breaking news
Palnadu
-
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కూటమి
వినుకొండ: రాష్ట్రంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలిపే హక్కుకూడా లేకుండా ప్రజల ప్రాథమిక హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తూ, దుర్మార్గమైన పాలన సాగిస్తోందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బొల్లా బ్రహ్మనాయకుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసినవారిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటిని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్న వినుకొండ నియోజకవర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు సోషల్మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారని అక్రమ కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఈపూరు పోలీస్టేషనుకు తరలించి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. కూటమి నేతలు పాలనను గాలికొదిలి అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులను సైతం వదలకపోవడం విడ్డూరమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుదాచేపల్లి: శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని దాచేపల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున హైదరాబాదులో అదుపులోకి తీసుకొని దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఇటీవల ఓ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను అబ్బూరి శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్లుగా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టీజె చంద్రశేఖర్ బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి వీడియోలు అప్పటికే సామాజిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారనే అభియోగంతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అబ్బూరి శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం సాక్షి,అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు వినుకొండ నియోజకవ వర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం ప్రెసిడెంట్ పోశిం రెడ్డి సునీల్, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మందపాటి హరీష్రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. -
వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి అనుబంధ అధ్యక్షుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగల అధ్యక్షులుగా పలువురిని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యూత్ వింగ్ అధ్యక్షుడిగా షేక్ ముక్తియార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొణతం స్వాతి, రైతు విభాగానికి బండి కోటి నాగిరెడ్డి, బీసీ సెల్కు వేల్పుల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్కు మొగిలి నారాయణ, ఐటీ వింగ్కు యర్రం మణికంఠారెడ్డి, గ్రీవెన్స్ సెల్కు షేక్ నిజాం మొహిద్దీన్, వాణిజ్య విభాగానికి గోలమూరి వెంకటరామిరెడ్డి నియమితులయ్యారు.దీపక్కుమార్ మృతదేహానికి కన్నీటి వీడ్కోలుచిలకలూరిపేట: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్కు ప్రాంతంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో స్నేహితుడి చేతిలో హత్యకు గురైన దివ్వెల దీపక్కుమార్(22) అంతిమ యాత్ర కన్నీటి వీడ్కోలుతో గురువారం జరిగింది. చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్కుమార్ గ్రేటర్ నోయిడాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్ గదిలో అతని మిత్రుడు దేవాన్ష్ చౌహాన్ తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటనలో మృతి చెందిన విషయం విధితమే.ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దీపక్కుమార్ మృతదేహం చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న అతని నివాసానికి చేరుకుంది. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. చదువుల్లో చలాకీగా ఉండి, కాలేజీ టాపర్గా ఉన్న దీపక్ కుమార్ ఆకస్మిక మృతిపై అతని తల్లిదండ్రులు దివ్వెల రత్తయ్య, నీరజ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. విద్యార్థి మృతదేహాన్ని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ దరియావలి, నాయకులు కొప్పురావూరి పటేల్, తాళ్ల అంజిరెడ్డి, కౌన్సిలర్ షేక్ యూసుఫ్ఆలి, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14 , అండర్–17 బాల,బాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాలబాలికల విభాగంలో 150 మంది క్రీడాకారులు హజరయ్యారు. క్రీడా ఎంపికలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగబోయే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని సురేష్ కుమార్ తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పీఈటీలు లాకు పిచ్చయ్య, బి.అనిల్దత్తనాయక్, కోనంకి కిరణ్కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరరావు, హెచ్ఎం కాకరపర్తి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబ శివరావు, కోనంకి కిరణ్కుమార్, జి.తులసీరామ్నాయక్, ఒ.రత్నాకర్, షేక్ మెహబూబి, కె.స్వాతి, సిహెచ్ అనూష, తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాల బాలికల జట్లు.. అండర్–14 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.రాము, టి.కళ్యాణ్బాబు, బి.రత్నాకర్, పి. సన్నీ, ఎస్.మహేష్, స్టాండ్బైలుగా షేక్.నాగుర్వలి, ఎస్.వేణు, జి.పవన్కుమార్ ఎంపికయ్యారు. అండర్–14 బాలికల జట్టుకు పి.శ్రీ జర్షిని, కె.తిరుమలభార్గవి, కె.స్వరూప, కె.ప్రశాంతి, పి.వర్షిని స్టాండ్బైలుగా ఎ.వేదవతి, ఆర్.సిరివెన్నెల, కె.మాళవిక. అండర్–17.. అండర్–17 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.శామ్యూల్ రాజు,ఆర్.సంతోష్ కుమార్, ఎం.ప్రభుదాస్, ఎం.శ్రీశాంత్, బి.మనిధర్, స్టాండ్ బైలుగా వి.సురేంద్ర, బి.అనీల్ కుమార్, ఎ.కిషోర్లు ఎంపికయ్యారు. అండర్ –17 బాలికల జట్టుకు పి.గాయత్రి, కె.గీతిక, జి.చిన్మయి, డి.స్వరూప, షేక్.సమీర, స్టాండ్ బైలుగా ఎ.ప్రశాంతి, పి.దివ్యశ్రీ, జి.వర్ష. -
ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి
సత్తెనపల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్తెనపల్లి మండలం కట్టమూరు, రాజుపాలెం మండలం గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ‘నిరసన వారం’లో భాగంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఈనెల 4న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆరోగ్యమస్తు పథకంలో ఉద్యోగులను మినహాయించి, రాష్ట్రంలో అందరికీ రూ.25 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. పేదల నుంచి కోటీశ్వరుల వరకు ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ఈహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపు ఎందుకన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ‘నిరసన వారం’ చేపట్టిన ఉపాధ్యాయులు -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)లో అర్హత సాధించిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. బైపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థుల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్లైన్ ఆధారిత కౌన్సెలింగ్ జరగనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది. ఆన్లైన్లో కళాశాలల జాబితా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు, ఫార్మసీ కళాశాలల నుంచి సహాయాన్ని పొందవచ్చు. అయితే, తమ ర్యాంకు, ఫీజు చెల్లించిన రసీదు వివరాలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపర్చిన జాబితా నుంచి తాము చేరదలచుకున్న కళాశాలలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుతో మొదలయ్యే ప్రక్రియ ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్ఈటీఎస్.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్కు లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్ డిటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమీపంలోని హెల్ప్లైన్ కేంద్రంలో పరిశీలన చేసి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్గా 2013వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమెను జిల్లాకు కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర కేడర్కు చెందిన కృతికా శుక్లా తన బ్యాచ్కే చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను వివాహం చేసుకొని ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. కృతిక శుక్లా 2016 నవంబర్ 11వ తేదీ నుంచి 2018 ఆగస్టు 12వ తేదీ వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గానూ విధులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్; దిశా స్పెషల్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తదితర హోదాలలో పనిచేశారు. అరుణ్బాబుకు దక్కని పోస్టింగ్ గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న పి.అరుణ్బాబుకు తాజా బదిలీలలో పోస్టింగ్ ఇస్తున్నట్లు జీఓలో పేర్కొనలేదు. గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీఓగా పనిచేసిన అరుణ్బాబు 2024 ఆగస్టు 7వ తేదీన పల్నాడు జిల్లా మూడవ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ ప్రాంగణంలో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయించారు. ఉచితంగా అర్జీలు రాసిచ్చే ప్రక్రియను చేపట్టారు. ప్రతి మూడో శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కలెక్టరేట్కు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకున్నారు. -
యూరియా.. కష్టం తీరలేదయా!
అధిక వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు యూరియా వాడాల్సి వస్తోంది. రైతుకు ఒక బస్తా తీసుకెళ్లమని సర్కార్ చెబుతోంది. కానీ అలా ఇస్తే రైతులకు యూరియా సరిపోదు. సరఫరా మరింత పెంచాల్సి ఉంది. – మర్రి శ్రీనివాసరెడ్డి, ఆదర్శ రైతు, దొడ్లేరు దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో గురువారం రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు బారులు తీరారు. ఒక్కో రైతుకు పాస్ పుస్తకం ప్రకారం బస్తా అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాసి ఒకే బస్తా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది క్యూలైనులో నిలిచి ఉండే ఓపిక లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి రిక్తహస్తాలతోనే నిరాశగా వెనుదిరిగారు. ఏవో వేణుగోపాల్ మట్లాడుతూ కొద్దిరోజుల్లో జీడీసీసీ, సొసైటీల్లో కూడా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
నరసరావుపేట: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ సహకార ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫణి పేర్రాజు కోరారు. గురువారం ప్రకాష్నగర్లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) సమావేశం హాలులో ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య సమావేశం రిటైర్డు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జేపీడీ తాండల్ కాండం అధ్యక్షతన నిర్వహించారు. ఫణి పేర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 230 మంది సహకార శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల నుంచి శాఖలో ప్రమోషన్లు లేవని గుర్తుచేశారు. ప్రధాన కార్యదర్శి రమేష్నాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళుతున్నామని తెలిపారు. జేపీడీ తాండల్ కాండం మాట్లాడుతూ సహకార సంఘాల కంప్యూటరైజేషన్ పూర్తయ్యే దశలో ఉందని, ఇప్పుడు ఈ పాక్స్ కంప్యూటర్ ఆడిట్ కొత్త కావడం, సమయాభావం వలన ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్నారని విన్నవించారు. ఆత్మీయ అతిథిగా జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎంపిక జిల్లా అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా డి.రవికుమార్, ఉపాధ్యక్షులుగా కె.అంజమ్మ, కోశాధికారిగా వి.అశోక్ కుమార్, ఈసీ మెంబర్గా ఎం.రమేష్లను కో ఆప్షన్ పద్ధతిలో ఎంపిక చేసుకొని నియమించినట్లు జిల్లా కార్యదర్శి జి.సురేష్నాయుడు పేర్కొన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్.లక్ష్మీబాయి, ఉద్యోగ సంఘాల నాయకులు కె.శ్రీనివాసరావు, ఏవీఎస్ సాయిరాం, పరిమళ, రాధ, పద్మావతి, హనుమంతరావు, జిల్లా కోశాధికారి ఏంవీ నరసయ్య పాల్గొన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్. సత్యశ్రీ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో రాజీ పడితే కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని తెలిపారు.రెవెన్యూ రికార్డులు భద్రపరచాలి: కలెక్టర్ సూచననరసరావుపేట: రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు ఆధునిక పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.కార్యాలయంలో ఉన్న రికార్డుల నిర్వహణ గురించి ఆర్డీఓ కె.మధులత, తహసీల్దార్ వేణుగోపాల్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి సబ్జైలును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వసతులు, మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా.. లేదా.. అని తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తన వైపు నడిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని, బయటకు వెళ్లాక ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు.డీఎల్డీవో కార్యాలయ పనులు పూర్తి చేయాలి సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డీఎల్డీవో కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. గుంటూరు రోడ్లోని అయ్యప్పస్వామి దేవాలయం పక్కన గల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ను సత్తెనపల్లి డీఎల్డీవో కార్యాలయానికి ఇటీవల కేటాయించారు. దీంతో గురువారం ఆయన దానిని పరిశీలించారు. కార్యాలయంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 10 లక్షలు కేటాయించాల్సిందిగా సీఈఓకు సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, సత్తెనపల్లి డీఎల్డీవో బి.రాజగోపాల్, సత్తెనపల్లి ఇన్చార్జి ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎంపీడీవో షేక్ రెహమాన్, పంచాయతీరాజ్ ఏఈ కె.రామ్మోహన్ సింగ్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
బాపట్ల జిల్లా కలెక్టర్గా వి. వినోద్కుమార్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్గా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్గా ఉన్న ఆయనను బాపట్లకు బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఐఏఎస్ క్యాడర్కు చెందిన వినోద్కుమార్ ఏప్రిల్ 2024లో అనంతపురం కలెక్టర్గా బదిలీ అయ్యారు. కర్ణాటకు చెందిన వినోద్ కుమార్ డాక్టర్ చదువు పూర్తి చేసి 2015లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. 2016 – 17లో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 2017– 19లో రంపచోడవరం సబ్ కలెక్టర్, 25 జూన్ 2019 నుంచి 17 సెప్టెంబరు 2019 వరకు ఐటీడీఏ పార్వతీపురం, 11 మే 2020 నుంచి 11 ఆగస్టు 2020 వరకు నెల్లూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2020– 23లో ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతెనింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించారు. 12 ఏప్రిల్ 2023 నుంచి 4 ఏప్రిల్ 2024 వరకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. 9 జూలై 2024న బాపట్ల కలెక్టర్గా వచ్చిన జె.వెంకట మురళిని ఏడాది తర్వాత ప్రభుత్వం బదిలీ చేసింది. -
గుంటూరు జిల్లా కలెక్టర్గా తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా కలెక్టర్గా 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. జిల్లా కలెక్టర్గా ఇప్పటి వరకు పనిచేసిన ఎస్.నాగలక్ష్మిని జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ వచ్చారు. 1987లో జన్నత్ హుస్సేన్ పనిచేయగా 2007 లో మొహమ్మద్ ఆలీ రఫత్ను జిల్లా కలెక్టర్గా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించారు. మళ్లీ జిల్లాకు మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ రావడం గమనార్హం. -
న్యాయవాదులపై దాడులు అరికట్టాలి
సత్తెనపల్లి: తరచూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్కుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా సత్తెనపల్లిలో ఉన్న నాలుగు న్యాయస్థానాల్లో విధులను బహిష్కరించి తాలుకా న్యాయస్థానం ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం వద్ద న్యాయవాదులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. అజయ్కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులపై, న్యాయవాద వృత్తిని, న్యాయవాదులను అవమానకరంగా మాట్లాడుతున్న పోలీస్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. నందిగామకు చెందిన న్యాయవాది కోట దేవదాస్పై నందిగామ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేయటాన్ని వ్యతిరేకించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కూడా న్యాయవాదులను, న్యాయవాద వృత్తిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో సురేష్ బాబు అనే న్యాయవాదిపై ఒక రౌడీ షీటర్ చేసిన దాడిని, తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ భీమపాక నగేష్ అనే న్యాయమూర్తిపై ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిన్నం మణి బాబు, న్యాయవాదులు సయ్యద్ అబ్దుల్రహీమ్, దివ్వెల శ్రీనివాసరావు, జూపల్లి శేషయ్య, జొన్నలగడ్డ విజయ్కుమార్, రాజవరపు నరసింహారావు, ఇ.ఏడుకొండలు, బొక్కా సంగీతరావు, తవ్వా హరనాథ్, గుజ్జర్లపూడి సురేష్బాబు, చావా జోజీ, వడియాల పాపారావు, సాయిశ్రవణ్, ఎ.వి.కృష్ణారెడ్డి, పాటిబండ్ల రవికుమార్, మంగళపురి రామారావు, బత్తుల జయప్రకాష్, లాజర్ తదితరులు ఉన్నారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్కుమార్ -
బెట్టింగ్లో నష్టపోయి యువకుడి ఆత్మహత్య
నరసరావుపేట టౌన్: క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబందించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరుకు చెందిన సీతారామ్(25) మెడికల్ హోల్సేల్ దూకాణంలో పని చేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు నష్టపోయాడు. అధిక వడ్డీలకు తెచ్చి మరీ పందేలు కాశాడు. గత కొన్ని నెలలుగా అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం అర్ధరాత్రి జొన్నలగడ్డ గ్రామ సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వెనుక ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందు విషయాన్ని స్నేహితునికి ఫోన్లో చెప్పాడు. అర్ధరాత్రి సీతారామ్ అచూకీ కోసం బందువులు, స్నేహితులు పరిసరాలు అంతా వెతికారు. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శవ పంచనామా అనంతరం బంధువులకు అప్పగించారు. సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలి గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమావేశంలో డీఆర్ఎం లక్ష్మీపురం: గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గుంటూరు డివిజన్ అధికారులు అందుబాటులో ఉంటారని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గూడ్స్, పార్సిల్ వినియోగదారులు బిజినెస్ డెవలప్మెంట్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–ఆగస్టు వరకు గత సంవత్సరంతో పోల్చితే సరుకు రవాణా ఆదాయం 26.12 శాతం పెరిగిందని తెలిపారు. రెడ్డిపాలెంలో ప్రత్యేక కంటైనర్ రైలు టెర్మినల్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సరుకు లోడింగ్ను పెంచి డివిజన్ లక్ష్యాన్ని సాఽధించేందుకు సహకరించాల్సిందిగా కోరారు. సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ మాట్లాడుతూ రైల్వే అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు, గూడ్స్ షెడ్ అభివృద్ధి గురించి వివరించారు. కార్యక్రమంలో గూడ్స్ వినియోగదారులు ప్రేమ్, కాశిరెడ్డి, జి.వి. రమణ, హేమంత్కుమార్, కె.ఆర్. రెడ్డి, పార్సిల్ వినియోగదారులు రెహ్మన్, అమీర్, ప్రభాకర్, డివిజన్ అధికారులు ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సీనియర్ డీఓఎం శ్రీనాథ్, సీనియర్ డీఈఎన్ శ్రీనివాస్, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియర్ డీఎఫ్ఎం అమూల్యా బి.రాజ్, డీసీఎం వినయ్కాంత్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్లు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సమయంలో విద్యార్థుల స్కాలర్షిప్లు, కళాశాలల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోని వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ బకాయిలు పేరుకపోతున్నాయే తప్పా నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జగదీష్, మధు, హేమంత్, ఆర్.అంజిరెడ్డి, యు.రాజు పాల్గొన్నారు. తొలుత అరండల్పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
ఏపీఆర్ఎస్ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
గుంటూరు వెస్ట్: ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్–2025లో జరుగుతుందన్నారు. దీనిలో జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు. జేసీకి పుష్పగుచ్ఛ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ప్రధాన కార్యదర్శి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి దివ్య, షేక్ దరియా వలి ఈఖీ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అనుపమ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయూబ్, ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యదర్శి రామారావు, బాబురావు, లీల, సంధ్యారాణి, త్రిలోక తదితరులు పాల్గొన్నారు. -
పేదల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ
నగరంపాలెం: భూమి, భుక్తితోపాటు వెట్టి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మహిళలపై చిన్నచూపు కనబరిచే ప్రతి ఒక్కరికీ ఆమె పోరాటం కనువిప్పు కలిగించిందని పేర్కొన్నారు. పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. పేదల విముక్తి కోసం పోరాడిన వీరనారిగా కొనియాడారు. భూమి కోసం సాహించిన తొలి మహిళని చెప్పారు. కార్యక్రమంలో అరవింద్, వసంత్, పోకల వెంకటేశ్వర్లు, కొల్లూరు శివప్రసాద్, సుబ్బు, దుర్గాదేవి, బద్రి, గౌరీశంకర్, కిశోర్, శంకర్ పాల్గొన్నారు. -
పల్నాడుకు జ్వరం
జిల్లాలో విస్తరిస్తున్న జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర రోగాలు సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెల్లు పల్లెలు జ్వరాలతో మంచానపడ్డాయి. ఇంటికొకరు ఇద్దరు చొప్పున జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో గత 20 రోజులుగా సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలో ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రోజు ఓపీలు సాధారణంగా 450 ఉంటాయి. అయితే, వాతావరణ మార్పుల ద్వారా వస్తున్న జ్వరాల వల్ల ఓపీల సంఖ్య సుమారు 100 నుంచి 150 దాకా పెరగాయి. వచ్చిన వారిలో 40 శాతం టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జ్వరం, జలుబు, దగ్గు, అతిసార లక్షణాలతో బాధపడుతూ వచ్చే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దర్లు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో చిన్నారులు వైద్యాశాలలో చేరుతున్నారు. ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లే రోగులకు సుమారు రూ. 5 వేల దాకా ఖర్చు అవుతోంది. రక్త పరీక్షలు, విషజ్వరాలకు ప్రత్యేకంగా ఫ్లూయిడ్స్ పేరిట రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. పోనీ ప్రభుత్వ వైద్యశాలలకు వెళదామంటే అక్కడ మందుల లేమికి తోడు సిబ్బంది నిర్లక్ష్యంతో అటువైపు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ వైద్యశాలల్లో రక్తపరీక్షల వద్ద రద్దీ అధికంగా ఉంది. రిపోర్ట్స్ అందించడంలో కూడా ఆలస్యం చేస్తుండటంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీజన్ల వ్యాధులు ప్రబలుతున్నాయన్న సమాచారం రాగానే ఇంటింటికీ సచివాలయ, వైద్య సిబ్బంది వెళ్లి సర్వే నిర్వహించేవారు. ఇందులో ఎవరైనా జ్వర లక్షణాలతో బాధపడుతున్నారా? ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి? ఏ మందులు వాడాలి.. ఏ ఆసుపత్రికి వెళ్లాలో సలహాలు, సూచనలు సైతం చేసేవారు. అవసరమైన మందులు ఇంటి వద్దే అందజేసేవారు. మరోవైపు గ్రామాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరిగేది. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపేవారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు తక్కువగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దీంతో ఇంటింటికీ ఫీవర్ సర్వే సరిగా జరగడం లేదు. ఎక్కడ జ్వరబాధితులు అధికంగా ఉన్నారో తెలియడం లేదు. మరోవైపు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో సీజనల్ వ్యాధులు అధికమవుతున్నాయి. గతంలో ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు, సిబ్బంది గ్రామాలకు వెళ్లి మెరుగైన వైద్యం ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం అది లేకపోవడంతో ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బోధన, పరిశోధనల్లో ఏఎన్యూ మేటి
పెదకాకాని(ఏఎన్యూ): బోధన, పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పేరొందిందని ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి అన్నారు. వర్సిటీ 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరగనుంది. బుధవారం డైక్మెన్ హాల్లో మీడియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లా నల్లపాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా ప్రారంభమై, స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిందన్నారు. ప్రాంగణంలో ఆర్ట్స్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ వంటి ఆరు కళాశాలలు ఉన్నాయని చెప్పారు. నేడు రెగ్యులర్ విధానంలో 65 యూజీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు, దూరవిద్యా విధానంలో 43 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జ్యోతిర్మయి మట్లాడుతూ వ్యవస్థాపక దినోత్సవానికి పూర్వ వీసీలు, ప్రొఫెసర్లు వేడుకలకు హాజరుకానున్నారని చెప్పారు. ముఖ్యఅతిథిగా వీసీ ఆచార్య కె.గంగాధరరావు హాజరుకానుండగా, పూర్వ వీసీలు ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సీవీ రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో డాక్టర్ కె. శశిధర్, డాక్టర్ ఎన్.బాబు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ కరవు
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎస్సీలపై దాడులు, వారి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నబాల శామ్యూల్, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖరరావు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఈనెల 16న ఎస్సీ సెల్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్సీలు అంటే షెడ్యూలు క్యాస్ట్ కాదని, వైఎస్సార్ సీపీకి స్టాండర్డ్ కాస్ట్ అని గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లేసి నిరూపించారని తెలిపారు. పార్టీకి వచ్చిన ఓట్లలో ఎస్సీలవే అధికంగా ఉన్నాయని అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి స్వయంగా చెప్పారని వారు పేర్కొన్నారు. పార్టీకి కంచుకోటలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తన వారిగా చెప్పుకొని వారికి జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత మేలు చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాయకులు ఆయా వర్గాలపై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు వైఎస్సార్ సీపీకి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమ వర్గాలను వైఎస్సార్ సీపీ నుంచి విడదీయలేరని వారు స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని దళితులంతా పార్టీకి వెనుదన్నుగా ఉండాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు చావలి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పులివెల మాణిక్యం, జిల్లా కార్యదర్శులు కాలే మాణిక్యాలరావు, నెలటూరి సురేష్, ఎస్సీ సెల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల ఎజ్రా, అచ్చంపేట, యడ్లపాడు, రొంపిచర్ల మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు శిఖా తిమోతి, వలేటి ఉదయకిరణ్, గుండాల వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజం 16న నరసరావుపేటలో విస్తృత స్థాయి సమావేశం -
జీవన నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
విజయపురి సౌత్: స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలపై రెండు రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా ఏపీఎస్సీఆర్టీ కరికులం కమిటీ మెంబర్ డాక్టర్ సీఏ ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లో స్థిరంగా ఉండాలని తెలిపారు. కళాశాలలోని గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాహిత్యాభిలాషులుగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని చెప్పారు. స్ఫూర్తివంతమైన కథలతో విద్యార్థులకు సూచనలు అందించారు. రెండవ రోజు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కె. ప్రభాకర్ మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలైన సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని ఉన్నత విద్యావంతులుగా తయారవ్వాలని తెలిపారు. చదువొక్కటే జీవితాలను మార్చగలదని చెప్పారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. కొండల రెడ్డి విద్యార్థులకు ప్రత్యక్షంగా కొన్ని ప్రయోగాలను చూపించి సైన్స్పై అవగాహన కల్పించారు. కాళోజీ కవితను వినిపించి, ఆయన సాహిత్యాన్ని చదవాలని విద్యార్థులకు కిరణ్మయి సూచించారు. అందరితో రాజ్యాంగ పీఠికను పాండురంగారావు (మట్టి ప్రచురణలు) చదివించారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ నయీం భాను పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.. -
అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
తాడేపల్లి రూరల్: కృష్ణానది కరకట్ట లోపల ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన అసైన్మెంట్ భూముల్లో రాత్రీ పగలు తేడా లేకుండా మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో పెద్ద యంత్రాలతో తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు. 2015–16 సంవత్సరాల్లో ఇలాగే అసైన్మెంట్ భూముల్లో తవ్వకాలు నిర్వహిస్తుంటే పది జేసీబీలు, 40 ట్రాక్టర్లను సీజ్ చేసి తాడేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తాడేపల్లి రూరల్లోని గుండిమెడ, ప్రాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో అసైన్మెంట్ భూముల్లో మట్టితవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జేబులు నింపుకొంటున్న మాఫియా తిరిగి కొంతమంది రైతులను మట్టి మాఫియా వారు మభ్యపెట్టి నామమాత్రంగా నగదు ఇచ్చి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.2500 నుంచి రూ.4 వేల వరకు మాఫియా అమ్ముతోందని స్థానికులు తెలియజేశారు. అసైన్మెంట్ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇస్తే కొంతమంది వాటిలో మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల పక్కనే పంట భూములకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ అసైన్మెంట్ భూముల్లోకి నీరు చేరుతుందని, తవ్వకాలు వల్ల పక్కనే ఉన్న భూమి సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని వాపోయారు. -
సీఎం సభకు బస్సులు.. విద్యార్థులకు చిక్కులు
అచ్చంపేట: అనంతపురంలో సీఎం మీటింగ్కు సత్తెనపల్లి డిపో నుంచి ఆర్టీసీ బస్సులు పండంతో పాఠశాల విద్యార్థులు బుధవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక రోజు అయితే సరిపెట్టుకోవచ్చు.. పల్లె వెలుగు బస్సులు మూడు రోజుల పాటు గ్రామాలకు వెళ్లలేదు. సత్తెనపల్లి నుంచి మాదిపాడు రూట్లలో రోజులో కనీసం 25 ట్రిప్పులు తిరుగుతాయి. ఇందుకోసం సుమారు 20బస్సుల వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం మూడింటిని మాత్రమే తిప్పుతున్నారు. మాదిపాడుకు గంటకో బస్సుకు గానూ నాలుగు, అయిదు గంటలకు ఒకసారి మాత్రమే తిప్పారు. ఇక రోకటిగుంటవారిపాలెం, తాళ్లచెరువు, కస్తల, కోనూరు గ్రామాలకు పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిస్థితి మంగళవారం, బుధవారంతో పాటు గురువారం మధ్యాహ్నం వరకు ఉంటుందని ఆర్టీసీ వారే చెబుతున్నారు. దీంతో అచ్చంపేట పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆటోలు, మిని లారీలను ఆశ్రయించారు. రోకటిగుంటవారిపాలెం నుంచి 30మందికి పైగా అచ్చంపేట హైస్కూలులో చదువుతున్నారు. బస్సులు రాకపోవడంతో తల్లిదండ్రుల మినీ ఆటోను మాట్లాడుకుని పిల్లలను దగ్గరుండి ఎక్కించి పంపారు. -
పేద విద్యార్థులకు వరం
యడ్లపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరులశాఖ ఏటా జాతీయ ఉపకార వేతన పరీక్ష నిర్వ హిస్తోంది. ప్రతిభ ఉన్న వారికి పేదరికం అడ్డుకారాదని చెబుతూ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తోంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 30వ తేదీ కాగా, ఈ ఏడాది డిసెంబర్ 7న పరీక్ష జరగనుంది. దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అర్హులు వీరే... ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, వసతి లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3.5 లక్షల లోపు ఉండాలి. 2024–25 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో బీసీ, ఓసీ విద్యార్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు ఇలా చేయాలి ఆసక్తి ఉన్న విద్యార్థులు www. bse. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష రుసుం రూ.100 కాగా, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 చొప్పున ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో లభించే ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. ఉపకార వేతనం ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతిలో 55శాతం మార్కులు, 10వ తరగతిలో 60శాతం, ఇంటర్ మొదటి సంవత్సరంలో 55శాతం మార్కులు సాధిస్తేనే ఉపకార వేతనం కొనసాగుతుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 12వేల చొప్పున నాలుగు సంవత్సరాలకు విద్యార్థికి ఉపకార వేతనం లభిస్తుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల ఏటా రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం -
దోపిడీలతో భీతిల్లుతున్న పేట ప్రజలు
నరసరావుపేట రూరల్: వరుస దారి దోపిడీలతో నరసరావుపేట ప్రజలు భీతిల్లుతున్నారు. దుండగులు దోపిడీలతో పాటు మహిళలపై కూడా లైంగిక దాడులకు పాల్పడటంతో భయపడిపోతున్నారు. ఇటీవల కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడి చేసి బంగారం దోపిడీ చేయడంతో పాటు మహిళపై లైంగికదాడియత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో యువకుడు ఐదుగురు యువకులు ఈ ఘతకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి అందులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని గోనెపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుమారుడుతో కలిసి రెండు రోజుల కిందట కారులో నరసరావుపేటలో పనిముగించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. చినతురకపాలెం– గోనెపూడి రహదారి గుంతలతో అధ్వానంగా ఉండటంతో గురవాయపాలెం మీదగా పయనమయ్యారు. మార్గంమధ్యంలో స్టోన్క్రషర్ సమీపంలో వీరు వెళ్తున్న కారును ఐదుగురు యువకులు అటకాయించారు. బలవంతంగా అందులోని వారిని బయటకు లాక్కెళ్లారు. మహిళ మెడలో బంగారు అభరణాలు దోచుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిపై బీరు సీసాతో దాడికి పాల్పడ్డారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె దుస్తులను చించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో నివాసం ఉండే వారు వస్తారన్న భయంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ప్రాణభయంతో గ్రామానికి చేరుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని గ్రామంలో బంధువులకు, సన్నిహితులకు వివరించారు. వెంటనే అదే రోజు రాత్రి గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అఘాయత్నానికి పాల్పడిన వారిలో గురవాయపాలేనికి చెందిన యువకులను బాధితులు గుర్తించారు. నిందితులు నివాసం ఉండే కాలనీ వద్దకు బాధితుల బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బెదిరించి దారి దోపిడీ గురవాయపాలెం దారి దోపిడీ ఘటన మరువకే ముందే తాజాగా మంగళవారం రాత్రి మరొకటి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తూరుకు చెందిన గోళ్లపాడు నాని తెలంగాణ రాష్ట్రం వరంగల్లో తాపిమేస్త్రిగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో స్వగ్రామం వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండ్కు చేరుకున్నాడు. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో సంతమాగులూరు అడ్డరోడ్డుకు వెళ్లేందుకు బస్టాండ్ ఎదుట ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత మార్గంమధ్యంలో మరో వ్యక్తి ఆటో ఎక్కాడు. పెట్లూరివారిపాలెం గ్రామ సమీపంలోని చిలకలూరిపేట మేజర్ కాలువ కట్ట వైపునకు దారి మళ్లించారు. కట్టపై కొంతదూరం తీసుకువెళ్లి కత్తులతో బెదిరించారు. అతిడి దగ్గర ఉన్న రెండు సెల్ఫోన్లు, నగదు, వెండి చైన్లను దోచుకున్నారు. బాధితుడు అర్ధరాత్రి రూరల్ పోలీసు స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులును పోలీసులు అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నట్టు తెలిసింది. గురవాయపాలెం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిశోర్ తెలిపారు. ప్రయాణికుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసులో సీసీ టీవీ పుటేజ్ను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.గురవాయపాలెం వద్ద జరిగిన దారి దోపిడీ వంటి ఘటనలు ఈ ప్రాంతానికి కొత్తేమి కాదని స్థానికులు అంటున్నారు. గురవాయపాలెం, గొనెపూడి, కోటప్పకొండ శివారు ప్రాంతాల్లో కాపుకాచి ఒంటరిగా వస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారం, నగదు దోచుకుంటున్నారని తెలియవచ్చింది. అయితే, కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా మరి కొంతమంది ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు ఇచ్చిన సమాచారంతో దోపిడీలో ఐదుగురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు తురకపాలెంలో తరచూ జరిగే పేకాటలో పాల్గొన్నట్టు తెలిసింది. నిందితులపై పలు పోలీస్స్టేషన్లలో దారి దోపీడీ, చోరీ కేసులు ఉన్నట్టు పోలీసు వర్గాల ద్వారా సమాచారం. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో పలువురికి చోటు
నరసరావుపేట / సత్తెనపల్లి : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నలుగురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ఎస్టీ సెల్ సెక్రటరీగా రమావత్ జనపల్ నాయక్(మాచర్ల), స్టేట్ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా వెన్నా నరసింహారెడ్డి (గురజాల), స్టేట్ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులుగా జూలకంటి శ్రీనివాసరావు (గురజాల), స్టేట్ వాణిజ్య విభాగ కార్యదర్శిగా అచ్యుత శివప్రసాద్ (సత్తెనపల్లి) నియమితులయ్యారు. అచ్యుత శివప్రసాద్ గతంలో వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. తన నియామకానికి సహకరించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అక్షరమే ఆయుధం
పత్రికా స్వేచ్ఛకు విఘాతంఇటీవల సాక్షిలో రెండు అంశాలపై వచ్చిన వార్తల విషయంలో పోలీసులు విజయవాడలోని సాక్షి కార్యాలయానికి వెళ్లి ఎడిటర్కు నోటీసులు జారీ చేయడం పాత్రికేయ స్వాతంత్య్రానికి విఘాతం కలిగించడమే. సత్యమనే సూర్యునికి చెయ్యి అడ్డం పెట్టి ఆపడం వంటిది. ఆ వార్తని ఖండిస్తూ ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలే తప్పా పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరచకూడదు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం ముమ్మాటికీ గర్హనీయం. –ఈదర గోపీచంద్, నైతిక విప్లవం పత్రిక పూర్వ సంపాదకులు, నరసరావుపేటఎడిటర్పై కేసు ఉపసంహరించాలిఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన మాటలను స్థానిక విలేకరి ద్వారా పంపబడిన సమాచారం మేరకు ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్పై కేసు నమోదుచేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నేనెక్కడా వినలేదు. ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్న సాక్షి పేపర్పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగినట్లుగా కన్పిస్తోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. గతంలో కూడా ఎడిటర్పై కేసు నమోదు చేసినట్లుగా విన్నాం. బేషరతుగా పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఉపసంహరించుకొని చంద్రబాబు తన సీనియార్టీని కాపాడుకోవాలి. – వై.వెంకటేశ్వరరావు, పీడీఎం రాష్ట్ర నాయకులు -
కూటమి వేధింపులు.. వైఎస్సార్సీపీ వెన్న రాజశేఖర రెడ్డి అరెస్ట్
సాక్షి, పల్నాడు: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా పిడుగురాళ్ల పోలీసులు హైదరాబాద్కు వెళ్లారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ వెన్న రాజశేఖర రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. -
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గృహ నిర్బంధం
పెదకూరపాడు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుంటూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేనందున ఆ కార్యక్రమానికి మీరు వెళ్లకూడదంటూ నంబూరు శంకరరావుకి నోటీసులు ఇచ్చారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టం రావణకష్టం అయ్యిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారన్నారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలను ఇలా అరెస్ట్ చేసి ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులు, ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని నంబూరు తెలిపారు. అమరావతి: అమరావతికి చెందిన తురకా కిరణ్ భార్య కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై 2018 నవంబర్ 28వ తేదీ రాత్రి విజయవాడ నుంచి అమరావతి వస్తుండగా పెద్దమద్దూరు వాగు చప్టా వద్ద అమరావతి నుంచి విజయవాడ వెళ్లే ఆటోడ్రైవర్ హూమాయున్బాషా ఆటోను అతి వేగంగా అజాగ్రతగా నడిపి కిరణ్ ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టాడు ఈ ప్రమాదంలో కిరణ్, అతని భార్య, కుమారుడు ఋషికుమార్కు తీవ్రగాయాలయ్యాయి. ఋషికుమార్ చనిపోయాడు. అప్పట్లో అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఫిర్యాది తరుపున లాయర్ ప్రసాద్నాయక్ వాదనలు వినిపించగా మంగళవారం సత్తెనపల్లి 2వ అదనపు సివిల్ జడ్జి ఒ.సృజన్కుమార్ నిందితునికి 304(అ) సెక్షన్తోపాటుగా 338 సెక్షన్ల ప్రకారం 18 నెలలు జైలు శిక్ష, రూ.11,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నరసరావుపేట: ఏళ్ల తరబడి అపరిష్కతంగా ఉన్న ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ‘యూటీఎఫ్ రణభేరి’ కార్యక్రమానికి జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం యూటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యాలయంలో రణభేరి పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్పు సమస్యకు పరిష్కారం చూపడం లేదని బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని అన్నారు. మూడు నెలలుగా మినిమం టైం స్కేలు టీచర్లకు జీతాలు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రపంచబ్యాంక్ సాల్ట్ పథకం రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా మూడో వంతు ప్రైమరీ స్కూళ్లు ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూళ్లుగా మారిపోయాయని, సగంపైన హైస్కూళ్లు సింగిల్ సబ్జెక్టు టీచరు స్కూళ్లుగా తయారయ్యాయని తెలిపారు. హైస్కూళ్లలో పనిచేయాల్సిన స్కూలు అసిస్టెంట్లు సర్ ప్లస్ పేరుతో క్లస్టరు టీచర్లుగా, ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్లుగా పనిచేయాల్సిన పరిస్థితులు కల్పించారని తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసిం పీర, కోశాధికారి రవిబాబు, జిల్లా సహాధ్యక్షురాలు భాగేశ్వరీదేవి, జిల్లా కార్యదర్శులు తిరుపతిస్వామి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలపై ప్రశ్నించే అధికారం లేదా ?
●మాజీ మంత్రి విడదల రజిని ●అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు చిలకలూరిపేట: ప్రజాస్వామ్యంలోనే ఉన్నాంకదా... రైతుల సమస్యలపై శాంతియుతంగా కార్యక్రమం చేపడితే అడ్డుకోవడం ఏమిటి... ఇది నియంతృత్వాన్ని తలపిస్తోంది అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని విమర్శించారు. అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమౌతున్న మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు మంగళవారం ఆమె నివాసం వద్ద అడ్డుకొని నోటీసులు అందించారు. అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవని మాజీ మంత్రికి పోలీసులు తెలిపారు. ఉదయం నుంచే చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ డి చెన్నకేశవులు, రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్, నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు సిబ్బందితో కలసి మాజీ మంత్రి నివాసానికి చేరుకున్నారు. కార్యక్రమానికి బయలుదేరిన ఆమెను వెళ్లవద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో మాజీ మంత్రి పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా కూడా రైతుల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించే అవకాశం కూడా ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. తాము ప్రజలను పోగు చేయలేదని, కేవలం పార్టీ నాయకులతో కలసి నరసరావుపేటకు వెళ్లి ఆర్డీవోకు రైతుల సమస్యలతో కూడిన మెమోరాండం ఇచ్చేందుకు మాత్రమే వెళుతున్నామని, ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగే సమస్య ఎక్కడుందని పోలీసులను నిలదీశారు. ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా కూడా అందజేయలేని పరిస్థితుల్లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఎందుకు ప్రశ్నించకూడదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్లి తీరుతామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు తమ ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని చెప్పి, ఉన్నతాధికారులతో చర్చించి రెండు కార్లు మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. దీంతో రెండు కార్లలో ఆమె నరసరావుపేటకు తరలివెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడు కొండలు, పార్టీ వివిధ విభాగాల నాయకులు ఉన్నారు. -
అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం
సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలనుఅడ్డుకుంటున్న పోలీసులు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లే సమయంలో రైతులను అడ్డుకుంటున్న పోలీసులు నరసరావుపేటలో పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ గోపిరెడ్డి, నాయకులను బయటకు రాకుండా అడ్డుకుంటున్న సీఐ హైమారావు నరసరావుపేటలోని గుంటూరురోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట కాపలా కాస్తున్న పోలీసులు ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు, నంబూరు, బొల్లా తదితరులను గృహ నిర్బంధం చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి పార్టీ నాయకులు, కార్యకర్తలను నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. –సాక్షి, నెట్వర్క్సత్తెనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త చల్లంచర్ల సాంబశివరావును హౌస్ అరెస్ట్ చేసి కాపలా ఉన్న పోలీసులు గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులుగురజాలలో ద్విచక్రవాహనదారులను తనిఖీ చేస్తున్న పోలీసు గురజాలలో ఆటోలను క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్న పోలీసులు -
మాజీ ఎమ్మెల్యే బొల్లా గృహ నిర్బంధం
వినుకొండ: వినుకొండ మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకూడదంటూ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అందజేశారు. తెల్లవారుజామునే బొల్లా ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా బందోబస్తు నిర్వహించారు. రైతు పోరుకు అనుమతులు లేవని చెబుతూనే మధ్యాహ్న సమయంలో షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం గమనార్హం. అడ్డుకోవడం దారుణం మాజీ ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రతిపక్షం ప్రజల పక్షాన అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన టమటో, ఉల్లి, పొగాకు, కందులు, మామిడి, ధాన్యం వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంటే చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. రైతులకు ఎలాంటి న్యాయం చేయలేని ప్రభుత్వం వారి సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షపార్టీ నాయకులను అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు యూరియా వస్తుందని అంటున్నారని యూరియా ఎక్కడ ఉందో చూపించాలని డియాండ్ చేశారు. ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం పోలీసుల అనుమతితో ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే అన్నదాత పోరులో పాల్గొనేందుకు వెళ్లారు. -
విద్యుత్ సబ్స్టేషన్లు చిలకలూరిపేటకు తరలింపు ఆపాలి
●సీఎండి పుల్లారెడ్డికి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, బొల్లా ●ఎమ్మెల్యే పత్తిపాటి మెప్పుకోసమే చేయటం తగదు నరసరావుపేట: దశాబ్దాలుగా నరసరావుపేట విద్యుత్ సబ్డివిజన్లో కొనసాగుతున్న నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు, శావల్యాపురం మండలాల విద్యుత్ సబ్స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్న చిలకలూరిపేట విద్యుత్ సబ్డివిజన్లో కలపడానికి నిరసిస్తూ తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్శాఖ జిల్లా కార్యాలయంలో సీఎండీ పి.పుల్లారెడ్డి, ఎస్ఈ ప్రత్తిపాటి విజయకుమార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పై మండలాల విద్యుత్ సబ్స్టేషన్లను నరసరావుపేట సబ్స్టేష్న్ నుంచి తొలగించి చిలకలూరిపేట సబ్డివిజన్కు తరలించడం దారుణమైన విషయమని అన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి కూత వేటు దూరంలో ఈ నాలుగు మండలాలు ఉన్నాయని, ఇక్కడే విద్యుత్ డీఇ, ఎస్ఇ, ఈఈలతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి వీరిని కలిసి సమస్యలు విన్నవించుకోవడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అన్ని కార్యాలయాలు ఇక్కడ పెట్టుకుని ఇక్కడి ప్రజలు చిలకలూరిపేటకు వెళ్లి సమస్యలు విన్నవించుకోవడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. కేవలం చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మెప్పుకోసం చిలకలూరిపేటలో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, వారికి అంతగా కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోవాలని ఉంటే అక్కడున్న మండలాలను కలుపుకొని చేసుకోవాలే తప్ప మా నియోజకవర్గాలకు చెందిన మండలాలను తీసుకువెళ్లి అటు కలపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే ధర్నాలు చేయడానికి, న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
అడుగడుగునా అడ్డంకులు
గురజాల: గురజాలలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన అన్నదాత పోరుకు పోలీసులు అడుగడునా అడ్డంకులు కల్పించారు. సోమవారం రాత్రి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం ఉదయం గురజాలకు వచ్చే అన్ని మార్గాలను మూసివేసి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పట్టణంలోకి అడుగుపెట్టనీయకుండా అడుగడునా తనిఖీలు నిర్వహించారు. కొద్ది మంది నాయకులు, రైతులు పోలీసుల ఆంక్షలను అధిగమించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల పక్షానే ఉంటాం వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటామని సృష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో వ్యవసాయం పండుగ సాగిందని, చంద్రబాబు పాలనలో దండగలా ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. శాంతియుతంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తామంటే పోలీసులను అడ్డుపెట్టి వినతిపత్రం ఇవ్వకుండా చేశారన్నారు. రైతులకు న్యాయం చేయాలని రైతుల సమస్యలను సత్వరమే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
అమరేశ్వరునికి గ్రహణానంతర ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో చంద్ర గ్రహణానంతరం సోమవారం అమరేశ్వరునికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం పుణ్యహావాచన జలాలను మేళ తాళాలతో అమరేశ్వరునికి అభిషేకించారు, అలాగే బాలచాముండేశ్వరి అమ్మవారికి, ఉపాలయాల్లో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.జిల్లా కలెక్టర్ అరుణ్బాబునరసరావుపేట: యూరియాపై రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామస్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. వీఆర్వో, మహిళా పోలీసు, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం యూరియా అంశంపై కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ బృందాలు ప్రతి రైతు వద్దకు వెళ్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న విషయం వివరించాలన్నారు. యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగుచేసిన భూమికి అవసరమైన యూరియా రైతులకు లభించిందా అనే అంశాలపై అధికారులకు నివేదిస్తారన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్న విషయం స్పష్టం చేస్తూనే, అవసరానికి మించి యూరియా కొనుగోళ్లు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు. రానున్న మూడు రోజులు మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాల్లోనే ఉండి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.దయ కలిగిన తల్లి వేళాంగణిమాత పాలువాయిజంక్షన్(రెంటచింతల): దయ కలిగిన తల్లి వేళాంగణిమాత అని రాయవరం విచారణ గురువులు రత్నబాబు అన్నారు. పాలువాయి జంక్షన్లోని వేళాంగణిమాత మందిరం 26వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం కానుకమాత చర్చి విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో సమష్టి పవిత్ర దివ్యపూజాబలిని సమర్పించారు. ఫాదర్ రత్నబాబు మాట్లాడుతూ వేళాంగణిమాతలోని ప్రేమ, దయ, కరుణ, క్షమాపణ, వినయం, విశ్వాసం, శాంతి, సమాధానాలు వంటి సుగుణాలను క్రైస్తవులు అలవర్చుకొని దేవుని కృపకోసం ప్రార్థించాలన్నారు. అనంతరం మందిరం వ్యవస్థాపకులు దుగ్గింపూడి అనిత కస్పారెడ్డి నేతృత్వంలో భక్తులకు మహా అన్నదానం చేశారు. తుమృకోట విచారణ గురువులు రె.ఫాదర్ పవిత్రన్, ఫాదర్ కొణతం ఏలీషా రాజు, కన్యసీ్త్రలు, చర్చిపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
వేధింపులపై ఐసీసీలో ఫిర్యాదు చేయండి
యడ్లపాడు: మహిళలపై జరిగే వేధింపుల నిర్మూలనకు ఐసీసీ(ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు డీవీసీ(గృహహింస కేసుల) సోషల్ కౌన్సిలర్ ఎం.సంగీత తెలిపారు. మండలంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ మిల్లులో సోమవారం మిషన్ సంకల్ప కార్యక్రమంలో భాగంగా బాలలు, మహిళలకు చట్టాలకు సంబంధించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ నాదెండ్ల ప్రాజెక్టు సీడీపీఓ జి.శాంతకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై జరిగే లైంగిక దాడుల నివారణ కోసం ఐసీసీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గృహహింస నిరోధక చట్టంపై మహిళలకు వివరించారు. ఓఎస్సీ(ఒన్ స్టాప్ సెంటర్) లీగల్ కౌన్సెలర్ కె.వాణిశ్రీ మాట్లాడుతూ మహిళా సంరక్షణ, ఉచిత న్యాయాన్ని అందించేందుకు 2006లో వచ్చి గృహహింస చట్టంపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో వన్స్టాప్ సెంటర్ ద్వారా గృహహింసకు సంబంధించిన కేసుల్లో నేరుగా పోలీస్స్టేషన్లకు వెళ్లకుండా ముందస్తుగా ఓఎస్సీలో మహిళలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఐదురోజులు వైద్యం, భోజన, వసతి కల్పించి వారికి కుటుంబ సభ్యులను కలిసి బాధిత మహిళకు న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా న్యాయం లభించకుంటే ఆ తర్వాత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కోర్టుద్వారా న్యాయం పొందవచ్చన్నారు. సీడీపీఓ జి.శాంతకుమారి మాట్లాడుతూ బాల్యవివాహాలు, గర్భిణులు – బాలింతలు, పిల్లల ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆర్.సామ్రాజ్యం, కె.వెంకటరమణ, మహిళా పోలీస్ నిర్మల, వలస కూలీలు, మహిళా కార్మికులు, అంగన్వాడీ తల్లులు పాల్గొన్నారు. డీవీసీ(గృహహింస కేసుల) సోషల్ కౌన్సెలర్ ఎం.సంగీత -
రైతు పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట...
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్నారు. గతంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఆర్బీకే కేంద్రాలలో లభించేవి. ప్రస్తుతం వాటిని రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి నిర్వీర్యం చేశారు. జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. మరోవైపు అధికారపార్టీ నేతలు, ప్రైవేట్ వ్యాపారులు జిల్లాలో యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. గత పదిహేను రోజులుగా రైతులు యూరియా బస్తాల కోసం కుస్తీలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దీంతో రైతులు పక్షాన నిలిచే పోరాడే వైఎస్సార్ సీపీ నేడు పోరుబాటకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులు, నేతలు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్డీఓలకు వినతిపత్రం ఇవ్వనున్నారు.బస్తాపై అ‘ధనం’జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు కష్టమవుతుందనే భావన అన్నదాతల్లో నెలకొంది. కొరతను సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరకు యూరియాను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కోసం దుకాణాలకు వెళ్తున్న రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా ధరను ప్రభుత్వం రూ.266 గా నిర్ణయించగా, మార్కెట్లో రూ.480 వరకు విక్రయిస్తున్నారు. బస్తాకు రూ.200 అధికంగా రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. మార్కెట్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధిక ధరకు విక్రయించాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంరైతులకు అవసరమైన ఎరువులను సంతృప్తికర స్థాయిలో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉన్న అరకొర నిల్వలను ఎరువుల మాఫియాగా మారిన కొందరు అక్రమదారులు ఇతర ప్రాంతాలకు తరలించి మరింత కొరతను సృష్టిస్తున్నారు. ఒకవైపు సరిహద్దు తెలంగాణ జిల్లాలకు ఇక్కడి యూరియాను తరలించి బ్లాక్ మార్క్ట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు, మరోవైపు ఇక్కడి యూరియా నిల్వలు తరలిపోవడంతో రైతులకు అవసరానికి తగ్గట్టు లేకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపు అవుతున్నాయి. దీనివల్ల రెండు రకాలుగా యూరియా మాఫియాకు ఆదాయంగా మారింది.తెలంగాణ కు ఇబ్బడిముబ్బడిగా..గత నెల రోజులుగా పల్నాడు జిల్లా నుంచి వేల టన్నుల యూరియా పక్కదారి పట్టింది. పక్క రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సైతం మన యూరియానే సరఫరా అవుతుండటం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. యూరియా అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పది రోజుల క్రితం దాచేపల్లి మండలం పొందుగల వద్ద దొరికిన ఒకటి రెండు సంఘటనలు తప్ప పెద్దగా కట్టిడిచేసిన దాఖలాలు కనిపించడంలేదు. పొందుగల వద్ద రెండు వాహనాలలో తరలిస్తున్న 165 బస్తాలలోని 7,425 కిలోల యూరియాను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.రైతు సేవా కేంద్రాలు నిర్వీర్యంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరతను వ్యాపారులు సృష్టించకుండా ఉండేందుకు ఆర్బీకేల్లో సీజన్కు అవసరమయ్యే ఎరువులను అందుబాటులో ఉంచేవారు. దీంతో స్థానికంగా ఎరువులు అందుబాటులో ఉండటంతో రైతులు నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కూటమి ప్రభుత్వం రైతుసేవా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆర్ఎస్కేలకు నామమాత్రంగా ఎరువులను కేటాయిస్తుంది. దీంతో పాటు సొసైటీల ద్వారానే ఎరువులను పంపిణీ చేస్తుంది. అధికార పార్టీ సానుభూతిపరులకే ఆర్ఎస్కేలు, సొసైటీలు, జీడీసీఎంఎస్లకు కేటాయించిన ఎరువులు అందుతున్నాయి. దీంతో యూరియూ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది.కూటమి ప్రభుత్వం విఫలమైందిరాష్ట్రంలో రైతులు అన్ని విధాల కష్టాలపాలవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడం కూడా చేతకాక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ తరఫున నేడు అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతులంతా పాల్గొని పోరుబాటను విజయవంతం చేయాలి.– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడువ్యాపారులు చెప్పిన ధరకు కొంటున్నాంఎరువుల కోసం దుకాణాలకు వెళ్తే వ్యాపారులు చెప్పిన ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి ఎక్కడా యూరియా అమ్మడం లేదు. బస్తాకు రూ.200 అధికంగా చెల్లిస్తేనే యూరియా అమ్ముతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.– చెంచయ్య, రైతు, గోనెపూడిఎరువులు అందుబాటులో ఉంచాలి...యూరియా కొరత పేరుతో వ్యాపారులు అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఎరువుల పంపిణీపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.– అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడుసాగు సగమైనా కాలేదు..పల్నాడు జిల్లాలో సెప్టెంబర్ మాసం మొదటి వారానికి ఖరీఫ్ సాగు 50 శాతం కూడా పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే వరి, మిర్చి సాగు పనులు ముమ్మరమవుతున్నాయి. అయితే జిల్లాలో యూరియా అమ్మకాలు మాత్రం దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇది ఎలా సాధ్యమంటే.. మాఫియా సభ్యులు స్థానిక రైతుల పేర్లతో యూరియా కొనుగోలు చేసినట్టు చూపి ఆ బస్తాలను సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే సాగు తక్కువగా ఉన్న సమయంలో అంత యూరియా ఎలా విక్రయించారో వ్యాపారులను నుంచి ఆరా తీస్తే అసలు విషయం బయటపడేది. కానీ వ్యవసాయశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఎరువుల మాఫియా రెచ్చిపోయి రైతులను కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా కారంపూడి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల లాంటి ప్రాంతాల నుంచి యూరియా పక్కదారి పడుతోంది. -
కూటమి పాలనలో దగా పడిన అన్నదాత
చిలకలూరిపేట: కూటమి పాలనలో రైతన్నలు అన్ని రకాలుగా దగాకు గురవుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం పట్టణంలోని ఆమె నివాసంలో వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జగనన్న పాలనలో ఆర్బీకేల ద్వారా యూరియా, ఇతర ఎరువులను కావాల్సినంత మేర రైతులకు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యూరియా బస్తా కోసం ఎరువుల దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోడవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతాంగం పీకలోతు కష్టాల్లో మునిగి ఉంటే ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని తెలిపారు. యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం ఒకవైపు యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడుతుంటే యూరియా కొరత లేదని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. యూరియా కొరత లేకపోతే మరి అవి ఎక్కడికి వెళ్లాయో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, లేదా నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని విమర్శించారు. అన్నదాత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల వారు పాల్గొని రైతులకు అండగా నిలుద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట పట్టణ, మండల, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడుకొండలు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏకాంబరపు సునీత, నాయకులు ఉడుతా వెంకటేశ్వరరావు, సింగారెడ్డికోటిరెడ్డి, మైలా రాజేష్, సయ్యద్ జమీర్, దాసరి అంజలి, మానుకొండ శేషిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, కొండవీటి ఆంజనేయులు, రాచమంటి చింతారావు, గుత్తా యాములయ్య, యూసుఫ్ ఆలి, కొప్పురావూరి పటేల్, కొచ్చెర్ల కిషోర్, గౌస్ సంధాని, షేక్ నజీర్, డీలర్ సుభాని పాల్గొన్నారు. -
ముస్లిం మైనార్టీలపై కూటమి వివక్ష
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ముస్లిం మైనా ర్టీలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను అమలుచేయకుండా వివక్ష చూపుతోందని వైఎస్సా ర్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్టీ ముస్లిం మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ ఖాన్, నియోజకవర్గాల నాయకులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో మైనార్టీల సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదించేందుకు కలెక్టరేట్కు తరలి వచ్చారు. అయితే ప్రవేశద్వారం వద్దకు వచ్చిన వారిని గేటు మూసేసి లోపలికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. కేవలం పది మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పగా.. పదిమందితో లోపలికి వెళ్లి కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. మౌజమ్లు, ఇమామ్లకు 11 నెలల నుంచి గౌరవ వేతనాలు చెల్లించడంలేదన్నారు. తక్షణమే వారికి జీతాల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటివరకు జిల్లాలో ఖబర్స్థాన్, షాధీఖానాలకు కమిటీలు వేయలేదన్నారు. దుల్హన్ పథకం అమలుచేయలేకపోయారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జలీల్, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లాలు మాట్లాడగా, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, నియోజకవర్గ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిలార్బాష, జిల్లా కార్యదర్శి సయ్యద్ఖాదర్బాష, పొదిలే ఖాజా, వరవకట్ట బుజ్జి తదితర మైనార్టీసెల్ నాయకులు పాల్గొన్నారు. -
జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికలు
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ సోమవారం జరిగాయి. ఈ సెలక్షన్స్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గల వివిధ పాఠశాలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 32మంది క్రీడాకారులను ఉమ్మడి గుంటూరు జిల్లా టీంకు ఎంపిక చేశారు. వారిలో బాలుర నుంచి 16 మంది, బాలికల నుంచి 16మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెలలో వైజాగ్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీసీ కమిటీ చైర్మన్ ఏడుకొండలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను విశ్రాంత హెచ్ఎం ఎన్. రామకష్ణారెడ్డి, హెచ్ఎం బీఎం సుభాని, వ్యాయామ ఉపాధ్యాయుడు సైదయ్య అభినందించారు. -
‘అన్నదాత పోరు’ జయప్రదం చేయండి
మాచర్ల రూరల్/మాచర్ల: తగినంత యూరియాను అందుబాటులో ఉంచకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నేడు అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతన్నలు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిల్చోవటం దారుణమన్నారు. యూరియా కొరతను అదుపులోకి తేవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన యూరియా, ఎరువులు అందించినట్లు గుర్తు చేశారు. నేడు ఉదయం 10.30గంటలకు గురజాల పార్టీ ఆఫీసు నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డితో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట ఎస్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బుల్లా మేరీకుమారి, ఇతర మహిళా నేతలతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను పీఆర్కే ఆవిష్కరించారు. విజయవంతం చేద్దాం : డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తనతోపాటు మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యూరియా, ఎరువుల కొరతపై స్థానిక లింగంగుంట్ల జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గ రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పీఆర్కే -
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేటు భాగస్వామ్యానికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా నరసరావుపేట: గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను పూర్తిచేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో ధర్నాచేసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కలెక్టర్ పి.అరుణ్బాబుకు వినతిపత్రం సమర్పించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఏం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు, కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రయత్నంచేస్తే, కూటమి ప్రభుత్వం వాటిలో పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు భాగస్వామ్యంతో నడపడానికి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మెడిసన్ చదవాలంటే సాధ్యంకానీ పరిస్థితి ఉందని, ఇప్పటికే విద్యా, వైద్యం ప్రైవేటీకరణ వలన పేదలకు అందట్లేదని, ఇక ప్రైవేటుకు అప్పగిస్తే మరింత ఘోరంగా మారుతుందన్నారు. ఇటీవల విజయవాడలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనపై జరిగిన లాఠీచార్జిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యుడు కంబాల ఏడుకొండలు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోటనాయక్, ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్రహం లింకన్, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట: పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను సంతృప్తికరంగా, సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ సూరజ్ గనోరే, జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన పీజీఆర్ఏస్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 122 అర్జీలు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు పరిష్కారం కోసం పంపాలని అధికారులకు కలెక్టరు సూచించారు. వివిధ శాఖల జిల్లా, డివిజన్ అధికారులు పాల్గొన్నారు. రూ.15వేలు పింఛన్ ఇప్పించండి నాకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. గత ప్రభుత్వంలో రూ.6వేలు పింఛన్ ఇచ్చారు. 90శాతంకుపైగా ఉన్న వారికి రూ.15వేలు పింఛన్ ఈ ప్రభుత్వంలో ఇవ్వాల్సివుండగా నా కుమారునికి అమలు కావట్లేదు. దయచేసి ఆ పింఛన్ అమలుచేసి న్యాయం చేయగలరు. –షేక్ షాహిదా, వినుకొండ విలీనానికి అంగీకరించేది లేదు మా గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాల్టీలో విలీనం చేసేందుకు మేం అంగీకరించపోయినా అంగీకరించినట్లుగా వీఆర్ఓ, పంచాయతీ ప్రెసిడెంట్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత నెల 25న గ్రామసభ జరిగినట్లుగా మేం సంతకం చేశాం. విలీనంపై కేవలం చర్చలు మాత్రమే జరిపాం. విలీనానికి మేం వ్యతిరేకం. అనుమతిస్తూ సంతకాలు చేయలేదు. గ్రామ ప్రజల అభీష్టం మేరకు పంచాయతీ విలీనాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. – భీమవరం పంచాయతీ మెంబర్లు -
రాష్ట్రస్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థుల ప్రతిభ
బాపట్ల: జాతీయ సోర్డ్స్డే సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థులకు బంగారు పతకాలు రావటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. క్రీడాకారులను సోమవారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జె.పంగులూరుకు చెందిన సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఖోఖోతోపాటు పలు క్రీడాల్లో విద్యార్థులకు బంగారు పతకాలు కై వసం చేసుకోవటం హర్షనీయమన్నారు. విద్యార్థులు మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు. ఖోఖోలో గోల్డ్ మెడల్, మరో విభాగం వెయిట్ లిఫ్టింగ్ పురుషుల భాగంలో గోల్డ్, సిల్వర్ కై వసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ లాంగ్ జంప్లో రెండో స్థానం సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నారు. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యత
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర 111 ఫిర్యాదులు అందాయి. -
పోలీసుల అదుపులో భర్త..
చిలకలూరిపేట: తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఓ మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్కు సంబంధించి గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. సిటీ సెంటర్ యజమాని, అమెరికాలో నివాసం ఉండే ఎన్ఆర్ఐ రావి మురళి తమకు అప్పు ఉన్నాడంటూ కొంతమంది గత కొంతకాలంగా కాంప్లెక్స్ ముందు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నారు. ఈ కాంప్లెక్స్ పక్కన ఐస్ ఫ్యాక్టరీ నిర్వహించే పరమట వెంకటరమణ రావి మురళివద్ద ఉద్యోగిగా ఉన్నాడు. ఇతనిని ఒక కేసు విషయమై చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన వెంకటరమణ భార్య తులసి ఉత్తరం రాసి ఆత్మహత్యయత్నం చేసింది. ఉత్తరంలో తన భర్తను అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్లారని, తన భర్తకు ఏదైనా జరిగితే తాను తట్టుకోలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసింది. దీనికి కారణం టెంట్లో కూర్చొన్న వారు, ఎమ్మెల్యే పుల్లారావు, పోలీసులు బాధ్యులని పేర్కొంది. ● ఘటనపై బాధితుడు వెంకటరమణ స్పందిస్తూ తనపై ఏ కేసు పెట్టారో తెలియదని, రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి సంతకాలు పెట్టించుకొని పంపించి వేశారని, ఈ నేపథ్యంలో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపాడు. రూరల్ సీఐ బి.సుబ్బానాయుడును ఫోన్లో వివరణ కోరగా క్రైమ్ నంబర్ 151 /24 నమోదై ఉన్న కేసులో స్టేషన్కు పిలిపించి 41 నోటీసు ఇచ్చి పంపించి వేశామని తెలిపారు. ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన తులసి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతోంది. ఇదిలాఉండగా.. తాను సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తన వద్ద పనిచేస్తున్న వెంకటరమణను వేధిస్తున్నారని ఎన్ఆర్ఐ రావి మురళి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం విశేషం. -
అప్పుల బాధ తాళలేక ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య
పెదకూరపాడు/మాదల(ముప్పాళ్ళ): అప్పుల బాధ తట్టుకోలేక పల్నాడు జిల్లాలో ఇద్దరు కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన అడపాల మహేష్బాబు (28) ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాడు. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అప్పులు తీర్చేదారి లేక ఆదివారం పురుగుమందు తాగాడు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అతడిని సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిట్టుబాటు ధర లభించక... పల్నాడు జిల్లా మాదలకు చెందిన యర్రంశెట్టి కోటేశ్వరరావు(47) 20 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత ఏడాది 12 ఎకరాల్లో మిరప, 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించపోడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులిచి్చనవారి ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కోటేశ్వరరావుకు రూ.40 లక్షల వరకూ అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
ట్రాఫిక్కు అంతరాయం కల్గించారని పిన్నెల్లిపై కేసు
పల్నాడు: ఏదో రకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో మాత్రమే పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసును బనాయించింది. నిన్న( ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) మాచర్ల వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అయితే ట్రాఫిక్కు అంతరాయం కల్గించారనే కారణంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న పోలీసులు.. పిన్నెల్లిపై కేసును నమోదు చేశారు. -
కూటమి పాలనలో రైతులకు కష్టాలు
కూటమి సర్కార్ కళ్లు తెరిపించేందుకు సన్నాహాలు ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ చేపట్టనుంది. జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం జరిగాయి. మాచర్ల: రాష్ట్రంలో రైతులు అన్ని రకాలుగా కష్టాలపాలవుతున్నారని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం పీఆర్కే తన క్యాంపు కార్యాలయంలో భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల నడుమ ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్తి, మిర్చితో పాటు అన్ని పంటలను అమ్ముకోలేక రైతులు దిగులు చెంది ఆత్మహత్య చేసుకునే దుర్భర పరిిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు. తరలి రావాలని పిలుపు ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నిర్ణయించిందని తెలిపారు. గురజాల ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రాజీ పడకుండా రైతన్నకు అండగా ఉండే పార్టీ వైఎస్సార్సీపీ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనను కార్యాలయంలో చాలా రోజుల తరువాత కలిశారు. మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పలపాటి పెద్దబ్బాయ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పెద మల్లుస్వామి, నవులూరి భాస్కరరెడ్డి, జిల్లా నాయకులు మేకల కోటిరెడ్డి, చల్లా మట్టారెడ్డి, చుండూరు చంద్రశేఖర్రెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, రాష్ట్ర యువజన విభాగ నాయకులు నవులూరి చెన్నారెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కోటిరెడ్డి, సర్పంచ్ ఓరుగంటి చిన్న, కౌన్సిలర్లు వేల్పుల గురవయ్య, మందా సంతోష్, చవ్వా బాలస్వామిరెడ్డి, జిల్లా విభాగం నాయకులు నూన్సావత్ రంగానాయక్, మున్నా మురళి, జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, అల్లయ్య, జెడ్పీటీసీ షఫి, మాజీ ఎంపీపీ సంపూర్ణమ్మ, ఎస్సీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, పార్టీ నాయకులు పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్ళపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గిరాముడు, కంభంపాటి అమర్, మద్దికర శ్రీనివాసరెడ్డి, జిల్లా విభాగం మహిళా నాయకురాలు అనంతరావమ్మ, ధనలక్ష్మి, చల్లా మోహన్, మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బీసీ యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పిటీసీ పెద్ద మల్లుస్వామి, దేవళ్ళ సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్ మందా సంతోష్, దేవళ్ళ సాంబశివరావు, చల్లా కాశయ్య, చల్లా మోహన్, బాలమ్మ, సంపూర్ణ, ఆకుల శ్రీనివాస నాయుడు, దేవళ్ళ యోగయ్య, గుంజ నాగ అంజి, తిరుమల కొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు, బొంగురు, అగ్గిరాముడు, ఎం.పాపిరెడ్డి, బిజ్జం సుధాకర్రెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. -
రైతులపై సర్కార్ చిన్నచూపు
వినుకొండ: అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నరసరావుపేటలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నివిధాలుగా మోసగించిందని మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై, ఎరువుల బ్లాక్ మార్కెట్పై 9వ తేదీన నరసరావుపేటలో నిరసన ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, కనీస మద్దతు ధర కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఆది నుంచి చంద్రబాబు వ్యవసాయం దండగ అని చెబుతున్నారని, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కడం, క్యూలైన్లలో వేచి ఉండటం వంటి దుస్థితి నెలకొందన్నారు. కొంత మేరకు పంపిణీ చేసి, అసలు ఎక్కడా కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల కమీషనుతో బ్లాక్లో రూ.700 వరకు యూరియా బస్తా విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. టీడీపీ నేతలు రేషన్ బియ్యం, ఇసుక, మద్యంతోపాటు యూరియాను కూడా వ్యాపారంగా చేసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో భేష్... వైఎస్ జగన్ పాలనలో ఆర్బీకేల ద్వారా యూరియా, ఇతర ఎరువులను రైతులకు సరిపడా సకాలంలో అందించారని బొల్లా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే మిర్చి, పొగాకు, మామిడి, పత్తి, ఉల్లి రైతులు అల్లాడుతున్నారని గుర్తుచేశారు. దీనిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే... కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెబుతోందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. అప్పటివరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మూతపడిన అమరేశ్వరాలయం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025న్యూస్రీల్ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఉదయం రుద్రహోమం, కల్యాణం నిర్వహించారు. స్వామి వారి మహర్నీవేదన అనంతరం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 8 గంటలకు భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. – అమరావతి -
వెయిట్ లిఫ్టర్ సాధియా అల్మస్కు గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలి
నరసరావుపేట: మంగళగిరికి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ సాధియా ఆల్మస్కు గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. స్వదేశానికి తిరిగిగొచ్చిన సాదియాకు గన్నవరం విమానశ్రాయంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాదల నాగూర్, విజయవాడ సీనియర్ నాయకులు సల్మాన్తో కలిసి ఘనంగా సత్కరించామన్నారు. ఆల్మస్ ప్రపంచవ్యక్తంగా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లో మూడు గోల్డ్మెడల్స్తో పాటు ఏడు మెడల్స్, కామన్వేల్త్ గేమ్స్లో ఎనిమిది బంగారు పతకాలు, ఏషియన్ గేమ్స్లో 18 బంగారు పతకాలు, 35 నేషనల్ గేమ్స్లో 19 గోల్డ్ మెడల్స్, 24 రాష్ట్ర స్థాయి ఆటల్లో 20 గోల్డ్ మేడల్స్ సాధించిందని పేర్కొన్నారు. సాధియా దేశ విదేశాల్లో మనదేశ గొప్పతనాన్ని చాటి చెప్పడమే కాకుండా మన రాష్ట్రానికి 60 బంగారు పతకాలు సాధించి ప్రపంచపటంలో నిలిపినందున గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ప్రతిభను గుర్తించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా సాదియా అల్మస్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మౌలాలి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన ఎంఐఎం పట్టణ అధ్యక్షులు మౌలాలి -
ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్కు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవిని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మధురై, చైన్నె, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం ప్రాంతాల నుంచి తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. జనవరి 3వ తేదీన ఉదయం 10గంటలకు జ రిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సు ముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్లోకి రాకుండా అడ్డుకునేందుకు బార్ పాలసీపై చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సెలక్షన్ టీం కమిటీ సభ్యులు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి తెలిపారు. ఆట్యా–పాట్యా రాష్ట్రస్థాయి పోటీలకుగాను పల్నాడు జిల్లా సెలక్షన్స్ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 50మంది పురుషులతో, 40 మంది మహిళలతో జిల్లా జట్టు ఎంపిక జరిగిందన్నారు. ఈ జట్టు ఈనెల 25, 26 తేదీలలో నకరికల్లులోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో క్రీడా ఉపాధ్యాయులు డి.మణి, బి.పెదవెంకటేశ్వర్లు, మద్దం వెంకటేశ్వర్లు, ఎన్.జానకిరామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
అమరావతి: పవిత్ర శైవక్షేత్రమైన అమరావతి శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో తొమ్మిదిరోజులపాటు చండీహోమం నిర్వహిస్తామని చెప్పారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేయనున్నట్లు తెలిపారు. బాలబాలికలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 29వ తేదీ రాత్రి 8.40 గంటలకు చండీ కల్యాణోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. శమీ వృక్షం కింద ప్రత్యేక వేదికపై అక్టోబరు 2 వ తేదీన రాత్రి స్వామి వారి గ్రామోత్సవం అనంతరం శమీపూజ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానాలలో కూడా దసరా నవరాత్రోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీతా సమేత శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాలు సాయంత్రం అమ్మవారి ప్రత్యేక పూజలు, బతుకమ్మ పూజ నిర్వహించనున్నారు. అమ్మవారికి అలంకరణలు ఇలా.. తొమ్మిది రోజులపాటు వేడుకల్లో అమరావతి బాల చాముండేశ్వరి దేవి ఆలయంలో 22 వ తేదీన రజత కవచాలంకృత అలంకరణ, 23న బాలా త్రిపుర సుందరీ దేవి, 24న గాయత్రీ దేవి, 25న అన్నపూర్ణా దేవి, 26న మహాలక్ష్మీ దేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి, 28న మంగళగౌరీ దేవి, 29న సరస్వతీ దేవి, 30న దుర్గాదేవి, 01న మహిషాసుర మర్ధిని దేవి, అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకారాలు ఉంటాయని ఈవో తెలిపారు. -
ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలి
ఎస్టీయూ డిమాండ్ చిలకలూరిపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు భారంగా మారాయని, వాటిని పునఃపరిశీలించి, వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ప్రారంభించాలని కోరారు. 12వ పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, షేక్ మక్బూల్బాషా, దుర్గాప్రసాద్, బొంత రవి, జి కోటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. -
టెండర్లలో తమ్ముళ్ల కాళ్లబేరం!
● టెండర్లు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్ల పాట్లు ● ఇటీవల అడ్డదారిలో దక్కించుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ● దాని ఆధారంగా పలువురిని బ్లాక్లిస్ట్లో పెట్టిన అధికారులు ● వర్కులను ఎలాగైనా దక్కించుకోవాలని వెంపర్లాడుతున్న పచ్చ నేతలు ● టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ వాట్సాప్ మేసేజ్లు నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతోపాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమని అంటున్నారు. సగంలో ఆగిపోయిన వర్కులు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి రూ.కోట్లు విలువైన పనులను కైవసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించడంతో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చర్చనీయాంశంగా మారిన మెసేజ్ వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్లో రూ.1.14 కోట్ల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. వ అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఇలాగే జరుగుతుందని తోటి కాంట్రాక్టర్లు చెప్పుకోవడం గమనార్హం. నేడు కలెక్టర్కు వినతి పత్రం నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
ప్రభుత్వానికి రైతుల సమస్యలపై శ్రద్ధలేదు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వానికి మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో ఉన్న శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అప్రమత్తం చేసి కళ్లు తెరిపించే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10గంటలకు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు యూరియా కోసం రోడ్డుమీద పడి కాపు కాయాల్సి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా అధిక ధరకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ నిద్రపోతున్నట్లుగా ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, లేడా అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతుందన్నారు. అధికారులు యూరి యాకు కొరత లేదని పదే పదే ప్రకటనలు ఇస్తున్నారని, యూరియా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. వాస్తవానికి దళారుల చేతుల్లో యూరియా ఉందని, ప్రభుత్వం, అధికారులు దళారులకు బానిసలు అయ్యారని పేర్కొన్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, నాయకులైన బాగుపడ్డ చరిత్ర లేదని అన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాంతియుత నిరసన ర్యాలీ అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, రైతు సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు అన్నదాత పోరు జయప్రదం చేయండి వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి -
వైఎస్సార్ సీపీపై అక్రమ కేసులు దుర్మార్గం
శావల్యాపురం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వ బలి తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మండలంలోని కారుమంచికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాష్ అక్రమ అరెస్ట్ నేపథ్యంలో తట్టుకోలేక తండ్రి అంకమ్మరావు(వికలాంగుడు) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. అంకమ్మరావు మృతదేహాన్ని బొల్లా సందర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం బొల్లా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈనెల 4వ తేదీ గ్రామంలో టీడీపీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించగా, సత్రం సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోగా ఈ క్రమంలో గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు పాల్పడినట్లు చెప్పారు. దీనితో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా ఇళ్లపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. టీడీపీ దాడులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపించారు. ఆ కేసులో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాశ్ను శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసే క్రమంలో అతడి తండ్రి వికలాంగుడైన అంకమ్మరావును అన్ని విధాలుగా పోలీసులు ఇబ్బందులు గురిచేశారన్నారు. దీంతో గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న అంకమ్మరావుకు మళ్లీ గుండెపోటుకు గురి కాగా వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్లు చెప్పారు. మాజీ సొసైటీ చైర్మన్ బొల్లా సాంబశివరావును కూడా అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పగ తీర్చుకోవటం మానుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు(కొండలు), నేతలు వుట్ల సుబ్బారావు, బొల్లా శ్రీనివాసరావు, సుబ్బారావు, రామాంజినేయులు, నాగేశ్వరరావు, కేతినేని ఆంజనేయలు, అప్పలనేని చిన ఆంజనేయులు, తదితరులు ఉన్నారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం ఉన్నారు. కార్యకర్త అవినాశ్ తండ్రి అంకమ్మరావుది ప్రభుత్వ హత్యే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం -
భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా మూడో మహాసభలను కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర కార్యాలయంలోని సయ్యద్ సైదా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘ జెండాను జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు ఆవిష్కరించారు. జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా అవ్వారు ప్రసాదరావు, అధ్యక్షులుగా కోట ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శిలార్ మసూద్, కోశాధికారిగా రామిశెట్టి ఆంజనేయులు ఎన్నికయ్యారు. వారికి సీఐటీయూ నాయకులు అభినందనలు తెలియచేశారు. డి.శివకుమారి, నాయకులు పాల్గొన్నారు. -
అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం
గురజాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీలతో కలిసి ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో మేలు గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు వంటివి రైతులకు సకాలంలో సరిపడా అందించారన్నారు. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ తన పాలనలో రైతులకు మేలు చేశారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కనీసం రైతులకు యూరియాను అందించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సత్వరమే న్యాయం చేసేలా అండగా వైఎస్సార్సీపీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మంగళవారం జరిగే అన్నదాత పోరులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు వి. అమరారెడ్డి, పట్టణ కన్వీనర్ కె.అన్నారావు, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా కాశీబాబు, వేముల చలమయ్య, మన్నెం ప్రసాద్, దేవండ్ల నారాయణ, వెంకట నారాయణ, మహంకాళి యఽశోద దుర్గ, కె. ఆదినారాయణ దత్తు, జక్కా సత్యనారాయణ, పరిమి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,01,300
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాంచీ స్టేషన్కు రూ.1,01,300 ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. బుద్ధిజం అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన విజయపురిసౌత్: గ్రామీణ వారసత్వం, అభి వృద్ధి కోసం భారతీయ ట్రస్ట్ సంస్థ ఆదివారం నాగార్జునసాగర్లో బుద్ధిజం అకాడమీ స్థాపించడానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. పర్యాటక శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించారు. స్థల పరిశీలన చేసిన బృందంతోపాటు రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, గురజాల ఆర్డీవో మురళి, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, తహసీల్దార్ కిరణ్, మండల సర్వేయర్, హరిత రిసార్ట్స్ యూనిట్ ఇన్చార్జి మస్తాన్రావు, నాగులవరం గ్రామ సర్వేయర్ అయ్యప్ప పాల్గొన్నారు. సజావుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఏసీ కళాశాల, టీజేపీఎస్, విజ్ఞాన్ నిరూల డిగ్రీ, పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పరిశీలించారు. ఉదయం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు హాజరు 78.2 శాతం నమోదైంది. మధ్యాహ్నం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసిన 1,492 మంది అభ్యర్థుల్లో 1,133 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,216 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 340, బ్యాంక్ కెనాల్కు 1,930, తూర్పు కాలువకు 720, పశ్చిమ కాలువకు 241, నిజాపట్నం కాలువకు 454, కొమ్మూరు కాలువకు 3,420, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 53,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల 12వ వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. యూరియా బ్లాక్ మార్కెట్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9న సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ‘అన్నదాత పోరు’ పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడంపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నదాతల పాలిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. అన్నదాతలను కూటమి ప్రభుత్వం దగాకు గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనీస చలనం లేదని విమర్శించారు. చంద్రబాబు మొద్దు నిద్రవీడాలని, రైతులు ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారన్నారు. యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రైతులకు సొసైటీల్లో యూరియా దొరకకున్నా బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక రేట్లకు ఎరువులు విక్రయిస్తున్నారన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 9న చేపట్టనున్న అన్నదాత పోరులో భాగంగా ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందిస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇంటి ముంగిటకే గతంలో సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత పోరు పేరుతో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని పట్టణం, అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ముందుగా అన్నదాత పోరు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బాసు లింగారెడ్డి, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, రాజవరపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, మర్రి సుబ్బారెడ్డి, సంకటి శ్యాంసన్, తేలుకుట్ల చంద్రమౌళి, చిలుక జైపాల్, మేడం ప్రవీణ్ రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, అచ్యుత శివప్రసాద్, యాసారపు బాబు, సయ్యద్ ఘోర, గుజర్లపూడి సతీష్, పెద్దింటి నాగేశ్వరరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, బండి మల్లిఖార్జునరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా? జగనన్న పాలనలోనే అన్నదాతల సంక్షేమం రేపు నిర్వహించనున్న అన్నదాత పోరులో భాగస్వాములు కావాలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి సత్తెనపల్లిలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ -
జాబ్ క్యాలెండర్పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్పై మాట మార్చిందని, తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత నిరుద్యోగులను పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ గా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి
మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న కార్పొరేట్ విధానాల వలన చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటిని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె చంద్రమౌలి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె శివభవన్నారాయణ, వై నాగు, జే రవి, టి హేమసుందరరావులు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాలకృష్ణ -
సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
సత్తెనపల్లి: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రూ. 64.50 లక్షలు పోగొట్టుకున్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్నగర్కు చెందిన కట్టెబోయిన కోటేశ్వరరావు అచ్చంపేట మండలం కొండూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపడంతో కోటేశ్వరరావు వారి వలలో చిక్కుకున్నాడు. మార్చి 10న వాట్సాప్ నుంచి వచ్చిన లింకును ఓపెన్ చేయటంతో ఎఫ్ 979 2025 ఫార్చ్యూన్ గేట్ అనే గ్రూపులో సభ్యుడిగా చేర్చినట్లు మెసేజ్ వచ్చింది. అలాగే ఓ మొబైల్ యాప్ను స్టాక్ మార్కెట్ కోసం డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. జూలై నుంచి ఆగస్టు 29 వరకు విడతల వారీగా రూ.10 వేల నుంచి ఆరంభమై నగదు జమ చేశారు. తన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయుని అయిన అనూష ఖాతా నుంచి, స్నేహితుడి భార్య ఖాతా నుంచి కూడా నగదు పంపారు. మొత్తం రూ. 64,50,199 బదిలీ చేశారు. నగదు పెట్టుబడి పెట్టడమే తప్ప ఒక్క పైసా కూడా లాభం రాలేదు. తాను చెల్లించిన నగదు రిఫండ్ చేయాలని కోరగా ఒక రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి చిరునామా పెట్టమని కోరగా ముంబైలో ఏంజల్ వన్ స్టాక్ బ్రోకర్ కార్యాలయం అంటూ చిరునామా ఇచ్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత అది నకిలీ స్టాక్ బ్రోకర్ సైబర్ నేరగాళ్ల ముఠాగా తేలింది. ముంబై నుంచి తొమ్మిది సెల్ ఫోన్ నెంబర్ల నుంచి సైబర్ నేరగాళ్లు వ్యవహారం నడిపి నగదు కాజేశారు. మోసపోయిన కోటేశ్వరరావు సత్తెనపల్లి పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
ఆటో కార్మికులను రోడ్డున పడేశారు
అమరావతి: సీ్త్ర శక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందని సీఐటీయూ మండల కార్యదర్శి బి.సూరిబాబు అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మండల ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులనుద్దేశించి సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఉన్నతమైన చదువులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక బ్యాంకులు ద్వారా ఫైనాన్స్ల ద్వారా ఆటోలు తీసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. నేడు పిల్లలు ఫీజులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఆటో కార్మికులకు రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు 13 నెలలుగా పూర్తయినా, ఆర్థికసాయం గురించి, ఒక్కమాటైనా మాట్లాడడం లేదన్నారు. మరోపక్క డీజిల్, పెట్రోలు ధరలు పెరిగి, నిత్యవసర వస్తువులు ధరలు కొనుగోలు చేయలేని దుస్థితిలో కార్మికులు బతుకులీడుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు మస్తాన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఎన్నికల్లో వాగ్దానాలన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ డానియేలుకు వినతిపత్రం అందజేశారు. టాటా మ్యాజిక్ యూనియన్ నాయకుడు షేక్ బుడేతో పాటుగా కోటి రవి, కోటి లింగం, నందిగం సుధాకర్, అడపాల కోటేశ్వరరావు అద్దంకి గోపి, షేక్ ఫరీద్ ప్రసాదు, వేదాంతం, సీపీఎం నాయకులు నండూరి వెంకటేశ్వరరాజు ఎస్డీ మొహీ ద్ధీన్ వలి తదితరులు పాల్గొన్నారు.అమరావతిలో ఆటో కార్మికుల నిరసన ర్యాలీ -
పింఛన్ కోసం వెళ్తుంటే ప్రాణమే పోయింది
చికిత్స పొందుతూ మృతి చెందిన ఒంటరి మహిళ నరసరావుపేట టౌన్: పింఛన్ తీసుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టూటౌన్ ఎస్ఐ లేఖ ప్రియాంక శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలం, దూళ్ళిపాళ్ల గ్రామానికి చెందిన ఉర్లగొంట కోటేశ్వరమ్మ (54) గత కొన్ని నెలలుగా నరసరావుపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఒంటరి మహిళ పింఛన్ తీసుకునేందుకు తన సోదరుడి ద్విచక్ర వాహనంపై దూళ్ళిపాళ్ల గ్రామానికి బయలుదేరింది. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వాహనం వెనుక కూర్చున్న ఆమె తూలి కింద పడింది. సంఘటనలో తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రురాలిని 108 సహాయంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నకరికల్లు: స్థానిక వంగా వెంకటరెడ్డి జెడ్పీ హైస్కూల్లో ఆట్యా–పాట్యా పల్నాడు జిల్లా జట్టు సెలక్షన్స్ ఆదివారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఉన్నం రోహిత్ జోయల్ శనివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లాలోని అన్నిపాఠశాలల నుంచి సెలక్షన్లకు హాజరుకావచ్చన్నారు. క్రీడాకారులు ఈనెల 25, 26 తేదీలలో నకరికల్లులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు చింతా పుల్లయ్య, 9866925108,జి.ఝాన్సీరాణి 99495 33234 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. గుంటూరు వెస్ట్: రైతులతోపాటు ఇతర రుణాలు ఇచ్చే క్రమంలో బ్యాంకర్లు కొంత ఉదారతతో వ్యవహరించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్లతో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులు అందుకున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు తప్పనిసరిగా మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం రుణాల యాక్షన్ ప్లాన్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్నం మహిపాల్ రెడ్డి, ఇండియన్ బ్యాంక్ డీజీఎం గౌరీ శంకర్, ఆర్బీ ఎల్డీఓ గిరిధర్, నాబార్డ్ డీడీఎం శరత్ బాబు పాల్గొన్నారు. మేడికొండూరు : గుంటూరు జిల్లా షూటింగ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన మేడికొండూరు మండలం కొరప్రాడులోని క్రీడా ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అనిల్ తెలిపారు. -
రైతులకు మేలు చేసేలా జీఎస్టీలో మార్పుల్లేవు
నగరంపాలెం: రైతులకు మేలు చేసేలా జీఎస్టీలో మార్పుల్లేవని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నాటవర్ కూడలిలోని ఐసీసీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ యువత, కార్మికులకు కూడా జీఎస్టీలో శ్లాబుల మార్పు ఉపయోగపడేలా లేదన్నారు. పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ తగ్గించాలని అన్నారు. ఆటోలు, ఫెర్టిలైజర్పై కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలకు సంబంధించి కాస్మోటిక్స్, దుస్తులు, నగలపై పన్నులు విధించరాదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రివర్స్ ట్యాక్స్లు విధిస్తున్నారని, అది సరైందికాదని చెప్పారు. ఒకట్రెండు రోజులుగా కిరాణా వస్తువుల దుకాణాల ఎదుట స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలనే బోర్డులు ఏర్పాటు మంచిదని అన్నారు. మిగతా వ్యాపారస్తులు కూడా ప్రయత్నించాలని చెప్పారు. భారీ మాల్స్కు అనుమతి ఇవ్వవద్దని అన్నారు. పట్టణాల్లో నెలకొల్పినా మున్సిపల్, పంచాయతీల పరిధిలో వద్దని కోరారు. -
బీచ్ ఫెస్టివల్కు అందరు సహకరించాలి
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో శనివారం రియల్ ఎస్టేట్, బంగారు నగల వ్యాపారులు, బీచ్ రిసార్ట్ యాజమాన్యం, రైస్ మిల్లర్స్, పెట్రోల్ బంక్, ఎరువులు, విత్తనాల వ్యాపార సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26, 27, 28 తేదీలలో సూర్యలంక, రామాపురం బీచ్లలో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాలు తిలకించే విధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ వంతు ఆర్థిక సహకారం అందజేయాలని కలెక్టర్ సంస్థల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మరాజు, ఎం.ఎం.కొండయ్య, ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
చీరాల వాసికి అరుదైన అవకాశం
చీరాలటౌన్: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 12 వరకు జరగనున్న ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంపునకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్లకు ఏఎన్ఓ మేడికొండ రాజేష్బాబు నాయకత్వం వహించనున్నారు. ఈయన చీరాల వాసి కావడంతో ఎన్సీసీ క్యాడెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 ఆంధ్రా బెటాలియన్కు చెందిన అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్బాబు చీరాల ప్రసాద్నగర్ నివాసి. ఎంబీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్తోపాటు ఏఎన్వోగా నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న రాజేష్బాబు ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంపులో ఏపీ, టీజీ రాష్ట్రాల డైరెక్టరేట్ల తరఫున కాంటిజెంట్ కమాండర్గా ఎంపిక చేశారు. చీరాల వీఆర్ఎస్ అండ్వైఆర్ఎన్ కళాశాలలో ఎన్సీసీలో శిక్షణ పొంది పలు క్యాంపుల్లో పాల్గొనడంతోపాటు ఎన్సీసీ అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈనెల 12 వరకు న్యూ ఢిల్లీలో జరిగే ఏఐటీయూసీ క్యాంపునకు దేశంలోని 17 డైరెక్టరేట్లు పాల్గొననున్నాయి. జాతీయ వేదికపై రెండు రాష్ట్రాలకు కాంటిజెంట్ కమాండర్గా ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీసీ క్యాంపునకు నేతృత్వం వహించనున్న రాజేష్బాబు -
మాచర్ల దోపిడీ కేసు ఛేదన
నరసరావుపేట రూరల్: మాచర్లలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.5లక్షల నగదుతో పాటు రెండు కార్లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్తో కలిసి మీడియాకు తెలియజేశారు. మాచర్లలో ఈనెల ఒకటో తేదీన దోపిడీ జరిగింది. కారులో వచ్చిన దుండగులు మంగళగిరికి చెందిన అవ్వారు మహేష్బాబును కత్తులతో బెదిరించి రూ.5లక్షలు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీఐ పి.ప్రభాకరరావు, ఎస్ఐ వెంకట్రావులు తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో పాటు ఘటనా స్థలంలోని భౌతిక ఆధారాలు పరిశీలించి నిందితులను గుర్తించారు. తొమ్మిది మంది అరెస్ట్.. దోపిడీ కేసులో మంగళగిరి, గుంటూరుకు చెందిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో మహిళ కూడా ఉంది. మంగళగిరి దీన్దయాల్నగర్కు చెందిన కర్నె రాము ప్రధాన నిందితుడు కాగా గుంటూరుకు చెందిన ఫణీంద్రపు మహిమ క్రాంతి, మోదుకూరి ప్రసన్నబాబు, వల్లూరి శ్రీరామ్, ఫణిధరపు రాధిక, ఎటుకులపాటి నాగరాజు, సాగిరి వెంకట శివరామకృష్ణ, కొల్లిమర్ల లక్ష్మీబాబు, అందరేకుల లీలా నాగ లోకేష్లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిపై గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి న్యామమూర్తి ఎదుట హాజరుపరిచారు. పథకం ప్రకారం దోపిడీ.. మంగళగిరిలోని లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ కంపెనీ బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారు వస్తువులను కొనుగోలు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ప్రధాన నిందితుడు కర్నె రాము గుమస్తాగా పనిచేస్తున్నాడు. మిగిలిన నిందితులతో రాము ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం రచించాడు. మాచర్లలో ముత్తూట్ ఫైనాన్స్లో 62 గ్రాముల బంగారం ఉందని దీనిని విడిపించాలని లక్ష్మీశ్రీనివాస ట్రేడర్స్ యజమానికి గత నెల 31వ తేదీన నిందితురాలు ఫణిధరపు రాధిక చేత ఫోన్ చేయించాడు. దీంతో మాచర్ల వెళ్లి నగదు చెల్లించి బంగారాన్ని విడిపించుకురావాలని ఉద్యోగియైన అవ్వారు మహేష్బాబుకు యజమాని సూచించాడు. దీంతో రూ.5లక్షల నగదుతో ద్విచక్రవాహనంపై ఈనెల ఒకటో తేదీన మాచర్ల వెళ్లిన మహేష్బాబును నాగార్జునసాగర్ రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి రమ్మని నిందితులు చెప్పారు. అక్కడికి వెళ్లిన మహేష్బాబుపై నిందితులు తొమ్మిదిమంది దాడిచేసి గాయపరిచి నగదు బ్యాగ్తో పాటు సెల్ఫోన్తో పరారయ్యారు. కేసును ఐదు రోజుల్లో చేధించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐతో పాటు హెడ్కానిస్టేబుళ్లు జి.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, టెక్నికల్ టీం సభ్యులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెం ఘటన
గుంటూరురూరల్:తురకపాలెం గ్రామంలో పలువు రు కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆరోపించారు. శనివారం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులర్పించారు. ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని భరోసా కల్పించారు. బలసాని మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు ప్రజలకు అందటం లేదన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. చిన్నపాటి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు బెల్ట్ షాపులు వెలిశాయని పేర్కొన్నారు. ఇంటి దగ్గరే మద్యం దొరుకుతుండటంతో అందరూ వాటికి అలవాటు అవుతారన్నారు. మెరుగైన వైద్యసేవలు కీలకం కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం లోపం, అక్రమ మద్యం విక్రయ దుకాణాలు వంటి వాటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. స్పెషలిస్ట్ వైద్యులతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటిని మినరల్ వాటర్ను అందించాలన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, మండల కన్వీనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, పిల్లి మేరి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, మెట్టు వెంకటప్పారెడ్డి, దారం అశోక్కుమార్, వెంకటరావు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
సత్తెనపల్లి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యకు కారణమవుతున్న వలంటీర్ విధులను బహిష్కరిస్తూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైఠాయించి శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు చిలుక ప్రదీప్ మాట్లాడుతూ గతంలో వలంటీర్లను క్లస్టర్లుగా విభజించి వారి సేవలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థ లేనందున ఆ సేవలను సచివాలయ ఉద్యోగుల చేత చేయించటం సరైనది కాదన్నారు. వలంటీర్ల విధులను తామెందుకు నిర్వహించాలని, తక్షణమే ఆ సేవలను సచివాలయ ఉద్యోగులకు కేటాయించటం మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సెక్రటరీ గౌతమి, మహిళా పోలీసులు జిల్లా ప్రెసిడెంట్ దామర్ల నలిని, తిరుమల లక్ష్మి గౌరవ సలహాదారుడు జి. రవిరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బూరే సైదా, జిల్లా అధ్యక్షుడు బి. కొండలరావు, సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. -
సూర్యఘర్ ఇనస్టలేషన్ పూర్తిచేయండి
నరసరావుపేట: జిల్లాలో పీఎం సూర్యఘర్ ద్వారా నమోదు చేసుకున్న 90 వేలు కుటుంబాలకు నెలరోజుల్లోగా సౌర ప్యానెళ్లు ఇన్స్టాల్ చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్లకు వెండార్ల ఎంపిక వెంటనే పూర్తిచేయాలన్నారు. గ్రామానికి వంద కుటుంబాలు లక్ష్యం చేసుకుని, ఒక్కో గ్రామాన్ని ఒక్కో వెండర్కు అప్పగించడం ద్వారా పనులు పూర్తిచేయాలన్నారు. శనివారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ పథకంపై విద్యుత్ శాఖ అధికారులు – వెండర్స్తో ఎంపీ, కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ సూర్యఘర్ పథకానికి బ్యాంకు రుణం కోరే ప్రజలకు సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలివ్వాలన్నారు. సరైన రిజిస్ట్రేషన్లు లేని ఇళ్లకు ఇంటి పన్ను రసీదు ఆధారంగా రుణం మంజూరు చేయాలన్నారు. డీసీఆర్బీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, విద్యుత్ శాఖ అధికారి డాక్టర్. కె.విజయకుమార్, వెండార్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
తురకపాలెం మరణాలు ప్రభుత్వ హత్యలే
లక్ష్మీపురం: ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ప్రజల మరణాలు ప్రభుత్వ హత్యలేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు ఎక్కువగా వారి కుటుంబ పోషకులను కోల్పోయారని తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందనే విషయానికి ఈ ఘటన తార్కాణం అన్నారు. మృతుల కుటుంబంకు రూ.25 లక్షలు పరిహారంగా చెల్లించాలన్నారు. జిల్లా కార్యదర్శి జె.నవీన్ ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు లూదర్ పాల్, జె.వెంకటస్వామి, సీఐటీయూ గుంటూరు నగర కార్యదర్శి ముత్యాలరావు, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. తురకపాలెం బాధితులకు రూ.10 లక్షలివ్వాలి గుంటూరు రూరల్: తురకపాలెంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 40 మందికిపైగా మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని జనచైతన్య వేదిక, రేట్ పేయర్స్ అసోసియేషన్, అవగాహన, మానవత, నేస్తం, కొవిడ్ ఫైటర్స్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తదితర పౌర సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పౌర సంస్థల ప్రతినిధులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ శనివారం తురకపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించింది. అదుపులోకి పరిస్థితులు గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం వైద్య ఆరోగ్య ఇతర సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 895 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 2,850 మందికి ఉపాహారం, 3500 మందికి మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ట్యాంకర్స్ ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. -
చంద్రగ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత
దాచేపల్లి : నీలకంఠేశ్వర స్వామిని తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. దాచేపల్లి మండలం కాట్రపాడు సమీపంలో కృష్ణా నది ఒడ్డున నీలకంఠేశ్వర స్వామి విగ్రహాన్ని గత కృష్ణా పుష్కరాల సందర్భంగా డాక్టర్ కనుమూరి క్రాంతి కుమార్, డాక్టర్ విక్రాంత్ కుటుంబ సభ్యులు ప్రతిష్టించారు. శనివారం నదిలో వరద పెరిగి నీలకంఠేశ్వర విగ్రహాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తే ఈ విగ్రహం పైనుంచి నీరు ప్రవహిస్తుంటాయి. అమరావతి: గుంటూరు, పల్నాడు జిల్లాల సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తొమ్మిది వినాయక విగ్రహాలను శనివారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో వైభవంగా నిమజ్జనం చేశారు. గత తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిది చోట్ల నిర్వహించుకుని అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఇలా ప్రతి ఏటా నిర్వహిస్తామని అమరావతి సత్యసాయి సేవా సమితి కో–ఆర్డినేటర్ సీహెచ్ జాజిబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సత్యసాయి శాంతిసుధ , గుంటూరు బైపాస్ రోడ్డులోని ఆధ్యాత్మిక సామ్రాజ్యం నుంచి దుగ్గిరాల, తెనాలి, మోదుకూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, అచ్చంపేట, అమరావతి సాయిబాబా మందిరంలో, త్రిశక్తిపీఠంలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న తొమ్మిది ప్రాంతాలలోని తొమ్మిది విగ్రహాలను తొలుత వైభవంగా ఊరేగించి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు. తెనాలి: వైకుంఠపురంలోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేయనున్నట్టు సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామి, అమ్మవారలకు మహానివేదన, తదుపరి అవసర నివేదన సమర్పించిన అనంతరం ఆలయం మూసివేస్తామని తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం దేవాలయంలో సంప్రోక్షణలు జరిపించి ఉదయం 10 గంటల నుంచి దర్శనం, పూజలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. అద్దంకిరూరల్: ఆర్టీఐ త్వరలో ప్రారంభించనున్న వెబ్ పోర్టల్తో వివిధ శాఖల సమాచారాన్ని సులువుగా పొందవచ్చని రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా తెలిపారు. శనివారం అద్దంకి వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో రూ.10 స్టాంపుతో లెటర్ ద్వారా మనకి కావాల్సిన సమాచారాన్ని 30 రోజుల్లో తీసుకోవవచ్చన్నారు. -
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాయడం చంద్రబాబునాయుడు నైజం అని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబునాయుడు పాలన అంటేనే ప్రైవేటు వ్యవస్థకి కేంద్ర బిందువని అన్నారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగరా అని ప్రశ్నించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలియజేశారు. వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారపక్షంలో ఉండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం ఆలోచనకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చోరీలు
నగరంపాలెం: పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను పగులకొట్టి నగదు, నగలు, ల్యాప్ట్యాప్లు దొంగలించే పాత నేరస్తుడ్ని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. గడిచిన రెండు నెలలుగా కార్ల అద్దాలను పగులకొట్టి నగలు, నగదు, ల్యాప్ట్యాప్లను తస్కరిస్తున్నారు. వరుస ఘటనలపై బాధితులు ఆయా పోలీస్స్టేషన్లల్లో ఫిర్యాదులు చేశారు. ఈ తరహా సంఘటనలు నల్లపాడు పీఎస్ పరిధిలో నాలుగు, నగరంపాలెం పీఎస్ పరిధిలో మూడు జరిగాయి. దీంతో సీసీఎస్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల (పీఎస్) పోలీస్ అధికార, సిబ్బందిని అప్రమత్తం చేశారు. చిన్న క్లూ ఆధారంగా చేసుకుని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, నిందితుడిని గుర్తించామని ఎస్పీ చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామ వాసి 33 ఏళ్ల జంగం బాజిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. నేరం రుజువుకావడంతో అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్ట్యాప్లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్లపాడు పీఎస్ పరిధిలో– 4, నగరంపాలెం పీఎస్ పరిధిలో– 3, పెదకాకాని పీఎస్, పాత గుంటూరు పీఎస్, అరండల్పేట పీఎస్ పరిధిలో ఒక్కొక్క కేసు నిందితుడిపై నమోదైందని వివరించారు. రౌడీషీట్ కూడా.. 2022లో పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో బాజీ నిందితుడని, రౌడీషీట్ కూడా ఉందని ఎస్పీ తెలిపారు. చోరీలు చేసే విధానాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాడని చెప్పారు. చేతులకు గ్లౌజ్లు, తలకు హెల్మెట్ ధరించి, గులక రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేసేవాడని విచారణలో తెలిసినట్లు వివరించారు. చాకచక్యంగా వరుస కేసులను ఛేదించిన నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్, సీసీఎస్ సీఐ అనురాధ, ఎస్ఐ చల్ల వాసు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, భిక్షునాయక్, మస్తాన్వలిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో దక్షిణ సబ్ డివిజనల్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్ పాల్గొన్నారు. -
అప్పాపురం ఛానల్లో మునిగి యువకుడు మృతి
చేబ్రోలు: వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వచ్చి అప్పాపురం ఛానల్లో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి యువకుడు మృతిచెందిన సంఘటన చేబ్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నల్లచెరువు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం సైలేష్ (18) తన స్నేహితులతో కలిసి గురువారం రాత్రి గుంటూరు నుంచి చేబ్రోలు కొమ్మమూరు చానల్లో నిమిజ్జనం కోసం బయలుదేరారు. మార్గంమధ్యలో అప్పాపురం ఛానల్ వద్ద మృతుడు సైలేష్ అతనితోపాటు మరో ఇరువురు స్నేహితులు ఆగి ఛానల్లో ఈత కోసం దిగారు. కొంత సేపు తరువాత అతని స్నేహితులు వరుణ్, షన్నులు సైలేష్ అప్పాపురం ఛానల్లో గల్లంతైన విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. రాత్రి సమయంలో గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఛానల్ నీటి పరిమాణం తగ్గించి ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టడంతో మునిగిపోయిన కొంతదూరంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి
నరసరావుపేట: గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.8,850 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు చర్యలు తీసుకోగా అందులో ఐదింటిని పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కౌన్సిల్కు సీట్లు అవసరం లేదని లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. ఆయన పాలన బినామీల ప్రయోజనాల కోసమే అన్నట్లుగా సాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు ఈ పాపానికి వడిగడుతున్నాడన్నారు. ఈ జీఓను వెనక్కి తీసుకోకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటపాటి మణికంఠారెడ్డి, బూదాల కల్యాణ్, ఉప్పతోళ్ల వేణుమాధవ్, బంటి, షోయబ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకుల డిమాండ్ -
యువత భుజస్కంధాలపై భారత్ భవిత
గుంటూరు ఎడ్యుకేషన్: భారత్ ఉజ్వల భవిత యువత భుజస్కంధాలపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నలంద, తక్షశిల వంటి విశ్వ విద్యాలయాల ద్వారా ప్రపంచ మానవాళికి జ్ఞానమందించిన ఘనమైన మన భారత సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేవుడిపై ఎంత భక్తి, గౌరవం ఉంటాయో, జ్ఞానాన్ని అందించే గురువుపై కూడా అంతే శ్రద్ధాభక్తులు ఉండాలని చెప్పారు. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ మనం నేర్చుకున్న జ్ఞానం, వైపుణ్యాలను సరైన మార్గంలో నడింపిచేవారే గురువని అన్నారు. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్లబోతు మురళి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఏ వృత్తిలో రాణించాలన్న గురువుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు జీవితంలో ఎంతో సాధించిన ప్రేరణాత్మకమైన వ్యక్తులను వారికి పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వారి అనుభవసారాన్ని వినమ్రంగా గ్రహించి లక్ష్యసాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. తొలుత అతిథుల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ మురళీలను భాష్యం ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. అనంతరం అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధ్యక్షులుగా కొమ్ము చంద్రశేఖర్బాబు (మాచర్ల), ఉపాధ్యక్షులుగా పెద్దింటి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), దావలి పెదవెంకటేశ్వర్లు (పెదకూరపాడు), ప్రధాన కార్యదర్శులుగా పులిమెల మాణిక్యం (మాచర్ల), సాతులూరి రమేష్ (గురజాల), బేతం గాబ్రియేలు(వినుకొండ), పంగులూరి విజయకుమార్ (నరసరావుపేట), పండుల బుల్లెబ్బాయ్ (చిలకలూరిపేట), కార్యదర్శులుగా తంబాటి మల్లయ్య (మాచర్ల), కాలే మాణిక్యాలరావు (గురజాల), కొచ్చర్ల రాజారత్నం (చిలకలూరిపేట), కిన్నెర దేవయ్య (వినుకొండ), నేలటూరి సురేష్ (నరసరావుపేట), యనమల సింగయ్య (సత్తెనపల్లి), కంభంపాటి భాస్కరరావు (మాచర్ల)లను నియమించారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా తంగిరాల మేరిబాబు, బత్తుల సాగర్బాబు (మాచర్ల), పల్లమిశాల కిషోర్, కోట వెంకటరావు(వినుకొండ), బందెల వెంకటరావు, చింతిరాల నాగార్జున నటరాజ్ (నరసరావుపేట), ప్రత్తిపాటి కోటేశ్వరరావు, దేపంగి మరియబాబు (సత్తెనపల్లి), తుమ్మలగుంట రమేష్బాబు, యామర్తి రవి (చిలకలూరిపేట), మందడపు నాగయ్య, చిలకల శ్రీకాంత్, కంపెర్ల రోశయ్య (పెదకూరపాడు), చల్లగుండ్ల స్వామి, బండ్ల ఏసుపాదం (గురజాల) నియమితులయ్యారు. -
వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం బాపట్ల: బీచ్ ఫెస్టివల్ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిర్వహణపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సూర్యలంక, రామాపురంలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫెడ్ లైట్ల మధ్య వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలా జరపాలని ఆయన సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం 100 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలుగు సినీ రంగం నుంచి కళాకారులను పిలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో సరదాగా ఉండడానికి జబర్దస్త్ బృందాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రసిద్ధ గాయకులతో పాటు సినీ రంగ నటులు, ప్రముఖుల సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. డాన్సర్లు, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతంలో బోట్ల ప్రదర్శన, స్పీడ్ బోట్లు, స్పోర్డ్స్ రైడర్స్, గుర్రాలు, ఒంటెలు ప్రదర్శన ఉంచాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. 350 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేలాదిమంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డెప్యూటీ కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పర్యటకశాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పాల్గొన్నారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు. గుండెపోటుతో వ్యక్తిమృతి బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్పార్టీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించారు. పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర యువతలో నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి, ప్రపంచ ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు గాను నియమితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (అంతర్జాతీయ నైపుణ్య, ఉద్యోగ కల్పన) సీతాశర్మతో కలసి శుక్రవారం యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ గురించి సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ రావెల నవీన్ బృందానికి వివరించారు. సీతాశర్మ మాట్లాడుతూ జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం గల నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. నిర్మాణం, ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక వంటి రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. ఇండో జర్మన్ సమష్టి కృషితో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ నియామకాలు అందించవచ్చని సూచించారు. -
రాష్ట్రంలో అతిపెద్ద సంఘం ఏపీ ఎన్జీజీవో
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గం, అన్నీ తాలూకా కార్యవర్గ సభ్యులతో స్థానిక ఎన్జీజీవో హోంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి రమణలు కొత్త జిల్లాల పునర్విభజన సందర్భంగా నూతన ఆడహాక్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశం శుక్రవారం ఎన్జీవో రిక్రియేషన్ హాలులో జరిగింది. సమావేశానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తమ సంఘం 205 తాలూకాలతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ సంఘాలతో కలిసి అతిపెద్ద జేఏసీ సంఘంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ సంఘాన్ని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్లు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలు సాధించడంలో తాము శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. ఏఎన్ఎంలు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పదోన్నతి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అడహాక్ కమిటీ చైర్మన్గా ఎం.రామకృష్ణ, కన్వీనర్ కే.నాగేశ్వరరావు, ట్రెజరర్ బ్రహ్మహేశ్వరరావు, సభ్యులు రామయ్య, అప్పారావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరిగి నవంబర్ నాటికి ఏ.పీ ఎన్జీజివో సంఘ పల్నాడు జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు జగదీష్, రంజిత్ నాయుడు, రామ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, ఏఐజిఎఫ్ మహిళ విభాగ కన్వీనర్ రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్, జిల్లా నాయకులు సుకుమార్, కూరాకుల శ్రీనివాసరావు, శ్రీవాణి, కృష్ణకిషోర్, సయ్యద్ జానీబాషా, విజయ్, విజయలక్ష్మి, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎన్జీవో నాయకులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. విజయ్కుమార్కు ఆర్థిక సాయం గుంటూరు జీజీహెచ్ కాంట్రాక్టు మేల్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న వి.విజయ్కుమార్ అమెరికాలో అక్టోబరులో జరగనున్న వరల్డ్కప్ పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనేపథ్యంలో శుక్రవారం గుంటూరులోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ చేతుల మీదుగా జిల్లా నేతలు విజయకుమార్కు రూ.10వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రటరీ శ్యామ్సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ -
ఇరువర్గాలపై కేసులు నమోదు
శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషనులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ను వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్రావు పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు నిఘా ఉంచామన్నారు. ఆయనతోపాటు రైటరు షేక్ బాషా, ఎస్బీ కానిస్టేబుల్ రమేష్, శివ పోలీసు సిబ్బంది ఉన్నారు. -
రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వం
నరసరావుపేట: రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన అన్ని రైతు కూలీ, ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేసే ఏకై క పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి సకాలంలో ఎరువులు సరఫరా చేశామని తెలిపారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ధాన్యానికి బస్తాకు రూ.3 వేలు, మిర్చికి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. సర్కార్ ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయలేదని అన్నారు. ధాన్యం, కందులు, మిర్చి, పత్తికి గిట్టుబాటు ధర లేదని అన్నారు. అప్రమత్తం చేసినా ఫలితం లేదు యూరియా రైతులకు అందటం లేదని గతంలో తాము కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒకటి, రెండు కట్టలు అందజేస్తున్నారని అన్నారు. కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులు యూరియా సరిపడా ఉందని చెబుతున్నారని, సరిపడా ఉంటే ఎందుకు నియంత్రణ చేసి ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎకరానికి ఆరు కట్టలు అవసరమని అన్నారు. పల్నాడులో గతేడాది 82,000 హెక్టార్లలో వ్యవసాయం సాగుచేస్తే ఈ ఏడాది దాదాపు 97వేలు నుంచి ఒక లక్ష హెక్టార్లలో సాగుచేశారని, గతేడాది లెక్కల ప్రకారం 36 వేల టన్నులు అవసరమైతే ఇప్పటివరకు 34వేల టన్నులు మాత్రమే ఇచ్చారని, ఇంకా 18 వేల హెక్టార్లకు అదనంగా యూరియా కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు నిజమైన రైతుకి యూరియా అందించకుండా బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. యూరియా బస్తా రూ.266లకు విక్రయించాల్సి వుండగా బ్లాక్లో రూ.400 నుంచి రూ.460లకు అమ్ముతున్నారని చెప్పారు. యూరియా అందుబాటులో లేదని దుష్ప్రచారం చేస్తున్నామని మాపై కేసులు పెట్టాలని ఎస్పీ మాట్లాడుతున్నారని, ఈనాడులో యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడుతున్నారని ఒక ఆర్టికల్ రాశారని మరి వారిపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో టీడీపీ నాయకులు సంతకం పెడితేనే రైతుకు యూరియా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ దుకాణాల యజమానులు షరతులు పెడుతున్నారని, తక్షణమే విజిలెన్స్, అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షణ చేసి నియంత్రించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ పాల్గొన్నారు. -
తురకపాలెంలో వరుస మరణాలపై పరిశీలన
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్ను పరిశీలించారు. వైద్య సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని చెప్పారు. మెలియాయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి అని, దాని వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయని వివరించారు. యాంటీబయాటిక్ ద్వారా జబ్బు తగ్గించవచ్చని చెప్పారు. నాలుగైదు రకాలు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. కేవలం తాగు నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించదని, గాలి, నీరు, మట్టి తేమ స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాపిస్తుందని వివరించారు. అరుదైన వ్యాధి కాబట్టే గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, పరీక్షల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. -
మరణాలపై వీడని మిస్టరీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు / గుంటూరు మెడికల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. రాష్ట్ర ప్రజ్రాప్రతినిధులు సైతం గ్రామ బాట పట్టారు. మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా.. ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. మేమున్నామంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాందోళనలు రవ్వంత కూడా తొలగిపోలేదు. కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, అధికార యంత్రాంగం నిద్రమత్తులో తూలుతుండటంతో గ్రామం వల్లకాడును తలపిస్తోంది. భిన్న ప్రకటనలతో గందరగోళం మరణాలకు ఎప్పుడు పుల్స్టాప్ ? రెండు నెలలుగా గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. రెండు నెలల అనంతరం కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యాధికి గల కారణాలు, అందుకు అందుబాటులో ఉన్న చికిత్సలు, సదరు చికిత్సలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేటతెల్లంగా కనిపించే వరకు తురకపాలెం గ్రామస్తులు నిద్రపోయే పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లిప్తత గ్రామంలో ఏదైనా విపత్కర పరిస్థితులు తక్షణ కర్తవ్యంగా జిల్లా వైద్య అధికారులు జరుగుతున్న సంఘటనలపై జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసి, అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మరణాల గురించి మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వరకు చలనం లేదు. విపత్తులు అంచనాలు వేసేందుకు ఐడీఎస్పీ విభాగం ప్రత్యేకంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉంది. సదరు విభాగం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం వల్లే రెండు నెలలుగా గ్రామం వల్లకాడుగా మారింది. గుంటూరు వైద్య కళాశాల ఎస్పీఎం వైద్య విభాగం సైతం విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు గ్రామాలకు వెళ్లి వ్యాధులకు కారణాలు, మరణాలకు కారణాలు విశ్లేషించాలి. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించి, మరణాలు, వ్యాధుల కట్టడికి కృషి చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది. ఎస్పీఎం వైద్య విభాగం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం వల్లే నేడు ఓ చిన్న గ్రామం రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు నిలయంగా మారింది. లక్షలాది మంది ప్రజల్లో భయాందోళనకు కారణంగా నిలిచింది. -
● ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ● ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులదే నరసరావుపేట ఈస్ట్: సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత గురువులపైన ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాష్నగర్లోని టౌన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు మాట్లాడుతూ మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనలో నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులలో పరిశీలనాత్మక, పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందించేలా గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. విద్యారంగానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ అవసరం జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ విద్యార్థి జీవితాన్ని పాఠశాల స్థాయి ఉపాధ్యాయుడు ప్రభావితం చేస్తారని తెలిపారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీసం పదాలు రాయలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు ఎందుకు వెనుకబడి ఉంటున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కె.విజయ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిని సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. -
జిల్లాలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు
నరసరావుపేట రూరల్: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు చెప్పారు. నరసరావుపేటలోని పలు ఎరువుల దుకాణాలు, జీడీసీఎంఎస్ షాఫులను గురువారం ఆయన తనిఖీ చేశారు. జగ్గారావు మాట్లాడుతూ రైతులు అనవసరంగా రసాయనిక ఎరువులు, యూరియాను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని తెలిపారు. రసాయనిక ఎరువులు కొన్న రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలిపారు. బిల్లులు ఇవ్వని ఎరువుల డీలర్లపై రసాయనిక ఎరువుల చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు అమ్మిన వెంటనే ఈ–పాస్ మిషన్ ద్వారా స్టాక్ అప్డేట్ చేయాలని డీలర్లను ఆదేశించారు. యూరియాను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఐ.శాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి కే.బ్రహ్మయ్య పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు -
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నరసరావుపేట: గురజాల మాజీ శాసన సభ్యులు కాసు మహేష్రెడ్డిపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు తీవ్ర స్థాయికి చేరాయని, ఇది సమాజానికి మంచిది కాదని అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ● బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి ఈ రోజు మీరు కర్రలతో మా మీద దాడులు చేస్తున్నారు, రేపు మా వాళ్లు గొడ్డళ్లతో వస్తారని ఆ పార్టీ దౌర్జన్యాలను నియంత్రించే ఉద్దేశంతో కాసు అన్నారని చెప్పారు. అంతమాత్రానికే అతనిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని మాట్లాడిన పవన్ కల్యాణ్పై, మంత్రి నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో బండ బూతులు మాట్లాడారని వారిపై ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. ● పోలీసులకు ప్రమోషన్లు రావడం లేదని రాసిన సాక్షి ఎడిటర్పై అక్రమంగా కేసు పెట్టారని, ఇది దారుణమైన విషయం అన్నారు. ● రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా టీడీపీకి చెందిన ఒక వ్యక్తిపై కుంకుమ పడితే, ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకా ఏమైనా ఉందా అని జిల్లా ఎస్పీ ఆలోచన చేయాలన్నారు. ● ఆ కేసు పెట్టిన వ్యక్తి రెండు అడుగులు రోడ్డు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశాడన్నారు. కుంకుమ పడినందుకు కేసులు బుక్ చేస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ● ఇటీవల తమ పార్టీకి చెందిన వరవకట్ట బుజ్జి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తే ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని 16 మందిపై కేసు బుక్ చేశారన్నారు. ● నిన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ మోర్ సెంటర్లో నడిరోడ్డు మీద కేక్ కట్చేసినా అనిపై కేసు ఎందుకు బుక్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ● యూరియా దొరకట్లేదని మాట్లాడితే కేసులు పెట్టమని పోలీసు అధికారులు చెప్పటం దారుణమైన విషయం అన్నారు. ● ఇప్పటి వరకు కాసుపై గురజాల నియోజకవర్గానికి సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని, ఇంకా ఎన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేశారో తెలియట్లేదని, తక్షణమే సుమోటోగా ఆ అక్రమ కేసులను విత్డ్రా చేసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసుపై నమోదు చేసిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి వినాయక విగ్రహం ఊరేగింపులో కుంకుమ పడిందని ఎనిమిది మందిపై కేసు పెడతారా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆగ్రహం -
యడవల్లి దళితులకు న్యాయం చేయాలి
●కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ ●జాయింట్ కలెక్టర్కు వినతి నరసరావుపేట: చిలకలూరిపేట మండలం యడవల్లి దళిత రైతుల నుంచి ప్రభుత్వం కారుచౌకగా తీసుకున్న విలువైన భూములపై హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేను కలిసి హైకోర్టు ఉత్తర్వు కాపీలను అందజేసి కోర్టు ఆదేశాల మేరకు యడవల్లి దళిత రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని కోరారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులు కలెక్టర్కు పెట్టుకున్న అర్జీపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. యడవల్లి గ్రామంలో 1975లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటి జిల్లా కలెక్టర్ చంద్రయ్య భూమిలేని 120 దళిత, గిరిజన కుటుంబాలకు 416 ఎకరాలు బీడు భూమిని అసైన్న్డ్ చేసి వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ పేరిట రిజిస్టర్చేసి పంపిణీ చేశారన్నారు. వాటిని 50 ఏళ్ల నుంచి లిఫ్ట్ ద్వారా ఏడాదికి వరి, ఆరుతడి రెండు పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. భూములలో గ్రానైట్ నిక్షేపాల నెపంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. దళిత రైతులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఎకరాకు రూ.8.33లక్షల పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుందన్నారు. భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతపు భూ సేకరణ జరిపారన్నారు. అప్పటి 120 మంది లబ్ధిదారులకుగాను ప్రస్తుతం వారి వారసులు 244 మందిగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. నాటి నుంచి నేటివరకు పేద రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చట్టప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎకరాకు రూ.40లక్షల పరిహారం ఇవ్వాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది వి.రవీందర్ కోర్టులో వాదనలు వినిపించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటస్వామి, పెద్దిరాజు, యడవల్లి రైతులు పాల్గొన్నారు. -
యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు
దాచేపల్లి: యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో యూరియా కొరత అధికంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాపారులు ఏపీ నుంచి యూరియా బస్తాలను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో యూరియా ఇలా తరలిపోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా బుధవారం రాత్రి పొందుగల, తాంగేడ సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యూరియా తెలంగాణకు తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. పూర్తిస్థాయిలో ఏపీలోనే రైతులు వినియోగించాలని కోరారు. అక్రమంగా తెలంగాణకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఏవో వెంకటేష్, ఆర్ఐ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పంటలపై పరిశోధన, విస్తరణ దిశగా రోడ్ మ్యాప్
గుంటూరు రూరల్: లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం హైదరాబాద్కు చెందిన జాతీయ నూనె గింజల సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ప్రాముఖ్య అంశాల గుర్తింపుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాపులో రాష్టంలోని వివిధ వ్యవసాయ జాతీయ పరిఽశోధన సంస్థల ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థలు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. వర్క్షాప్ నోడల్ ఆఫీసర్ ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కె మధుర్ మాట్లాడుతూ వివిధ పంటల్లో ముఖ్యమైన పరిశోధన, విస్తరణ, అంశాలను గుర్తించి వాటిని సాధించేందుకు అవసరమైన ప్రణాళికల కోసం రోడ్ మ్యాప్ రూపొందించాల్సి ఉందన్నారు. ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి , ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సురేష్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ మధుమతి, డాక్టర్ పీవి సత్యనారాయణ, డాక్టర్ ఎ.లత పాల్గొన్నారు. -
యూరియా అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి రిమాండ్
–జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట: యూరియా అక్రమాలపై జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు గురువారం వెల్లడించారు. పొందుగల చెక్పోస్టు వద్ద నిబంధనలకు విరుద్ధంగా యూరియాను తెలంగాణకు తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ నెల 2వ తేదీన పొందుగల చెక్పోస్టు వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీలో 630 కేజీల యూరియాను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ నల్గొండ జిల్లా వాసులు పులి పిచ్చయ్య, బుక్యా రవి పట్టుబడ్డారన్నారు. ఎరువుల రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. వ్యక్తిగత వాహనాలను ఇతరులు ఎరువుల రవాణాకు వినియోగించకుండా జాగ్రత్త పడాలని పౌరులకు సూచించారు. చినగంజాం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా చినగంజాం మండలానికి చెందిన ఇరువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాజుబంగారుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిషు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రావిపాటి శివ వెంకట పోతురాజు, ఆవులదొడ్డి గొల్లపాలెంలోని పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కడలి సుజాతలు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. కోడూరు: స్వామిజీల వేషధారణలో భిక్షాటనకు వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వారిని కోడూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్ఐ చాణక్య కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బచ్చు వెంకట పున్నయ్య ఇంటికి నలుగురు వ్యక్తులు గురువారం స్వామిజీల వేషధారణ భిక్షాటనకు వచ్చారు. పున్నయ్య వరండాలో టేబుల్పై రూ.11 వేలు ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో భిక్షాటనకు వచ్చిన నలుగురు దొంగ స్వాములు ఆ నగదును దొంగిలించి పరారయ్యారు. నగదు పోయిన విషయాన్ని గ్రహించిన పున్నయ్య వెంటనే కోడూరు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బాపట్ల జిల్లా నగరం గ్రామానికి చెందిన గంధం శివయ్య, గంధం తోట స్వామిజీ, పాసం బాజీ, పాసం యేసును నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. రేపల్లె: రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అతిథి అధ్యాపకుల నియమకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టీసీ రవిచంద్ర కుమా ర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామ ర్స్, జంతుశాస్త్రం, కంప్యూటరు సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉన్న వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు. భట్టిప్రోలు(వేమూరు): కరెంట్ షాక్ వల్ల యువ కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. భట్టిప్రోలు మండలంలోని గుత్తావారి పాలెం గ్రామానికి చెందిన వాకా శరత్(26) గురువారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు కరెంట్ మోటారు వేశాడు. కొద్దిసేపు తర్వాత ఇనుప గొట్టంపై చెయ్యి పెట్టి మంచినీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో పెద్దగా కేక వేసి కింద పడిపోయాడు. పక్క పొలంలో పని చేస్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా మృతి చెందాడని తెలిపారు. -
తెలుగు భాషపై శివకుమారికి పట్టు
డీఎస్సీ–1996 ద్వారా తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపికైన బి.శివ కుమారి కనపర్రు పాఠశాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేసానుపల్లి, కండ్లకుంట, తుమ్మలచెరువు, రెడ్డిపాలెం తదితర పాఠశాలల్లో పనిచేసి 2023లో జరిగిన బదిలీలలో నకరికల్లు జెడ్పీ హైస్కూల్కు వచ్చారు. తెలుగు భాషపై పట్టు, ఆధ్యాత్మిక ప్రసంగాలలో దిట్టగా గుర్తింపు పొందిన శివపార్వతి ఎన్నో ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ పాఠశాలకు హాజరై విద్యార్థులకు ప్రత్యేక బోధనా పరికరాల ద్వారా బోధన అందిస్తుంటారు. ప్రత్యేకించి పాఠశాలలోని గ్రంథాలయాన్ని తాను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించటం తన పాఠశాల దినచర్యలో ఒక భాగంగా మార్చుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయినిగా తాను దరఖాస్తు చేయలేదని రాష్ట్ర పాఠశాల విద్య కార్యాలయం తనను ఎంపిక చేసినట్టు తెలిపారు. -
మత్స్యకారులు నిబంధనలను పాటించాలి
సత్రశాల(రెంటచింతల): సత్రశాల వద్దనున్న కృష్ణానదిలో చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు కచ్చితంగా నిబఽంధనలను పాటించాలని జిల్లా అధికారి ఎస్.సంజీవ్రావు అన్నారు. గురువారం సత్రశాలలో నాగార్జునసాగర్ (రైట్ బ్యాంక్) సత్రశాల మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ జలాశయానికి ప్రస్తుతం వరద ఉధృతంగా వచ్చి చేరుతుండటంతో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. మత్స్యకారులు సత్రశాల ప్రాంతంలో వేట కొనసాగించడంతో స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 30వ తేదీ నాటికి మత్స్యకారులకు ఇచ్చిన అనుమతుల గడువు పూర్తి అయిందని సంజీవ్రావు పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రాంతంలోనే ఎవరైనా చేపట వేటకు వెళ్లాలన్నారు. లేదంటే అనుమతులను రద్దుచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కారంపూడి సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ దొప్పటపూడి మేరికనకం, ఎస్ఐ సీహెచ్ నాగార్జున, మాచర్ల మత్స్యశాకాధికారి శ్రీనివాసరావు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
జీజీహెచ్ ఏడీగా పూసల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్గా (ఏడీ) పూసల శ్రీనివాసరావు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఏడీగా పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు జీజీహెచ్ ఏడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. గుంటూరు జీజీహెచ్లో సీనియర్ అసిస్టెంట్గా, పరిపాలనా అధికారిగా, ఇన్చార్జి ఏడీగా శ్రీనివాసరావు పని చేశారు. 2024లో ఏడీగా పదోన్నతి పొంది, కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీజీహెచ్ ఏడీగా పనిచేస్తున్న చింతలపూడి నాగేశ్వరరావు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. నూతనంగా విధుల్లో చేరిన ఏడీని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నేతలు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది బొకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్లో పెండింగ్లో ఉన్న రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులను మూడు నెలల్లో ఇస్తామని తెలిపారు. మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్ల టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, ఆసుపత్రిలో రోగులకు అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఆడిట్ పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, జాయింట్ డైరెక్టర్ సుధారాణి సహకారంతో పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చి, మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
బార్లకు రీ నోటిఫికేషన్
● నేటి నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● 15న లాటరీ ద్వారా ఎంపిక నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో మిగిలిన 30 బార్ అండ్ రెస్టారెంట్లకు తిరిగి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.మణికంఠ గురువారం తెలిపారు. జిల్లాలో 54 బార్ అండ్ రెస్టారెంట్లకు గాను మొదటి విడత 24 బార్లకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరిగాయన్నారు. మిగిలిన 30 బార్లకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రీనోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. నరసరావుపేటలో 8, చిలకలూరిపేటలో 7, పిడుగురాళ్లలో 6, మాచర్ల 3, వినుకొండలో 6 నూతన బార్ అండ్ రెస్టారెంట్లకు శుక్రవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈనెల 15వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామని తెలిపారు. నరసరావుపేట: జిల్లాలో యూరియా సరఫరా మెరుగుపర్చేందుకు వ్యవసాయశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం పేర్కొన్నారు. యూరియా సరఫరాలో సమస్యలు, అక్రమాలను 83320 66633 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. నరసరావుపేట రూరల్: చంద్రగహణాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 8వ తేదీ ఉదయం ఏడు గంటల వరకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ ఈవో టి.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తామని తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శన వేళల్లో మార్పులను గమనించాలని కోరారు. దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం 7,427 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 296, బ్యాంక్ కెనాల్ 1,848, తూర్పు కాలువకు 699, పశ్చిమ కాలువకు 267, నిజాంపట్నం కాలువకు 500, కొమ్మూరు కాలువకు 3,080 క్యూసెక్కులు విడుదల చేశారు. సముద్రంలోకి 18,125 క్యూసెక్కులు వదులుతున్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి నిలువ నీడ కల్పించారు. స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 75 వేల మందికి స్థలాలు కేటాయించారు. ఇందులో కొంత మందికి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు.అయితే, వాటిని పూర్తి స్థాయిలో అధికారులు పంపిణీ చేయకపోవడంతో సచివాలయాల్లోనే మూలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నగర పరిధిలోని 127వ వార్డు సచివాలయంలో బుధవారం పాత సీఎం జగన్మోహన్రెడ్డి పేరుతో సదరం సర్టిఫికెట్ జారీ చేయడంపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, సచివాలయ సెక్రటరీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో సచివాలయాల్లో ఉన్న పాత సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ను నగరపాలక సంస్థకు అందజేయాలని ఆదేశించడంతో గోతాల్లో వేల సంఖ్యలో రిజిస్టర్ ఇళ్ల పట్టాల డాక్యుమెంట్స్ దర్శనమియ్యాయి. -
కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా
రేపల్లె: రేపల్లె పట్టణంలోని 24వ వార్డు నేతాజీనగర్ వాసులు గురువారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపల్ పైపుల ద్వారా తాగునీటి బదులు కలుషిత నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరా అయిన నీటిలోనుంచి భరించలేని దుర్గంధం వెదజల్లుతుండటంతో తాగడానికి గానీ, వాడుకోవడానికి గానీ పనికిరాకపోయిందని కాలనీవాసులు వాపోయారు. రోజుకు ఒకసారి ఇచ్చే నీరు కూడా ఇలా కలుషితమై వస్తే తమ కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలంటూ ప్రజలు ప్రశ్నించారు. కనీసం వాడుకోవడానికి ఒక బిందె కూడా శుభ్రమైన నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ నేతాజీనగర్ సమీపంలోని వాడ మురుగు డ్రైన్లో బుధవారం పొక్లెయిన్తో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో పైపులు దెబ్బతిన్నాయని, అందువల్లే మురుగు నీరు సరఫరా లైన్లలోకి చేరిందన్నారు. సమస్యను గుర్తించి పైపు లీకేజీని సరిచేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
మేదరమెట్ల: రోడ్డు దాటుతున్న బైకును కారు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. కొరిశపాడు మండలం పరిధిలోని వెంటాపురం క్రాస్రోడ్డు వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. పి.గుడిపాడు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డి (67) వెంకటాపురం వైపు నుంచి పి.గుడిపాడు వెళ్లేందుకు మోటారు బైకుపై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు.. బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వెంకటేశ్వరరెడ్డికి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలు కాగా ప్రయివేటు వాహనంలో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత
●వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులు ●మాజీ ఎమ్మెల్యే బొల్లా కారు డ్రైవర్తో పాటు పలువురిపై విచక్షణారహితంగా దాడులు శావల్యాపురం: వినాయక నిమజ్జనం సందర్భంగా పల్నాడు జిల్లా కారుమంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా 100 మందికిపైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గురువారం టీడీపీ అబిమానులు ఏర్పాటు చేసిన విగ్రహం నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు గ్రామంలోని సత్రంబజారు ప్రధాన సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద రెండు గంటల పాటు రెచ్చగొట్టే విధంగా హంగామా చేయడంతోపాటు అటువైపుగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు డ్రైవర్ వేమూరి శ్రీకాంత్ పై దాడి చేశారు. అనంతరం, బండారుపల్లి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పరిస్థితిని అదుపుచేయలేక చేతులెత్తేశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరగటంతో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేశారు. -
రచ్చబండ పేరుతో ఎమ్మెల్యే హడావుడి
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రచ్చబండ పేరుతో ప్రధాన వీధి చెట్టుకింద కూర్చుని ప్రజలతో ముచ్చటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు అడిగారు. ప్రతి ఇంటికీ రూ. వెయ్యి చొప్పున కలెక్ట్ చేయించండని, దానికి తోడు మరికొంత తాను ఇస్తానని, దాన్ని బాధిత కుటుంబాలకు ఇద్దామని ఎమ్మెల్యే అన్నాడని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క అనారోగాలతో మృత్యువాతకు గురవుతున్న ప్రజలు ఇంటికి వెయ్యి రూపాయలు ఎలా ఇస్తారని మహిళలు, ప్రజలు చర్చించుకుటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా మాట్లాడటంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టండి: ఎమ్మెల్యే బూర్ల గుంటూరు రూరల్: తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం పర్యటించారు. గత నాలుగు నెలలుగా గ్రామంలో ప్రజలు అకాల అనారోగ్య మృత్యువాతలకు గురవ్వడంతో గురువారం గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యశాఖ, తాగునీటి శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సరిపోకపోతే ఇతర గ్రామాలనుంచి తెచ్చుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
దాతల సహకారం అభినందనీయం
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు అదృష్టవంతులని డీఈఓ ఎస్.పురుషోత్తం పేర్కొన్నారు. స్థానిక యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కారంచేడులోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామానికి చెందిన అనేక మంది ఎన్నారైలు, పాఠశాలల పూర్వ విద్కార్థులు చేతులు కలపడం మంచి పరిణామమని కొనియాడారు. గ్రామంలోని వైఎన్ ప్రభుత్వ పాఠశాలను దాతల సహకారంతో రూ. 12 లక్షలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అమెరికాలోని డల్లాస్ పట్టణంలో స్థిరపడిన గ్రామానికి చెందిన రాయినీడి మురళీకృష్ణ సహకారంతో రూ. 33 లక్షలతో నూతనంగా బస్సును కొనుగోలు చేసి ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్న 360 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులను గ్రామానికి చెందిన హైదరాబాద్లోని స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు గౌర అనీల్కుమార్ సమకూర్చగా, వాటిని కూడా ఆయన చేతుల మీదుగా అందించారు. ఎన్నారై ఘంటా పద్మజ మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని తెలిపారు. అవిభక్త పిల్లల వైద్యులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్సలో పేరు నమోదు చేసుకున్న డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ కూడా ఈ పాఠశాల విద్యార్థే అని గుర్తు చేశారు. వేసవి తరగతులు నిర్వహించిన పావులూరి శ్రీనివాసరావు, పొదిలి మురళీకృష్ణలను సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ రాఘవయ్య, చుండూరి రామయ్య, పాఠశాల పూర్వ కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు, ఎంఈఓ ఎం. వెంకటేశ్వర్లు, హెచ్ఎం సామ్రాజ్యం పాల్గొన్నారు. బాపట్ల డీఈఓ పురుషోత్తం -
సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు అరెస్ట్
నరసరావుపేట టౌన్: నిషేధిత సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.51,480లు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చిత్రాలయ టాకీస్ సెంటర్లో సింగిల్ నంబర్ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇస్లాంపేటకు చెందిన షేక్ మస్తాన్వలి, ఉప్పలపాడు గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6,580 నగదు, లాటరీ నంబర్లకు సంబందించి స్లిప్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఏంజెల్ టాకీస్ సమీపంలో వన్టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి నిమ్మతోటకు చెందిన గుడిపాటి వెంకటేశ్వరరావు, ఇస్లాంపేటకు చెందిన షేక్ నన్నూ బాజీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.44,900 నగదు, లాటరీ నంబర్ల స్లిప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఖాజాషరీఫ్ అలియాస్ బుజ్జి, రామిరెడ్డిపేటకు చెందిన షేక్ గౌస్పీరాలను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులను అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనపరిచిన వన్టౌన్, టూటౌన్ సీఐలు ఎం.వి.చరణ్, ఎం.హైమారావు, ఎస్ఐలు టి.అశోక్ బాబు, అరుణలను అభినందించారు. నిషేదిత లాటరీ, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నలుగురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు వెల్లడించిన డీఎస్పీ నాగేశ్వరరావు -
చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివదుర్గారావు
ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన కట్టా శివదుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం భవన్ ఆవరణలో బుధవారం జరిగిన ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా మూడో మహాసభలో 10 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులుగా బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి ఏసురత్నం, వలపర్ల దిబ్బయ్య, మోపపర్తి బాబురాజు, మల్లాల గురవయ్య, సాముల నాగలక్ష్మిలను ఎన్నుకున్నారు. -
బడ్జెట్లో చేనేతకు మొండిచేయి
సత్తెనపల్లి: చేనేతకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఫణిదం చేనేత సహకార సంఘం భవన ఆవరణలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చేనేతకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్స్, జెట్లూమ్స్లను ప్రోత్సహిస్తూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై అక్టోబర్ 6,7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన తెలిపారు. తొలుత చేనేత జెండాను చేనేత జాతీయ అవార్డు గ్రహీత కర్నాటి మురళి, సామాజిక సేవా కార్యకర్త గంజి వీరాస్వామి, ఫణిదం చేనేత సొసైటీ కార్మికురాలు మంచి మల్లేశ్వరి లు ఆవిష్కరించారు. మహాసభలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుములు వీర బ్రహ్మం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై మహాసభలో ప్రతినిధుల చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్ కర్తవ్యాల కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. మహసభలో చేనేత కార్మిక సంఘ నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
పెదకాకాని(ఏఎన్యూ): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి 4వ స్పోర్ట్స్మీట్–2025 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా మంత్రి సంధ్యారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ ఎం. మల్లికార్జుననాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం సెక్రటరీ గౌతమి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడాలని ఆలోచన వచ్చిందంటేనే పిల్లలు గెలిచినట్టన్నారు. రోజూ గంటకుపైగా ఆడుకోవడం ద్వారా శారీరక సామర్థ్యం పెరుగుతుందన్నారు. గురుకులం సెక్రటరీ గౌతమి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 5వ తేది వరకు బాలికలు, 7 నుంచి 9వ తేదీ వరకూ బాలురకు 12 అంశాల్లో క్రీడలు ఉంటాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 656 మంది హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థుల నుంచి క్రీడావందనం స్వీకరించారు. వసతులు కరువు 1500 మంది క్రీడాకారులతో నిర్వహించడానికి అనుకూలంగా వసతులు లేని కారణంగా బాలికలు, బాలురకు వేర్వేరు తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్సిటీలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్టెన్నిస్, తైక్వాండో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ శ్యాంసుందర్ వివరించారు. ముందుగా జాతీయ జెండా, స్పోర్ట్స్ జెండా, ఈఎంఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి 800 మీటర్లు పరుగుపందెం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రిజిస్ట్రార్ సింహాచలం, పలువురు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచన ఘనంగా గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న రైతులు కొల్లూరు: కృష్ణా నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులను భయాందోళనలకు గురి చేసిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. నెల రోజుల నుంచి నదిలో నిండుగా నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నీటి మట్టం కూడా అడుగంటడం మొదలెట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదలను ఆ శాఖాధికారులు తగ్గించడంతో రైతులను వరద భయం వీడింది. ఎగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీటి విడుదల నిలిచిపోయింది. మున్నేరు తదితర వాగుల నుంచి వస్తున్న స్వల్ప మొత్తంలో నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదలవుతోంది. బుధవారం ఉదయం 1.73 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవగా, క్రమంగా అధికారులు తగ్గించారు. సాయంత్రానికి 36 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. యథావిధిగా రాకపోకలు వరద తీవ్రత తగ్గిన కారణంగా మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక మార్గంలో లోలెవల్ వంతెన పైనుంచి రాకపోకలు యథథావిధిగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు వరద భయంతో ఆందోళనకు గురైన పరీవాహక ప్రాంత రైతులు కృష్ణమ్మ శాంతించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి
తెనాలి అర్బన్: వేమూరు నియోజకవర్గ పరిధిలోని అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలిపే విధంగా చూడాలని ఆ ప్రాంత వాసులు కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను మంగళవారం తెనాలిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జగదీష్ ప్రసాద్, గోగినేని వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, గోపీచంద్, రాజేంద్ర, కోగంటి సాంబశివరావు పాల్గొన్నారు. కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య నకరికల్లు: మతిస్థిమితం సక్రమంగా లేక వృద్ధురాలు ఎన్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ చల్లా సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీమలమర్రి గ్రామానికి చెందిన సురభి సీతమ్మ(75) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో చల్లగుండ్ల సమీపంలోని గోరంట్ల మేజర్లో దూకింది. సమీపంలోని వారు గమనించి వెలికితీసే సరికే మృతిచెందింది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉండగా వారందరూ వివాహితులే. 14 యూరియా బస్తాలు స్వాధీనం దాచేపల్లి: అక్రమంగా తరలిస్తున్న 14 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సౌందర్యరాజన్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, ఈ తనిఖీల్లో గురజాల మండలం గంగవరం గ్రామం నుంచి 14 యూరియా బస్తాలను రైతులు పేరుమీద కొనుగోలు చేసి తెలంగాణలోని దామరచర్ల మండలంలోకి ఆటో ద్వారా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని గుర్తించి యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూరియాను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సౌందర్యరాజన్ వెల్లడించారు. కొల్లూరు : గుర్తు తెలియని దుండగులు టీడీపీ నాయకుడి వాహనాన్ని దగ్ధం చేసి న సంఘటన కొల్లూరులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. కొల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు బుర్రి జగజ్జీవనరావు వాటర్ ప్లాంట్ నడుపుతారు. స్థానిక దక్షిణపు వీధిలోని పాడి తోటల ప్రాంతంలో మంగళవారం రాత్రి వాటర్ ప్లాంట్ వద్ద రోడ్డు వెంబడి వాహనాన్ని నిలిపి వెళ్లారు. తెల్లవారుజాము ప్రాంతంలో అది దగ్ధమవుతుండటంతో స్థానికులు గమనించి వాహన యజమానికి సమాచారం అందించారు. పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో అప్పటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికుల సహకారంతో అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని దగ్ధం చేసినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీని వెనుక టీడీపీలో వర్గ విభేదాలు కారణమవ్వవచ్చునన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. బైక్ ప్రమాదంలో ఎంపీడీఓకు గాయాలు ఇంకొల్లు (చినగంజాం): విధుల్లో భాగంగా ఇంకొల్లు ఎంపీడీఓ జి. శ్రీనివాసరావు బుధవారం అక్కడ నుంచి దుద్దుకూరు గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొణికి, దుద్దుకూరు గ్రామాల మధ్య ఎదురుగా వాహనం రావడంతో దాన్ని తప్పించుకునే క్రమంలో హ్యాండిల్ కొద్దిగా పక్కకు తిప్పడంతో ఎదురుగా గుంతలో పడిపోయింది. వాహనాన్ని నడుపుతున్న ఎంపీడీఓ శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకొల్లులో ప్రథమ చికిత్స అనంతరం కార్యాలయానికి వచ్చిన ఆయన్ను తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాసరావు, సర్వేయర్ ఎం. సాంబశివరావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ కిరణ్, కార్యాలయ సిబ్బంది పరామర్శించారు. -
పిడుగురాళ్లలో వందేభారత్ను ఆపాలి
పిడుగురాళ్ల: వందే భారత్కు స్టాపింగ్ కల్పించాలంటూ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్ జూలకంటి శ్రీనివాసరావు విన్నవించారు. సికింద్రాబాద్లో బుధవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే 75వ జెడ్ఆర్యూసీసీ మీటింగ్లో రైల్వే అధికారులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. పిడుగురాళ్ల స్టేషన్లో వందే భారత్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్, భావ్నగర్ ఎక్స్ప్రెస్, రామేశ్వరం ఎక్స్ప్రెస్లు ఆగే లా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గంలో కొత్తగా రైళ్లు నడపాలని, పల్నాడు ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల రద్దీ ఎక్కుగా ఉందని బోగీల సంఖ్య పెంచాలని కోరానన్నారు. పిడుగురాళ్ల – నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య గడిచిన నెలల్లో దోపిడీలు పలు మార్లు జరిగినందున ప్రయాణికులకు భద్రత పెంచాలని, రైల్వే పోలీసుచే రాత్రిళ్లు గస్తీ ఏర్పాటు చేయాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వత్సవకు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. -
మహాగణపతికి ప్రత్యేక పూజలు
గుంటూరు రూరల్: నగర శివారు ఇన్నర్ రింగ్రోడ్డులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైల దేవస్థానం నుంచి తెచ్చిన 36 అడుగుల వరి కంకుల గజమాలను బుధవారం అలంకరణ చేశారు. సింగంశెట్టి సుబ్బారావు దంపతులు వరి కంకుల గజమాలను తెచ్చి స్వామివారికి అలంకరింపజేశారు. సౌత్ డీఎస్పీ భానోదయ బుధవారం స్వామి వారిని దర్శించుకుని, పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు గుంటూరు జిల్లాకు చెందిన భక్తుడు ఆలపాటి సురేష్ రూ.10,11,111 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన డీడీని బుధవారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి స్వయంగా అందజేశారు. -
అవసరానికి మించి కొనొద్దు
నరసరావుపేట: జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మరోసారి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో యూరియా అంశంపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబరు నాటికి 34,556 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకూ 36,615 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం నుంచి అందిందన్నారు. రైతులకు 26,616 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, 7,442 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనవసర భయాలతో రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు నెలాఖరుకు రాష్ట్రానికి రానున్న మరో రెండు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియాలో జిల్లా రైతులకు అవసరమైన కేటాయింపులు ఉంటాయన్నారు. యూరియా అక్రమాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్ శాఖల సిబ్బంది సంయుక్తంగా తనిఖీ సిబ్బందిని నియమించామన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజూ యూరియా నిల్వలపై బులెటిన్ విడుదల చేసి అనవసర అనుమానాలకు తావులేకుండా చూస్తామన్నారు. ●వర్షాలు అంచనాలకు మించి కురవడం, సాగర్లో పుష్కలంగా నీరు ఉండటంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు నమోదైందన్నారు. గత ఏడాది సెప్టెంబరు నాటికి 82 వేలు హెక్టార్లలో విత్తనం వేయగా, ఈ ఏడాది 97వేలు హెక్టార్లకు చేరిందన్నారు. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సరిహద్దులో యూరియా అక్రమ రవాణా అడ్డుకునేందుకు పొందుగల, తంగేడ, నాగార్జునసాగర్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవిగాక ఇతర మైనర్ రూట్లలో సైతం సిబ్బందిని నియమించామన్నారు. అక్రమార్కుల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ●ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా నిత్యవసర సరుకుల పరిధిలో ఉన్నందున ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టం, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు పాల్గొన్నారు. అక్రమార్కులపై ఈసీ, పీడీ యాక్టు కింద కేసులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. జాతీయ ఆరోగ్య అథారిటీ వద్ద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు జాతీయ ఆరోగ్య అథారిటీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత మెంబర్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గీతారాణి జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రజెంటేషన్ చేశారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నిరోధానికి పోలీసు, రవాణా, ఆర్అండ్బీ శాఖలు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల జాతీయ, రాష్ట్ర హైవేలపై రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుదల పట్టిందన్నారు. అయితే ఇతర రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. రోడ్డుసేఫ్టీ ఎన్జీఓ సంస్థ కన్వీనర్ దుర్గా పద్మజ శిక్షణ పూర్తిచేసుకున్న వారికే డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, ఆర్డీఓ కె.మధులత, ఆర్టీసీ ఆర్ఎం అజిత కుమారి, డీఈఓ చంద్రకళ, జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్కుమార్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మణికంఠ, నరసరావుపేట కమిషనర్ ఎం.జస్వంతరావు, ఎన్హెచ్ఐ అధికారులు పాల్గొన్నారు. -
టిష్యూ కల్చర్ అరటికి సబ్సిడీ
కొల్లూరు : టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని మండల ఉద్యాన శాఖాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. మండలంలోని జువ్వలపాలెం, కిష్కింధపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పంటలకు చీడ, పీడలు ఆశించకుండా అధికారుల సూచనల మేరకు మందులు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ వి.నరేంద్రబాబు మాట్లాడుతూ సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రాల్లో ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బి.ఎన్. వంశీ, వీహెచ్ఏ ఎం. నవీన్, వీఏఏలు కె. విజయ్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్లపై అడ్డంగా ముళ్ల కంపలు
రెంటచింతల: మండలంలోని తుమృకోట గ్రామంలో నున్న రెండు రహదారులపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ముళ్ల కంపవేసి రాకపోకలను అడ్డుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని జంగాలవారి వీధిలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఆదివారం టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నా స్థలం.. నా ఇష్టం అంటూ గ్రామస్తులు నడిచే రెండు రహదారులపై ముళ్లకంప వేసి అడ్డుకున్నాడు. దీంతో ఆ కాలనీకి చెందిన కొందరు గ్రామ వీఆర్ఓ నరసింహ, గ్రామ సర్వేయర్ శివేంద్రకు సమాచారం ఇవ్వగా.. వారు ఇద్దరూ వెళ్లి సర్వే చేసి.. ముళ్ల కంపలు తీయించకపోగా.. తాము కార్యదర్శికి చెబుతామని మీరు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. ఈ రహదారి స్థలం 1988లో అడ్డుకున్న వ్యక్తి తాత వద్ద నుంచి ఆ ప్రాంతానికి చెందిన వారు రూ.4 వేలకు కొనుగోలుచేసి రహదారి ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని ఆ వీధికి చెందిన కొందరు రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున దృష్టికి తీసుకువెళ్లగా ఇరువర్గాలు ఆ స్థలానికి సంబంధించి పేపర్లు తీసుకువస్తే మాట్లాడతానని, సమస్యను రెవెన్యూ శాఖవారు పరిష్కరిస్తారని తెలిపారన్నారు. దీనిపై గ్రామస్తులు ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాసరావును సంప్రదించగా.. గురువారం తహసీల్దార్, ఎస్ఐలతో కలిసి వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారని తెలిపారన్నారు. -
ఆర్ఓబీకి ముందే ఆర్యూబీ నిర్మించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్విలాస్ నూతన ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టే ముందుగానే ప్రజా రవాణాకు వీలుగా రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశంలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి ముందే ఆర్యూబీ నిర్మించాలని చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపి ఆమోదింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్యూబీ నిర్మాణానికి నిధులు తెచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్యూబీ నిర్మాణం దిశగా రైల్వేశాఖను ఒప్పించాలని కోరారు. శంకర్విలాస్ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించే ఆర్నెల్ల పాటు బ్రిడ్జిపై వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించేశారని చెప్పారు. – బ్రిడ్జికి రెండు వైపులా కూల్చివేసిన ఆర్అండ్బీ శాఖాధికారులు రైల్వే పరిధిలోని బ్రిడ్జి కూల్చివేత పనులకు అనుమతుల కోసం తీరిగ్గా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లడం ముందుచూపు లోపించిన పనులకు నిదర్శనమన్నారు. అన్ని అనుమతులు తెచ్చిన తరువాతే బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రైల్వేబోర్డు అనుమతి కోసం పంపడం ద్వారా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని మరింతగా జాప్యం చేయడమేనన్నారు. బ్రిడ్జి నిర్మాణం కారణంగా నష్టపోతున్న భవన యజమానులకు చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతోపాటు స్టేటస్–కో విధించినప్పటికీ అధికార యంత్రాంగం ఖాతరు చేయకండా ఏకపక్షంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉండగానే రెండు రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. నగర ప్రజలపై గౌరవం లేని అధికారులు కనీసం హైకోర్టుపై గౌరవంతో ఆదేశాలను పాటించాలని కోరారు. – నగర ప్రజలతో పాటు నిర్మాణాలను కోల్పోతున్న యజమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అన్ని అనుమతులు తెచ్చుకుని బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మాణానికి నిధుల గురించి ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్యూబీ నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపడుతుందని చెప్పారు. సమావేశంలో షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు, కమల్కాంత్, అవధానుల హరి, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేరికపూడి గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లు(70), కుమారుడు భార్గవ్(23)లు మంగళవారం ద్విచక్రవాహనంపై పెట్రోలు బంకు వద్దకు బయలు దేరారు. మేరికపూడి గ్రామం వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనకభాగం ద్విచక్రవాహనం హ్యాండిల్కు తగిలింది. దీంతో వాహనం అదుపుతప్పి రహదారిపై పడిపోవడంతో భార్గవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు తీవ్రగాయలు కావడంతో అతడిని చికిత్సకోసం నరసరావుపేట ప్రభుత్వవైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డీఆర్ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్
ప్రారంభించిన డీఆర్ఎం సుథేష్ఠ సేన్ లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో సోలార్ ప్లాంట్ను ప్రారంభించడం సంతోషదాయకమని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలంలో రోజు వారీ విద్యుత్ వినియోగంలో గణనీయమైన భారాన్ని తీర్చడానికి సోలార్ ప్లాంట్ను రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేసిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఎం.రవితేజ, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డివిజన్ అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా యడ్ల సత్యవతి బాపట్ల: బాపట్ల జిల్లాలో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా యడ్ల సత్యవతి ఎంపికయ్యారు. ఏవీవీ హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న యడ్ల సత్యవతిని ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేయటంతో ఆజాద్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూలు సిబ్బంది అభినందించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా వీరాంజనేయులు బల్లికురవ: గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా మండలంలోని కొప్పరపాలెం ఉన్నత పాఠశాల ఎస్జీటీ గాలం వీరాంజనేయులు ఎంపిక చేశారు. ఈమేరకు ఎంఈవో 1,2 శ్రీనివాసరావు, రమేష్బాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వైదన గ్రామానికి చెందిన వీరాంజనేయులు 2008లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి కూకట్లపల్లి, కొటావారిపాలెం, పాతమల్లాయపాలెంలోని పాఠశాలలో విద్యాభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారన్నారు. జిల్లాలో ఎంపికై న 33 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో బల్లికురవ మండలానికి స్థానం దక్కిందన్నారు. ఎంఈవోలతోపాటు ఎంపీడీవో కుసుమ కుమారి, పాఠశాల హెచ్ఎం కోటినాగులు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఆయన్ను అభినందించారు. -
10న నాయుడమ్మ అవార్డు ప్రదానం
తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఆయన జన్మదినమైన ఈనెల పదో తేదీన ప్రదానం చేయనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను మంగళవారం సాయంత్రం ఇక్కడి కుమార్ పంప్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు జరిగే సభలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును బహూకరిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీజిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు. అవార్డు ప్రదానోత్సవ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కె.అరవింద్, కె.నందకిశోర్ పాల్గొన్నారు. చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ మంత్రి నాదెండ్ల మనోహర్ అత్తోట(కొల్లిపర):రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డు ల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరకు లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీ మార్ట్లుగా తీర్చి దిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు. యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
జిల్లా కోర్టులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్పాహార విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పాల్గొని మహానేత చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు పోకల వెంకటేశ్వర్లు, ఎంవీ సుబ్బారెడ్డి, మాజీ ఏజీపీ సౌభాగ్య లక్ష్మి, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, వాసం సూరిబాబు, వజ్రాల రాజశేఖర్ రెడ్డి, మాతంగి శ్రీకాంత్, కేవీ రమణారెడ్డి, సోమసాని ఝాన్సీ, బడి మంజుల, గేర వెంకట సుబ్బారావు, బొడ్డు కోటేశ్వరరావు, బూదాటి సాగర్, లీగల్ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ బాబు, మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణారెడ్డి, సుదర్శన క్రాంతి కుమార్ బొమ్మనబోయిన శ్రీనివాస్, నల్లక వెంకట వేణు, సురేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏటి కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా టెన్నికాయిట్ సీనియర్ సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక పోటీలు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో మంగళవారం నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో ఇరు జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టులో డి.కోటేశ్వరరావు, పి.ఆంజనేయులు(నకరికల్లు), ఆర్.సాయిగణ్ష్, వి.వీరతేశ్వర్ (శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్), మహిళల జట్టులో జె.సిరివల్లి, టి.నవ్య(కేజీబీవీ, నాదెండ్ల), బి.వైశాలి(నకరికల్లు), బి.రాజ్యలక్ష్మి (రాజుపాలెం)లు ఎంపికయ్యారు. ఎంపికై న జట్లు ఈనెల 13, 14వ తేదీలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. పోటీలను అసోసియేషన్ అధ్యక్షడు నిడికొండ జానకీరామయ్య పర్యవేక్షించారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పి.తిరుపతిరావు, సిహెచ్ పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, ఎన్.రాణి, పి.రమాదేవిబాయ్, లక్ష్మీతిరుపతమ్మలు వ్యవహరించారు. -
డీజిల్ దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసంజీవయ్య కాలనీకి చెందిన కాకాని యశ్వంత్ చిలకలూరిపేట రోడ్డు ముస్లిం శ్మశానవాటిక పక్కన గల పెట్రోల్ బంకు ఆవరణలో నిలిపి ఉన్న లారీలో తెల్లవారుజామున డీజిల్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది కేకలు వేయటంతో తన వెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనం, 25 లీటర్ల రెండు క్యాన్లు వదిలి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత మరో ద్విచక్ర వాహనంపై అతని స్నేహితుడితో కలిసి వచ్చి వదిలి వెళ్లిన వాహనాన్ని తీసుకెళ్లాడు. అప్పటికే యశ్వంత్ కోసం అక్కడ వేచి చూస్తున్న లారీ యజమానులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు అతన్ని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని నెలలుగా లారీల్లో డీజిల్, బ్యాటరీలు అపహరణకు గురవుతున్నాయని లారీల నిర్వాహకులు పోలీసులకు వివరించారు. నిందితుడితోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని డీజిల్ దొంగతనం చేసేందుకు తెచ్చిన ప్లాస్టిక్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఉపాధ్యాయ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు నరసరావుపేట ఈస్ట్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాది సుబ్బారావు తెలిపారు. అరండల్పేటలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో ర్యాంక్లు వచ్చినా కాల్లెటర్లు రాని అభ్యర్థులు మెరుపు వేగంతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ నియామకాలలో కూటమి ప్రభుత్వం మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ రిజర్వేషన్ కోటాలో కోత కోస్తున్నదని తెలిపారు. మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బిసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరి నుంచి రిజర్వేషన్ కోటాలోకి మార్చటం వలన నిజమైన రిజర్వేషన్ అభ్యర్థులు అనర్హులుగా మారి వందలాది పోస్టులను కోల్పోయారని వివరించారు. జీఓ 77 ప్రకారం రిజర్వేషన్లు వర్టికల్ పద్ధతిలో అమలు చేయాలని స్పష్టం చేసారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ కోటా పోస్టులపై సరైన నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పోరాట సమితి జిల్లా కార్యదర్శి వైదన వెంకట్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి కారు బీభత్సం
తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిలో ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించి పలుచోట్ల ద్విచక్ర వాహనదారులను, ఒక సైక్లిస్టును ఢీకొట్టి చివరకు ఒక చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళుతున్న పోలీస్ స్టిక్కర్ కలిగి వున్న ఒక కారు సాయిబాబా గుడివద్ద విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్తోపాటు భార్యాభర్తలకు స్వల్పగాయాలయ్యాయి. కారు ఆపినట్లు ఆపి మళ్లీ అతివేగంగా వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని, ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో వ్యక్తికి ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారులో బెలూన్స్ సైతం ఓపెన్ అయ్యాయి. పూటుగా మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి కారులోంచి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉంది. ఇది పోలీసులకు చెందిన వాహనమా? లేక ఇంకెవరైనా పోలీస్ స్టిక్కర్ అతికించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు గోప్యంగా వివరాలు సేకరిస్తున్నారు. -
జాతీయ నేతల విగ్రహాలకు సముచిత గౌరవం
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల( జమునా స్కూల్)లో జాతీయ నాయకుల విగ్రహాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూలన పడిఉన్న వాటిని పాఠశాలలో తిరిగి ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణంలో భాగంగా పాఠశాలలోని జాతీయ నాయకుల విగ్రహాలను పిచ్చి మొక్కల మధ్య పడేశారు. దీనిపై ఆగస్టు 15వ తేదీన ‘మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా!’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి, పిడుగురాళ్ల ఎంఈఓ శ్రీనివాసరెడ్డికి ఆదేశాలు జారీచేయడంతో జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు విగ్రహాలను పాఠశాలలో చక్కటి వేదిక ఏర్పాటు చేయించి, పునర్నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు ‘సాక్షి’ చొరవతో జాతీయ నాయకుల విగ్రహాలకు సముచిత గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. -
ఆదివారం అమ్మవారి ఆలయం మూసివేత
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్ర గ్రహణం కారణంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మూసివేయనున్నట్టు ఈఓ కె.సునీల ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
ఎరువుల అక్రమ రవాణాను సహించం
కారెంపూడి: పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కారెంపూడి మండలంలో మంగళవారం పర్యటించారు. కారెంపూడిలో ఎరువుల దుకాణాల గోడౌన్లలో స్టాకును తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల సరఫరా, రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అక్రమాలలో భాగస్వాములయ్యేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాకు రిజిష్టర్లు ఈ పాస్ మిషన్లలో ఉన్న ప్రకారం స్టాకు నిల్వలుండాలన్నారు. తప్పని సరిగా స్టాకు నిల్వల బోర్డులు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఎరువు కూడా కొరత రాకూడదని కొంచెం నిల్వలుండగానే ఇండెంటు పెట్టుకోవాలని సూచించారు. ముందుగా ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ తరగతి గదికి వెళ్లి బోధన తీరును పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం కారెంపూడి పీహెచ్సీని సందర్శంచి, డాక్టర్లు, సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, డీఈఓ చంద్రకళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు, డీఎంహెచ్ఓ రవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎస్ఐ వాసు ఉన్నారు. -
సదా స్మరామీ
సంక్షేమ ప్రదాత సాక్షి, నరసరావుపేట: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు పల్నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. సేవా కార్యక్రమాలలో భాగంగా అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజల గుండెల్లో సజీవం మహనీయులకు మరణం ఉండదని, ప్రజల గుండెల్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ కొలువై ఉంటారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీబైక్ ర్యాలీగా బయలుదేరి భాస్కర్ సెంటర్లోని డాక్టర్ వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104, ఇందిరమ్మ ఇళ్లు వంటి ఎన్నో పథకాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారని గుర్తుచేశారు. అభివృద్ధి ప్రదాత 2004 నుంచి 2009 వరకు చేసిన అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలని గర్వంగా చెప్పి రెండవసారి కూడా ముఖ్యమంత్రి అయిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో కాసు మహేష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ బిర్యానీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని అంజిరెడ్డి హాస్పటల్ వద్ద ఉన్న వైఎస్సార్ భారీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ పీఏసీ మెంబరు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, 108, 104 వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగించారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రదాత, వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే నడచి ఆయన ఆశయాలను వైఎస్సార్ సీపీ ముందు కు తీసుకెళ్తుందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా క్రోసూరు నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి శంకరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మహానేత ఆశయాలను సాధిస్తామని నంబూరు శంకరరావు అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట తప్పని.. మడమ తిప్పని నేత పేదల సంక్షేమానికి కట్టుబడి జనరంజక పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గవ్యాప్తంగా వాడవాడలా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. పలు చోట్ల అన్న సంతర్పణలు నిర్వహించారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్ అని గజ్జల కొనియాడారు. పేదల సంక్షేమానికి తపించారు పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని, అటువంటి మహనీయుడికి ఘన నివాళులర్పించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా అన్నారు. మంగళవారం మాచర్ల నియోజక వర్గంలోని పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలోని దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం తపించిన మహనీయుడు వైఎస్సార్ అన్నారు. ఆయన ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేసిన మహనీయుడిగా వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆదర్శవంతమైన పరిపాలన అందించి పాలకులకు స్ఫూర్తి నిచ్చిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వందలాది పార్టీ శ్రేణుల మధ్య గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ ప్రతిమకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రామిరెడ్డిపేట సెంటర్లో ని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ సుమారు మూడు వేలమందికి అన్నదానం నిర్వహించారు. -
రేషన్ బియ్యం.. రైట్ రైట్!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి నెలా వేల టన్నుల బియ్యం జిల్లా సరిహద్దుల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి తరలివెళుతోంది. జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టుల సిబ్బంది లారీలను పట్టుకోకపోగా.. రైట్ రైట్ అంటూ రాష్ట్ర సరిహద్దులను దగ్గరుంచి దాటిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల బియ్యంతో వ్యాపారం చేస్తున్న అక్రమార్కులకు స్థానిక పౌరసరఫరాలు, విజిలెన్స్, పోలీసు అధికారులు అండగా నిలుస్తుండటంతో మరింత రెచ్చిపోయి పట్టపగలే సరిహద్దులు దాటిస్తున్నారని సమాచారం. పల్నాడులో పట్టుకోరంతే...! గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని రేషన్ బియ్యాన్ని స్థానిక డీలర్ల నుంచి రేషన్ మాఫియా కిలో సుమారు రూ.14 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని వినుకొండ, సంతమాగులూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పరిధిలోని రైస్ మిల్లులలో పాలిష్ చేసి సంచులను మారుస్తున్నారు. సదరు మిల్లులపై దాడులు చేసి పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు. పాలిష్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.36 వరకు ఒడిశా, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎక్కువ భాగం బియ్యం లారీలు తొలుత తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. పల్నాడు జిల్లా సరిహద్దు చెక్పోస్టులైన పొందుగల, తంగెడ, నాగార్జునసాగర్ల మీదుగా తెలంగాణ లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ చెక్పోస్టుల మీదుగా పీడీఎస్ బియ్యం లారీలు వెళ్తున్నా పట్టుకుంటున్న దాఖలాలు లేవు. రేషన్ మాఫియా వాళ్లలో వాళ్లకు గొడవలు వచ్చి పట్టిస్తున్న అరకొర సరకు తప్ప పెద్ద మొత్తంలో వెళ్తున్న బియ్యం లారీలు దర్జాగా సరిహద్దులు దాటేస్తున్నాయి. తెలంగాణలో చిక్కేస్తున్నారు... ఆంధ్రా సరిహద్దు చెక్పోస్టుల నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీలు తెలంగాణ చెక్పోస్టుల వైపు వెళ్లగానే పట్టుబడిపోతున్నాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు నుంచి దర్జాగా వెళ్లిన బియ్యం లారీలు వందల మీటర్ల దూరంలో కృష్ణానది అవతల ఉన్న తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్పోస్టులో పట్టుబడుతున్నాయి. జూలై 4న వాడపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద 600 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న రెండు లారీలను సాధారణ తనిఖీలలో పట్టుకున్నారు. ఆ లారీలను పొందుగల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోలేదు. గత నెల 5వ తేదీన మరోసారి అదే చెక్పోస్టులో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు. ఈ లారీ గుంటూరు జిల్లా చేబ్రోలు నుంచి పల్నాడు జిల్లా మీదుగా పొందుగల చెక్పోస్టు దాటుకొని తెలంగాణలో ప్రవేశించింది. ఏ ఒక్క అధికారి దీన్ని ఆపిన పాపన పోలేదు. తెలంగాణ బోర్డర్లో దొరికిన అవే బియ్యం లారీలు నిమిషాల వ్యవధిలో అర కిలోమీటర్ లోపున్న చెక్పోస్టును దాటుతుంటే ఎందుకు పట్టుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెక్పోస్టు సిబ్బంది మొదలు అధికారుల వరకు రేషన్ మాఫియా నుంచి లంచాలు తీసుకోవడంతో చూసీచూడనట్టు వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ మాఫియా అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి ప్రభుత్వ అధికారుల సహకారం ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా మొదలు నల్గొండ వరకు పల్నాడు మీదుగా ప్రయాణిస్తున్న పీడీఎస్ బియ్యం లారీలను ఏ చెక్పోస్టులో అడ్డుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లు పనిచేస్తున్నారు. రైస్ మిల్లుల నుంచి అంతర్రాష్ట్ర మాఫియాకు బియ్యం అప్పగించేవరకు వీరు రూట్ ఆఫీసర్లుగా పనిచేస్తారు. పోలీసులతో సన్నిహితంగా ఉంటూ వారికి నెలవారీ మామూళ్లు అప్పగించి లారీలను ఆపకుండా చూడటం ఈ ఏజెంట్ పని. స్టేషన్, అధికారిస్థాయిని బట్టి నెలకు రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల దాకా మామూళ్లు ఇస్తున్నట్టు గత నెలలో అరెస్టయిన ఏజెంట్ వాంగ్మూలంలో బయటపెట్టినట్లు భోగట్టా. తెలంగాణ పోలీసులకు సైతం లంచాలు ఇస్తూ లారీలు దాటిస్తున్న ఏజెంట్లకు నెలకు రూ.2 లక్షల దాకా మిగులుతున్నట్టు తెలుస్తోంది. -
జిల్లా అభివృద్ధిపై రాజముద్ర
వైఎస్ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనం ఎవరూ చెరపలేని, మరువలేని సజీవ సంక్షేమ సంతకంపేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవంఅన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా పదిలండాక్టర్లుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయంఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జన సందోహంఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అపూర్వంజిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర శాశ్వతంసాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతును రాజును చేయాలని అహర్నిశలు కలలుగన్న రైతుబాంధవుడు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆ మహానేత ముందుకు వెళ్లారు. జలయజ్ఞంలో భాగంగా పులిచింతల ప్రాజెక్టు రూపకల్పనతో పాటు ఆయకట్టు స్థిరీకరణ కోసం పాటు పడ్డారు. రైతుల బతుకు చిత్రాన్ని మార్చడం కోసం కలలు కన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టును ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2004 అక్టోబరు 15వ తేదీన రూ. 680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. ఈ మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినా సరే కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది లేకపోవడానికి పులిచింతల ప్రాజెక్టే కారణం అనడంలో అతిశయోక్తి లేదు.జలయజ్ఞంతో సస్య శ్యామలంనాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ.4,444.41 కోట్లతో నాగార్జున సాగర్ కుడి, ఎడమల కాలువల ఆధునికీకరణకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువల ఆధునికీకరణ కోసం రూ. 4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ.1760.15 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి. దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. మహానేత పదవీకాలంలో ఉమ్మడి జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్రను వేసుకున్నారు.వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రైతులు ఎకరానికి రూ.లక్ష వరకూ నష్టపోయారు. వారిని ఆదుకుంటామని ప్రకటన చేసినా ఇంతవరకూ పైసా కూడా విదల్చలేదు. దీంతో జిల్లా రైతులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర ● రాష్ట్ర వ్యాప్తంగా రూ. 12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.07 లక్షల మందికి రూ. 560 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ● ఇందిర ప్రభ పథకం జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు. ● ఇందిరమ్మ ఫేజ్–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు. ● రాజీవ్ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ● గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ. 6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్ పాంట్ల వరకు రెండో పైపు లైను నిర్మించారు. తమ నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ● 2008, జూన్ 5న ప్రాజెక్టు వద్ద రైతు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు కృష్ణానది నుంచి సాగునీటిని అందించేందుకు ఒకే సారి 10 ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు రూ.250కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ పథకాలు మొత్తం పూర్తి కావడం వల్లనే నియోజకవర్గంలో పంట పొలాలు సాగునీటితో కళకళలాడుతున్నాయి. ● రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. ● విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80 వేల మంది రైతులకు లబ్ధి చేకూరింది. విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ. 36 కోట్ల లబ్ధి కలిగింది. ● అమరావతి మండలం నరుకుళ్లపాడు లో లెవెల్ బ్రిడ్జిలో పడి ఎనిమిది మంది మృతి చెందడంపై డాక్టర్ వైఎస్సార్ తీవ్ర మనస్తాపానికి గురై ప్రమాదకరంగా ఉన్న నరుకుళ్లపాడు, ఎండ్రాయి బ్రిడ్జిలను హైలెవెల్ చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కావడంతో ఇప్పుడు ఎంత వర్షం పడినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ● ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలోని 80 వేల మంది రైతులకు ఏడాదికి రూ. 281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచి ఆయన ప్రారంభించి జిల్లా ప్రజలు మరిచిపోలేని విషయం. ముఖ్యమంత్రి హోదాలో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఉన్న మమకారం అర్ధం అవుతుంది. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారినుంచి 92 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళిలతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు ఉండాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు దళితులకు సొసైటీ పేరుతో కేటాయించిన 416 ఎకరాల్లో జీఓ 270 ప్రకారం ఏపీఎండీసీకి కేటాయించిన 223 ఎకరాల భూముల్లో నాలుగేళ్ల నుంచి ఎటువంటి పనులు చేపట్టలేదు. ఆ భూములపై జిల్లా కలెక్టర్కు పూర్తి అధికారం ఉంది. మిగిలిన 193 ఎకరాలతో కలిపి సొసైటీ సభ్యులు అందరికీ వ్యక్తిగత పట్టాలు మంజూరు చేయండి. సాగు చేసుకుంటున్న దళిత రైతులకు అధికారుల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడండి. –ఎస్సీ, ఎస్టీ రైతులు, యడవల్లి గ్రామంలో బొడ్డురాయికి సమీపంలోని నా ఇంటి ముందు పదేళ్ల క్రితం పంచాయతీ నిధులతో వేసిన సీసీ రోడ్డుపై మా పక్కింటి ఇంటియజమాని సాంబశివరావు నన్ను, కుటుంబ సభ్యులను నడవనీయకుండా అడ్డుకుంటున్నాడు. నడిస్తే దూషిస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకొని నాకు రోడ్డుపై నడిచే అవకాశం కల్పించండి. – చల్లా శ్రీనివాసరావు, ములకలూరు, నరసరావుపేట మండలం -
ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన మాణిక్యరావు
చిలకలూరిపేట: ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దివంగత ఎంజే మాణిక్యరావుకు దక్కుతుందని మాజీ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. పూర్వ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు, ఆక్టా నాయకుడు దివంగత ఎంజే మాణిక్యరావు శతజయంతిని పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాలులో రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగభద్రత లేక బానిసల మాదిరి జీవితాలు గడుపుతున్న ఎయిడెడ్ కళాశాల లెక్చరర్ల జీవితాలను చూసి 1972లో రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపునిచ్చారని తెలిపారు. సమ్మె ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు ఉద్యోగభద్రత, పెన్షన్ విధానం గవర్నమెంట్ లెక్చరర్లతో సమానంగా లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంజే మాణిక్యరావు మెమో రియల్ కమిటీ కార్యదర్శి డాక్టర్ మోజస్, రిటైర్డ్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శు లు కేవీ కృప్ణారావు, జీఆర్కే రెడ్డి, జీవీ రాఘవులు, తోటకూర వెంకటనారాయణ, టి వెంకటేశ్వరరావు, ఎం లక్ష్మీనారాయణ, పీఎస్వీ ప్రసాద్, కె రామారావు, ఆళ్ల వేమనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
వ్యాపారం పేరుతో ఎన్ఆర్ఐకు టోకరా
నరసరావుపేట రూరల్: వ్యాపారం పేరుతో ఎన్ఆర్ఐకు టోకరా, కుమారులను విదేశాలకు పంపేందుకు ఆర్థిక సహకారం అందించిన సోదరుడికి నగదు చెల్లించకుండా చేస్తున్న వేధింపులపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాయలంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర సమస్యలపై 65 ఫిర్యాదులు అందాయి. సోదరుడు మోసం ముప్పాళ్ల మండలం తురకపాలేనికి చెందిన దాసరి జోసఫ్ తంబికుమార్ నాల్గవ సోదరుడు అంతయ్య నరసరావుపేట రెడ్డినగర్లో నివసిస్తున్నారు. అంతయ్య కుమారులు జర్మనీలో చదువుల నిమిత్తం రూ.33.50లక్షలను 2019 నుంచి పలు దఫాలుగా తంబికుమార్ అందించారు. పిల్లలు చదువులు పూర్తిచేసి స్థిరపడినప్పటికీ నగదు చెల్లించడంలేదు. పలుమార్లు అడగటంతో అంతయ్య ప్రోనోట్లు రాసిఇచ్చాడు. వాటి కాలం తీరిపోవడంతో తిరిగి రాయమని అడగ్గా మభ్యపెడుతూ మోసగిస్తూ వస్తున్నాడు. దీనిపై న్యాయం చేయాలని ఎస్పీని తంబికుమార్ కోరాడు. మోసం వలలో ఎన్ఆర్ఐ నరసరావుపేటలో వీసా కన్సల్టెంట్గా పనిచేస్తున్న తాడువాయి వెంకటేశ్వరరావు సోదరుడు అశోక్బాబు అమెరికాలో జీవిస్తున్నాడు. వీరిద్దరికి కామన్ స్నేహితుడైన పెరుమాళ్ల సాయి జస్వంత్ తాను విజయవాడలో కొనుగోలు చేసిన ప్లాట్కు చెల్లించేందుకు రూ.52లక్షలను 2024లో అశోక్బాబు నుంచి అప్పుగా తీసుకున్నాడు.స్నేహితుడైన తక్కిళ్లపాటి అఖిలేష్తో కలిసి మార్బుల్ వ్యాపారం చేద్దామని అశోక్బాబును నమ్మించి సాయిజస్వంత్ రూ. 51.40లక్షలు తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. ఇప్పటి వరకు వ్యాపారం మొదలు పెట్టకపోవడంతో మోసపోయానని గ్రహించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం హత్యాయత్నం రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన తుర్లపాటి శ్రీనివాసరావుపై గత నెల 8న సోదరుడు, సోదరి తరఫు వ్యక్తులు గొడ్డళ్లు, రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో శ్రీనివాసరావు నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా రొంపిచర్ల పోలీసులు సాధారణ కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశాడు. తనకు చెందిన పంటపొలాన్ని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపాడు. రక్షణ కల్పించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వివాహం చేసుకొని మోసం అచ్చంపేట మండలం కస్తల గ్రామానికి చెందిన పాటిబండ్ల మౌనిక భర్తతో విడిపోయి ఒంటిరిగా ఉంటోంది. గ్రామానిక చెందిన జాన్బెన్ని ఆమె ఇంటికి వచ్చి వేధిస్తుడటంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నడిచింది. తరువాత మౌనికను నమ్మించి అమరావతిలో గత నెల 15వ తేదీ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వేధిస్తుడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. నమ్మించి రూ.కోటికి పైగా మోసం పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు పలు సమస్యలపై 65 అర్జీల స్వీకరణ -
నిండుకుండలా టెయిల్పాండ్ రిజర్వాయర్
పులిచింతలకు 3,41,297 క్యూసెక్కులు విడుదల సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 19 క్రస్ట్గేట్లు ద్వారా 3,41,297 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 19 క్రస్ట్గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 3,41,297 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 74.47 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.389 టీఎంసీలు ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 62.08 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
కక్షపూరితంగా తొలగించారు
పెదకూరపాడు : తనను కక్షపూరితంగా తొలగించారని శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వాపోయారు. తన భర్త మైనేని ప్రతాప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా పార్టీ యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారని కక్షపూరితంగా తనను శ్రీ సత్య సాయి స్వయం సహాయక సంఘం నుంచి అన్యాయంగా తొలగించారని వాపోయారు. ఈ మేరకు మండలంలోని లగడపాడు గ్రామానికి చెందిన మైనేని స్రవంతి తహసీల్దార్ ధనలక్ష్మికి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గత పది సంవత్సరాల నుంచి సంఘం సభ్యురాలుగా నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లింపులు చేశానని, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నామని తొలగించడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. స్వయం సహాయక సంఘాలపై కూడా రాజకీయాలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్రవంతి కోరారు. శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా భర్త వ్యవహరిస్తున్నారని కక్ష -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
బెల్లంకొండ: మండలంలోని పలు గ్రామాల్లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ సాగు క్షేత్రాలను సోమవారం శాస్త్రవేత్తల బృంద సభ్యులు పరిశీలించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమల కుమారి శాస్త్రవేత్తల బృందానికి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. మండలంలోని నాగిరెడ్డిపాలెంలో రైతు చింతారెడ్డి మహాలక్ష్మి వరి పొలంలో సాగు చేస్తున్న నాలుగు పద్ధతులను శాస్త్రవేత్తలకు వివరించారు. గ్రామంలోని ప్రకృతి వనరుల కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు అందజేస్తున్న కషాయాలు, ద్రావణాల గురించి ప్రాజెక్టు మేనేజర్ తెలియజేశారు. బీజామృతం తయారీ విధానాన్ని లైవ్ డెమో నిర్వహించి, విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మండలంలోని చండ్రాజుపాలెంలో రొయ్యల మంగమ్మ సాగు చేస్తున్న కూరగాయలు, ఏటీఎం మోడల్లో సాగు విధానాలను పరిశీలించారు. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలను వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో లీడ్ ప్రిన్సిపల్ సైంటిస్టులు నాగ మాధురి, శ్రీలేఖ, యూఏఎస్ మాజీ వైస్ చాన్స్లర్ రాజేంద్రప్రసాద్, క్రోసూరు డివిజన్ ఏడీఏ మస్తానమ్మ, అడిషనల్ డీపీఎం ప్రేమ్ రాజ్, వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. పలు గ్రామాల్లో పర్యటించిన శాస్త్రవేత్తల బృందం -
మా పొట్ట కొడితే కచ్చితంగా పాపం తగులుతుంది !
సత్తెనపల్లి: తమ పొట్ట కొడితే కచ్చితంగా పాపం తగులుతుందని సబ్స్టేషన్లలో తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సోమవారం తొలగించిన 13 మంది షిఫ్ట్ ఆపరేటర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. చల్లగుండ్ల సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ కారణంతో తొలగిస్తున్నారో నోటీసు ఇస్తే సంజాయిషీ చెప్పుకుంటామంటే పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతున్నారన్నారు. అధికారుల సూచన మేరకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను కలిసేందుకు 4, 5 సార్లు ప్రయత్నించినా పార్టీ ఆఫీస్ వద్ద అందుబాటులో లేకపోవడంతో గుంటూరు వెళ్లి 19 మంది ఆయన్ను కలిశామని తెలిపారు. ఉద్యోగాలు చేసుకోండని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చెప్పారన్నారు. తిరిగి ఏఈని కలిసి ఎమ్మెల్యే ఉద్యోగాలు చేసుకోమని చెప్పారని తెలియజేశామని వివరించారు. రాజకీయ ఒత్తిళ్లు రీజాయిన్ గురించి అడగటంతో ఏఈ మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని, పై వాళ్లను కలవమని చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో తమ టాలెంట్ చూసి జాబు ఇచ్చినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల సత్తెనపల్లి సబ్స్టేషన్–3లో రాజకీయ నాయకులు మీడియా సమావేశం పెట్టరని, అక్కడికి వచ్చిన వాళ్లంతా డీఎన్ఆర్ దగ్గర బేరసారాలు కుదుర్చుకొని వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అంబటి రాంబాబును కోరితే ఉద్యోగం కల్పించారని, ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. కొత్త సబ్స్టేషన్స్ రావడంతో కొత్తగా జాబులు ఇచ్చారే తప్పా ఎవరినీ తొలగించి ఇవ్వలేదని తెలిపారు. సత్తెనపల్లి సబ్స్టేషన్–3లో కొత్తగా వచ్చిన షిఫ్ట్ ఆపరేటర్లు అంతా డీఎన్ఆర్ అంటున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వచ్చిందని తెలివిగా డీఎన్ఆర్ అని చెబుతున్నారని, ఇక్కడ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణా లేక ఆయనో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జాబులు చేసుకోమంటే డీఎన్ఆర్ ఆపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై సత్తెనపల్లి, నరసరావుపేటలో ధర్నాలు చేసి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం ఆగదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో తొలగించబడిన షిఫ్ట్ ఆపరేటర్లు వజ్రాల వీరారెడ్డి, చింతా సుధీర్బాబు, మాబు సుభాని, అన్నపరెడ్డి అఖిల్రెడ్డి, వెంకట రెడ్డి, పవన్రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, ఓర్సు నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లు రవినాయక్, సుబ్బారావు, అబ్దుల్బాషా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రూపాయి తీసుకోకుండా ఉద్యోగాలు కల్పించారు ఎమ్మెల్యే కన్నాలక్ష్మీనారాయణను కలిస్తే పొట్ట కొట్టనన్నారు మా ఉద్యోగాలతో డీఎన్ఆర్కు సంబంధం ఏమిటి ? కొమెరపూడి సబ్స్టేషన్ వద్ద మీడియాతో షిఫ్ట్ ఆపరేటర్ల ఆవేదన -
ఖాకీనంటూ... మహిళలకు ట్రాప్!
నరసరావుపేట టౌన్: సీసీఎస్ ఎస్సైనని, తక్కువ ధరకు రికవరీ బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ మహిళలను వంచిస్తున్న నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ మోసగాడి గురించి సేకరించిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన మేకల సాయికుమార్ తన పేరును ట్రూ కాలర్లో క్రైమ్ ఎస్ఐ విజయ్గా వచ్చేలా చేసి, మహిళా ఉద్యోగులు టార్గెట్గా ఫోన్లు చేస్తాడు. కాల్ చేసిన వెంటనే తాను ఎస్ఐ అంటూ పరిచయం చేసుకుని మాటలతో మభ్యపెడతాడు.కొన్ని రోజుల తర్వాత దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశామని, ఇందులో కొంత పక్కకు తీశానని చెబుతాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికి వారి నుంచి నగదు కాజేస్తాడు. మరికొందరికి బంగారాన్ని ఆశగా చూపి లోబర్చుకుంటాడు. ఆ తరువాత వారితో సన్నిహితంగా ఉన్న ఆడియో, వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడి డబ్బులు, బంగారాన్ని బలవంతంగా గుంజుకుంటాడు.ఈ నేపథ్యంలో నరసరావుపేటకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు ఏడు మొబైల్స్ వినియోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతని చేతిలో మోసపోయిన మహిళలు ఆరుగురు ముందుకొచ్చారని నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ తెలిపారు. -
కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘీయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేసి ఈశ్వర్ తెలిపారు. పాలపాడురోడ్డులోని కల్యాణ మండపంలో ఆదివారం పల్నాడు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షునిగా తొర్లకొండ చినఅంజయ్య, కార్యదర్శిగా వీరబ్రహ్మంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా యూత్ అధ్యక్షునిగా బాడిశ మస్తాన్రావు (పిడుగురాళ్ల) నియమితులయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఐలాపురం భాస్కర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, సంఘం నాయకులు టి.మంగమ్మ, రంగయ్య, బి.రోశయ్య, సిహెచ్.వెంకటఅప్పారావు తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు చినఅంజయ్య మాట్లాడుతూ త్వరలో జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
పారదర్శకత కోల్పోతున్న ఎన్నికల కమిషన్
గుంటూరు ఎడ్యుకేషన్: భారత ఎన్నికల సంఘం గత దశాబ్ద కాలంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పారదర్శకంగా, జవాబు దారీతనంతో వ్యవహరించడం లేదని సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. దివాకర్ బాబు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బాలానంద కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ అధ్యక్షతన ‘‘రాజ్యాంగం – భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య వక్త దివాకర్బాబు మాట్లాడుతూ రాజ్యాంగంపై నమ్మ కం, విశ్వాసం లేని వాళ్లు పాలకులుగా కొనసాగు తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం, ఆధార్ కార్డును పరిగణన లోకి తీసుకోకుండా జనన ధ్రువీకరణ పత్రాలను కోరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అత్యధికులు బిహార్ నుంచి వలస కార్మికులుగా పలు రాష్ట్రాలకు పోతున్న స్థితిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోక పోవడం విచారకరమని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్కు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సొంత సిబ్బంది ఉండాలని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ప్రజా స్వామ్యం వికసిస్తుందని, దాని రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా దాన్ని కాపాడుకోవాలని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి మాట్లాడుతూ కాగ్, యూపీఎస్సీ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో అధికార పార్టీల జోక్యం ఉండరాదని తెలిపారు. రాజ్యాంగ చర్చా వేదిక సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి. సేవా కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షు డు పి. మల్లికార్జునరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీపీఎం నేత నళినీ కాంత్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగించారు. -
సూపర్ సిక్స్ సభకు ప్రైవేట్ స్కూల్ బస్సులు
●నేడు పిడుగురాళ్లలో అన్ని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ●మంత్రులు రాకతో హడావుడి సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి సీ్త్ర శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఇచ్చిన హామీకి భిన్నంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటికి 15 రోజులు గడిసింది. అయితే సూపర్సిక్స్– సూపర్ హిట్ పేరుతో స్థానిక ప్రజాప్రతి నిధి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీ సభ ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ప్రైవేటు స్కూళ్లకు సెలవులు.. పల్నాడు జిల్లాలోని గురజాల నియోజక వర్గంలో సీ్త్ర శక్తి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు జనసమీకరణకు ప్రైవేట్ స్కూలు బస్సులు ఉపయోగించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాలలకు సెలవు ఇప్పించారు. ఓ పక్క మేము ఉచిత బస్సు ఇచ్చాం అందరూ ఫ్రీగా బస్సు ఎక్కండి, ఆధార్ కార్డు చూపించండి అని చెబుతూ ఈ ప్రైవేట్ స్కూల్ బస్సును ఎందుకు వాడుతున్నారు అని నియోజవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. స్కూల్ సెలవుపై తల్లిదండ్రులు ఆవేదన.. ఆగస్టు నెలలో సుమారు పది రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చాయి.. దీంతో చదువులకు ఆటంకం కలిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలా అనధికారికంగా సెలవులు ఇస్తే ఎలా అని, సెప్టెంబర్లో దసరా సెలవులు కూడా వస్తున్నాయని, దీంతో చదువు ఎలా సాగుతుందని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. -
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సత్తెనపల్లి: విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 12వ అంతర్ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రమం తప్పని సాధన ముందుకు తీసుకు వెళుతుందన్నారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.నరసింహారెడ్డి, గుంటూరు జిల్లా సెక్రెటరీ పి. సామంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, లయోలా ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. అనంతరం విజేతలను అభినందించి, బహుమతులు అందించారు. హోరాహోరీగా పోటీలు... సెమీఫైనల్స్లో వైఎస్సాఆర్ కడప, గుంటూరు జట్లు తలపడ్డాయి. 0–5తో గుంటూరు విజయం సాధించింది. విజయనగరం, కృష్ణా జట్లు పోటీ పడగా, 11–2తో విజయనగరం విజేతగా నిలిచింది. ప్రీ ఫైనల్స్లో గుంటూరు, విజయనగరం తలపడ్డాయి. గుంటూరు 3–2తో గెలిచింది. వైఎస్సాఆర్ కడప, కృష్ణా జట్లు తలపడిన పోటీలో 4–2తో వైఎస్సాఆర్ కడప జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్స్లో విజయనగరం, వైఎస్సాఆర్ కడప జట్లు తలపడ్డాయి. 8–2తో విజయనగరం విజయం సాధించింది. గ్రాండ్ ఫైనల్లో గుంటూరుపై విజయనగరం 5–4తో గెలిచింది. చాంపియన్గా విజయనగరం, రన్నర్స్గా గుంటూరు, తృతీయ స్థానం వైఎస్సాఆర్ కడప, నాలుగవ స్థానం కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకున్నాయి. -
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి
●రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ●మాజీ మంత్రి డొక్కా, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా హాజరు నరసరావుపేట: జిల్లా సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో ఆదివారం పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించిన నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, పద్మభూషణ్ లాంటి బిరుదులు గుర్రం జాషువా పొందారన్నా రు. చిన్నతనం నుంచి పేదరికం, అంటరానితనం మధ్య పెరిగి సమాజంలో రుగ్మతలపై అనేక పుస్తకాలు, కావ్యాలు రచించారని గుర్తుచేశారు. నాటక రంగం, సినీ రంగాల్లో పనిచేసిన గొప్ప వ్యక్తిగా కీర్తించారు. అటువంటి మహోన్నత వ్యక్తి అయిన గుర్రం జాషువా పేరు జిల్లాకి పెట్టాలన్నారు. ఆత్మగౌరవం పెంచేలా... మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం గుర్రం జాషువా అన్నారు. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాకు లేదా గుంటూరుకు జాషువా పేరు పెట్టాలని సూచించారు. టీటీడీ బోర్డు మెంబరు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పల్నాడు గుర్రం జాషువా జిల్లా అని లేదా గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పెడితే ప్రజలు ఆమోదిస్తారని అన్నారు. బులియన్ మర్చంట్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్, కన్వీనర్ కొరివి వినయ్కుమార్, గుర్రం జాషువా మనవడు బీఆర్ సుశీల్కుమార్, బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు నలబోతు రాజు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొల్లిపర బాలాజీ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోదా రమేష్కుమార్, జన జాగృతి మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, ఎంఆర్పీఎస్ నాయకులు మల్లవరపు బాబు, దళిత కవి డాక్టర్ కాకాని సుధాకర్, ఎంఏఎం కాలేజ్ అధినేత, దళిత నాయకుడు క్రిస్టఫర్, ఎస్సీ, ఎస్టీ మాజీ విజిలెన్స్ సభ్యులు మరియదాసు, బీసీ నాయకులు బత్తుల వెంకటేష్ పాల్గొన్నారు. -
‘104’ వాహన సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఉద్యోగుల (ఎంఎంయూ) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని జిల్లా గౌరవాధ్యక్షులు బి. లక్ష్మణరావు తెలిపారు. స్థానిక పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం కె. సత్యరాజు అధ్యక్షతన జరిగిన యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తగ్గించిన వేతనాల సహా ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత యాజమాన్యం అరబిందో నుంచి రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలయ్యే లీవులు, పబ్లిక్ హాలిడేలు, గుర్తింపు కార్డులు, పే స్లిప్పులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు సరిపడా సిబ్బందిని నియమించాలని, అవసరమైన చోట బఫర్ జోన్ ఉద్యోగులను నియమించాలని కోరారు. వాహనాలకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయక పోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చేయించాలని ఆయన కోరారు. రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి ఉద్యోగికి కల్పించాలని విన్నవించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఈఎస్ఐ పరిధి దాటిన వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. డిమాండ్ల సాధనకు నిర్వహించనున్న ఆందోళనలో ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. నూతన కార్యవర్గం ఎన్నిక నూతన అధ్యక్ష, కార్యదర్శిగా గోరంట్ల సురేష్, ఆలూరి శ్రీహర్ష, కోశాధికారిగా ఐ. నాగులు, ఉపాధ్యక్షులుగా కె. సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా బి. బాలకృష్ణ, కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్, ఏడుకొండలు, సురేష్, సాయిరాం, విజయ్ నియమితులయ్యారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మణరావు -
పులిచింతలకు 2.32 లక్షల క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 17 క్రస్ట్ గేట్ల ద్వారా 2,32,037 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ తొమ్మిది క్రస్ట్గేట్లు మూడు మీటర్లు, ఎనిమిది క్రస్ట్గేట్లు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,32,037 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 60.54 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 2,89,876 క్యూసెక్కుల వరదనీరు ఇక్కడ ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత
కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు... కాకుమానుకు చెందిన దొప్పలపూడి చంద్రపాల్(61) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వరినారు కోసం ద్విచక్రవాహనంపై బాపట్ల మీదుగా కర్లపాలెం వస్తున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చంద్రపాల్ తీవ్రంగా గాయపడటంతో అతనిని మొదటిగా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చంద్రపాల్ మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రవీందర్ తెలిపారు. కొల్లూరు: అతి వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని బొద్దులూరుపాడుకు చెందిన కొల్లూరు వెంకట నరసయ్య (68) గ్రామంలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం కొల్లూరులో సామగ్రిని కొనుగోలు చేసుకొని, మోపెడ్పై గాంధీనగర్లో నివసిస్తున్న కుమార్తెను చూసేందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు నరసయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమార్తె 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నరసయ్య మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొల్లూరు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. తెనాలి రూరల్: డివైడర్ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ మారిస్పేట నిజాంపట్నం కాల్వ కట్టపై నివసించే అన్నపురెడ్డి పవన్(21) బైక్పై వెళుతూ కొత్త వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారంచేడు: మార్టూరు నుంచి చీరాలకు సరిహద్దు రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఆదివారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో.. కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ ట్రక్కు వెనుక టైర్లకు ఉండే బేరింగ్లు ఊడిపోవడంతో ట్రక్కు ఒక్క సారిగా తిరగబడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కూడా నిధానంగా ప్రయాణిస్తుండటంతో కేవలం ట్రక్కు మాత్రమే బోల్తా పడింది. దీంతో రాళ్లు ప్రధాన రహదారిలో పడటంతో వాహన ప్రయాణాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఏఎస్ఐ శేషసాయి తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ.1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. విరాళాలు ఇచ్చినందుకు అభినందించారు. -
కరాటే పోటీల్లో సత్తా చాటిన సత్తెనపల్లి విద్యార్థులు
సత్తెనపల్లి: సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30,31న జరిగిన సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లికి చెందిన షికోకాయ్ షిటోరియో కరాటే ఇనిస్టిట్యూట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ చూపి ఐదు గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ను కై వసం చేసుకుని సత్తెనపల్లి పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చినట్లు కరాటే మాస్టర్ అనుముల రామయ్య ఆదివారం తెలిపారు. బాలికల కటా విభాగంలో బి అక్షయ్రెడ్డి గోల్డ్ మెడల్, బాలుర కటా విభాగంలో బి.టిష్యంత్, ఎంవీ.బాలాజీ, ఎల్ కిరీట్, ఎల్ గెష్ణ్ఆషిత్లు గోల్డ్మెడల్స్ సాధించగా .. బి.సత్యనారాయణ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ప్రతిభ చూపిన విద్యార్థులను అకాడమీ ఆర్గనైజర్ ఏ.వీరబ్రహ్మం, అడ్వైజర్ ఏ.రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు. -
పండగలోనూ పోలీస్ ‘పచ్చ’పాతం
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి పాలనలో వినాయక విగ్రహాల విషయంలోనూ పోలీసుల పక్షపాత వైఖరి మారడం లేదు. టీడీపీ నాయకుల మాటే తమకు శాసనమంటున్నారు. రాజ్యాంగబద్ధంగా తాము పని చేయబోమని తేల్చేస్తున్నారు. కూటమి నాయకుల మాటే తమకు వేదం అంటూ పల్నాడు జిల్లాలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇదే కోవలో వారి తీరుకు నిదర్శనంగా నిలిచే ఘటన గురుజాల నియోజవర్గంలోని పిడుగురాళ్లలో జరిగింది. అనుమతి ఇచ్చింది వారేగా.. వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు ముందే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిమకు, ఊరేగింపునకు, డీజేకి అనుమతి తీసుకోవాలని చెప్పారు. పిడుగురాళ్ల టౌను, మండలం పరిధిలోనే గ్రామాలలో ఉన్న ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆ మేరకు అనుమతులు తీసుకున్నారు. ఏ పోలీసులైతే అనుమతి ఇచ్చారో వారే ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు చెప్పిన మండపాలు, విగ్రహాలు, డీజే ఊరేగింపులకు అవకాశం ఇస్తున్నారు. పండగల సంస్కృతి, సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం తన రాజకీయాలతో కలుషితం చేస్తోంది. ఓ పక్క సనాతన ధర్మం తమదే , దేవుడిపై నమ్మకం తమకే ఉందంటూ వినాయక విగ్రహాల నిమజ్జనంలోనూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు తమవంతుగా సాగిలపడుతున్నారు. వైఎస్సార్సీపీ వారే లక్ష్యం మండలంలోని పలు గ్రామాలలో అన్ని పార్టీల వారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రతిమలకు మాత్రమే అడ్డగోలు నిబంధనలు విధించారు. కనీసం డీజిల్ పెట్టుకొని వినాయకుని నిమజ్జనం చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. తాము పార్టీ పాటలు పెట్టబోమని చెప్పినా తమపై ఒత్తిడి ఉందని పోలీసులు అంగీకరించడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపులో డీజేలు, నాయకుల బొమ్మలు, పార్టీ జెండాలు కనిపిస్తున్నా వారిని ఒక్క మాట కూడా అనడం లేదు. కూటమి నేతలైన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కటౌట్లతో వినాయక నిమజ్జనం ఊరేగింపులో పచ్చ నేతలు నానాయాగీ చేశారు. పవన్ కళ్యాణ్ వాడిన డైలాగులను పదేపదే పెట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడం, స్టేషన్కు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయటం ఇప్పటివరకు కూటమి పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పండగ వేడుకల్లో కూడా అదే ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతలకు సాగిలపడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నారు. వినాయక చవితి వేడుకల్లో వైఎస్సార్సీపీ వారిపై అడ్డగోలు ఆంక్షలు విధించడమే దీనికి నిదర్శనం పచ్చనేతలు చెబితేనే అనుమతి గ్రామాలలో ఏ పార్టీ వారైనా విగ్రహ ఊరేగింపునకు స్థానిక టీడీపీ లీడర్లు చెబితేనే పర్మిషన్ ఇస్తామని పోలీసులు బహిరంగంగానే చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది. రూ.లక్షలు పెట్టి పండగ చేసుకుంటుంటే ఈ రాజకీయాలు ఏంటని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీకి ఒక రకంగా, వేరొక పార్టీకి మరోవిధంగా చట్టాలు ఉంటాయా? అని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకే పోలీస్స్టేషన్ కదా.. మరి ఈ పక్షపాత ధోరణి ఎందుకని నిలదీస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఇలాంటివి ఎప్పుడూ ఎక్కడా జరగలేదని గుర్తుచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పిడుగురాళ్ల టౌన్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపులో భారీ శబ్దాలతో డీజే ఏర్పాటు చేశారు. మరి అదే టౌన్లో పల్నాడు హాస్పిటల్ వారు ప్రభుత్వానికి రూ.600 చలానా కట్టి పర్మిషన్ తీసుకున్నా పైనుంచి ఒత్తిడి అంటూ డీజేకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతల కోసం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైన చట్టం ఏమైనా చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చవితి వేడుకల్లో వైఎస్సార్సీపీ వారికే అడ్డగోలు నిబంధనలు