంగలించారు. వీరి నుంచి మొత్తం 129.57 గ్రాముల బంగారం వస్తువులును, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్ స్నాచర్లను పట్టుకొనడంలో ప్రతిభ చూపించిన బాపట్ల డీఎస్పీ పి.జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్ సీఐ పి.ప్రేమయ్య, ఎస్.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్.ఐ ఎస్.రవీంద్ర, కానిస్టేబుల్ వి.శివ శంకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ లు యు.రాజేష్, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం.రమేష్ లను అభినందించి, నగదు బహుమతి అందించారు. -
వన్స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్
నరసరావుపేట: ఆపదలో ఉన్న మహిళలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్శక్తి వన్స్టాప్ సెంటర్కు సంబంధించిన అత్యవసర వాహనాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆ వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు ఈ వాహనం ద్వారా వైద్యశాలకు, సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సేవల కోసం టోల్ఫ్రీ నంబరు 181, 1098 సంప్రదించాలని కోరారు. మహిళాభివృద్ధిశాఖ పీడీ ఉమాదేవి, మిషన్శక్తి కో–ఆర్డినేటర్, వన్స్టాఫ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ, దిగువ సన్నిధితో పాటు ఉపాలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నామని, తిరిగి బుధవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
చెవి కెక్కించుకోండి..!
సత్తెనపల్లి: స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. వినికిడి సమస్య బాధితులు పెరుగుతున్నారు. బ్లూటూత్ హెడ్ సెట్ వినియోగించడం తదితర కారణాలతో వినికిడి సమస్య ఏర్పడి అవస్థలు పడుతున్నారు. వినికిడి సమస్యను అధిగమించేందుకు ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో వినికిడి సమస్యతో బాధపడు తున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. వినికిడి పరీక్ష ఇలా చేయించుకోవాలి వినికిడి సమస్యకు కారణాలు.. చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వచ్చినప్పుడు చెవి బ్లాక్ అవుతుంది. ఒక్కోసారి వినికిడి సమస్య రావచ్చు. చెవి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వినికిడి లోపాలకు దారి తీసే ప్రమాదం ఉంది. సమస్యను గుర్తించినప్పుడు జాప్యం చేయకుండా ఈఎన్టీ వైద్యులను సంప్రదిస్తే చికిత్స చేస్తారు. పెద్దలలో నరాల బలహీనత వల్ల వినికిడి సమస్య వస్తుంది. వీరికి ఆడియో మెట్రి పరీక్షలు చేసి మందులు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ మాధురి, ఈఎన్టీ వైద్యురాలు, సత్తెనపల్లి -
బాణసంచా గోదాములపై మెరుపు దాడులు
చిలకలూరిపేటటౌన్: ఇటీవల సామర్లకోట వేట్లపాలెంలో జరిగిన బాణసంచా దుకాణాల్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి చిలకలూరిపేట పరిధిలోని బొప్పూడి, చినపసుమర్రు ప్రాంతాల్లోని పలు బాణసంచా హోల్సేల్ దుకాణాలు, గోదాములపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పల్నాడు ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు నేతృత్వంలో సుమారు 8 దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.2లక్షల విలువైన బాణసంచా నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉండగా, మెజారిటీ గోదాముల్లో అంతకు మించి భారీగా నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించామన్నారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం ఆయా దుకాణాలకు తాళాలు వేశారు. వీటికి సంబంధించిన మిగిలిన శాఖల జిల్లా అధికారులు, బాణసంచాకు సంబంధించిన నిపుణులను తీసుకువచ్చి నిల్వలను లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ట్రైనీ డీఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా బాణసంచా దుకాణాలు పరిశీలించామని, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతికి మించి అక్రమంగా నిల్వలు ఉంచితే వాటిని వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీఓల సమక్షంలో సమగ్ర తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిల్వలు ఉంచనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అర్బన్ సీఐ పి.రమేష్, రూరల్ ఎస్ఐ జి.అనిల్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తమ మహిళా పురస్కార గ్రహీత మంజు సెబాస్టియన్
గుంటూరు ఎడ్యుకేషన్: వైజాగ్లో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా గుంటూరుకు చెందిన మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైజాగ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.మంగాకుమారి, వైజాగ్ ఆర్జేడీ విజయకుమార్ సమక్షంలో మంజు సెబాస్టియన్ను పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
చిలకలూరిపేట: పిచ్చికుక్క పట్టణంలో స్వైర విహారం చేసింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెదనందిపాడు రోడ్డులో ప్రారంభించి పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వరకు ఎదురుపడ్డ వారిపై దాడికి పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టించింది. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఒక్క చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చికిత్స చేయించుకున్న వారు 11 మంది ఉన్నారు. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు సమాచారం. సుమారు 15 మంది బాధితులు ఉండవచ్చని తెలుస్తోంది. వీరు కాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మరో ఐదుగురు వీధి కుక్కల దాడికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఒక్క సోమవారం నాడే ప్రభుత్వ వైద్యశాలలో కుక్కకాటుకు గురై చికిత్స పొందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇటీవల ‘సాక్షి’లో ‘కనిపిస్తే... కరిచేస్తాయి’ శీర్షికన ఈ సమస్యపై కథనం కూడా ప్రచురితమైంది. మున్సిపల్ సమావేశాల్లో కుక్కల స్వైర విహారంపై పలువురు కౌన్సిలర్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నియంత్రణ చర్యలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని వెంటాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇరువురు మున్సిపల్ కౌన్సిలర్లు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కల దాడికి గురై ఆసుపత్రి పాలైన సంఘటన దుస్థితికి అద్దంపట్టింది. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
వాడరేవులో కార్డన్ సెర్చ్
చీరాల: ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని వాడరేవులో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాడరేవులోని వైఎస్సార్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటుసారా ప్రభావం ఉండేదని, ఈ క్రమంలో పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల మెడపై కత్తి
గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కాలాన్ని హరించి వేస్తున్న యాప్లతోపాటు ఉన్నతాధికారుల నుంచి అర్జెంట్ పేరుతో అడిగిందే తడవుగా సమాచారాన్ని పంపాలంటూ పెడుతున్న ఒత్తిడిని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భరించలేకపోతున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందేనంటూ చేస్తున్న హెచ్చరికలతో రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి, ఏ విధంగా మాట్లాడుతారో, క్రమశిక్షణా చర్యల పేరుతో ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారో అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు రాసేది విద్యార్థులు అయితే అంతకు పదింతలు తీవ్ర ఒత్తిడితో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అధికారంలోకి వస్తే జీవితాలను మార్చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, పదింతలు పని ఒత్తిడితో ఉపాధ్యాయుల మెడపై కత్తి పెట్టింది. ఉపాధ్యాయ సంఘాల పరామర్శ డీఈవో హెచ్చరికలతో ఆస్పత్రి పాలైన హెచ్ఎం శ్రీనివాసరావును పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. అధికారులు వ్యహరిస్తున్న తీరు సరికాదని, పరీక్షల పేరుతో తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడంతోపాటు పాఠశాలల సందర్శన సమయంలో వ్యక్తిగతంగా దూషించడం మానుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల ముందే తిట్టడం, అరవడం వంటి సంఘటనలపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనకు దిగిన విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సంఘాల నాయకులు చెబుతున్నారు. గుంటూరు కేవీపీ కాలనీలోని కేఎస్సార్టీ నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాసరావు శనివారం గుండెపోటుతో లలితా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయన గత గురువారం వ్యక్తిగత పనులపై అధికారికంగా సెలవు పెట్టారు. అదేరోజు పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు ?. అయితే ఆయన సెలవు పెట్టారని చెప్పినప్పటికీ, పాఠశాలకు రావాలంటూ హడావుడిగా ఫోన్ చేసి పిలిపించారు. డీఈఓ పిలిచారని తెలియడంతో సదరు హెచ్ఎం శ్రీనివాసరావు పాఠశాలకు హడావుడిగా వచ్చారు. హెచ్ఎం వచ్చిన సమయానికి డీఈఓ సలీమ్ బాషా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తరగతి గదిలోకి వచ్చిన హెచ్ఎంపై విద్యార్థుల ఎదుటే అకారణంగా సీరియస్ అవడంతోపాటు వెళ్లి ఆఫీస్ రూమ్లో వేచి ఉండాలని డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ రూమ్కు వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా సెలవులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈఓ ఏకవచనంతో మాట్లాడటంతో సంబంధిత హెచ్ఎం తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఎదుట ఏకవచనంతో సంబోధించడంతోపాటు అధికారికంగా లీవ్ యాప్లో సెలవు నమోదు చేసినా, వ్యక్తిగత పనులపై ఉన్న హెచ్ఎంను పాఠశాలకు పిలిపించిన సంఘటన ఆయనలో తీవ్ర ఆవేదన కలిగించింది. అదే రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన హెచ్ఎం శ్రీనివాసరావు జరిగిన సంఘటనపై తీవ్రంగా కలత చెందారు. మనోవేదనతో గుండెపోటకు గురి కావడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెచ్ఎంను పరీక్షించిన వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. -
అశ్లీల ఓటీటీలను నిషేధించిన కేంద్రం
తెనాలిటౌన్: అసభ్యకర, అశ్లీల కంటెంటులను ప్రదర్శిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లు ఇకపై భారతదేశంలో కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించినదని మా– ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వీటికి సంబంధించిన 57 సోషల్ మీడియా ఖాతాలు, 10 యాప్లు, 19 వెబ్సైట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందన్నారు. స్థానిక మా–ఏపీ కార్యాలయంలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో 13 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఉంకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శృంగార కంటెంటులను 16 ఏళ్ళ లోపు పిల్లలకు దూరంగా ఉంచేలా చట్టం చేయవలసిందిగా ప్రభు త్వానికి ఆయన సూచించారు. ఇక రోగుల ప్రాణాలతో సోషల్ మీడియ చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఒకరు తినగూడదని చెపితే మరొకరు తినొచ్చు అని వీడియోలు పెట్టడం వలన ప్రజలు లేని రోగాలను తెచ్చుకుంటున్నారని దిలీప్ రాజా వాపోయారు. శాశ్వత నివారణ లేని వ్యాధుల ను సైతం తగ్గిస్తామని వైద్యశాస్త్రం చదవని వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పటం వలన ప్రజలకు ఎంత ప్రాణాంతకమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేశారు. సమావేశంలో పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. మా – ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన గురజాల పోలీసులు
●నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు.. ●విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు సాక్షి నరసరావుపేట: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గురజాల పోలీసులు బేఖాతరు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన ఒక పార్టీ నాయకుడిపై కొంతమంది దాడి చేసిన సంఘటనలో గురజాల పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వారిని పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు హాజరుపరిచారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు రోడ్డుపై నడిపించకూడదనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గురజాల పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు రాజకీయ ప్రముఖులువారి ఆభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. -
ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించిన చైతన్య
గుంటూరు మెడికల్: పెళ్లీడుకొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కళ్లెదుటే చనిపోయాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డ ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే అకాల మృత్యువుకు లోనయ్యాడు. యువకుడైన బిడ్డ చనిపోయి గుండెలు పిండేసే బాధలో ఉన్న తల్లిదండ్రులు తమ బాధను దిగమింగుకుంటూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి నూతన జీవితాలను ప్రసాదించేందుకు అవయవ దానం చేశారు. తల్లిదండ్రుల గొప్ప నిర్ణయంతో ఓ యువకుడి అవయవాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆదివారం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో జరిగిన మహత్కర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నల్లపనేని వెంకటశివ, ఆదిలక్ష్మిల దంపతుల కొడుకు చైతన్య (25) శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 27న ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో తాటపూడి గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చైత్యన్య మెదడుకు తీవ్ర గాయాలు అవ్వటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో చికిత్స కోసం చేర్పించారు. చైతన్యకు ఆసుపత్రిలో వైద్యుల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయేసరికి 28న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ జీవన్దాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు కొడాలి అనూష, చింతమనేని అఖిలేష్లు చైతన్య తల్లిదండ్రులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. దీంతో యవకుడి తల్లిదండ్రులు బిడ్డను పొగొట్టుకున్న బాధలో ఉండి కూడా తమ బిడ్డ అవయవాలు వేరొకరికి నూతన జీవితాన్ని ఇస్తాయని తెలుసుకుని ముందుకొచ్చి అవయవదానం చేశారు. తల్లిదండ్రుల పెద్దమనస్సు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు హాస్పటల్లో చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయస్సులోనే రోడ్డు ప్రమాదంలో చైతన్య చనిపోవటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పెంచి పెద్దచేసిన బిడ్డను కోల్పోయిన బాధలో ఉండి కూడా వెంకటశివ, ఆదిలక్ష్మి దంపతులు అవయవదానం చేయటం చాలా మంచి పని అని, వారి మంచి మనసుకు అభినందనలు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు చైతన్య కుటుంబ సభ్యులను అభినందించి, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. చైతన్య అవయవదానంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో తీవ్ర అనారోగ్యంలో ప్రాణాపాయస్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఇరువురు బాధితులకు ఆస్పత్రి వైద్య బృందం లివర్, కిడ్నీ అవయవాలు అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీని విజయవాడ, రెండు నేత్రాలు ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. -
వర్సిటీ మహిళా ఖోఖో జట్టులో కృష్ణవేణి విద్యార్థినులు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీ అంతర్ కళాశాలల మహిళా ఖోఖో టోర్నమెంట్లో తమ కళాశాల చాంపియన్గా నిలవటంతోపాటు తమ విద్యార్థినిలు ఎం.శిరీష, ఎం.హేమలత, బి.అలేఖ్య, మడకా చౌడేశ్వరి, కె.అనుషాబాయిలు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారిణిలు త్వరలో కర్నాటక రాష్ట్రం దావణగేరిలో జరగనున్న సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా ఖోఖో టోర్నమెంట్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ప్రిన్సిపల్ ఎంఆర్కె సతీష్బాబు, తిరుపతయ్య, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, కోచ్లు సయ్యద్ మహమ్మద్, షేక్ షకీలా, అధ్యాపకులు అభినందించారు. విక్టరీ కళాశాల విద్యార్థినులు... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు విక్టరీ కళాశాల చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. వర్సిటీ అంతర్ కళాశాలల టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు రన్నర్స్గా నిలవటంతో పాటు జట్టులోని శ్రీలక్ష్మీ, కృష్ణవేణి, తిరుపతమ్మలు వర్సీటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థినిలను కళాశాల కార్యదర్శి ఒద్దుల సుబ్బారెడ్డి, చైర్మన్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్, పీడీ శ్యాంసన్, అధ్యాపకులు అభినందించారు. -
ఢిల్లీని ఫిదా చేసిన గుంటూరు ఆతిథ్యం
● ‘వేదిక’అంకితభావానికి దక్కిన అభినందన ●నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రశంసలుయడ్లపాడు: తెలుగు నాటక రంగానికి.. గుంటూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అసాధారణ విజయాన్ని సాధించింది. గుంటూరులో 25వ భారత్రంగ్ మహోత్సవ్–2026 అంతర్జాతీయ నాటకోత్సవం దిగ్విజయ నిర్వహణకు దేశ రాజధాని ఢిల్లీ ఫిదా అయింది. ఈ వేడుకల విజయవంతంపై న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఎన్ఎస్డీ డైరెక్టర్ చిత్తరంజన్ త్రిపాఠి ప్రత్యేక అభినందన పత్రాన్ని పంపించారు. ఆ విషయాలను ఆదివారం ముత్తవరపు మీడియాతో పంచుకున్నారు. కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర... గత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీవరకు గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన ఈ అంతర్జాతీయ నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక గొప్ప సాంస్కృతిక పండుగలా సాగాయని ఎన్.ఎస్.డి కొనియాడిందని సురేష్బాబు తెలిపారు. ముఖ్యంగా దేశ, విదేశీ కళాకారులకు కల్పించిన వసతులు, సాంకేతిక తోడ్పాటు ఉత్సవం నిర్వహణలో ప్రదర్శించిన క్రమశిక్షణ అద్భుతమని ప్రశంసించిందన్నారు. ఈ గౌరవం ‘వేదిక’ బృందం అంకితభావానికి, రెండు తెలుగు రాష్ట్రాల నాటక రంగ పెద్దలకు, గుంటూరు నగరవాసుల సహకారానికి దక్కిన ప్రతిఫలమన్నారు. దేశ, విదేశీ నాటక బృందాల మధ్య వేదిక ఒక వారధిగా నిలిచిందన్నారు. ఐదు రోజుల పాటు ఎక్కడా ఆటంకాలు లేకుండా పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో వేదిక కలిసి వేసిన ఈ తొలి అడుగును సుదీర్ఘ ప్రయాణంగా కొనసాగిస్తామని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. -
సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
లక్ష్మీపురం: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల సమస్యలను మానతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ అన్నారు. గుంటూరు పోస్టల్ డివిజన్లో ఆదివారం నేషనల్ యూనియన్ పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం జరిగింది. వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ 8వపే కమిషన్లో జీడీఎస్ ఉద్యోగులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఉన్న సేవల్లో కొన్ని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చెంది కొత్తవి రావాలని, ఇంకా వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు, పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ సర్కిల్ సెక్రెటరీ నవీన్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్, జీడీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ యోగేశ్వరరావు, సీనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ -
కల్పవృక్ష వాహనంపై నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతూ మాడ వీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి సునీల్కుమార్ పర్యవేక్షించగా, ఉత్సవ కైంకర్యపరులుగా తిరుపతికి చెందిన గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సమయంలో స్వామిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామి కృపకు పాత్రులు అవుతారని భక్తుల నమ్మకం. పొన్న వాహన కైంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేడు స్వామి వారి కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం అశ్వ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారని, రాత్రి ఎదురుకోలు ఉత్సవం కోలాహలంగా జరగనుందని పేర్కొన్నారు. కల్యాణ వేదికపై వేంచేసి దర్శనమిస్తారు. కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం వేదిక మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. -
ఎర్ర బుక్లు.. పసుపు బుక్లకు ఎవ్వరూ భయపడరు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్)/ నగరంపాలెం: నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్ర బుక్ పాలనకు.. పసుపు బుక్ పాలనకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే రోజులు పోయాయని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకర రావులు పరామర్శించారు. కొడాలి నాని మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై, కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని వదిలేశారని మండిపడ్డారు. కానీ అంబటి రాంబాబును 18 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని ధ్వజమెత్తారు. అంబటిని రెచ్చగొట్టినప్పుడు నోరు జారి ఒక మాట మాట్లాడారని, దానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కావాలనే టీడీపీ వారు ఇలా దాడి చేయించారని అన్నారు. జగన్తో పెట్టుకుంటే లోకేష్కే ప్రమాదం రెడ్బుక్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉందో లేదో మీకు త్వరలో తెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ బుక్లో వైఎస్ జగన్ పేరు రాస్తే లోకేష్కే ప్రమాదమని, వైఎస్ జగన్ ఏదైనా బుక్లో లోక్ష్ పేరు రాసినా లోకేష్కే ప్రమాదమని హెచ్చరించారు. సిగ్గు ఉంటే ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంపై పాలకులు దృష్టి సారించాలన్నారు. అరెస్టులతో మరింత పట్టుదల అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైఎస్సార్ సీపీలోని అన్ని స్థాయిల నాయకుల్లో మరింత పట్టుదల పెరిగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారనే ఇంగితజ్ఞానం లేకుండా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి ఇలా దాడులు చేస్తే వాళ్లకి మద్దతు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దుస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. 2014–19 మధ్య కాపు నాయకులు ముద్రగడ పద్మనాభంపై దాడి చేశారని, వారి కుటుంబ సభ్యుల్ని హింసించారని, ఇప్పుడు కాపు నాయకుడైన అంబటిపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం కొందరికి అలవాటుగా మారిపోయిందని స్పష్టం అవుతోందన్నారు. కక్ష సాధింపు మానుకోకుంటే ఇబ్బందులే ఎవరైనా కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపితే వారి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. కేసులు పెట్టినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళతామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోని ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు పలికారు. జై జగన్, జై అంబటి, కాపుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా అంబటి నివాసానికి తరలివచ్చారు. -
సచివాలయాల్లో నిత్య నరకం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాబ్చార్ట్ ప్రకారం ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి పనులు అప్పగించలేదు. ఆ తర్వాత నుంచి క్షణం తీరిక లేకుండా పనులు అప్పగించి తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా అది సచివాలయ ఉద్యోగులే చేయాలనే దుస్థితి నెలకొంది. నెహ్రూనగర్: ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే–2025, పీ–4 సర్వే (పేదరిక నిర్మూలన), అక్షరాంధ్ర, ఈకేవైసీ, పల్స్ సర్వే.. ఇలా ప్రతిదీ సచివాలయ ఉద్యోగుల నెత్తినే పడుతోంది. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి వెళ్లాల్సి వస్తోంది. వీటితోపాటు ట్యాప్ కనెక్షన్లు, బాత్రూమ్ ఫొటోలు తీయడం, ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు అప్పగిస్తున్నారు. వార్డు కార్యదర్శులకై తే సర్వేలతోపాటు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి, సమీక్షల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. రాజకీయ విమర్శలు అధికార కూటమి నేతలు సచివాలయాలను ’దరిద్రాలయాలు’ అని, ఉద్యోగులను ‘ఎందుకూ పనికిరారు’ అని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీరా చూస్తే ప్రభుత్వ ప్రచారాలకు, ప్రతి నెలా సర్వేలకు సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వాడుకుంటోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని పేర్లు మార్చి ఉద్యోగుల విధులను మాత్రం అస్తవ్యస్తం చేసింది. జిల్లాలో 568 సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేరువ చేసే ఉద్దేశంతో 2019 ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 543 రకాల ఈ– సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 568 సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 5,563 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అగమ్యగోచరం గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. సంబంధం లేని పనులన్నీ సచివాలయ సిబ్బంది నెత్తిన రుద్దుతుండటంతో పనిభారంతో వారు అల్లాడిపోతున్నారు. ఒక వైపు గతంలో వలంటీర్లు చేసిన పనులు, మరో వైపు రోజుకో కొత్త సర్వేతో సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మార్చుకోవాలని కోరారు. సర్వీసుపరంగా ఏడో ఏట అడుగుపెడుతున్నా సచివాలయ ఉద్యోగులకు నేటికీ ఎలాంటి పదోన్నతులు లేవు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేరలేదు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనులు పురమాయిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలు దాటిన తర్వాత కూడా డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు గంటల తరబడి మీటింగులు పెడుతుండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా వీరికి మాత్రమే బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడం గమనార్హం. రాష్ట్రంలో 75 శాఖలు ఉండగా, అత్యధికంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష్యాలు చేరుకోలేక, అధికారుల చీవాట్లు పడలేక కొందరు రాజీనామా చేస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ట్విట్టర్ క్యాంపెయిన్ ప్రకారం.. ఒత్తిడి తట్టుకోలేక సుమారు 40 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఒక సమయంలో ఒకే పని ఇవ్వాలని, సీనియారిటీ జాబితా రూపొందించి ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
న్యాయ విచారణ చేపట్టాలి
గడిచిన మూడు నెలల్లో సుమారు 40 మందికిపైగా సచివాలయ ఉద్యోగులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్ల వయస్సు గలవారే. ఈ మరణాలకు కారణం తీవ్రమైన పని ఒత్తిడే. సచివాలయ శాఖలో సుమారు 15 వేల మందికిపైగా ఉద్యోగులు వివిధ శాఖలకు, అధికారుల వద్ద డెప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వీరందరి భారం మిగిలిన వారిపైనే పడి వారు తీవ్రమైన పని ఒత్తిడితో మరణిస్తున్నారు. సర్వేలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతోపాటు సచివాలయ ఉద్యోగుల మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం -
నీటి ఎద్దడిపై మీనవేషాలు
పల్నాడుఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026క్షమాగుణం కురిసే శుభదినాలు ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. నరసరావుపేట ఈస్ట్: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. 7 -
వైభవంగా నృసింహుని హంస వాహనోత్సవం
మంగళగిరి టౌన్: మంగళాద్రితో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారు శనివారం ఉదయం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి రంగురంగు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం దేవస్థానం వద్దనుంచి ప్రారంభమై సాధుసోడా సెంటర్, పూలమార్కెట్ సెంటర్మీదుగా మిద్దెసెంటర్ వరకు సాగింది. ఈ ఉత్సవంలో మహిళలు కోలాటం చేస్తూ స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రి గజవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వగా అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా, హంసవాహన సేవా కై ంకర్యపరులుగా వేదాంత గోపాలసత్యవతి, వేణుగోపాల వాసుదేవ భట్టర్, అరుణ ప్రియలు వ్యవహరించగా, గజవాహన సేవా కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీపద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. రాత్రి గజవాహనంపై విహరించిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించనున్నారు. రాత్రి పొన్నవాహనం ఉత్సవం జరుగుతుందని ఆలయ ఈవో సునీల్కుమార్ తెలిపారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి
అమరావతి: తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణ విధానాలపై రైతులకున్న సందేహాలకు సహేతుకమైన విధానంలో వివరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగాపురం, ధరణికోట గ్రామాలలో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రైతు సంఘాలతో ప్రభుత్వం అవగాహన కార్యక్రమం నిర్వహించి స్పష్టమైన విధానాన్ని తెలియపరచాలన్నారు. ఆయా గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారన్నారు. ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం స్పష్టంగా ప్రకటించలేదని, భూములు కోల్పోతున్న రైతుల పేర్లు, సర్వే నెంబర్లు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. తమ భూమి ఎంతపోతుందో అని ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో ఆరు నెలలు కిందట అధికారులు వచ్చి మాట్లాడటమే తప్ప మళ్లీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. ధరణికోట, లింగాపురం గ్రామాల్లో రైతులతో అభిప్రాయ సేకరణ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, వెంకటేశ్వరరాజు, రైతు సంఘం నాయకుడు దర్శి శేషారావు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, మొహద్దీన్ వలి పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య -
అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామిని శనివారం ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ను దేవా లయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వర స్వామి, ,బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్కు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. వైద్య కళాశాలకు ‘భాష్యం’ రూ. 4.50 లక్షల విరాళం గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కళాశాలకు రూ.4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం సంబంఽధిత మొత్తాన్ని చెక్కు రూపంలో భాష్యం రామకృష్ణ కుమార్తె భాష్యం జనని, భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ బి.హరిబాబు చేతుల మీదుగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారికి అందజేశారు. గతేడాది సైతం ఇదే ఇదే విధంగా ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్కు ఐదు శీతలీకరణ యంత్రాలను అందజేసినట్లు హరిబాబు తెలిపారు. సేవా భావంతో భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు, భాష్యం పూర్వ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎన్యూ నూతన డైరీ ఆవిష్కరణ ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నూతనంగా ముద్రించిన విశ్వవిద్యాలయం డైరీ–2026ను ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్టార్ ఆచార్య సింహాచలంలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయంలోని విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమాచారాన్ని డైరీ రూపంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజిస్టార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సొంతగా ముద్రించిన డైరీ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. డైరీ ముద్రణ కమిటీ కన్వీనర్ ఆచార్య పద్మావతి మాట్లాడుతూ ఎంతో విలువైన సమాచారంతో అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ముద్రించామన్నారు. -
సర్కారు భూముల ఆక్రమణపై చర్యలు శూన్యం
వినుకొండ: వినుకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, ఎక్కడ చూసినా అక్రమ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నా సమాధానం చెప్పేవాళ్లు లేరని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురేష్ మహల్ రోడ్డులో ఏకంగా తహసీల్దార్ కార్యాలయ గోడనే కూల్చివేసి రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. హనుమాన్నగర్లో పాఠశాల సమీపంలోనే బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారని, మహిళలు అడ్డుకున్నా షాపు నడుపుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి చేయకపోగా, అక్రమాలను కూడా అడ్డుకోలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. జీవీ ట్యాక్స్ పేరుతో గ్రానైట్ లారీల యజమానుల నుంచి రూ. లక్షలు వసూళ్లు చేస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం వ్యాపారం, అంతటా మద్యం దుకాణాలు, ఇసుక అక్రమ తరలింపు వంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు చేయడం వంటివి సర్వసాధారణంగా మారాయని అన్నారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు చేపల చెరువులను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఎన్ఎస్పీ భూముల్లో గతంలో చేపట్టిన మాదిరిగానే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని సూచించారు. కొండపైన అభివృద్ధి పనులు ఎవరు చేశారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డు గతంలో ప్లాన్ మాదిరిగా యథావిధిగా నిర్మించాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే గ్రామాలకు రోడ్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు సొంత గ్రామాలకు కూడా రోడ్లు వేసుకోలేని దుస్థితిలో గత ప్రభుత్వం హయాంలో తాము రోడ్లు వేశామని బ్రహ్మనాయుడు చెప్పారు. గతంలో వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరయ్యాయని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు చెప్పారని గుర్తుచేశారు. బనకచర్ల పేరుతో ఒకరు, వరికపూడిశెల పేరుతో మరొకరు పనులు పూర్తి కానివ్వకుండా రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వినుకొండలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైందని, పట్టించుకునే వారే లేరని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్లు బేతం గాబ్రియేలు, తెల్లాకుల రాజేష్ఖన్నా, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, రూరల్ మండల అధ్యక్షులు దండు చెన్నయ్య, బీసీ సెల్ అధ్యక్షులు గుంజి వాసు, నూజెండ్ల మండల కన్వీనర్ ముప్పరాజు వెంకటేశ్వర్లు, టౌన్ మహిళా కన్వీనర్ సీహెచ్ దుర్గ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
నాదెండ్ల: విద్యుత్ షాక్కు గురైన మహిళ తీవ్రగాయాలపాలై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక శివాలయం వీధిలో నివాసం ఉండే షేక్ ఫకీరమ్మ (31), బాజి దంపతులు. కూలి పనులు చేసుకుంటూ ఫకీరమ్మ జీవనం సాగిస్తోంది. జనవరి 28న ఇంట్లో దుస్తులు ఉతికి డాబాపై ఆరేసేందుకు వెళ్లింది. దుస్తులు ఆరేస్తుండగా ఇంటి పక్కనుంచి వెళ్లే విద్యుత్ లైనుకు తగిలి షాక్కు గురై డాబాపై నుంచి కిందపడింది. తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. 50 శాతం కాలినగాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అప్పట్లో పోలీసులకు భర్త బాజి ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాజి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. దిద్దుబాటు చర్యలు... అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం గాల్లో కలిసింది. షేక్ ఫకీరమ్మ విద్యుత్షాక్కు గురైందన్న సమాచారం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డాబా మీదుగా ఓ లైను వెళ్తుండడంతో అదనంగా మరో స్తంభం ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వైరును తొలగించారు. తమ కుటుంబానికి విద్యుత్శాఖ అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. షాక్కు గురై చికిత్స పొందుతూ మహిళ మృతి -
రాజకీయ వేధింపులు ఆపాలి
ఐపీఎస్ అధికారి సునీల్కుమార్పై నరసరావుపేట: ఐపీఎస్ అధికారి ముడావత్ సునీల్కుమార్ నాయక్పై రాజకీయ వేధింపులు ఆపాలని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గడియారం స్తంభం సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్కు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సునీల్కుమార్ను రఘురామకృష్ణరాజు కేసులో రాజకీయ కుట్రతో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఒక గౌరవప్రదమైన ఐపీఎస్ అధికారిని ఫోన్ ద్వారా ఒత్తిడి చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ పేర్లు చెప్పాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నిందితుడిగా మారుస్తానని బెదిరించడం రాజకీయ బ్లాక్మెయిలింగ్ కాదా అని ప్రశ్నించారు. గిరిజన, దళిత అధికారులు ఉన్నత పదవుల్లో ఉండటం కొందరికి అసహనంగా మారిందన్నారు. ప్రత్యక్ష సంబంధంలేని కేసులో సునీల్ నాయక్ ఇరికించడం వెనుక ఉన్న అదృశ్య హస్తాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై గౌరవ రాష్ట్రపతి, జాతీయ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులు బనాయించడం ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. బుదలా బాబురావు కే.ప్రకాష్, ఇస్లావత్ హనుమంతునాయక్, కె.రవీంద్ర, వివిధ గిరిజన దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాత్రూమ్కు వెళ్లాలా.. షుగర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకురండి!
సత్తెనపల్లి: పరీక్ష సమయంలో బాత్రూమ్కు వెళ్లేందుకు అనుమతి అడిగినందుకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్(డీవో) అసభ్యకర మాటలతో వేధించారంటూ ఇంటర్మీడియెట్ విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధితులు మాట్లాడుతూ.. సత్తెనపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తాము పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. డీవో రోజూ తమను మాటలతో ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. పరీక్ష సమయంలో బాత్రూమ్కు వెళ్లేందుకు అనుమతి అడిగితే ఆయన ‘మీకు షుగర్ ఉందా? రేపు పరీక్షకు వచ్చేటప్పుడు షుగర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్ తీసుకురండి. బాత్రూమ్కు వెళ్లి ఎక్కడ ఏమి పెట్టుకుని వస్తారో’ అంటూ అసభ్యంగా మాట్లాడారంటూ వాపోయారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కాలేజీ గేటు వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో డీవో రాగా.. ఆయన కారును వారు ముట్టడించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఏఎస్ఐ మస్తాన్వలి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి.. డీవోను కాలేజీ లోపలికి పంపించారు. ఈ ఘటనపై ఇంటర్ బోర్డు డీవీఈవో నీలావతికి ఫిర్యాదు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఆమె పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు సమాచారం. -
వినుకొండలో మహిళల ఆందోళన
పాఠశాల, నివాసాల మధ్య మద్యం షాపు వద్దంటూ నిరసన వినుకొండ: నివాస గృహాలు, పాఠశాలల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్న నిబంధనలను తుంగలో తొక్కి అకస్మాత్తుగా బ్రాందీ షాపు ఏర్పాటుచేయడంపై మహిళలు తిరుగుబాటు చేశారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్ ప్రాంతంలో ఒక వైపు ఎస్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, మరో వైపు నివాస గృహాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళల ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి షాపును తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల బ్యాంక్ కెనాల్కు 244, తూర్పు కాలువకు 330, పశ్చిమ కాలువకు 120, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,446 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు. -
మహిళా ఖోఖో పోటీలు ప్రారంభం
● పోటీలను ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ● పోటీలో పాల్గొంటున్న 13 జట్లు నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళా ఖోఖో పోటీలు శుక్రవారం వాగ్దేవి డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు నిర్వహించనున్న పోటీలలో వర్సిటీ ఖోఖో మహిళా జట్టును ఎంపిక చేయనున్నారు. పోటీలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ, మానసిక శారీరక వికాసం కలుగుతుందని అన్నారు. క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించటంతోపాటు విద్యా, ఉద్యోగాలలో సముచిత రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి.సూర్యనారాయణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఖోఖో అసోసియేషన్ సలహాదారుడు డి.కోటేశ్వరరావు, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, కార్యదర్శి రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్ ఓగూరి నాగేశ్వరరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.రాజామెర్సిన్బాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా పోటీలు.. నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో 13 కళాశాలల మహిళా ఖోఖో జట్లు పాల్గొన్నాయి. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్లో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 13–02 తేడాతో చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల జట్టుపై ఘన విజయం సాధించింది. అలాగే గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్టు 24–10 తేడాతో తిరుమల ఆక్స్ఫర్డ్ మహిళా కళాశాలపై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల జట్టు 14–13 తేడాతో ఏఎం రెడ్డి ఫార్మసీ కళాశాల (నరసరావుపేట) జట్టుపై విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా 28వ తేదీ శనివారం లీగ్ దశ పోటీలు జరగనున్నట్టు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెర్సిన్బాబు తెలిపారు. -
ఇంటిగుట్టురట్టేనా?
సర్వేశ్వరా .. ప్రభుత్వ ఉద్యోగమా .. ప్రైవేట్ ఉద్యోగమా .. స్థిరాస్తి ఎంత ఉంది.. ద్విచక్ర వాహనాలెన్ని ఉన్నాయి .. కార్లు ఉన్నాయా? ఇంట్లో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా? ఫ్రిడ్జ్ వాడుతున్నారా? తదితర వివరాలను చంద్రబాబు ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమ ఇంటి గుట్టు భద్రమేనా? లేక రట్టవుతందా? అని మదనపడుతున్నారు. సత్తెనపల్లి: ప్రజల వ్యక్తిగత వివరాల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే విస్తృతంగా చేపడుతోంది. కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచి సర్వేను పూర్తి చేసేందుకు లక్ష్యాలను విధిస్తోంది. అయితే ఈ సర్వేలో పొందుపరిచిన వివరాలను చెప్పేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. విద్య, ఉద్యోగ, స్థిరాస్తి, వాహన వివరాలతో పాటు ఇంట్లో ఉపయోగించే వస్తువుల వివరాలను సైతం అడుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమ వ్యక్తిగత, ఆస్తి వివరాలు ఎందుకు చెప్పాలంటూ సర్వేకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులను చాలామంది నిలదీస్తున్నారు. మా నుంచి సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు భద్రమేనా? అంటూ మదనపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడంపై దృష్టి సారించడం వెనుక ఏదో మతలబు ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 538 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేస్తున్న వారిలో 3,700 మంది ఉద్యోగులకు ఈ సర్వే బాధ్యత అప్పగించారు. ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల కుటుంబాలు సర్వే పూర్తి కాగా .. ఇంకా మూడు లక్షల కుటుంబాల వరకు సర్వే చేయాల్సి ఉంది. దీనిపై మండల స్థాయి అధికారుల మానిటరింగ్తోపాటు జిల్లా అధికారులు నిత్యం కాన్ఫరెన్స్లు నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ సర్వేపై ఉన్నతాధికారులు ఆరాఽ తీస్తున్నారు. లక్ష్యం మేరకు సర్వే పూర్తి చేయాల్సిందేనంటూ కిందిస్థాయి సిబ్బందిపై మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. ప్రజల నుంచి సానుకూలత లేకపోవడం, సర్వేను సకాలంలో పూర్తి చేయకపోవడంతో సర్వే సిబ్బందికి ప్రజల నుంచి నిరాకరణ, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. విద్య, ఉద్యోగ వివరాలతో ప్రభుత్వం సర్వే చేయడం సర్వసాధారణం. అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం సకుటుంబ సపరివారంగా పూర్తి వివరాలను సేకరిస్తుండడంపై ప్రజల్లో అలజడి నెలకొంది. ఇంట్లో వినియోగించే వస్తువులు, స్థిరాస్తి వివరాలను ఎందుకు చెప్పాలంటూ మండిపడుతున్నారు. వీటన్నింటితోపాటు కుల ధ్రువీకరణను సైతం సర్వే సిబ్బందికి చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుండడంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వే సిబ్బంది ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాము అడిగిన వివరాలు చెప్పాల్సిందేనంటూ ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం సేకరించాలని చెప్పిన వివరాలను మాత్రమే తాము అడుగుతున్నామని ఎంత చెప్పినా ప్రజలు సర్వేలో వివరాలు చెప్పేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలను చెప్పబోమంటూ మండిపడుతున్నారు. సత్తెనపల్లి గవర్నమెంట్ కాలేజీ గేటు వద్ద డీవో కారును ముట్టడించిన విద్యార్థులు ముట్టడి నుంచి డీవోను లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్న ఏఎస్ఐ మస్తాన్ వలి ఇంటర్ బాలికలతో డీవో అసభ్య ప్రవర్తన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సచివాలయ ఉద్యోగులకు శాపంగా మారింది. సర్వే చేసేందుకు రోజువారి లక్ష్యాలు విధించడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో మళ్లీ మళ్లీ అదే ఇంటికి తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక ఇంటి దగ్గర సర్వే చేయాలంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. దీంతోపాటు సర్వర్ డౌన్ సమస్య వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంటి సర్వే గంటకు పైగా సమయం పడుతోంది. ప్రజలు సర్వేపై అయిష్టత వ్యక్తం చేస్తుండడంతో సచివాలయ ఉద్యోగులు వారిని ఒప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో సర్వేకు సమయం తీసుకుంటోంది. ఉన్నతాధికారులు మాత్రం సర్వే సిబ్బందిని వేధించి వీధుల్లోకి తరుముతున్నారు. ఒక్కో సిబ్బంది రోజుకు పది ఇళ్లు సర్వే చేయాలని ఆదేశించగా అధికారులు మాత్రం 20కి తగ్గకుండా చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతల నుంచి సిఫార్సు చేయించుకుని పలువురు డిప్యూటేషన్ల పై మరో ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాంటి సిబ్బందికి సర్వే పోటు తప్పింది. ఈ పని భారం సచివా లయాల్లో అరాకొరాగా ఉన్న సిబ్బందికి రెట్టింపు అయ్యింది. వ్యక్తిగత వివరాలు భద్రమేనా? సకుటుంబ వివరాల సేకరణకు నడుం బిగించిన బాబు ప్రభుత్వం విద్య, ఉద్యోగ, స్థిరాస్తి వివరాల సేకరణ వినియోగించే వస్తువుల గురించీ ఆరా అడిగిన వివరాలు చెప్పాల్సిందేనంటూ ఒత్తిడి జిల్లాలో సర్వే చేయాల్సిన కుటుంబాలు ఇంకా మూడు లక్షలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై ప్రజల్లో ఆందోళన యూనిఫైడ్ డ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్) ద్వారా ప్రభుత్వం కుటుంబ వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తోంది. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంత మందికి సంబంధించిన పూర్తి వివరాలను సర్వే యాప్లో నమోదు చేస్తున్నారు. ఒక్కో సభ్యుడు వివరాలు నమోదు చేయడానికి ఒక్కో ఓటీపీ సర్వే సిబ్బందికి ఇస్తే గాని యాప్లో వివరాలు నమోదు కావడం లేదు. ప్రతి ఒక్కరికి సంబంధించిన విద్య (కోర్సులతో సహా) ఉద్యోగ వివరాలు, ఉద్యోగం చేస్తుంటే ఎలాంటి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగమా లేదా ప్రైవేట్ ఉద్యోగమా తదితర సమాచారం. స్థిరాస్తి వివరాలు, ద్విచక్ర, కార్లు వినియోగ వివరాలు, ఇంట్లో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా?, ఫ్రిడ్జ్ వంటి ఇంట్లో వినియోగించే వస్తువుల వివరాలను సైతం చెప్పాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది.ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగత పూర్తి వివ రాలు సేకరించడం పై ప్రజల్లో అయోమయం నెలకొంది. నేడు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ నరసరావుపేట: కలెక్టరేట్లో శనివారం ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
● గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు ● ఉదయం చిన శేషవాహనంపై విహరించిన నారసింహుడు మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసిన యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గ్రామోత్సంలో స్వామివారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంలో కొలువుతీరిన బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గలవారిని హింసించేవాడు నారసింహుడు. నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. సాధు జనులకు అభయాన్నిస్తూ దుర్మార్గాన్ని పారద్రోలుటకు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పక్షుల్లో గరుత్మంతుడు, మృగాల్లో సింహం తానేనని స్వామివారు చెప్పినట్లు అర్చకులు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు. ఉదయం చిన్నశేషవాహనంపై.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కై ంకర్య పరులుగా దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు హంస, గజ వాహన సేవలు గ్రామోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి విదేశీ ప్రశంసలు
పెదకూరపాడు: పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. నెదర్లాండ్కు చెందిన గ్లోబల్ మార్కెటింగ్ బృందం పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రైతు దర్శి శేషారావు మిరప పొలాన్ని సందర్శించింది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి పర్యవేక్షణలో జరిగిన ఈ సందర్శనలో రసాయనాలు వినియోగించకుండా కషాయాలు, జీవామృతంతో పంటలను సాగు చేస్తున్న విధానాన్ని బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్లో మిరప ప్రధాన వాణిజ్య పంట అని, ప్రకృతి విధానంలో పండించడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. ప్రధాన పంటతోపాటు ముల్లంగి, ఉల్లి, బీట్రూట్, క్యారెట్, టమోటా, మొక్కజొన్న, కంద, బంతి వంటి అంతర పంటలు, జొన్న, సజ్జలను రక్షక పంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తున్నట్లు వివరించారు. ప్రకతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్ ధర కంటే మెరుగైన ధర వస్తోందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 1,04,586 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ 12 మే 2025న 30 రకాల విత్తనాలతో పచ్చిరొట్ట పైర్లు వేసినట్లు తెలిపారు. దీంతో భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మిరప కలాలను పరిశీలించి శాసీ్త్రయ పద్ధతిలో ఆరబెట్టే విధానంపై సూచనలు ఇచ్చారు. నెదర్లాండ్ గ్లోబల్ మార్కెటింగ్ రిలేషన్ షిప్ మేనేజర్ లియో, సంబల్ ప్రాజెక్టు స్టేట్ లీడ్ వినూత్న, ఎన్ ఎఫ్ఏ మార్కెటింగ్ ఎస్పీఎంయూ పున్నారావు, ఏఈఓ జానీబాషా, మార్కెటింగ్ బృందం సభ్యులు మేరీ, అంజలి పాల్గొన్నారు. -
గుంటూరులో ఏపీటీఎఫ్ ధర్నా
12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ గుంటూరు ఎడ్యుకేషన్: ఉగ్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం బ్రాడీపేటలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవలింగారావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపులో భాగంగా అన్ని పాత తాలుకా కేంద్రాల్లో ఉపాధ్యాయులతో ధర్నా చేపట్టామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో సాచివేత ధోరణిని అవలంబిస్తూ ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, సీపీఎస్ బకాయిలు అరకొరగా చెల్లించి పండగ చేసుకోమనడం దారుణమన్నారు. తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి, మధ్యంతర భృతితో పాటు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు గత 20 నెలలకు పైగా గ్రాట్యుటీ చెల్లించలేదని, ఉద్యోగ విరమణ రోజునే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయడంతో పాటు నాలుగు పెండింగ్ డీఏలు చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే 10వ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రాష్ట్ర స్థాయిలో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు. ఏపీటీఎఫ్ జీఓ కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవిధంగా చట్ట సవరణ చేసేందుకు మార్చి 10న చలో ఢిల్లీ చేపట్టామన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ విద్యాశాఖాధికారుల విచిత్ర పోకడలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల సీఎస్, డీవోల నియామకంలో కొత్త పోకడలు అవలంబిస్తున్నారని, గతంలో ఎన్నడూ ఇన్విజిలేషన్ విధులను చేయనివారిని నియమించారన్నారు. జూనియర్లను కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్గాను, సీనియర్లను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. -
జనసేన నాయకుల ఘర్షణ
వినుకొండ: పల్నాడు జిల్లా పరిశీలకులు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలోనే జనసేనలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. జనసేన సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వినుకొండకు వచ్చిన పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. సభలో నూజెండ్ల మండల కన్వీనర్ వేముల వెంకటేశ్వర్లను వేదికపైకి పిలవకుండా ఉపాధ్యక్షుడు రాజబాబును పిలవడంతో వివాదం మొదలైంది. వినుకొండలో జనసేన నాయకుడు నిశంకరరావు శ్రీనివాసరావు, నాగశ్రీను రాయల్ ఇరువురు ఎవరికి వారు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం వెల్లటూరు రోడ్డులో కొణిజేటి నాగశ్రీను రాయల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నిశంకరరావు శ్రీనివాసరావు తన అభిమానులతో హాజరయ్యారు. అధ్యక్షుడిని పిలవకుండా ఉపాధ్యక్షుడుని ఎలా పిలుస్తారని ప్రశ్నించడంతో నాగ శ్రీను వర్గీయులు వాదనకు దిగారు. నిశంకరరావు శ్రీనివాసరావు వర్గీయులపై విరుచుకుపడ్డారు. దీంతో పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. మీడియా కవరేజ్కి వెళ్ళిన విలేకరి పట్ల దురుసుగా ప్రవర్తించి సెల్ఫోన్, టాబ్ను లాక్కున్నారు. ‘అంతు తెలుస్తామని’ బెదిరించడంతోపాటు ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేశారు. దీంతో ఒక వర్గం వారు పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. విభేదాలు వెలుగు చూడటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
చేతికందినా కన్నీరే..
సాక్షి, నరసరావుపేట, దుర్గి: వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 35 వేల హెక్టార్లలో కంది సాగు చేశారు. సుమారు 80 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దిగుబడి ఎక్కువే ఉండే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 8 వేల మేరకు ప్రతి రైతు నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పటివరకు కనీసం ఒక్క మెట్రిక్ టన్నుల కందులను సైతం కొనుగోలు చేయలేదు. ఈ విషయంపై మార్క్ఫెడ్ అధికారులను అడిగితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతుల నుంచి కందులు కొనుగోలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35 కేంద్రాలు ప్రారంభించారు. మరోవైపు తేమశాతం పేరిట అడ్డంకులు సష్టిస్తోంది. యాప్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటివరకు 400 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పారు. దళారుల దోపిడీ... వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా కందులు రూ. 10 వేలకుపైగా ధర పలికింది. కొంత మంది రైతులు రూ.12 వేలకు సైతం అమ్ముకున్నారు. దీంతో రెండేళ్లుగా కంది పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపారు. ప్రభుత్వం కందుల కొనుగోలులో విఫలమవడంతో రైతులు తప్పనిసరిగా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు, వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమయ్యాయన్న పేరుతో క్వింటా కందులను రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అది కూడా రైతులే నేరుగా దాల్ మిల్లుల వద్దకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. వ్యాపారులు ఇంతలా దోపిడీకి రంగం సిద్ధం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందిపంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండిన పంటను మార్క్ఫెడ్ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారు. దీంతో రైతు కంట కన్నీరు వస్తోంది. ఆరుగాలం కష్టపడినా చంద్రబాబు సర్కారు తీరుతో నష్టాలు రావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆరు ఎకరాలలో కంది సాగు చేశా, దిగుబడి ఆశాజనకంగా లేదు. కనీసం పండించిన కందులను అమ్ముకుందామంటే కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కష్టాల్లో ఊబిలో ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించిన కనీసం ధర రూ.8 వేలకు కొనుగోలు చేస్తామని కల్లుబొల్లి మాటలు చెప్పారు. నేటికీ ఆయా కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దళారులు, వ్యాపారుల చేతిలోకి దాదాపుగా కంది పంట వెళ్లిపోయింది. – అంబారావు, రైతు, ఆత్మకూరు, దుర్గి మండలం మూడు ఎకరాలలో కంది సాగు చేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే మద్దతు ధర రూ.8 వేలు వస్తుందని ఎంతో ఆశగా కోత ప్రారంభించాం. వచ్చిన కందులను 10 రోజులపాటు ఇంటి వద్ద ఉంచుకొని అధికారుల చుట్టూ తిరిగా. కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఆరా తీస్తే ఒక్కరూ సమాధానం చెప్పలేదు. అప్పు తీసుకొని సాగు చేస్తే పంట చేతికి వచ్చిన తర్వాత అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తట్టుకోలేక దళారులను ఆశ్రయించి క్వింటా రూ.7 వేలకు అమ్ముకున్నాను. దాదాపు ఖరీఫ్ అమ్మకాలు పూర్తయిన తరువాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏం లాభం? – మంత్రు నాయక్, రైతు, నెహ్రూనగర్ తండా, దుర్గి మండలం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీలలో సుమారు 23,500 మెట్రిక్ టన్నుల కందులను మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తాం. ఇప్పటికే 35 కేంద్రాలు ప్రారంభించాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కంది విక్రయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నాం. తేమశాతం, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం వల్ల కొనుగోలు కేంద్రాలలో ఆశించిన స్థాయిలో కొనడం లేదు. తేమశాతం తగినంత ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతు నుంచి కంది కొనుగోలు చేస్తాం. – రమేష్, మార్క్ఫెడ్, పల్నాడు జిల్లా మేనేజర్ -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం 167ఏ వాడరేవు– పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని అనంతపూర్కు చెందిన బోయ సహస్ర (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం బోయ సహస్ర మరో యువకుడు అఖిల్ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి చీరాల వస్తున్నారు. నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిపై విజయనగర్కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం సమీపంలోని వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ నాగభూషణం, సిబ్బంది చేరుకుని తీవ్రగాయాలైన సహస్ర, అఖిల్ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సహస్ర మరణించింది. తీవ్రగాయాలైన అఖిల్ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గుంటూరు నుంచి చీరాలకు రావడానికి కారణాలు, అసలు ప్రమాదానికి గల కారణాలను తెలియరావాల్సి ఉంది. -
నృసింహుడు
యాలి వాహనంపైమంగళగిరి టౌన్ : మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు యాలివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. వ్యాళి వాహనాన్నే యాలి వాహనం అంటారు. హింసించే స్వభావం ఉన్న క్రూరులను శిక్షించి సాధువులను రక్షించేందుకు తానున్నానని తెలియజేసేందుకు లక్ష్మీనరసింహస్వామికి యాలివాహన ఉత్సవం నిర్వహిస్తారు. యాలివాహన రూఢుడైన స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వల్ల కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ముత్యాల పల్లకి వాహనంపై.... స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ముత్యాల పల్లకి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్య పరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి శుక్రవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి ఏడు గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరు చోరుల అరెస్టు
నగరంపాలెం: చోరీ కేసుల్లో ఇద్దరు పాత నేరస్తులను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు రూ.38 లక్షల విలులైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... దుగ్గిరాల గ్రామం బ్రాహ్మణబజార్కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి పాత నేరస్తుడైన చిప్పాడ కేదారేశ్వరరావు(40)ని అదుపులోకి తీసుకుని, రూ.16.32 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. చింతలపూడి గ్రామంలోని ఓ ఇంట్లో సుమారు రూ.20 లక్షల ఖరీదైన నగలు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. నెహ్రూనగర్ వాసి ఇమడాబత్తిని గోపి (38)ని మంగళగిరి షరాఫ్బజార్లో అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విచారణలో నేరం రుజువుకావడంతో రూ.20.40 లక్షల విలువైన బంగారం, రూ.1.11 లక్షల ఖరీదైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. -
ముగిసిన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈనెల21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు, శ్రీ యోగాంజేయ స్వామివార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, ప్రథమారాధన, మంగళాశాసనం, ఋత్విక్ సమ్మానం, ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. -
సూక్ష్మకళ మొనగాడు!
యడ్లపాడు: జీవితం అంటే కేవలం బతుకు తెరువు మాత్రమే కాదు, ఆ బతుకు చాటున ఒక తపన ఉండాలని నిరూపిస్తున్నారు కొణతం సంతోష్. చిలకలూరిపేటలోని సంజీవనగర్ గల్లీల్లో తిరుగుతుంటే ఒక సామాన్య వెల్డింగ్ కార్మికుడిలా కనిపించే ఆ యువకుడు చేతిలో చాక్ పీస్ పట్టినా.. పెన్సిల్ మొనను తాకినా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. చదివింది ఐదో తరగతే అయినా ఆయన కళాత్మక సృజన మాత్రం విశ్వవిద్యాలయాల స్థాయిని మించి సాగుతోంది. ప్రశ్న నుంచి పుట్టిన ప్రయాణం.. ఒకనాడు దినపత్రికలో వచ్చిన చాక్పీస్పై ఏనుగు బొమ్మ అనే వార్త సంతోష్ జీవితాన్ని మలుపు తిప్పింది. అంత చిన్న వస్తువుపై బొమ్మ ఎలా సాధ్యం? అన్న ఒక సూక్ష ప్రశ్న సంతోష్లో జిజ్ఞాసను రగిల్చింది. ఆ ఆసక్తితోనే సూక్ష్మకళ వైపు మొదలైన ప్రయాణం...చార్మినార్, భరతమాత, గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుల ప్రతిమలను చాక్పీస్లపై ప్రాణం పోసేలా చేసింది. 2010లో పట్టణంలోని ఫార్కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ డాక్టర్ జెస్సీ ఎస్.బర్నబాస్ నుంచి విశిష్ట సేవా అవార్డును అందుకున్నారు. కేవలం బొమ్మలకే పరిమితం కాకుండా ఒకే చాక్పీస్తో 74 లింకుల గొలుసును తయారు చేసి 2011లో తొలిసారి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. మరుసటి ఏడాదే ఆ రికార్డును తానే తిరగరాస్తూ 79 లింకులతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి 2012లోనూ అవార్డు అందుకున్నారు. ఖాళీ బల్బుల్లో వైఎస్సార్, ఇల్లు ఈఫిల్ టవర్ఏర్పాటు, పుచ్చకాయపై భారతదేశం చిత్రపటం, మహాశివుడు తదితర దేవతామూర్తుల చిత్రాలు చెక్కి వాటిని పట్టణంలోని వినాయకచవితి, నవమి రాత్రుల పందిళ్లలో ప్రదర్శించి, ప్రశంసలు అందుకున్నారు. లక్ష్యం.. గిన్నిస్ రికార్డు! ప్రస్తుతం సంతోష్ చూపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్పై ఉంది. ఇప్పటికే ఇతర దేశానికి చెందిన కళాకారుడు 125 లింకుల పెన్సిల్ లిడ్ చైన్ గిన్నిస్ బుక్ రికార్డును నమోదై ఉంది. దానిని అధిగమించి 130 లింకులతో కొత్త చరిత్ర సృష్టించాలని ఆయన సంకల్పం. అంతేకాదు భారత జాతీయ గీతంలోని 150 అక్షరాలను పెన్సిల్ మొనపై చెక్కి తన దేశభక్తిని చాటుకోవాలని తపిస్తున్నారు. ఇటీవల కొండవీడు కోట ఉత్సవాల్లో ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. భావితరాలకు ఈ సూక్ష్మ కళపై అవగాహన కల్పించాలనేది ఆయన ఆశయం. చిన్న పెన్సిల్ మొనపై సంతోష్ చేసిన విన్యాసాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. విద్యార్థులు రాసుకునే పెన్సిల్ లెడ్పై ఐ లవ్ ఇండియా అని చెక్కడం నుంచి, హంసలు, జిరాఫీలు, మత సామరస్య చిహ్నాల వరకు ఆయన సృజన అప్రతిహతంగా సాగుతోంది. 18 గంటల పాటు ఏకధాటిగా శ్రమించి, పెన్సిల్ లెడ్తో 80 లింకుల గొలుసును తయారు చేసి తన నైపుణ్యాన్ని శిఖరాగ్రాన నిలిపారు. -
బ్యాంకు ఖాతాదారుడి కుటుంబానికి రూ. కోటి బీమా అందజేత
కొరిటెపాడు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యడ్లపల్లి బ్రాంచ్కు చెందిన ఖాతాదారుడు పి. కామేశ్వరరావు డిసెంబర్ 2022లో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కామేశ్వరరావు అకస్మాత్తుగా మృతిచెందాడు. మృతుని భార్య పి.శివ కు ఖాతాదారుడి పాలసీకి సంబంధించిన రూ. కోటి బీమా పరిహారాన్ని గురువారం బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్ అందజేశారు. ప్రమోద్ మాట్లాడుతూ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తక్కువ ప్రీమియంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బీమా పథకాలను అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు రాజశేఖర్, జనార్ధన్ రావు, రఘునాథ్ రెడ్డి, ఇండియా ఫస్ట్ లైఫ్ ఆర్బిహెచ్ మదన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు
తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసును సీబీఐ కోర్టు ఇటీవల మూసివేయడంతో ఆమె అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 20న కేసు మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు షంషద్బేగం, ఇక్బాల్బాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఉదయం తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. భద్రత నడుమ గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించారు. ఆమేరకు శుక్రవారం కోర్టులో పంచనామా జరిపిన అనంతరం అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించనున్నారు. చెంచుపేటలోని ఖబరిస్తాన్లో అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్ చైర్మన్గా మణిరావు
సత్తెనపల్లి: ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్ చైర్మన్గా పెండెం మణిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పిలుపు మేరకు ఏపీ ఎన్జీవోస్ సత్తెనపల్లి కార్యాలయం నందు ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్ కార్యవర్గ సమావేశం గురువారం సత్తెనపల్లి తాలూకా యూనిట్ చైర్మన్ పెండెం మణిరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పి. రమేష్ బాబు, కో చైర్మన్లుగా ఎన్. నాగేశ్వరరావు, కె.శివారెడ్డి, జె.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లుగా బి. కొండలరావు, జి. సునీల్ బాబు, సీహెచ్. ఆగష్టుస్ బాబు, జక్కుల లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా షేక్ కరిముల్లా, ఎం. చంద్రశేఖర్, వై. నాగార్జున, కె. కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి. అశోక్కుమార్ లను ఎన్నుకున్నారు. ఎన్నికై న వారిని పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ సత్తెనపల్లి తాలూకా యూనిట్ కార్యదర్శి ఎస్. అంబేడ్కర్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు బీఆర్కె కుమార్, అప్పారావు సత్తెనపల్లి తాలూకా యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సందేపోగు. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు ఎస్.కె ఇబ్రహీం, టైగర్ నాగేశ్వరరావు, పరిమి రాంబాబు,నటరాజ్, చందు, తదితరులు ఉన్నారు. -
విద్యాశాఖ ఏకపక్ష విచారణపై నిరసన
నరసరావుపేట ఈస్ట్: పట్టణంలోని ప్రకాష్నగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాల 10వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ దాడి చేసిన ఘటనపై విద్యాశాఖ ఏకపక్షంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వటాన్ని నిరసిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేవలం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడిన విచారణాధికారి (డిప్యూటీ డీఈఓ) బాధితురాలిని జరిగిన ఘటనపై వివరాలు అడగకుండానే నివేదిక ఏలా సమర్పిస్తారని ధ్వజమెత్తారు. నివేదికలో ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రాశారనీ, అసలు సదరు నెంబరు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాము విడతల వారీగా ఫీజులు చెల్లిస్తున్నా అసలు ఫీజులే చెల్లించటం లేదని యాజమాన్యం చెప్పటం సరికాదన్నారు. తమ కుమార్తైపె జరిగిన దాడిని ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించి బెదిరించారని ఆరోపించారు. కేవలం డబ్బు, పలుకుబడి ఉందని తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యాలయం వద్ద ఆందోళన సమాచారం అందుకున్న డీఈఓ పివిజే రామారావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఘటన జరిగిన విషయం తెలుసుకొని ఎంఈఓను విచారణకు పంపామనీ, అయితే ఎవరూ అందుబాటులో లేకపోవటంతో మరుసటి రోజు డిప్యూటీ డిఈఓను విచారణకు పంపామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నివేదిక కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని పూర్తిస్థాయిలో విచారించి సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. ఈసందర్భంగా బాధిత విద్యార్థిని, తల్లిదండ్రులతో తన ఛాంబర్లో వ్యక్తిగతంగా విచారణ చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని డిఈఓ రామారావు స్పష్టం చేసారు. ఆక్స్ఫర్డ్ ఘటనపై డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా -
మెప్మా నిందితులపై క్రిమినల్ చర్యలు?
నరసరావుపేట: జిల్లాలో పలుచోట్ల నకిలీ గ్రూపులు సృష్టించి కోట్ల నిధులు బ్యాంకుల నుంచి మింగిన ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు నివేదిక సమర్పించేందుకు సిద్ధం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎస్పీ, ఆర్డీఓ, మెప్మా పీడీలతో ఏర్పాటైన త్రిసభ్య అధికారుల బృందం ఇచ్చిన నివేది క మేరకు ఈనెల 10న ఎనిమిది మంది ఉద్యోగులను మెప్మా పీడీ మురళీకృష్ణ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల సిటీ మిషన్ మేనేజర్లు తుమ్మా దీప, ఉమర్వలి, జి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం.మల్లికార్జున రావు, జి.భూదేవి, బి.విజయ ప్రణతి, కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులు ఉన్నారు. వారిపై ఈనెల 17న పట్టణ పోలీసు స్టేషన్లో జిల్లా సమైఖ్య ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ప్రకారం రూ.9.4 కోట్ల వరకు కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. అయితే మెప్మా విభాగం తరపున జరిగిన కంభకోణంపై నివేదికను సిద్ధ్దం చేశారు. నిధుల కై ంకర్యం ఇంకా జరిగిందని నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఉద్యోగులతో పాటు నకిలీ గ్రూపులకు నిధులు విడుదల చేసిన బ్యాంకు ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారికి సంబంధించిన ఆస్తులను జప్తుచేసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్న మెప్మా విభాగం -
జవాబు కాదు
విమర్శలకు దాడి నగరంపాలెం (గుంటూరు వెస్ట్)/ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాఽథ్, పార్టీనేత వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పీవీవీ సూర్యనారాయణ, అనంతబాబు, రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్, సినీ నటుడు జోగినాయుడు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ● సాకే శైలజానాఽథ్ మాట్లాడుతూ, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ, దాడులు చేయడం మంచి విధానం కాదని అన్నారు. పోలీసుల సమక్షంలో ఏడు గంటలకు పైగా అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి జరగడం బాధాకరమని చెప్పారు. అన్యాయాన్ని ఎదురించేందుకు ఉన్నానని అంబటి వ్యాఖ్యానించడం మంచి మాటగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నోట్ఫైల్ ప్రకారం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. లడ్డూలో అసలు కల్తీలేదని, అయినప్పటికి దుర్మార్గంగా మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ● వైఎస్సార్ సీపీ నేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వం అడ్డగోలు అరెస్ట్లు, శిక్షలు జరుగుతాయనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అయినా మేమంతా కలిసి కట్టుగా ఉన్నామని, టీడీపీ చేసిన తప్పులను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ● మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇల్లు, కార్యాలయంపై దాడి గురించి చెప్పేందుకు రాష్ట్ర డీజీపీ, ఏడీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అనేకసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వారు క్రిమినల్స్ కాదని, చంద్రబాబు, లోకేష్, డీజీపీ, ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీ క్రిమినల్స్ అని మండిపడ్డారు. ఆ రోజు మా ఇంటి దగ్గర వరకు జిల్లా ఎస్పీ వచ్చి వెనక్కి వెళ్లారని అన్నారు. చంద్రబాబుకి టచ్లో ఉండే పనిలో జిల్లా ఎస్పీ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ● రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అంబటి రాంబాబుపై దాడి చేయించారనీ, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. -
రోడ్డుప్రమాదంలో జేఎల్ఎం మృతి
నకరికల్లు: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో నరసరావుపేట రోడ్డులో బుధవారం జరిగింది. నకరికల్లుకు చెందిన జూపల్లి రాజారత్నం (38) గత ఆరేళ్లుగా గుండ్లపల్లి గ్రామంలో గ్రేడ్–2 జేఎల్ఎం (ఎనర్జీ అసిస్టెంట్)గా పనిచేస్తున్నాడు. కాగా నరసరావుపేటలోని అక్కయ్య వాళ్లింటికి వెళ్లాడు. మండలంలోని త్రిపురాపురం గ్రామంలో విద్యుత్బిల్లుల డ్యూటీ ఉండడంతో విధుల్లో హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై నకరికల్లుకు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దేచవరం మిద్దె సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.సతీష్తో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్శాఖ ఈఈ రాంబొట్లు, డీఈఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సుచరిత, పలువురు లైన్మెన్లు మృతదేహానికి ఘననివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వక్కపట్లవారిపాలెం వద్ద ఘటన నాగాయలంక: మండలంలోని నాగాయలంక – అవనిగడ్డ మెయిన్ రోడ్డుపై వక్కపట్లవారి పాలెం సమీపంలో బుధవారం ప్రయాణికులతో వస్తున్న ఆటోలో సాంకేతిక లోపాల కారణంగా ఆకస్మికంగా పల్టీ కొట్టిందని ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. బాపట్ల జిల్లా అల్లపర్రు గ్రామం నుంచి నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పాలెం సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై పంటకాలువ వైపు బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వర్రే శివయ్య(60)కు కాలు విరిగిందని, బండ్రెడ్డి రాఘవమ్మ(60) మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ అలపర్రుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులని, ఆటో కూడా ఆ సభ్యుల్లో ఒకరిదని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. -
భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు
భట్టిప్రోలు: భట్టిప్రోలు గర్డర్ బ్రిడ్జి రహదారిలోని జుమ్మా మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. సుమారు 165 సంవత్సరాల క్రితం జమాలుద్దీన్ ఈ మసీదును నిర్మించారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై తరలి వచ్చేవారని పెద్దలు చెబుతున్నారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని ముస్లిం పెద్దలు తెలిపారు. జుమ్మా మసీదుకు ఎదురుగా ఉన్న గదులు ప్రార్థన చేసేందుకు వచ్చేవారికి ఒకప్పుడు విశ్రాంతి భవనంగా ఉండేవి. గుర్రాలు నిలుపుదల చేసేందుకు ఈ భవనం కిందగా దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే ఆయా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మసీదులు నెలకొల్పారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఐదు పుటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి. ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈద్గాలు. – ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఈద్గాల ప్రదేశం ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కఠోర ఉపవాస దీక్షలను నిర్వహిస్తున్న ముస్లింలు ప్రతి నిత్యం మసీదులకు చేరుకుని పూర్తి సమయాన్ని ప్రార్థనలతో గడుపుతూ ఆధ్యాత్మిక లోకంలో గడుపుతారు. ప్రతి ఏడాది ఈద్గాల వద్ద పండుగ రోజున ప్రత్యేక నమాజు చేసే సందర్భంగా ముస్లింలు ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈద్గా ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని అద్దేపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన, వేమవరం, వెల్లటూరులోని మసీదులు ఉన్నాయి. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు -
‘ఉపాధి’ అవినీతి రూ.8 లక్షలు
నూజండ్ల: పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయకపోవటం, నిశాని పేరుతో సంతకాలు లేకుండా డబ్బులు జమ చేయటం, ఉపాధి సిబ్బంది, క్షేత్ర సహాయకుల తప్పులు పునరావృతం అవుతుండటం పట్ల డ్వామా పీడీ లింగమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ జరిగిన విచారణలో ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. మండల పరిషత్ కార్యాలయం వద్ధ ఎంపీడీవో ఉమాదేవి అధ్యక్షతన జరిగిన ప్రజావేదికకు డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి హాజరయ్యారు. మండల పరిధిలో 27 పంచాయతీల్లో 669 పనులకుగాను రూ.12 కోట్ల 41 లక్షల నిధుల వినియోగంపై జరిగిన అవకతవకలను డీఆర్పీలు సభలో చదివి వినిపించారు. విచారణలో కొన్ని విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. తిమ్మాపురం గ్రామంలో స్థానికేతరులు, విదేశాల్లో ఉన్నవారికి, అంగన్వాడీ సిబ్బందిలోని ఆయాలు, ఆశా కార్యకర్తలు, హైదరాబాద్లో నివాసం ఉండేవారితో కలిపి 50 మందికిపైగా అనర్హులు జాబ్కార్డులు కలిగి ఉన్నారని... క్షేత్ర సహాయకుడు వారికి మస్టర్లు వేసి డబ్బులు డ్రా చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అదే వ్యక్తికి చెందిన కుటుంబంలో భార్య పేరుతో రెండు, 14 సంవత్సరాల కుమార్తెకూ, కుటుంబ సభ్యులందరికీ జాబ్కార్డులున్నాయని పీడీ దృష్టికి తెచ్చారు. క్షేత్ర సహాయకుడు గైర్హాజరు కావటంతో షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా పీడీ ఆదేశించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రూ.2.71 లక్షల రికవరీ చేయలని రాయటం జరిగిందని తెలిపారు. రూ.5.30 లక్షలు థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించటం జరిగిందన్నారు. క్షేత్ర సహాయకులు, ఉపాధి సిబ్బంది బాధ్యతగా పనులు చేయకపోతే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీడీ బూసిరెడ్డి, ఎస్ఆర్పీ ఆవులయ్య, విజిలెన్సు అధికారులు విజయకుమారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపురం పంచాయతీలో విస్తుగొలిపే అక్రమాలు -
రాజాధిరాజ వాహనంపై నృసింహుడు
వైభవంగా బ్రహ్మోత్సవాలు మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణాధికారి కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు గురువారం రాత్రి యాలి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. – మంగళగిరి టౌన్ -
తండాల్లో పైపులైన్లకు అనుమతులివ్వండి
నరసరావుపేట: జిల్లాలోని గిరిజనులు నివసించే ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్ కింద మంజూరైన రహదారులు, పైపులైన్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అనుమతులపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 22 తండాల్లో నీటి పైపులైన్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 65 కి.మీ. పొడవైన పైపులైన్ నిర్మిస్తే 22 తండాలకు తాగునీటి సమస్య ఇకపై ఉండదన్నారు. అదేవిధంగా పీఎం జన్మన్ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో మంజూరైన రహదారుల నిర్మాణాలు వేగవంతం చేయలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, పంచాయతీరాజ్ ఈఈ కె.ముత్తయ్య, గుంటూరు పంచాయతీరాజ్ ఈఈ ఎం.సంపత్ కుమార్లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ యోగాంజేయ స్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్సీ) భవనాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన సుశీల్ కుమార్ లోహాని డీపీఆర్సీ నిర్మాణ పనుల ప్రగతి, నిర్మాణ వ్యయం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీపీవో నాగ సాయి కుమార్, డ్వామా పీడీ వి.శంకర్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్–1కు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో 35,306 మంది హాజరయ్యారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఎస్ఆర్ కళాశాల, అయ్యప్పస్వామి గుడి ఎదుట ఉన్న నారాయణ జూనియర్ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. ఆయా కేంద్రాలలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మారుతీనగర్లోని కంచి కామకోటి పీఠ మారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి. శ్రీబ్రహ్మానంద సరస్వతి స్వామి (విజయవాడ) జ్యోతిప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. సామూహిక తులసి పూజలు చేపట్టారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
పల్నాట పచ్చ పిశాచాలు
పల్నాడుగురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ఇఫ్తార్ సహరి (గురు) (శుక్ర) నరసరావుపేట 6.21 5.12 గుంటూరు 6.19 5.10 బాపట్ల 6.19 5.10● వైఎస్సార్ సీపీ శ్రేణులపై పాశవిక దాడులు ● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ● బాధితులపైనే కేసులు నమోదు దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు. -
లెక్క తేల్చేందుకు..!
● రెండు దశల్లో జనగణనకు చర్యలు ● ఏప్రిల్ నుంచి తొలిదశ ప్రారంభం ● దీని ఆధారంగానే భవిష్యత్ ప్రణాళిక ● 2011 జనగణన ప్రకారం పల్నాడు జిల్లా జనాభా 20.42 లక్షలు సత్తెనపల్లి: జనగణనకు అడుగులు పడుతున్నాయి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈసారి జరిగే జనాభా లెక్కలు రెండు దశల్లో జరగనున్నాయి. ఐదేళ్లు ఆలస్యంగా ఈ గణనకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత ఏడాది జూన్ 15న కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గణనలో పాల్గొనే అధికారులకు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. తొలిదశ ఏప్రిల్లో మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలై మార్చి నెలాఖరు నాటికి పూర్తి కానుంది. దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. తొలిసారి డిజిటల్ విధానంలో... ● జనగణన – 2027లో తొలిసారిగా డిజిటల్ విధానాన్ని తీసుకు వచ్చారు. ఇది పేపర్, పెన్ను లేకుండా కొనసాగనుంది. ఈ గణనలో పాల్గొనే అధికారులు ట్యాబ్ లేదా మొబైల్ యాప్ ద్వారా పూర్తి సమాచారం సేకరించి సాంకేతిక పద్ధతిలో నిక్షిప్తం చేయనున్నారు. దీనిపై మాస్టర్ ట్రైనీలకు శిక్షణ సాగుతోంది. శిక్షణ అనంతరం వీరంతా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. జనాభా లెక్కల్లో ఈసారి ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులు బాటు కల్పించారు. ఆన్లైన్లో తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తరువాత అధికారులు వీటిని పరిశీలించి నిర్ధారిస్తారు. రెండవ దశలో వ్యక్తి సమాచారం... ● రెండో దశ జనాభా లెక్కల్లో వ్యక్తి పూర్తి సమాచారం సేకరించనున్నారు. ఆ వ్యక్తి పేరు, ఇంటి యజమానితో అతని సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మస్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వ్యాపారం, ఉద్యోగం వంటి వివరాలను సేకరించనున్నారు. వాటి ఆధారంగానే... ● దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతోంది. చివరి జనాభా లెక్కలు 2011లో జరిగాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2021లో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదాలపై వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది తొలి దేశ మొదలు కానుంది. ● ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత కార్యక్రమాలకు, తీర ప్రాంతాల్లో నిధుల కేటాయింపునకు, వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే రాయితీలు, రుణాలు వంటి వాటికీ యూనిట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా లెక్కలే ప్రామాణికం. ● చాలా వాటిని 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల నష్టపోతున్నామని పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. జనాభా, కుటుంబాలు, గృహాలు వంటి వివరాలపై ఇప్పటి వరకూ అంచనాలే తప్ప స్పష్టమైన లెక్కలు లేవు. ● జిల్లాలో జనాభా పై ఒక అంచనాకు రావడానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కొంత వరకు ఉపయోగ పడ్డాయి. ● 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 20.42 లక్షల మంది జనాభా ఉన్నారు. 5.23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ గణన నిర్వహించనున్నారు. ఈ దశలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులపై సమాచారం సేకరించనున్నారు. దీనికోసం పట్టణ, పంచాయతీలను బ్లాక్లుగా విడదీయనున్నారు. ప్రతి ఇంటికి ఒక యూనిక్ కోడ్ ఇవ్వనున్నారు. వీటిని జనాభా లెక్కల యాప్లో నమోదు చేస్తారు. దీనికోసం ప్రతి ఇంటికి సిబ్బంది వెళ్లాల్సిందే. ఇందులో శాశ్వత, తాత్కాలిక నివాస గృహాలు, వాణిజ్య, ప్రభుత్వ భవనాలు వంటి వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే ఆస్తుల వివరాలు, ఇళ్లు రకం, గదుల సంఖ్య, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. వంటగ్యాస్, టీవీ, ఫ్రిజ్, వాహనం వంటి వివరాలు సేకరిస్తారు. ఇంటర్నెట్, మొబైల్ వాడకం వివరాలు నమోదు చేస్తారు. జిల్లాలో మొదటి దశ జనగణనలో పాల్గొనే సుమారు వంద మంది మాస్టర్ ట్రైనీలకు ఆన్లైన్లో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉన్నారు. బ్లాక్ల వివరాలతో మ్యాప్లు కూడా సిద్ధం చేయనున్నారు. -
అన్నదాతల్లో ‘గుర్తింపు’ ఆందోళన
సత్తెనపల్లి: అన్నదాతలను టీడీపీ ప్రభుత్వం టెన్షన్ పెడుతోంది. ప్రతి రైతు 11 అంకెల గుర్తింపు కార్డు తీసుకోవాలంటూ కొత్త మెలిక పెట్టింది. ఈ నెలాఖరులోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఒత్తిళ్లు ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. –● సర్వర్ పనిచేయక, రైతులు అందు బాటులో లేక, మృతులు, డోర్లాక్డ్తో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. సర్వర్ సమస్యతో పలు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వలస బాటలో రైతులు... ఈ ఏడాది ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంటలు వాతావరణం అనుకూలించక తెగుళ్లతో దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. పెట్టుబడులు చేతికి రాక, పండిన కాసింత పంట ధరల్లేక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. కుటుంబ పోషణ కోసం పిల్లాపాపలతో కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఇంకా నెల వరకు వచ్చే అవకాశం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ఎక్కడ ముగుస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్డు లేకుంటే... రైతు గుర్తింపు కార్డు ద్వారా పంట రుణాలు, సబ్సిడీలు, వడ్డీ రాయితీ, వ్యవసాయంత్ర పరికరాలు, పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ పథకం, వైపరీత్యాల సమయంలో అందే పరిహారం వంటివి అందనున్నాయి. కార్డు లేకుంటే ఇవన్నీ ఆగి పోతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. రైతు విశిష్ట గుర్తింపు కార్డు నమోదులో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పాం. పూర్తి వివరాలతో రైతులు గుర్తింపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రస్తుతం సొంత భూములు ఉన్న వారు తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు ఆలస్యం చేయకుండా నమోదు చేయించుకునేందుకు ముందుకు రావాలి. –ఎం. జగ్గారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు


