breaking news
Palnadu
-
సమన్వయంతో శంకర్విలాస్ వంతెన పనులు
గుంటూరు వెస్ట్: గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ నూతన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సమన్వయంతో వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని చాంబర్లో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే తొలగించిన ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. -
సీఎంకు చెంచాలుగా ఐపీఎస్లు
సత్తెనపల్లి: కొందరు ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు చెంచాలుగా వ్యవహరిస్తూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. బంగారుపాళ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులపై, కార్యకర్తలపై, రైతులపై, అభిమానులపై రౌడీషీట్ పెడతానని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ బెదిరించడాన్ని ఖండించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ... చిత్తూరు ఎస్పీ మణికంఠ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠత్రిపాఠిలు చంద్రబాబుకు చెంచాలేనని ఆరోపించారు. వీరు కాకుండా మరికొంత మంది రిటైర్డ్ అయిన వారు కూడా ఇదే తీరులో మద్దతుగా ఉన్నారన్నారు. వీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది అక్రమమన్నారు. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా సమాధానం చెబుతామని, కోర్టులో వారి సంగతి తేలుస్తామని పేర్కొన్నారు. కేవలం హరీష్ కుమార్ వర్సెస్ బిహార్ అనే కేసును ఫాలో కాకుండా చేసిన అందరు ఎస్పీల మీద, అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద కేసులు పెడతామని హెచ్చరించారు. ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్పీ మణికంఠ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగానే ఆయన అంతు తేలుస్తామన్నారు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అని చంద్రబాబు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారన్నారు. కూటమికి గుణపాఠం తప్పదు... ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తమకు కేసులు, పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చేలా, నల్లచట్టాలు తీసుకొచ్చి అణచివేయడానికి, నిర్బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలిపారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఓటుతో ప్రజలు కూటమికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గుంటూరులో రెండు, సత్తెనపల్లిలోనూ అక్రమ కేసులు పెట్టారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి లేదన్నారు. మిర్చి, పొగాకు, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లినందుకే కేసులు పెట్టారన్నారు. వ్యవసాయం దండగ అనేది చంద్రబాబు వైఖరి అని వ్యాఖ్యానించారు. అందుకే రైతులను అణగదొక్కడానికి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రౌడీల్లా వ్యవహరిస్తున్న పలువురు పోలీసు ఉన్నతాధికారులు అడ్డగోలు కేసులు పెడితే కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి భయపడేదే లేదు... పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ... తమకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ జన సమీకరణ చేశామని పేర్కొంటూ తప్పుడు కేసు పెట్టారన్నారు. తమను అణచివేయాలని, భయపెట్టాలనే ఇలాంటి ప్రయత్నం సరికాదన్నారు. పొన్నూరులో ఒక దళిత సర్పంచ్పై, అదీ 60 ఏళ్లుగా రిజర్వేషన్ లేకుండానే రాజకీయంగా పలు పదవులు సొంతం చేసుకున్న కుటుంబంలోని వ్యక్తిపై హత్యాయత్నం చేయించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో అక్కడ కూడా కేసు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసులకు తాము భయపడేదే లేదన్నారు. -
అక్రమ కేసులతో వేధించేందుకు కుట్ర
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో కొత్త కుట్రలకు తెరదీస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మాచర్లలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ పచ్చ పేపర్లలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన స్పందించారు. ఇప్పటికే తనపై అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. చివరకు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాల వల్ల వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జంట హత్యలు జరిగితే తనపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసులో బెయిల్ వస్తుందేమోనన్న అనుమానంతో అక్రమ మైనింగ్ అంటూ కొత్త కుట్రలకు తెరలేపారన్నారు. ఆ మైనింగ్తో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి తనను ఇరికించాలని చూస్తున్నారన్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం, జూలకంటి బ్రహ్మారెడ్డిలు మాచర్లలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధిని పక్కదోవ పట్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాభిమానాన్ని ఓర్వలేక జాతీయ రహదారి నిర్మాణానికి అక్రమ మైనింగ్ మట్టి వాడారంటూ కొత్త ప్రచారానికి తెరదీశారన్నారు. ఆంధ్రజ్యోతిలో తనపై కావాలనే నిరాధార కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రిక యాజమాన్యంపై హైకోర్టులో పరువునష్టం దావా వేస్తామన్నారు. తనపై రోజుకో అసత్య ఆరోపణ తెరపైకి తెచ్చి వార్తలు రాస్తున్నారని, వారిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. కుట్రలకు భయపడేది లేదని చెప్పారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానన్నారు. టీడీపీ నేతల విభేదాలతో జరిగిన జంట హత్యల కేసును నాపై వేశారు అసత్య ఆరోపణలు చేసిన పేపర్పై న్యాయ పోరాటానికి సిద్ధం వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగ కమిటీ నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా యువజన విభాగ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యక్షులుగా సయ్యద్ జబీర్(గురజాల), దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి (మాచర్ల), ప్రధాన కార్యదర్శులుగా శివరాత్రి అశోక్కుమార్ (నరసరావుపేట), భిమాని అంకారావు (వినుకొండ), ఇల్లూరి వెంకటరామి రెడ్డి (గురజాల), నిమ్మా రాము (పెదకూరపాడు), యాసరపు బాబు (సత్తెనపల్లి), కార్యదర్శులుగా కోట చినబాబు (నరసరావుపేట), మాచర్ల పవన్కుమార్ (మాచర్ల), గోపు ఆంతోని రెడ్డి (పెదకూరపాడు), గాదె సత్యనారాయణ రెడ్డి (వినుకొండ), దాట్ల విక్రమ నరసింహ వర్మ (చిలకలూరిపేట), కంఠమనేని రామచంద్ర రావు (సత్తెనపల్లి), బైరెడ్డి బసవి రెడ్డి (మాచర్ల) నియమితులయ్యారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా నూలే అంకిరెడ్డి, అత్తర్ నాగూర్ వలి, షేక్ ఖాదర్ బాషా (వినుకొండ), బత్తుల సంజీవ రావు, పి.చిన్నరాజా (మాచర్ల), వజ్రాల శ్రీనివాస రెడ్డి, మైనేని ప్రతాపకుమార్, షేక్ బాజి (పెదకూరపాడు), ఎం.జయప్రకాష్ రెడ్డి, ఐ.దేశిబాబు (సత్తెనపల్లి), ఎం.డి.ఉస్మాన్, డి.జోజి బాబు, లకావత్ చిన దుర్గానాయక్, కత్తి రత్నశేఖర్ (చిలకలూరిపేట), షేక్ సైదా, పాతర్ల చిన్ని (నరసరావుపేట), చల్లా రంగారెడ్డి (గురజాల) నియమితులయ్యారు. -
హైవే బాధితులకు న్యాయం చేయండి
నరసరావుపేట: వినుకొండ–గుంటూరు నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఉప్పలపాడు గ్రామస్తులు, పట్టణ ప్రాంతవాసులకు తగిన న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ హైవే పనులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు శుక్రవారం కలెక్టరేట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరక్టర్ పార్వతీశం నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామస్తులు, పట్టణ ప్రాంతవాసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి బాధితులకు మద్దతుగా డాక్టర్ గోపిరెడ్డి హాజరయ్యారు. పరిహారం ఇచ్చాకే పనులు పీడీ పార్వతీశం మాట్లాడుతూ.. మొత్తం 80 కిలోమీటర్ల పొడవైన హైవేలో 45 కిలోమీటర్ల మేర భూ సేకరణ పూర్తయిందన్నారు. ఐదు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణాలు అవసరం అవుతాయని చెప్పారు. వచ్చే డిసెంబర్ లేదా మార్చిలోపు టెండర్ పిలవనున్నట్లు పేర్కొన్నారు. భూ సేకరణపై ఎన్ఎస్పీ, చిన్న నీటి పారుదల శాఖల అధికారుల అభ్యంతరాలను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల మేరకు భూములు సేకరిస్తామని తెలిపారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలు పెడతారన్నారు. రైటాఫ్ వే పద్ధతిని అనుసరించి 40 మీటర్లకు పైగా భూమి సేకరించనున్నట్లు వివరించారు. ఈ రోడ్డు మార్గంలో రోడ్డు వంకర తిరిగిన శావల్యాపురం, పెట్లూరివారిపాలెం గ్రామాల వద్ద బైపాస్ నిర్మాణం చేస్తారని చెప్పారు. ఉప్పలపాడు వద్ద రోడ్డు సక్రమంగా ఉండటం వలన బైపాస్ నిర్మాణం ప్రతిపాదించలేదని అన్నారు. ఉప్పలపాడు వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించండి ఎన్హెచ్ఏఐ పీడీకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సూచన నష్టం తగ్గేలా భూసేకరణ చేపట్టాలి దీనిపై డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 80 కిలోమీటర్ల రోడ్డు పొడవులో ఉప్పలపాడు గ్రామ విస్తీర్ణం అధికంగా ఉందన్నారు. రోడ్డును ఆనుకొని ప్రజలు నివాసం ఉండటం వలన భూ సేకరణతో ఎక్కువ మంది విలువైన భూములు, ఇళ్లు కోల్పోతున్నారన్నారు. అవకాశం ఉంటే ఉప్పలపాడు వద్ద బైపాస్ నిర్మాణం చేపట్టి నష్టాన్ని తగ్గించాలని కోరారు. ఉప్పలపాడు నుంచి ఎస్ఆర్కేటీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డుకు ఒకవైపే భూసేకరణ కారణంగా అనేకమంది గృహాలు, మిల్లులు, వాణిజ్య సముదాయాలు కోల్పోతున్నారన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొంది ఆ డబ్బులతో ఇళ్ల నిర్మాణం చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. జగనన్న కాలనీలో సుమారు ఆరు వేల మందికి ప్లాట్లు ఇచ్చారని, 500 మంది ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని గుర్తుచేశారు. ఈ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా భూమి సేకరిస్తే నష్టం తగ్గుతుందన్నారు. డాక్టర్ గోపిరెడ్డితో పాటు పార్వతీశం, గ్రామస్తులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ కరిముల్లా, డాక్యుమెంట్ రైటర్ మోహనరెడ్డి, రామాంజనేయరెడ్డి, పెద్దిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
చూపు.. పామాయిల్ వైపు..
పల్నాడు రైతులకు రెండేళ్లుగా వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అధికంగా పండించే మిర్చి సాగు చేసినా అప్పుల పాలవుతున్నారు. పత్తి పంటకు చీడపీడల దెబ్బకు గిట్టుబాటు కావడం లేదు. పొగాకు కొనేవారు కూడా కరువయ్యారు. ఈ నేపథ్యంలో మెట్ట రైతులు పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఇప్పటికే జిల్లా రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ● తొలుత 8 మండలాల్లో మొదలైన మొక్కల పెంపకం ● ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,408 ఎకరాల్లో తోటలు ● ఈ ఏడాది సాగు లక్ష్యం 3,300 ఎకరాలు ● ఉచితంగా మొక్కల పంపిణీ.. డ్రిప్, అంతర పంటలకు సబ్సిడీ ● సాధారణ పంటలకు ప్రత్యామ్నాయం అంటున్న ఉద్యాన శాఖ అధికారులు కేంద్రం ప్రోత్సాహంతో జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణంసాక్షి, నరసరావుపేట: ఇప్పటివరకు పామాయిల్ తోటలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలే గుర్తుకొస్తాయి. రెండు, మూడేళ్లుగా పల్నాడు జిల్లాలోనూ ఈ సాగు క్రమంగా పెరుగుతోంది. అనుకూల వాతావరణం, భూసారం, నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో 8 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పిడుగురాళ్ల, అమరావతి, రాజుపాలెం, బెల్లంకొండ, నాదెండ్ల, ఈపూరు, మాచవరం, సత్తెనపల్లి మండలాలు ఉన్నాయి. పామాయిల్ గెలలను నేరుగా తోటలోనే కొనుగోలు చేస్తారు. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థకు ఆరు మండలాలు, గోద్రెజ్ ఆగ్రోవేట్ సంస్థకు రెండు మండలాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు రైతులకు మెలకువలు నేర్పడంతోపాటు మద్దతు ధరకే పామాయిల్ కొనుగోలు చేస్తున్నాయి. అన్నివిధాలా ప్రోత్సాహం ఈ మండలాల పరిధిలో ఇప్పటి వరకు 1,408 ఎకరాల్లో పామాయిల్ సాగు చేశారు. బెల్లంకొండ, మాచవరం, ఈపూరు మండలాల్లో అధికంగా రైతులు మొగ్గు చూపారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 3,300 ఎకరాలుగా నిర్ణయించారు. పామాయిల్ దిగుమతిపై ఆధారపడకుండా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంట నూనెల మిషన్ ఏర్పాటు చేసి సాగు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మొక్కలను ఉచితంగా అందిస్తున్నారు. ఎకరానికి 57 మొక్కలను 9/9 మీటర్లకు ఒకటి చొప్పున నాటాల్సి ఉంటుంది. హెక్టారుకు 150 మొక్కలను ఉచితంగా అందజేస్తారు. విదేశీ రకమైతే రూ.29 వేలు, స్వదేశీ రకమైతే రూ.20 వేలు రాయితీ లభిస్తుంది. తోట నిర్వహణకు హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు. అంతర్ పంటల సాగుకు మరో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.5,250 చొప్పున ఇస్తారు. బిందు సేద్యం పరికరాలను సైతం రాయితీపై తీసుకొవచ్చు. పామాయిల్ హెక్టారుకు సగటున 25 నుంచి 30 టన్నుల గెలలు దిగుబడి ఉంటుంది. టన్ను ధర సుమారుగా రూ.18 వేల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఉచితంగా మొక్కలు పంపిణీ జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. ఎంపిక చేసిన 8 మండలాల్లో ఇప్పటికే సుమారు 564 హెక్టార్లలో సాగు అయింది. మొక్కలను ఉచితంగా అందజేస్తాం. సాగు ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఉంటుంది. అంతర్ పంటల సాగుకూ రాయితీ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. – ఇంటూరు వెంకట్రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పల్నాడు ప్రత్యామ్నాయంగా పామాయిల్ గతేడాది రెండు ఎకరాల్లో పామాయిల్ సాగు ప్రారంభించాను. ఉద్యాన శాఖ అధికారులు భూములను పరిశీలించి అనుకూలమని తేల్చారు. మిర్చి, పత్తి పంటలలో వరుస నష్టాల నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాం. ఉపాఽధి హామీ పథకం కింద అన్నివిధాలా సహకారం లభిస్తోంది. నాలుగేళ్లపాటు అంతర్ పంటలకు వెసులుబాటు ఉండటం రైతుకు మేలు చేకూరుస్తుంది. – ఆది కోటేశ్వరరావు, రైతు, వెంకటాయపాలెం -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు
పూనూరి గౌతంరెడ్డి మాట్లాడుతూ... మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు పాలిస్తున్నారని మండిపడ్డారు. రూ.5.60 లక్షల కోట్లు ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఏం చేసిందో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు చెప్పుకొనేందుకు తనకంటూ ఒక్క పథకమైనా లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఏది చెబితే అదే చేస్తారనే నమ్మకం ప్రజలలో ఉందన్నారు. పార్టీ సూచించిన ప్రకారం క్యూఆర్ కోడ్ ఉపయోగించుకుని ప్రతి ఇంటికి వెళ్లి బాబు మోసాలు ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కేసులకు భయపడొద్దన్నారు. -
నమ్మి మోసపోయిన ప్రజలు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసం చేస్తాడని తెలిసినా ఏదో ఒక ఆశతో ఓట్లేసి ప్రజలు మళ్లీ అధికారం అప్పగించారని అన్నారు. గత ఎన్నికల్లో ఓడింది తామే కాదని, కార్యకర్తలు కూడా అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసం గురించి తెలియజెప్పాలని కోరారు. టీడీపీ వారు చిన్న పని చేసి కొండంత ప్రచారం చేసుకుంటారని అన్నారు. మనం కూడా మారాలన్నారు. లెక్కలు కచ్చితంగా రాసుకొని తిరిగి అంతకు అంత ఇస్తామని హెచ్చరించారు. కేసులకు భయపడకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. -
సంబరం... ఇంద్ర వైభవం
నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ. 50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూల విరాట్ను వివిధ ఫలాలు, డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, పైనాపిల్, పచ్చి ఖర్జూరం, ఆల్బక్రా, యాపిల్, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మ సన్నిధిలో గురుపూజా మహోత్సవం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకటేశధ్వర ఘనాపాటి, శంకరమంచి శివప్రసాద్, అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు దంపతులను సత్కరించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు గురువులకు హారతులిచ్చి పూజ నిర్వహించారు. నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు. -
కొలిక్కిరాని బది‘లీలలు’
● జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద వెల్ఫేర్ సెక్రటరీల పడిగాపులు ● సుదూరంగా ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై ఆవేదన ● రివైజ్ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్న సెక్రటరీలు నెహ్రూనగర్: ఉమ్మడి జిల్లా రూరల్ పరిధిలో పనిచేసే గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సొంత మండలంలో పని చేయకూడదనే ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారం చేసుకుని అధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. ఈ నెల 7న వెలువడిన ఉత్తర్వులు చూసి సెక్రటరీలు కంగుతిన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరులో 874 మంది వెల్ఫేర్ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే వెబ్ ఆప్షన్స్(గూగుల్ ఫాం) ఇచ్చి బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు. చాలా మందిని ప్రస్తుత సచివాలయం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి బదిలీ చేశారు. దీంతో ప్రతిరోజూ వందల మంది సచివాలయ సెక్రటరీలు గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి వస్తున్నారు. తమను అంత దూరానికి బదిలీ చేస్తే ఏ విధంగా వెళతామంటూ అధికారులను వేడుకొంటున్నారు. దయతలిచి సొంత మండలం పక్కనే ఉన్న మండలంలోకి మార్చాలంటూ విన్నవించుకుంటున్నారు. ముడుపులకే ప్రాధాన్యం నిబంధనల ప్రకారం స్పౌజ్ కేటగిరికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, అధికారులు దాన్ని పక్కన పెట్టారు. ముడుపులు తీసుకుని కొందరికి నచ్చిన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పనిచేసే సెక్రటరీలకు బదిలీల ప్రక్రియ భారంగా మారింది. ప్రతి రోజు అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, న్యాయబద్ధంగా బదిలీల ప్రక్రియ జరపాలని కోరుతున్నారు. -
ఆందోళనతోనే ‘తల్లికి వందనం’
కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తనకు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి నియోజకవర్గంలోని కార్యకర్తలను చూసి ఇచ్చారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందేలా ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తుపెట్టుకుంటామని హామీ ఇచ్చారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. అవసరమైతే పార్టీ కోసం జైలుకు వెళతానని అన్నారు. వెన్నుపోటు దినం పాటించటం వలనే చంద్రబాబు తల్లికి వందనం కొంతవరకు అమలు చేశారని పేర్కొన్నారు. ఇతర హామీలు అమలు కాని తీరును ప్రజలకు వివరించాలన్నారు. -
అన్ని వర్గాలను ముంచేసిన బాబు
● సీఎం మోసాన్ని ప్రతి ఇంటికెళ్లి వివరించండి ● వైఎస్సార్సీపీ శ్రేణులకు ముఖ్య నేతల పిలుపు ● జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం ● నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం ● అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచన ● కేసులకు భయపడొద్దని, అండగా ఉంటామని భరోసా నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ముఖ్య నేతలు పేర్కొన్నారు. అన్నివర్గాలను చంద్రబాబు నిండా ముంచేశారని మండిపడ్డారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పల్నాడు జిల్లా పరిశీలకులు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. నాయకులకు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.సురేంద్ర, అచ్చి శివకోటి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం స్వామి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, అంగన్ వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, గిరిజన, మాదిగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు పాలపర్తి వెంకటేశ్వరరావు, కందుల ఎజ్రా, రొంపిచర్ల మండల ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్ర, యువజన విభాగ నాయకుడు ఎన్కే ఆంజనేయులు కూడా మాట్లాడారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పంచాయతీ విభాగ రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శనివారపు వాసుదేవరెడ్డి, అధికార స్పోక్ పర్సన్ ఆర్.శ్రీనివాసరావు, మద్దిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాకంబరిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం అమ్మవారిని కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. ఆలయంలోని జ్వాలాముఖి దేవికి కూడా శాకంబరిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. పెరుగుతున్న సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 541.20 అడుగులకు చేరింది. కాగా, ఇది 190.8366 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 4,204, ఎడమ కాలువకు 3,202, ఎస్ఎల్బీసీకి 1,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం 8,906 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,16,833 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కందులు కొనుగోలు చేయండి నరసరావుపేట: కందుల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. గురువారం కలెక్టరేట్లో దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మెరుగైన ధరకు కొనాలన్నారు. ఈ వారంలోగా ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా వ్యవసాయ అధికారి జె.జగ్గారావు, ఆర్డీవోలు కె.మధులత, రమణాకాంత్రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు పూర్తి నరసరావుపేట: జిల్లాలో గురువారం ధాన్యం కొనుగోలు బకాయిల్లో రూ.6.29 కోట్లు చెల్లింపులు ప్రధాన కార్యాలయ నుంచి రైతుల అకౌంట్లకు జమ చేశామని, దీంతో మొత్తం బకాయిలు రూ.11.36 కోట్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 రబీ సీజన్లో 68 రైతుసేవా కేంద్రాల ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా 550 మంది రైతుల నుంచి రూ.11.36 కోట్ల విలువైన 4,904 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జూన్ 30 వరకు రూ.4.07 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. జూలై ఒకటో తేదీన మరో రూ. కోటి రైతుల అకౌంట్లకు వేశామన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాకు చర్యలు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి నరసరావుపేట: నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ డి.పుల్లారెడ్డి చెప్పారు. గురువారం ఆయన బరంపేట విద్యుత్ కార్యాలయంలో పల్నాడు జిల్లా సర్కిళ్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులు, రెవెన్యూ కలెక్షన్లు పెంపుదల, పీఎం సూర్య ఘర్లపై సమీక్ష చేసి లక్ష్యాలు నిర్దేశించామన్నారు. వ్యవసాయ పంపు సెంట్ల కనెక్షన్ల కోసం రెండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే మూడు నెలల వ్యవధిలో రైతులందరికి ఆ సర్వీసులు అందజేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. లో ఓల్టేజ్, అధిక లోడులు ఉన్న ప్రాంతాల్లో బేస్మెంట్లు వేసి అధిక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జిల్లా విద్యుత్ శాఖాధికారి పి.విజయకుమార్, ఈఈ సీహెచ్ రాంబొట్లు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
సత్తెనపల్లి: క్రమశిక్షణతో ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘మెగా పీటీఎం 2.ఓ’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకోగలమని పేర్కొన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంతో చదవాలన్నారు. తద్వారా తల్లిదండ్రులకు పేరు తేవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పిల్లల చదువు తీరు గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపారు. అమ్మ పేరుతో మొక్క నాటడమే కాకుండా దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సత్తెనపల్లి ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్.ఆనంద్కుమార్లు కూడా మాట్లాడారు. తల్లిదండ్రుల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులకు పోటీలు పెట్టారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొక్కలు నాటిన విద్యార్థినులకు మొక్కలతోపాటు గ్రీన్ పాస్పోర్టు అందించారు. తల్లులకు చిన్నారులు పాదాభివందనం చేశారు. మొక్కలు పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మండల విద్యాశాఖాధికారి–2 ఎ.రాఘవేంద్రరావు, ప్రధానోపాధ్యాయురాలు మాధవీ లత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు -
పార్టీకి పెరుగుతున్న ఆదరణ
మోదుగుల మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలు మొదలుపెట్టే వరకు ఒక మాజీ ఎంపీగా పోలీసు అధికారులకు ఫోన్ చేసినా తనను లెక్క చేయలేదని గుర్తుచేశారు. అయితే పొదిలి, రెంటపాళ్ల పర్యటనలతో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు కుర్చీలు వేసి పనిచేసి పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదనే విషయం ప్రతి మహిళకు తెలియజేయాలన్నారు. కూటమి నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వివరించాలని సూచించారు. డాక్టర్ గోపిరెడ్డికి కార్యకర్తలు అండగా నిలబడాలని సూచించారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నాన్తాడును అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు విచారణలో సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించారు. నాగరాజును విచారించగా చైన్ స్నాచింగ్ను ఒప్పుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద సుమారుగా రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాగరాజు డీజే ఆపరేటర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్పై భర్తతో కలిసి వెవెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెవెళ్లిపోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రేపు జిల్లా స్విమ్మింగ్ జట్టు ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వాటర్ పోలో జట్టు ఎంపికలు నిర్వహిస్తామన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్రోడ్డులోని అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వతేది సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు. -
ఇష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు..
నరసరావుపేట రూరల్: పాఠశాలను దేవాలయంగా భావించి క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఎంచుకున్న రంగంలో రాణించవచ్చని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం ఎం.పార్వతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సృజనాత్మకతతో ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై ఉందన్నారు. తమ పిల్లల దినచర్యపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పిల్లల ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, అడిషనల్ ఎస్పీ సంతోష్, ఆర్డీఓ మధులత, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి, విద్యాకమిటీ చైర్మన్ ఎం.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ హెచ్ఎం ఎంఎస్ఆర్కే ప్రసాద్ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు లింగంగుంట్ల శంకర భారతీపురం హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ -
అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా?
సత్తెనపల్లి: ఎవరి హయాంలో, ఏ విధమైన అభివృద్ధి జరిగిందో చర్చకి వచ్చే దమ్ము చంద్రబాబు, అండ్ కోకు ఉంటే తన సవాల్ను స్వీకరించాలని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ .. నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్త్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి అధ్యక్షత వహించారు. పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో, చంద్రబాబు 21 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు వస్తే సత్తెనపల్లి వేదికగా తేల్చుకుందామని, ఈ సవాల్ను చంద్ర బాబు, అండ్ కో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా నెల రోజుల్లోపు స్వీకరించవచ్చన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. వందలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చడం, వేలాది మందిని క్షతగాత్రులు చేయడం తప్ప మరొకటి లేదన్నారు. మీరు పెట్టే అక్రమకేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడేది లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ. 23 లక్షల కోట్ల భారం వైఎస్సార్ సీపీ శ్రేణులంతా కలిసికట్టుగా ఐకమత్యంతో పని చేయాలని, అప్పుడే ఎలాంటి అక్రమ కేసులైనా ఎదుర్కోవచ్చునన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీకి పట్టుకొమ్మ లాంటిది సత్తెనపల్లి నియోజకవర్గమన్నారు. వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే బలమన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ. 23 లక్షల కోట్ల భారం ప్రజలపై చంద్రబాబు వేయనున్నారన్నారు. నాడు వైఎస్ జగన్ యూనిట్ రూ. 2కు విద్యుత్ కొనుగోలు చేస్తే పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు, ఎల్లో మీడియా ఇప్పుడు యూనిట్ రూ. 4.75 కొంటుంటే మౌనంగా ఉంటున్నారన్నారు. జగన్ హయాంలో 1.35 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు, 4 లక్షల వలంటరీ ఉద్యోగాలు ఇస్తే.. చంద్రబాబు ఏపీ ఫైబర్లో 1200 మందిని, ఏపీ బేవరేజెస్లో 18 వేల మందిని, 4 లక్షల వలంటీర్లను తొలగించాడన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఇంటింటికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పట్టణంలో పర్యటించి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ .. మోసాలు వివరిద్దమన్నారు. ఇంటింటికి చంద్రబాబు మోసాలు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మారుస్తూ చంద్రబాబు కోతలు విధిస్తున్నాడన్నారు. దివ్యాంగుల పెన్షన్లకు వెరిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఇంటింటికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రెంటపాళ్ళ జగన్ పర్యటనను ఎలా విజయవంతం చేశామో అదే ఊపు, ఉత్సాహంతో మరో మూడేళ్లు పని చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు పక్కాల సూరిబాబు, డాక్టర్ గీతా హసంతి, రోళ్ల మాధవి, చలంచర్ల సాంబశివరావు, గంగారపు అనూష, రాజవ రపు శివ నాగేశ్వర రావు, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీను, వేపూరి శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, ఎంజేఎం రామలింగారెడ్డి లు మాట్లాడారు. సమావేశంలో నాయకులు రమావత్ కోటేశ్వరరావు నాయక్, ముక్త్యార్, సయ్యద్ ఘోర, షేక్ జలీల్, అచ్యుత శివప్రసాద్, తుమ్మల వెంకటేశ్వరరావు, చిలుక జైపాల్, లోకా మాధవ, గడ్డం వెంకటేశ్వర్లు, వాకు మళ్ళ చెంచిరెడ్డి, చిన్నం మణి బాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో సత్తెనపల్లిలో తేల్చుకుందాం చంద్రబాబు మోసాలను ఇంటింటికి చాటుదాం వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి -
యూనిఫాం లేక.. సాధారణ దుస్తులతోనే రాక...
వేసవి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభించే నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో మాత్రం విఫలమైంది. పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్కు విద్యార్థులు సాధారణ దుస్తులతో హాజరయ్యారు. పాఠశాలలో మొత్తం 1225మంది విద్యార్థులు ఉండగా, వీరికి యూనిఫామ్ అందకపోవడంతో వారందరూ సాధారణ దుస్తులతోనే సమావేశానికి హాజరవడం గమనార్హం. తొలుత ఈ పాఠశాలలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. అయితే విద్యార్థులకు యూనిఫామ్ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గైర్హాజరయ్యారని తల్లిదండ్రులు చర్చించుకున్నారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. అలాగే హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పిఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు. -
నీటిగుంటలో పడి వ్యక్తి మృతి
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వతేదీన గ్రామ సమీపంలో బహిర్భూకని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో వున్న నీటి కుంటలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల వున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం
వినుకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రెడ్బుక్ చర్యలు ఆగడంలేదు. పోలీసుల సహాయ సహకారాలతో వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రామినీడి అనీల్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై ఈపూరు పోలీసులు తమ ప్రతాపం చూపారు. గురువారం స్టేషనకు పిలిపించి అర్ధరాత్రి వరకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంతకు అనీల్చేసిన నేరమేమిటంటే.. ఇటీవల హైదరాబాద్లోని ఓ టీవీ కార్యాలయంపై కొందరు దాడిచేసి కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపై.. అనీల్ సోషల్ మీడియాలో సాక్షి మీడియాపై కూడా రాష్ట్రంలో దాడులు జరగలేదా..? అని పోస్టు పెట్టడమే. దీనిని గమనించిన స్థానిక టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో అనీల్ను స్టేషనుకు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అనీల్ కోసం స్టేషన్కు వెళ్లగా వారిని చూసి పోలీసులు అనీల్ను వదలిపెట్టడం గమనార్హం. ● తాము చెప్పినట్లు నడుచుకోకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు తొలగించినప్పటికీ కనికరంలేకుండా పోలీసులు క్రూరంగా తనను హింసించినట్లు తెలిపాడు. పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడితే న్యాయం కోసం ఇంక ఎక్కడి వెళ్లాలని వాపోయాడు. ● అనీల్పై దాడిని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈపూరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు. న్యాయపరమైన పోరాటం చేసి కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. అర్ధరాత్రి స్టేషనుకు పిలిపించి తమదైన శైలిలో కౌన్సెలింగ్ సోషల్మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో దారుణం ఖండించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసినాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటీష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢి చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని సత్తెనపల్లి: 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్పై పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం చేయమన్న పనులు, ఇవ్వమన్న రిపోర్టులు క్షణాల మీద నిద్రాహారాలు మానేసి సమాయానికి ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావలసిన 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్ పట్ల మాత్రం మౌనంగా ఉంటున్నారని, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను నిరాస నిస్ప్రహలకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు. నెలాఖారులోగా పనులు పూర్తిచేస్తాం ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో జరుగుతున్న మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. గురువారం పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వటం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలో ఉన్ననటువంటి మేజరు కాల్వలు రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు. -
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో క్రోసూరు: కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచిపోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మీడియాతో మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని, దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టాడని తెలిపాడు. గతంలో కూడా సాగు నీరు విషయమై వీరు తనపై దౌర్జన్యం చేసారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేసారు. ఆందోళన చేస్తున్న వారితో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు. -
● సివిల్ వ్యవహారంలో డబ్బుల దగ్గర వివాదం ● ఇద్దరు న్యాయవాదులు కూటమి నేతలే.. ● వినుకొండలో తీవ్ర చర్చనీయాంశం
ఇండోర్ ఆడిటోరియం స్టేడియం ప్రారంభం సత్తెనపల్లి: సత్తెనపల్లిలో ఇండోర్ ఆడిటోరియం స్టేడియాన్ని బుధవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాలు అభివృద్ధి చేసి దానిలో 2,500 ఎకరాలు అంతర్జాతీయ క్రీడా మైదానానికి కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. తొలుత స్టేడియాన్ని ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. స్టేడియానికి సంబంధించి పెండింగ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్, ప్రహరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాటికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వినతి పత్రం అందించారు. నూతనంగా ప్రారంభించిన కోర్ట్లో బ్యాడ్మింటన్ ఆడారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదిపై మరో న్యాయవాది దాడి వినుకొండ: సీనియర్ న్యాయవాదిపై మరో సీనియర్ న్యాయవాది దాడి చేసి, దుర్భాషలాడిన ఘటన వినుకొండ పట్టణంలో న్యాయస్థానం ముందు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామ పరిధిలోని భూమికి సంబంధించి సివిల్ దావా ఒకటి వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నడుస్తోంది. అయితే, పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది ఆ దావాను కొంత కాలం నుంచి తన క్లయింట్ తరఫున వాదిస్తూ వచ్చాడు. తనకు ఆ కేసును ఇచ్చినట్లయితే రాజీ చేసి, ప్రతిఫలం ముట్టచెబుతా అని మరో సీనియర్ న్యాయవాది దావాను చేజిక్కించుకున్నాడు. అదేమని అడిగితే కోర్టు గేటు ముందే దాడి చేశాడు. అయితే, న్యాయవాదులు ఇద్దరూ కూటమికి చెందిన వారే కావడం విశేషం. ఈ గొడవ బయటకు పొక్కడంతో పట్ణణ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. న్యాయవాదులు సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కూటమి ప్రభుత్వం పరువు తీస్తున్నారని ఆ పార్టీలో కూడా చర్చ జరగడం విశేషం.ఇంత జరిగినా దాడిపై న్యాయవాది ఫిర్యాదు చేయకపోవడం విశేషం. -
మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతదేహంతో ఫ్యాక్టరీ ముందు ధర్నా సత్రశాల(రెంటచింతల): స్థానిక పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుని కుటుం సభ్యులు, బంధువులు, కార్మికులు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బుధవారం రాత్రి ధర్నా చేశారు. ఫ్యాక్టరీలో ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్న ఉప్పుతోళ్ల మల్లయ్య (47) జూన్ 29న విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే పరాశక్తి ఫ్యాక్టరీ అంబులెన్స్లో తొలుత పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 50 వేలు అందజేసింది. అది కాకుండా మల్లయ్య కుటుంబ సభ్యులు మరో రూ. 2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆర్థికస్తోమత లేకపోవడం వల్ల అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఫ్యాక్టరీ అధికారులు మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మల్లయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ఫ్యాక్టరీ ప్రధాన రహదారి ముందు ధర్నా చేశారు. కొంతసేపు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని సర్ది చెప్పారు. మల్లయ్యకు భార్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. తొలుత భార్య లక్ష్మమ్మ న్యాయం చేయాలని కోరుతూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఉరి వేసుకుని భార్య హంతకుడు ఆత్మహత్య
బొల్లాపల్లి:అనుమానం పెనుభూతమై అర్ధాంగిని కడతేర్చిన భర్త అదే గ్రామ పొలాల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. భార్యాభర్తల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బండ్లమోటు ఎస్ఐ ఏ. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లవాగు గ్రామ పొలాల్లో గంగనబోయిన వెంకటేశ్వర్లు (37) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల కిందట ఇదే పొలాల్లో భార్య కృష్ణకుమారిని హత్య చేసి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసిన ప్రదేశానికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పొలానికి వచ్చిన గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రాంతానికి వారు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి టౌన్ చర్చి శత వార్షికోత్సవాలు
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం తెనాలి: పట్టణంలో టౌన్చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి (తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల ఆహ్వాన పత్రిక, బ్రోచర్ను బుధవారం టౌన్చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసు రత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్బాబు, రెవరెండ్ డి.సాల్మన్రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్బాబు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్థన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్ హాజరవుతారని తెలిపారు. ● రెవ.వై.లెనిన్బాబు మాట్లాడుతూ హాఫ్ దొర టౌన్చర్చిని కట్టించి విద్యాలయం, వైద్యశాలను నిర్మించి ప్రజలకు సేవలందించినట్టు తెలిపారు. మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్జాన్స్ విద్యాసంస్థ పక్కనగల లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని అడ్హాక్ కమిటీ సభ్యుడు జి.వేమయ్య చెప్పారు. -
గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు పతకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్క్రాస్కు అవార్డులు వరించాయి. కుడి జల విద్యుత్ కేంద్రం ఉద్యోగుల నిరసన విజయపురిసౌత్: ఎన్సీసీవోఈఈఈ దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు జేఏసీ నాయకులు, ఉద్యోగులు సంఘీభావంగా కుడి జలవిద్యుత్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో 15 నిమిషాల సేపు ఆందోళన చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జి. రాజారెడ్డి, సెక్రటరీ అములు నాయక్, కన్వీనర్ బి. సూరజ్చంద్, కో–చైర్మన్ వెంకటేశ్వర్లు, కో–సెక్రటరీ రాణి, కో–కన్వీనర్ రామకృష్ణ, ఎన్. సాంబశివరావు, మెంబర్స్ ఎస్కే అక్బర్, రేవతి, సీహెచ్. తిరుపతిరావు, వై. వెంకటేశ్వర్లు, మనోహరమ్మ, సీహెచ్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్లో విచారణకు హాజరుకావాలంటూ.. సత్తెననపల్లి పట్టణ పోలీసులు బుధవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. క్రైం నెంబర్ 156/2025 అండర్ సెక్షన్ 189(2), 189(3), 189(4), 298, 351 (2), 352, 126(2), 61(2) రెడ్విత్ 190 బీఎన్ఎస్ అండ్ సెక్షన్ 3ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు అంశంలో జరిగిన నేరానికి సంబంధించి మీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా రూఢీ అయిన నేపధ్యంలో, దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్కు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు తెనాలి రూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీల లెక్కింపు జరిగింది. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. -
ప్రభాకర్ను వెంటనే విడుదల చేయాలి
నరసరావుపేట: కుల నిర్మూలనా పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్తోపాటు దేశవ్యాప్తంగా అనేక అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదివాసీలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక ఉపా చట్టం కింద ప్రభాకర్ను అరెస్టు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ కేఎన్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న ఒంగోలు పట్టణంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదుట సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేఎన్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాదు, సహాయ కార్యదర్శి జక్కాబ్రహ్మయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఓర్సు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు బయ్యవరపు రామయ్య, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు చలంచర్ల అంజి, కంబాల ఏడుకొండలు, దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ పాల్గొన్నారు. -
‘కూటమి’ దెబ్బకు రైతు కుదేలు
సత్తెనపల్లి: రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సాగుకు సంబంధించిన పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రైతుకు రూ. 13,500 చొప్పున రైతు భరోసా మంజూరు చేయడంతో కొంత లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కంటే అదనంగా కొంత చేర్చి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద అందిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. నిధులు విడుదలవుతాయా? కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా రూ. 20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడాదైనా ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధి పొందడానికి సమీప రైతు సేవా కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో... అర్హులను గుర్తించి నిధులు విడుదల చేసేదెప్పుడో.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. భారంగా మారిన సాగు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయి. దుక్కి, కూలీల ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నింటిని దాటి పంటలను సాగు చేయాలంటే తగిన దిగుబడి చేతికి వస్తుందన్న ఆశ కూడా పూర్తిగా లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో కంటే తక్కువగా పంటలు సాగు చేస్తున్నారు.రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం, పంట నష్టపోతే బీమా పరంగా అండ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి కనీసంపట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక సాయం అందివ్వని ప్రభుత్వం ఖరీఫ్ పెట్టుబడికి తప్పని పాట్లు నగదు లేక కష్టపడుతున్న అన్నదాతలు జిల్లాలవారీగా పరిస్థితి ఇదీ... జిల్లా అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి ఈకేవైసీ పెండింగ్ గుంటూరు 1,07,942 1,02,731 5,211 పల్నాడు 2,39,110 2,31,495 7,615 బాపట్ల 1,59,157 1,52,842 6,315 -
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
పిడుగురాళ్ల రూరల్: మిరప నారు పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు సూచించారు. కామేపల్లి రైతు భరోసా కేంద్రంలో బుధవారం సమగ్ర ఉద్యాన మిషన్ ఆధ్వర్యంలో మిరప నారు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు, డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ హాజరయ్యారు. ముందుగా కామేపల్లిలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రావు నర్సరీ చట్టం– 2010 గురించి యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. స్టాక్, సేల్స్, తనిఖీ అధికారి రిజిస్టర్లతో పాటు రసీదులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. నర్సరీ చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, సస్యరక్షణ , విత్తే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కో– ఆర్డినేటర్ మస్తాన్వలి, ఉద్యాన శాఖ అధికారి కుమారి అంజిలిబాయి, గ్రామీణ ఉద్యాన శాఖ అధికారులు కరిముల్లా, దస్తగిరి, పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు -
పల్నాడు
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025శాకంబరిగా పార్వతీ అమ్మవారు దుగ్గిరాల: గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు బుధవారం శాకంబరిగా భక్తుకుల దర్శనం ఇచ్చారు. అలరించిన భక్తి సంకీర్తన నగరంపాలెం: స్థానిక ఆదిత్యనగర్లోని సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి సంకీర్తన కార్యక్రమం అలరించింది. సాయినాథుని గ్రామోత్సవం ముప్పాళ్ళ: గురుపౌర్ణమి సందర్భంగా చాగంటివారి పాలెంలోని ప్రసన్న షిరిడీ సాయిబాబా ఆలయంలో బుధవారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 -
శరణు శాకంబరి
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరి ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకుపైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. – ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
కార్మికుల సమ్మెతో కేంద్రం దిగి రావాలి
నరసరావుపేట: కార్మికుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేబర్ కోడ్ అమలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కోరారు. బుధవారం సార్వత్రిక సమ్మెలో భాగంగా వినుకొండ రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద నుంచి స్టేషన్రోడ్డులోని గాంధీ పార్కు వద్ద ధర్నా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె శిబిరానికి సీఐటీయూ నాయకులు షేక్ సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రధాని విడనాడాలని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆఫీసు నుంచి ఆర్డీవో కార్యాలయం, గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో సార్వత్రిక సమ్మె ర్యాలీ నిర్వహించిన వామపక్షాలు -
ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు
చెమట చుక్కలు చిందించి సాయిసాధన చిట్ ఫండ్లో పెట్టిన సొమ్మంతా పోగొట్టుకుని రోడ్డున పడి గుండెలు బాదుకున్న బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పిల్ల పెళ్లికి దాచుకున్న డబ్బు తీసుకుని బోర్డు తిప్పేస్తే.. ఆ తల్లిదండ్రుల గుండె మంటలు రగులుతూనే ఉన్నాయి. అయ్యా.. ఆత్మహత్యే శరణ్యమంటూ కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్లు పట్టుకుని వేడుకున్న బాధితుల రోదనలు మిన్నంటుతూనే ఉన్నాయి. తమ కష్టం తిరిగొస్తుందో, రాదోననే దిగులుతో ఎదురు చూస్తున్న వారు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. అసలు నిబంధనలే పాటించకుండా అడ్డగోలుగా చిట్లు వసూలు చేసి, కుచ్చుటోపీ పెట్టిన బడాబాబులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. నిబంధనలు పాటించని ఇంకా ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పాలకులు, అధికారులు మాత్రం స్పందించడం లేదు.చిట్ఫండ్ సంస్థలు నడపాలంటే 1982 చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలి. చీటీ పాటలకు సంబంధించి సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలతో సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ప్రతి నెలా నిర్వహణకు సంబంధించి లెక్కలు చూపాలి. సభ్యులకు లిఖితపూర్వక ఒప్పందాలు అందించాలి. ఎంత మొత్తంలో చీటీపాట నిర్వహిస్తున్నారో, అంత సొమ్మును జాయింట్ రిజిస్ట్రార్, చిట్ఫండ్ పేర్లతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అయితే నేటి పరిస్థితుల్లో ఈ నియమాలు నామమాత్రంగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి లేకుండానే నిర్వాహకులు చీటీపాటలు నడుపుతున్నారు. ఇది చట్టప్రకారం నేరం అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇప్పటి వరకు ఒకరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక నష్టపోయిన వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదు. నరసరావుపేటటౌన్: రిజిస్ట్రేషన్ ఉన్న చిట్ ఫండ్లో సభ్యులుగా చేరితే డబ్బులకు ఢోకా లేదంటూ నమ్మించి కోట్లాది రూపాయలు పోగేసుకొని రాత్రికి రాత్రే సాయిసాధన చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. మోసపోయిన బాధితులు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లితే పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. సాయి సాధన చిట్ఫండ్కు అసలు రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతులు లేవని తెలిసింది. యథేచ్ఛగా అక్రమ చీటీపాటల లావాదేవీలు కొనసాగించినట్లు తెలిసింది. దీంతో చిట్ఫండ్స్ విషయంలో అధికారుల డొల్లతనం తేటతెల్లమైంది. చట్టబద్ధమైన నిబంధనలు, రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ చీటీ పాటలకు అమాయక ప్రజలు పొదుపు ధనాన్ని పూర్తిగా నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపం ఈ మోసాలకు దారి తీస్తున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఇటీవల అనధికార చిట్ఫండ్ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు, అటు ప్రభుత్వం మౌనం వహించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనధికారంగా నడుస్తున్న పాటలు చట్టపరంగా చిట్ఫండ్ సంస్థలు నడపాలంటే రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఇవి ఏమీ పాటించకుండా కొన్ని సంస్థలు అనధికార చీటీపాటలు నిర్వహిస్తున్నాయి. అందులో సభ్యులుగా చేరి చివరకు కట్టిన సొమ్ము చేతికి అందక బాధితులుగా మిగులుతున్నారు. పేరుకే సంస్థలు ఏర్పాటు చేస్తున్నారుగానీ, వాస్తవానికి ఎటువంటి బాధ్యత లేకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చిట్ఫండ్ నిర్వాహకులు ఒకటి, రెండు చీటీ పాటలకు అనుమతి పొందుతున్నారు. ఇక మిగిలినవి అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఏ ఆధారాలు లేకుండానే వేరే ప్రాంతాలకు తరలి పోయే సంస్థల యజమానుల వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు డబ్బు నష్టపోతున్నాయి. అమాయకులే బలిపశువులు ఈ చీటీ పాటల మాయాజాలంలో పడే వారి తాలూకు బాధలు వర్ణనాతీతంగా మరాయి. అవసరానికి ఆదుకుంటాయని రూపాయి, రూపాయి కూడ బెట్టి స్థోమతను బట్టి నెలకు రూ.5,000 నుంచి రూ.50,000 వరకూ చెల్లిస్తూ వచ్చారు. చివరికి లబ్ధిదారులు డబ్బు పొందే సమయంలో నిర్వాహకులు షాక్ ఇస్తున్నారు. బోర్డు తిప్పేసి మాయం కావడం పరిపాటిగా మారింది. కట్టిన డబ్బులకు చట్టపరంగా ఏ విధమైన ఆధారాలూ లేకపోవటంతో సభ్యులు మోసపోతున్నారు. దీంతో పోలీసులు కూడా అనధికార చిట్లపై కేసులు నమోదుకు ముందుకు రావటం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. పాటించాల్సిన నిబంధనలు ఇవిగో.. నరసరావుపేటలోచిట్ ఫండ్ మోసాలపై దృష్టి పెట్టాల్సిన రిజిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే ఈ తరహా మోసాలకు కారణం అవుతోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో తగిన ఆధారాలు లేని కారణంగా కేసును తిరస్కరిస్తున్నారు. ఫలితంగా మోసగాళ్లు నిర్భయంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో అనేక పేర్లతో చీటీ పాటలు నిర్వహిస్తున్నారు. గృహిణులు, చిన్న స్థాయి వ్యాపారులు, రోజువారీ కూలి చేసేకునే వారు, వంటి వారందరూ ఈ పాటల్లో సభ్యులుగా చేరుతున్నారు. కానీ ఇటీవల కొన్ని సంస్థలు వార్షిక మొత్తాన్ని తీసుకుని మధ్యలోనే ఆచూకీ లేకుండా మాయమవడం మొదలుపెట్టాయి. ఒకచోట గోడకెక్కిన బోర్డులు, ఖాళీగా ఉన్న కార్యాలయ గదులు, తాళం వేసిన తలుపులు కనిపిస్తే చిట్ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసిందని అర్థం చేసుకోవచ్చు. అనధికార చిట్ఫండ్లపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలు మరింతగా తమ కష్టార్జితం నష్టపోయే అవకాశం ఉంది. -
నేటికీ ప్రారంభం కాని పనులు
కొత్తపాలెం – కోటప్పకొండ రోడ్డు పనులకు రెండు నెలలు క్రితం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయినా నేటి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. వెట్మిక్స్ వేసిన రోడ్డుపై ప్రస్తుతం కంకర బయటపడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరికే రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించినా.. నేటికీ రోడ్డు పనుల్లో పురోగతి లేకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగా ప్రకటనలకే పరిమితమైందని, ఆచరణ ఉండదని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ‘ఎక్స్’లో ఉప ముఖ్యమంత్రి పోస్టు -
రోడ్డేది.. డిప్యూటీ సీఎం సారూ?
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి చేరే దారుల్లో ఒకటైన కొత్తపాలెం – కోటప్పకొండ రోడ్డు అధ్వానంగా తయారయింది. కోటప్పకొండ నుంచి గోనెపూడి మీదుగా కొత్తపాలెం వరకు ఈ రోడ్డు ఉంది. ఎనిమిది కిలోమీటర్ల ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట – నరసరావుపేట రోడ్డుకు చేరుకోవచ్చు. నాదెండ్ల మండలం నుంచి కోటప్పకొండ వైపునకు వచ్చే ప్రయాణికులు, యాత్రికులు ఈ రోడ్డును ఉపయోగిస్తుంటారు. రూ.3.9 కోట్లు మంజూరంటూ ప్రకటన గోతులమయంగా మారిన రహదారిలో వాహన దారుల ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన ప్రధాన రహదారి కావడంతో ఆయన స్పందించి రోడ్డు నిర్మాణానికి రూ.3.9 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ‘ఎక్స్’లో ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగే మహా శివరాత్రికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఈ మేరకు జనవరి నెలలో పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదల అయింది. ఉన్నది తవ్వారు.. కొత్తది వేయరు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో టెండర్ల ప్రక్రియతో సంబంధం లేకుండానే టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. జనవరి నెలలో అప్పటివరకు ఉన్న రోడ్డును పొక్లెయిన్తో తవ్వేశారు. దీంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా ఈ రోడ్డులో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడం, ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించిన కోటప్పకొండ తిరునాళ్లకు సమయం దగ్గర పడటంతో టెండర్లు లేకుండానే హడావుడిగా రోడ్డు పనులు ప్రారంభించారు. వెట్మిక్స్ పరిచి దుమ్ము లేవకుండా నీళ్లు చల్లి తిరునాళ్ల వరకు ముగించారు. కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డు నిర్మాణం మాటల్లోనే.. నిధులు మంజూరు చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం 8 కి.మీ. రోడ్డుకు రూ.3.9 కోట్లు మంజూరు చేస్తూ జీఓ సైతం జారీ ఎనిమిది నెలలు గడిచినా ప్రారంభం కాని పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా టెండర్ల ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో వెట్మిక్స్ పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు కూడా నిర్వహించాం. ఇప్పటికి 25శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. పనులు వెంటనే ప్రారంభించి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకు వస్తాం. – ప్రసన్నకుమార్, పంచాయతీరాజ్ జేఈ -
ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాటం ఆగదు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటనకు వచ్చిన సందర్భంగా 113 మందికి నోటీసులు ఇచ్చామని పోలీసులు అంటున్నారని, పది లక్షల మందికి ఇచ్చినా ప్రజల పక్షాన వైఎస్ జగన్ పోరాటం చేస్తారని, అది ఆగేది కాదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. విచారణలో భాగంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో కలిసి బుధవారం సత్తెనపల్లి పోలీసుస్టేషన్కు ఆయన వచ్చారు. పోలీసుల విచారణ అనంతరం పోలీసుస్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నందున చేతనైతే ప్రజలకు మంచి చేయాలన్నారు. ప్రజలు, ప్రతిపక్షాల వారు రోడ్డు మీదకు రాకూడదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయకుండా తిరుగుబాటు వస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆ తిరుగుబాటే విప్లవం అవుతుందని, ఆ విప్లవం నాలుగు సంవత్సరాల్లో టీడీపీని కాల్చి పడేయబోతుందన్నారు. హామీలపై నిలదీస్తున్నందుకే భయం వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వాస్తవంగా వైఎస్ జగన్ను చూస్తే చంద్రబాబుకు భయమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం భయపడుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చిత్తూరు వెళితే మామిడి రైతులు కాయలను రోడ్డు మీద పడేస్తున్నారని గుర్తుచేశారు. పల్నాడుకు వస్తే ధాన్యం, పొగాకు, అపరాలు కొనేవారు లేరన్నారు. గొడవలు సృష్టించడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదన్నారు. తమను ఇక్కడకు ఏం చేశామని పిలిపించారని ప్రశ్నించారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్సీపీ నాయకులు చల్లంచర్ల సాంబ శివరావు, భావనాశి యల్లారావు, అచ్యుత శివప్రసాద్, ముక్త్యార్, గుజ్జర్లపూడి చంటి, గుజ్జర్లపూడి కృపారావు, వాకుమళ్ల చెంచిరెడ్డి, తుమ్మల వెంకటేశ్వరరావు, సయ్యద్ ఘోరా, వల్లెం నరసింహారావు, గడ్డం వెంకటేశ్వర్లు (బుల్లోడు), గంటా ఏసుబాబు, యాసారపు బాబు తదితరులు పాల్గొన్నారు. పది లక్షల మందికి నోటీసులిచ్చినా ముందుకే సాగుతాం మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు వెల్లడి సత్తెనపల్లి పోలీసు స్టేషన్లో విచారణకు హాజరు -
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వేదవ్యాస ఆరాధన అమరావతి: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాసాలయంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో రెండవరోజు కార్యక్రమాలలో భాగంగా బుధవారం వ్యాస భగవానునికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, వ్యాస ఆరాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భవఘ్ని గురూజీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి వ్యాస భగవానుడు అందించిన భగవద్గీత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వేడుకలలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, షూక్ బాపూజీ పద్యనాటకం భక్తులను ఎంతగానో అలరించాయి. భక్తులు పలు జిల్లాల నుంచి భారీగా పాల్గొన్నారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్కో క్వార్టర్స్ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్ను జెన్కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అమరేశ్వరుని ఆదాయం రూ.27.09 లక్షలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596, మొత్తం రూ.27,09,095 వచ్చిందన్నారు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
● గుంటూరు అర్బన్ నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీలు ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. కనీసం ఐదు ఆప్షన్లల్లో ఒకట్రెండు వాటికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఏడు నెలల బాబు ఉన్నాడని దరఖాస్తులో తెలియజేసినా గుంటూరు అర్బన్ నుంచి మేడికొండూరు మండలం రూరల్కు బదిలీ చేశారని ఓ మహిళా పోలీస్ వాపోయింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అందుబాటులో లేరని చెప్పడంతో డీపీఓ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంటి బిడ్డలతో వచ్చిన వారు సైతం వెనుదిరిగి వెళ్లారు. -
ఎస్పీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
నరసరావుపేట రూరల్: పోలీసుల ఆరోగ్యం సమాజ ఆరోగ్యానికి ప్రతిబింబం అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించగలరని అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పోలీసులు సిబ్బందికి ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. మహాత్మాగాంధీ సూపర్స్పెషాలిటి హాస్పిటల్ వైద్యుల సహకారంతో నిర్వహించిన క్యాంప్లో 100మంది పోలీసు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు జరిపారు. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, ఈసీజీ, కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్ట్లు వంటి కీలక పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ వరకు హెల్త్ చెకప్ క్యాంప్ జరుగుతుందని తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిడి, నిద్రలేమి, అధిక శారీరక శ్రమ వంటి అంశాలు పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు భవిష్యత్లో కూడా నిరంతరాయంగా కొనసాగుతాయని వివరించారు. కార్యక్రమంలో పోలీసు శాఖ వైద్యురాలు డాక్టర్ ఎస్.వాసవి, మహాత్మాగాంధీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికులకు తీరని ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటూరు విజయ్కుమార్ ● నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సత్తెనపల్లి: కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసి కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తీసుకు వచ్చి కార్మికులకు తీరని ద్రోహం చేసిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటూరు విజయ్కుమార్ అన్నారు. సత్తెనపల్లిలో సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పేదల వ్యతిరేక విధానాలను విడనాడాలని, రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని బుధవారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తూ ప్రజలపై భారాలను మోపుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రంలోని బీజేపీకి వత్తాసు పలుకుతూ అవే విధానాలు అమలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లు బడుగు బలహీన వర్గాలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, కోపరేటివ్ బ్యాంక్, మార్కెట్ యార్డ్, యూనియన్ బ్యాంక్, అంగన్వాడీ కేంద్రాలు, కరూర్ వైశ్యా బ్యాంక్లను సందర్శించి కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి.మల్లేశ్వరి, పెండ్యాల మహేష్, అవ్వారు ప్రసాద్రావు, ఏ ఆంజనేయులు, ప్రజాసంఘాల నాయకులు కె దుర్గారావు, ఎ వీరబ్రహ్మం, జె రాజ్కుమార్, పి ప్రభాకర్, జి సుసలోన్, కె.జగన్, ఎం.రవికిరణ్, షేక్.మస్తాన్వలి, జి.యేసురత్నం, జి.మస్తాన్రావు, కె.సుధ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే భూమిలో ఎన్నో సంపదలు
యడ్లపాడు: ఒకే పంట కాకుండా పలు అంతర పంటలు వేసినట్లయితే భూమికి అవసరమైన సూక్ష్మపోషకాలు పెరిగి ప్రధాన పంట దిగుబడి మెరుగవుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి పేర్కొన్నారు. మంగళవారం యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక రైతులు కుర్రా వేణు 22 ఎకరాల్లో సాగు చేస్తున్న 22 బహుళ పంటల్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రసాయనాల వాడకాన్ని పూర్తిగా మానేసి, కషాయాలతో సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు వివరించారు. అంతర పంటల ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. మహిళా రైతు కోటేశ్వరమ్మ అభ్యసిస్తున్న ఏటీఎం మోడల్ వ్యవసాయం గురించి వివరించారు. ఈ విధానంలో రోజూ కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి పంటలు పండించడం ద్వారా కుటుంబానికి ఆహార భద్రత కలుగుతుందని, ఇంకా రసాయన రహిత పద్ధతిలో పండిన ఉత్పత్తులకు ధరలు కూడా ఎక్కువగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు అవులు ఉండి అర్హులైతే ప్రభుత్వం రూ.50వేల ప్రోత్సాహకం అందిస్తుందని వెల్లడించారు. ఇందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజనన్లో పత్తి, వరి సాగు చేసే రైతులు ప్రకృతి పద్ధతులవైపు మొగ్గుచూపాలని సూచించారు. కార్యక్రమంలో కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, పాములు సహా గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపాలి ఆవులున్న రైతులకు రూ.50 వేలు ప్రభుత్వ ప్రోత్సాహకం -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. కరీమూన్, రజియా, సైదాబీలు ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 2వ తేదీన బయలుదేరారు. కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ఏఎస్సై ఆంటోని, హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావు, కోటేశ్వరరావు, నరసింహారావు, మాణిక్యరావుల సహాయంతో హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలో వీరు ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు
సత్తెనపల్లి: పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. పీ–4 తో పేదరికం నిర్మూలిద్దాం జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి నరసరావుపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానస పుత్రిక పీ–4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్) కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరికం నిర్మూలనలో భాగమవుదామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ – స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ జిల్లా చాప్టర్పై మంత్రి గొట్టిపాటి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రామికవేత్తలు పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా నమోదు చేసుకుని ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహాయ సహకారం అందించాలన్నారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక అంతరాలు రూపుమాపడమే లక్ష్యం.. ఆర్థిక అంతరాలను రూపుమాపి పేదరికం లేని సమాజం రూపొందించాలన్నదే పీ–4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీ–4 ఉద్దేశ్యాలను తెలియజేశారు. ఆగష్టు 15 వ తేదీ లోపు బంగారు కుటుంబాలను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ సూరజ్ గనోరే, సీపీఓ శ్రీనివాసమూర్తి, డీఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్న 44 చట్టాల్లో మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం రూపొందించిన చట్టాలు సైతం రద్దు అయితే కార్మికులు సర్వసం కోల్పోతారని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ సిలార్ మసూద్ పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ప్రదర్శన చేశారు. జీతం పెంపుదల, సెలవులు, రక్షణకోసం జాగ్రత్తలు అడిగే హక్కు కోల్పోతారన్నారు. ఇప్పటికే సమానపనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా ప్రభుత్వాలు అమలుచేయట్లేదన్నారు. కనీస వేతన చట్టం అమలుచేయాలని కోరారు. బుధవారం నిర్వహించే జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అల్లాభక్షు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్ ్స వివరాల సేకరణ సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్ రేంజ్ ఇన్స్పెక్టర్ షేక్ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్ బృందం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్లు అందర్నీ మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. -
సాగర్ను సందర్శించిన విదేశీయులు
విజయపురిసౌత్: పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థలో ఈ నెల 1వ తేదీ నుంచి 14 వరకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37మంది మంగళవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. పర్యావరణ, అభివృద్ధి, నీటి సంరక్షణ తదితర అంశాలలో శిక్షణ పొందుతున్న వీరు సాగర్ జలాశయం, మెయిన్ డ్యాం, జల విద్యుదుత్పాదన కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, జలవనరుల వినియోగం తదితర అంశాల గురించి సాగనీటి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
కళాశాల స్థలం ఆక్రమణ ఆపాల్సిందే
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిపిడుగురాళ్ల: టీడీపీ నాయకులు పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమయ్యారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. కాలేజీ ప్రాంగణంలో రోడ్డు వేసిన చోట మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలతోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలంలో రోడ్లు వేసి ప్లాట్లు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి ఎవరూ నష్టపోవద్దని చెప్పారు. సుమారు 44 సంవత్సరాల క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. పిడుగురాళ్లకు తలమానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని కూడా ఆక్రమిస్తున్నారని ఇటు వంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తెచ్చామఅన్నారు. జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించేందుకు అన్ని ప్రతిపాదనలు పూర్తిచేశామని తెలిపారు. సమావేశంలో పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్ కుమార్, చింతా సుబ్బారెడ్డి, మాజీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మందా సుధీర్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సంక్షేమ రేడు.. పేదల దేవుడు.. అభివృద్ధి ప్రదాత.. ఆరోగ్య దాత.. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా వైభవంగా జరిగాయి. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా.. ఊరు వాడా.. భేదం లేకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి, క్షీరాభిషేకాలు చేసి అభిమానం చాటుకున్నారు. కేకులు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. అన్నదానం.. రక్తదానం.. పేదలకు దుస్తుల పంపిణీ.. వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, రాజన్నా.. నిను మరువలేమన్నా.. అని స్మరిస్తూ.. వైఎస్సార్పై తమ గుండెల్లోని ప్రేమను వ్యక్తం చేశారు. నరసరావుపేట: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. జిల్లా కార్యాలయంలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అంధుల పాఠశాలలో అంధులకు అన్నదానం చేశారు. వినుకొండరోడ్డులోని రెడ్డి హాస్టల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించి అన్నదానం చేశారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగ జిల్లా కార్యదర్శి అన్నెంపున్నారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా ర్యాలీగా పాల్గొన్నారు. ● చిలకలూరిపేటలో భాస్కర్ సెంటర్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి విడదల రజని నివాస ప్రాంతంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. కేకు కటింగ్ చేశారు. పలు వార్డుల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేకులు కట్చేశారు. పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ దరియావలి, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండల అధ్యక్షులు దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, వడ్డెపల్లి నరసింహారావు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కందుల శ్రీకాంత్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ● పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, గ్రామాల్లో పెద్దఎత్తున వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. క్రోసూరు మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.లగడపాడు గ్రామంలో ముస్లిం యూత్ గ్రామపార్టీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ● మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం, దుర్గి, కారంపూడి, వెల్దుర్తి, మాచర్లరూరల్, పట్టణంల్లో వైఎస్సార్కు నివాళులు అర్పించారు. మాచర్ల పట్టణంలో యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. జమ్మలమడకలో జరిగిన జయంతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాడవాడలా వైఎస్సార్కు ఘననివాళులు విగ్రహాలకు పూలమాలలు, రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహణ హాస్పిటళ్లలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ మాచర్లలో వైఎస్సార్ సీపీ శ్రేణుల భారీ ర్యాలీ సత్తెనపల్లి నియోజకవర్గం కార్యాలయంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి కేకు కట్చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తాలూకా సెంటర్, గ్రంథాలయం, 13, 16, 19 వార్డులు, రైల్వేగేటు వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆదరణ, మొల్లమాంబ వృద్ధాశ్రమం, పరివర్తన ఆశ్రమ పాఠశాలలో కేకులు కట్చేసి అన్నసంతర్పణ చేశారు. రెంటపాళ్ల, కంటెపూడి, కొమెరపూడిల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. అన్నసంతర్పణ చేశారు. ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకల్లో డాక్టర్ గజ్జల పాల్గొన్నారు. పక్కాల సూరిబాబు, చల్లంచర్ల సాంబశివరావు, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, షేక్ నాగూర్మీరాన్, రోళ్ల మాధవి పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పాల్గొని మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ గురజాల పట్టణం, మండలం, దాచేపల్లి, మాచవరం మండల నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. కేకులు కట్చేశారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మినేని వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. రక్తదానం శిబిరంలో పలువురు రక్తదానం చేశా రు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు, బాలింతలు, పిల్లలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఏనుగుపాలెంరోడ్డు, ముండ్లమూరు బస్టాండ్ వద్ద నున్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, పేదలకు అన్నదానం చేశారు. యోగివేమారెడ్డి సేవాసంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో సంఘ కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అన్నదానం చేశారు. ఎంపీపీలు జయశ్రీ వెంకటరామిరెడ్డి, మేడం జయరామిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, సూరాబత్తుని రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
షరతులపై గుర్రు
సత్తెనపల్లి: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం–2.0) కార్యక్రమ నిర్వహణపై విద్యా శాఖాధికారులు షరతులు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించి మధ్యాహ్నం 12:30 వరకూ జరుగుతుందీ లేనిదీ ఇతర శాఖల ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. గురువులపై అదనపు భారం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అన్ని మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో 2,038 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,70,968 మంది విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థుల ప్రగతిని వివరించడం, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథుల ప్రసంగాలు, ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఈ బాధ్యత, భారం అంతా ఉపాధ్యాయుల పైనే పడుతుంది. యోగాంధ్ర మాదిరి ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.ఇతరుల పర్యవేక్షణ సరికాదు మెగా పీటీఎంలో భాగంగా ఈ నెల 10న జరిగే సమావేశానికి ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ సరికాదు. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పుడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరును కించ పరచడమే. – బంకా వాసుబాబు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, పల్నాడుఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి నెలా జరుగుతుండేవే. కానీ ఎప్పుడు లేని విధంగా అటు విద్యార్థులతో పాటు కార్యక్రమాలన్నీ క్షణాల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అదనపు కార్యక్రమాలతో ఉపాధ్యాయులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. – ఎస్ఎం సుభాని, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పేరెంట్స్ మీట్ షరతులపై విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలు రేపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ -
జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
గుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అధికారులలో కొరవడిన సమన్వయం జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్లు రాలేదు. – ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ -
ప్రతిపక్షం కాదు...ప్రజాపక్షం
● బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ● కార్యకర్తలకు అండగా వైఎస్సార్సీపీ ● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని భవనాశి కల్యాణ మండపంలో సోమవారం ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్కుమార్ అధ్యక్షత వహించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ క్యూఆర్ కోడ్ విడుదల చేశారన్నారు. ఈ క్యూఆర్ కోడ్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సెల్ఫోన్లో స్కాన్ చేస్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలు మొత్తం వస్తాయని, వాటిల్లో ఎన్ని హామీలు ప్రజలకు ఇచ్చాడో నేరుగా అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు మోస పూరిత మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం చంద్రబాబు మేనిఫెస్టోకు సంబంధించిన క్యూఆర్ కోడ్ వాల్పోస్టర్ను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్తో బాబు మోసాలు బహిర్గతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడటానికి ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి మురళీధర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవీ)మాట్లాడుతూ కార్యకర్తలందరు ఐక్యమత్యంతో ఉంటే తమపై ఎవ్వరూ దాడి చేయటానికి ముందుకు రారని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అమరారెడ్డి, ముడేల వెంకటేశ్వరరెడ్డి, మద్దు ప్రసాద్, కొప్పుల సాంబయ్య, ఏలియా కుమారి, గురవారెడ్డి, మందా సుధీర్, వెంకటేశ్వరరెడ్డి, జూలకంటి శ్రీనివాసరావు, పోలు వీరారెడ్డి, యల్లారావు, షేక్ జైలాబ్దిన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల పేరిట రూ.36 లక్షల మోసం
నరసరావుపేట రూరల్: ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడకు చెందిన మ్యాట్రిక్స్ కన్సల్టెన్సీ సంస్థ తమను మోసం చేసినట్టు గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన కాకా హనుమంతరావు, ప్రసాదం తేజ రామకృష్ణలు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జాబ్ వీసా కోసం తమ వద్ద రూ.36.50 లక్షలు వసూలు చేశారని, ఇప్పడు సంస్థ కార్యాలయం మూసివేసినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించి 96 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ అందిన అర్జీలలో కొన్ని ఇలా... ● ఫారెక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి నెలా పెట్టుబడిలో 10 శాతం లాభంగా ఇస్తామని చెప్పడంతో నమ్మి మోసపోయానని సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన బలుసుపాటి కోటయ్య ఎస్పీకి తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన రోంగల ప్రవీణ్కుమార్, గజ్జల మధుసూదన్రెడ్డిలు వ్యాపారం పేరుతో రూ.45,67,500 తీసుకొని మోసం చేశారని వివరించారు. ● నా భర్త ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడని, ఇద్దరు సంతానంతో సత్తెనపల్లి మండలం బృంగబండకు చెందిన పొలేపల్లి రాజీ తెలిపింది. ఆ తరువాత ఆన్లైన్లో పరిచయమైన హైదరాబాద్కు చెందిన నరసింహా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు ఫిర్యాదు చేసింది. తాను రూ.30 లక్షలు మోసం చేసినట్టు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసి వేధిస్తున్నాడని వివరించింది. ● మామ, మరిది శారీరకంగా వేధిస్తున్నారని దాచేపల్లికి చెందిన చిన్నం రమ్య తెలిపింది. నా భర్త కాపురానికి పనికిరాడని వైద్యులు తెలిపారని, నాకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ప్రజాసమస్యల సమస్యల పరిష్కార వేదికలో గతంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. ● నరసరావుపేటలోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తీసుకొన్న లోన్ మొత్తం చెల్లించినప్పటికీ అదనంగా మరి కొంత చెల్లించాలని సంస్థ సిబ్బంది బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లికి చెందిన ఎండీ హనీఫ్ రహమాన్ కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
రాష్ట్రంలో నరకాసుర పాలన
సత్తెనపల్లి: రాష్ట్రంలో నరకాసుర పాలన సాగుతోందని, ఏ రకంగా జరుగుతుందనటానికి తనపై కేసు పెట్టడమే ఒక ఉదాహరణ అని, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నమోదైన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన సోమవారం సత్తెనపల్లి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి పోలీసులపై పాలకుల ఒత్తిడి ఉందని, వైఎస్సార్ సీపీ వారిపై తప్పుడు కేసులు పెడితేనే మీరు ఉద్యోగంలో ఉంటారంటూ బెదిరిస్తే, ఎస్పీ, డీఎస్పీ, సీఐలు ఏం చేస్తారంటూ అన్నారు. 11 సెక్షన్లతో తనపై సత్తెనపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైందన్నారు. వాస్తవానికి ఆ రోజు తాను తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ కారులో వచ్చానన్నారు. సత్తెనపల్లి వచ్చే వరకు కూడా ఇక్కడ ఎవరు తెలియదన్నారు. అలాంటిది నేను జనాన్ని పోగు చేశానంట, నేరం చేశానంట, పోలీసుల ఆంక్షలు అతిక్రమించానంటూ నా మీద నేరం మోపి నన్ను నిందితుడిగా చేర్చారన్నారు. సత్తెనపల్లి కాదు జగన్తో రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా.. కేసు పెట్టి నంత మాత్రాన జగన్ జెండా వంచుతానా, జగన్ పేరు మరిచిపోతానా, జగన్తో తిరగడం మానేస్తానా, మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదలనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్ని నాని అన్నారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి, పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, పార్టీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, గుజ్జర్లపూడి సతీష్, వల్లెం నరసింహారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ జెండా వదిలేది లేదు సత్తెనపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని -
న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ సుందరాచారి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్టు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులో అసోసియేషన్ 32వ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సుందరాచారీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాదిపాటు డాక్టర్ సుందరాచారీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కాగా, ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థులు డాక్టర్ పి.సాయిలక్ష్మి ఫ్రీ పేపర్ ప్రజంటేషన్ పోటీల్లో రాష్ట్రంలో మొదటి బహుమతి గెలుపొందారు. డాక్టర్ పి.వల్లికృష్ణప్రియ పోస్టర్ ప్రజంటేషన్ పేపర్లో మొదటి బహుమతి గెలుపొందారు. సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు న్యూరాలజిస్టులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్సుందరాచారీని అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ గెలుపొందిన వైద్య విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఉప్పుటూరి అరుణకుమారి, డాక్టర్ గొట్టి పాటి బిందు నర్మద, తదితరులు పాల్గొన్నారు. -
పట్టణంలో వైద్యురాలి ఇంట భారీ చోరీ
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని వైద్యురాలి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానిక పురుషోత్తమపట్నంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మడి రాణి సంయుక్త సుమారు రెండేళ్లుగా శారద హైస్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉంటున్న అన్నయ్య వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, దాని పక్కనే మరోవైపు ఉన్న తలుపు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది. గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు గ్రహించింది. బీరువా తెరిచి ఇంట్లో అంతా చిందర వందరంగా వస్తువులు, దుస్తులు పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాల సేకరించారు. ఇంట్లోని 70 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు, కేజీన్నర వెండి వస్తువులు, పట్టు చీరెలు అపహరణకు గురయ్యాయని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ పి రమేష్ తెలిపారు. సుమారు రూ.13 లక్షలు అపహరణ -
దళితులపై పెరిగిన దాడులు
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారపు శివనాగేశ్వరరావు సత్తెనపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, పేదల పైన దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణం, అమానుషమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావును కొట్టి తీవ్రంగా గాయపరిచారని, టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత దళితులపైనా, పేద వర్గాలపైనా దాడులు అధికమయ్యాయన్నారు. మొన్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు నడిబజారులో కొట్టిన సంఘటన మరొక ఉదాహరణ అని, రాష్ట్రంలో దళితులంటే తెలుగుదేశం పార్టీకి చిన్న చూపు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇకనైనా దళితులు, పేదల పై దాడులను మానుకోవాలని లేకుంటే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘నూటా’ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారికి లేఖ ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం(నూటా) ఎన్నికల్లో పారదర్శకత లోపించడం వలన ఈ నెల 9న జరిగే నూటా ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు సోమవారం లేఖ అందజేసినట్లు ఆచార్య కె.సుమంత్ కుమార్(అధ్యక్ష పదవికి పోటీ అభ్యర్థి), ఆచార్య ఎం.జగదీష్ నాయక్(ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ అభ్యర్థి) తెలిపారు. తమకు పోటీగా నిలబడిన అభ్యర్థులు విశ్వవిద్యాలయం పరిపాలన పరమైన పదవుల్లో కొనసాగటం వలన ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, కనుక ఎన్నికల నిర్వహణ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 15 రోజులు పాటు ఎన్నికలను వాయిదా వేయాలని ఈనెల 4, 5 తేదీల్లో ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు వినతి పత్రాలు అందించినా నేటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు తమ లేఖలకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. -
మీటర్ల ఏర్పాటుపై కూటమి నాయకులను నిలదీయండి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని నిలిపివేయాలని, ఈ విషయంపై ప్రజలంతా ప్రజాప్రతినిధులను నిలదీయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలిపారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు గత ప్రభుత్వం అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అదానితో అనేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల నెత్తిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని మోపుతూ బలవంతంగా ప్రజలకు అంటగడుతున్నారని, దీనివలన ఇప్పటికే ప్రజలకు అర్థం కాకుండా విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్మీటర్లు బిగింపు వలన ప్రజలంతా మరింతగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ మేరకు పోస్టర్లు ప్రదర్శించారు. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిలుపు ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు మీటర్ల ఏర్పాటుపై ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన -
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడుగా విష్ణువర్ధన్ ఎన్నిక
మాచర్ల రూరల్: ఆంధ్రపద్రేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా కోమటి విష్ణువర్థన్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిపినట్లు ప్రస్తుత అధ్యక్షులు ముదిరాజ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్నీ నారాయణ ముదిరాజ్ తెలిపారు. ముదిరాజ్ మహాసభ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం వారి సామాజిక భద్రత కోసం జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా అన్నీ పార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని, ఎన్నో ఉద్యమాలు చేసి ముదిరాజ్ జాతి పక్షాన అండగా నిలిచిన చరిత్ర ముదిరాజ్ మహాసభకు ఉందన్నారు. అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అండదండలతో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ జాతి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని జాతి ఉన్నతి కోసం ఎన్నో ఉద్యమాలు, భారీ మహాసభలు నిర్వహించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర శాఖకు తాను అధ్యక్షుడుగా ఎన్నిక కావటం ఆనందకరంగా ఉందని విష్ణువర్ధన్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బొమ్మన సుబ్బరాయుడు ముదిరాజ్, గుడాల సత్యనారాయణ ముదిరాజ్, కోశాధికారిగా బాలబోయిన పాపారావు ముదిరాజ్ ఎన్నికై నట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను సత్కరించారు. కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ముదిరాజ్ విభాగం అధ్యక్షుడుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. విష్ణువర్థన్ ఎన్నికపై రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
లోకపావని.. శాకంబరి
● నేడు శాకంబరిగా కనకదుర్గమ్మ దర్శనం ● ప్రధాన ఆలయాలు, ఉపాలయాలకు కూరగాయలతో అలంకరణ ● మూడు రోజుల పాటు కొనసాగనున్న శాకంబరి ఉత్సవాలు ● ఉత్సవాల్లో ప్రత్యేకంగా కదంబ ప్రసాదం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోకపావని.. జగజ్జనని కనకదుర్గమ్మ శాకంబరిమాతగా భక్తులను కరుణించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఇతర ఉపాలయాలను, దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను దండలుగా సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతలు సమర్పించారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు తమ వంతుగా ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. శాకంబరీగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం మంగళవారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, ఋత్విక్వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధనతో శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన వంటి వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. పదో తేదీ ఉదయం పది గంటలు పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. శాకంబరీ ఉత్సవాలు జరిగే మూడు రోజులూ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం రద్దు చేసినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్త బృందాల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుండటం, శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
రాజముద్ర
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025 నేడు మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి ‘వైఎస్సార్’.. పేరు వినగానే పేదల మోములు వికసిస్తాయి.. లక్షల జతల నేత్రాలు చెమరుస్తాయి ఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జన సందోహం.. ఆయనే పేదల పాలిట దైవం ఆరోగ్య శ్రీతో లక్షలాది ప్రజల గుండె సవ్వడుల్లో నేటికీ ఆయన సజీవం జలయజ్ఞపు జలధారల్లో.. సస్య శ్యామలమైన పంటపొలాల్లో.. అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో నేటికీ ఆయన చిరునామా శాశ్వతం ఇంజినీర్లుగా.. వైద్యులుగా రాణిస్తున్న పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం సంక్షేమ రేడుగా.. అభివృద్ధి సూరీడుగా.. పేదింటి దేవుడిగా.. వైఎస్సార్ ప్రాతఃస్మరణీయుడు ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అపూర్వం.. జిల్లా అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం నగరవాసుల తాగునీటి ఇక్కట్లకు చెక్ న్యూస్రీల్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్ పాలన ఓ స్వర్ణ యుగం అన్నదాతలపై మమకారానికి చిహ్నంగా పులిచింతల నిర్మాణం పశ్చిమ డెల్టా, సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ రాష్ట్రానికే తలమానికం స్పైసెస్ పార్కు నిర్మాణం గుంటూరు నగర వాసుల దాహార్తి తీర్చిన రాజన్న గుంటూరు నగరంలోనే ఆరోగ్యశ్రీకి అంకురార్పణ రాజకీయంగా జిల్లాకు అధిక ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా పై -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రతిపాదనలు
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారుల ద్వారా ఈనెల 13వ తేదీలోపు https://nationalawardstoteachers. education.gov.in సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోటప్పకొండ తొలిఏకాదశి ఆదాయం రూ.24.02లక్షలు నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి రూ.24.02 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు తెలిపారు. స్వామి వారి హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించి ఆదాయ వివరాలు వెల్లడించారు. టిక్కెట్ల ద్వారా రూ.9,09,090లు, ప్రసాదాల ద్వారా రూ.4,39.380లు, హుండీల ద్వారా రూ. 9,68,028లు, అన్నదానానికి రూ.86,051లు ఆదాయం లభించినట్టు వివరించారు. మెగా పేరెంట్స్ మీట్కు పటిష్ట ఏర్పాట్లు నరసరావుపేట: జిల్లాలో ఈనెల 10న నిర్వహించనున్న ‘మెగా పేరెంట్స్ మీట్’కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1580 ప్రభుత్వ, 458 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 2,308 పాఠశాలలు, 91 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హాజరయ్యేవారికి భోజన సదుపాయాలతో ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తగా వండించాలన్నారు. లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదు గుంటూరు లీగల్: లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్విన్ సుల్తానా బేగం సోమవారం తీర్పు వెలువరించారు. 2014లో పొన్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన లైంగిక దాడి కేసులో 32 సంవత్సరాల మద్దసాని సురేంద్ర 13 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సమర్పించారు. కేసులో నేరం రుజువు కావడంపై ముద్దాయికి జీవిత ఖైదు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు చెల్లించేలా తీర్పు చెప్పారు. ముద్దాయిని జిల్లా జైలుకు తరలించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బరత్ అలీఖాన్ వాదనలు వినిపించారు. బాధిత బాలికకు న్యాయం జరిగిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 198 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పీజీఆర్ఎస్లో 198 అర్జీలు స్వీకరణ -
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్ జెండా వదిలేదే లేదు’
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. -
అంతులేని గ్రావెల్ దోపిడీ
చిలకలూరిపేట: గ్రావెల్ దోపిడీకి అంతులేకుండా పోతోంది. అది చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమైనా... సమీపంలో గురుకుల విద్యార్థులకు హాని కలిగించే ప్రమాదం ఉన్నా.. అవేమీ పట్టని అక్రమార్కులు గ్రావెల్ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని పెద్దన్న పాత్ర పోషిస్తున్న నాయకుల కనుసన్నల్లో కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కూటమిలోని మరో భాగస్వామియైన జనసేన పార్టీ నాయకులే వ్యతిరేకించేంత స్థాయిలో వ్యవహారం కొనసాగటం విశేషం. వందలాది ఎకరాల్లో తవ్వకాలు చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో విస్తృత స్థాయిలో అసైన్డ్, అటవీ భూములు విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా చెంఘీజ్ఖాన్పేట పంచాయతీ పరిధి నుంచి కొంతమేర కొండవీడు వరకు ఎర్రమట్టి నేలలు విస్తారంగా ఉంటాయి. కొండవీడు కొండల మధ్య రెడ్డి రాజుల కాలంలో రక్షణగా ఎర్రమట్టితో వేసిన అడ్డుకట్టను సైతం 2014–19 నాటి టీడీపీ ప్రభుత్వ కాలంలో తవ్వి గ్రావెల్ విక్రయాలకు పాల్పడ్డారు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ అక్రమ దందా విజృంభిస్తోంది. చెంఘీజ్ఖాన్పేట పంచాయతీ పరిధి నుంచి కొండవీడు కొండల సముదాయం పక్కన విస్తరించి ఉన్న వందలాది ఎకరాల భూముల్లో భారీగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 28న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధిత స్థలానికి చేరుకొని గ్రావెల్ తరలించుకు పోతున్న లారీలను అడ్డుకున్నారు. మూడు టిప్పర్ లారీల డ్రైవర్ల నుంచి తాళాలు తీసుకొని యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి అప్పగించారు. ఆరు పొక్లెయిన్లతో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు నిర్వహించి టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలించి అమ్ముకుంటున్నారని వారు ఫిర్యాదు చేయడం గమనార్హం. అత్యంత ప్రమాదకరంగా గోతులు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వడంతో సంబంధిత ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాల ముందు భాగంలో సైతం భారీగా తవ్వకాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. వర్షాకాలం భారీ వర్షా లు కురిస్తే ఆ ప్రాంతంలో నీరు నిలవడం ఖాయం. విద్యార్థులు తెలిసో తెలియకో ఈతకు దిగడం వంటివి చేస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇక్కడ ఒక టిప్పర్ లోడ్ చేసేందుకు రూ. 6,500 వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబు తున్నారు. దూరాన్ని బట్టి రవాణా చార్జీలు అదనంగా ఉంటాయి. ఆరు పొక్లెయిన్లతో తవ్వకాలు నిర్వహిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు 200 నుంచి 250 లోడ్ల వరకు గ్రావెల్ తరలిపోతుంటుంది. ఇవి ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న క్రమంలో ఆదాయం మొత్తం ఎవరి చేతుల్లోకి పోతుందనేది జగమెరిగిన సత్యం. రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ అధికారులు కళ్లు మూసుకొని నిద్ర నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని, అక్రమ గ్రావెల్ తరలింపును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వందలాది ఎకరాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు విక్రయాలు భారీ గుంతలతో చెరువులుగా మారుతున్న వైనం పర్యావరణానికి తీరని ముప్పు పట్టించుకోని అధికారులు ఉన్నతాధికారులకు నివేదిస్తాం తవ్వకాలు చేస్తున్నది అసైన్డ్ భూములా, లేక అటవీ భూములా అనేది విచారిస్తున్నాం. రెవెన్యూ, మైనింగ్, అటవీ, పోలీసు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందిస్తాం. – విజయశ్రీ, తహసీల్దార్, యడ్లపాడు అనుమతులు లేవు సంబంధిత ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలకు ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. కొంతమంది దరఖాస్తు చేసుకొని ఉన్న మాట వాస్తవమే. అయితే ఎవరికి అనుమతులు మాత్రం ఇచ్చింది లేదు. – నాగిని, అసిస్టెంట్ డైరెక్టర్, మైనింగ్, పల్నాడు జిల్లా -
కొండంత సంబరం
వినుకొండ: తొలిఏకాదశి పర్వదినం, వినుకొండ తిరునాళ్ల సందర్భంగా వినుకొండ కొండపైకి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటలనుంచే భక్తులు కొండపైకి చేరుకుని బాలాలయాలల్లో ఉన్న రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో కొండపైకి 40 బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైన భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవాసంస్థలు, ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లి కార్జునరావులతోపాటు పలువురు పార్టీ నాయకులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ● తిరునాళ్ల సందర్భంగా ఎన్ఎస్పీ గ్రౌండ్లో ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల ఆవరణలో సాంఘిక, పౌరాణిక నాటికలు, కోలాటాలు, చెక్క భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ● తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 400 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 మందికిపైగా మున్సిపల్, రెవెన్యూ, దేవదాయ సిబ్బంది సేవలందించారు. కొండకింద పోలీస్ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశారు. కోటప్పకొండపై ‘తొలి’ పూజల సందడి నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినంపురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకొని తరించారు. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు బిందెతీర్ధంతో స్వామి వారికి తొలి అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, ఫలాలు, విశేష ద్రవ్యాలతో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిపారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. ● ఉదయం కొండపై భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు అభిషేక దర్శనాన్ని భక్తుల కల్పించారు. సోపానమార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండ మీదకి చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయం వెనుక రావిచెట్టు, మహనందీశ్వరుడి వద్ద దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ● కొండ మీద పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయింది. దీంతో పోలీసులు కొండదిగువనే వాహనాలను నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్రోడ్డులోని పార్క్ వద్ద యాత్రికుల సందడి నెలకొంది. కొండమీద పలు స్వచ్ఛంద సంస్థలు, దిగువున సత్రాలు వద్ద ఉచిత ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వామి వారిని దర్శించుకున్నారు. వినుకొండలో ఘనంగా కొండ పండుగ రామలింగేశ్వరుడికి విశేష పూజలు కొండపైకి పోటెత్తిన భక్తులుభక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలుఅఖండజ్యోతి ప్రజ్వలన వినుకొండ కొండపైన అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 6:30 నిముషాలకు జరిగింది. హిమాలయ బాబా భక్తులు జ్యోతిని వెలించారు. కొండపైన అఖండజ్యోతి చూసిన భక్తులు ఓం నమఃశివాయ అంటూ నినదించారు. -
తెల్లపేపర్పై జీఎస్టీ వసూలు
నరసరావుపేట టౌన్: నరసరావుపేటలోని కొన్ని బ్యూటీపార్లర్లలో అనధికార జీఎస్టీ వసూలు చేస్తూ కస్టమర్ల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం పట్టణంలోని అరండల్పేటకు చెందిన నేచురల్స్ బ్యూటీపార్లర్కు ఓ ఉన్నత స్థాయి అధికారిణి వెళ్లారు. అక్కడ సర్వీసు అనంతరం వారు ఇచ్చిన బిల్లు చూసి సదరు అధికారి అవాక్కయ్యారు. ఆ బిల్లులో సర్వీస్ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా కలిపి అధిక మొత్తంలో చేతితో రాసి ఇవ్వడంతో విస్మయం చెందారు. సర్వీస్ ఛార్జీలతోపాటు సెంట్రల్ జీఎస్టీ 18 శాతం చెల్లించాలంటూ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా జీఎస్టీ ఎలా వసూలు చేస్తారంటూ ఆ అధికారిణి నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తమ వద్ద ఇలానే ఉంటుందని దురుసుగా జవాబిచ్చారు. తాము ఇచ్చినంత బిల్లు చెల్లించాల్సిందే అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పటికే సదరు అధికారిణి బిల్లు చెల్లించారు. ఇదేవిధంగా వినియోగదారుల వద్ద అనధికారికంగా జీఎస్టీ వసూలు చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సదరు అధికారిణి సిద్ధమయ్యారు. అయితే ఆ బ్యూటీ పార్లర్ ఓ సీఐకి చెందినదని తెలియ వచ్చింది. నరసరావుపేటలో నిర్వహిస్తున్న కొన్ని బ్యూటీ పార్లర్లలో ప్రతినిత్యం ఇలానే అనధికార బిల్లులతో కస్టమర్ల జేబులు గుల్లచేస్తున్నట్లు సమాచారం. రేపటి లోగా ఎస్సీ విద్యార్థులతో పోస్టల్ అకౌంట్లు తెరిపించండి నరసరావుపేట: ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది చదువుతున్న ఎస్సీ విద్యార్థులతో పోస్టల్ అకౌంట్లు మంగళవారంలోపు తెరిపించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఈ.ఈశ్వరమ్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో సహాయ సంక్షేమాధికారులు, కళాశాల కో ఆర్డినేటర్లు, వసతి గృహ సంక్షేమాధికారులు, సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలో అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులను గుర్తించి వారి పోస్టల్ అకౌంట్లు ఆధార్ నంబర్లకు ఎన్పీసీఐ లింకు చేయించాలని సూచించారు. ఇప్పటికే అకౌంట్లు తెరిచిన వారు ఎన్పీసీఐతో లింకు పరిశీలించుకోవాలని అన్నారు. తొమ్మిది, పది తరగతులకు చెందిన 70 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లకు ఎన్పీసీఐ లింకు పెండింగ్లో ఉందని చెప్పారు. 133 మంది ఇంటర్ విద్యార్థుల మ్యాపింగ్ కూడా పెండింగ్లో ఉందని వివరించారు. నరసరావుపేటలోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకం ఇదేమని ప్రశ్నించిన ఓ అధికారిణికి నిర్లక్ష్యపు సమాధానం తమ వద్ద ఇలానే ఉంటుందంటూ రుబాబు -
త్రికోటేశ్వరా.. నిను చేరేదెలా?
నరసరావుపేట రూరల్: తొలిఏకాదశి పర్వదినాన కోటప్పకొండకు వచ్చిన భక్తులకు కొండ ఎక్కకుండానే దేవుడు కనిపించాడు. త్రికోటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆదివారం అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండ దిగువున పోలీసుల అతి జాగ్రత్త, కొండ మీద సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఓవర్ యాక్షన్తో తిప్పలు తొలిఏకాదశి రోజున జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కార్లు, సమీప ప్రాంతాల నుంచి వారు ద్విచక్రవాహనాలతో పాటు గ్రామాల నుంచి వచ్చే భక్తులు ట్రాక్టర్ల మీద కొండకు చేరుకుంటారు. కొండ మీద పార్కింగ్ సమస్య పేరుతో ఈ ఏడాది కొండ దిగువునే కార్లు, ట్రాక్టర్లను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను కూడా అప్పుడప్పుడు వదిలారు. ఘాట్రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు పెట్టి అడ్డుకున్నారు. కొండకావూరు రోడ్డు ద్వారా పార్కింగ్ స్థలానికి మళ్లించారు. మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే ఈ విధంగా ప్రైవేటు వాహనాలను కొండమీదకు అనుమతించరు. ఈ సారి పోలీసులు తొలిఏకాదశి రోజున కూడా వాహనాలను అనుమతించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వాహనాలను అనుమతించకపోవడంపై పోలీసులు ముందస్తుగా భక్తులకు ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో వాహనాలపై వచ్చిన భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అన్నదానం నిలిపివేత భక్తులకు అన్నప్రసాదం అందించాల్సిన అన్నప్రసాదశాలను ఆదివారం మూసివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్న సమయంలో అన్నప్రసాద శాలకు వెళ్లగా ఈ రోజు అన్నప్రసాద వితరణ నిలిపివేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఎందుకు నిలిపివేశారని భక్తులు ప్రశ్నించగా కేవలం సిబ్బందికి మాత్రమే ఈ రోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతున్నా పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోటప్పకొండకు వచ్చే భక్తులపై పోలీసు ఆంక్షలు ఘాట్రోడ్డు వద్ద వాహనాలు నిలిపివేత భక్తుల తీవ్ర ఇబ్బందులు వీఐపీల సాకుతో లిఫ్ట్ నిలిపివేత వృద్ధుల పైనా కనికరం చూపని అధికారులు నిత్యాన్నదానం నిలిపివేతతో ఆకలితో వెనుదిరిగిన భక్తులు -
వీధి కుక్కలు .. భౌబోయ్..!
సత్తెనపల్లి: వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంపులుగా కనిపిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలను వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే కొరికేస్తున్నాయి. జిల్లాలో ఏడాది కాలంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం పూర్తిగా నిలిచిపోయింది. వీధి కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. జన సంచారం లేని రోడ్డు ఉందేమో గానీ.. వీధి కుక్కల సంచారం లేని రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.... పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారుల ను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను పాఠశాలల్లో వదిలి తల్లిదండ్రులు పొలాలకు వెళ్తుంటారు. దీంతో చిన్నారుల భద్రత మీద ఆందోళన చెందుతున్నా రు. పల్లెల్లో వీధి కుక్కలు బెడద ఎక్కువగా ఉండ డంతో పిల్లలు స్కూల్ నుంచి ఒంటరిగా వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోన ని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అటకెక్కిన బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం... వీధి కుక్కలు పెరగకుండా నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం నిర్వ హించాల్సి ఉంది. మగ కుక్కలకు క్యాస్టేషన్ చేస్తారు. ఆడ కుక్కలకు గర్భసంచి తీసేస్తారు. దీంతో పునరుత్పత్తి జరగదు. క్రమంగా వీధి కుక్కల సంఖ్య తగ్గిపోతుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఏబీసీ ప్రోగ్రాం జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం వీధి కుక్కలకు త్వరలో ఆపరేషన్లు చేయిస్తామంటూ చెప్పి తప్పించుకుంటున్నారు. పదే పదే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు ప్రస్తావించినా కనీసం నామ మాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రాణాంతకంగా మారిన రేబిస్... కుక్కలు కరిస్తే రేబిస్ సోకే ప్రమాదం ఉంది. కుక్క కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి. లేకపోతే రేబిస్ బారిన పడితే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాణాలకు గ్యారెంటీ చెప్పలేని దుస్థితి. నరాల వ్యవస్థ మొత్తం దెబ్బతిని చివరికి ప్రాణాలు పోతాయి. రేబిస్ సోకిన వారిలో కొందరు మంచినీళ్లు తాగడానికి కూడా భయపడి పోతారు. ఈ లక్షణాన్ని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అంటారు. నీళ్లు తాగకపోవడంతో డిహైడ్రేషన్ ఏర్పడి మరణానికి గురవుతారు. అందుకే కుక్క కరిచిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) చేయించుకోవాలి. తీవ్రమైన గాయాలైనప్పుడు, పిచ్చి కుక్క కాటు వేసినప్పుడు, కాటు తీవ్రతను బట్టి హిమునోగ్లోబిన్ ఇంజక్షన్ చేస్తారు. దీని వలన తక్షణమే వ్యాధి నిరోధక శక్తి చేకూరుతుంది. అదే ఏఆర్వీ వలన వ్యాధి నిరోధక శక్తి సమకూరడానికి మూడు నెలల వరకు పట్టవచ్చు. జిల్లాలో హడలెత్తిస్తున్న వీధికుక్కలు రోడ్లపై గుంపులుగా తిరుగుతూ జనంపై దాడులు ద్విచక్ర వాహనాల వెంట పరుగులు యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం రోడ్ల పైకి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు -
పెరిగిన వీధికుక్కల బెడద...
జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్లి వచ్చే రైతులు, పట్టణ శివారు ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారు, ఇంటిముందు ఒంటరిగా ఆడుకునే చిన్నారులు, వాహనాలపై వెళ్లేవారు ఎవరు కనిపిస్తే వారిపై ఎగబడి రక్కేస్తున్నాయి. ఈ నెల 4న సత్తెనపల్లి వీరాంజనేయ నగర్లో దేశినేని అశోక్ అనే నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటన మరవక ముందే ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడిని సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట వీధి కుక్కలు వెంబడించడంతో యువకుడు ప్రధాన రహదారిపై పడి పోయాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుంచి యువకుడు బయటపడ్డాడు. దీంతో వీధి కుక్కలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపించాలంటేనే వణికిపోతున్నారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. మే నెలలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించి, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ధ్రువపత్రాలు అవసరమంటే.. ఏపీ ఈఏపీసెట్–2025 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన ధ్రువపత్రాల జాబితాను నోటిఫికేషన్లో పొందుపర్చారు. ఏపీ ఈఏపీసెట్–2025 ర్యాంక్ కార్డ్, హాల్ టిక్కెట్, ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్ సర్టిఫికెట్, టీసీ, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, 2025–26 సంవత్సరపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేటు విద్యార్థులకు రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు, శారీరక వైకల్యం గల విద్యార్థులకు సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం అని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుతో మొదలు ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సెట్స్.ఏపీఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఏపీఈఏపీసెట్ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ● రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఇదే వెబ్సైట్లో క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఏపీఈఏపీ సెట్ డీటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్ల పరిశీలన ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈఏపీసెట్కు దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వెబ్ బేస్డ్ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ‘రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి’ అనే చోట క్లిక్ చేయాలి. తద్వారా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఏస్థాయిలో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయిన విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్పై కేండెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తే, విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధం కావచ్చు. ఈ విధంగా కాకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హెల్ప్లైన్ కేంద్రంలో పురోగతిలో ఉన్న పక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. సమీప కేంద్రం ఎంపిక ఇలా.. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలు అసంపూర్తిగా ఉండటం, వివరాలు అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో కాంటాక్ట్ హెల్ప్లైన్ సెంటర్ (హెచ్ఎల్సీ) అని డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఆన్లైన్లో పొందుపర్చిన హెల్ప్లైన్ కేంద్రాల జాబితా నుంచి తమకు సమీపంలోని కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అసమగ్రంగా ఉన్న సర్టిఫికెట్ల వివరాలు డిస్ప్లేలో ప్రత్యక్షమవుతాయి. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్థులు తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత సంబంధిత హెచ్సీఎల్లో అధికారులు వాటిని పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి ఈ నెల 17 వరకు హెల్ప్లైన్ కేంద్రాల వారీగా ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు హెల్ప్లైన్ కేంద్రాలు ఇక్కడున్నాయి.. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఆయా హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 17వ వరకు పరిశీలిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 19న తుది అవకాశం ఉండగా, ఈ నెల 22న సీట్ల కేటాయింపు జరుపుతారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కళాశాలల్లో చేరికలు, ఆగస్టు 4వ తేదీ నుంచి బీటెక్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. -
మహిళ పొట్ట నుంచి నాలుగు పెన్నులు వెలికితీత
నరసరావుపేట: ఓ మహిళ పొట్ట నుంచి నాలుగు బాల్పెన్నులు డాక్టర్లు బయటకు తీసిన ఘటన పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్లో శనివారం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని మాతాశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ వాంతులతో బాధపడుతుండగా ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఎండోస్కోపీ ద్వారా పరీక్షలు నిర్వహించగా పేగులో పెన్నులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. అనుమానంతో సిటీస్కాన్ చేయించడంతో నాలుగు పెన్నులు ఉన్నట్లు బయటపడిందన్నారు. వెంటనే తమ హాస్పిటల్లోని అధునాతనమైన లాప్రోస్కోపిక్ పద్ధతిలో పొట్టలో నుంచి నాలుగు పెన్నులు చాకచక్యంగా బయటకు తీశామన్నారు. ఆమెను ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించామని చెప్పారు. లాపరోస్కోపి ద్వారా ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయటం పల్నాడులో ఇదే మొదటిసారని డాక్టర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్ను పలువురు సహచర డాక్టర్లు, పట్టణ ప్రముఖులు అభినందించారు.మాతాశ్రీ హాస్పిటల్లో లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్త్ర చికిత్స -
ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి
పెదకూరపాడు: పెదకూరపాడులోని ముస్లిం కాలనీలోని పిచ్చి కుక్క ఆరుగురుపై ఆదివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్ల పఠాన్ మహ్మద్ అమన్, వృద్ధుడు షేక్ ఖాసిం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుస్సన్, నిమ్మకాయల వ్యాపారి షేక్ ఖాసింలతో పాటు మరో ఇద్దరిపై విచక్షణ రహితంగా కరచింది. నాలుగేళ్ల అమన్కు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 18వ తేదిన మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన చిన్నారులు, వృద్ధులు 16 మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది. రోడ్డు పక్కనే మాసం విక్రయాలు జరుపుతుండంతో గుంపులు కుక్కలు అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రోడ్డుపై తిరుగుతూ వాహనదారులను కరుస్తున్నాయి. -
భక్తజన సంద్రం.. వైకుంఠపురం
అమరావతి: తొలి ఏకాదశి సంద ర్భంగా మండలంలోని పుణ్యక్షేత్రాలైన అమరావతి, వైకుంఠపురం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠపురం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తులు వైకుంఠపురం క్షేత్రంలో కృష్ణానది ఉత్తర వాహినిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైన స్వయంభూగా వెలసిన వేంకటేశ్వరుని దర్శించారు. అనంతరం కొండకింద వేంచేసియున్న వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే స్వామివారికి పంచామృత స్నపనానంతరం విశేష అలంకారం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. దేవదాయశాఖాదికారులు కొండపైన, కొండకింద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే పెదమద్దూరు చెందిన భక్తబృందం నిర్వహించిన భజనలు, వైకుంఠపురం భక్తులు ప్రదర్శించిన కోలాటం భక్తులను అలరించాయి. -
రైతుల నెత్తినే ప్రీమియం భారం
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. గత రబీ సీజన్ నుంచే రైతులు నేరుగా బీమా ప్రీమియం చెల్లించుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో, ప్రీమియం భారం పూర్తిగా రైతులపై పడింది. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు ముప్పేటా దాడి చేస్తున్న నేపథ్యంలో, ఈ ప్రీమియం భారం రైతులను మరింత కలవరపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే ఫసల్బీమా పథకం జిల్లాలో కేవలం మూడు పంటలకే మాత్రమే వర్తింపజేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.15లోగా ప్రీమియం చెల్లించాలిజిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో వరి 38,599 హెక్టార్లు, కంది 21,054, మిరప 55,786, పత్తి 91,566 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు వేశారు. ఆయా పంటలు ఈ–క్రాప్లో నమోదైతే బీమా పరిధిలోకి వస్తాయి. పత్తి పంటకు ఈనెల 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలి. మిరప, కంది పంటలకు ఈనెల 31వరకు, వరి పంటకు ప్రీమియం చెల్లించే అవకాశం ఆగస్టు 15 వరకు అవకాశం ఉంది.అన్నదాతలకు అండగా గత ప్రభుత్వంవైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలిచారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పలు వ్యవసాయ పథకాలు పారదర్శకంగా అమలు చేశారు. వాటిలో పంటబీమా గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. మొదట కేవలం రైతు భాగస్వామ్యంగా ఒక్కరూపాయి చెల్లించాలని చెప్పినా, ఆ తర్వాత దానికి కూడా తీసేసి రైతులపై పైసాభారం పడకుండా చూసింది.దరఖాస్తు విధానంరైతులు తమ పంటలను ఈ–పంటలో నమోదు చేసుకోవాలి. పంట రుణం తీసుకున్న రైతుల ప్రీమియంను బ్యాంకులు స్వయంగా మినహాయించుకుంటాయి. రుణం తీసుకోని అన్నదాతలు తమ సమీపంలోని మీ–సేవా, కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాలు, లేదా తమ ఖాతాలున్న బ్యాంకుల్లో నగదు చెల్లించవచ్చు. జాతీయ పంటల బీమా పోర్టల్లోనూ నేరుగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవచ్చు.పంట ప్రీమియం(ఎకరాకు) బీమా మొత్తం (ఎకరాకు)మిరప రూ.360 రూ.90,000కంది రూ.40 రూ.20,000వరి రూ.80 రూ.40,000ప్రత్తి రూ.1900 రూ.38,000 -
రూ.16 లక్షలు కొట్టేసిన టీడీపీ నేత
పెదకూరపాడు: ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.హసీనా..తన సోదరి జాన్బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
పల్నాడు: భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లికీ చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. విజయవాడ పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
సమగ్ర ఆరోగ్య ప్రచారం
నరసరావుపేట రూరల్: మండలంలోని రావిపాడులో శనివారం సమగ్ర ఆరోగ్య ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆదేశానుసారం జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవీ ఆధ్వర్యంలో 104 సిబ్బందితో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సుమారు 40మందికి హెచ్ఐవీ, సిఫిలిస్ పరీక్షలతో పాటు హెపటైటిస్ బీ, సీ రక్త పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. పమిడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీఆర్ జోయెల్ ప్రసాద్, ఏఎన్ఎం నాగమల్లేశ్వరి, ఐసీటీసీ కౌన్సిలర్ రవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైస్మిల్లు దగ్ధం
నకరికల్లు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైస్మిల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో శనివారం తెల్లవారుఝామున జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. షేక్ జాన్సాహెబ్, అరవపల్లి ప్రదీప్లు భాగస్వామ్యంతో గ్రామంలోని మసీదులైన్లో రైస్మిల్లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి కార్యకలాపాలు ముగించుకొని వెళ్లిపోయారు. శనివారం తెల్లవారుఝామున మిల్లులో మంటలు రావడం గమనించిన సమీప గృహాల వారు మిల్లు నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో మిల్లులోని యంత్రాలు, ధాన్యం, బియ్యం బస్తాలు కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ చల్లా సురేష్ కేసు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రూ.10లక్షల మేర ఆస్తినష్టం -
కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
రేపల్లె: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామంలోని మోపిదేవి సతీష్ గృహాన్ని పరిశీలించారు. గృహంలో కల్తీ మద్యం తయారు చేసే ముడి సరుకుతోపాటు మద్యం నిల్వ ఉంచే టిన్లు, క్వార్టర్ సీసాలు కనిపించాయి. మోళ్లగుంటకు చెందిన మోపిదేవి సతీష్, కన్నా రాములతోపాటు కృష్ణాజిల్లా గుల్లలమోద గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి సూర్యలను అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి సతీష్, సూర్య, రాములతోపాటు మరో ముగ్గురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇథనాల్ ఆల్కహాల్ 10 లీటర్లు, 21 ఖాళీ క్యాన్లు, 510 ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి అయిన యానం శ్రీను అలియాస్ నులికుర్తి శ్రీనివాస్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఇథనాల్ ఆల్కహాల్ను సతీష్కు పంపుతాడు. ఆల్కహాల్లో రంగు నీరు కలిసి సతీష్, సూర్య, రాములు 180 మిల్లీలీటర్ల సీసాలలో నింపి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ అక్రమంగా నగదు సంపాదిస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన యానం శ్రీను, రూతుల శ్రీనివాస్ , చరణ్జిత్లను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎకై ్సజ్ అధికారి తెలిపారు. వీరిరువురికి హైదరాబాద్లో ఉన్న నకిలీ మద్యం తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జనార్థన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుబాబు, ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎస్ఐలు రాజ్యలక్ష్మి, రామారావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
నరసరావుపేట: జిల్లాలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శనివారం తన చాంబర్లో కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా స్థాయి ప్రెగ్నన్సీ యాక్ట్–1971 అమలు తీరుతెన్నులపై సభ్యులతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ చట్టం కింద లీగల్గా అబార్షన్స్ చేసేందుకు రెండు దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలియచేస్తుందన్నారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ రవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ వైద్యశాలలు, ప్రైవేటు అల్ట్రా సౌండ్ స్కాన్ సెంటర్లు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. అలా చేస్తే తీవ్ర నేరంగా పరిగణించి జరిమానా, జైలుశిక్ష, గుర్తింపు సర్టిఫికెట్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏరియా హాస్పిటల్ గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ కె.విజయలక్ష్మి, పీడియాట్రిషన్ డాక్టర్ బి.లక్ష్మణరావు, ఫిజీషియన్ డాక్టర్ ఎస్.గిరిరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు డి.శివకుమారి ప్రోగ్రాం ఆఫీసర్ డెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు. ప్రెగ్నెన్సీ యాక్ట్పై డీఎంహెచ్ఓ సమీక్ష -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఏవూరి గోపాలరావు పిలుపు నిచ్చారు. కోటప్పకొండరోడ్డులోని సంఘం కార్యాలయంలో శనివారం గుంటుపల్లి బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో గోపాలరావు మాట్లాడారు. కేంద్రం మద్దతు ధరల చట్టం తీసుకవస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినా అమలులోకి రాలేదన్నారు. అలాగే కార్మికలోకాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావటంతో పాటు కేరళ తరహాలో రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకై తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం నాయకలు సిహెచ్.సురేష్రాజా, ముని వెంకటేశ్వర్లు, జి.జాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన 565వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు, ఆయన భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్తో కలిసి శనివారం బైక్పై నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో సాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల గోడు పట్టదా?
సత్తెనపల్లి: మున్సిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరి సమస్యల పరిష్కారానికి కనికరం చూపడం లేదు. పలుమార్గాల్లో నిరసనలు, ఆందోళనలు తెలిపినా కార్మికులకు గత్యంతరం లేక సమ్మెబాట పట్టారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపల్ కార్యాలయాల వద్ద గత 10 రోజులుగా ఇంజినీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ వర్క్స్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. పట్టణాల్లో రోడ్ల నిర్వహణ, తాగు నీరు, విద్యుత్ సరఫరాలో వీరి సేవలు కీలకం. వీరంతా సమ్మెలో ఉండడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వ వంచన... తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి నాయకులు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకం వారికి అమలు చేయలేదు. జిల్లాలోని 8 పురపాలక, నగర పంచాయతీల్లో సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా తల్లికి వందనం పథకానికి అర్హులైనా అమలు చేయలేదు. సమ్మెలోనే మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు పది రోజులుగా వివిధ రూపాల్లో దీక్షలు, నిరసనలు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్ సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్న వైనం జిల్లాలోని 8 మున్సిపాల్టీల్లో 500 మంది ఇంజినీరింగ్ కార్మికులు సత్వరమే సమస్యలు పరిష్కరించాలి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. గత నెల 25 నుంచి వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నాం. సమస్యలు పరిష్కారం కాకపోతే 12 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. ప్రధానంగా ఉద్యోగ భద్రత, పనికి తగిన వేతనం లేదు. కొత్తగా చేరిన వారికి పాత వారికి ఒకే జీతం ఉండకూడదు. సర్వీస్ అర్హత గుర్తించి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. – సిలార్ మసూద్, గౌరవాధ్యక్షుడు, మున్సిపల్ యూనియన్, పల్నాడు ప్రధాన డిమాండ్లు కార్మికులకు టెక్నికల్ జీతం రూ. 29,200, నాన్ టెక్నికల్ రూ. 24,500 అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి తీసుకురావాలి. కార్మికులందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలి. ఇంకా పలు డిమాండ్లు. -
నీటి మోటార్ల దొంగలు అరెస్ట్
నాలుగు మోటార్లు స్వాధీనం వేటపాలెం: పొలాల్లో సాగు నీటికి ఉపయోగించే మోటార్లు దొంగిలించే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.జనార్దన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన రైతు మర్రి నాగార్జున తమ పంట పొలాలకు ఉపమోగించి నీటి మోటార్లు దొంగతనాకి గురైట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొణిజేటి చేనేత కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నాసిర్ వాలి, వేటపాలెం మార్కెట్ సెంటర్లో నివాసం ఉంటున్న షేక్ సుభాని.. ఇద్దరు చెడు వెసనాలకు అలవాటు పడి పొలాల్లో ఉండే మోటార్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 హెచ్పీ మోటార్లు మూడు, 2 హెచ్పీ మోటార్లు రెండు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.1.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులిద్దరినీ చీరాల కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. 15న జిల్లా అథ్లెటిక్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్లో ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్తోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఆగస్ట్లో బాపట్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. నేడు అండర్–14 పికిల్ బాల్ పోటీలు వివివి హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని క్లబ్లో అండర్– 14 బాల బాలికల ఓపెన్ పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని క్లబ్ డైరెక్టర్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన దుకాణాల్లో తనిఖీలు కొరిటెపాడు (గుంటూరు): జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 40 మంది అధికారులను 13 టాస్క్ఫోర్స్ బృందాలుగా ఏర్పాటు చేసి ఏకకాలంలో తనిఖీలు చేశారు. గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని పలు విత్తన దుకాణాలు, మాన్యుఫాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, రిటైల్, హోల్ సేల్ దుకాణాల్లో శనివారం ఈ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగుతున్నట్లు గమనించామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఆ విత్తనాల అమ్మకాలను నిలిపివేశామన్నారు. రూ.4.72 కోట్ల విలువైన 704.84 కిలోల మిర్చి విత్తనాలు, రూ.5.65 లక్షల విలువ గల మరో 293.85 కిలోల ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేశామని పేర్కొన్నారు. -
వృథా.. అన్నదాతల వ్యథ
దుర్గి: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నియోజకవర్గంలో మైనర్ రిజర్వాయరైన బుగ్గవాగు డ్యాం మరమ్మతులకు నోచుకోలేదు. పల్నాడు జిల్లా, ముఖ్యంగా మాచర్ల, గురజాల నియోజకవర్గ ప్రజల వరధాయిని లాంటి బుగ్గవాగు డ్యాం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న రిజర్వాయర్ను సక్రమంగా రైతులకు అందుబాటులోకి తీసుకురాలేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. సాగర్ కుడికాలువ నుంచి బుగ్గ వాగు డ్యాంకు నీటిని సరఫరా చేసి ఇక్కడ నుంచి కుడికాలువకు నీటిని సరఫరా చేస్తూ లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయటమే ఈ రిజర్వాయర్ ప్రధాన ఉద్దేశ్యం. మాచర్ల, గురజాల నియోజక వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు సరఫరా అవుతుంది. అల్లాడుతున్న రైతాంగం ఖరీఫ్ సీజన్లో ముందస్తు వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో రైతాంగం మే మొదటివారం నుంచి ముందస్తుగా వేలాది ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అయితే వర్షాలు సరిగా పడక, డ్యాంలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ విషయమై రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా వారి గోడు ఆలకించేవారే కరువయ్యారు. ప్రస్తుత సీజన్కు నీటి సరఫరా రానున్న తరుణంలో హడావుడిగా రెండు షట్టర్లకు తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో డ్యాంను ఆపరేట్ చేసి షట్టర్లను బాగు చేస్తేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. తాగునీటికి అల్లాడిపోతున్నాం ఊరి బోర్లలో నీరు లేకపోవటంతో బుగ్గవాగు డ్యాం నుంచి పైపుల ద్వారా మా గ్రామానికి తాగునీటి సరఫరా అవుతుంది. డ్యాంలో కనీస నీటిమట్టం లేకపోవటంతో తాగునీరు రావటం లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని నీటిని నిల్వ చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – ఎం.సాంబయ్య, కంచరగుంట బోర్లు ఎండిపోయాయి డ్యాంలో కనీస నీటిమట్టం ఉన్నట్లయితే మా గ్రామంతో పాటు పరిసర గ్రామా ల్లో వేలాది బోర్లలో సమృద్ధిగా నీరు వచ్చి పంటలు సాగు చేసుకునేవారం. డ్యాంలో నీరు నిల్వ లేకపోవటంతో మొత్తం బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీని మూలంగా వేలాది ఎకరాల్లో పత్తిపంట ఎండిపోయింది. – తోటకూర వెంకటేశ్వర్లు, రైతు రెండు గేట్లకు అనుమతులు వచ్చాయి బుగ్గ డ్యాం ఆరు గేట్లలో రెండు గేట్లు ధ్వంసమైన నేపథ్యంలో వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. రెండు గేట్లకు నిధులు కేటాయించింది. గత పదిహేను రోజులుగా మరమ్మతులు నిర్వహిస్తున్నాం. మరో 15 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి నీరు వృథాకాకుండా చర్యలు తీసుకుంటాం. మిగిలిన వాటిని త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. – శివయ్య, జేఈ, ఎన్ఎస్పీ డ్యాం బుగ్గవాగు డ్యాం మరమ్మతులతో వృథాగా సాగర్ జలాలు ఆరు గేట్లలో నాలుగు ధ్వంసం నీటి నిల్వ లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న బోర్లు, పంటలు .. రైతుల గగ్గోలు సాగు, తాగు నీటికి తీవ్ర కటకటపాడైన నాలుగు గేట్లు బుగ్గవాగు డ్యాంకు సంబంధించి మొత్తం ఆరు గేట్లు పనిచేస్తుంటాయి. వీటిలో నాలుగు ధ్వంసం కావటంతో వాటిని ఆపరేటింగ్ చేయకపోవటంతో వచ్చిన నీరు వచ్చినట్లు కిందికి వెళ్లిపోతోంది. దీంతో కనీస నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. రిజర్వాయర్ మొత్తం కెపాసిటీ 3463టీఎంసీలు, డెడ్ స్టోరేజీ కెపాసిటీ 1.698టీఎంసీలు. కానీ షట్టర్లు ధ్వంసం కావటంతో జలాశయంలో నీరు అడుగంటుతోంది. మొత్తంగా నీటి లెవల్ 475.58టీఎంసీలు అందుబాటులో ఉండటం లేదు. -
లోక్ అదాలత్లో 852 కేసులు పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం స్థానిక మండల న్యాయ సేవా అధికారులు న్యాయస్థాన భవనం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13 అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్.సత్యశ్రీ ఆధ్వర్యంలో న్యాయాధికారులు ఆరు బెంచ్లుగా ఏర్పడ్డారు. సివిల్, క్రిమినల్, ముందస్తు వ్యాజ్యాలు, అన్ని రకాల కేసులు కలిపి 852 కేసులను పరిష్కరించారు. పరిష్కారమైన కేసుల్లో కక్షిదారులకు రూ. 5,49,30,445ల మేరకు పరిహారం లభించింది. అదాలత్లో న్యాయాధికారులు కె.మధుస్వామి, ఎన్.లావణ్య, ఆర్.ఆశీర్వాదం పాల్, ఎ.సలోమి, ఎం.గాయత్రి, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు.ఆలయ జీర్ణోద్ధరణకు రూ.లక్ష విరాళంనరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలో వేంచేసియున్న వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు పట్టణానికి చెందిన లక్ష్మీనరసింహా జువెల్లరీ మార్ట్ అధినేత దద్దాల వెంకటేశ్వరరావు, పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాతలు విరాళం మొత్తాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా కృష్ణ, వనమా సాంబశివరావు, కోవూరు శివశీనుబాబులకు అందజేశారు.స్వామివారికి వెండి కిరీటంగురజాల: పల్నాడు యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో వేంచేసియున్న వేంకటేశ్వర స్వామి వారికి 5 కిలోల వెండి కిరీటాన్ని శనివారం భక్తులు అందించారు. గురజాలకు చెందిన కనిగిరి సాంబశివరావు, గుండా రవితేజ, జూలకంటి మణికుమార్ రెడ్డిలు స్వామి వారికి అందించారు. తొలి ఏకాదశి ముందు రోజు శనివారం స్వాతి నక్షత్రం కావడంతో స్వామి వారికి కిరీటం అందజేశామని దాతలు తెలిపారు. వెండి కిరీటానికి దేవాలయ అర్చకుడు వేణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాజగోపురం తలుపునకు మరమ్మతులుఅమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపునకు ఉన్న ఇనుపరాడ్ విరిగిపోవటంతో గత బుధవారం రాత్రి ఒరిగిపోయింది. ఈనేపధ్యంలో ఆలయ ఈఓ రేఖ ఆధ్వర్యంలో మంగళగిరి నుంచి తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగి నిపుణులను పిలిపించి క్రేన్ సాయంతో మరమ్మతులు పూర్తి చేశారు. -
అమ్మో.. తొలి ఏకాదశి?!
వినుకొండ: తొలిఏకాదశి వినుకొండ వాసులకు పెద్ద పండుగ. సంక్రాంతి తరువాత ఇళ్లన్నీ కళకళలాడేది ఈ పర్వదినం నాడే. బంధువులు, స్నేహితులు, కన్నబిడ్డలు ఇలా.. ఒకరేమిటి బంధుగణమంతా ఎక్కడ ఉన్నా.. ఇక్కడి తమ వారిండ్లకు తరలివచ్చి తొలిఏకాదశి పర్వదినాన్ని ఆస్వాదించి మరునాడు తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. మెట్ల మీదుగా కొండపైకి వెళ్లి స్వామిని దర్శించి పరవశించే వారు. చుట్టపక్కల గ్రామాల నుంచే కాకుండా లక్ష మందికి పైగా భక్తులు వినుకొండకు పెద్ద ఎత్తున తరలివస్తారు. కానీ ఇవాళ ఈ పండుగ పేరు చెబితేనే స్థానికుల్లో వణుకు పుడుతోంది. ఎందుకంటే, గత ఏడాది ఇదే పర్వదినం నాడు జరిగిన ఘటనే ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన రషీద్ అనే యువకుడిని రోడ్డుపైనే అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలో 29 మందిని నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా తొలిఏకాదశి పండుగ రోజునే పలు చెదురు మదురు ఘర్షణలు జరిగాయి. అయితే ఈ ఏడాది ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరగాలని పట్టణ వాసులు కోరుకుంటున్నారు. పర్వదినం రోజున వినుకొండలో ఏదోక ఘర్షణ గత ఏడాది ఇదేరోజున రషీద్ హత్య పట్టణంలో పటిష్ట భద్రత 42 మందిపై బైండోవరు కేసులు 82 సీసీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు 400 మంది పోలీసులతో భద్రత -
కోటప్పకొండపై..
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విస్త్రృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. అలాగే స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. -
పటిష్ట బందోబస్తు
గతేడాది రషీద్ హత్య నేపథ్యంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. తిరునాళ్లకు జిల్లావ్యాప్తంగానే కాకుండా పక్క జిల్లా నుంచి 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాం. కొండపైనా, కింద 82 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కొండ కింద పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం. ప్రధాన కూడళ్లలో కూడా పటిష్ట భద్రతతోపాటు, ఫ్లైయింగ్ టీంలను ఏర్పాటు చేశాం. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో 42 మందిపై బైండోవరు కేసులు నమోదు చేశాం. కొంత మందిని హౌస్ అరెస్టు చేశాం. మరికొంత మందిని ఊరు విడిచి పెట్టి వెళ్లాలని ఆదేశాలిచ్చాం. గత నాలుగు రోజుల నుంచి రాత్రి 10 గంటలకే వ్యాపార దుకాణాలు మూసివేయిస్తున్నాం. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. – శోభన్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్, వినుకొండ ● -
అధికారులు సమన్వయంతో పనిచేయండి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట: పేద మహిళలకు అందించే పథకాలపై సమన్వయంతో అన్నిశాఖల అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం వివిధ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించి ఏసీఎల్పీ యాన్యువల్ క్రెడిట్ లవ్లీహుడ్ ప్లాన్పై సమీక్ష చేశారు. ఇందులో భాగంగా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు దీనిలో వచ్చిన అంశాలు ఆధారంగా వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, జిల్లా పరిశ్రమలు, ఫిషరీస్, పట్టు పరిశ్రమలు, ఖాదీబోర్డు, హ్యాండ్లూమ్ శాఖలు జిల్లాలోని డ్వాక్రా సంఘ మహిళలకు అవసరమైన పథకాలు వివరించడంలో ఎటువంటి మార్గదర్శకాలను పాటించాలనే విషయం తెలియచేశారు. చుక్కల భూముల సమస్యలను పరిష్కరించండి.. నరసరావుపేట: జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 22 ఏ జాబితాలో పడిన చుక్కల భూములను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. కార్యాలయంలో శనివారం జేసీ సూరజ్ గనోరేతో కలిసి సమీక్షచేశారు. మూడు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి 22ఏ లిస్టులోని భూములు ఎవరెవరికి చెందినది, వారికి ఎలా సంక్రమించిందనే వివరాలను భూముల రికార్డుల ఆధారంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా భూములను సరైన ఆధారాలు చూపించిన వాటిని వెంటనే తీసుకొని అర్హత కలిగిన వారికి 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. డీఆర్ఓ మురళి, ఆర్డీఓలు కె.మధులత, రమణారెడ్డి, మురళీకృష్ణ, కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ సూపరిండెంట్ నాగిరెడ్డి, తహసీల్దార్లు దానియేలు, జి.శ్రీనివాస్, కిరణ్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. 10న మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జూలై 10న పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ (పీటీఎం 2.0) సమావేశం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన పీటీఎంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలను సైతం భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో 3.04లక్షల మంది తల్లిదండ్రులు భాగస్వామ్యం కానున్నారన్నారు. ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు సమావేశం జరుగుతుందన్నారు. అదేవిధంగా అమ్మ పేరుతో ఒక మొక్కను ప్రతి విద్యార్థికి అందించడం జరుగుతుందని, ఆ మొక్కకు సంబంధించి వారికి గ్రీన్ పాస్పోర్టు అందజేస్తామన్నారు. అందులో ఆ మొక్క వివరాలు అదేవిధంగా మొక్క ఎదుగుదలను సంబంధించి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి నమోదు చేసి గ్రీన్ పాయింట్లను యాడ్ చేయడం జరుగు తుందన్నారు. -
పడకేసిన ఆరోగ్య రంగం!
ఆరోగ్యశ్రీ నిర్వీర్యమై పోయింది.. గత ప్రభుత్వం ప్రకటించిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం సాధ్యం కాదనీ, ‘పీపీపీ’ల ప్రాతిపదికనే వాటిని నిర్వహిస్తామంటూ చేతులెత్తేసింది.. మునుపు మండలానికి ఒక్కటి అంటూ కచ్చితంగా తిప్పిన అంబులెన్సుల్లో నేడు చాలా వరకు రిపేర్ల పేరుతో మూలనపెట్టింది.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అటకెక్కించింది.. కనీసం అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచలేకపోతోంది.. వెరసి పేదోడికి పెద్ద రోగమొస్తే ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకోవద్దని తన చేతల ద్వారా స్పష్టం చేస్తోంది.కుయ్.. కుయ్.. కుయ్.. అలనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ ఎన్నికల సభలో 108 సేవల గురించి ప్రస్తావిస్తూ ఆయన వినిపించిన అంబులెన్స్ తాలూకు భరోసా శబ్దాలివి. రయ్.. రయ్.. రయ్.. ఆ తర్వాత తన తండ్రి వాగ్దానాలను పటిష్ట పరుస్తూ వైఎస్ జగన్ జెండా ఊపినప్పుడు ఒకేసారి పరుగెత్తిన 1024 అంబులెన్సుల హోరులవి. నై.. నై.. నై.. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు చక్కగా అందుతుండగా.. వాటిని మరింత మెరుగ్గా కొనసాగించాల్సింది పోయి, అసలు ఈ పథకానికే ఎసరు తెస్తూ.. ప్రభుత్వ వైద్యం నో.. నో.. నో.. అంటూ ప్రైవేట్/కార్పొరేట్ వైద్యానికి మేలు కలిగేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. యాసిన్ – గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కొన్ని కారణాల వల్ల చిలకలూరిపేటలో ఇటీవల ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. అతణ్ణి అర్జెంటుగా ఆసుపత్రికి తరలించాలి. కానీ ‘లెన్సు’ వేసి చూసినా ‘అంబులెన్సు’ అందుబాటులో లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు ఆంబులెన్సులు అందుబాటులో ఉండేవి. ఇందులో చిలకలూరిపేటలోని అంబులెన్సు కోసం వాకబు చేస్తుండగా ఇక్కడి వాహనం రిపేర్లో ఉందని, అందువల్ల నాదెండ్ల లేదా యడ్లపాడు వాహనం కోసం ప్రయత్నిoచాలంటూ అక్కడి సిబ్బంది చెప్పారు. అక్కడి నుంచి సదరు అంబులెన్సు వచ్చేలోపు ప్రాణాలే పోవచ్చనే అభిప్రాయంతో స్థానిక ప్రజలు సొంత డబ్బులతో బాధితుడిని ఆసుపత్రికి చేర్చారు. ‘‘గతంలో 108 అంబులెన్సు కోసం ఫోన్ చేస్తే గరిష్టంగా 10 నిమిషాల లోపే వచ్చేసేవి. బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడేవి. ఇప్పుడు వాటి ఆనూ పానూతో పాటు నడిపించేందుకు తగిన ప్లానూ లేకుండా పోయింది. నిరుటి వరకు చక్కగా తిరిగిన ప్రాణరక్షణ ఆంబులెన్సులు ఇప్పుడు కూడా అలాగే ఎందుకు పని చేయడం లేదు?’’ అనే ప్రశ్న ఇప్పుడు అక్కడి స్థానికుల నుంచి వినిపించింది. ఈ ప్రశ్నకు జవాబు లేదు. దొరికే దాఖలా కూడా లేదు. ఎంతలో ఎంత తేడా? వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేసేందుకు పూనుకుంది. దానికి తోడు జగన్ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే కరోనా వైరస్ విజృంభించడం, మరిన్ని వైద్య సేవలూ అవసరం కావడంతో ఈ పథకం పరిధిలోకి వచ్చే వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి మరీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆ పెండింగ్ బకాయిలను కూడా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ చెల్లించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అంతకు ముందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.ఐదు లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో 1,059 ప్రొసీజర్లను ఐదేళ్లలో 3,257కు పెంచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో కూడా చికిత్స చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్ను అదనంగా పథకం పరిధిలోకి చేర్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సానంతరం రోగులకు అందించే ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలివేసింది. గత ప్రభుత్వంలో చికిత్సానంతరం రోగులకు నెలకు రూ.5 వేల మేర సాయం అందించేవారు. దీనిప్రకారం.. గత ఏడాదికి రూ.400 కోట్ల మేర సాయం అందించాల్సిన సాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు అరకొరగా అందుతున్నాయనీ, పైగా హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేరున్న చాలా ఆసుపత్రుల్లో ఈ పథకం కింద రోగులను తీసుకోడానికి సుముఖంగా లేవంటూ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ‘పేదలు, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలని వైఎస్ జగన్ పరితపించారు. మన ఇంట్లో వాళ్లు ఆస్పత్రికి వెళితే ఎలాంటి సేవలు అందాలని కోరుకుంటామో.. ఆస్పత్రుల్లో అందరికీ అలాంటి సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి పదే పదే సూచించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. కూటమి నేతల మాటలు నమ్మి వాపును చూసి బలం అనుకున్నాం. ఏడాదిలోనే తెలిసొస్తోంది’ అని ఒంగోలుకు చెందిన ఓ చిరుద్యోగి వ్యాఖ్యానించారు. అది ఉండనే ఉందిగా... మళ్లీ ఇదీ ఎందుకు? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో చిత్రమైన వాదనను వినిపిస్తోందని ప్రజలు తెలిపారు. ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘‘ఆయుష్మాన్ భారత్’’ స్కీమ్ అమల్లో ఉన్నందున ప్రత్యేకంగా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం లేదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటున్నారు. దాంతో మళ్లీ ఆరోగ్యశ్రీ కింద మరిన్ని చికిత్సల కవరేజీ అవసరం లేదనీ, అసలు ఈ పథకానికి ఇన్ని నిధులు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న దుర్మార్గ స్థితి నెలకొంది. ఎన్నికల హామీల్లో భాగంగా మునుపు అమలవుతున్న ఏ పథకాన్నీ తీసేయబోమనీ, కావాలంటే ఆ జాబితాకు మరికొన్ని చేరుస్తామంటూ వాగ్దానాలు చేసే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ‘గతంలో అమలైన అనేక పథకాలకు మంగళం పాడింది. ప్రాణాలు పోసే వైద్య రంగంలోని సేవలనూ మినహాయించక పోవడం దుర్మార్గం.. ముష్టిగా ఓ వెయ్యి ఎగస్ట్రా పడేసి.. రూ.వేలు విలువైన సేవలను అన్యాయంగా తీసేసింది’ అని ఓ వృద్ధుడు వాపోయాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలపై కక్ష! ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 వైద్య కళాశాలలను తెరవాలనే సంకల్పంతో గత సర్కారు అనుమతులను తెచ్చుకుంది. ఆ మేరకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి ఓ టీచింగ్ హాస్పిటల్ ఉండటం తప్పనిసరి కావడంతో.. రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఈ కళాశాలలు తెరిచే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించింది. మలి దశలో ఇంకొన్ని సిద్ధం చేసింది. అంతలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటికి కొర్రీ వేసింది. పులివెందుల కళాశాలకైతే మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం క్షమార్హం కాదని గుంటూరులో ఓ మెడికల్ షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కళాశాలలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తోంది.అన్నింటా విఫలం.. అందరి నోటా అదే మాట గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ చాలా సమర్థవంతంగా జరిగింది. 2020 – 2022 మధ్యకాలంలో కరోనా వైరస్ విజృంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విరివిగా అందాలనే ఉద్దేశంతో పీహెచ్సీలను మరింత బలోపేతం చేయడం, డాక్టర్ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇచి్చంది. వైద్యుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. ఒక పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించింది. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్ను సమర్థవంతంగా అమలు చేసింది. ఆ గ్రామాలకు వెళ్లే వైద్యుడు అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి మంచి వైద్యం అందించే వారు. మంచంలో ఉన్న రోగుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లేవారు. ఇప్పుడు ఇదంతా గతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు తగినన్ని ప్రణాళికలు ఎలాగూ రచించడం లేదు సరికదా... ఉన్నవే చెరిపేస్తున్నారన్న భావన ఈ ఏడాది కాలంలో ప్రజల్లో బలంగా వేళ్లూనుకుంది. ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో పురోగతి చాలా పరిమితమేనంటూ గతంలో నిరంతరం సెలైన్లా అందుతున్న సేవలు ఇప్పుడు కోమాకు వెళ్తున్న చందంగా ఉన్నాయని సామాన్యులు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద ఎటు చూసినా... గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగం నిర్వహణ చాలా పేలవంగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వంపై చాలా మంది చాలా ఆశలు పెట్టుకోగా, అన్ని రంగాల్లోనూ విఫలమైందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్యం దీనంగా మారడం, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం, కొత్త మెడికల్ కాలేజీలకు నో చెప్పడం, పీపీపీకి ప్రోత్సాహం, కార్పొరేటు ఆసుపత్రుల సంపద పెంచేలా చర్యలు తీసుకోవడం, గ్రామీణులకు వైద్య సదుపాయాలను మరింత మృగ్యం చేయడం మినహా వైద్య, ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం సాధించిందంటూ ఏమీ లేదని ప్రజలు ఊరూరా చెప్పుకుంటున్నారు. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
ఆడపిల్లల ఆస్తిహక్కు కోసం పోరాడిన సూర్యావతి
సత్తెనపల్లి: ఆడపిల్లలకు ఆస్తి హక్కు కోసం, మద్యపానం నిషేధం కోసం సూర్యావతి పోరాడారని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని అన్నారు. ఐద్వా నాయకురాలు స్వర్గీయ మానుకొండ సూర్యావతి వర్ధంతి కార్యక్రమం పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. వర్ధంతి సభకు ఐద్వా పట్టణ అధ్యక్షురాలు మునగా జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ మండల అధ్యక్షురాలిగా, శాసనమండలి సభ్యురాలిగా సూర్యావతి పని చేశారన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆడ పిల్లల ఆర్థిక స్వాతంత్య్రం కోసం సూర్యావతి పోరాడారని వివరించారు. మద్యం వలన మహిళలపై నిత్యం లైంగికదాడులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా కేరళ తరహాలో 16 రకాల సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సూర్యావతి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన వార్డు కమిటీని ఎన్నుకున్నారు. ఐద్వా నాయకురాలు ధరణికోట విమల, సుధారాణి, లక్ష్మి, అనురాధ, అనంతలక్ష్మి మల్లేశ్వరి, జ్యోతి, భవాని, ఉమామహేశ్వరి భారతి , కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి పెండాల మహేష్, తదితరులు పాల్గొన్నారు. ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని -
రాజకీయ కుట్రలో భాగంగానే శిలాఫలకం ధ్వంసం
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్కుమార్, చింతా సుబ్బారెడ్డిలు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పట్టణంలోని జానపాడు రోడ్డులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.52 కోట్ల నిధులు మంజూరు చేయించి, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారన్నారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఒక వేళ నిర్మాణానికి అడ్డు వస్తే తొలగించి, ఆ పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేయాలేగానీ, ధ్వంసం చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి చింతా రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కెర శ్రీను, షేక్ సైదావలి, కత్తెరపు వాసుదేవరెడ్డి, నాయకులు కందులూరి శివయ్య, చల్లా పిచ్చిరెడ్డి, శివారెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి, శెట్టుపల్లి పూర్ణ, కాలే మాణిక్యరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధ్యులపై సత్వరం చర్యలు తీసుకోవాలి పిడుగురాళ్ల పీఎస్లో వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు -
జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మృతి
నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 21న అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నయీంభాను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం–1, హిస్టరీ–1, కామర్స్–2, కంప్యూటర్ సైన్స్–2, కెమిస్ట్రీ–1, జువాలజీ–1, అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత పోస్టు కోసం పోస్ట్ గ్రాడ్యూయేషన్లో 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, పీహెచ్డీ, యుజీసీ నెట్, సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 11వ తేదీ ఉదయం 11గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మరిన్నీ వివరాల కోసం 8688169290 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం వద్దు
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఈ మేరకు ఈనెల 7వ తేదీన విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలలు నిర్మాణం జరిగితే పేదవానికి వైద్యం సకాలంలో అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు కూ టమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు యల్లావుల సోహిత్ యాదవ్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు కాటి లక్ష్మణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ పర్వే జ్, రేపల్లె అధ్యక్షులు వసీం మొహమ్మద్, చీరాల అధ్యక్షులు గోనబోయిన వెంకటేష్, జిల్లా విద్యార్థి యువ నాయకులు చోప్రా రాజశేఖర్ ఉన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ రవికుమార్ -
ఛిద్రమవుతున్న రోడ్లు
బల్లికురవ: గ్రామీణ రహదార్లు గ్రానైట్ భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమౌతున్నాయి. అడుగుకో గోయ్యితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ నుంచి తీసే స్టీల్గ్రే మీటరు, ముడిరాళ్లు మార్టూరు, గణపవరం, జొన్నతాళి, వేమవరం, మే దరమెట్ల, సంతమాగులూరు, ఒంగోలు, మురికి పూడి, తాతపూడిలోని పరిశ్రమలతోపాటు బెంగళూరు, తాడిపత్రి, చెన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో లారీపై ప్రమాదకరంగా 4 నుంచి 7 బ్లాక్లను ఎక్కిస్తూ 70 నుంచి 90 టన్నుల వరకు తరలిస్తున్నారు. గోతుల కారణంగా అంటూ ఎక్కడ రాయి దొర్లి కింద పడుతుందోనని ప్రజలు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. భారీ వాహనాల రాకపోకలతో బల్లికురవ–నాగరాజుపల్లి–మార్టూరు, చెన్నుపల్లి–వేమవరం జంక్షన్–తాతపూడి –అనంతవరం, కొణిదెన–వేమవరం జంక్షన్–ఉప్పుమాగులూరు, నక్కబొక్కలపాడు–కొదదెన–మార్టూరు, బల్లికురవ–సంతమాగులూరులో రోడ్లు మోకాటిలోతు గోతులతో 10 కిలో మీటర్లు ప్రయాణానికి సైతం 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతోంది. గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని ట్రాఫిక్జామ్లతో బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులకు గమ్యం చేరతామన్న గ్యారంటీ లేదు. గ్రానైట్ దారుల ఆధీనంలో.. చెన్నుపల్లి–అనంతవరం రోడ్లులో కొండాయపాలెం గ్రామాల మధ్య క్వారీ నిర్వాహకులు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారిపైనే యంత్రాలు, లారీలు నిలపడం, లోడింగ్ చేపట్టడం వల్ల తారురోడ్లు సైతం జారుడు బల్లను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో ఈరోడ్డులో ప్రయాణించాలంటే సాహసం చేయక తప్పదు. దెబ్బతిన్న రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. నిధులు మంజూరుతో టెండర్కు కాంట్రాక్టర్లను ఆహ్వానించినా భారీ వాహనాల రాకపోకలకు మెయింటెనెన్స్ ఇవ్వలేక రోడ్ల అభివృద్ధికి కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు. గ్రానైట్ లారీ ఎదురైతే బెంబేలెత్తున్న ప్రయాణికులు భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసం ప్రతిపాదనలతో సరి.. గోతులతో సాగని ప్రయాణం పట్టించుకోని అధికారులు, పాలకులు -
అన్నపూర్ణాదేవికి ఆషాఢం సారె
పెదకూరపాడు: మండలంలోని 75త్యాళ్లూరులో వేంచేసియున్న శ్రీకాశీ అన్నపూర్ణదేవికి శుక్రవారం మహిళలు ఆషాఢం సారె సమర్పణ ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీవిఘ్నేశ్వర స్వామీ ఆలయం నుంచి మేళతాళాలతో గ్రామ దేవుని వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని 108 రకాల వంటకాలు, వస్త్రాలు, పసుపు కుంకుమ గాజులు, పూలు, పండ్లు, తాంబూలాలు, వాయనాలను అన్నపూర్ణాదేవికి సమర్పించారు. ఆలయ అర్చకులు నుదురుపాటి హనుమంతరావుశర్మ, హరినాథ్ శర్మ, తారకనాథ్ శర్మ పూజ క్రతువు నిర్వహించారు. శ్రీ శివసాయి ట్రస్టు సభ్యులు పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారికి సారె సమర్పణ నిర్వహించడం జరుగుతుందని మహిళలు తెలిపారు. -
ఫ్లోరోసిస్పై అప్రమత్తంగా ఉండండి
పెదకూరపాడు: ఫ్లోరోసిస్పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి డాక్టర్ గిరిధర్ అన్నారు. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరిధర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ ఏ విధంగా వ్యాపిస్తుందో, దానిని ఏవిధంగా నివారించగలరో వివరించారు. బోర్వెల్ తాగు నీటిద్వారా, పొగాకు సంబంధింత వస్తువుల ద్వారా, పానీపూరి, కుర్ కురే వంటి వాటిని తినడం వల్ల అందులో కలిపే బ్లాక్ సాల్ట్ వల్ల, బ్లాక్ టీ వంటివి మితిమీరి ఉపయోగిస్తే ప్రజలు త్వరగా ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడతారని వివరించారు. పాఠశాలలో చదువుతున్న, 3,4,5వ తరగతి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెలుగొండా రెడ్డి, ఎంపీహెచ్ఈఓ లక్ష్మీ మనోహర్, ఎంపీహెచ్ఎస్ దిలీప్ కుమార్, బి.శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి డాక్టర్ గిరిధర్ -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడమటి బిక్షాలు కోరారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు, పార్క్ కూలీలకు, ఆఫీసు సిబ్బందికి, టౌన్ప్లానింగ్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీఓ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. రిటైర్ అయిన కార్మికులస్థానంలో, మృతి చెందిన వారి స్థా నాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశా లు కల్పించాలని కోరారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని శివప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగం వాణిశ్రీ పాల్గొన్నారు. -
ఆదాయం సమకూరుతున్నా అభివృద్ధి లేదు..
బల్లికురవ, ఈర్లకొండ చుట్టూ 25 పైచిలుకు గ్రానైట్ క్వారీలు మండలంలో 600 పైచిలుకు పరిశ్రమలు ఉన్నాయి. ఎగుమతులకు రాయల్టీ చెల్లింపు ద్వారా ఆదాయం సమకూరుతున్నా రహదారులు అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ నుంచి ప్రభుత్వానికి చెల్లించే ఆదాయంతో పూర్తిస్థాయిలో అన్ని రహదార్లను అభివృద్ధి పరచవచ్చు. – తంగిరాల వెంకేటేశ్వర్లు, సీపీఎం నాయకుడు గ్రానైట్ లారీ ఎదురైతే హడలే.. బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, అద్దంకి మండలాల్లో రహదార్లపై టూవీలర్, కార్లపై ప్రయాణించాలంటే భయంగా ఉంది. 4 నుంచి 7 గ్రానైట్ బండలు, లారీ ట్రాలీలపై ఎగుమతితో ఎక్కడ ఒరుగుతాయోనని భయపడుతున్నాం. – ధర్మవరపు రవికుమార్, వాహన చోదకుడు● -
సహకారం.. మంగళం!
యడ్లపాడు: సహకార సంఘాల ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వం మరోమారు యూ టర్న్ తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే సత్వరమే సహకార ఎన్నికలు నిర్వహిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రైతుల మద్దతుతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వెనువెంటనే సొసైటీలకు త్రిసభ్య కమిటీలుగా కొనసాగుతున్న వారిని వైదొలగాలని బలవంతపు రాజీనామాలు చేయించింది. సహకార సంఘాల్లో పనిచేసే అధికారులను అఫీషియల్ పర్సన్ ఇన్చార్జులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 జూన్లో అధికార బాధ్యతలు చేపట్టి వసంత కాలం గడిచినా సహకార సంఘాల ఊసే ఎత్తలేదు. గతనెల 28తో అఫీషియల్ పర్సన్ ఇన్చార్జులు పరిమిత కాలం పూర్తి కావడంతో, మరో నెలరోజులు వారే కొనసాగేలా గడువు పెంచి మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు త్రీమెన్ లేదా ఫైవ్మెన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. సహకార ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే ..? ఎన్నికల నిర్వహిస్తామన్న హామీ నెరవేర్చని కూటమి వైఎస్ జగన్ హయాంలో మారిన సొసైటీల రూపురేఖలు -
కష్టాల్లో పింగళి వెంకయ్య కుటుంబీకులు
దయనీయ స్థితిలో ఆయన మనవరాలు భవాని చీరాల: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవరాలు భవాని దయనీయస్థితిలో ఉంది. అనారోగ్యానికి గురై కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం జరిగినా అది శిథిలావస్థకు చేరింది. పింగళి వెంకయ్య వర్థంతి కార్యక్రమాన్ని శుక్రవారం వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేవాంగపురిలోని ఆయన మనవరాలు భవాని గృహంలో జరగ్గా ఈ విషయాలు వెలుగు చూశాయి. వర్ధంతి కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు బట్ట మోహనరావు మాట్లాడుతూ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వాతంత్య్ర సమరయోధునిగా ఎన్నో సేవలు చేశారన్నారు. కృష్ణాజిల్లా దివి తాలూకా పెద్ద కల్లేపల్లి గ్రామంలో 1878లో ఆయన జన్మించారన్నారు. ఉన్నత చదువులు చదివిన ఆయన చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశారని వివరించారు. ఆయన మనవరాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం సీతారామయ్య, భవాని దంపతులను రోటరీ క్లబ్ తరఫున సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఏవీ సురేష్బాబు, కార్యదర్శి అక్కల చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 522.50 అడుగుల వద్ద ఉంది. ఇది 153.8745 టీఎంసీలకు సమానం. సాగర్ నుంచి ఎడమ కాలువకు 2,114 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,542 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
వైఎస్సార్ సీపీ హయాంలో ఘనం
జిల్లాలో 60 సొసైటీలు ఉండగా వాటిలో 2.40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోక నష్టాల్లో ఉన్న సహకార సంఘాల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ సర్కారు విశేష కృషి చేసింది. రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడం వరకే పరిమితమైన సంఘాల్ని సమూలంగా మార్చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘాలను లాభాల బాట పట్టించారు. ● సంఘాల్లో రైల్వే టికెట్ల నుంచి దైవదర్శనం టికెట్ల వరకూ, విద్యుత్ బిల్లుల చెల్లింపులు వంటి అనేక సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ● పెట్రోల్ బంకులు, మల్టీ పర్పస్ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలతో నమ్మకమైన వ్యాపారాలకు శ్రీకారంచుట్టి కొత్త ఒరవడి తెచ్చారు. ● రైతులు పండించిన ఉత్పత్తుల్ని స్థానికంగానే నిల్వ చేసుకునేలా జిల్లాలో 53 మల్టీపర్పస్ గోడౌన్లు, 3 కోల్డ్ స్టోరేజీలు, 3 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశారు. ● జిల్లాలోని శావల్యాపురంలో నిర్మించిన కోల్డ్స్టోరేజ్ రాష్ట్రంలోనే సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటైన మొట్టమొదటిది కావడం విశేషం. ● పల్లె ప్రజలకు తక్కువ ధరకే జనరిక్ మందులు లభించేలా ఐదు ప్రధానమంత్రి జనఔషధి కేంద్రాలు నెలకొల్పారు. ● 60 సొసైటీలను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చి, యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా అన్నిరకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిద్వారా సామాన్య పౌరులతో పాటు రైతులకు 300లకు పైగా వివిధ రకాల పౌరసేవలు అందించారు. మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి సహకార సంఘాలు పునాది వంటివని నిరూపించారు. -
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బాబు
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే రూ. లక్షా అరవై వేల కోట్ల అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని అందుకే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాను రిలీజ్ చేసిన వీడియో సందేశంలో కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రూ. 3,30,000 కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కల్పించారన్నారు. అలాగే కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఐదేళ్లల్లో రాష్ట్రానికి ఇంత చేసి సగటునా ఏడాదికి రూ. 65 వేల కోట్లు మాత్రమే అప్పు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించా రన్నారు. ● చంద్రబాబునాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారని మండి పడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అనుకూల చానళ్లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. విపరీత అప్పులతో నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆఫ్రికా లోని సూడాన్ కంటే దారుణంగా ఉందన్నారు. ● ఎన్నికలకు ముందు విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచనని బీరాలు పలికిన చంద్రబాబు నేడు స్మార్ట్ మీటర్లతో రూ.వందలు వచ్చే కరెంట్ బిల్లులను రూ.వేలకు మార్చారన్నారు. దీంతో వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి, రెండవ నెలలో తమ ఇంటి కరెంట్ బిల్లు రూ. 6349లు వస్తే, కూటమి ప్రభుత్వంలో నేడు రూ.16,918లు కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. సంస్కరణలు అంటే ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఏడాదిలో రూ.లక్షా అరవై వేల కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.. అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
వర్షా కాలం.. జరభద్రం
సత్తెనపల్లి: జిల్లాలో వర్షాకాలం కారణంగా మారిన వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలతో నెలకొన్న చల్లని వాతావరణానికి దగ్గు, కఫం, జలుబు చేసే అవకాశం ఉందని, వీటికి తోడు మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా, చికున్ గున్యా వంటి జ్వరాలు ప్రబలుతాయంటున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారే ఉన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్య లోపం, తదితర కారణాలతో పాటు ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులతో జనం అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన -
డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలి
చిలకలూరిపేట: డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా నియామకాలు నిర్వహించాలన్నారు. జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో డీఎస్సీ ఖాళీలు కూడా చూపించినందున మారుమూల ప్రాంతాలలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరగా మెరిట్ లిస్టు విడుదల చేసి తద్వారా సెలక్షన్ లిస్టు తయారు చేసి వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడకుండా నియామక ప్రక్రియ సత్వరం చేపట్టాలన్నారు. కొన్ని పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేని కారణంగా రిలీవర్లు లేక బదిలీలు ఆగి పోయాయన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వినుకొండ అక్కయ్య, చావలి మల్లేశ్వరరావు, మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాశ్, బొంతా రవి, చిలకా వీరయ్య, అట్లూరి శ్రీనివాసరావు, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ఆదాయ పంటలపై దృష్టి పెట్టాలి
నరసరావుపేట ఈస్ట్: తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు చెప్పారు. మండలంలోని నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో సాగు చేసిన ఉద్యాన పంటలను గురువారం పరిశీలించారు. వ్యవసాయరంగంలో ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకొని రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సబ్సిడీలో అందించే సూక్ష్మ సేద్యం పరికరాల ద్వారా ఎరువుల వినియోగం, నీటి వినియోగం పొలంలో ప్రతి అంగుళానికి అందుతుందన్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి పదివేల సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ● రొంపిచర్ల మండలంలోని అన్నవరం గ్రామంలో రైతు లింగయ్యచౌదరి సాగు చేసిన జామతోటలో డ్రిప్పు సేద్యం పరికరాల పనితీరును పరిశీలించారు. నరసరావుపేట మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో పోతురాజు శివయ్య తోటలో వంగ, గులాబీ సాగును పరిశీలించారు. సూర్యఘర్ పథకం కింద తన ఇంటిపై సోలార్ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న శివయ్యను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గుడ్లు, పాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని ఆదేశించారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. -
డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ అవసరం
నరసరావుపేట: ట్రక్కు డ్రైవింగ్ నేర్చుకునే వారికి సీపీఆర్ ట్రైనింగ్ అవసరమని పల్నాడు జిల్లా రహదారి భద్రత కమిటీ మెంబర్ సెక్రటరీ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.రాజానాయక్ అన్నారు. గురువారం రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ను గురువారం సందర్శించి ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రీసెర్చ్ సెంటర్ను ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఆర్టీఓ ఆఫీసు పక్కనే ఉండటం వల్ల వాహనదారులకు లైసెన్సు మంజూరు సమయంలో నిర్వహించే పరీక్ష ఇక్కడ నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రిఫ్రెషర్ ట్రైనింగ్లో భాగంగా సీపీఆర్పై శిక్షణ ఇవ్వడానికి ఈ విభాగాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రీసెర్చ్ సెంటర్ మేనేజింగ్ పార్టనర్ కనకదుర్గ పద్మజ, ఎన్జీఓ సభ్యుడు బంగారయ్య పాల్గొన్నారు. -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన శ్యామ్ సునీల్ కొల్లూరులో రేషన్ బియ్యాన్ని ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకొని రాత్రి సమయంలో తరలించటానికి ప్రయత్నించాడు. సుమారు 76 బస్తాల రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరు మండలంలోని రైస్ మిల్లుకు తరలించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని వివిధ కంపెనీలకు చెందిన గోతాలలో ప్యాక్ చేసి ఆటోలో తరలించే యత్నం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన శ్యాం సునీల్, బుల్లెద్దు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
భూగర్భ జలశాఖ ఏడీఏగా జి.సురేష్
బాపట్ల: భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులుగా జి.సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్.జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సహాయ సంచాలకులుగా పనిచేసిన కె.రామబాలాజీ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పదోన్నతితో బదిలీపై వచ్చిన సురేష్కు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి వేమూరు: మద్యం బెల్టు షాపుల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్య షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు. మద్యం ప్రభుత్వం ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని కోరారు. సీఐ రవి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు -
ఎల్ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు జూలై 9వ తేదీన ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమ్మె జరగనుందని తెలిపారు. 85 శాతానికిపైగా ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్సూరెనన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెలో భాగస్వామిగా ఉందన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74 శావాతం నుంచి వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజల పొదుపును ప్రోత్సహించాలని, విదేశీ పెట్టుబడులు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని చెప్పారు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయం దేశ ప్రయోజనాలకు హానికరం అని స్పష్టం చేశారు. ఎల్ఐసీలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, క్లాస్ 3, 4 క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లకు తరలించడం నష్టదాయకమని పేర్కొన్నారు. ఎల్ఐసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఫెడరేషన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం పాలసీదారులపై ఆర్థిక భారాన్ని మోపడమేనని, పైగా ఇది ప్రజలకు బీమాను దూరం చేయడమేనన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొనే ఈ సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలిపాలని కోరారు. -
పునీత థామస్వారి అడుగుజాడల్లో నడవాలి
తుమృకోట(రెంటచింతల): క్రీస్తు సూక్తులను నిత్యం ఆచరిస్తూ పునీత థామస్వారు క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలలో నడిచి సమాజంలో నిజమైన క్రైస్తవులుగా జీవించాలని రెవ.ఫాదర్ ఎం.రాజరత్నం అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలో నున్న పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచారణ గురువులు మాలై పవిత్రన్ ఆధ్వర్యంలో రెవ.ఫాదర్ కొణతం ఎలీషారాజుతో కలిసి సమష్టి దివ్యపూజాబలి సమర్పించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలోనే తుమృకోట చర్చి అతి పురాతనమైందన్నారు. అపోస్తులు 12 మందిలో ఒకరైన థామస్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తు సువార్తను ప్రచారం చేశారని గుర్తుచేశారు. భక్తులకు పులిహార పంపిణీ చేశారు. పెద్దలు అశోక్, మల్లి, దుగ్గింపూడి శౌరి రాయపురెడ్డి, రెంటచింతల కానుకమాత చర్చి దళ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రెవ.ఫాదర్ రాజరత్నం వైభవంగా పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవం -
హాస్టలు వార్డెన్కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు. వెంటనే వార్డెన్కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు. ఎస్ఐ వెంకటాద్రి దీనిపై మాట్లాడుతూ.. కొల్లిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్.కిషోర్ బాబు(12), వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్ (13), రేపల్లె ఓల్డ్ టౌన్కు చెందిన ఎ.జితేంద్ర దర్శన్ (14) స్థానిక నాజరుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని తెలిపారు. స్కూలుకు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు చెప్పారు. వెంటనే వార్డెన్కు సమాచారం అందించి బాలలను అప్పగించినట్లు తెలిపారు. వార్డెన్ ఆదినారాయణను వివరణ కోరగా.. వారిలో ఇరువురికి ఇంకా స్కూలులో అడ్మిషన్ కాలేదన్నారు. హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని, చెప్పులు కొనుక్కునేందుకు ముగ్గురు స్టేషన్ సమీపంలోని షాపునకు వచ్చారన్నారు. అక్కడి నుంచి నీరు తాగేందుకు స్టేషన్లోకి వెళ్లగా పోలీసులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. -
జాతీయ సమ్మెను జయప్రదం చేయండి
అద్దంకి: దేశవ్యాప్తంగా వాపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ ఆవరణలో బుధవారం జాతీయ సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. సమావేశం కేఎల్డీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ఎల్ఐసీ, కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు కలిసి సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. కె.రఘుచంద్ మాట్లాడుతూ సమ్మెలో అందరూ పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరారు. ఉరి వేసుకుని మహిళ మృతి అద్దంకి రూరల్: కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. నూజిళ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన మరియకుమారి (35) అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ కలహాలా.. లేదా ఇతర కారణాలనే అనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాహక్కు చట్టం ప్రవేశాల పేరుతో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గురువారం విద్యాసంస్థలను మూసివేసి బంద్ పాటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు పిలుపు మేరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోనూ పాఠశాలలు మూతపడ్డాయి. విద్యాహక్కుచట్టంలోని 12 (1) సీ ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే విషయంలో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సీట్ల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం, విద్యాశాఖ పక్షపాత ధోరణితో వ్యవహరించడం, ఫీజుల చెల్లింపు విషయమై స్పష్టత లేకపోవడంతోపాటు విద్యాశాఖాధికారుల బెదిరింపు ధోరణులు, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, రాజకీయంగా ఒత్తిడి తెస్తున్న సంఘటనలను యాజమాన్యాలను తీవ్రంగా నిరసిస్తున్నాయి. సాగర్, పులిచింతలలో చేపల వేట నిషేధం నరసరావుపేట: జిల్లాలోని లైసెన్సుడ్ రిజర్వాయర్లు నాగార్జున సాగర్, కేఎల్ రావు పులిచింతలలో చేపల సంతానోత్పత్తి సమయమైన జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు (62 రోజులు) వేట నిషేధం అమలులో ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.సంజీవరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్లో లైసెన్సు తీసుకొని వేట కొనసాగించే మత్స్యకారులు ఎవరూ ఆ సమయంలో వేటకు వెళ్లవద్దని, దానికి భిన్నంగా ఎవరైనా వేటకు ఉపక్రమిస్తే వారి లైసెన్సు రద్దుచేసి, అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. -
ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపు పక్కకు ఒరిగిపోయింది. బుధవారం రాత్రి దేవాలయ భద్రతా సిబ్బంది తలుపులు మూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ రాజగోపుర తలుపు మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వేగంగా వచ్చిన ఓ కారు తలుపును ఢీ కొట్టటం వల్ల ఇసుపరాడ్ వంకర వచ్చిందన్నారు. ఈతరహా తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగ నిపుణులను పిలిపించటానికి ఏర్పాట్లు చేశామని రెండుమూడు రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అప్పటివరకు గాలిగోపురం వద్ద సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. అలాగే పోలీసుల సహకారంతో మరమ్మతులు పూర్తయ్యే వరకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. నేడు భూ సమీకరణ గ్రామ సభలు తాడికొండ: తాడికొండ మండలం దామరపల్లి, ఫణిదరం, బండారుపల్లి గ్రామాల్లో భూ సమీకరణ కోసం ఎమ్మెల్యే అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఫణిదరం, 11 గంటలకు దామరపల్లి, 12 గంటలకు బండారుపల్లి గ్రామాల్లో గ్రామ సభ జరగనుంది. రైతులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు. సీఎస్ సమీక్షకు హాజరైన కలెక్టర్ నరసరావుపేట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియా సమావేశానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే కలెక్టరేట్ నుంచి వర్చ్యువల్గా హాజరయ్యారు. పీ–4, పాజిటివ్ పబ్లిక్ పెర్సప్సన్, మహిళా స్వయం శక్తి సంఘాలకు వార్షిక క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, మైక్రో క్రెడిట్ ప్లాన్, పోషణ్ ట్రాకర్, బాల సంజీవని లబ్ధిదారుల ఫేషియల్ అథంటికేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, రుతుపవన సన్నాహక చర్యలు, అంశాలపై సమీక్ష చేశారు. దీనిలో కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఏకా మురళి, సీపీఓ శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. రేవుల్లో పడవలు తిప్పుకొనేందుకు వేలం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానది రేవుల్లో పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు గురువారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ అధ్యక్షతన సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించారు. ఆరు రేవులకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు హక్కుల కల్పిస్తూ సీల్డ్ టెండరు, బహిరంగ వేలంలో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని నాలుగు రేవులను పాటదారులు దక్కించుకున్నారు. మాచవరం, కొల్లిపర మండలాల్లోని రేవులకు జరిగిన వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని వాయిదా వేశారు. త్రికోటేశ్వరస్వామి ఆదాయం రూ.82.05 లక్షలు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి 126 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం రూ.82,05,746లు ఆదా యం రాగా, వాటిలో కొండ పైభాగాన ఏర్పా టు చేసిన హుండీ ద్వారా రూ.74,54,621లు, మెట్ల మార్గంలో ఏర్పాటుచేసిన హుండీ ద్వారా రూ.1,72,385, అన్నదానానికి రూ.5,78,740 లభించిందని ఆలయ సహాయ కమిషనర్ డి.చంద్రశేఖరరావు వెల్లడించారు. బంగారం 28.500గ్రాములు, వెండి 562.500గ్రాములు భక్తులు సమర్పించారన్నారు. వివిధ దేశాల కరెన్సీ సైతం లభించిందన్నారు. -
కొలిక్కి రాని సచివాలయ ఉద్యోగుల బదిలీలు
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీలు గందరగోళంగా మారాయి. గుంటూరు అర్బన్ పరిధిలో జరిగిన బదిలీల్లో సిఫార్సు లేఖలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. రూరల్ పరిధిలో కూడా ఇంకా గందరగోళం నెలకొంది. గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఉమ్మడి జిల్లాలో వీరి బదిలీల ప్రక్రియ గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మొత్తం 874 మంది ఉండగా.. సిఫార్సు లేఖలను దృష్టిలో పెట్టుకుని తమను ఎక్కడికి బదిలీ చేస్తారో అని వేచిచూస్తున్నారు. కౌన్సెలింగ్కు పిలవకుండానే... అర్బన్ పరిధిలో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు గత నెల 28, 29వ తేదీల్లో గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. రూరల్ పరిధిలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించలేదు. గూగుల్ ఫాంలో 5 ఆప్షన్లు ఇవ్వాలని వారం క్రితం సూచించారు. ఆ మేరకు ఉద్యోగులు నమోదు చేశారు. ఇంత వరకు దీనిపై సమాధానం రాకపోవడంతో ఉద్యోగులు వారిని సంప్రదించారు. బదిలీల ప్రక్రియ నడుస్తోంది.. సమాచారం అందిస్తామని నేటికీ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. సిఫార్సు లేఖలతో మల్లగుల్లాలు సాధారణంగా బదిలీల ప్రక్రియ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి. ఆ వివరాలను హోల్డ్లో ఉంచి ఫించన్ల పంపిణీ తరువాత విడుదల చేయాలి. సామాజికి ఫించన్ల పంపిణీ చాలా వరకు పూర్తయినప్పటికీ బదిలీల ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు. కోరుకున్న గ్రామ సచివాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని సిఫార్సు లేఖలు కుప్పలు కుప్పలుగా ఉద్యోగులు ఇవ్వడంతో లిస్ట్ ఫైనల్ అయినప్పటికీ మార్పుచేర్పులతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. కార్యాలయంలో రాత్రుళ్లు కూడా దీనిపైనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్యను దీనిపై వివరణ కోరేందుకు ఫోన్ చేయగా, ఆయన సమాధానం ఇవ్వలేదు. ఐదు ఆప్షన్లు ఇచ్చిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగులు సిఫార్సు లేఖలు ఎక్కువగా రావడంతో తుది జాబితాపై అధికారుల కసరత్తు -
ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?
ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజావసరాలను గుర్తించి పనులకు సభ్యుల ఆమోదంతో నిధులు కేటాయించాల్సి ఉన్నా అడ్డదారిలో మంజూరు చేయడం కమీషన్ల కోసమేననే ఆరోపణలకు తావిస్తోంది. నేడు జరగబోయే సర్వసభ్య సమావేశంలో దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు మరోమారు నిరసన గళం వినిపించే అవకాశం ఉంది. గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులకు జెడ్పీ నుంచి ముందస్తుగా సమాచారాన్ని పంపారు. గత మార్చి 15న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం మరలా ఇప్పటి వరకూ జరగలేదు. 2024–25 ఆర్థిక సంవత్సర సవరణ బడ్జెట్తోపాటు 2025–26 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్ను ఆమోదించేందుకు కీలకమైన సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గైర్హాజరు కావడంతో నిరవధికంగా వాయిదా పడింది. చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వ్యతిరేకత ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడంతోపాటు ముందస్తు అనుమతుల పేరుతోనూ జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు చేస్తున్న ధోరణికి వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మార్చి 15న ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా, సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురాకుండా పనులు మంజూరు చేస్తున్నప్పుడు ఇక తమకు విలువ ఎక్కడిదని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో రూ.కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తున్న తీరును ఖండించారు. వాటిలో కమీషన్లు, పర్సంటేజీ తీసుకుని అవినీతి, అక్రమాలతో జెడ్పీని నడుపుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. మార్చిలో ఏర్పాటు చేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్న ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తు అనుమతులను ఇచ్చేయడంతో సమావేశానికి హాజరైన పక్షంలో సభ్యులు అంగీకారం తెలిపినట్లవుతుందనే కోణంలో గైర్హాజరయ్యారు. తద్వారా జెడ్పీటీసీలు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో సఫలీకృతమయ్యారు.జెడ్పీటీసీల అంగీకారం లేకుండా అడ్డగోలుగా పనులు కేటాయింపుపై వ్యతిరేకతనేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వైఎస్సార్ సీపీ సభ్యుల తీవ్ర అసంతృప్తి తాము గెలిచి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్న జెడ్పీటీసీలు నిరసనగా గతంలో బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు ప్రభుత్వానికి పంపి మరీ ఆమోదింపజేసుకున్న చైర్పర్సన్ గతంలో జెడ్పీటీసీలకు తెలియకుండా రూ.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు తాజాగా మరో రూ.10 కోట్ల మేరకు ఇదే తరహాలో అనుమతి -
అక్కసుతో ధ్వంస రచన!
పిడుగురాళ్ల: జానపాడు రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని గురువారం మున్సిపల్ సిబ్బంది ధ్వంసం చేశారు. అయితే ఆ శిలాఫలకం ఎదురుగా కూటమి ప్రభుత్వం నేతలు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఇటీవల ప్రారంభించిన శిలాఫలకం జోలికి వెళ్లక పోవడం గమనార్హం. వైఎస్సార్ సీపీ గుర్తులు చెరిపేయాలనే కుట్ర.. జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది.. తొలగించిన తర్వాత నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులు చేపడతారు. ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో వేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. దీనిపై స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం రాజకీయ కుట్రలో భాగమేనని, కూటమి నాయకులు కావాలనే ఈ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన శిలఫలకాలను ఇలా ధ్వంసం చేయటం సరికాదని, ఇది దుస్సంప్రదాయానికి దారితీస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏర్పాటు చేసిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన మున్సిపల్ సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం జోలికి వెళ్లని వైనం రాజకీయ కుట్రలో భాగంగానే అంటున్న పరిశీలకులు ఆక్రమణల తొలగింపులో భాగంగానే.. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఐ.శ్రీనివాసులును వివరణ కోరగా జానపాడు బ్రిడ్జి నిర్మాణ పనులలో భాగంగా రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నామని, అందులో భాగంగానే తమ సిబ్బందే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకాన్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించగా త్వరలో దాన్ని కూడా తొలగిస్తామని తెలిపారు. -
గుర్తింపు ఏదీ?
సత్తెనపల్లి: జిల్లాలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది కౌలు రైతులకు అందించే సాగుహక్కు ధ్రువీకరణ పత్రాలు(సీసీఆర్సీ) అందుతాయో లేదో అన్న బెంగ రైతులను వెంటాడుతోంది. సీసీఆర్సీ కార్డు లేకపోతే ప్రయోజనాలు అందవని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కౌలు రైతులకు అన్ని విధాల మేలు జరిగింది. వారికి సీసీఆర్సీ కార్డులు అందజేయడంతో పాటు విత్తనాలు, ఎరువులు కూడా అందించింది. అంతేకాకుండా సాధారణ రైతులకు ఇచ్చిన విధంగా వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. లక్ష్యానికి సుదూరం ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 421 రైతుసేవా కేంద్రాల ద్వారా 67 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఇంతవరకు కేవలం 8,333 మందికి అంటే కేవలం 12.44 శాతం మందికి మాత్రమే సాగుహక్కు ధ్రువీకరణ పత్రాలు కార్డులు అందాయి. ఇంకా 58,667 మందికి కార్డులు అందించాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా సత్తెనపల్లి మండలంలో 2,137 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేయగా.. అత్యల్పంగా పిడుగురాళ్లలో కేవలం ఆరుగురు కౌలురైతులకు మాత్రమే కార్డులు పంపిణీ చేయడం గమనార్హం. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. రైతులు కొన్నిచోట్ల పంటల సాగుకు ఉపక్రమించగా, మరికొన్ని చోట్ల పొలాలను సిద్ధం చేస్తున్నారు. కార్డుల జారీలో ప్రభుత్వం అలసత్వంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. అవగాహన అవసరం సీసీఆర్సీ కార్డుల మంజూరుకు సంబంధించి అసలు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు చొరవ చూపాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కార్డు వల్ల కౌలు రైతుకు కేవలం 11 నెలల కాలంలో పండించిన పంటపై మాత్రమే హక్కు ఉంటుందని, భూమిపై ఉండదన్న విషయాన్ని వివరించాల్సి ఉంది. కార్డు ఉంటే విపత్తుల వేళ పంట నష్టపరిహారం పొందేందుకు, అలానే ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు వీలుంటుంది.జిల్లాలో సీసీఆర్సీ కార్డులు జారీ ఇలా ... డివిజన్ లక్ష్యం పంపిణీ పంపిణీ చేయాల్సినవి చేసినవి శాతం నరసరావుపేట 26,391 2,516 9.53 23,875 సత్తెనపల్లి 20,728 4,574 22.07 16,154 గురజాల 19,881 1,243 6.25 18,638 మొత్తం 67,000 8,333 12.44 58,667 నత్తనడకన కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీ ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా పావు వంతు మందికీ అందించని వైనం జిల్లాలో 2025–26 సీసీఆర్సీ కార్డుల జారీలక్ష్యం 67 వేలు ఈ ఏడాది ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 8వేలే.. జిల్లావ్యాప్తంగా 421 రైతు సేవా కేంద్రాలు రాయితీ నష్టపోయే ప్రమాదం పంట కాలం 11 నెలలు కావడంతో బ్యాంకులు, సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు సరిగ్గా 11వ నెలలో తీసుకున్న మొత్తం వడ్డీతో కలిసి చెల్లిస్తే వెంటనే కొత్త రుణం జారీ చేస్తారు. ఆ తర్వాత వడ్డీ రాయితీ బ్యాంకులో జమవుతుంది. అయితే కార్డు జారీ మూడు వారాలు ఆలస్యం కావడంతో జూన్ మొదటి మూడు వారాల్లో రుణాలు తీసుకున్న రైతులకు రాయితీ ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు. కార్డుల జారీలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కౌలు రైతులందరికీ కార్డులు జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందచేస్తాం. పీఎం కిసాన్పై దృష్టి పెట్టాం. దీనిని కౌలు రైతులకు కూడా వర్తింప చేయనున్నాం. ఖరీఫ్ సీజన్కు ఇంకా సమయం ఉంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు నమోదు కాని వారి పై ప్రత్యేక దృష్టి పెట్టాం. వెబ్లాండ్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. –ఎం.జగ్గారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఎండగడదాం
కూటమి వంచననుఇంత తక్కువ కాలంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి ఇంత ప్రజా వ్యతిరేకత రాలేదు. ఎటు చూసినా దోపిడీలే.. కూటమి కార్యకర్త సైతం దొరికిందల్లా దోచుకుంటూ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నాడు. ప్రశ్నిస్తే కేసులు పెడతారనే భయంతో ప్రజలు బయ టకు రావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు రాగానే తల్లికి వందనం అందజేశారు. లేకుంటే అమలు చేసేవారే కాదు. మన కార్యకర్తలు ప్రశ్నించడం మొదలు పెడితే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. – బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీల అమలును పక్కనబెట్టి ప్రజలను మరొకసారి నిలువునా వంచించారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్లోని కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో బుధవారం వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగానే జిల్లాస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం కొత్తేమి కాదని, 1999 నుంచి ఆయన ఇదే పద్ధతి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. ● జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు, గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలులను, చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన విధానాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నికలకు ముందు ఏఏ పథకాలు వస్తాయని బాండ్లు ఇచ్చారో, వాటిని సేకరించి వారికి ఏఏ పథకాలు రాలేదో తెలుసుకుని, మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. ● వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటారని, జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు, పల్నాడు జిల్లాల వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు. కేసులకు భయపడంవైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు కేసులు కొత్తేమీ కాదు. నాపై ప్రభుత్వం 90 కేసులు పెట్టింది. మన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనేక కేసులు పెడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజా పరిపాలన చేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. – పూనూరు గౌతమ్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు తక్కువ కాలంలో పెద్దఎత్తున వ్యతిరేకత వైఎస్సార్ సీపీ పల్నాడు – గుంటూరు జిల్లాల నేతల విస్తృత స్థాయి సమావేశం పూర్తిస్థాయిలో ప్రజల్లోకి... వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. ప్రశ్నించిన వారిపై కొంతమంది టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకం సన్నగిల్లుతోంది. పార్టీ సూచనల మేరకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లే విధంగా కృషి చేద్దాం. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కార్యకర్తలే వారధులు వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి నడుమ కార్యకర్తలే వారధులు. ఎన్నికలకు ముందు రెండు అబద్దాలు చెప్పి ఎన్నికల్లోకి వెళదామని పలువురు నాయకులు చెప్పినా వైఎస్ జగన్ అందుకు ఒప్పుకోలేదు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఏడాదిలోపే వ్యతిరేక సెగ భారీగా తగులుతోంది. మన నాయకుడు ఒక్క రెండుసార్లు బయటకు వస్తే అధికారుల్లోను, ప్రభుత్వంలోనూ మార్పు కనిపిస్తోంది. మనం పూర్తిస్థాయిలో పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ పల్నాడు, గుంటూరు జిల్లాల పరిశీలకులు ఇంటింటికి చంద్రబాబు మోసాలు హామీలు ఇచ్చి నెరవేర్చపోవడం చంద్రబాబుకు ఇది మొదటిసారి కాదు వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి కూటమి సర్కారు మోసాలను, సూపర్ సిక్స్ వైఫల్యాలను ఇంటింటికి వివరించాలి వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి -
భూముల సమీకరణ ఉపసంహరించుకోవాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ప్రభుత్వం రాజధాని కోసం మరో దఫా 44వేల ఎకరాలు భూమిని సమీకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబూరావు మాట్లాడారు. 11 సంవత్సరాల కిందట తీసుకున్న 34వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములతో కలిపి 54వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోలేదని పేర్కొన్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారని, అది ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. రాజధాని కొలిక్కి రాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇప్పుడు వేల ఎకరాల భూములు సమీకరించడం సబబు కాదని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. భావన్నారాయణ, ఈమని అప్పారావు, కె.నళీనికాంత్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు -
అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు!
జె.పంగులూరు: ఖరీఫ్ సీజన్ వచ్చింది. రైతులను ఆకర్షించేలా కొత్త పురుగుల మందులు, విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ సీజన్లో వివిధ పంటలు సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అనుమతులు లేని కంపెనీలవి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం మిర్చి, పత్తి, కురగాయల విత్తనాలను మార్టూరు, చిలకలూరిపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తారు. జె.పంగులూరు మండల పరిధిలోని ముప్పవరంలో విత్తనాలు, పురుగుమందు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఈ విక్రయాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 30 ఎకరాల్లో నష్టపోయిన రైతులు ఏటా ముప్పవరం గ్రామంలో కొన్న రైతులు పలువురు నష్టపోతున్నారు. మూడేళ్ల క్రితం ముప్పవరం గ్రామ శివారులో పెద్ద ఎత్తున నకిలీ పురుగుల మందులు, ఎరువులను సీజ్ చేశారు. అధికారుల అండదండలతో నకిలీ దందా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పురుగుల మందుల దుకాణదారులు బిల్లులు ఇవ్వకుండా తెల్లకాగితంపై రాసిస్తున్నారు. అయినా అధికారులు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది మండల పరిసర ప్రాంతాల్లోని ముప్పవరం, కొండమూరు, బైటమంజులూరు, జాగర్లమూడివారిపాలెం మొక్కజొన్న రైతులను అగస్త్య కంపెనీ నిలువునా ముంచింది. మండలంలో నాలుగు గ్రామాల్లో మొక్కజొన్న చేలల్లో కలుపు రావడంతో తొలగించుకునేందుకు ముప్పవరంలో హనుమాన్ ట్రేడర్స్ షాపు వద్ద అటరాజిన్ మందును తీసుకెళ్లారు. మందు వేసిన 15 రోజుల తర్వాత దాదాపు 30 ఎకరాల్లో పైరు ఎండుముఖం పట్టింది. ఆకులు ఎండిపోతూ, మచ్చలు పడి, ఎర్రగా మారిపోయింది. కొంతమంది రైతులు పైరును దున్ని మళ్లీ సాగు చేసినా ఆ పైరు కూడా ఇదే విధంగా వస్తోందని వాపోయారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● లైసెన్స్ లేని వ్యక్తులు, దుకాణాలు, దళారుల నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయకూడదు. సరుకు ల్యాబ్ నంబర్, తయారీ తేదీ, కాలపరిమితి గడువు, రకం, ఇలా అన్ని వివరాలు ఉండాలి. సంతకం చేసిన బిల్లును విక్రయదారుల నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. ● సంచులు సీలు విప్పినట్లు లేదా విప్పి తిరిగి కుట్టినట్లు కనిపిస్తే వాటిని కొనరాదు. విత్తన బస్తాతో లభించే ట్యాగ్ను ఏడాదిపాటు భద్రంగా ఉంచుకోవాలి. ● వ్యవసాయ శాఖ అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకారం సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. మార్కెట్లోకి ‘నకిలీ’ పురుగులు వచ్చేస్తున్నాయ్.. ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టాన్ని దోచుకునేందుకు వేచి చూస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విషయంలో కాస్త ఏమరుపాటుగా ఉండి నకిలీవి కొనుగోలు చేస్తే నట్టేట మునగక తప్పదు. అటు డబ్బు, ఇటు సమయం మట్టిపాలు కావడం ఖాయం. అప్రమత్తతే అన్నదాతకు రక్షణ కవచంగా నిలవనుంది. అన్నదాతలను ముంచేస్తున్న డొల్ల కంపెనీలు మార్కెట్లో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నమ్మకంతో కొనుగోలు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కొనే సమయంలోనే అన్నివిధాలా అప్రమత్తత అవసరం అనుమతి ఉన్న దుకాణాల నుంచి తీసుకుంటేనే మేలు -
పంటలకు బీమా చేయించుకోండి
నరసరావుపేట రూరల్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మిరప, కంది, వరి పంటలను ఖరీఫ్ సీజన్కు ఎంపిక చేసినట్టు సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పమిడిపాడు, కేతముక్కల అగ్రహారం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ ఐ.శాంతిలు పాల్గొని పత్తి పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలను వివరించారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు పంటలకు బీమా చేసుకోవాలన్నారు. మిరపకు ఎకరానికి రూ.360, వరికి రూ.80, కందికి రూ.40 బీమా ప్రీమియంను చెల్లించి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వ్యవసాయ సహాయకులు అశోక్, పవన్, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణకు పీఆర్కే పరామర్శ సత్తెనపల్లి: తన చావుతోనైనా పోలీసుల అరాచకాలు ఆగాలని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), సత్తెనపల్లి సమ న్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిలు బుధవారం పరామర్శించారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం పాఠకులకు విధితమే. నాయకులు మాట్లాడుతూ అధైర్య పడవద్దని, అండగా ఉంటామని, ప్రశాంతంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా వారికి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపాడు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, జిల్లా వలంటరీ విభాగం అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు పొన్నూరు: మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ వేడుకలను పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హజరత్ మొహమ్మద్ మనుమలు హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ వేడుకలు జరుపుకొన్నారు. ఏడవ రోజు బుధవారం ప్రధాన రహదారిలోని పీర్ల చావిడిలో హజరత్ అలీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా ముజావర్ల కమిటీ మొల్లా కరీమ్, మొల్లా హైదర్, మొల్లా గబ్బర్ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్, షేక్ , ఖాదర్, మొల్లా అల్లాబక్షి, మొల్లా నజుముద్దీన్, మొల్లా ఖాలీల్ బాషా, మొల్లా బాజి, షేక్ గౌస్, మొల్లా రహంతుల్లా, మొల్లా ఆర్షద్, మొల్లా జలీల్, మొల్లా ఇమ్రాన్, మొల్లా జైనులాబద్దీన్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుడి బదులు భార్య విద్యా బోధన పెనుమర్రు(వేమూరు): మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా జవ్వాది శ్రీనివాసరావు ఉండగా, ఆయన తన భార్యను తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా తంతు జరుగుతున్నా విద్యా శాఖ అధికారులు ఇంతవరకు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఉపాధ్యాయుడు, అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా శ్రీనివాసరావు స్థానంలో ఆయన భార్య పాఠాలు బోధించడం గమనించిన స్థానికులు ఆమెను నిలదీశారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా గర్భిణులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సిజేరియన్ వల్ల జరిగే దుష్ప్రభావాలను వివరించి అవగాహన పెంచుతున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఆస్పత్రులను గుర్తించి, మెమోలు అందజేస్తున్నాం, ప్రత్యేకంగా ఆడిట్ చేస్తున్నాం. గర్భిణులు, కుటుంబ సభ్యులు సైతం సిజేరియన్ల వైపు మొగ్గు చూపకుండా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి. – డాక్టర్ బి.రవి, డీఎంహెచ్ఓ, పల్నాడు జిల్లా -
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే !
ప్రత్తిపాడు:రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రత్తిపాడు వైఎస్సార్ కాలనీలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చల్లగిరి నాగరాజు కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు రైతు నాగరాజు పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు, కౌలు రైతు కార్డు లేకపోవడం, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ప్రైవేటు సంస్థల నుంచి వందకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎకరం ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, తిరిగి నూతనంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పొగాకు సాగు చేసిన 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు కె. ఆదినారాయణ, నల్లమోతు రాజేంద్ర ఉన్నారు. -
పల్నాడు
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ నరసరావుపేట: క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ పంటల బీమా పథకం పోస్టర్లను కలెక్టర్ పి.అరుణ్బాబు ఆవిష్కరించారు.సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం తెనాలిఅర్బన్: సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం బుధవారం ఐతానగర్లోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గేరా థామస్, సీయోను కుమారిలు జెండా ఎగురవేశారు. శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం నగరం: జిల్లేపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణం వీక్షించారు.పోరాటాలు వైఎస్సార్ సీపీకి, మనకు కొత్త కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. అరాచక పాలనను తిప్పికొట్టాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం సెల్ఫోన్. సామాజిక మాధ్యమం వేదికగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, ప్రజల సమస్యలను విస్తృతంగా ప్రచారం చేసి, ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సిద్ధం కావాలి. – కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే 7న్యూస్రీల్పోరాటాలు మనకు కొత్తకాదు -
ఖరీఫ్లో ముంపు ముప్పు
రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్కు ముందే అవసరమైన డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రేపల్లె సబ్ డివిజన్లో ఇలా... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఆర్ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. రేపల్లె నియో జకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్లో వరి సాగు అవుతుంది. ఇక్కడి వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లే దు. పంట చివరి దశ నవంబర్, డిసెంబరు మా సాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో రైతులు కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్లో వరి పంటకు ముంపు ముప్పు తప్పేలా లేదు. రేపల్లె నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. ప్రధాన మురుగు కాలువలతోపాటు మైనర్, రోడ్డు పక్కన ఉన్నవి కూడా గుర్రపు డెక్క, తూటికాడ, గడ్డి వంటి చెత్తతో పూడిపోయాయి. వర్షాలు ఊపందుకుంటే నీరు ముందుకు సాగని స్థితిలో కాలువలు ఉన్నాయి. పక్కనే ఉండే పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. గుర్రపు డెక్క, తూటి కాడతో పూడుకుపోయిన డ్రెయిన్లు పూడిక తీసేందుకు కనీస చర్యలు చేపట్టని కూటమి సర్కార్ ఈ ఏడాది పంటకు ముంపు తప్పదని ఆందోళనలో అన్నదాతలు నాడు ఖరీఫ్కు ముందే పనులు పూర్తి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం -
మోకాళ్లపై కార్మికుల నిరసన
మంగళగిరి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. మంగళగిరి నగర పరిధిలోని ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వై. కమలాకర్, ఎం. బాలాజీ, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, కేదారనాథ్, దుర్గారావు, ప్రకాష్, రాము పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా ●ఢిల్లీలోని విద్యాంజలి సంస్థ పేరుతో నియామక ఉత్తర్వులు ●నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న మోసగాళ్లు ●ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను పోలిన నియామక పత్రాలను సృష్టించి, బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాంజలి సంస్థ పేరుతో కొంత మంది వ్యక్తులు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, యోగా టీచర్లు, అటెండర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తప్పుడు నియామక ఉత్తర్వులను సృష్టించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా విద్యాంజలి సంస్థ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులోని జెడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ట్రైనర్ను నియమిస్తున్నట్లుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం పంపుతున్నట్లుగా సిద్ధం చేసిన నియామక ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. జెడ్పీ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ నియామక విషయమై సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇదంతా బోగస్ అని, ఎవ్వరూ నమ్మవద్దని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని సమాచారం పంపారు. ప్రధానోపాధ్యాయులు కూడా తప్పుడు నియామక ఉత్తర్వులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. -
బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: కుంచనపల్లి జాతీయ రహదారిపై గల బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి బాలికను నీటిలోకి విసిరేసి హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే బుధవారం తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఓ మహిళ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు మూడు గంటలు కష్టపడి బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వెంటన్ నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్, పెదకాకాని సీఐ, ఎస్ఐలతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుంచనపల్లి బ్రిడ్జి వద్ద, జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తి నడిపించుకుంటూ బ్రిడ్జి ఎక్కినట్లు నమోదైంది. మృతి చెందిన బాలిక, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న బాలిక ఒకరే కావడంతో ఫొటోలను కృష్ణా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు పంపారు. వివరాలు సేకరించాలంటూ కోరారు. తాడికొండ మండలం బడేపురానికి చెందిన పాపగా గుర్తించడంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించా రు. పేరు కూరపాటి హేమ అని, మతిస్థిమితం లేదని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాపను పెంచలేక తాతయ్య ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి తోసిన వ్యక్తి సరిగ్గా కనిపించకపోవడంతో పాటు లుంగీ ధరించి ఉన్నాడు. తాడేపల్లి సీఐ వీరేంద్ర హత్య చేసింది తాతయ్యా లేక ఎవరన్నా ఉన్నారనే విషయాలను లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి తాత కూరపాటి మాధవరావే కాల్వలోకి తోసేశాడని పోలీసులు నిర్ధారించారు.పత్యేక దృష్టి సారించిన డీఎస్పీ 24 గంటల్లోపు వివరాల సేకరణ -
అమ్మ ఆరోగ్యంపై కత్తి
సాక్షి, నరసరావుపేట: పంటి బిగువన నొప్పిని భరించి, ప్రసవవేదనను అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కాసులు కక్కుర్తి వల్లనో, నొప్పులు భరించలేమనో, ముహూర్తాల ప్రకారం జన్మనివ్వాలనో చాలా మంది మాతృమూర్తులకు సిజేరియన్లు చేసి బిడ్డను భూమిపైకి తెస్తున్నారు. దీంతో అవసరం ఉన్నా, లేకున్నా కాన్ను కోతలు పెరిగిపోతున్నాయి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వాస్తవంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. ఇది మొత్తం కాన్పుల్లో 25 శాతానికి మించకూడదు. అయితే పల్నాడు జిల్లాలో ఇది 55 శాతం పైగా ఉంటోంది. ప్రభుత్వ వైద్యశాలలో జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,451 ప్రసవాలు జరగగా అందులో 3,801 మందికి సిజీరియన్ చేశారు. ప్రైవేట్ వైద్యశాలల్లో అయితే ఇది 60 శాతం దాకా ఉంటోంది. కాన్పుకు వెళితే కోతే... సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. కానీ కొంతమంది వైద్యులు ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నారు. సంపాదనే లక్ష్యంగా కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సిజేరియన్ ప్రసవాలు తరచూ కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రసవాలతో ప్రయోజనాలు సాధారణ ప్రసవాల వల్ల తల్లి, పిల్లలకు బహుళ ప్రయోజనాలు అందుతాయి. సాధారణ ప్రసవాల్లో మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలా పనులు చేసుకోవడానికి వీలుంటుంది. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. గర్భసంచికి ప్రమాదం ఉండదు. భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పుట్టిన బిడ్డకు సైతం మొదటి గంటలో తల్లిపాలు అందించవచ్చు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల తీరు సంవత్సరం మొత్తం సిజేరియన్లు అసిస్టెడ్ ప్రసవాలు 2022–23 6,594 3,045 64 2023–24 7,631 3,766 118 2024–25 7,451 3,801 114 తల్లీ బిడ్డలకు నష్టంజిల్లాలో పెద్ద సంఖ్యలో సిజేరియన్లు పల్నాడులో 55 శాతానికి పైగా ఆపరేషన్లే.. రోజురోజుకు తగ్గుతున్న సాధారణ ప్రసవాలు కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక భాగం సిజేరియన్లే నొప్పుల భయం, మంచి ముహూర్తాల కోసం ఒత్తిడి చేస్తున్న గర్భిణులు, కుటుంబ సభ్యులు తల్లుల ఆరోగ్యంపై పెను ప్రభావం.. శిశువులకూ నష్టం సిజేరియన్ల సంఖ్య అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న డీఎంహెచ్ఓ ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఎక్కువగా జరుగుతున్న సిజేరియన్ల వల్ల తల్లికి, బిడ్డకు అధిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగితే అవి అమృతంతో సమానం అంటున్నారు. శస్త్ర చికిత్సల కారణంగా మొదటి గంటలో తల్లిపాలు తాగే వీలు లేకుండా పోవడంతో శిశువు ఎదుగుదల, అనంతరం జీవితాంతం అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రక్తస్రావం అధికమైనా, ఇతరత్రా సమస్యలు తలెత్తినా ప్రాణాపాయంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్టు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో అప్పుడప్పుడు తీవ్ర కడుపు నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో గర్భ సంచి తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చు. -
‘నాన్ మస్టర్’ కార్మికుల వేతనాల పెంపు
నరసరావుపేట: 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో నాన్ మస్టర్రోల్ విధానంలో పనిచేసే కార్మికుల వేతనాల పెంపుదలకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆమోదం తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి నాన్ మస్టర్రోల్ వేతనాల స్థిరీకరణ సమావేశం బుధవారం నిర్వహించారు. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రోజుకు రూ.864 నుంచి రూ.899కి పెంచారు. నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రూ.855, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనం రూ.742, నైపుణ్యంలేని కార్మికుల వేతనం రూ.619గా నిర్థారించారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాల కోసం రోజువారీ ప్రాతిపదికన పనిచేసే నాన్ మస్టర్రోల్ కార్మికులకు నూతనంగా నిర్ధారించిన వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, సీపీఓ జి.శ్రీనివాస్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజానాయక్, డీఈఓ చంద్రకళ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్ -
యువ వైద్యులకు అండగా ఉంటాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై శాంతి యుతంగా నిరసనకు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్టర్స్ డే' అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవమానించింది.పేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యనభ్యసించడంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకండా వేధించడానికి ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్లపాటు చేయాలనే నిబంధన పెట్టి వేధిస్తున్నారు. ఇంటర్న్షిప్ చేసిన వారిని రిలీవ్ చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టడమో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడమో లేదా పీజీలు రాసుకుంటున్నారు.కానీ ఒక్క ఏపీలో మాత్రమే ఇంటర్న్షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను తెలియపర్చడానికి హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిస్తే ఆయన వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువ వైద్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ని కలిశారు. వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యంరాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంబీబీయస్ డాక్టర్లు, పీజీ డాక్టర్లను నియమించుకోకుండా ఎలా వైద్యం అందించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో వైద్యారోగ్యశాఖలో ఐదేళ్లలో 54 వేలమంది నియామకం జరిగితే అందులో డాక్టర్లే 3800 మంది ఉన్నారు.మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాకరిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఆయుష్మాన్ భారత్లో కలిపే పేరుతో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్లు జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో యూజర్ చార్జీల పేరిట రోగులను దోచుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కోపేమెంట్ల పేరుతో వసూలు చేసి ఆస్పత్రులను నడిపించుకోవాల్సిన పరిస్థితి ఆస్పత్రి యాజమాన్యాలది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. -
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి
చిలకలూరిపేట: విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పిలుపు నిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపు నిచ్చిన టీడీపీ ఇప్పుడు అదాని మేలు కోసం స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంతో పాటు సర్దుబాటు చార్జీల విధానాన్ని తొలగించాలని కోరారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలందరిపై భారం పెరుగుతుందని, ముందుగానే డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకున్నా, బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శి బొంతా దానియేలు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ -
ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చిన జీఎస్టీ
● సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్ ● ఘనంగా జీఎస్టీ దినోత్సవం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : జీఎస్టీతో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జీఎస్టీ అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జీఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. జి ఎస్.టి చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో జీఎస్టీ ప్రారంభమైన ఏడాది రూ.2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అలాగే గుంటూరులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది ఉండగా, ఇప్పుడు 75 వేల మందికి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ జీఎస్టీతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎం.డి దాసరి రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ లో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు. సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జీఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహూకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.కార్యక్రమంలో జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు ఆర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైడేతో డెంగీ నివారణ
నరసరావుపేట: డెంగీ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ పనికిరాని వస్తువులు, తొట్లలో ఉండే నీటిని పూర్తిగా మార్చాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ డెంగీ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డాక్టర్ రవి మాట్లాడుతూ డెంగీ వ్యాధి వైరస్ వలన ఒకరి నుంచి మరొకరికి ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వస్తుందన్నారు. ఈ దోమ మంచినీటిలో పెరుగుతుందన్నారు. ఇళ్లలో నిల్వుండే మంచినీటిలో గుడ్లు పెట్టి తన సంతానాన్ని వృద్ధి చేస్తాయన్నారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా పిల్లలకు కాళ్లు, చేతులు కప్పేలా పూర్తిగా డ్రస్ వేయాలని, పడుకునే సమయంలో దోమతెరలు తప్పకుండా వాడటం చేయాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. తొలుత కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ రాజేశ్వరి, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి -
ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తా మని హమీ ఇచ్చి రూ.13 వేలే తల్లుల ఖాతాల్లో వేయటం విడ్డూరంగా ఉందన్నారు. కొంత మంది తల్లులకు అర్హత ఉన్నా పథకం వర్తించకపో వటంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇంటి వద్దకు వచ్చే రేషన్ను తొలగించి దివ్యాంగులకు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
గ్రానైట్ లారీలు పట్టివేత
● బిల్లులు లేకుండా తరలింపు ● స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ గ్రానైట్ లారీలు ● కమర్షియల్ టాక్స్ అధికారుల మెరుపు దాడులు ● అదుపులోకి తీసుకున్న గ్రానైట్ లారీలు నడికుడి మార్కెట్ యార్డ్లో ● విలువను బట్టి పన్ను, జరిమానా వేస్తామన్న అధికారులు పిడుగురాళ్ల: బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు గ్రానైట్ లారీలను జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి లారీలను తనిఖీ చేసే కార్యక్రమం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొండమోడు నుంచి దాచేపల్లి వైపు వెళుతున్న నాలుగు గ్రానైట్ లోడ్ లారీలను గుర్తించి పట్టుకున్నారు. ఈ గ్రానైట్ లారీలకు సంబంధించి ఎటువంటి బిల్లు లేకపోవడం, సామర్థ్యాన్ని మించి లోడుతో రవాణా చేయటం నిర్వహించడంతో ఈ నాలుగు లారీలను అదుపులో తీసుకున్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.భార్గవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేపట్టామని అందులో నాలుగు గ్రానైట్ లారీలు బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నాయని వాటిని గుర్తించామన్నారు. వీటిని అదుపులో తీసుకొని నడికుడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉంచినట్లు తెలిపారు. గ్రానైట్ లోడును బట్టి, గ్రానైట్ విలువను అంచనా వేసి ఆ తరువాత పన్నుతోపాటు అపరాధ రుసుం కూడా విధిస్తామని చెప్పారు. అలాగే లెక్కలు చూసి టాక్స్, ఫైన్ వేయాల్సి ఉంటుందని దానికి కొంత సమయం పడుతుందని వివరించారు. బిల్లులు లేకుండా ఓవర్ లోడ్ తో గ్రానైట్ లారీలు వెళితే అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అక్రమంగా బిల్లులు లేకుండా గ్రానైట్ లారీలు తరలిస్తే వాటిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడుల్లో జీఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవికుమార్, జీఎస్టీవో టి పీటర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుతో గొప్ప ప్రయోజనాలు
● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ ● కొత్తపాలెంలోని ప్రకృతి సాగు పంటల పరిశీలన ● ప్రకృతి సాగు పద్ధతి ప్రయోజనాలపై అవగాహన యడ్లపాడు: ప్రకృతి సాగు విధానంతో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. బి తెలిపారు. ప్రకృతి విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారితో కలిసి కొత్తపాలెం గ్రామంలో మంగళవారం పర్యటించారు. రసాయనాలు లేని, సహజసిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులు మానం శ్రీనివాసరావు, ఐనం హరిబాబు, మానం మణింద్ర, నిక్కీ తిరుపతిరావు, దమ్ము నాగజ్యోతి పంట పొలాలను పరిశీలించారు. వారు సాగు చేసిన బహుళ రకాల పంటలు, అంతర పంటలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మునగ తోటలో దొండ, కాకర, సొర, కనకాంబరం, అరటితోటలో తీగజాతి దోసను, నిమ్మతోటలో కరివేపాకును అంతర పంటగా వేయడాన్ని గమనించారు. వినూత్న పద్ధతిలో సాగు చేసిన తీరు, ఎక్కువ దిగుబడుల్ని సాధిస్తూ.. అన్నింటికీ మించి అధిక లాభాలను ఆర్జిస్తున్నామని తెలపడంతో స్థానిక రైతుల్ని ఆమె అభినందించారు. పురుగు మందుల ఖర్చు తక్కువ.. ప్రకృతి వ్యవసాయ విధానంతో కౌలు రైతుకు మంచి దిగుబడి, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నారు. సహజ సిద్ధంగా పండించే ఉత్పత్తుల ద్వారా కౌలురైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. అయితే వారికి కౌలుకు ఇచ్చిన భూ యజమానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సాగు విధానం చేయడం వలన నేల సారం వృద్ధి చెందుతుందన్నారు. రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చే సమయంలో ప్రకృతి సేద్యం చేసేవారికి మాత్రమే ఇచ్చే ఒప్పందం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రకృతి సాగు సిబ్బంది సౌజన్య, అప్పలరాజు, నందకుమార్, స్వాతి, బేబీ రాణి, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
అడ్డాగా మారుద్దాం
పల్నాడును వైఎస్సార్ సీపీనరసరావుపేట: పల్నాడు జిల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తానని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించటంతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది మంగళవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో డాక్టర్ గోపిరెడ్డిని కలిసి అభినందనలు తెలియచేశారు. డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, మాజీ మంత్రి విడదల రజిని, గజ్జల సుధీర్ భార్గవరెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని నాయకులను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి సలహాలు స్వీకరిస్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. 2029 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈఎం స్వామి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు షేక్ రెహమాన్, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, కార్యనిర్వాహక అధ్యక్షుడు అచ్చిశివకోటి, ఎన్.సురేంద్ర, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి -
క్షుద్రపూజల కలకలం
బల్లికురవ: మూడు రోడ్ల కూడలిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్అండ్బీ రోడ్లోని కొమ్మినేనివారిపాలెం, వలపర్ల వెళ్లే క్రాస్ రోడ్డు జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి ఆగంతకులు గుమ్మడికాయలు, కుంకుమ, పసుపు పూలతో పూజలు నిర్వహించారు. మంగళవారం ఆ మార్గంలో వెళ్తున్న వారంత ఇవి దాటి వెళ్లాలంటే ఏ ప్రమాదం ముంచుకువస్తోనని భయాందోళన చెందారు. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని వాటిని అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. 18 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత తాడికొండ: అక్రమంగా నిల్వ చేసిన 18 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్న ఘటన మండల కేంద్రమైన తాడికొండలో జరిగింది. వివరాల ప్రకారం తాడికొండ చెరువు కట్టపై రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సీఎస్ డీటీ దేవరాజు, ఆర్ఐ హనుమంతరావుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించగా 35 కిలోల తూకం కలిగిన 18 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. దీనిపై విచారించగా తాడికొండకు చెందిన గుర్రపుశాల ఆనంద్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు స్థానికులు తెలపగా అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఆర్ఎంపీ వద్దే అన్ని సేవలు
యడ్లపాడు: కనీస వైద్య శిక్షణ లేని ఈ వ్యక్తులు ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ ఇచ్చి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పల్లె ప్రజల అమాయకత్వం, చదువులేని స్థితి వీరికి అవకాశంగా మారింది. కొందరు మెడికల్ షాపుల యజమానులే ఇప్పుడు గ్రామాల్లో డాక్టర్ల అవతారం ఎత్తి, రోగులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఫార్మసీ కోర్సులు చేసినవారు కొందరైతే, సదరు కోర్సు పూర్తి చేసిన వ్యక్తుల నుంచి సర్టిఫికెట్లు సేకరించి, మెడికల్ షాపులు నడిపేవారు మరికొందరు. ఇలా మెడికల్ షాపులు పెట్టుకున్నవారు అక్కడే మందులు, ఇంజెక్షన్లు, సైలెన్లు ఇస్తూ, క్రమంగా ఆ షాపులను చిన్నపాటి ఆసుపత్రులుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో నిరాదరణ, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యపరీక్షల రూపంలో జరిగే ఆర్థిక దోపిడీకి భయపడి నిరుపేద, మధ్యతరగతి ప్రజలు వీరిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కమీషన్ల దందా: ప్రైవేట్ ఆసుపత్రుల అండదండలు కొందరు ఆర్ఎంపీల దందా కేవలం మందుల అమ్మకాలకే పరిమితం కాలేదు. రోగులకు పరీక్షలు అవసరమైతే నిర్దిష్ట ల్యాబ్లకు పంపి, భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యం, మెడికల్షాప్, ల్యాబ్లు, రిఫరల్ సేవలు అన్నీ కలిసి మెడికల్ సిండికేట్ మాఫియాలా నడుస్తున్నాయని బహిరంగ రహస్యమే. కరోనా సమయంలో సైకిళ్లపై తిరిగి వైద్యం చేసిన ఆర్ఎంపీలు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగడమే ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మందుల షాపులే మినీ ఆస్పత్రులు అద్దెకు దొరుకుతున్న ఫార్మసీ సర్టిఫికెట్లు గ్రామాలు, పట్టణాల్లోభారీగా ఆర్ఎంపీ క్లినిక్లు పట్టించుకోని జిల్లా వైద్యశాఖ జగ్గాపురంలో బాలిక మృతి ఒక ఉదాహరణ మాత్రమే... ఆర్ఎంపీ వైద్యం ఎంత ప్రమాదకరమో జగ్గాపురం బాలికకు ఇటీవల యడ్లపాడులో జరిగిన విషాదకర ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. బొంతు కోటేశ్వరరావు కుమార్తె శాలిని(9) అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఉండగా ఎలాంటి పరీక్షలు లేకుండా వైద్యం చేయడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణకు వెళ్లిన వైద్యాధికారులే అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో బయటపడింది. అలా చేయకుండా సెటిల్మెంట్లతో వెలుగు చూడని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఆర్పీఎం సంఘాలు, మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్లు రంగంలోకి దిగి వివాదాలను సద్దుమణిగేలా చూస్తాయి. వీటిపై నిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారంటూ ప్రజల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం మేరకు ఆర్ఎంపీలు ప్రిస్క్రిప్షన్స్ రాయటం, ఇంజక్షన్లు చేయడం, సైలెన్స్ పెట్టడం వంటి ఇన్ఫెషెంట్ సేవలు అందించరాదు. ప్రథమ చికిత్సకు సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై చర్యలు తప్పవు. జగ్గాపురంలో బాలికకు వైద్యం వికటించి ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే యడ్లపాడులోని సదరు మెడికల్ షాపును మూత వేయించాం. నిర్వాహకుడిపై కేసు నమోదైంది. – బి రవి, జిల్లా వైద్యాధికారి పల్నాడు -
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని వడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్కుమార్ కర్లపు, రేష్మి పిళ్లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులుగా జిల్లాలో పర్యటించింది. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాననీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడు చేయకపోవడం వల్ల పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితోపాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కారు డ్రైవర్కు రెండేళ్లు జైలు శిక్ష గుంటూరు లీగల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కారు డ్రైవర్కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 5వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కోలారు లత మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021లో పేరేచర్ల జంక్షన్ వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు డ్రైవర్ మాలంపాటి శ్రీకాంత్ రెడ్డి ఢీకొట్టాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుంటుపల్లి వెంకటేశ్వరరావు మృతిచెందగా, ఆయన భార్య తీవ్రగాయాలపాలైంది. ఈఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. సాక్షాధారాలతో జిల్లా ఐదో అదనపు సివిల్ కోర్టులో సమర్పించగా, పూర్వపరాలు, సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కె.లత ముద్దాయికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఏపీపీ ఎ.పవన్ కుమార్, కోర్టు పర్యవేక్షణ అధికారి సీఐ నరసింహారావు , అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై నరహరిలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.