Palnadu
-
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
పాస్పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహనరసరావుపేట: ఈ–కేవైసీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం డివిజినల్ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాలకు ఈ–కేవైసీ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులలో వెనుకబడి ఉన్న తప్పనిసరిగా ప్రగతి చూపించాలని, లేనిపక్షంలో చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇళ్ల గణన పరిశీలన.. జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని రామిరెడ్డిపేటలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇళ్ల గణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కేసులు.. నరసరావుపేట: జిల్లాలో బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే బాల్యవివాహాలు చేసే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సకాలంలో అధికారులను అప్రమత్తం చేయటం ద్వారా వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహం, దాచేపల్లిలోని మరో వివాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన కోసం తీసుకోవలసిన చర్యలపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో గ్రామస్థాయి, కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థినుల ఇళ్ల వద్ద నిఘా ఉంచాలని, గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
జిల్లా క్రీడాకారులకు అంతర్జాతీయ పతకాలు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చాగంటివారిపాలెం (ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన జరిగింది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ (39) చాగంటివారిపాలెంకు చెందిన రుద్రపాటి చంద్రశేఖర్ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్నా సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెంది ఉంది. చంద్రశేఖర్కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... చంద్రశేఖర్తో సైదాబీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే చాగంటివారిపాలెం గ్రామానికి తరచూ వస్తుండేదని స్థానికులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చంద్రశేఖర్ను బిర్యానీ కోసం బయటకు పంపించి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైదాబీ మృతిని తట్టుకోలేక ఎక్కువ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడైంది. సైదాబీకి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే నీట్కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన
● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్ పట్టే ప్రసక్తే లేదని కాల్ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్కాల్ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్ దుర్గాప్రసాద్కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్ఎం ఫోన్ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్డ్రైవర్లతో ఫోన్ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు. -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతంలో రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డ్
కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్ విల్సన్బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్ విల్సన్బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్ విల్సన్బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్ విల్సన్ బాబుకు సర్టిఫికెట్, మెడల్ అందాయి. -
హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలు పూర్తి చేయాలి
కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్ పీహెచ్సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్, పర్చూరు కో లోకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్సీ వైద్యాఽధికారి డాక్టర్ డాక్టర్ హరిత, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నరసరావుపేట రూరల్: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని రావిపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని కాసు వెంగళరెడ్డి కాలనీకి చెందిన కాలే పాపమ్మ(75) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. రెండు రోజుల కిందట వరకు మిరప కూలి పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతిచెందింది. రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామం వద్దగల కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విప్పర్ల గ్రామానికి చెందిన కోరా వెంకటేశ్వర్లు(30) మృతి చెందాడు. కోరా వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై రెడ్డిపాలెం గ్రామం నుంచి తన స్వగ్రామమైన విప్పర్ల గ్రామానికి వస్తూ ఎక్స్ప్రెస్వేని దాటుతుండగా నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ ప్రాంతంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. విజయపురి సౌత్లోని డౌన్ మార్కెట్కు చెందిన మైలపల్లి గోవింద్ (42) శ్రీశైలానికి వెళ్లే మార్గంలో జోడుతొట్లు వద్ద ఉంటున్నాడు. సోమవారం పిల్లలతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు సాగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో జెండాపెంట వద్ద గోవింద్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రా నాగార్జున బాబు (24) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నాగార్జున బాబు భార్య పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన నాగార్జున సంతోషంతో తిరిగి వెళ్తూ మద్యం తాగాడు. అనంతరం వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నాగార్జున మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్ఓ యశ్వంత్, జాషువా, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేత నాగార్జునయాదవ్పై మరో కేసు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్్లో మంగళవారం మరో అక్రమ కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ నాగార్జునయాదవ్ గతంలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2024 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 244 రోజులపాటు ఈ నిధులు స్థానిక సంస్థలకు అందలేదని ఆయన గణంకాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు అసత్యమని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని జనసేన నేత రామ సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇదే అంశంపై నాగార్జునయాదవ్పై కొద్దిరోజుల కిందట కాకినాడ జిల్లాలో కూడా కేసు నమోదు చేశారు. -
ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సాగు కనెక్షన్లపై దృష్టి రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కోసం 12 సబ్స్టేషన్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్, కాలనీల నుంచి విద్యుత్ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్ సాధించామని, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్ డైరక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ పి.విజయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీల గృహాలపై బిగించేందుకు చర్యలు -
టార్గెట్ గుంటూరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది. సిబ్బంది కొరతే పెనుసవాలు రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని జీఆర్పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్ గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు. అసలేం జరిగింది రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్లతో సహా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్లు తుపాకులతో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మాత్రం విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. -
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
గణపవరంలో క్షుద్రపూజల కలకలం
నాదెండ్ల: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నాదెండ్ల–గణపవరం ఎన్ఎస్పీ కాలువ కట్ట మీద ముగ్గుతో గీతలు గీసి పసుపు కుంకుమ, అరటి నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్ధానికులు గుర్తించారు. సోమవారం ఉదయం స్థానిక రైతులు అటుగా వెళ్తూండగా, వింత ఆకృతిలో గీసిన ముగ్గు, పూజా సామాగ్రి చూసి ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. 14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. 23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. -
ఆర్టీసీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి
1980లో అమరావతిలో బస్టాండ్ నిర్మాణం కోసం అమరేశ్వర దేవస్థాన సర్వీసు మాన్యంకు చెందిన నాలుగు సెంట్ల భూమిని ఆర్టీసీ సంస్థకు ఇచ్చారు. నెల కిందట దేవినేని సాంబశివరావు అతని అనుచరులు తన మామకు అందులో ఒక సెంటు స్థలం ఉందంటూ పొక్లెయిన్తో స్థలంలోని పంపుహౌస్ను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. డిపో మేనేజర్ నాగమణికి పార్టీ తరపున ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ స్థలాన్ని పరిరక్షించి ప్రహరీ నిర్మాణం చేసి పంపుహౌస్ను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం సంస్థకు చెల్లించేలా చూడాలి. –బి.సూరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి, అమరావతి -
అర్జీలు నాణ్యతగా పరిష్కరించాలి
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతతో అలసత్వం లేకుండా గడువులోపు పరిష్కారం చేయాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారిచే 119 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ క్లినిక్కు సంబంధించినవి 15 అర్జీలు ఉండగా అందులో నరసరావుపేట డివిజన్ నుంచి ఏడు, గురజాల, సత్తెనపల్లి డివిజన్ల నుంచి నాలుగు చొప్పున ఉన్నాయి. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం
నరసరావుపేట రూరల్: భూ వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవి సంతోష్ పీజీఆర్ఎస్లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలనిఅనదపు ఎస్పీ సూచించారు. సమాఖ్య లీడర్ మల్లెల అనీల నాకు తెలియకుండా నాలుగు పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా చేర్చి బ్యాంక్ల నుంచి సుమారు రూ.10లక్షల వరకు రుణం తీసుకుని మోసం చేసింది. బ్యాంక్ నుంచి రుణం చెల్లించమని నోటీసులు రావడంతో విషయం తెలిసింది. దీనిపై అనీలను ప్రశ్నించగా బ్యాంక్కు డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పిందని, రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను చెల్లించనని బెదిరింపులకు పాల్పడుతుంది. ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన అనీలపై చర్యలు తీసుకోవాలి. –కంచర్ల సుజాత, నరసరావుపేట గ్రామంలో నాకు చెందిన 13 సెంట్లలో రెండు సెంట్లలో దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెలకు ఇచ్చాను. ఈ స్థలం నాదంటూ పాపిరెడ్డి అనే వ్యక్తి వచ్చి దుకాణాదారులను బెదిరించి అద్దె వసూలు చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా స్థలాన్ని సర్వే చేసి నాదిగా నిర్దారించారు. అయినా పాపిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ దాడికి ప్రయత్నిస్తున్నాడు. నాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. –దిడిచినాల రామిరెడ్డి, శిరిగిరిపాడు ఉద్యోగం కల్పిస్తానని మోసం చేశారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన రాజా హిందుస్తాన్ నిధి సంస్థలో సేల్స్ ఆఫీసర్గా నియమించారు. నెలకు రూ.45వేలు జీతం అని ప్రకటించి నాలుగు నెలలుగా పని చేయించుకుంటూ జీతం ఇవ్వడం లేదు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి. –జంగాల కోటేశ్వరరావు, నరసరావుపేట ఏటీఎం సెంటర్లో సహాయం చేస్తానని చెప్పి యువతి తన అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన పెదనందిపాడు రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లాను. నాకు చదువు లేకపోవడంతో అక్కడే ఉన్న యువతిని డబ్బులు డ్రా చేసి పెట్టమని కోరాను. యువతి పలు నెంబర్లు కొట్టిన తరువాత కార్డు పనిచేయడం లేదని వెళ్లిపోయింది. దీనిపై బ్యాంక్ అధికారులను సంప్రదించగా నా అకౌంట్ నుంచి రూ.26వేలు డ్రా చేసినట్టు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. –షేక్ మీరా అహ్మద్, చిలకలూరిపేట -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
వేసవి సెలవుల్లో సమావేశాల ఏర్పాటు తగదు
ఎస్టీయూ నాయకులు నరసరావుపేట ఈస్ట్: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత కూడా వరుసగా వివిధ సమావేశాల పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించటం తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్టీయూ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును కలసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో ఆడ్మిషన్ డ్రైవ్ను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ, వేసవి సెలవుల మధ్యలో ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయంలో మండల స్థాయిలో పాఠశాల ప్లాన్, హ్యాబిటేషన్, క్లస్టర్ ప్లాన్, మండల ప్లాన్ను ఈనెల 13వ తేదీలోపు పూర్తి చేయాలని గడువు విధించటం సరికాదని తెలిపారు. ఈమేరకు సమగ్ర శిక్ష ప్లాన్ షెడ్యూల్ ప్రకటించటం అభ్యంతరకరమని తెలిపారు. అధికారుల తీరుతో విద్యా శాఖ వెకేషన్ డిపార్ట్మెంటా లేదా నాన్ వెకేషన్ డిపార్ట్మెంటా అని ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నవంబర్ నెలలో స్కూల్ డెవలప్మెంట్, హ్యాబిటేషన్, క్లస్టర్, మండల ప్రణాళికలను పూర్తి చేయాల్సి ఉందనీ, వేసవి సెలవుల్లో షెడ్యూల్ విడుదల చేయటాన్ని ఎస్టీయూ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత మరోమారు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. డీఈఓ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళతానని తెలి పా రు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్.మహబూబ్ సుభానీ, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు షేక్.కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్ వై.రామయ్య, పి.వి.మల్లికార్జునరెడ్డి, రొంపిచర్ల మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇసుక భూముల్లో నమూనాల సేకరణ
చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల మండలం చందవరానికి చెందిన గొర్రపాటి శ్రీనివాసరావు తూబాడుకు చెందిన పురుగుమందుల వ్యాపారి పూదోక నాగేశ్వరరావు వద్ద ఏడాది క్రితం రూ.2.09 లక్షల విలువైన పురుగుమందులు కొనుగోలు చేశారు. ఈనెల నాలుగున నాగేశ్వరరావు శ్రీనివాసరావుపై ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్ ధర కంటే తక్కువగా రూ.8.95 లక్షల విలువైన 50 క్వింటాల మిర్చి కొనుగోలు చేశారు. బాకీ రూ.2.63లక్షలు కాగా మిగతా డబ్బులు ఇవ్వమని శ్రీనివాసరావు వ్యాపారిని అడిగినా నకిలీ బిల్లులు చూపించి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నాడు. బాధితుడికి న్యాయం చేయండి. –జి.రామకృష్ణ, కోటనాయక్, వై.వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు -
ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్ఎల్టీపీ ప్రోగ్రాం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వ హించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్ ప్లాజమ్ డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. -
క్షణికావేశంతోనే..
సాక్షి, నరసరావుపేట: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కార్ల్ మార్క్స్. ప్రస్తుత సమాజంలో అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే విలువనిస్తున్నారు. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబంధులుగా మారుతున్నారు. అంతవరకు తమలో ఒకరిగా ఉన్న వ్యక్తులు అంతలోనే శత్రువులుగా మారుతున్నారు. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువవుతోంది. ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ముల్లే యమకింకరులవుతున్నారు. ఆస్తి కోసమో... క్షణాకావేశమో కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల చిలకలకూరిపేటలో కన్న తల్లిదండ్రులనే చంపాలని కూతురు చేసిన హత్యాయత్నం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ మొదలైంది. తల్లిదండ్రుల ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించి.. కనిపెంచిన తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి వస్తుందన్న కారణంతో కూతురు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టిన ఘటన గత నెల 29వ తేదీన చిలకలకూరిపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడిలో నివాసం ఉంటున్న గౌడిశెట్టి సుకన్య, మల్లికార్జునరావులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు వివాహమై ఓ కూతురు పుట్టిన తరువాత భర్తతో విడాకులు తీసుకొని పట్టణంలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కొన్నాళ్లుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. గత నెల 29న తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి ఇంట్లో దాచిన బాణసంచా పేలడంతో పెద్ద శబ్దం రావడంతో తల్లిండ్రులకు మెలుకువచ్చి అదృష్టవశాత్తు మంటల నుంచి బయటపడ్డారు. తాము చనిపోతే ఆస్తి వస్తుందని కన్న కూతురు ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లి సుకన్య చిలకలూరిపేట టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు నివ్వెరపోయారు. ఆస్తి కోసం తల్లిదండ్రులనే చంపాలని కూతురు చూడడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం కోసం తండ్రినే... పొలం కోసం కన్నకొడుకే తనను గొంతునులిమి చంపబోతే ఊరి వదిలి పారిపోయానని తనకు రక్షణ కల్పించాలని ఓ తండ్రి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... దాచేపల్లికి చెందిన అచ్చాల కనకయ్య(70)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. అందరికీ పెళ్లికాగా చిన్న కుమారుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో వారితోనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకి పదేళ్ల క్రితమే ఆస్తి పంపకాలు చేసేసాడు. అయితే తన బతుకుతెరువు కోసం ఉంచుకున్న కొద్దిపాటి పొలం కోసం తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గత నెల ఇదే క్రమంలో తనను గొంతునులిమి చంపబోతే పొన్నూరు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నానని కనకయ్య ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ముందు గోడువెళ్లబోసుకున్నాడు. కుటుంబ సభ్యులు తన ఆచూకీ కనుగొని మళ్లీ దాచేపల్లికి తెచ్చారని, అయితే తనకు పెద్ద కొడుకు ద్వారా ప్రాణహాని ఉందని ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. ఆస్తి కోసమో, పంతం కోసమో సొంత కుటుంబ సభ్యులను సైతం హత్య, దాడులు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. క్షణాకావేశంతో తాము ఏమి చేస్తున్నాం అన్న స్పృహ లేకపోవడంతోనే ఈ హత్యలు చేస్తున్నారు. ఆర్థికపరమైన ఆంశాలు, పట్టింపులే బంధుత్వాలు దెబ్బతినడానికి కారణమని ఎక్కువమంది మా వద్దకు వస్తున్న వారి ద్వారా తెలిసింది. కొంతమందికి మానసిక రుగ్మతల వల్ల ఇలాంటి విపరీతపోకడలకు వెళుతున్నారు. వారిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం చేయిచాల్సి ఉంది. మారుతున్న కాలంతోపాటు కుటుంబ విలువలు తగ్గిపోవడం కూడా దీనికి కారణమవుతోంది. –డాక్టర్ సతీష్ అత్తిలి, మానసిక వైద్యుడు, నరసరావుపేట ఏరియా వైద్యశాల -
ఉక్కుపాదం మోపాలి
అక్రమ లే–అవుట్లు, నిర్మాణాలపై నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు, అక్రమ లే–అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, డీపీఓ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లే అవుట్లపై ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2016 ప్రకారం అనధికార లే–అవుట్లను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ ఐదు ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్, కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనకాడకూడదని స్పష్టం చేశారు. ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం, పటిష్టమైన పర్యవేక్షణ ద్వారానే అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేయగలమని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు కె.బాలకృష్ణ, శ్రీరాములు, మురళీకృష్ణ, డీఎల్డీఓలు వెంకటరెడ్డి, గబ్రూ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల గణన పూర్తిచేయని అధికారులపై చర్యలు జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ హెచ్చరించారు. సోమవారం జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల ఒకటవ తేదీ నుంచి 30లోగా ఇళ్ల గణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇళ్ల గణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి నెలాఖరులోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహా -
మనీషి
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026మాయమవుతున్న‘మాయవయ్యాడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్నట్లుగా.. స్వార్ధం నిండిన సమాజంలో మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతుండగా.. అంతంతమాత్రంగానైనా ఉన్న ప్రేమలు అంతర్ధానమవుతున్నాయి. విలువల వలువలు విప్పగా.. మనిషిగా చచ్చి.. అతనిలోని రాక్షసత్వం బట్టబయలై నడిరోడ్డుపై వికటట్టహాసం చేస్తోంది. ఈక్రమంలో తోటివారికి సాయం దేవుడెరుగు.. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే హతమార్చేందుకు వెనుకాడని ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. ఇందులో లింగభేదం ఎంతమాత్రం లేకపోవడం విశేషం. ఆస్తికోసం తోడబుట్టిన వారిని తుదముట్టించిన సోదరి.. కన్నతల్లిదండ్రులపై పెట్రోలు పోసి తగలబెట్టేందుకు యత్నించిన కూతురు.. వృద్ధుడనే కనికరం కూడా లేకుండా తండ్రిని చంప చూసిన కసాయి కొడుకు.. ఇలాంటి ఘటనలో జిల్లాలో నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. -
దళిత యువకులపై టీడీపీ వర్గీయుల దాడి
టాస్క్ఫోర్స్(ముప్పాళ్ళ): తిరునాళ్లలో భాగంగా ఎస్సీ వర్గీయులు బాణాసంచా పేల్చటానికి వీలులేదంటూ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడికి దిగిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గీయులు విద్యుత్ప్రభ పైన ఆర్కెష్ట్రా ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు జొన్నలగడ్డ ప్రసన్న, మాతంగి రత్నబాబు, మరికొందరు దీపావళి మందులు కాల్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ, గరికపాటి సాంబశివరావు, గరికపాటి కరుణ, ఎర్రంనేడి రవితేజ తో పాటుగా మరికొంతమంది మీకు ఇక్కడేం పనిరా అంటూ... ఒక్కసారిగా దాడికి దిగారు. దాడితో పాటుగా విచక్షణారహితంగా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో దుర్బాషలాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబసభ్యులను సైతం బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు యువత తెలిపారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగటం గమనార్హం. దాడిలో ప్రసన్న, రత్నబాబులకు స్వల్ప గాయాలయ్యాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఇలాంటి దాడులు చేయడం ఏంటని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై బాధితులు ముప్పాళ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక
సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే 45వ జాతీయస్థాయి సబ్ జూనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాల, బాలికల జట్టును ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరుశరాముడు సోమవారం ప్రకటించారు. బాలుర జట్టు రామ్ తేజ్, ( కెప్టెన్ కృష్ణా జిల్లా), తిరుమల సాయి త్రినేష్ (విశాఖపట్నం), నందన్రెడ్డి (గుంటూరు), కార్తీక్ (కర్నూలు), శ్రీను నాయక్ (అనంతపురం), సురేష్, చితాస్ (పల్నాడు), గణేష్ (అన్నమయ్య), శేషాద్రి (తిరుపతి), అభిలాష్ (అనంతపురం), రిత్విక్ రెడ్డి (నెల్లూరు), ఎతిక్ రత్న (ఏలూరు) ఎంపికయ్యారు. బాలికల జట్టు యశస్విని (కెప్టెన్, చిత్తూరు జిల్లా), భూమిక (విశాఖపట్నం), గీతిక (గుంటూరు) ఊహ (గుంటూరు), సుచరిత (ప్రకాశం) ,హర్షిత (పల్నాడు), స్వాతి కీర్తన (పల్నాడు), శేన్షి (తిరుపతి), శ్రీలత (అన్నమయ్య), అర్చన (నెల్లూరు), జశ్విత రాణి (అనంతపురం), ఎం.హర్షిణి (గుంటూరు)లు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాణించి విజయంతో తిరిగి రావాలనీ పరశు రాముడు అభినందించారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి కిరణ్కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి విజయకుమార్ పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంక్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలని, శాశ్వత ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి
చిలకలూరిపేటటౌన్/ యడ్లపాడు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా చిలకలూరిపేట డిపో డ్రైవర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తున్న బస్సును చౌడవరం స్టాప్వద్ద ఆపకపోవడంతో స్థానికులు కొందరు ఆగ్రహించి డ్రైవర్ జి దుర్గాప్రసాద్పై భౌతిక దాడికి దిగడం ఈ ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలిసింది. తమ సహచర ఉద్యోగిపై జరిగిన దాడిని ఖండిస్తూ సుమారు 35 మంది అద్దె ప్రాతిపదికన పనిచేసే (కాల్) డ్రైవర్లు ఉదయం నుంచే విధులను బహిష్కరించి మరుసటిరోజు బస్టాండ్ ఆవరణలో ధర్నాకు దిగారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించే వరకు బస్సులు కదిలించేది లేదని భీష్మించుకోవడంతో డిపో కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. డిపో మేనేజర్ వై వేణు ఆందోళనకారులతో చర్చలు జరిపి సర్దిచెప్పే ప్రయత్నం ఫలించలేదు. కార్మికులు ససేమిరా అనడంతో పాటు సోమవారం తమ విధుల్ని పూర్తిగా బహిష్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఇక్కట్లు... డ్రైవర్ల ఆందోళన ప్రభావం సామాన్య ప్రయాణికులపై తీవ్రంగా పడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు గంటల తరబడి నిలిచిపోవడంతో బస్టాండ్లో వేచి ఉన్న మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర డ్రైవర్ల ద్వారా కొన్ని సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ, మరో 8 బస్సులు డ్రైవర్లు లేక డిపోకే పరిమితమయ్యాయి. బాధిత డ్రైవర్ ద్వారా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ సిబ్బంది నిరసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భద్రతపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటం ఆపబోమని డ్రైవర్ల సంఘం స్పష్టం చేయడంతో డిపో పరిసరాల్లో ఆందోళన వాతావరణం కొనసాగుతోంది. -
ఆర్టీసీ బస్సు కిందకు దూరిన బైక్
పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు కింద ద్విచక్రవాహనం దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక చెందిన షేక్ బుజ్జి(41) బైక్పై చిలకలూరిపేట వైపుకు వస్తుండగా అదే సమయంలో చీరాల–సత్తెనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురైంది. ప్రమాదవశాత్తూ బుజ్జి బైక్ ఆర్టీసీ బస్సు ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. బుజ్జికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుజ్జి మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడో అంతస్తులో వివాహాల సందడి సాయంత్రం పెరిగిన రద్దీ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ -
భద్రత దైవాధీనం
పల్నాడుసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026● జిల్లాలో కలవరపెడుతున్న వరుస చోరీలు ● కారంపూడి దోపిడీ ఘటన మరువక ముందే సత్తెనపల్లిలో భారీ చోరీ ● తాళాలు వేసిన ఇళ్లే దొంగల టార్గెట్ ● నియంత్రణలో విఫలమవుతున్న పోలీసులు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో వరుస చోరీలు ప్రజలను కలవర పెడుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో నిత్యం దొంగతనం కేసులు నమోదు అవుతుండటం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దోచుకువెళ్తున్నారు. పార్క్ చేసిన వాహనాలు క్షణాల్లో మాయమవుతున్నాయి. ● జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 20 రోజుల క్రితం ప్రకాష్నగర్ రిజిష్ట్రార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో షిరిడీ యాత్రకు వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను అపహరించుకు వెళ్లారు. ● తాజాగా మూడు రోజుల క్రితం సత్తెనపల్లిలో రెండు బంగారు దుకాణాల్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గొళ్లమూడివారి వీధిలోని నాగలక్ష్మీ జ్యూయలర్స్, శ్రీకృష్ణా డైమండ్ హాల్ జ్యూయలర్స్ దుకాణాల్లో తాళాలు పగులగొట్టి రూ.8 లక్షల విలువైన మూడు కిలోల వెండి వస్తువులను అపహరించుకు వెళ్లారు. మరో దుకాణంలో తాళాలు పగులగొట్టి చోరీకి విఫల యత్నం చేశారు. ఈ ఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ● నెల రోజుల క్రితం సత్తెనపల్లి మార్కెట్ యార్డు కార్యాలయ తాళాలు పగులగొట్టి ఆఫీస్లోని విలువైన వస్తువులు అపహరించుకు వెళ్లారు. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ చోరీల పరంపరకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో చిన్నపాటి దొంగతనాలు చోటుచేసుకోవటం పరిపాటిగా మారింది. చోరీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని అయితే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లని సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పోయిన సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకం లేక చాలా మంది ఫిర్యాదు చేయటానికి వెనకడుగు వేస్తున్నారన్నా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నపాటి చోరీలను బాధితులు మౌనంగా భరించాల్సి వస్తుంది. ఇటీవల వినుకొండ దక్షిణం బజారుకు చెందిన అడ్డగిరి లక్ష్మి మెడలో బంగారపు గొలుసును పట్టపగలు లాక్కెళ్లారు. అడ్డువచ్చిన భర్త కొండయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడి పరారీ అయ్యారు. ఇలా ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు నానుతాడులు లాక్కువెళ్లటం వంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. పగలు ప్రాంతాలను పరిశీలిస్తూ తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను గుర్తిస్తున్న దొంగలు రాత్రి వేళ వాటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్నారు. రోజుల తరబడి తాళం వేసి ఉంటే అటువంటి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు ఇంటికి తాళాలు వేయకుండా ఆరుబయట నిద్రించే ఇళ్లపై దొంగలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు దొంగలు సీసీ కెమెరాలకు సైతం దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖాలకు మాస్క్లు, టోపీలు ధరించి కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దీంతో దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నా నిందితులను గుర్తించటం సవాల్గా మారింది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) తో పోలీస్ శాఖ ఇళ్లకు సాంకేతిక భద్రత ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళ్తే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. ఆ ఇంటిని పోలీసులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ విధానం ఇళ్లకు రక్షణ కవచంలా నిలుస్తోంది. ఆన్లైన్ యాప్ సిస్టమ్లో అభ్యర్థిస్తే పోలీస్ సిబ్బంది ఇంటికి వచ్చి ఆ సౌకర్యాన్ని అమర్చుతారు. ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు ఈ ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సత్తెనపల్లిలో చోరీ జరిగిన బంగారు ఆభరణాల దుకాణం బల్లవంతపు వసూలు!యడ్లపాడు: సాధారణంగా వి ద్యార్థి దశ అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కుల చుట్టూనే తిరుగుతుంది. కానీ, కొందరు మాత్రం చదువుతోపాటు ఒక ప్రత్యేక కళను ప్రాణంగా ప్రే మిస్తారు. ఆ ప్రేమే వారిని ప దిమంది ప్రేమించేలా.. ప్రశంసల్ని పొందేలా చేస్తుంది. ఇందుకు యడ్లపాడు మండలం చారిత్రక ప్రాంతమైన కొండవీడుకు చెందిన షేక్ సనా కౌసర్ను చక్కని ఉదాహరణ. కుంచె లేని అక్షర చిత్రకారిణి ఆటో డ్రైవర్ రషీద్, ఫాతిమా దంపతులకు ఇద్దరు సంతానంలో చిన్న కుమార్తె కౌసర్. పేద కుటుంబమే అయినా, పేదరికానికి ప్రతిభకు సంబంధం లేదని ఈ బాలిక నిరూపించింది. స్వభావరీత్యా బిడియం ఎక్కువే అయినా, ఆమె అక్షరాల్లో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన కౌసర్, తన చేతిరాతతో చిత్రకారుడినే తలపిస్తోంది. ముంబాయికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించి, ‘అక్షరం’ అంటే సమాచారం కాదు, అది ఒక ‘అలంకారం’ అని చాటిచెప్పింది శిష్యరికం నుంచి శిక్షణ వరకు.. తన గురువు డాక్టర్ షేక్ జున్ను మాస్టర్ పర్యవేక్షణలో లుసిడా, ప్రింట్ హ్యాండ్ రైటింగ్లో ఏడాది పాటు కఠోర సాధన చేసింది. కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాలేదు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలనే తపనతో యడ్లపాడులో బాసట ఆధ్వర్యంలో జరిగే ఉచిత వేసవి శిబిరంలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 43 మందికి హ్యాండ్ రైటింగ్పై శిక్షణ ఇచ్చింది. తనకంటే పెద్దవారైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సైతం అక్షరాల మెలకువలు నేర్పిస్తూ ‘చిన్నారి గురువు’గా నీరాజనాలు అందుకుంటోంది. కౌసర్ ప్రతిభను గుర్తించిన బాసట సామాజిక సంస్థ, గురువు సరసన బాలికను కూర్చోబెట్టి ఘనంగా సత్కరించడం కౌసర్ పట్టుదలకు దక్కిన గౌరవం. గురుశిష్యులను సత్కరిస్తున్న బాసట స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు 7వేసవి సెలవులు రావటంతో పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉక్కపోతకు ఆరుబయట, డాబాలపై నిద్రించే వారు ఉన్నారు. ఇదే అదునుగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా రాత్రిళ్లు గస్తీ బలహీనంగా ఉందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అధికారులు దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించి రాత్రిళ్లు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత నేరస్తుల కథలికలపై నిఘా ఉంచటంతో పాటు అనుమానితులపై పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కారంపూడిలో పట్టపగలు వ్యక్తి పై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన సంఘటన వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. గత నెల 27వ తేదీన వినుకొండకు చెందిన యక్కల శ్రీనివాసరావు కారంపూడిలో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చాడు. అతనిని అడ్డగించి ద్విచక్రవాహనంపై వచ్చిన ఆరుగురు నిందితులు రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.కౌసర్ సాధించిన విజయం చిన్నదే కాని, మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. ప్రతి విద్యార్థిలో నూ ఒక ప్రత్యేకమైన సృజనాత్మకత, నైపుణ్యం దాగి ఉంటాయి. చిన్న వయసులోనే పిల్లల ఆలోచనలను, వారిలోని సహజ సిద్ధమైన అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి. తమకు నచ్చిన కళలను నేర్చుకునే అవకాశం కల్పిస్తే అది వారిలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచన చేయాలి. పిల్లల అభిరుచులను గుర్తించి వెన్నుతట్టాలి. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కళల్లో నిష్ణాతులుగా ఎదిగేలా ప్రాథమిక స్థాయి నుంచే కృషి జరగాలి. అప్పుడే జీవితంలో వారు గొప్పగా రాణించగలుగుతారు.లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్ చేస్తాం. – కోయ శ్రీనివాసరావు, ఎంపీడీఓ, అచ్చంపేట అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. -
లీజు ముగిసినా కొనసాగుతున్న బల్లకట్టు
● ఈ ఏడాది మార్చితో ముగిసిన వైనం ● టీడీపీ నేతల అండతో వేలం నిర్వహణను అడ్డుకుంటున్న బల్లకట్టు మాఫియా ● రెండు నెలలుగా అక్రమంగా నిర్వహణ ● ప్రయాణికుల నుంచి భారీగా దోపిడీ ● జడ్పీ ఆదాయానికి గండి ● చోద్యం చూస్తున్న అధికారులు అచ్చంపేట: లీజు కాలం పూర్తయింది.. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు.. అయినా నెలన్నర కాలంగా దర్జాగా బల్లకట్టు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జడ్పీ ఖజానాకు గండిగొడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారులెవ్వరూ ఇదేమిటని అడగరు.. ఆ ఛాయలకూ వెళ్లరు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలంలోని పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం రామన్నపేటకు ఎలాంటి నిబంధనలను పాటించకుండా, జిల్లా పరిషత్కు చెల్లించాల్సి సొమ్ము ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ప్రతి రోజు యథేచ్ఛగా కృష్ణానదిపై బల్లకటు తిప్పుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వేలం జరగకుండా అడ్డుకున్న మాఫియా.. మండలంలోని పుట్లగూడెం నుంచి కృష్ణానదికి ఆవలిఒడ్డున ఉన్న రామన్నపేటకు బల్లకట్టుపై నుంచి పెద్ద పెద్ద వాహనాలు, ప్రయాణికులు, పశువులు, జీవాలు, నిత్యావసర వస్తువులు తరలించేందుకు ప్రతి యేటా మార్చి చివరలో గుంటూరు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహిస్తారు. గత ఏడాది పాట దక్కించుకున్నవారి లీజుకాలం ఈ ఏడాది మార్చి 30తో ముగిసింది. జిల్లా పరిషత్ అధికారులు తిరిగి టెండర్లు ఆహ్వానించి ఏప్రిల్ 8న బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే టెండర్లు వేయనీకుండా, బహిరంగ వేలంలో ఎవరూ పాల్గొననీయకుండా బల్లకట్టు మాఫియా అడ్డుకుంది. దీంతో బహిరంగ వేలాన్ని మే 8కి తిరిగి వాయిదా వేశారు. అప్పుడు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎవరికీ అనుమతులు దక్కలేదు. ఇదే అదనుగా కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదిలి యథావిధిగా బల్లకట్టును నడుపుతూ రూ.లక్షలు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్వాహకులు అడిగినంత చెల్లిస్తూ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా వసూలు చేస్తుండటంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అక్రమార్కుల జేబులు ఫుల్ అవుతున్నాయి. జిల్లా పరిషత్ ఆదాయానికి భారీ గండి అచ్చంపేట మండలంలో మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రం బొగ్గమాదారం వరకు, పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా రామన్నపేటకు బల్లకట్టు సర్వీసులు తిప్పుతారు. మాదిపాడు వద్ద నడిచే బల్లకట్టును తాత్కాలికంగా నిలిపివేశారు. ఏటా అచ్చంపేట మండలం నుంచే సుమారు పడవలపైనుంచి గానీ, బల్లకట్టు నుంచి గానీ జిల్లా పరిషత్కు రూ.60లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.5 లక్షలు. ఈ ఏడాది గత నెలన్నర కాలంగా అధికారికంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఆ ఆదాయానికి గండిపడింది. అనధికారంగా అక్రమార్జనలు జరుగుతూనే ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్ చేస్తాం. – కోయ శ్రీనివాసరావు, ఎంపీడీఓ, అచ్చంపేట ప్రభుత్వ నిబంధనల మేరకు బల్లకట్టుపై ప్రయాణించే వ్యక్తికి 40కిలోల లగేజీతో సహా రూ.3 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. ద్విచక్రవాహనానికి వ్యక్తితో సహా రూ.15 వసూలు చేయాల్సి ఉంగా రూ.100, కారు, ఆటో, ట్రాక్టరు ట్రక్కుతో సహా రూ.180 వసూలు చేయాల్సి ఉండగా రూ.500, లారీకి రూ.240 వసూలు చేయాల్సి ఉండగా రూ.700వరకు, టెన్ టైర్, ట్వల్ టైర్ లారీలైతే రూ.1000 కూడా వసూలు చేస్తున్నారు. -
అర్బన్ స్టేషన్కు హాజరైన మాజీమంత్రి విడదల రజిని
చిలకలూరిపేటటౌన్(యడ్లపాడు): న్యాయస్థానం పట్ల గౌరవంతో నిబంధనల మేరకు యడ్లపాడు పోలీస్ స్టేషన్న్లో మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం హాజరై సంతకం చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి వారం స్టేషన్న్లో రిపోర్ట్ చేయాల్సి ఉండటంతో, ఈ నెల మూడో తేదీన మొదటి పర్యాయం తర్వాత తిరిగి రెండోసారి ఆమె అధికారుల ముందు హాజరయ్యారు. న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ప్రతి ఆదివారం ఇదే రీతిన ఆమె స్టేషన్కు రానున్నట్లు సమాచారం. రజిని రాకపట్ల పార్టీ నాయకులు, అభిమానులు అఽధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఎక్కడా న్యాయస్థాన ఉత్తర్వుల ఉల్లంఘన జరగకుండా, చట్టపరమైన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్టేషన్లోకి ఒంటరిగా వెళ్లి ఆమె తన హాజరును నమోదు చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాయకులు కలిసి ఆమె నివాసానికి వెళ్లా రు. పార్టీ వ్యవహారాలను గురించి రజినితో చర్చించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు దేవినేని శంకరరావు, యడ్లపాడు మండల అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహరాజు, ఎస్సీసెల్ జిల్లా నా యకులు పందుల బుల్లెబ్బాయి, నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులు రాచమంటి చింతారావు, నాయకులు ఉడత వెంకటేశ్వరరావు, కొప్పురావూరి పటేల్, సాపా సైదావలి,తొట్టింపూటి శ్రీను, మైలా రాజేష్, డీలర్ సుభాని, ఊసా రమేష్, ఈ సూబ్వలి, తియ్యగూర అంజిరెడ్డి, నర్సింహనాయక్, మానుకొండ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని, అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని సూచించారు. అన్నీ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా రెవెన్యూ క్లినిక్కు హాజరై వినతులను స్వీకరిస్తారని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీలు అందుబాటులో ఉంటారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు తమ భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
వినుకొండ: చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం అక్రమ మార్గాల్లో సంపాదించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వరికి బదులు ఆరుతడి, వాణిజ్య పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు భారీగా మొక్కజొన్న, పొగాకు సాగు చేస్తే తీరా గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. దీనివల్ల దళారులు రూ.1000 –రూ.1100లకే కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి ఒక్క రోజులోనే డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. అసలు ఎంత పంట పండింది, ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తితే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు, రూ.2.50 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని గుర్తు చేశారు. కానీ నేడు వినుకొండలో మట్టి, ఇసుక, మద్యం వంటి అక్రమ వ్యాపారాలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. వెంటనే పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్ ప్రసాదు, పట్టణ కన్వీనర్ కొత్తమాసు శివ, మండల కన్వీనర్లు దండు చెన్న య్య, కొండా వరుజు నాగేశ్వరరావు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, కాకర్ల నారాయణరెడ్డి బేతం గాబ్రియేలుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
శోక సంద్రమైన ఎండుగుంపాలెం
నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్ఎస్పీ తుర్లపాడు మేజర్ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు (52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి దుర్మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరవుతూనే తదుపరి విమానంలో తిరుగు ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తుల అశ్రునయనాల మధ్య రామారావు అంత్యక్రియలు ముగియగా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్న్ఎస్పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఉద్యోగ, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చటంలో విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య తెలిపారు. అరండల్పేటలో ఆదివారం నిర్వహించిన పీడబ్ల్యూడీ వర్క్షాప్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ 31వ మహాసభలో వెంకటసుబ్బయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లా డారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆయా వర్గాల సమస్యలను పరిష్కంచటంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాడు నాగార్జునసాగర్ పరిధిలోని ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా ఏఐటీయూసీ కృషి చేసి విజయం సాధించిందని వివరించారు. కార్మిక శ్రేయస్సు కోసం అందరితో కలసి పోరాటాలలో ముందుండాలని తెలిపారు. యూనియన్ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు ఆవిష్కరించారు. మహాసభలో నివేదికను కెనాల్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉప్పలపాటి రంగయ్య ప్రవేశపెట్టారు. సీపీఐ సీనియర్ నాయకులు షేక్ బుడే, యూనియన్ నాయకులు ఎల్.శాంతి, ఎం.బాబురావు, కాసా సాంబయ్య పాల్గొన్నారు.ఏఐటీయూసీ డిమాండ్ -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ కె.సతీష్ ఆదివారం తెలిపారు. మండలంలోని కుంకలగుంట గ్రామానికి చెందిన కాకర్ల వెంకటేష్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఈనెల 5న మాచవరం వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి కుంకలగుంటకు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్ను బైకు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వెంకటేష్ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఇంజినీరింగ్’ పరీక్షలకు వేళాయె!
● రేపటి నుంచి 20 వరకు ఏపీ ఈఏపీసెట్–2026 ● 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 46,168 మంది విద్యార్థులు ● మూడు జిల్లాల్లో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2026ను నిర్వహిస్తోంది. ● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,168 మంది విద్యార్థులు ● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 28,158, అగ్రికల్చర్, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 2,899, అగ్రికల్చర్, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు. ● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 7,684, అగ్రికల్చర్, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్ట్, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి. -
రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి
నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రనన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్న్స్ క్లబ్ ఏర్పాటు–నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకి ఐద్వా సీనియర్ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడు తూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యావ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్ క్లబ్లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు. చిల్డ్రన్ ్స క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే వాటి సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు -
రాజరాజేశ్వరి దేవిగా మహంకాళి దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్కుమార్లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు. తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. -
కుమార్తెను విమానం ఎక్కించి వస్తుండగా తండ్రి మృతి
నాదెండ్ల: కుమార్తెను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలన్న ఆ తండ్రి కల నెరవేరిన వేళ.. ఆ ఇంట సంతోషం అంబరాన్నంటింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ లండన్ వెళ్తుంటే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరే వరకు రెప్పవాల్చకుండా చూస్తూ కుటుంబసభ్యులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. విధి ఆడిన వింత నాటకంలో వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న తండ్రిని కొద్ది గంటల్లోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన ఎన్ఎస్పీ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నెల్లూరి రామారావు(52) తన కుమార్తె అంజలిని ఎంఎస్ విద్యకోసం లండన్ పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తెను విమానం ఎక్కించి, వారు తిరుగు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి వద్దకు రాగానే వీరి కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారు సమీపంలోని చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా..కారు వెనుక సీటులో కూర్చున్న రామారావుకు అద్దాలు పగిలి తలకు బలంగా గుచ్చుకున్నాయి. తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న రామారావును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న కుమారుడు ఈశ్వరప్రసాద్, భార్య రామపూర్ణమ్మల కళ్లెదుటే ఈ ఘోరం జరగడంతో వారి రోదనలు మిన్నంటాయి. అదే కారులో రామారావు బావమరిది భార్య నాగలక్ష్మి, ఆమె ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అటు లండన్ వెళ్తున్న కుమార్తెకు తండ్రి మరణవార్త తెలియక, ఇటు చేతికందిన కొడుకు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నల్గొండలో పోస్టుమార్టం అనంతరం రామారావు భౌతికకాయం శనివారం సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో ఎండుగుంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఫైల్ క్లియరెన్స్లో రెండో స్థానంలో జిల్లా కలెక్టర్
నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించడంలో అగ్రగామిగా నిలిచారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–ఫైల్స్ క్లియరెన్స్ నివేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఒక్కో ఫైలును సగటున కేవలం 7.65 గంటల్లోనే పరిష్కరిస్తూ పాలనలో అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా, పారదర్శకతతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఫైళ్ల క్లియరెన్స్లో జిల్లాను అగ్రపథంలో నిలిపిన కలెక్టర్ను జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సేవలు ఏవైనా నిర్ణీత సమయంలోగా అందేలా చూడటమే తన ప్రాధాన్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. -
రేషన్ మాఫియా దందా
గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలానికి ఒక టీడీపీ నేత రేషన్ మాఫియా నిర్వహణను పంచుకున్నారు. గుంటూరు నగరంలో, రూరల్ మండల పరిసరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లో రేషన్ మాఫియా నడుస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్కు చేరేలోగానే బియ్యాన్ని మాఫియా దోచేస్తోందని డీలర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అక్రమ రేషన్ దందాకు అంతులేకుండా పోయింది. ముఖ్యంగా మురళి.. ఈ పేరు చెబితేనే ప్రతి రేషన్ డీలర్ భయపడుతున్నాడంటే మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. బియ్యం గోడౌన్ నుంచి లారీ బయలుదేరగానే సంబంధిత అధికారులు ఆ వ్యక్తికి సమాచారం ఇస్తారు. వెంటనే ఆ వ్యక్తి తమ మాఫియా గణంతో ఆయా డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తాడు. తమ వాహనాల్లో ఇన్ని బస్తాలు లోడు చేయాలని ఆదేశిస్తాడు. అతని మాట ఎవరైనా వినకుంటే రోజుల వ్యవధిలో అధికారులు ఆయా షాపుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. చేసేది లేక ఆ వ్యక్తి చెప్పినట్లుగానే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని వాహనాల్లో చెప్పినన్ని బస్తాలు లోడు చేసి పంపాల్సిందే. డిప్యూటీ తహసీల్దార్లపై ఆరోపణలు పేదలకు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అవినీతి కుంపటిలో కూరుకుపోయింది. కింది స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,90,546 రేషన్ కార్డులున్నాయి. 972 డిపోల ద్వారా ప్రతి నెలా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు పంచదార, గోధుమ పిండి సరఫరా చేస్తారు. మొదటి 15 రోజులు ఈ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. చాలా రేషన్ దుకాణాల్లో కొలతల వ్యత్యాసం ఉంటుంది. దీనిని సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోరు. దానికిగాను కొన్ని రేషన్ దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. గతంలో వెస్ట్ డీటీ మొహమ్మద్ ఖాదర్ బాషాపై ఓ రేషన్ దుకాణదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈస్ట్ డీటీపైనా ఫిర్యాదులు అందాయి. ఇలా మరికొందరిపైనా నిత్యం ఏదో ఒక సమయంలో ఫిర్యాదులొస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉండగానే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేషన్ గోడౌన్ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యం బస్తా ఒకొక్కటి 50 కిలోలు ఉండాలి. కానీ 40, కిలోలు, ఇంకా కొన్నింటిలో 35 కిలోలు ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. తమకు వచ్చే బియ్యంలోనే కోతలు వేసి, మళ్లీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న మాఫియాకు వారు అడిగినన్ని బస్తాలు పంపితే ఇక లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నుంచి వచ్చే బస్తాల్లో తమ వాటాగా అధికారులు బస్తాకు పది కిలోలకుపైగా దోచుకుంటుంటే, మాఫియా కూడా తామేం తక్కువ కాదని బస్తాలకు బస్తాలు దోచుకుపోతున్నారు. మాఫియా సైతం కిలో రూ.16కు కొనుగోలు చేస్తోందని, ప్రజలకు ఇచ్చి మళ్లీ వారి వద్దే రూ.15 బియ్యం కొని మాఫియా అడిగినన్ని బస్తాలు ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. -
కార్పొరేట్కు భోగం
పేదోడి రోగం.. ‘‘ఏంటి సార్ దగ్గుతున్నారు.. మీరు కూడా కొన్ని టెస్ట్లు చేయించుకోండి’’.. అంటూ ఠాగూర్ సినిమాలో ఓ సీన్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అద్దం పడుతుంది. కేవలం పొడి దగ్గుకే టెస్టుల పేరిట దోచుకునే తీరు పల్నాడు జిల్లాలోకి కొన్ని కార్పొరేట్ వైద్యశాలల్లోనూ కనిపిస్తోంది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే కంటి వరకు టెస్టులు చేయిస్తూ పేదల స్థోమతకు పరీక్ష పెడుతున్నారు. ఆస్పత్రి గడప తొక్కితే చాలు రోగం తగ్గడం సంగతి దేవుడెరుగు అప్పుల మూట గుండెలపై గుదిబండగా మారుతోంది. స్కానింగ్లు, రక్త పరీక్షల ల్యాబ్తో కుమ్మకై ్కన వైద్యుల తీరు రోగుల జేబులకు చిల్లు పెడుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవల అందక కార్పొరేట్ ఆస్పత్రుల వారు పేద, మధ్య తరగతి వారిని దోచుకుంటున్నారు. నరసరావుపేట టౌన్: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగికి చికిత్స కంటే ముందే భారీ బిల్లులు భయపెడుతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో పరిస్థితి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన సౌకర్యాలు, నిపుణుల కొరత కారణంగా ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని కొందరు కార్పోరేట్ వైద్యసంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు అవసరం లేని వైద్య పరీక్షలు రాస్తూ రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్ల మధ్య కమీషన్ వ్యవస్థ కారణంగా రోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. జ్వరానికి రూ. 1.5 లక్షల బిల్లు.. నరసరావుపేటకు చెందిన శ్రీనివాస్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ చికిత్సతో తగ్గే సమస్య అయినప్పటికీ అతడికి వరుసగా దాదాపు పది రకాల రక్త పరీక్షలు, స్కానింగ్లు, ఇతర నిర్ధారణ పరీక్షలు సూచించారు. వారం రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి బిల్లు రూ.1.50 లక్షలు కావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. పరీక్షల పేరుతో భారీ మొత్తం వసూలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. వ్యాపారంగా మారిన వైద్యం రోగి పరిస్థితిని పరిశీలించి అవసరమైన పరీక్షలు మాత్రమే సూచించాల్సిన వైద్య విధానం ప్రస్తుతం వ్యాపారంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్యులు రోగి లక్షణాలు పూర్తిగా తెలుసుకోకుండానే వరుస పరీక్షలు రాస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, థైరాయిడ్, విటమినన్ టెస్టులు, హార్మోనన్, పూర్తి రక్తపరీక్షలు, 2డీ ఈసీజీ, ఎకో పరీక్షలు, ఇలా అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద జాబితా ఇస్తూ రోగులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని పలువురు వాపోతున్నారు. రోగిని చూడకుండానే ‘అసిస్టెంట్ల’ దందా కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుడిని కలిసే ముందు అక్కడి సిబ్బందే పరీక్షల జాబితా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగి సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే వివిధ టెస్టులు సూచిస్తూ రూ.వేలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యుడిని కలిసే అవకాశమే లేకుండా ముందుగానే ల్యాబ్, స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఇది వైద్య నైతిక విలువలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు. గర్భిణులకు ప్రైవేట్ స్కానింగ్లు నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రేడియాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో గర్భిణులకు అవసరమైన స్కానింగ్ పరీక్షలు బయట ప్రైవేట్ సెంటర్లలో చేయించుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తుండటంతో అవసరం లేకున్నా వైద్యులు స్కానింగ్ పరీక్షలు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో కనీసం మూడు నుంచి నాలుగు స్కానింగ్లు అవసరం అవుతాయి. ప్రతి స్కానింగ్కు రూ.వేల ఖర్చు కావడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నేళ్లుగా రేడియాలజిస్ట్ పోస్టు భర్తీ చేయకపోవటంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం అవసరం.. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం వస్తోంది. అనవసర పరీక్షలపై విచారణ, ఫీజుల నియంత్రణ, కమీషన్ వ్యవస్థపై దృష్టి సారించాలి. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుల నియామకం చేపట్టాలి. ఈ వ్యవహారాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. -
ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం
● మేం చనిపోతే మా కుమారుడిని కాపాడండి ● వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు మొర కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరు గాంధీనగర్కు చెందిన నంబూరు కృష్ణ, రమణ దంపతులు శుక్రవారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల కిందట కొల్లూరులోని తమ బంధువులైన ఈ దంపతుల ఇంటికి వచ్చింది. వారి కుమారుడైన జయరాజును వివాహం చేసుకుంటానని, తమకు పెళ్లి చేయాలని యువతి కోరడంతో ఆమె ఆధార్ కార్డు ప్రకారం మేజర్ అని నిర్ధారించుకుని వివాహం జరిపించారు. కొన్ని వారాల కిందట యువతి తల్లి వచ్చి ఆమె మైనర్ అని, బలవంతంగా వివాహం చేశారని పోలీసుకలు ఫిర్యాదు చేసింది. కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు సూచన మేరకు చీమకుర్తి పోలీసుస్టేషన్కు యువకుడి తరఫు వారు వెళ్లారు. యువకుడిపై పోక్సో, లైంగికదాడి, కిడ్నాప్ కేసులు నమోదైనట్లు తెలిసింది. తమ బిడ్డను గొడ్డును బాదినట్లు బాదడంతోపాటు, రోజుల తరబడి స్టేషన్ వద్ద తమను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని రేణుక, సురేష్, వంశీ, నవీన, శ్రీను అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి బెదిరించడంతో తమను బతకనివ్వరనే ఆందోళనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తాము చనిపోయినా పోలీసుల వద్ద ఉన్న తమ కుమారుడిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు మొరపెట్టుకున్నారు. దంపతులు పురుగుల మందు తాగి, వీడియో రూపంలో తమ బాధను వెళ్లగక్కడాన్ని గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. -
ఆదాయ పన్ను చెల్లింపునకు సరళీకృత విధానాలు
ఆదాయపు పన్నుశాఖ అధికారులు నరసరావుపేట: ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను సక్రమంగా సకాలంలో చెల్లించాలని ఆశాఖ అదనపు డైరెక్టర్ నెడుమారన్, డెప్యూటీ డైరెక్టర్(ఇన్వెస్టిగేషన్స్) భరత్ వెల్లడించారు. శుక్రవారం ఆదాయపు చట్టం–2025పె అవగాహన కార్యక్రమాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమా సాంబశివరావు అధ్యక్షతన సత్తెనపల్లిరోడ్డు కోట సెంటర్లోని వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన అధికారులు మాట్లాడుతూ చట్టాన్ని సులభతరంగా ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 1961 చట్టంలో మార్పులు, చేర్పులు చేసిందన్నారు. 1961 చట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటిని 2025 చట్టంలో 533గాను, ఫారంలు 329 నుంచి 190కు కుదించారన్నారు. రేట్లు, టాక్స్, వడ్డింపులు తగ్గించారన్నారు. పలు దేశాల చట్టాలను పరిశీలించి మనదేశ ప్రజలు అందరికీ అర్దమయ్యేరీతిలో తీసుకొచ్చారన్నారు. 1961 చట్టం ప్రకారం అందజేసే బెనిఫిట్స్ 2025 చట్టంలోకూడా వర్తిస్తాయన్నారు. సామాన్య మానవులు సైతం సులభంగా సింగిల్ ఫారంలో పన్ను చెల్లించేలా ఏర్పాటు చేశారన్నారు. సీనియర్ ఆడిటర్ చేకూరి సాంబశివరావు, చాంభర్ కార్యదర్శి పచ్చిపులుసు సతీష్కుమార్, చాంభర్ ప్రతినిధులు తాళ్లూరి సత్యనారాయణ, బచ్చు నాగేశ్వరరావు, హనుమత్ప్రసాదు, కొప్పూరావూరి మోహనరావు, ఆడిటర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026వారాంతం ఆహా..● వారంలో ఐదు రోజులపాటు వ్యాయామాలు, మితంగా తిండి ● శని, ఆదివారాల్లో నచ్చిన పదార్థాలు ఎక్కువ తినేందుకు ఆసక్తి ● తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీ సిద్ధం చేస్తున్న హోటళ్లు ● అర్ధరాత్రి దాటిన తరువాత కూడా భారీగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ● బయటి ఆహారంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు●7గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. సాక్షి, నరసరావుపేట: ఉద్యోగులైనా, వ్యాపారులైనా, విద్యార్థులైనా, గృహిణులైనా... ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి పద్ధతులు పాటిస్తున్నారు. రోజూ వ్యాయామం, యోగా, ఆహార నియామాలు పాటించడం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం వంటివి చేస్తున్నారు. వీరిలో చాలా మంది శని, ఆదివారాలు వచ్చేసరికి తమ మెనూ మార్చేస్తున్నారు. రోజువారీ చేసే పనులు, తినే ఆహారానికి స్వస్తి పలికి సరదాగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ సరదా సందడిలో నిత్య వ్యాయామానికి దూరమవడంతోపాటు, తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు శరీర ఆకృతిలోనూ తేడాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఆహార నియమాలు పక్కాగా పాటిస్తూ, సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపే నగర, పట్టణ వాసులు సైతం వారాంతంలో మాత్రం మసాలాలతో కూడిన మాంసాహారం తినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ తినే ఆహారం కన్నా విభిన్నంగా ఉండే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ పాటించి...అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ కేలరీలు లభించే ఆహారం తింటున్నారు. అందుకే గుంటూరు నగరం వన్టౌన్ ప్రాంతంలోని హోటళ్లలో మిడ్నైట్ బిర్యానీలకు యమా గిరాకీ ఉంటోంది. కొత్తగా 4ఏఎం బిర్యానీలంటూ తెల్లవారుజామున నాలుగింటికే రకరకాల బిర్యానీలు వేడివేడిగా వడ్డిస్తున్నారు. వీటిని వారాంతంలో తినడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. అనధికార లే అవుట్లపై స్పెషల్ డ్రైవ్ తాడువాయి అడవిలో నరికిన చెట్టు తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,700, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 524.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. చాలా మంది వారాంతంలో ఆహార నియమాలను మార్చేసుకుంటున్నారు. రాత్రి ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. రాత్రిళ్లు ఎక్కువసేపు మెలకువగా ఉండి, ఆహారం తినడం వల్ల ఊబకాయం వస్తుంది. వీలైనంతవరకు బయటి ఆహారం తినకపోవడం మంచిది. – డాక్టర్ అంకినీడు ప్రసాద్, ఏరియా వైద్యశాల వారంలో ఐదు రోజులు పాటు వ్యాయామం చేసి చివర రెండు రోజులు మానేయడం, ఎక్కువ ఆహారం వల్ల శరీరాకృతిలో మార్పులొస్తాయి. ఐదు రోజుల జిమ్ ఫలితం మొత్తం పోతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా, వారాంతమైనా వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఆహార నియమంలో కొంత మేరకు తీసుకోవడం వెసులుబాటు తీసుకుంటే ఇబ్బంది లేదు. – అజీజ్, జిమ్ నిర్వాహకుడు, నరసరావుపేట -
ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం
కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. -
బంగారం దుకాణంలో చోరీ
యద్దనపూడి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పూనూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన కొండా మాధవరెడ్డి వెంకటరత్నం దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి(7) రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని శివాలయం సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి 108 వాహనంలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగాను ఒక్క కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలలో చిన్నారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి టైక్వాండో చాంపియన్షిప్ పోటీలకు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు. ఆస్తి వివాదంపై ఘర్షణ దాచేపల్లి: ఆస్తి వివాదం నేపథ్యంలో సచివాలయంలోనే ఘర్షణ పడ్డారు. మండలంలోని గామాలపాడు గ్రామ సచివాలయంలో అధికారుల ఎదురుగానే ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగారు. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడులో ఉన్న ఆస్తిపై ఇరువర్గాల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై వివరాలు తెలుసుకునేందుకు సచివాలయం అధికారులు ఇరువర్గాలను సచివాలయానికి పిలిపించారు. ఇరు వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలన చేస్తున్న క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు అధికారులు ఎదుటే పరస్పరం దాడులకు దిగారు. గ్రామ సచివాలయంలో ఇరువర్గాలు దాడులకు దిగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దాడుల్లో స్థానిక టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గ్రామ సచివాలయంలో జరిగిన ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పల్నాడు జిల్లా జట్లు
రొంపిచర్ల: కర్నూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ బేస్బాల్ పోటీలలో పల్నాడు జిల్లా బాల, బాలికల జట్లు సత్తా చాటాయని రొంపిచర్ల జెడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య శనివారం తెలిపారు. బాలికల జట్టు మొదటి స్థానం, బాలుర జట్టు రెండవ స్థానం సాధించినట్లు తెలిపారు. మొదటి స్థానం సాధించిన పల్నాడు జిల్లా బాలికల జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన క్రీడాకారులు పి.చంద్రిక, వి.శ్రీదేవి, బి.శ్రీలక్ష్మి, బి.కృప, సిహెచ్.అపర్ణ, ఓ.పావని, ఎస్.ప్రజ్ఞ, ఏ.నక్షత్ర, ఇ.పూజిత, టి. తెజస్విని, బి.మౌనిక, ఇ.నందిని, సీహెచ్.అలేఖ్యలు ఉండగా, బాలుర జట్టులో పి.అశోక్, పి.నరేంద్ర, బి. బాలకృష్ణ, జి.రిషి వర్థన్, పి.నరేంద్ర, ఎం.వెంకీ, పి.హుస్సేన్, ఎస్కే.అక్బర్లు ఉన్నారన్నారు. విజయం సాధించిన క్రీడాకారులను పల్నాడు జిల్లా బేస్బాల్ సెక్రటరీ వి.వేమారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.సైదయ్య, గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అధినేత పి.నరసింహారెడ్డి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. -
సోషల్ మీడియా యాక్టివిస్టుపై దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి దుర్గారావుపై గురువారం టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. తమ్మిశెట్టి దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గంగమ్మతల్లి దేవస్థానం ఎదురుగా గల ఓ టీ షాప్లో జ్యూస్ పాయింట్ నడుపుకునేందుకు టీ పాయింట్ యజమాన్ని అడగ్గా ఆయన అంగీకరించారు. దీంతో దుర్గారావు జ్యూస్ పాయింట్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. టీడీపీకి చెందిన షేక్ ఇంతియాజ్ టీ షాపు యజమానికి ఫోన్ చేసి వైఎస్సార్సీపీ సోషల్మీడియా యాక్టివిస్ట్కు ఎందుకు జ్యూస్ పాయింట్కు అనుమతి ఇచ్చారని ప్రశ్నించాడు. ఖాళీ చేయించాల్సిందేనని హుకుం జారీ చేశాడు. టీ షాపు యజమాని దుర్గారావుకు విషయం చెప్పగా ఖాళీ చేసేందుకు కొంత సమయం కోరాడు. రాత్రి సమయంలో అందరు నడిరోడ్డుపై ఉండగానే నలుగురు టీడీపీ కార్యకర్తలు దుర్గా జ్యూస్ పాయింట్ వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. దుర్గారావు తప్పించుకొని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. సంఘటన తెలుసుకున్న వైఎస్సార్ సీపీ స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టుపల్లి పూర్ణ దుర్గారావును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు. దుర్గారావుకు కాసు మహేష్ పరామర్శ నరసరావుపేట: సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావుపై దాడిచేసిన టీడీపీ గుండాలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావును గురువారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిడుగురాళ్ల నడిరోడ్డులో బుధవారం రాత్రి టీడీపీకి చెందిన నలుగురైదుగురు గుండాలు దుర్గారావుపై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టారన్నారు. కేవలం సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో టీడీపీ నాయకులు కొంతకాలంగా దుర్గారావును వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలు, ప్రాంతాల్లో జరిగిన సంఘటనపై ఛలో గురజాల నిర్వహిస్తామన్నారు. ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. పలువురు వడ్డెర సంఘ నాయకులు కూడా దుర్గారావును పరామర్శించారు. -
ఉద్యోగుల పోరుబాట
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. వీరు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. అందిస్తున్న సేవలివీ... మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ● ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ● మినిమం టైం స్కేల్, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి. ● రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ● కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు
కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించిన అధికారులునరసరావుపేట: గిరిజనులను అన్ని రకాలుగా చైతన్యపరచి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని డీఆర్ఓ నారదముని కొనియాడారు. కలెక్టరేట్లో గురువారం అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడని, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో జన్మించారని తెలిపారు. సీతారామరాజు తన ప్రాథమిక విద్యను పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో అభ్యసించారని, 15 ఏళ్ల వయస్సులో విశాఖపట్నంలో ఉన్న హైస్కూల్, విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించారని చెప్పారు. 18 ఏళ్ల వయస్సులో సన్యాసిగా మారి జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించారని, ఆయన ఆధ్యాత్మికత, త్యాగనిరతి గిరిజనుల్లో విశేషమైన ప్రభావాన్ని చూపిందని వివరించారు. సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చిందని తెలిపారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, ఆయన నాయకత్వంలో గిరిజనులు పోలీస్స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచిందని తెలిపారు. 1924 మే 7న సీతారామరాజు బ్రిటిష్ సైన్యం చేతిలో పట్టుబడి అనంతరం కాల్చి చంపబడ్డారని చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గోవింద్ నాయక్, జిల్లా గణాంక అధికారి యూవీ సత్యనారాయణరాజు, టూరిజం అధికారి నాయుడమ్మ, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు
చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటం, దురవ్యసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్త ఇంట్లో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్లో పొన్నూ రు రూరల్ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ గురువారం వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా బార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందు లోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్, చైన్లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పి వీరనారాయణ కేసు దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. ఎస్ఐ పి వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీలు అభినందించారు. తొమ్మిది లక్షల బంగారు, వెండి నగలు అపహరణ -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘాటెక్కిన మిర్చి వాటాలు!
మిర్చి యార్డులో పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిర్చి యార్డులో భారీగా జరుగుతున్న జీరో వ్యాపారంపై వచ్చే నగదులో తమకు కూడా వాటా ఇవ్వాలని పాలకవర్గం పట్టుపడుతుండటం, దీనిపై గురువారం కార్యవర్గం సమావేశం కావడం యార్డులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి కార్యదర్శి గైర్హాజరు అయ్యారు. ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు పెడితే తాను రానని కార్యదర్శి చెప్పినట్లు పాలకవర్గ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కార్యదర్శి వైఖరిపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన డబ్బుల్లో తమ వాటా చెల్లించాల్సిందేనని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మిర్చి యార్డు కార్యదర్శి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బంధువు కావడంతో తమను అసలు లెక్క చేయడం లేదని పాలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి యార్డులో గత రెండేళ్లుగా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో యార్డుకు రావాల్సిన సెస్ రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఏడాదిన్నర తర్వాత పాలకవర్గం వచ్చినా అధికారులు మిర్చి యార్డుపై తమ పెత్తనం కొనసాగిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది యార్డ్ ఖాతాలో జమ కావడం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నారు. మిర్చి యార్డులో జరుగుతున్న జీరో వ్యాపారం, దానిపై వచ్చే ఆదాయం విషయంలోనే అధికారులు, పాలకవర్గం మధ్య గొడవలు తలెత్తాయి. జీరో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నో విధాలుగా... ఇదే కాకుండా బిల్ టు బిల్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మిర్చి యార్డులో రైతులు, ఎగుమతి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసి కోనుగోళ్లు జరపడానికి కమీషన్ ఏజెంట్లు పని చేస్తుంటారు. రైతులకు కొనుగోలు చేసిన రోజే డబ్బులు చెల్లిస్తారు. వీరు మార్కెట్ యార్డు నుంచి లైసెన్స్ కలిగి ఉంటారు. లైసెన్స్ లేనివారు ఇప్పటికే ఉన్న వారి పేరుతో వ్యాపారం చేస్తూ వాస్తవంగా వసూలు చేయాల్సిన రెండు శాతానికి బదులుగా రెట్టింపు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న వేమెన్లు, సూపర్వైజర్లు, యార్డు యంత్రాంగానికి కాసుల వర్షం కురుస్తోంది. బిల్ టు బిల్ విధానానికి సహకరించినందుకు బస్తాకు రూ.పది వరకూ వసూలు చేస్తున్నారు. యార్డులో వచ్చే అవినీతి డబ్బుల కోసం పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య రచ్చ జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజిలెన్స్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి. -
15 నుంచి రంగస్థల నటనాభినయ ప్రత్యేక శిక్షణ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో వర్క్షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అల్లూరి త్యాగస్ఫూర్తి, దేశభక్తి స్ఫూర్తిదాయకం
నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామారాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను అర్పించడాని వివరించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరి సేవా భావం, క్రమశిక్షణ, ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఆర్ఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్బీ సీఐ బి.సురేష్బాబు, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాధ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాతకక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జీజీహెచ్కు తరలింపు -
అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంగీత విశ్వనాథన్ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్ను యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు. -
పల్నాడు జిల్లా ఎడ్లకు ప్రథమ స్థానం
ముగిసిన ఎడ్ల బండ లాగుడు పోటీలు నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు విజయవంతంగా ముగిశాయి.. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలలో విజేతల ఎడ్ల జత యజమానులకు రైతు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ ఎడ్ల జత 3,030 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 2,778 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంకు చెందిన దూదేకుల పెద్ద చాంద్బాషా ఎడ్ల జత 2,585 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.లక్ష, 80 వేలు, 70 వేలు, 60 వేల నగదు బహుమతులతోపాటు, జ్ఞాపికలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘వన్ మంత్ –వన్ విలేజ్’ను సద్వినియోగం చేసుకోండి
యడ్లపాడు: మండలంలోని మర్రిపాలెం రెవెన్యూ గ్రామంలో గురువారం తొలిగా నిర్వహించిన వన్ మంత్–వన్ మండల్– వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. అధికారులను, ప్రజల్ని కలసి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ మండలం మర్రిపాలెం గ్రామంలో వరుసగా నాలుగు గురువారాలు గ్రామసభలు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామసభల్లో ఇచ్చిన ప్రతి అర్జీ ప్రజాసమస్యల పరిష్కార వేదిక యాప్లో నమోదవుతుందన్నారు. ప్రతి అర్జీపై మండలస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల పరిశీలన ఉంటుందని, కావున ప్రజలు ఈ కార్యక్రమంలో సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మండలంలోని మర్రిపాలెం గ్రామంలో నిర్వహించిన తొలి గ్రామసభలో స్థానికుల నుంచి ఐదు అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడివో వి హేమలతాదేవి, ఎంఈవో ఎంవీ నాగరత్నం, ఆర్ఐ సుబ్బారావు, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, దేవదాయ, అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కనీస జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల రోగులు, చిన్న పిల్లలు మారిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఎండలో బయట తిరగకుండా చూడాలి. వృద్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, తదితర సహజసిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే కాటన్ దుస్తులు ధరించాలి. కూలింగ్ గ్లాసు, గొడుగు, టోపీ, ఒక లీటర్ నీరు వెంట తీసుకు వెళ్లాలి. మాంసాహారం, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం, మద్యం సేవించరాదు. చెమటలు పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అది వడదెబ్బ. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ బి. రవి, డీఎంహెచ్వో, పల్నాడు -
తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ
మంగళగిరి టౌన్: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. -
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు నిప్పుల కొలిమిలా మారుతోంది. గత ఐదు రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 44 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఊపిరాడని
సత్తెనపల్లి: జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 44 డిగ్రీల మార్కును దాటాయి. ఈ ఉష్ణోగ్రతలకు వృద్ధులు, చిన్నారులు, బాలింతల కష్టాలు వర్ణనాతీతం. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు .. మరోవైపు గాలి వానతో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో సాధారణంగా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్క పోత .. బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీలు దాటడంతో ప్రధాన రహదారులు, పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 5 గంటల దాటిన సమయంలో కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకొని చినుకులు పడుతున్నాయి. ఆ సమయంలో మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి ఎండలు ఎక్కువే.... మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు సెగలు కక్కుతుండగా .. జనం విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. గత ఏడాది మే మొదటి వారంలో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసినప్పటికీ గతంతో పోలిస్తే మరో డిగ్రీ పెరిగింది. దీంతో ఎవరి నోట విన్నా అమ్మ బాబోయ్..! ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు. అకాల వర్షాలు... ఈ సారి వేసవిలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండలు తీవ్రత ఒకవైపు ఉంటే .. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల చెట్లు కూలి పిడుగులు కూడా పడ్డాయి. ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తదితర నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. దీంతో కొన్నిచోట్ల ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరో వైపు మొక్కజొన్న, రబీ వరి, కంది, మిర్చి పంటలను సాగుచేస్తున్న రైతులకు అకాల వర్షాలతో నష్టాలు తప్పడం లేదు. పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
నేడు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని
84 వేల డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ ప్రారంభంనరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా గురువారం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో నకరికల్లు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వారం మహిళల ద్వారా కిచెన్ గార్డెన్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మండలానికి 3 వేల మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 84 వేల మంది డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామంలో ఔత్సాహికులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, డీఆర్డీఏ సిబ్బందితో విత్తనాల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంపై అవగాహన పెంచేందుకు టమోటా, పాలకూర, చుక్కకూర, తోటకూర, బెండ, గోరు చిక్కుడు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. కర్షకులకు కష్టం
నరసరావుపేట రూరల్: అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బుధవారం ఉదయం మండలంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై 7.30 గంటల సమయంలో జల్లులు ప్రారంభమయ్యాయి. మిరప, మొక్కజొన్న రైతులకు వర్షం తీవ్రంగా నష్టం కలిగించింది. మూడవ విడత మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్లాల్లో పంట తడవకుండా రైతులు టార్పలిన్ పట్టలతో కప్పి ఉంచారు. దాదాపు గంటన్నరపాటు కురిసిన వర్షం కారణంగా పట్టలపైనా నీరు నిలిచింది. భారీ వర్షం కావడంతో కల్లాల్లోని మిరప పంటకు నిమ్ము చేరింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షంతో ఎకరానికి రూ.లక్ష మేర నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షం వలన తాలుగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే మద్దతు ధర లభించక ఆందోళన చెందుతున్న రైతులకు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు పలుచోట్ల వర్షానికి తడిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలింది. -
నేటి నుంచి మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49 వారికోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో కె.సునీల్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులపాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించేందుకు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్(ఐఐటీ–జేఈఈ మెయిన్స్, ఎన్ఈఈటీ, ఎంసెట్) అందించనున్నట్లు వివరించారు. 250 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం 6303325356, 8978452495 సంప్రదించాలని కోరారు. తెనాలి: తెలంగాణ సారస్వత పరిషత్ ముద్రించిన బాల సాహితీ కథా సంకలనంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన ‘ప్రగతి పథం’ కథ ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 180 కథలు రాగా వాటిలో ఎంపిక చేసిన 70 కథలతో ‘బాలసారస్వతం’ పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. వాతావరణ, జల కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, భూగర్భ జలాల్ని ఎలా పెంచుకోవాలి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి యువత ఎలా దోహదపడాలనే అంశాలపై ఈ కథనం రాశారు. హకీంజాని ఇప్పటి వరకు పిల్ల్లల కోసం 36 పుస్తకాలు, 290 కథలు రచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హకీంజాని కథలను 2019లో 11వ తరగతికి, 2020లో 12వ తరగతికి పాఠ్యాంశాలుగా ప్రచురించింది. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్ర చెస్ అసోసియేషన్, గుంటూరు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు 8వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవీంద్ర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని ఐడీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.50,000 నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లోని వారికి ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 99481 98809 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
ఉత్తమ విద్యార్థులకు గగనయానం
అచ్చంపేట: మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థులను బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యం బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మేరీ శ్రీలత మాట్లాతూ 595మార్కులు సాధించిన పెద్దింటి సైదేశ్వరరావు, 593 మార్కులు సాధించిన మద్దుల శ్రీలక్ష్మిలను ప్రోత్సహించేందుకు, మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో భాగంలోనే విమాన ట్రిప్పు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి యేటా తమ పాఠశాల విద్యార్థులు నూరుశాతం విత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. కారెంపూడి: బైక్ వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేపకంపల్లి గ్రామ రోడ్డు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. కారెంపూడికి చెందిన నెమలికంటి రామాంజనేయులు తెలంగాణ రాష్ట్రం వాడపల్లి నుంచి బైక్పై స్వగ్రామం కారెంపూడి వస్తున్నారు. దాచేపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీప ప్రాంతంలో ఆగి ఉన్న వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. దీంతో బైక్పై ఉన్న రామాంజనేయులు (42) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో కారెంపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్ను సాధించినట్లు చెప్పారు. -
కలెక్టరేట్ ఉద్యోగిపై పోలీసుల దాడి హేయం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్మెనన్గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్ఎస్ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జేసీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు -
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలి
కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్టైల్స్ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: చైనాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్(మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్ లిఫ్టర్లు ఎం. షానూన్ 47 కేజీల విభాగం, జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్, ఇ.ఎల్. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు. -
ఆమె ఎలా చనిపోయింది..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరాలకు చెందిన పల్లపు రేణుక (39)కు వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వివాదంపై సస్పెండ్ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్ ముందు ఇద్దరు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత రేణుకకు ఫిట్స్ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎయిమ్స్ వద్ద బంధువుల ఆందోళన రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. సీఐల చర్చలతో మారిన సీన్ ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. -
చట్టం అమలే ఎగతాళి!
జిల్లాలో గుట్టుగా బాల్య వివాహాలు సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు గుట్టుగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని అధికారుల దృష్టికి వస్తుండగా, చాలా వరకు రావడం లేదు. కొన్నిచోట్ల బాల్యవివాహాలు అధికారులు నిలుపుదల చేసినట్టు లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటున్నప్పటికీ రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి వివాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలు నిలుపుదల చేస్తున్నామని ఇరువురి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత అధికారులు అక్కడితో ఆ అంశాన్ని వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఆ వివాహానికి సంబంధించి ఎటువంటి ఆరా తీయడం లేదు. లిఖితపూర్వకంగా బాల్యవివాహం చేయబోమని రాసి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు వారికి నిజంగానే బాల్యవివాహాన్ని నిలుపుదల చేశారా, లేదంటే అధికారులు వెళ్లిపోవడానికి ఆ విధంగా హామీ ఇస్తున్నారా .. అనేది అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ దాన్ని నిలుపుదల చేయడానికి వెళ్లిన అధికారులపై వదిలేయండని ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితమివ్వని సదస్సులు... బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహ్ ముక్త్ భారత్, బేటీ బచావో.. బేటీ పడావో, కిశోరి వికాసం, ప్రత్యేక వాహన ప్రచారం సహా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్ల వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించే వారితోపాటు ప్రతి విభాగం వారికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం... ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపడం, ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడం వంటి కారణాలతో ఈ కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఆయా శాఖల సిబ్బంది నుంచే ఈ మాట వినిపిస్తోంది. కమిటీలు ఉన్నా ఫలితం సున్నా బాల్యవివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రాహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం, 31,39 జీఓలను అనుసరించి వివిధ స్థాయిల్లో కమిటీలను నియమించారు. జిల్లా ఉన్నతాధికారి సహా డీఆర్ఓ ఆధ్వర్యాన జిల్లా స్థాయి .. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లలో ఆర్డీఓల ఆధ్వర్యాన డివిజన్ స్థాయి ... రెండు లేదా మూడు మండలాలకు ఒక బ్లాక్ చొప్పున సీడీపీఓల ఆధ్వర్యాన బ్లాక్ స్థాయి .. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, జీఎంఎస్కేలు, సీఎంపీఓల ఆధ్వర్యాన మండల స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జీఎంఎస్కే నోడల్ అధికారిగా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, మహిళా కార్యదర్శి, స్కూల్ హెచ్ఎం, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఇలా 10 మందితో కలిపి ప్రతి గ్రామంలోనూ ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ కూడా వేశారు. బాల్యవివాహాల నియంత్రణ, నిరోధం కోసం వీటిని ఏర్పాటు చేశారు. పీసీఎంఏ చట్టాన్ని క్షేత్రస్థాయికి చేర్చి, బాల్యవివాహల నియంత్రణలో సీఎంపీఓలు కీలకపాత్ర పోషించాలి. పూర్తిగా నిరోధించాలి. ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నాయనేది ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. ఇవే కనుక సక్రమంగా పనిచేస్తే చిన్నారులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. పుస్తకాలు చేతపట్టాల్సిన అభం శుభం తెలియని పసి మొగ్గలు మెడలో పసుపు తాడుతో మరొకరి వెంట నడుస్తున్నారు. చిన్న ప్రాయంలోనే పురిటి నొప్పులు పడుతున్నారు. సామాజిక దురాగతాలు, పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లోపం, అఘాయిత్యాల పేరిట వారి బాల్యం నాశనం అవుతోంది. బంగారు భవిష్యత్తు మసకబారుతోంది. రక్షించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టం ఉన్నా అమలు తీరును ఎగ‘తాళి’ చేసింది. వందల మంది బాలికల జీవితాలు బుగ్గిపాలవడం ఆవేదన కలిగిస్తోంది. -
9,10 తేదీల్లో జాతీయస్థాయి డప్పుల పోటీలు
వినుకొండ: దరువు సాంస్కృతిక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ గ్రౌండ్స్లో జాతీయస్థాయి డప్పు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక వాసి నండోజ పిండి పాపన్ హళ్లి ముని వెంకటప్ప మాదిగకు సన్మానం జరుగుతుందన్నారు. పోటీలకు ఆరు రాష్ట్రాల నుంచి ఎంపికై న నిష్ణాతులైన 12 టీమ్లు పాల్గొంటాయని, విజేతలైన టీమ్లకు మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50వేలు, మూడో బహుమతి రూ.30వేలు నగదు, పాల్గొన్న టీమ్లకు రూ.10వేలు నగదు, ప్రశంసాపత్రం, సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని దరువు వ్యవస్థాపకులు ఎర్రగుంట్ల భాస్కర్రావ్, కన్వీనర్ ప్రసాద్, కో–కన్వీనర్ స్కైలాబ్ కిరణ్, కో–ఆర్డినేటర్ బేతం గాబ్రియేల్, మోజేస్, సలహాదారులు చాట్ల రామయ్య, ఆర్గనైజర్స్ బంక ఎలియాజర్, కూచిపూడి వినోద్కుమార్ తదితరులు పర్యవేక్షిస్తారని తెలిపారు. రెంటచింతల: మండలంలోని గోలి గ్రామానికి చెందిన వడితే చంద్రూ నాయక్(38) మిట్టగుడిపాడు–గోలి గ్రామాల మార్గ మధ్యలోని ఓ కల్వర్టు వద్ద మృతి చెందినట్లు మంగళవారం ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఏప్రిల్ 30న గురువారం అదే గ్రామానికి చెందిన గురవయ్యకు ఆ ప్రాంతంలోని పొలం గట్టున చంద్రూ నాయక్ కన్పించాడు. అప్పటి నుంచి మంగళవారం వరకు చంద్రూ నాయక్ జాడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రతకు మంచినీరు లేక దప్పికతో మృతి చెందినట్లు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం: భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం చోదకులకు చాలా అవసరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆప్కా సాబ్కి అవాజ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో హోంగార్డులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తించే హోంగార్డులకు హెల్మెట్లను విరాళంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజ సేవ చేయడం సంస్థ ప్రధాన ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, సంస్థ సభ్యులు శివ కుమార్, డాక్టర్ రాధమాధవి, కిరణ్ పాల్గొన్నారు. -
డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా బిల్లు అమలు చేయాలి
నరసరావుపేట: డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐద్వా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని అధ్యక్షతన నిర్వహించిన డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన సదస్సులో సావిత్రి మాట్లాడారు. డిలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లును అమలు చేయడంలో ఆలస్యం చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును అమలు చేయడం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలు విషయంలో ఆలస్యం జరుగుతుందని డీలిమిటేషన్తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈ నెల 7న విజయవాడలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పే కూటమి ప్రభుత్వ పెద్దలు, అదేస్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం జీవన ప్రమాణాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మద్దతు లేకుండా గంజాయి సాగు జరగడం అది బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాధాకృష్ణ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీఐటీయు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు జి.మల్లేశ్వరి, మహిళా సంఘం సీనియర్ నాయకురాలు జి.ఉమశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జె.అనూషలు పలు అంశాలపై మాట్లాడారు. వివిధ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలోమహిళలు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి -
షేక్ షబీనాకు స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్
తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్–జూనియర్, జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో షబీనా జూనియర్ విభాగంలో చాంపియన్గా నిలిచింది. జూనియర్స్లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్ షబీనా స్క్వాట్లో 200 కిలోలు, బెంచ్ప్రెస్లో 110 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.అశోక్కుమార్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు. గుంటూరు మెడికల్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్ చేయడం, ఫాలో అప్ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్ని, ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్, మేనేజర్ శిరీష పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెన్యువల్ పత్రాలు తీసుకురావాలని కోరారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,500 వరకు పలికింది. 7 -
బడిబాటలో కలెక్టర్ సందడి
చిలకలూరిపేటటౌన్: మండలం పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్ల మంగళవారం పర్యటించారు. ముందుగా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాలా ఒక ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్.. ప్రభుత్వ బడుల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వసతులను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అక్షర వెలుగులతో గ్రామం మెరవాలని ఆకాంక్షించారు. అనంతరం సమీపంలోని టెక్స్టైల్ పార్కును సందర్శించారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, జిల్లా ప్రగతిలో వస్త్ర పరిశ్రమ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్, టెక్ట్స్టైల్స్ ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. -
స్కూల్ బస్సులు నిబంధనలు పాటించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థుల భద్రత కోసం స్కూల్ బస్సులను నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవకుమార్ తెలిపారు. జిల్లాలోని బడి బస్సులపై ప్రత్యేక తనిఖీల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలోని నాలుగు కార్యాలయాల పరిధిలో 162 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 770 బస్సులు ఉన్నట్టు వివరించారు. బస్సులను బృందాలు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఎటువంటి మరమ్మతులు చేపట్టాల్సి ఉందో వివరిస్తారు. ప్రతి బస్సుకు ఏఐఎస్–140 ప్రకారం వీఎల్టీడీ, పానిక్ బటన్ అమర్చాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తనిఖీ బృందాలు 119 బస్సులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. 31 వరకు గడువు మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీలోగా బస్సులను సిద్ధం చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆర్టీవో సూచించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, భద్రతా పరికరాల ఏర్పాటు, సరైన పత్రాలు, ఇతర నిబంధనలు తప్పనిసరని స్పష్టం చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ బస్సులకు సంబంధించిన అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, ఫైర్ డిస్టెన్షన్ అలారం, హ్యాండ్ బ్రేక్, సిగ్నల్ లైట్స్, డిటెన్షన్ అగ్నిమాపక యంత్రాలు, అత్యవసరద్వారం పనితీరును పరిశీలిస్తారని వివరించారు. అత్యవసర ద్వారంకు ఎటువంటి ప్రతిబంధకం లేకుండా సీట్లను అమర్చాలని సూచించారు. కచ్చితంగా అమలు చేయాలి పాఠశాల బస్సులలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిర్దేశిత గడువు తరువాత ఏవైనా ఉల్లంఘనలు గమనిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అన్ని స్కూల్ యాజమన్యాలు రవాణా శాఖతో సహకరించాలని కోరారు. -
చర్చి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు
వినుకొండ: పురపాలక సంఘం పరిధిలో గల క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఆక్రమణల పర్వానికి గురవుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కొందరు వ్యక్తులు చర్చి స్థలాలను ఆక్రమించడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై చర్చి కోశాధికారి పులిమల సునీల్కుమార్తో పాటు సంఘ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన విలువైన స్థలాలను కొందరు ఆక్రమణదారులు తప్పుడు ధ్రువపత్రాలతో పురపాలక సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అన్నపూర్ణ హోటల్ ఎదురుగా అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా బాధ్యత ఉన్న మున్సిపల్ అధికారులు, ఆక్రమణదారులతో చేతులు కలిపారని చర్చి సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ కాపీని చూపించినా కమిషనర్ స్పందించకపోగా నేను ఏ చర్యలు తీసుకోను, మీకు చేతనైనది చేసుకోండి అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్పై కఠినచర్యలు తీసుకోవాలని, తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి మిషనరీ ఆస్తులను కాపాడాలని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని శాఖ గ్రంథాలయంలో శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయ ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు. పుస్తక పఠనంతో మేధస్సు అభివృద్ధి చెందడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడం వలన మంచి అలవాట్లు చేకూరుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, ఎన్జీవో పార్కు అసోసియేషన్ అధ్యక్షురాలు జె.సుబ్బాయమ్మ, గ్రంథాలయాధికారి పి.సత్య శిరీష పాల్గొన్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి న్యూ కేటగిరి విభాగంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయని రైతు కమిటీ సభ్యులు తెలిపారు. నలుగురు వ్యక్తుల సహకారంతో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువు లాగినట్లు చెప్పారు. ఆరు పళ్ల విభాగంలో విజేతలు.. గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 15 నిమిషాల వ్యవధిలో 1.200 టన్నుల బరువును ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన దేవరపల్లి జాన్వికా రెడ్డి, హన్విక ఎడ్ల జత 4,551 అడుగుల దూరం ప్రథమ స్థానంలో నిలిచాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన కొప్పుల గోవర్దన్ రెడ్డి, ప్రవలీష్ రెడ్డి ఎడ్ల జత 4,398 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామానికి చెందిన గడిపూడి రాజా చౌదరి ఎడ్ల జత 4,029 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్దశ్రీను, ఉమ్మనేని విక్రం, అత్తలూరి వెంకట్రావ్, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరుమామిళ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత నాగార్జున యాదవ్కు నోటీసులు
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నినందుకుగాను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కు పోలీసులు నోటీసులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన రూ. 1,120 కోట్లను ‘ఏమైంది’ అని అడిగినందుకు నాగార్జున యాదవ్పై కేసు నమోదు చేశారు కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీసులు. డిసెంబర్ 16, 2024 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు 244 రోజుల పాటు స్థానిక సంస్థలకు వచ్చిన నిధులను విడుదల చేయకుండా, ఆ డబ్బులను ఏమి చేశారు?అని ప్రశ్నించారు. నిధులు దారి మళ్లించారా?, అలా అయితే, ఏ శాఖకు ఎంత మళ్లించారు?, ఎప్పుడు మళ్లించారు?, ఏ అవసరాలకు మళ్లించారో చెప్పలేరా?, ఎందుకు చెప్పడం లేదు?’ అని సాక్షి KSR లైవ్ షోలో నిలదీశారు. దీనిపై కేసు పెట్టి, 7 రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరులో నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చి.. ఆయనకు నోటీసులిచ్చారు తిమ్మాపురం పోలీసులు. -
అసలు రంగు బయటపడింది
పల్నాడురంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు ‘పచ్చ’కుట్రలు సాక్షి, నరసరావుపేట: అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న ముఠాను పట్టుకున్న విజిలెన్స్, ఆటవీశాఖ అధికారులను బెదిరించి రంగురాళ్ల కేసును నీరుగార్చేందుకు అధికారపార్టీ నేతలు తమ అసలు రంగు బయటకపెట్టుకుని పచ్చ కుట్రలకు తెరలేపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో దొరికే రంగురాళ్ల(క్రిస్టల్, క్వార్జ్జ్)ను దాచేపల్లి సమీపంలోని ఓ గోడౌన్లో దాచగా గత శుక్రవారం రాత్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈక్రమంలో శంకరపురం అటవీసమీపంలోని పలు గ్రామాల్లోని కూలీల ఇళ్లలో భారీ ఎత్తున రంగురాళ్లు నిల్వ చేశారన్న సమాచారంతో విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అయితే ఈ సమాచారం తెలియడంతో రంగురాళ్లు అధికారుల కంటపడకుండా రంగురాళ్ల మాఫియా జాగ్రత్తపడింది. విజిలెన్స్, అటవీ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించే సమయంలో టీడీపీ నేతల సన్నిహితంగా ఉండే కూలీలు హంగామా సృష్టించారు. సోదాలు నిర్వహించకూడదంటూ ఎదురుతిరిగారు. రంగురాళ్ల తవ్వకాలకు స్థానిక టీడీపీ నేతలకు ఓ ఫారెస్ట్ అధికారి, కొందరు సిబ్బంది బాగా సహకరిస్తున్నట్టు సమాచారం. సదరు ఫారెస్టు అధికారికి తెలియకుండా దాడులు నిర్వహించి రంగురాళ్ల పట్టుకోవడంతో అధికారపార్టీ నేతలతో కలసి కుట్రలకు తెరలేపినట్టు ఆ శాఖ అధికారులే చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా భట్రుపాలెంకు చెందిన కొందరు కూలీలతో సోదాలు నిర్వహించిన అధికారులపై దాచేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. షెడ్యూల్ తెగలకు చెందిన తమ ఇళ్లలోకి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రవేశించి కూలం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారట. ● దీనిపై దాచేపల్లి సీఐ రాజేష్ను వివరణ అడగగా ఫిర్యాదు అందిందని, దానిపై విచారణ చేస్తున్నామని ‘సాక్షి’కి తెలిపారు. అయితే సోదాలు నిర్వహించే సమయంలో ఒకటి రెండు నిబంధనలు పాటించలేదన్న సాకుతో ఏ తప్పు చేయకపోయినా మాపై ఫిర్యాదుచేయడం ఏంటని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయగలమని, రంగురాళ్ల మాఫియా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే ఇదే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగురాళ్ల మాఫియాతో చేతులు కలపి అటవీ సంపదను దోచుకోవడమే కాక సొంత సిబ్బందిపైనే ఫిర్యాదు చేయించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. అటవీశాఖ సిబ్బందిపై ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావును అటవీశాఖ అధికారులు కలసినట్టు సమాచారం. రంగురాళ్ల నిల్వలున్నాయని పలువురు కూలీల ఇళ్లలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్, అటవీ అధికారులు కులం పేరుతో తమను దూషించారంటూ అధికారులపై కూలీలతోనే ఫిర్యాదు చేయించిన రంగురాళ్ల మాఫియా అక్రమ కేసుపై పల్నాడు ఎస్పీని కలసిన అటవీ శాఖ అధికారులు రంగురాళ్ల కేసులో తెరవెనుక ఉన్న టీడీపీ నేతలు, సహకరించిన అధికారుల పాత్రపై విచారణను అడ్డుకునేందుకు కుట్ర అధికార పార్టీ నేతలు, అటవీ శాఖ అధికారులు కలసి రెండేళ్లలో రూ.కోట్ల విలువైన రాళ్లను విక్రయించిన వైనం రంగురాళ్లు పట్టుబడటం, దాని వెనుకున్న అధికారపార్టీ నేతలు, అవినీతి అధికారుల గుట్టు భయటపడుతుందన్న భయంతో కుట్రలకు తెరతీశారు. ఏకంగా అటవీశాఖ అధికారులపైనే ఫిర్యాదులు ఇవ్వడం ఆశ్చార్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రంగురాళ్ల మాఫియా కోట్లాది రూపాయల విలువచేసే రాళ్లు సేకరించి అక్రమార్జన చేశారు. ఇవన్ని బయటపడకుండా మాఫియా కుట్రలకు తెరలేపిందని సమాచారం. మరోవైపు దాచేపల్లి మండలంలోని శంకరపురం అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న కాట్రపాడు, భట్రుపాలెం తదితర గ్రామాలలో భారీస్థాయిలో రంగురాళ్లు ఉన్నాయని, వాటిపై దాడులు చేస్తే రంగురాళ్లు పెద్ద ఎత్తున బయటపడతాయని స్థానికులు చెప్పుకొస్తున్నారు. పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు. -
ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడీయల్ శిక్షణతో నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 11 శాతమే ఫెయిల్ అయ్యారని, సమష్టి కృషితో వారందరినీ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది, నూరు శాతం సాధించిన జిల్లాగా అగ్రస్ధానంలో నిలుపవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం స్టడీమెటీరియల్తో కూడిన 20 రోజుల ప్రణాళికను ఇచ్చిందని, దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరినీ తరగతులకు హాజరయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, తెనాలి ఉప విద్యాశాఖాధికారి శాంతకుమారి, డీసీఈబీ కార్యదర్శి ఏ.తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జలధార–జలహారతి పనులు త్వరగా ప్రారంభం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జలధార, పీజీఆర్ఎస్, రీ సర్వే, ఉపాధి హామీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జలధార– జలహారతి పనులు మంజూరైనప్పటికీ, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతున్నట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నాయన్నారు. పనులు త్వరగా ప్రారంభం చేయడమే కాకుండా వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై 48 గంటలలో చర్యలు చేపట్టాలని అన్నారు. జన గణన వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం చేసుకుంటూ చేయాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ దివ్యాంగులకు ఉపకరణాలను జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కటి రూ.15 వేలు విలువ గల పరికరాలను అందించారు. ఉపకరణాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య అభ్యసనానికి కృషి చేయాలని జేసీ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప పాల్గొన్నారు. -
వంటింట్లోకి యుద్ధం!
పశ్చిమాసియా యుద్ధం బూచిగా చూపి నిత్యావసరాల ధరల పెంపు సత్తెనపల్లి: పశ్చిమాసియ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి మార్కెట్లో నిత్యవసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో పేద ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్గా మారి కృత్రిమ కొరత సష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటర్కు రూ. 30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం... నిత్యావసర ధరలు రెండు నెలల నుంచి పెంచి సామాన్యులను దోచుకుంటున్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలకులు యుద్ధప్రభావం ఏమీ లేదని చెబుతుంటేఏ మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. ఏం కొనేటట్టు లేం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా .. నూనె, గ్యాస్ కనీస అవసరం. నూనె లేనిదే, గ్యాస్ లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా అసలు వంటకాలే తగ్గిస్తున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్తో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులకు వెజి ‘ట్రబుల్స్’... ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నింటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు రూ. 20 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ. 60 వరకు పెరిగాయి. డజన్ నిమ్మకాయలు రూ. 120 పైనే విక్రయిస్తున్నారు. కూరగాయలు రకాన్ని బట్టి రూ 10 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వినియోగ దారులు చెబుతున్నారు. రకం పాతధర(కిలో) కొత్త ధర వంకాయలు రూ. 40 రూ. 60 టమాటా రూ. 30 రూ. 40 గోరుచిక్కుళ్లు రూ. 30 రూ. 40 బెండకాయలు రూ. 40 రూ. 50 దొండకాయలు రూ. 30 రూ. 40 పచ్చిమిర్చి రూ. 30 రూ. 50 బీరకాయలు రూ. 40 రూ. 60 పప్పుల నుంచి నూనెల వరకు అదే తీరు సలసల కాగుతున్న వంట నూనెల ధరలు కూరగాయల ధరలకు సైతం రెక్కలు ఇంకా పూర్తిస్థాయిలో తీరని వంట గ్యాస్ కష్టాలు సామాన్య, పేద ప్రజలు బతికేదెలా? ఆందోళన వ్యక్తం చేస్తున్న పేద ప్రజలు పట్టించుకోని కూటమి పాలకులు పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు కమర్షియల్ సిలిండర్ ఏకంగా రూ. 993 పెరిగింది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు ధరలను నియంత్రించడంతోపాటు గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన.. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి– చుండూరు స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్ గోవాడ వెంకట్కు కరణం సురేష్ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్ శేఖర్, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్ (హైదరాబాద్), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, వైఎస్కేఎన్ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్ అసోసియేషన్–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్ఎంఆర్ క్రియేషన్స్–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు. -
ఊళ్లకు వెళ్తే సమాచారం ఇవ్వండి
బాపట్లటౌన్: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల సందర్భంగా అనేక కుటుంబాలు విహారయాత్రలు, తీర్థయాత్రలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లకు వెళుతుంటారని, ఈక్రమంలో ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల, పరిస్థితులను గమనించి అపరిచితులు, దుండగులు తాళాలు వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తాళం వేసిన ఇంటిలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లు, ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలన్నారు. సమాచారం అందినప్పుడు పోలీసులు ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి గస్తీ సమయంలో ఆ ఇళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు, 112 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న గృహాల వివరాలను సేకరించి, రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ఆ గృహాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సైరన్ వేస్తూ రాత్రి గస్తీ విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి వేలిముద్రలను సేకరించాలన్నారు. -
అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్, ఎస్ఐ జీ సురేష్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్పోస్టు సెంటర్లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్పోస్టు సెంటర్ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
ముగిసిన జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్ అసోసియేషన్, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్, శౌర్యదీప్ సింగ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ రవీంద్రరాజు, విజేత స్కూల్ డైరెక్టర్ నిమ్మల సురేష్, ఇన్చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ప్రశాంతంగా నీట్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో నీట్–2026 ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా పరిధిలో మూడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాలలో 1,323 మంది విద్యార్థులకుగాను 1,285 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ–ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో 696 మందికిగాను 674, ఇర్లపాడు కేంద్రియ విద్యాలయంలో 480 మందికిగాను 469, శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో 147 మందికిగాను 142 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి పంపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. -
ఆక్రమించి తీరాల్సిందే..!
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్కట్లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఆ ప్రాంత ప్రైవేటు వ్యక్తుల భూమి వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు ఏర్పాటుకు పథక రచన చేశారు. ఈ క్రమంలో పొట్టిసుబ్బయ్యపాలెం తీరం నుంచి స్ట్రయిట్కట్ కాలువ వరకు వారు అనుకున్నది జరిగితే సుమారు 50 ఎకరాల తీరప్రాంత భూమి అనధికారికంగా వారి ఆధీనంలోకి వెళుతుందని, దాని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకు స్థానిక పచ్చనేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పేరుతో... అక్కడ జరిగే లోపాలను, ఆక్రమణల ఆలోచన బయట పడకుండా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ క్రమంలో సదరు భూములు వెంట ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని.. కలెక్టర్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని.. సీమౌత్ వద్ద వాలు మలుపు తిప్పుతామని చెబుతున్నారు. అందుకు డ్రైనేజీ శాఖ పరంగా నిధులు మంజూరు చేస్తారని.. లేదంటే తామే నిధులు సమకూర్చి అధికారుల పర్యవేక్షణలో వాలు మలుపు చర్యలు చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నామంటున్నారు. కాలువ దగ్గర జెట్టీ నిర్మాణం జరుగుతోందని.. మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. అప్పుడు తీరం నుంచి మా భూముల పక్కన వచ్చే రోడ్డు వరకు ఎత్తు, పల్లాలుగా ఉన్న ఇసుకను చదును చేస్తామని.. ఇలా ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం. సీఆర్జెడ్ పరిధి పట్టించుకోవాలి.. ఆ ప్రాంతంలో తీరం నుంచి సీఆర్జెడ్ పరిధి, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారంలో చేపట్టే పనులు తదితర విషయాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ వివాదంలో అధికారులు మీనమేషాలు లెక్కించారు. తీరా సమస్య తీవ్ర రూపం దాల్చిన తరువాత పరిష్కార చర్యలు చేపట్టారు. చివరకు విషయం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తాజాగా వేటపాలెం స్ట్రయిట్కట్ వాలు మలుపుకు సంబంధించి ఆ ప్రాంతవాసుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముందస్తుగా అధికారులు స్పందించి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తీరం పరాధీనం కాకుండా కాపాడాలి. ప్లాట్లు విక్రయించేందుకు అడుగులు వీరిలో వస్త్ర వ్యాపారి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకుండానే ప్లాట్లు వేసి విక్రయించేందకు అడుగులు వేశారు. విషయం బహిర్గతం కావటంతో ఆయన తాత్కాలికంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొత్త ఆలోచనతో ముందుకెళుతున్నారు. అందుకు పచ్చనేత చేసిన హితోపదేశమే కారణమని సమాచారం. సునామీ సమయంలో... గతంలో సునామీ వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో భయంకరమైన అలల తాకిడికి సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఆ ప్రాంతంలో భారీ ఇసుక తిన్నెలు ఉండేవి. దీంతో ప్రమాదస్థాయి ఒకింత తగ్గింది. తరువాత ఇసుక తిన్నెలు మానవ చర్యలతో కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో సీ వ్యూ పేరుతో తాత్కాలిక లబ్ధి కోసం చేపట్టే చర్యలు భవిష్యత్లో ప్రమాద హేతువులు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ గీతారాణిని వివరణ అడగ్గా ఆమె పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. -
మూలకు చేరిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు....
ఆక్సిజన్ విలువ కరోనా సమయంలో అందిరికీ తెలిసి వచ్చింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆక్సిజన్ పేదరోగులకు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని మూలకు చేర్చారు. ఐటీసీ సహకారంతో 300 లీటర్లు, ప్రభుత్వం మెగా కంపెనీ నుంచి 500 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్లను వేరువేరుగా సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలలో ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రస్తుతం పనిచేయడం లేదు. వైద్యశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్లాంట్ల నుంచి వైద్యశాలకు వెళ్లే కేబుల్స్ కట్ కావడంతో మూలకు చేరాయి. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం లేదు. అంతేగాక చిన్న పిల్లలకు, బాలింతలకు వేడి నీళ్లు అవసరం. ఒక గీజర్ మాత్రమే ఉండడంతో ఆ నీటిని బయట హోటల్స్లో కొనుగోలు చేయాల్సి న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవికాలం అయినప్పటికీ బాలింతలకు, నవజాత శిశువులకు వేడి నీటిని ఉపయోగించాల్సి ఉంది. వైద్యశాల ప్రాంగణంలో వాహనాల నిలుదలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి నెలకొంది. -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని శంకరాపురం అటవీ భూముల్లో టీడీపీ నాయకులు తవ్వితీసిన రంగురాళ్లను ఆ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మూడు రోజుల క్రితం దాచేపల్లిలో ఓ గోడౌన్లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రంగరాళ్లను వినుకొండకు తరలించి భద్రపరిచారు. అయితే స్వాధీన పరుచుకున్న రంగురాళ్ల వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అధికారులు వెల్లడించకపోగా... ఈ కేసుపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాచేపల్లిలో దొరికిన రంగరాళ్లను టీడీపీకి చెందిన కీలక నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కీలకంగా ఉన్న సదరు నాయకులపై కేసులు పెట్టకుండా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య నేత ద్వారా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తూ టీడీపీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు చేసే కూలీలపైనే కేసులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సూత్రధారులను విడిచిపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. అధికారుల పాత్రే కీలకం దాచేపల్లిలో పట్టుబడిన రంగురాళ్లు సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ స్థాయిలో రంగురాళ్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. అటవీ భూముల్లో యథేచ్ఛగా రంగురాళ్ల కోసం తవ్వకాలు నిర్విరామంగా జరుగుతుంటే అధికారులు చూడకపోగా.. కేసులు కూడా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ శాఖ అధికారులు కూడా తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కారులో లభించిన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కారును వదిలి పెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శాఖాపరమైన విచారణ జరిగినట్లు కూడా సమాచారం. రంగు రాళ్లు తవ్వించే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారుల సహకారం ఉండటం వల్లనే కొండకు సొరంగాలు వేస్తున్నారు. సహజసిద్ధమైన సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. శంకరాపురం కొండలలో రంగురాళ్ల తవ్వకాల వ్యవహారం పైస్థాయి అధికారులకూ తెలుసని సమాచారం. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావు రెడీమెడ్ బంగారం వస్తువులు అమ్మడం కోసం ప్రతి సోమవారం కారంపూడి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన కారంపూడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో అంకాళమ్మ దేవాలయం వద్ద యూనియన్ బ్యాంకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పథకం ప్రకారం అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం వస్తువులను తీసుకుని పరారయ్యారు. కారంపూడిలోని శివరామకృష్ణ జ్యూయలర్స్లో గుమాస్తాగా పనిచేస్తున్న గోసుల సాంబయ్య పన్నిన పథకం ప్రకారం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం బండారు అజిత్, గుంటూరు అంబేడ్కర్ నగర్కు చెందిన కాండ్రగుంట శశికుమార్, కాండ్రకుంట సాయికిరణ్, అన్నం నిఖిల్, గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన గోగుల పవన్, పమిడిపాడు గ్రామానికి చెందిన గోసుల సాంబయ్యలు ఒక ప్లాను ప్రకారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై దాడి చేసి బంగారం వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలు ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కారంపూడిలోని పేటసన్నెగండ్ల కాలువ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం, యమహా–ఎంటీ 15, హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను చాకచాక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందంచారు. సమావేశంలో డీఎస్పీ ఎంఎ మహేశ్వరరావు, సీఐ పి శరత్బాబు, ఎస్ఐ ఎం వాసులు పాల్గొన్నారు. -
వైద్యానికి పాట్లు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026వసతులకు తూట్లు..ప్రజా వైద్యానికి చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాల నిర్వహణ తీరు గాడితప్పుతోంది. సిబ్బంది కొరత పీడిస్తోంది. ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గురువారం సాక్షి ఫీల్డ్ విజిట్ చేసింది. పేదలకు వైద్య సేవలు మొక్కుబడిగా అందడాన్ని గుర్తించింది. ఓపీ వద్ద కిటకిటలాడుతున్న రోగులుసత్తెనపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పలు వ్యాధులతో ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. చికిత్సల సంగతి దేవుడెరుగు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచటంలో విఫలమవుతోంది. ప్రసూతి సేవలకు అవసరమైన పాడ్స్ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, శిశువులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత నెల ప్రసవాల లక్ష్యం 100 కాగా ఇక్కడ 129 జరిగాయి. మహిళల స్కానింగ్కు సంబంధించి ప్రధానంగా రేడియాలజిస్ట్ లేక కష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వైద్యశాలలో ఒక సీఎస్ఆర్ ఎంఓ, మరో సీఏఎస్, ఒక ల్యాబ్ టెక్నీషీయన్, జనరల్ డ్యూటీ అటెండర్స్ మూడు పోస్టులు, డీఆర్ఏ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. బ్లడ్ స్టోరేజీ యూనిట్ ఉన్నప్పటికీ దానిలో సేవలందించే రెండు ల్యాబ్ టెక్నీషీయన్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాక రెండు డేటాఎంట్రీ పోస్ట్లు సైతం భర్తీ చేయలేదు. నిత్యం ఉన్న వారిపైనే పని భారం పడుతోంది. సెంట్రల్ డ్రగ్స్ నుంచి అరకొర మందులు... ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు ప్రతిరోజు 600 నుంచి 700 వరకు ఓపీలు వస్తున్నాయి. సీజనల్ ప్రభావంతో జ్వరం కేసులు తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రలు సెంట్రల్ డ్రగ్స్ నుంచి సరఫరా కావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వాడేవి కూడా లేవని తెలుస్తోంది. చిన్నపిల్లలకు ఇచ్చే సిరప్లు లేవు. వృద్ధులకు ఆయాసానికి సంబంధించి సిరప్ లేదు. వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ప్రభుత్వం పేదల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను విస్తృతం చేసింది. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసి వైద్య సేవలను అందించింది. పోస్టులు ఖాళీ పడితే వెను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని శాఖలోని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. రేడియాలజిస్ట్తోపాటు మరికొన్ని పోస్ట్లు ఖాళీ ఉన్నాయి వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం. మందుల కొరత గత నెల మార్చి కావటంతో చివరిలో ఇబ్బంది ఉన్నప్పటికీ అధిగమించేలా లోన్బేసిస్లో మందులు తెచ్చాం. మందులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నాం. బాలింతలు, నవజాత శివులకు వేడినీళ్లకు సంబంధించి మరో రెండు గీజర్లు వచ్చాయి. వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్లు పని చేయడం లేదు. – డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, సత్తెనపల్లి -
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..!
సత్తెనపల్లి: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది.పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో జిల్లాకు ఎన్ని కేటాయిస్తారు. అందులో జిల్లాకు ఎన్ని వస్తాయన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. స్పెషల్ కేటగిరి (పీహెచ్/ఎన్సీసీ/ స్పోర్ట్స్/ భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్లు జూన్ మొదటి వారంలో చేపట్టి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించను న్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ... రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఒక్కో విద్యాసంస్థలో సుమారు వెయ్యి సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. సమీకృత ఇంజనీరింగ్ కోర్స్ ఆరేళ్లు కాగా .. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్స్), నాలుగేళ్ల ఇంజనీరింగ్లో చేరుతారు. నూతన విద్యా విధానం –2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజనీరింగ్ సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంతోపాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరణ...ఎంపిక ప్రక్రియ 2026–27 విద్యా సంవత్సరానికిగాను రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూ కేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ అడ్మిషన్లు చైర్మన్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ చండ్రా ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరికి సమాన మార్కులు వస్తే ముందు గణితం, తరువాత జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్, చివరిగా ఫస్ట్ లాంగ్వేజీలో మార్కులు పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు.అప్పటికీ సమ ఉజ్జీగా ఉంటే పుట్టిన తేదీ, హల్ టిక్కెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. నాడు వైఎస్సార్ చలవతో... గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అధిక సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించి 4 వేల సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరలు, తెలంగాణ, ఎన్ఆర్ఐ తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. దరఖాస్తులను మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్( డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్జీయుకేటీ.ఇన్/ ఏపీ వెబ్సైట్) ద్వారా స్వీకరించనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్ధులకు దరఖాస్తు రుసుం రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.250 నిర్ధా రించారు. జూన్ 12వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమైనప్పటికీ..ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జులై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో కలిసి చదువు కొనసాగించేలా ఈ మార్పు చేశారు. -
వైభవంగా సాక్షి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్సీ), ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్న్ హెచ్సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్స్టేషన్ హెచ్సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి అమ్మవారు
బాపట్ల: ప్రసిద్ధిగాంచిన చందోలులోని బగళాముఖి అమ్మవారు స్వర్ణ ప్రకాశ రూపిణిగా దర్శనమిచ్చారు. దివ్యక్షేత్రం వార్షిక ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రాచీన స్వర్ణ ఆభరణాల శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆభరణాలను అమ్మవారికి అలంకరింపజేశారు. అమ్మవారిని దర్శించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేశారు. తొలుత ఆలయం నుంచి దేవాదాయ, పోలీస్, రెవెన్యూ పంచాయతీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చందోలు స్టేట్ బ్యాంకు వద్దకు శోభాయాత్రగా చేరుకొనగా బ్యాంక్ మేనేజర్కు అనుమతి లెటర్ ఇచ్చి అందరూ సంతకాలు చేసి బ్యాంకు నుంచి సీల్డు నగలు బాక్స్ను స్వీకరించి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకొని అందులో ఉన్న ఆభరణాలను అధికారుల సమక్షంలో అమ్మవారి అలంకారం నిమిత్తం ఆలయ పూజారులకు అప్పగించారు. అప్పటి నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు కొనకాల బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికీ చల్లటి మజ్జిగ అందజేశారు. ప్రముఖుల సందర్శన స్వర్ణాభరణముల అలంకారంలో అమ్మవారిని దర్శించటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, పెనుగొండ వాసవి పీఠాధిపతులు పరమ శ్రీప్రజ్ఞ భారతిస్వామి, బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్, బాపట్ల డీఆర్ఓ జి గంగాధర్గౌడ్, ట్రాన్స్ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పంచలోహ సింహాలు వితరణ బాపట్ల శాసనసభ్యుడు వేగేశ న నరేంద్ర వర్మ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. రూ.9 లక్షల వెచ్చించి తయారు చేయించిన గ్రానైట్ రాతి పద్మ పీఠం, పంచలోహ సింహాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఎం భాగ్యలక్ష్మి, తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎంవీ శివకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి సుజాత, వీఆర్ఓ అరుణకుమారి, ఆలపాటి వెంకటరమణారావు, భవనం బసవరెడ్డి, దోమ నాగేశ్వరరెడ్డి, కేతరాజు, పట్టాభిరామారావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, అయినంపూడి వెంకట పద్మజ, నక్క సముద్రాలు, ఎనకపల్లి వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బెల్లంకొండ: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మండల వ్యాప్తంగా సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, న్యూట్రి గార్డెన్లు, సెరీకల్చర్ విధానాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్లను ఏర్పాటు చేయాలని, అధికారులు తమ పరిధిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూట్రి గార్డెన్, కిచెన్ గార్డెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, డ్రామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ నారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రయ్యకుంట పనులు పరిశీలన రాజుపాలెం: జలధార పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని రెడ్డిగూడెం పరిధిలోని భద్రయ్యకుంటలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నెలలో చెరువుకుంట పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. రాజుపాలెం సమీపంలో జ్యోతి నాగేశ్వరరావు సూర్య మండల నమూనాను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ పొత్తూరి వెంకటనారాయణ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి,ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గృహ గణన సర్వే పారదర్శకంగా చేపట్టాలి
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ● సత్తెనపల్లి మండలం అబ్బూరులో పర్యటన సత్తెనపల్లి: జనగణనలో భాగంగా మొదటి విడతలో ప్రారంభమైన గృహ గణన సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో కలిసి గృహ గణన జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ చిన్నారులకు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, పిల్లల హాజరును పరిశీలించారు. చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె పాల్గొని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పెంపకం కుటీర పరిశ్రమ వద్దకు వెళ్లి పరిశ్రమ నడుపుతున్న తీరును, మార్కెటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో కె.శ్రీరాములు, తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి, ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డి, ఏపీ బట్రాజు కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, భీమినేని వందనాదేవిపాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అంతర్ జిల్లా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జిల్లా జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జీఎస్సీ బోస్, కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు సీహెచ్ శ్రీనివాసరావు, అనిల్, రవికుమార్ పర్యవేక్షించారు. అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుపున బాలుర విభాగం నుంచి షణ్ముఖ్, రూపేష్, మణికంఠ, అఖిల్, జాన్ ప్రడ్డి పాల్, జయ రామ్, అఖిల్, విజయ్, ప్రత్యుష, సత్య, ఈశ్వర్ దినేష్ స్టాండ్ బై గా గిరి, హర్షిత్, ఆకాష్, రుత్విక్, బాలికల విభాగం నుంచి యోగ శ్రీ, మానస, అక్షయ, కుండానే, కావ్య, జుబేరియా, శ్రీ లక్ష్మి, ఫర్హానా, ఈషా, ప్రణతి, సహస్ర, సాయి శ్రీ స్టాండ్ బైగా బృంద, జస్విత, ప్రణీత, బ్లేస్సిలను ఎంపిక చేశారు. డాక్టర్ తనపై దాడి చేశాడంటూ విభాగాధిపతి ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో విధుల కేటాయింపులో వివాదం ఏర్పడి ఓ డాక్టర్ ఓ విభాగాధిపతిపై దాడిచేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనపై దాడిచేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ విభాగాధిపతి లిఖితక పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ ఆర్ధోపెడిక్ విభాగాధిపతిగా, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా డాక్టర్ పాటిబండ్ల అనిల్బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి విధులు చేపట్టిన డాక్టర్ అనిల్బాబు ఎమర్జెన్సీ మెడిసిన్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలువురు క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్లకు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్) విధులు కేటాయించారు. జీజీహెచ్లో క్యాజువాల్టీలో పనిచేస్తున్న సీఏఎస్లను క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. వీరు మూడు షిఫ్ట్లు క్యాజువాల్టిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించి డ్యూటీ రోస్టర్ వేసిన పిదప క్యాజువాల్టిలో విధులు నిర్వహించకుండా ఆర్ఎంఓ రూములో డాక్టర్ గురుప్రసాద్ ఉండటంపై డాక్టర్ అనిల్కుమార్ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి డాక్టర్ గురుప్రసాద్ తనను అసభ్యంగా మాట్లాడి, కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలు సక్రమంగా నిర్వహించేలా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఉన్నవ గ్రామంలో చోరీ యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం శివారు పరిధిలోని వెంకటేశ్వర నగర్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన దాసరి మరియబాబు (35) బైకుపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని వెంకటేశ్వరనగర్ సమీపాన ఏదురుగా వస్తున్న ఆర్టీసీ ఢీకొనటంతో రోడ్డుపై పడి కుడి కాలు విరిగిపోవటంతో సత్వరమే 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్తం అధికంగా పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఆర్టీసి డ్రైవరు సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బార్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్కుమార్, ఆర్.చేతన్, పి.వీరాంజనేయులు, స్టేక్ హోల్డర్స్, సోప్ వర్కర్స్, మునిసిపల్ వర్కర్స్, ప్యానెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. -
బ్రేకుల్లేని అద్దె కార్ల దందా
చేతిలో స్టీరింగ్.. కళ్లకు కూలింగ్ గ్లాస్.. పక్కన ఫ్రెండ్స్తో చిట్ చాట్.. ఆకాశమే హద్దుగా డ్రైవింగ్.. ఈ రకమైన ఎంజాయ్మెంట్కు యువత ఆకర్షితులవుతుంటే.. అద్దె కార్ల ఆఫీసులు ప్రోత్సాహక కేంద్రాలుగా మారుతున్నాయి. డ్రైవింగ్ నిబంధనలు కూడా తెలియని జోరులో యువత రయ్మంటూ రోడ్లపై దూసుకుపోతుంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చేతిలో కాసులు పడితే.. ఎవరికై నా కీస్ అందిస్తామంటూ రూల్స్ను కార్ల చక్రాల కింద తొక్కిపెడుతుంటే.. బిడ్డల నిండు ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు అధికారుల నిద్రమత్తును నిలదీస్తున్నాయి. నరసరావుపేట కేంద్రంగా సాగుతున్న అద్దె కార్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు కాగా.. అనుభవం లేని యువత చేతిలో చక్రాలు రోడ్లపై నెత్తుటి ధారలు పారిస్తున్నాయి. నరసరావుపేట టౌనన్్ : అద్దె కార్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా మైనర్ యువకులకు, డ్రైవింగ్ లైసెనన్స్ లేని వారికి సైతం అద్దె కార్లు ఇస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండు రోజలు క్రితం మాదల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన అద్దె కార్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదానికి కారణమైన విషయాలపై తీగ లాగితే అద్దె కార్ల అక్రమ డొంక వెలుగులోకి వచ్చిందని ముప్పాళ్ల ఎస్ఐ అనిల్ తెలిపారు. నరసరావుపేట పట్టణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకున్నాడని, డ్రైవింగ్ చేసిన విద్యార్థికి కనీసం లైసెనన్స్ కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వ్యక్తికి కారు అద్దెకు ఇచ్చినందుకు యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పెట్లూరివారిపాలెం వద్ద మరో వ్యక్తిని ఢీకొట్టిన వైనం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అద్దె కార్ల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు నిర్వాహకులు కార్యాలయాలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో కార్లను అద్దెకు ఇస్తున్నారు. కార్లు బాడుగకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్న్స్ గానీ, వారి అనుభవంగానీ పరిశీలించడం లేదు. చేతిలో కాసులు పడితే చాలు కారు కీస్ అందిస్తున్నారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2 వేలు, లగ్జరీ కారుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ప్రైవసీ ఉంటుందని ట్రావెల్స్ కార్ల కంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వైపే యువత ఆకర్షితులవ్వడంతో నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు కార్లు అద్దెకు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. అద్దె కార్లు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్లటం వల్ల రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం పెట్లూరివారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని అద్దె కారు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చిన యువకుడు ఢీకొనడంతో మృతి చెందాడు. గతంలో ప్రకాష్నగర్ సెయింట్ జోసఫ్ పాఠశాల వద్ద మైనర్ కారుతో బీభత్సం సృష్టించాడు. సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ముప్పాళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇలాంటి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఈ వ్యవహారంలో నియంత్రణ పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనం లైసెన్స్, ఫిట్ నెస్, వాహనాన్ని నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెనన్స్, ఇన్సూరెన్స్... ఇలా అన్ని నిబంధనలు పరిశీలించాలి. అలాంటిది నరసరావుపేట కేంద్రంగా అద్దె కార్ల దందా కొనసాగుతుంటే అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో అద్దె కార్ల కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. వారి తల్లిదండ్రుల తీరని శోకానికి ఎవరు సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికై నా అద్దె కార్ల దందాపై పోలీసులు, రవాణా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అద్దె కార్ల ఆఫీసులు ఏర్పాటు చేసే క్రమంలో కనీసం నిబంధనలు పాటిస్తున్నారా .. లేదా .. అనే విషయాలను పరిశీలించాలి. వాహనాల ఫిట్నెస్తోపాటు ఎవరికి అద్దెకు ఇస్తున్నారో రికార్డులు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం చట్ట విరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరం. కారు నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకుంటే అనుకోని సంఘటన జరిగి మృత్యువాత పడినప్పుడు వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా, న్యాయపరంగా ఎటువంటి పరిహారం అందదు. ముఖ్యంగా డ్రైవింగ్ అనుభవం లేకపోవటం వల్ల వాహనం నడిపే వ్యక్తితోపాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కారు నడిపే మోజులో యువత అద్దె కారులు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. వచ్చీరాని డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. -
రంగురాళ్ల డంపు స్వాధీనం
దాచేపల్లి: భారీ స్థాయిలో రంగురాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహాయంతో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లు (క్రిస్టల్ క్వార్జ్) స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ నుంచి ఈ రంగురాళ్లు వెలికి తీసినట్లు అధికారులు గుర్తించారు. రంగురాళ్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తరువాత వీటి విలువ ఎంత అనేది తెలుస్తుంది. స్థానికుల సమాచారం సుమారు రూ.కోటి పైనే రంగురాళ్ల విలువ ఉంటుందంటున్నారు. స్థానిక సీఐ రాజేష్, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, పంచనామా నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు
రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. కమనీయం రంగనాథుడి కల్యాణం యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంప్ల పోస్టర్ను శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ అశుతోష్ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 8,417 మంది విద్యార్థులకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతోపాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను ఆయా కేంద్రాల్లోనే ఇస్తారు. -
పల్నాడు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. 7 -
విజయకీలాద్రిపై నృసింహ జయంతి
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం నృసింహ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళగశాసనాలతో ఉదయం 9 గంటలకు దుష్ట గ్రహ నివారణ, ఆయురా రోగ్యాభివృద్ధి కోసం లక్ష్మీ నారసింహ ఇష్టి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం లక్ష్మీనృసింహ స్వామి వారికి అభిషేకం, విశేష అలంకరణ, లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం, అష్టోత్తర శతనామార్చన, నివేదన, మంగళాశాసనం, తిరు నక్షత్ర తనియన్ విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి, వేద ఆశీర్వచనం, తదియారాధన కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. దుర్గి: దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.26,72,462 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా ధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె. ఆదిశేషు నాయుడు తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లికార్జునరావు, కారంపూడి గ్రూప్ దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి హనుమంతరావుల సమక్షంలో 51 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
హెచ్టీ పత్తి విత్తనాలు నిల్వ చేసినా కఠిన చర్యలు
సత్తెనపల్లి: హెచ్టీ పత్తి విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్నారు. కమిషనర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు కమిషనర్ కార్యాలయ ఏడిఏ ప్రేమ్శేఖర్, వ్యవసాయ అధికారి సుకుమార్తో కలిసి పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ విత్తన డీలర్లు కలుపు మందులు తట్టుకునే హెచ్టీ పత్తి విత్తనాలు నిల్వలు, అమ్మకాలకు మన రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. అటువంటి పత్తి విత్తనాల విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు ఎవరైనా విత్తన డీలర్లు నిల్వలు, అమ్మకాలు జరుపుతున్నారా అని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విత్తన డీలర్ల దగ్గర ఇప్పటివరకు ఎటువంటి హెచ్టీ లక్షణాలు ఉన్నటువంటి పత్తి విత్తనాలు లేవని గుర్తించారు. పత్తి విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే విత్తన డీలర్లు మండల వ్యవసాయ అధికారి వారికి తెలియజేసి వారి అనుమతి మేరకు విక్రయాలు జరపాలన్నారు. ప్రతి విత్తన డీలర్ రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గుర్తింపు లేని మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.అలాంటి మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు -
ఇళ్ల గణనకు అందరూ సహకరించాలి
నరసరావుపేట రూరల్: జనగణన– 2027ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అధికారులతో గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జనాభా గణన ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 23వేలకు పైగా స్వీయ గణనాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సారి జనగణన పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ఎక్కడా కాగితంపై రాసే పని ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో 3,824 మంది ఎన్యుమరేటర్లు, 668మంది సూపర్వైజర్లను నియమించినట్టు తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్కు సుమారు 150 నుంచి 160 ఇళ్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. జనగణన ప్రారంభించే ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతం లే అవుట్ను సిద్ధం చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందన్నారు. సెన్సస్ చట్టంలోని సెక్షన్ 15, 11 ప్రకారం ఈ సమచారాన్ని ఎవరికి బహిర్గతం చేయరని, ఇది ఆర్టీఐ పరిధిలోకి కూడా రాదని స్పష్టం చేశారు. సరైన సమాచారం ఇవ్వడం వలన భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించేందుకు వీలవుతుందని తెలిపారు. జనాభా గణణనలో వివరాలు ఇవ్వడం వలన ప్రభుత్వ పథకాలు కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా కచ్చితమైన సమాచారాన్ని ఎన్యుమరేటర్లకు అందించాలని కోరారు. జనగణనలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం 1855 నెంబర్కు కాల్ చేయవచ్చని సూచించారు. -
అన్నదాతకు అందని సేవలు
నాదెండ్ల: వ్యవసాయం లాభసాటిగా జరగాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులే కీలకం. విత్తనం బాగుంటే నాణ్యమైన పంట, సరైన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. నాణ్యమైన పంట దిగుబడులతో అన్నదాతల మోముపై చిరునవ్వు చూడాలనే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. నాబార్డ్ సౌజన్యంతో రాష్ట్రంలో 147 డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లలో విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల నాణ్యత పరీక్షలు నిర్వహించి నకిలీల బారి నుంచి రైతులను కాపాడేందుకు ఏర్పాట్లు చేసింది. డీఎన్ఏ ప్రింట్ టెక్నాలజీతో విత్తన జన్యు పరీక్ష, ఎరువులు, పురుగుమందుల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ నిర్ధారణ పత్రాలు అందించే ఏర్పాటు చేశారు. రైతులు తాము సాగు చేయదలచిన పంట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో పరీక్షించుకునేవారు. దీంతో నకిలీల బెడద నుంచి తప్పించుకుని నాణ్యమైన వాటినే వినియోగించేవారు. నెలకు సరాసరి 50 పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ల్యాబ్లు పనిచేస్తున్నాయి. అప్పట్లో రైతులకు విస్త్రతంగా ల్యాబ్ ద్వారా సేవలందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రి టెస్టింగ్ ల్యాబ్లపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఉదాసీనతతో అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు రైతులకు సేవలందించటంలో వెనుకబడిపోయాయి. పనిచేయని అగ్రి టెస్టింగ్ ల్యాబ్ 2021 జులై 8వ తేదిన అప్పటి మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలోని నూతన మార్కెట్ యార్డులో రూ.80 లక్షల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ల్యాబ్లపై సీతకన్ను వేయటంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొన్ని నెలలుగా ల్యాబ్ తెరవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిపోయింది. భవనంలో ఉన్న యంత్రపరికరాలు సైతం దెబ్బతినే పరిస్దితి నెలకొంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలు కావటంతో మాజీ మంత్రి రజిని ప్రారంభించిన శిలాఫలకానికి నల్లరంగు పులిమారు. అప్పటి నుండి పునరుధ్ధలేకపోవటం ల్యాబ్ పనితీరుకు నిదర్శనంగా ఉంది. నకిలీల బెడద మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, పురుగుమందులు రాజ్యమేలుతుండటంతో రైతులకు నష్టాలు తప్పటం లేదు. ఒడిదొడుకుల వ్యవసాయంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుతానికి ఏమాత్రం స్పందన లేకపోవటం శోచనీయమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులకు మేలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అగ్ని టెస్టింగ్ ల్యాబ్లో పనిచేస్తున్న టెక్నిషియన్ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. సెలవు ముగిశాక అగ్ని టెస్టింగ్ ల్యాబ్లో తిరిగి సేవలు ప్రారంభిస్తాం. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే సేవలను అందిస్తాం. – టి.సరిత, చిలకలూరిపేట వ్యవసాయాధికారి. -
నాడు అన్న.. నేడు తమ్ముడు..
ఇద్దరూ సరస్వతీ పుత్రులే రొంపిచర్ల: నాడు అన్న.. నేడు తమ్ముడు... ఇరువురు చదువులో సరస్వతీదేవికి కవలలు. పదవ తరగతి పరీక్షల్లో తమ సత్తా చాటి మండలంలో టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలై పది పబ్లిక్ పరీక్షల్లో గోగులపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి యర్రగుంట్ల నితీష్కుమార్ 587 మార్కులతో మండలంలో టాపర్గా నిలిచారు. గత ఏడాది నిర్వహించిన పది పబ్లిక్ పరీక్షల్లో నితీష్కుమార్ సోదరుడు నిరాజిత్కుమార్ 589 మార్కులతో మండలంలో టాపర్గా నిలిచి నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మండలంలో టాపర్లుగా నిలవటంతో గోగులపాడులో పలువురు సదరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావతి, నాగరాజులను అభినందించారు. తండ్రి నాగరాజు రొంపిచర్లలోని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. -
టెన్త్ ఫలితాల్లో బాలికల హవా
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో బాలికలు హవా చాటారు. పల్నాడు జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 24,919 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 21,808 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 12,666 మందికిగాను 85 శాతం ఉత్తీర్ణతతో 10,770 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 12,253 మందికిగాను 90.08 శాతంతో 11,038 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. కాగా, గత ఏడాది 84.15 శాతం ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది 3.37 శాతం అధిక ఉత్తీర్ణతతో 87.52 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచింది. సత్తా చాటిన ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అచ్చంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వి.సాయినాయక్ 600 మార్కులకుగాను 592 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గిరిజన సంక్షేమ పాఠశాల (వినుకొండ) విద్యార్థి వీఎస్ఎస్ పార్థు 591, జెడ్పీ హైస్కూల్ (ఉప్పలపాడు) విద్యార్థిని ఎ.మహాలక్ష్మి , జెడ్పీ హైస్కూల్ (దమ్మాలపాడు) విద్యార్థిని కె.భార్గవి 590 మార్కులతో టాపర్లుగా నిలిచారు. జిల్లాలో అత్యధికంగా 93.51 ఉత్తీర్ణత శాతంతో శావల్యాపురం, 93.03 శాతంతో బెల్లంకొండ, 91 శాతంతో క్రోసూరు, 90.59 శాతంతో మాచవరం మండలాలు నిలువగా, అత్యల్పంగా రెంటచింతల 65.79, కారంపూడి 68.76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో బీసీ సంక్షేమ పాఠశాలలు 92.7 శాతం, కేజీబీవీ 89.14, ఏపీ మోడల్ స్కూల్స్ 89.14, ఆశ్రమ పాఠశాలలు 85.95, సోషల్ వెల్ఫేర్ 84.78, గురుకుల 84.62, జెడ్పీ హైస్కూల్స్ 81.5, ఎయిడెడ్ 79.51, మున్సిపల్ 78.73, ప్రభుత్వ 75, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 73.94 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నరసరావుపేట రూరల్: తల్లి మరణాన్ని తట్టుకుని పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించింది కోటప్పకొండ జెడ్పీ హైస్కూల్ విద్యార్ధిని నేలపాటి చంద్రిక. వినుకొండ మండలం ఉమ్మడివరానికి చెందిన చంద్రిక కోటప్పకొండలోని కాకతీయ సత్రంలోని వసతి గృహంలో ఉంటూ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. పది పరీక్షలకు నాలుగు రోజుల ముందు ఇంటి సమీపంలో పాము కాటుకు చంద్రిక తల్లి నాగమణి మృతి చెందింది. ఆ బాధను దిగమింగి పది పరీక్షలపై దృష్టి సారించింది చంద్రిక. గురువారం విడుదలైన పది పరీక్ష ఫలితాలలో 582 మార్కులు సాధించింది. చంద్రికను సత్రం నిర్వాహకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
మద్యం మత్తులో కారు బీభత్సం
వినుకొండ: పట్టణ శివారులోని వెల్లటూరు రోడ్డులో బుధవారం రాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతి వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా వరుస ప్రమాదాలకు కారణమయ్యారు. మద్యం సేవించి అదుపు లేకుండా కారు నడిపిన యువకులు తొలుత ఒక వ్యక్తిని ఢీకొట్టారు. ఆపై వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో అది ముక్కలైంది. ఒక ద్విచక్రవాహనాన్ని, తోపుడు బండిని కూడా కారుతో బలంగా ఢీకొట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ ఎక్స్ప్రెస్ అత్యాచార కేసులో ట్విస్ట్
సాక్షి, పల్నాడు: వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే విశాఖ ఎక్స్ప్రెస్లో అదెలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. రైల్వే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. విశాఖ ఎక్స్ప్రెస్ వివాహిత అత్యాచార కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఏసీ బోగీలో పని చేసే కార్మికుడేనని తేలింది. ఒడిశాకు చెందిన శౌరవ్ బగ్దీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. అతన్ని అరెస్ట్ చేశామని విజయవాడ రైల్వే పోలీసులు ప్రకటించారు. తాను స్టాఫ్నని చెప్పి ఆ జంటను వెంట తీసుకెళ్లాడని, వాళ్ల ఆర్థిక స్థితి చెప్పడంతో డబ్బులు కూడా వద్దన్నాడని.. ఆపై ఏమార్చి వివాహితను ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖకు వెళ్లారు. జెట్టిపాలెం(పల్నాడు)లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీ ఎక్కారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఏసీ బోగీలో సీట్లు ఉన్నాయని.. తన వెంట రావాలని తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భార్యను పంపించి తాను టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు ఆ భర్త. అయితే ఇదే అదనుగా ఆ మహిళను హెచ్1ఏ బోగీలోకి లాక్కెల్లి.. కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. భార్యభర్తలిద్దరూ రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. -
ఆస్తి కోసం కన్నకూతురి ఘాతుకం
చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లికార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సుకన్య, మల్లికార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు తల్లిదండ్రుల వద్దే ఉంది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం..ఏడాది నుంచి ఆమె పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి మరో ప్రాంతంలో ఉంటుంది. తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. మంగళవారం రాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచకు ఉన్న గ్రిల్స్ నుంచి లోనికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు వంటివి తగలబడి పోయాయి. స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. -
అంగన్వేడి కేంద్రాలు
సత్తెనపల్లి: భానుడి భగభగలకు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చిన్నారులు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి వేడిగాలులు మొదలు కావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు పడుతున్నాయని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పుల్లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్ట కష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలీచాలని గదులు... రాష్ట్రంలో దాదాపు అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా అంగన్వాడీ కార్యకర్తలకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ● పైపెచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయంతో చిన్నారులు సతమతమవుతున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు : 09 అంగన్వాడీ కేంద్రాలు : 2,031 గర్భిణులు : 9,548 బాలింతలు : 9,414 3 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు : 38,261 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు : 49,778 ఆరు నెలలలోపు చిన్నారులు : 9,453 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘ఉక్క’రిబిక్కిరి కేంద్రాలకు సెలవులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ముందస్తు చొరవ తీసుకున్న ప్రభుత్వాలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు అంగన్వాడీ కేంద్రాల్లో అల్లాడిపోతున్న చిన్నారులు -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యడ్లపాడు: బాల్య వివాహం అనే సామాజిక మహమ్మారి బారి నుంచి ఓ బాలిక భవితను ఐసీడీఎస్ అధికారులు సమయస్ఫూర్తితో కాపాడారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో ఓ బాలికకు పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బుధవారం రోజు బాలికకు నిశ్చయ తాంబూలాలు చేస్తున్నట్లు ముందురోజు రాత్రి బాలిక బంధువుల నుంచి అందిన ఫోన్ కాల్పై తక్షణమే స్పందించారు. ఐసీడీఎస్ వంకాలయపాడు సూపర్వైజర్ ఆర్.సామ్రాజ్యం, తన సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలిసి బుధవారం ఉదయాన్నే ఆ ఇంటికి చేరారు. బాలిక తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. చట్టపరంగా వారు ఎదుర్కోవాల్సిన కఠిన చర్యలను తెలియజేస్తూ హెచ్చరించారు. అధికారుల కౌన్సెలింగ్తో మనసు మార్చుకున్న తల్లిదండ్రులు, తమ కుమార్తెకు మైనారిటీ తీరే వరకు ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయబోమని అధికారులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు, డీసీపీయూ సభ్యులు నానమ్మ, వంకాయలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి బాపిరాజు, నీడ్ సంస్థ ఎన్జీవో ప్రేమ్కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు సుబ్బాయమ్మ, కోటేశ్వరి ఉన్నారు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తికి రిమాండ్
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి బుధవారం న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 19న గణపవరంలో ఆరేళ్ళ చిన్నారిపై ఒడిశాకు చెందిన ప్రసాద్దాస్మాలిక్ లైంగిక దాడికి యత్నించాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికను తన గదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయటంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. పోలీసులకు సమాచారమివ్వటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. గాయాలైన నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. లివర్ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయండి శావల్యాపురం: మండలంలోని మతుకుమల్లికి చెందిన మల్నీడి సుస్మిత లివర్ డ్యామేజ్ కావటంతో గత కొద్ది కాలంగా చికిత్స పొందుతోంది. నిరుపేద రైతు కుటుంబలో జన్మించిన సుస్మిత ప్రస్తుతం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి మూగవాడు కావటం రెక్కడితే డొక్కాడిన కుటుంబ కావటం ఇప్పుటికే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.8 లక్షల వెచ్చించారు. లివర్ మార్పిడి నిమిత్తం వైద్యసేవలు కోసం రూ.30 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దాతలు సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. వివరాల కోసం 6301041236 నంబరు సంప్రదించాలన్నాని కోరారు. ద్విచక్రవాహనం ఢీకొని మహిళ మృతి పిడుగురాళ్ల రూరల్: అతివేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పిడుగురాళ్ల శివారులోని అయ్యప్పనగర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అయ్యప్పనగర్కు చెందిన యు.రాజ్యలక్ష్మి రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి స్పోర్ట్స్ బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజ్యలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2 నుంచి ఆహ్వాన నాటికల పోటీలు
● తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం ● త్రుటిలో తప్పించుకున్న కన్నవారు ● ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన 7మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు. మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెనాలిరూరల్: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువైన శ్రీభూ సమేత రంగనాయకస్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు పరుచూరి రామకృష్ణ చార్యుల నేతృత్వంలో మూలవిరాట్లతో పాటు నవవధువరులుగా ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ, బిందతీర్థం, నిత్యార్చన, హోమ, గ్రామబలిహరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ అమ్మవారికి నిర్వహించిన సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రాత్రివేళ స్వామివారి ఉత్సవమూర్తిని భారీ విద్యుత్ అలంకరణ చేసిన హనుమత్ వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్ –నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కన్నకూతురు ఘాతుకం చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్ నుంచి లోపలికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. ఇక ఆటవిడుపు ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటకు కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లా మొత్తంగా 27 శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. 14 రకాల క్రీడా అంశాలను నిర్వహించనున్నాం. ఈ మేరకు క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తాం. – పి.నరసింహారెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిసత్తెనపల్లి: వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సేద తీరుతుంటారు. వేసవి సెలవుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో గడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొందరు చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వారి దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని 27 నిర్ణీత ప్రాంతాల్లో నిర్వహించేందుకు శిక్షకులను నియమించనున్నారు. ఒక్కో శిబిరానికి రూ.10 వేలు శాప్ కేటాయించనుంది. జిల్లాలో 27 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహణకు శాప్ అనుమతులు జారీ చేసింది. ● 8 నుంచి 16 సంవత్సరాల లోపు వయసుగల బాల బాలికలకు అవకాశం కల్పిస్తారు. ● అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఫెన్సింగ్, హ్యాండ్బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ● ఏ ఏ ప్రాంతాల్లో ఏ క్రీడాంశంలో శిక్షణ ఇస్తారనేది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించనుంది. ● ఇందుకోసం శిక్షకులను ఎంపిక చేశారు. శిక్షకులకు, క్రీడా సామాగ్రికి అయ్యే ఖర్చును శాప్ భరిస్తుంది. ఆటలు ఆడించడానికి ఒక్కో శిబిరంలో ఒక కోచ్ లేదా ఒక సీనియర్ పీఈటీ ఉంటారు. శిబిరాలు నిర్వహించే మైదానాల్లో మంచినీటి వసతి, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతారు. తెనాలి: కొలకలూరులో కొలంకపూరి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మే నెల 2,3,4,5 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) సౌజన్యంతో జరిగే ఈ పోటీలు ఈసారి కొలకలూరు పంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల్నుంచి జరుగుతాయని కళాపరిషత్ కార్యదర్శి గోపరాజు విజయ్ బుధవారం ప్రకటించారు. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజున గోపరాజు బాల త్రిపురసుందరమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటీమణి దాసరి రమాదేవి (హైదరాబాద్కు ప్రదానం చేస్తారు. 3వ తేదీ రాత్రి కరణం సురేష్ జ్ఞాపకార్ధం ఏటా ఇస్తున్న సవ్యసాచి అవార్డును ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ వెంకట్ గోవాడ (హైదరాబాద్), గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణి (విజయనగరం)లకు బహూకరిస్తారు. 4వ తేదీన కొలంకపురి కళాపరిషత్ రచనల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. చివరిరోజున గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు డాక్టర్ సీఎస్ ప్రసాద్ (కాకినాడ)కు అందజేసి సత్కరిస్తారు. మైదానానికి రండి...ఆటల్లో మెరవండి రేపటి నుంచి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నెలరోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి 14 క్రీడాంశాల్లో శిక్షణ జిల్లాలో 27 శిబిరాల్లో శిక్షణకు కార్యాచరణ తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9600, మోడల్ ధర రూ.7200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9320 టీఎంసీలు. -
వావిలాల ఆదర్శనీయుడు
సత్తెనపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు, ఆంధ్ర గాంధీగా పేరు పొందిన వావిలాల గోపాలకృష్ణయ్య అందరికీ ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కొనియాడారు. వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని వావిలాల స్మృతి వనంలో బుధవారం నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ దేశం కోసం వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన పోరాటాలు, ఉద్యమాలను తెలుగు వారందరూ స్మరించుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ న్యాయవాది పక్కాల సూరిబాబు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన అవిరళ కృషి చేశారని కొనియాడారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వావిలాల మనవడు మన్నవ సోడేకర్, పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల నాయకుడు మర్రి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, ధూళ్ళిపాళ్ల ఆంధ్ర బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లబోతు శివన్నారాయణ ఉన్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులపై కేసు నమోదు
పెదకాకాని: రాజధాని ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ సహోద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పట్ల మరో విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉబైద్ ముస్తాఖ్ గత కొంతకాలంలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, ఇంటికి ఆహ్వానించాలని ఒత్తిడి చేయడం, వానిష్మోడ్ ఫ్యూచర్ని ఉపయోగించి ఖాతా నెంబర్కు మెసేజ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇరువురూ పెదకాకాని మండలంలోని నంబూరు ఏరియాలోని బహుళ అంతస్తుల సముదాయంలో ఉంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి తెలిపారు. మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం నివేదిస్తామని ఆయన తెలిపారు. ఒక బిందెకు రూ. 40, 11 బిందెలకు రూ. 440, 27 బిందెలకు రూ. 1080, 108 బిందెలకు రూ. 4320, 365 బిందెలు (రోజుకు ఒక బిందె చొప్పున సంవత్సరానికి) రూ. 14,600 లతో పథకాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు పొందేందుకు ఆర్జిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఊంజల్ సేవ, బంగారు గరుడోత్సవం, పెద్ద శేషవాహనం, చిన్నశేష వాహనం సేవలకు రూ.5 వేల చొప్పున, సుదర్శన హోమం, నరసింహ హోమం, లక్ష్మీ హోమానికి రూ. 3500 చొప్పున, శాంతి కల్యాణం రూ. 1500, నిత్య గోత్ర నామార్చనకు (సంవత్సరం) రూ. 516 గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్జిత సేవల కోసం రుసుము చెల్లించుటకు ఆన్లైన్ ద్వారా ‘సిటీ యూనియన్ బ్యాంక్, మంగళగిరి శాఖ, అకౌంట్ నెం. 500 101 014 411 599, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 688’కు చెల్లించవచ్చని తెలియజేశారు. నిత్యాన్నదాన ప్రసాదాలకు విరాళాలు ఇచ్చే వారు మహారాజ పోషకులు రూ. 1,01,116 పైన, రాజపోషకులు రూ. 50,116 పైన, పోషకులు రూ. 25116 పైన, ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవారు రూ. 10116 గా నిర్ణయించామని వివరించారు. విరాళాలు ఆన్లైన్ ద్వారా ‘మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెం. 500 101 042 919 33, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 686’లో చెల్లించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్
నగరంపాలెం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన తొమ్మిది మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... సోమవారం రాత్రి శ్రీరామ్నగర్ ఒకటో వీధిలోని వెంకటేశ్వర టీ స్నాక్స్ దుకాణం వెనుక ఖాళీ స్థలంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారంతో నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ తనిఖీలు చేశారు. తనిఖీల్లో వర్రా మణికంఠ (ఏటీ అగ్రహారం 12వ వీధి), రామిశెట్టి సురేష్ (నెహ్రూనగర్ ఆరో వీధి), కాసినేడి నటరాజ్కుమార్, కుంచాల సాయికుమార్, బొడ్డు ఇస్సాక్ (శ్రీరామ్నగర్ ఒకటో వీధి), షేక్.బాజీ (రామిరెడ్డినగర్ 4వ వీధి), పైడి ఎర్రంనాయుడు, పైడి అశిరినాయుడు (శ్రీరామ్నగర్ రెండో వీధి) యంపటి కోటిరెడ్డి (ఎన్జీవో కాలనీ)లను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ తొమ్మిది మంది ఆన్లైన్లో ఏపీబుక్.ఇన్, లక్కీ కిస్మత్.కామ్, గల్లీబెట్స్.ఇన్, వీల్బుక్.కామ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారని అన్నారు. క్రికెట్ను ఆటగా వీక్షించాలని, ఎవరూ జూదంగా మార్చవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసుని ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు రాంబాబు, ఎ.రామచంద్రరెడ్డి, కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పి.గంగరాజు, సీహెచ్.ఉదయచంద్, షేక్ షకీల్ అహ్మద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం
● కారు – బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి ● ముప్పాళ్ల మండలం బొల్లవరం అడ్డరోడ్డు సమీపంలో ఘటన ● మృతులు ఇరువురూ స్నేహితులు ముప్పాళ్ళ: కారు–ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న స్నేహితులైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని బొల్లవరం అడ్డరోడ్డు సమీపంలో బుధవారం జరిగింది. సంఘటన సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన గంపా ఆంజనేయరాజు(26), నాగార్జున నగర్కు చెందిన వేజెండ్ల ఇమేష్(24)లు ముప్పాళ్లలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని ముగించుకొని ద్విచక్రవాహనంపై సత్తెనపల్లికి బయలుదేరారు. సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై నాల్గవ మైలు మలుపు వద్దకు రాగానే సత్తెనపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ఉన్న ఇరువురు ఎగిరి రోడ్డు మార్జిన్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. కారు సైతం మార్జిన్లో ఉన్న చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కారులో నరసరావుపేట ఎన్ఈసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా సత్తెనపల్లి మండల పరిధిలోని గ్రామంలో జరిగిన ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తు న్నారు. కారు నడుపుతున్న బత్తుల అజయ్కుమార్ అనే విద్యార్థికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ముప్పాళ్ళ ఎస్ఐ పి.అనిల్కుమార్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు... మృతులు ఇరువురూ మంచి మిత్రులు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరి మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఇమేష్ (ఫైల్) ఆంజనేయరాజు (ఫైల్) -
పల్నాడు
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయం కన్నా ప్రాణం మిన్న ● టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల నేపధ్యంలో.. ● విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలి ● పరీక్షలు, మార్కులే జీవితంగా భావించొద్దు ● ఓటమి విజయానికి తొలిమెట్టుగా భావించాలి ● సమాజంలో మార్పుతెచ్చే మార్గాలు ఎన్నో.. ● జిల్లాలో టెన్త్ పరీక్ష రాసిన 25,167 మంది రెగ్యులర్, 1,087 మంది దూరవిద్య విద్యార్థులు సత్తెనపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారూ అలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్కు ఎంపికయ్యారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 25,167 మంది రెగ్యులర్ విద్యార్ధులు, 1,087 మంది దూరవిద్య విద్యార్థులు పరీక్షలు రాశారు. వారు అంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిభను నిర్ణయించేంది ఒక పేపర్ మీద ఉండే అంకెలు కాదని, ప్రతి విద్యార్థిలో ఉండే పట్టుదల, పోరాట గుణమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్య పరచాలని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. పలు కారణాలతో పరీక్ష తప్పిన వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలిమెట్టు లాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీలో తిరిగి ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు. ● పరీక్ష మీ తలరాతను మార్చలేదు ● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం ● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు ● పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహ పూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి. ● ఓటమి నుంచే విజయం వరిస్తుందని .. స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి. ● పరీక్షల్లో ఫెయిలైనా .. మార్కులు తక్కువొచ్చినా .. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి. ● జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి. ● అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి. ● ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు. ● అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యం నింపాలి. ● ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టెలి మానసన్ అందుబాటులోకి తెచ్చింది. 14416 నెంబర్ కు ఫోన్ చేసి కుంగుబాటు, మానసిక ఆందోళన, నాకు జీవితం ఎందుకు అనిపించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముడుతున్నా వెంటనే టెలిమానస్కు ఫోన్ చేస్తే.. కౌన్సిలర్లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం బుధవారం 525.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ఫలితం ఎలా వచ్చినా .. ఆత్మాన్యూనతా భావంతో మానసికస్థైర్యం కోల్పోరాదు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చరాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్త్రృత అవకాశాలు తెలిసే అవకాశముంటుంది. ఓటమి కూడా భవిష్యత్తులో సాధించబోయే విజయానికి తొలిమెట్టు. పాస్, ఫెయిల్ సాధారణ విషయాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుండా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. -
గరుడ పోటీలకు తెనాలి నాటికలు ఎంపిక
తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్ ఆర్ట్స్ శ్రీసరస్వతి శిశుమందిర్, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ ఫౌండర్ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్ఎం వలివేటి రాజేంద్ర కుమార్, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్ జానీబాషా, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్ అండ్ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు. వాసవి కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో వస్త్ర దుకాణ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకానిరోడ్డులోని వాసవి కాంప్లెక్సులో ఉన్న దుర్గా సిల్క్స్ సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. గుంటూరు–2 అగ్నిమాపక శాఖ అధికారి పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. వాసవి కాంప్లెక్సులో అన్నీ వస్త్ర దుకాణాలే ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న సమయంలో దుకాణదారులు షాపు షట్టర్లు మూసివేయడంతో ప్రమాదం తప్పిది. దుకాణంలోని నాలుగు బ్లాకుల్లో మంటలు వ్యాపించడంతో వస్త్రాలు కాలిపోయాయి. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ రెంటచింతల: మండలంలోని పశర్లపాడులో ఈ నెల 27న పర్యటించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై బీరు సీసాలతో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున బుధవారం తెలిపారు. నిందితులైన పశర్లపాడు గ్రామానికి చెందిన జక్కి గోపాల్, రాజు ఇద్దరిని గురజాల కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి రిమాండ్ విధించినట్లు చెప్పారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు విజయపురిసౌత్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ బుధవారం తెలిపారు. మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మన్నే లక్ష్మణ్, చింతల తండాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలికను వేధిస్తున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లి విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
పక్కింటి మహిళపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం
పల్నాడు జిల్లా: గతంలో పల్నాడు జిల్లా వినుకొండ సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బుధవారం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో సీఐకి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని కోళ్ల ఫారం నిర్వహిస్తున్నామని తెలిపింది. లీజు డబ్బుల కోసం వచ్చిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరింది. వినుకొండ సీఐ ప్రభాకరరావు విచారణ చేపట్టారు. -
భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం!
సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈలోపు జనరల్ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇన్నర్ రింగ్రోడ్డు బాధితులను ఆదుకోండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. స్వర్ణభారతినగర్ ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3 బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. గతంలో సుమారు 300 ఇళ్లను కూల్చివేశారని, నేటికీ వారికి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కాని ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఎందరో చిన్నపిల్లలతో రోడ్డున పడ్డారని వాపోయారు. కొంత మందికి ఇళ్ల స్థలాలను లాం తదితర ప్రాంతాల్లో చూపారని కానీ అక్కడ ఇప్పటికే గతంలో స్థలాలు కేటాయించగా అందులో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని వాపోయారు. వాళ్లు ఉంటున్న స్థలాలు మరలా మాకు ఇచ్చి మమ్మల్ని ఉండమంటే ఏవిధంగా న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారతినగర్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తాడికొండ: మంగళగిరి– తుళ్లూరు మండలాల పరిధిలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి కీలక ప్రమాద ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్లోని మురుగన్ హోటల్ సమీప ప్రాంతం, వెంకటాయపాలెం టోల్ప్లాజా, సీడ్ యాక్సెస్ రోడ్లను సందర్శించి, అక్కడి రోడ్డు పరిస్థితులు, వాహన రాకపోకలు, ప్రమాదాలకు దారితీసే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు వేగాన్ని తగ్గించేలా అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ముందస్తు హెచ్చరికగా ప్రతిబింబించే (రిఫ్లెక్టివ్) సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించేందుకు హైమాస్ట్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని, టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పీడ్ గన్్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. -
మూడు మట్టి లారీలు సీజ్
వినుకొండ: మండల పరిధిలో కౌజుల వాగు వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై వినుకొండ పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో మట్టిని తరలిస్తున్న మూడు భారీ లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా వివరాల్లోకి వెళ్తే... వినుకొండ మండలం తిమ్మాపాలెం మరియు శ్రీరాంపురం గ్రామాల మధ్య ఉన్న కౌజుల వాగు నుంచి సోమవారం రాత్రి నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సీఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం రాత్రి సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను అధికారులు గుర్తించి వాటిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సహజ వనరులను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని, ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ ఘటనపై వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్ గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్స్టేషన్ పోలీసులు స్పా సెంటర్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్ఫోన్లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. -
ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
లక్ష్మీపురం: విద్యారంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రైవేటు టీచర్స్, లెక్చర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రైవేటు టీచర్లకు సీవీ రామన్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం 1.20 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. కానీ వారిలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం చేపట్టాల్సిన చర్యలేవీ చేపట్టట్లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్కార్డులు మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగం శరవేగంగా పెరుగుతుందని, కానీ టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ఎం.సూర్యారావు మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం తమ అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసీ ఆర్గనైజెంగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్, పిటిఎల్పిడబ్ల్యూఎ రాష్ట్ర నాయకులు కిరణ్, శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీనిను, శ్రీవాణి, సదరన్ ప్రైవేటు టీచర్స్ అసోసియేసన్ అధ్యక్షులు డాక్టర్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.


