Palnadu
-
ఆఖరి స్టెప్తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం
చిలకలూరిపేటటౌన్: పెళ్లి వేడుకలో ఆనందంగా చిందేస్తూ, ఆ నవ్వుల మధ్యే ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన హృదయవిదారక సంఘటన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల మండలం రేకులగడ్డకు చెందిన ఏసోబు (62)కు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామానికి చెందిన భాగ్యమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలోనే దండమూడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈ దంపతులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అక్కడి వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో ఏసోబు కూడా వారితో కలిసి ఆనందంగా చిందేశాడు. అయితే దురదృష్టవశాత్తూ వెల్లకిలా పడిపోయాడు. కింద పడే క్రమంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను బంధువులు హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఏసోబు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బిడ్డలు కూడా లేని తనకు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడనుకున్న భర్త ఇలా మధ్యలోనే దూరమయ్యాడయ్యా.. అంటూ భాగ్యమ్మ కన్నీటి రోదన చూపరులను సైతం కంట తడిపెట్టించింది. -
చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు..
వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో రచ్చమల్లపాడు ఒకే కుటుంబంలోని వారు ఇద్దరు మృతిచెంది, ఒకరు తీవ్రగాయాల పాలై కోమాలోకి వెళ్లడంపై రచ్చమల్లపాడు గ్రామం శోకసంద్రంలో మునిగింది. విషయం తెలుసుకున్న బంధువులు, ఆత్మీయులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారయ్యా అంటూ బంధువులు రోదిస్తున్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
నరసరావుపేటరూరల్: ఉద్యోగాల పేరుతో మోసాలపై పీజీఆర్ఎస్లో పలు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ పాల్గొని ఫిర్యా దులు స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక, తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించిన 65 ఫిర్యాదులు అందాయి. ఇందులో భార్యభర్తల వివాదాలపై 15, ఆర్థిక వ్యవహారాలపై 11, భూ వివాదాలు–8, ఆస్తి వివాదాలు–7 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు. సత్తెనపల్లి: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 147 మందికి వివిధ రాష్ట్రాలను కేటాయించారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో 797వ ర్యాంక్ సాధించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.త్వరలో శిక్షణ అనంతరం డాక్టర్ పెండెం ప్రత్యూష్కు రాష్ట్రంలో పోస్టింగ్ కేటాయించనున్నారు. సత్తెనపల్లి: రగ్బీ పల్నాడు జిల్లా జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపికల కార్యక్రమానికి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈవూరి కృష్ణారెడ్డి హాజరై ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6, 7 తేదీల్లో నందిగామలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్షిప్లో పాల్గొంటారని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి పి.డానియేల్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వివరాలను ఆయన వెల్లడించారు. బాలుర జట్టుకు.. ఎల్.పార్థసారథి, వై.జస్వంత్, వి.సుప్రీత అభిషేయ్, ఇ.భువన చంద్రారెడ్డి, ఎం.భానుతేజ, బి.ప్రసన్నకుమార్, జి.జయభాను యాదవ్, బి.జ్యోతిబాబు, ఐ.జాన్, ఎం.కౌశిక్, డి.శివశంకర్, కె.రామ్ చరణ్, స్టాండ్ భైలుగా సి.రామ్మనోహర్, కె. మరియుబాబు ఎంపికయ్యారు, బాలికల జట్టు పి.అలేఖ్య, పి.కోమలి, ఇ.లాస్య, ఎ.పూజిత, సి.హెచ్. ప్రీతి, సీహెచ్.జ్ఞానశ్రీ అర్చన, బి.మహి, పి.శైలజ, బి. శైలజ, బి.గంగాభాయి, కె.సుకన్య, ఎన్.అలేఖ్య, స్టాండ్ బైలుగా ఎన్.నందిని, సీహెచ్.శ్రావ్యలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకరపర్తి శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు పి.శివరామకృష్ణ, వై.పూర్ణచంద్రరావు, లాకు పిచ్చయ్య, వై.చిరంజీవి, క్రీడాకారులు పాల్గొన్నారు. లోపాలు లేకుండా రీ సర్వే బొల్లాపల్లి: లోపాలు లేకుండా పకడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులకు సూచనలు చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు, ఏడీ సర్వే,భాను కీర్తి, నరసరావుపేట ఆర్డీవో ఏ బాలకష్ణ మండలంలో రేమిడిచర్ల, గుమ్మనంపాడు గ్రామాల్లో రీ సర్వే పనులను తనిఖీ చేశారు. స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుమ్మనంపాడు పంచాయతీ పరిధిలోని నిమ్మల సుబ్బయ్య కుంట తండాను సందర్శించారు. తండావాసులు రహదారి కోసం పీజీఆర్ఎస్లో అందజేసిన అర్జీని పరిశీలన అనంతరం తండావాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి మార్గం చూస్తామని తండావాసులకు హామీ ఇచ్చారు. -
అర్జీలు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి
జిల్లా రెవెన్యూ అధికారి నారదముని నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించి జిల్లా నలుమాలల నుంచి వచ్చిన వారిచే 152 అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు గడువులోపు అర్జీలను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. ప్రతిరోజు అర్జీలను మానిటర్ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, పెండింగ్ ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. నరసరావుపేట: మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలు, నియామకాలపై వెంటనే సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీచే సమగ్ర విచారణ జరిపించి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అగ్రనాయకులనే లోపలికి పంపించారు. పీజీఆర్ఎస్లో జరిగిన అవకాతవకలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చకుండా దగా చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామంటూ వారే ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారన్నారు. ఈ రెండేళ్లలో నిరుద్యోగులకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా డీఎస్సీలో దగా చేసి మోసం చేశారన్నారు. అవకతవకలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 4వేల మంది నిరుద్యోగులకుపైగా అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటా తరఫున 400 నుంచి 500 పోస్టులు అమ్ముకున్నారనే విషయం బయటపడిందన్నారు. మెరిట్ జాబితా విడుదల చేయలేదన్నారు. సమగ్ర విచారణ జరపకుండా మాయమాటలు, తప్పుడు ప్రచారాలతో దాటవేసేందుకు ప్రయత్నిస్తే విద్యార్థులు, యువత తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పేదప్రజలు, యువతీయువకులు, విద్యార్థులు, ప్రజల తరఫున తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ఎన్నాళ్లో సాగదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. యువతకు వెన్నుపోటు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల మాట్లాడుతూ చంద్రబాబును చూస్తేనే ప్రజలకు వెన్నుపోటు గుర్తుకు వస్తుందన్నారు. సూపర్ సిక్స్లో నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదన్నారు. డీఎస్సీలో ఒక్కో ఉద్యోగం రూ.15లక్షలు విక్రయించినట్లుగా ఆడియా, వీడియాలు బయటకు వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పడాల శివారెడ్డి, యెనుముల మురళీధరరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా నుంచి వచ్చిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది దగా డీఎస్సీ 6పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పూర్తి అవకతవకల మయమని, అవినీతితో నిండిపోయిందన్నారు. మెరిట్ లిస్టులో ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వకుండా రూ.లక్షలకు దొడ్డి దారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని స్పష్టం చేశారు. నిజాయితీగా డీఎస్సీ నిర్వహిస్తే మెరిట్ లిస్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో సుమారు 420 ఉద్యోగాలను ఒక్కో ఉద్యోగం రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన స్పోర్ట్స్ కోటాలో అర్హులైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసులకు ఉద్యో గాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. క్రీడా మైదానం అంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రూ.లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అమ్ము కున్నారన్నారురు. లోకేష్కు దమ్ము, ధైర్యం ఉంటే డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెరిట్ లిస్టులో ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోయారని, తక్షణమే మెరిట్ లిస్టు ప్రకటించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
చుక్కలు కనిపింఛన్
పిడుగురాళ్ల: సర్వర్ పనిచేయక పిడుగురాళ్లలో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క సర్వర్ పనిచేయక, మరోపక్క ఉక్క పోతతో ఓపిక నశించిన పింఛన్ లబ్ధిదారులు ఇక లాభం లేక వెనుదిరిగారు. అధికారులు సర్వర్తో కుస్తీ పట్టడమే సరిపోయింది. సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, సర్వర్ సమస్యతో కొద్దిమందికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇవ్వగలిగారు. అక్కడ నుంచి సర్వర్ మోరాయించి, సాయంత్రం నాలుగు గంటల వరకు రాకపోటంతో పెన్షన్ దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కచోటకి వస్తేనే పింఛన్.. ముప్పాళ్ల: సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించగా.. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఎప్పుడు ఇస్తారో తెలియక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రమైన ముప్పాళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటింటికి వచ్చి పింఛన్లు అందించాల్సిన ఐకేసీ సీసీ నాగరాజు లబ్ధిదారులందరిని చర్చి వద్దకు వస్తేనే ఇస్తానని చెప్పటంపై వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వయసుడిగి... కాళ్లు, నడుం నొప్పితో ఇబ్బందుల పడుతున్న తమను మరింత ఇబ్బందులకు గురిచేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ముప్పాళ్లలో చోటుచేసుకున్న పింఛన్ పంపిణీ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు అధికారులు పాట్లు పడ్డారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూకు తాళాలు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర ఆదివారం ఆయన స్వగ్రా మం ఇంకొల్లు మండలం పావులూరులో ఆదివారం నిర్వహించారు. ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఆఖరి మజిలీ యాత్ర రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు ఇన్చార్జి వరి కూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, దాసరి కిరణ్బాబు, వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు. ఊపిరి అందక ఒకరు.. గుండె ఆగిపోతూ మరొకరు... ప్రమాదం బారినపడి అత్యవసర వైద్యం కోసం ఇంకొకరు ఐసీయూ వైపు కదులుతుంటే మూసి ఉన్న తలుపులు ప్రభుత్వ వైద్య దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఐసీయూ అంటే తుదిశ్వాసకు ఆయువు పోసే దేవాలయం.. అలాంటి ఐసీయూకి తాళాలను చూసి పేదోళ్ల కన్నీళ్లు పొంగుతున్నాయి. ఐసీయూకి వేసింది తాళాలు మాత్రమే కాదు.. నిరుపేదల అత్యవసర వైద్య హక్కుకు సంకెళ్లు. కార్పొరేట్ ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేని నిర్భాగ్యులకు మేమున్నామంటూ అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేస్తుండడంతో అభాగ్యుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు చివరి ఆశగా ఉండాల్సిన ఐసీయూ విభాగం కొన్ని నెలలుగా తాళాలు వేసి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అందించే వైద్యం ప్రతినిమిషం విలువైందే. అటువంటి అత్యవసర బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తుంది. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న రోగులు, వారి సహాయకులకు ఐసీయూ తలుపులపై వేలాడుతున్న తాళాలు కనిపిస్తున్నాయి. ఆపదలో కాపాడాల్సిన విభాగం మూతపడటం అంటే పేదల ప్రాణాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని నిరు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు అలాంటి వైద్యశాల్లో ప్రాణ రక్షక సేవలు నిలిచిపోతే ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా ప్రశ్న తలెత్తోంది. అత్యవసరమైతే గుంటూరే..! ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తరువాత రోగులు ప్రతి రోజు అధిక సంఖ్యలో వచ్చేది నరసరావుపేట ఏరియా వైద్యశాలకే. ప్రతిరోజు 1000 కి పైగా ఓపీ నమోదు అవుతూ ఉంటుంది. మొదట 200 పడకల వైద్యశాలగా ఉన్న ఏరియా ఆసుపత్రిని 350 పడకలుగా అప్గ్రేడ్ చేశారు. దాదాపుగా అన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూ విభాగానికి తరలించి పర్యవేక్షణలో ఉంచుతారు. దీంతో పాటు గర్భిణులకు సంబంధించి హైరిస్క్ కేసులను ఐసీయూకు తరలిస్తారు. అయితే గత కొన్ని నెలలుగా ఐసీయూ అందుబాటులో లేకపోవటంతో అత్యవసర సేవలు అవసరమైన రోగులను గుంటూరుకు తరలిస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఐసీయూకి కావాల్సిన పరికరాలన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఐసీయూ అందుబాటులోకి తేకపోవటం విమర్శలకు తావిస్తుంది. ఐసీయూ విభాగాన్ని పూర్తిగా మూసివేసి తలుపుపై ఇటీవల సన్ స్ట్రోక్ వార్డుగా పోస్టర్ అంటించారు. వడదెబ్బ తగిలి వైద్యశాల్లో చేరేవారు లేకపోవటంతో ఆ వార్డును కూడా తెరవటంలేదు. ఏటా పెరుగుతున్న మరణాలు ఏరియా వైద్యశాల్లో ప్రతి ఏటా మాతా, శిశు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవటంలేదన్నా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024–25 లో 183 మంది శిశువులు మృతి చెందగా, 8 మంది బాలింతలు మృతి చెందారు. 2025–26లో 179 మంది శిశువులు మృతి చెందగా, 10 మంది బాలింతలు ప్రసవ సమయంలో మృతి చెందారు. 7ఐదు రోజుల క్రితం నకరికల్లు మండలానికి చెందిన గర్భిణి వైద్యశాలలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆమెకు ప్రసవం అనంతరం సీరియస్ కావడంతో మెరుగైన వైద్యసేవలు అందక.. గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వస్తున్న రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో సేవల్లో జాప్యం జరుగుతుందని రోగులు వాపోతుండగా, మరో వైపు పని ఒత్తిడి కారణంగా మెరుగైన సేవలు అందించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది చెప్పుకొస్తుండడం గమనార్హం. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతే ఆపరేషన్ దండాయన లక్ష్యం..
బాపట్లటౌన్: మహిళల భద్రతే ‘ఆపరేషన్ దండాయన’ లక్ష్యమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆపరేషన్ దండాయన పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసులు, మహిళలపై వేధింపులు వంటి నేరాల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులపై చట్టపరమైన చర్యలను మరింత కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి కేసులో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేసి, కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత మహిళలకు అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు నేరస్తులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నైబర్హుడ్ వాచ్ విధానాన్ని అమలు చేస్తూ, జియోట్యాగింగ్ ఆధారంగా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ ఇన్న్స్పెక్టర్ జి.నారాయణ, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బారావు, సీసీఎస్ ఇన్న్స్పెక్టర్ ప్రేమయ్య, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు -
దుర్గమ్మకు కానుకగా అరకిలో వెండి దిమ్మె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8 లక్షల నగదును అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
రైతుల నోట్లో ‘మట్టి’
శావల్యాపురం: శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో మట్టి, ఇసుక మాఫియా పడమటి వాగును పిండేస్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో కొందరు నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు, మండల స్థాయి అధికార పార్టీ నేత ఒకరు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇసుక, మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీకే బ్రిడ్జి నిర్మాణం! ఇటీవల కాలంలో ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలతో పడమటి వాగుపై ఒక బ్రిడ్జిని నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటి నుంచే సదరు నేత కన్ను ఇక్కడి ఇసుక నిల్వలపై పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, ఆఘమేఘాల మీద పొక్లెయిన్లను రంగంలోకి దించారు. చుట్టుపక్కల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాగు అంచుల్లో భారీగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికార పార్టీ నేత అధికారులను మభ్యపెట్టారా, లేక తన రాజకీయ బలంతో భయపెట్టారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పొంచి ఉన్న భారీ ముంపు పడమటి వాగు అంచున ఉన్న పొలాలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల భారీ వరద ముప్పు పొంచి ఉంది. గతంలో పలుమార్లు ఈ వాగు పొంగిపొర్లడం వల్ల చుట్టుపక్కల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఇప్పుడు వాగు అంచులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో, రాబోయే వర్షాకాలంలో వాగు గట్టు తెగి పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి.. దౌర్జన్యం ‘ఇలా అక్రమంగా తవ్వడం వల్ల మా పొలాలు మునిగిపోతాయి, ఇది పద్ధతి కాదు’ అని ప్రశ్నించిన రైతులపై సదరు నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. తమను నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ యథేచ్ఛగా పొక్లెయిన్లతో తవ్వకాలు సాగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ మైనింగ్పై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముంపు ముప్పు నుంచి తమ పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
హ్యాకథాన్లో మంగళగిరి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు. -
భవితకు బాసట
సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాల చిన్నారుల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ‘భవిత కేంద్రాలు’ ఆసరాగా నిలుస్తున్నాయి. బడులకు దూరంగా ఉన్న 3–18 సంవత్సరాల వయస్సున్న ప్రత్యేక అవసరాల చిన్నారుల గుర్తింపునకు ఈ నెల 1న ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఐఈఆర్టీ అధికారులు ప్రత్యేక అవసరాల చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను నూతనంగా గుర్తించి పాఠశాలలో పునఃప్రారంభమైన తర్వాత సమీప భవిత కేంద్రాలు, పాఠశాలల్లో చేర్పించనున్నారు. భవిత కేంద్రాల్లో అందించే సేవలు.. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో గత విద్యా సంవత్సరం 820 మంది విద్యార్థులు లబ్ది పొందారు. వీరిలో 280 మంది విద్యార్థులు ఇంటి వద్ద మంచాలకే పరిమితమై ఉండగా, మిగిలిన 540 మంది భవిత కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వంతోపాటు అలింకో అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన పరికరాలను అందిస్తున్నారు.రాయడం, మాట్లాడటం, చదవడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లాలో మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున 8 మంది ఉన్నారు. వీరు వారంలో ఒకరోజు భవిత కేంద్రాల్లో వైద్యులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నారులకు చిన్నపాటి వ్యాయామాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి వారిలో సానుకూల ధృక్పథాన్ని పెంపొంది స్తున్నారు. డీఈఓ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో ఉన్న ఐఈఆర్టీల ద్వారా నూతనంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల గుర్తింపు సర్వేను వేగవంతం చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించాం. ప్రత్యేక అవసరాల చిన్నారులకు 21 రకాల పరీక్షలు చేసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ఆయా స్థాయిలను బట్టి వారిని సమీప భవిత కేంద్రాలు, సమీప పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. –ఆర్.సెల్వరాజ్, సహిత విద్యా జిల్లా సమన్వయకర్త, పల్నాడు ఐఈఆర్టీ ఉపాధ్యాయులు సుమారు నెలరోజుల పాటు గ్రామాల్లో తిరిగి ప్రజల నుంచి వివరాలు సేకరించి దృష్టి యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన సర్వేలో ఇప్పటి వరకు 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించారు. వీరు చేస్తున్న సర్వేను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో భవిత కేంద్రాలు : 28 ప్రత్యేక అవసరాల చిన్నారులు : 820 మంది భవిత కేంద్రాలకు వచ్చేవారు : 540 ఇంటివద్ద చదివే పిల్లలు : 280 కొత్తగా సర్వేలో గుర్తించిన వారు : 60 మొత్తం ఐఈఆర్టీలు : 56 ఫిజియోథెరపిస్టులు : 8 -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపుకు బేబీ చిప్స్తో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుండి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్ ధ్వంసమై క్యాబిన్లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతిలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురికి తీవ్ర గాయాలు -
అన్నింటా ఇంటి బండ!
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ గ్యాస్ వినియోగం పట్టణంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. పశ్చిమసియా యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడి సామాన్యులు ఒకవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ మార్గంలో గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పాటు డిమాండ్ పెరగటంతో కట్టెల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ క్రమంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు తక్కువ ధరలో లభించే గృహ వినియోగ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో బుక్ చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యేది. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణ పరిధిలో బుక్ చేసిన తర్వాత నెల రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సరిపడా గ్యాస్ అందుబాటులో లేక గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర పెరగటంతోనే.. గృహ అవసరాలకు సరఫరా చేసే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.950ల వరకు ఉండగా, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.3,200 ఉంది. గృహ సిలిండర్ తక్కువ ధర కారణంగా అక్రమ వ్యాపారులు వాటిని ఉపయోగించేందుకు అనేక మార్గాలను వినియోగిస్తున్నారు. కొంతమంది వినియోగదారుల వద్ద సిలిండర్పై రూ.300 నుంచి రూ.500 వరకు అధిక నగదు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేసే దళారుల ద్వారా కొనుగోలు చేసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రభావంతో రూ.2,200 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,200లకు పెరిగింది. ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అక్రమార్కులు గృహ అవసరాల సిలిండర్లను అధికంగా వినియోగించటంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్యాస్ అక్రమ వినియోగ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నదుల రక్షణకు యాక్షన్ప్లాన్
యడ్లపాడు: నదుల ప్రక్షాళనపై రాజీపడేదే లేదని, పారిశ్రామిక వ్యర్థాలతో నదులను మురికికూపాలుగా మారిస్తే సహించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) ప్లాంట్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంట్లోని కంట్రోల్ రూమ్, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం, ఘనవ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు అన్ని విభాగాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, అక్కడి సాంకేతికతపై అధికారులతో చర్చించారు. ప్లాంట్ నిర్వహణ, వ్యర్థాల సేకరణ, బాయిలర్ ప్రాసెస్, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి సాంకేతిక అంశాలు, యూనిట్ విద్యుత్ విక్రయ చార్జీలు గురించి పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. జిందాల్ ప్లాంట్లో వాడుతున్న అధునాతన కాలుష్య నివారణ పద్ధతులను, రాజమండ్రిలోని ప్రసిద్ధ ఆంధ్ర పేపర్ మిల్లు ఎందుకు పాటించడం లేదంటూ పవన్ కల్యాణ్ అధికారులను ప్రశ్నించారు. పారిశ్రామిక వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నిత్యం టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న చెత్తను శాసీ్త్రయంగా సద్వినియోగం చేసుకునేందుకు, మరిన్ని ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ప్లాంట్ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఎం.వి.చారి, పంచాయతీరాజ్ అధికారి కృష్ణతేజ, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ నజీమాబేగం, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజానా సింహ, ఎస్పీ బి.కృష్ణారావు, ఆర్డీఓ బాలకృష్ణ, చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐలు పి.రమేష్, బి.సుబ్బానాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బహిరంగంగా వినియోగం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయటంలో నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలు వ్యాపారులకు మాత్రం అడిగినన్ని అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ వినియోగం కళ్లెదుట కనిపిస్తున్నా అధికారులు నివారణకు చర్యలు చేపట్టకపోవటం ఆరోపణలకు బలాన్ని చేకూరిస్తుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. సబ్సిడీతో సామాన్యులకు అందిస్తున్న గృహ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోవటం ఆందోళన కలిగిస్తుంది. -
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం
నరసరావుపేట: నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ చర్చ టౌన్హాలు లేదా కోటప్పకొండ వేదికగా జరగాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిపై పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిరోడ్డుపై అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ సమస్య వలన గంటలతరబడి కూర్చొని చర్చించటం సాధ్యంకాదని, అందువల్ల టౌన్హాలులో అంబేడ్కర్ చిత్రపటం ఏర్పాటుచేసి మీడియా సమక్షంలో చర్చిద్దామని సూచించారు. అధికారంలో వారు ఉన్నందున తేదీ, సమయం, ఏర్పాట్లు అన్నీ ఎమ్మెల్యేనే చూడాలని కోరారు. చెప్పిన సమయానికి వారు ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే వస్తానని పేర్కొన్నారు. పేదవాడికి సెంటు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ చదలవాడ చేసింది శూన్యమని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకి రూ.2476కోట్ల విలువైన సంక్షేమం, అభివృద్ధి పనులు తాము అందజేశామని వెల్లడించారు. పల్నాడును జిల్లాగా ఏర్పాటు చేసి, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించామని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు ఇక్కడ ఉంటున్నారంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తనకు ఆ ఘనత దక్కుతుందన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఏ ఒక్క పేదవాడికై నా ఇంటి స్థలంకోసం సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం తన అనుయాయుడు, ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్న బీసీ కాలనీ రమేష్కు సెంటు రూ.25లక్షలు విలువచేసే నాలుగు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని మాత్రమే ఇచ్చాడని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారు 15వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, జగనన్న కాలనీల్లో సెంటు స్థలం, గ్రామాల్లో సెంటున్నర చొప్పున ఇచ్చామన్నారు. కోటప్పకొండకు నిధులు పెంచామని ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవంలేదన్నారు. ఈ రెండేళ్లలో రూ.4కోట్ల నిధులు పెరిగితే 15 మరుగుదొడ్ల నిర్మాణం తప్పితే మరెటువంటి అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాకాని, చింతలపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరికి కోటప్పకొండ అజమాయిషీ అప్పచెప్పటంతో వారు కొండ నిధులను స్వాహా చేస్తున్నారన్నారు. తాము కోటప్పకొండపైన నంది, మేథా దక్షిణామూర్తి విగ్రహాలు, అతిధిగృహాలు, మెట్లపై షెడ్లు, దేవాలయం చుట్టూ ఉన్న గిరిప్రదక్షణ రోడ్డు, సెంట్రల్ డివైడర్, లైటింగ్, కూడలిలో శివుని బొమ్మ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు 90శాతం హామీలు నెరవేర్చామని మాట్లాడుతున్నాడని, అవి ఏంటో చర్చించేందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రెండు చప్టాలు కట్టి రెండు ప్లైఓవర్లు కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. తాము చేసిన అభివృద్ధి, అందజేసిన సంక్షేమం లెక్కలతో తాను చర్చించేందుకు వస్తానని, దమ్ము, దైర్యం ఉండి వారు వస్తే చర్చించి తేల్చుకుంటామన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సన్మానం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్ఐలు కె.రాజశేఖర్బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ సుందరాచారి
జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి బాపట్ల: భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోనున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్లో ‘బీచ్ ఆఫీసు’, ‘బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సెంటర్’లను మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వరరావు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాలను మంత్రి పరిశీలించారు. బే ఆఫ్ బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీచైన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్ వద్ద పునఃనిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, ఇన్చార్జి టూరిజం ఆఫీసర్ ఆనంద్ సత్యపాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ప్రతి ఒక్కరూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్లోని పలు యూనిట్లలో ఉద్యోగోన్నతి పొందిన 24 మంది సీఐలు శనివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజా సేవా దృక్పథంతో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని సూచించారు. సీఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో గుంటూరు జిల్లాలో పది మంది, పల్నాడు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, సీఐడీలో ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, సీీసీఎస్ నుంచి ఒక్కొక్కరూ ఉన్నారని తెలిపారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం ఆ తీవ్రత మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. -
గాదె వెంకటరెడ్డికి ప్రముఖుల నివాళులు
ఇంకొల్లు (చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మృతిచెందగా, శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరు లోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరై సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, నరసరావుపేట, చీరాల మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం కేపీ కొండారెడ్డి, చీరాల పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, అంబటి హరినాథ్ , మారెళ్ళ వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, రామారావు, వై శివారెడ్డి, పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామ అధ్యక్షులు, అభిమానులు, రిటైర్డ్ అధికారులు నివాళులర్పించారు. సజ్జల, అంబటితో పాటు హాజరైన పలువురు నాయకులు -
పోలీసు సిబ్బందికి సత్కారం
నరసరావుపేట రూరల్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పోలీసు శాఖలో బాద్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది అభినందన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఆర్.మంత్రునాయక్, యడ్లపాడు ఏఎస్ఐ ఎస్కె ఇస్మాయిల్, చిలకలూరిపేట ఎస్బీ ఏఎస్ఐ వై.శ్రీనివాసరావు, నరసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ జి.వెంకటేశ్వరరావు, జిల్లా డీఏఆర్ ఏఎస్ఐ సిహెచ్ శామ్యూల్, కానిస్టేబుల్ పి.రహమతుల్లా ఖాన్, మాచర్ల హోంగార్డ్ బి.రాజానాయక్లు శనివారం ఉద్యోగ విరమణ పొందారు. వీరిని జిల్లా ఎస్పీ పూలమాలలు, బహుమతులతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో, ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజానికి మంచి పోలీసు సేవలు అందించిన మీ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ( ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, హోంగార్డ్ ఆర్ఐ ఎస్.కృష్ణ, వెల్పేర్ ఆర్ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు. -
ధరల పెంపుపై జూన్ ఒకటి నుంచి ఆందోళన
వామపక్ష పార్టీల నాయకుల వెల్లడి లక్ష్మీపురం: పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ఆందోళన నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్షాల సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్కుమార్, సీపీఐ(ఎంఎల్) నాయకులు యు.నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్ రాష్ట్ర నాయకులు మన్నవ హరిప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపోరు నాయకులు పి.కొటేశ్వరరావు, ఎం.సీపీఐ(యూ) నాయకురాలు డి.నాగలక్ష్మి విలేకరులలో మాట్లాడారు. జూన్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన రాస్తారోకో చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేయాలని, 4వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహించాలని, 9వ తేదీన జరిగే రాస్తారోకో పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఈమని అప్పారావు పాల్గొన్నారు. -
ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాల పంపిణీ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టారు. జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం నుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్లకు 3,383, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు 3,327 పాఠ్యపుస్తకాలను అందచేయనున్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రథమ సంవత్సరం 1,016, ద్వితీయ సంవత్సరం 1,030 పుస్తకాలను అందచేయనున్నారు. జెడ్పీ హైస్కూల్స్లో 133 (ప్రథమ), 90 (ద్వితీయ), ఏపీఆర్జేసీ కళాశాలకు 175 (ప్రథమ), 192 (ద్వితీయ), కస్తూర్బా విద్యాలయాలకు 811 (ప్రథమ), 836 (ద్వితీయ) ఏపీ మోడల్ స్కూల్స్లోని ఇంటర్మీయెట్ విద్యార్థులకు 1,248 (ప్రథమ), 1,179 (ద్వితీయ) పుస్తకాలను పింపిణీ చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు దరఖాస్తు చేసుకోండి నరసరావుపేట: బెంగళూరులోని ఇండియన్ ఇన్నిస్టిట్యూట్ ఆఫ్ సైన్న్స్కు చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు ఇచ్చే సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు జిల్లాలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి బి.గోవింద్ నాయక్ శనివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. మారుతున్న ఉద్యోగ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్–క్యారెక్టరైజేషన్ శిక్షణ‘ అనే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ ప్రాజెక్ట్ కింద 1500 మంది గిరిజన విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ, 600 మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించడానికి అవకాశం ఉందన్నారు. పౌండేషన్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ఆన్లైన్ విధానంలో 60గంటలు, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 90 గంటలు శిక్షణ ఇస్తారన్నారు. యూజీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, పౌండేషన్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. మరిన్ని వివరాలు కోసం వెబ్పేజ్ లింకును అనుసరించాలన్నారు. స్విమ్మింగ్ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 3వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ పోలో సెలక్షన్స్– 2026 పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 77 మంది స్విమ్మర్లు పోటీలో పాల్గొన్నారు. వీరిలో 55 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల నుంచి 14 మంది చొప్పున బాల బాలికల జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న జట్లు జులై 7 నుంచి 12వ తేది వరకు చైన్నెలో జరగనున్న 79వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్–2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ కార్యదర్శి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర సీనియర్ కోచ్ నటరాజ్, స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ మృతి కారెంపూడి: నడుపుతున్న ఆటో కిందే పడి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చినగార్లపాడు గ్రామానికి చెందిన కె జానీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బాషా పనుల నిమిత్తం తన నడుపుతున్న ఆటోలో ఒక వ్యక్తిని డ్రాప్ చేయడానికి కారెంపూడి వచ్చాడు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పెదకొదమగుండ్ల గ్రామ శివారు బ్రహ్మనాయుడు కాలనీ మూల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తను నడుపుతున్న ఆటో కింద పడి జానీబాషా (24) అక్కడికక్కడే మృతి చెందాడు. ముందున్న మట్టికుప్పను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లుగా భావిస్తున్నారు. ట్రాక్టర్లు ఇతర వాహనాలకు డ్రైవర్గా వెళ్తూ కౌలుకు పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో స్వ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయాన్ని కాపాడుకుందాం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలో రాజధాని రైతు సంఘం 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎస్కే పేరు సాహెబ్, జి.నాగేశ్వరరావు వ్యవహరించారు. తొలుత రైతు సంఘం జెండాను ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట టి.బక్కిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం తెస్తామన్న మోదీ, కూటమి ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానాలకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు వాడకం సగానికి తగ్గించేశారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే వ్యవసాయం మనుగడని పేర్కొన్నారు. పొదుపు పేరుతో ఆహార పదార్థాలు, నూనెలు తగ్గించి వాడమంటున్నారని, పాలన చేతకాని ప్రభుత్వాలలే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవ్రంగా ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ల్యాండ్ బ్యాంక్ విధానం రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడానికే అని స్పష్టం చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని 10 శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల రూపాయితో డాలర్ విలువ తీవ్రంగా పడిపోయందని విమర్శించారు. అమెరికాలో 10 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రవి, కె.జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాల కింద పడి బాలుడు మృతి
దాచేపల్లి: విద్యుత్ స్తంభాల కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దుర్గాభవానీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో అదే కాలనీకి చెందిన ఆవుల శ్రీను, హనుమమ్మ దంపతుల చిన్న కుమారుడు పవన్ (5)దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఆడుతున్నాడు. కాలనీలో నిల్వ చేసిన విద్యుత్ స్తంభాలు ఎక్కి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటుండగా పోల్స్ జారి పవన్ మీద పడ్డాయి. పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పవన మృతదేహన్ని చూసిబోరున విలపించారు. పవన్ తండ్రి శ్రీను రెండేళ్ల క్రితం మృతి చెందాడు. పవన్కి అన్న అంజి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు స్థానిక నాయకులు చర్చలు జరుపుతున్నారు. -
స్థల వివాదంలో అన్నదమ్ముల ఘర్షణ
చిలకలూరిపేట టౌన్: మండలం పరిధిలోని వేలూరు గ్రామం ఎస్సీ కాలనీలో శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరుసకు అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు ఎస్సీ కాలనీకి చెందిన వంజా జ్ఞానయ్య, వంజా సురేంద్రం వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కొంతకాలంగా వీరి మధ్య నాలుగు సెంట్ల స్థలానికి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లిది. ఘర్షణ అనంతరం ఇరువర్గాల వారు చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషనుకు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ జి. అనిల్కుమార్ తెలిపారు. ఆప్తమాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీదేవి గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ కంటి వైద్య విభాగాధిపతిగా డాక్టర్ శ్రీదేవిని నియమిస్తూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంటి వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ రవిబాబు ఉద్యోగ విరమణతోపాటు, డాక్టర్ శ్రీదేవిని హెచ్ఓడీగా నియమించారు. -
మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటరు రూ.30లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లకు, పవర్ స్పెయర్లకు రూ.50లకు లీటర్ పెట్రోలు సరఫరా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు న్యాయమైన ధర కల్పించి, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న, అపరాలకు రైతులు నష్టపోకుండా స్వామినాథన్ సిఫార్సు మేరకు 50 శాతం మిగులు ఉండునట్లు కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయ కులు ముప్పాళ్ల శివశంకరరావు, పచ్చల సాంబశివరావు, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. -
సారీ... కమిషనర్
అమృతరావు దాడి ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని క్షమాపణ నగరంపాలెం: గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు దాడి ఘటన, అనంతరం ప్రెస్మీట్ నిర్వహించి కమిషనర్పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నార్ల ఆడిటోరియం పునః ప్రారంభ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరంసభలో మంత్రి మాట్లాడుతూ... గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయతీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కమిషనర్పై ఇలా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, లేదంటే తన వద్దకు రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీస్లపైకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికిగాను నగర కమిషనర్కి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రజుమంలో పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నాయకులు, నగర కమిషనర్ మయూర అశోక్, అన్నమయ్య సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. -
మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలన
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ను శుక్రవారం ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ, రాజ్యసభ సభ్యుడు సి.విజయేంద్రప్రసాద్లు పరిశీలిచారు. జిల్లా, స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన వారు మ్యాజిక్ డ్రెయిన్ పనితీరు, మురుగు ఇంకే విధానం స్వయంగా అధ్యయనం చేశారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, నిర్మాణానికి రా మెటీరియల్ ఏమేమి ఎంత మొత్తంలో వినియోగించారు, పనితీరు ఎలా ఉంది అనే అంశాలను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మ్యాజిక్ డ్రెయిన్ వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా, గతంలో మురుగు పారుదలకు, ఇప్పుడు మ్యాజిక్ డ్రెయిన్తో మురుగు ఇంకుతున్న తీరుకు ఏమైనా తేడా గమనించారా అని ప్రశ్నించారు. గతంలో మురుగు సక్రమగా తియ్యక, పారుదల లేక రోజుల తరబడి నిలిచి దోమల ఉధృతి అధికంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ డ్రెయిన్ నిర్మాణంతో మురుగు అంతా ఇంకిపోతుందని మహిళలు తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీవీవో హనుమతంరావు, ఎంపీడీవో కె.శివపార్వతి, ఏపీవో ఏడుకొండలు తదితరులున్నారు. స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి పెదకాకాని: ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధించడానికి స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. మండల పరిధిలోని అనుమర్లపూడి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): చైనాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఎక్విప్డ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జూనియర్ విభాగంలో ఇ.లక్ష్మి వినయశ్రీ, మదిన షారూను బ్రాంజ్ పతకాలు, సబ్ జూనియర్ కేటగిరీలో బి.లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారితో ముచ్చటించి సాధన, పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.అఫ్రోజ్ ఖాన్, కోచ్ సాయి రేవతి పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూన్ 3వ తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు, ఇతర సమన్వయ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, భవన అంతస్తులను సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం వద్ద నుంచి సీఎం సందర్శించే ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, వీవీఐపీల రాకపోకల మార్గాలు, ప్రజల రాకపోకలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ఖరీఫ్... కష్టకాలమే !
అమరావతి: గత సంవత్సరం ప్రకృతి అనుకూలించక పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు భారీగా నష్టపోయారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరగటంతో ఖరీఫ్ సీజన్లో వారిపై పెనుభారం పడనుంది. సకాలంలో విత్తనాలను సరఫరా చేయటానికి కార్యాచరణ లేకపోవడం చూస్తే ఈ ఏడాది పరిస్థితి అర్థం అవుతోంది. నాసిరకం విత్తనాలను గ్రామాలలో విక్రయించకుండా అరికట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలను నిర్వహణ, ప్రకటనలకే పరిమితం అవుతోంది. పత్తి, మిర్చి విత్తనాల ధరలపై రైతులు అందోళన చెందుతున్నారు. పురుగు మందులలో కూడా కొన్ని రకాల వాటి ధరలు రెట్టింపయ్యాయి. ఎరువుల విషయంలో ఈ సంవత్సరం అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ సారి కూడా యూరియా తదితరాలకు కొరత ఏర్పడి బ్లాకులో అధిక రేట్లకు విక్రయించే పరిస్థితి వస్తే రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. పత్తి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 8 వేలు – రూ. 10 వేలు, మిరపకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం, బ్యాంకులు, వ్యవసాయ రుణాల పంపిణీపై ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. ఇన్ని ఖర్చులు భరించినా రైతులకు వాతావరణం అనుకూలించక పోవటం, గిట్టుబాటు ధరలు లేకపోవటం వంటి సమస్యలతో ప్రతి సంవత్సరం నష్టపోయే పరిస్థితి వస్తోంది. దీంతో వ్యవసాయంపై ఆసక్తి చూపకపోవటంతో కౌలు పొలాలకు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పత్తి సాగుకు ఇబ్బందులు గతంలో ఎకరా పత్తి సాగు చేయటానికి రూ.15 వేలు – రూ. 20 వేల వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం రూ. 25 వేలు – రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. గతంలో పత్తి పంట ఎకరాకు సుమారుగా 20 నుంచి 25 క్వింటాళ్లుగా సగటున దిగుబడి వచ్చేది. ప్రస్తుతం గులాబి రంగు పురుగు, నాందేడ్ తెగులుతోపాటుగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఏ ఏటికాయేడు దిగుబడి తగ్గుతూ వస్తోంది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపటం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి రైతులను గిట్టుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎరువులు, పురుగుమందులపై సబ్సిడీ ఇచ్చి ఆదుకోకుంటే తమకు నష్టాలు తప్పవనే ఆందోళన రైతుల్లో నెలకొంది. గతేడాది వాతావరణం అనుకూలించకపోవటంతో పత్తిలో దిగుబడి రాక నష్టపోయాం. ఏటా విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు పెరగటంతో వ్యవసాయంలో పెట్టుబడి అధికమైంది. దీంతో బ్యాంకులలో తెచ్చిన అప్పులు చాలక ప్రైవేటుగా పెట్టుబడికి అప్పు తేవాల్సి పరిస్థితి నెలకొంది. – అద్దంకి హనుమంతరావు, రైతు, ఎండ్రాయి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సొసైటీల ద్వారా సబ్సిడీ ఇవ్వాలి. అలాగే దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే కొంతమేర లాభం ఉంటుంది. ఎరువుల కొరత లేకుండా చూడటంతోపాటు వాటి ధరలు, పురుగుమందులు అధిక రేట్లకు అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – గుబ్బా కృష్ణయ్య, రైతు, వైకుంఠపురం -
మెగా డీఎస్సీలో అంతా దగా
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరిట అంతా దగా చేసిందని వైఎస్సార్ సీపీ కీలక నేతలు మండిపడ్డారు. విద్యాశాఖ నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలతో అయోమయంగా మారిందని, జరిగిన అక్రమాలపై వెంటనే దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నరసరావుపేటలో మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి, విద్యార్థి, యువత విభాగం, పార్టీ సీనియర్ నేతలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వరకు వందల మంది విద్యార్థులు, నాయకులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి నేతలు వినతి పత్రం అందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు విక్రయించిన సర్కార్ డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖను లోకేష్ భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందన్నారు. కంప్యూటర్ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తికి కృష్ణా జిల్లా డీఎస్సీలో ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో పేపరు లీక్ అయిన మాట వాస్తవం కాదా అన్నారు. పేపర్ లీక్ అయిన విషయం తెలిసి కూడా లోకేష్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. మెగా డీఎస్సీ మెరిట్ లిస్టు ఎందుకు రిలీజ్ చేయలేదని, ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్న వారికే కాల్ లెటర్స్ పంపించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. మెరిట్ లిస్టు రిలీజ్ చేయకుండా జాయినింగ్ లెటర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆటలాడటమే తెలియని వారికి స్పోర్ట్స్ కోటా కింద రూ.15 లక్షల చొప్పున తీసుకుని 450 మందికి ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కోర్టు మెరిట్ లిస్టు ఇవ్వమన్నా ఎందుకు స్పందించడం లేదని మంత్రి లోకేష్ను నిలదీశారు. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు అడుగుతున్నా ఎందుకు వెనుకంజ వేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేపర్ లీక్ వల్లే టాప్ ర్యాంక్లు... ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా పేపర్ తయారు చేశారని, అందువలనే పనిచేసే వారికే టాప్ ర్యాంకులు వచ్చాయన్నారు. అందుకే దీనిని దగా డీఎస్సీ అంటున్నామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పూర్వ పద్ధతిలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. డబ్బులు కట్టిన వారికే ఉద్యోగాలు ఇస్తే వ్యవస్థ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, అంగన్వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతోళ్ల సతీష్, మాజీ ఎంపీపీ టి.మంగమ్మ, జిల్లా కోశాధికారి అన్నా చంద్రమోహన్, పలు విభాగాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడుతూ అక్రమాలు చేసేందుకే విద్యాశాఖను మంత్రి లోకేష్కు కేటాయించారన్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. విద్యావ్యవస్థను మెరుగుపరిచే ఆలోచన లేని లోకేష్ డీఎస్సీ ఉద్యోగాలను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు విక్రయించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కోచింగ్ సెంటర్ 90 రోజులుపాటు నిర్వహిస్తామని చెప్పి కేవలం 35 రోజులకే ముగించి డీఎస్సీ పరీక్ష నిర్వహించారన్నారు. -
పోలీసులకు అప్రమత్తత అవసరం
నరసరావుపేట: ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల (ఈవీఎం) గోడౌన్ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఈవీయం యంత్రాలు బి.యులు, సి.యులు, వీవీ ప్యాట్లు, అక్కడి భధ్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత కల్పించామన్నారు. ఎప్పటికప్పుడు గౌడౌన్ను క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ కె.బాలకృష్ణ, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. సర్కు రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లాలో ఓటరు జాబితా పారదర్శకంగా, దోషాలు లేకుండా నవీకరించడానికి చేపట్టిన ప్రక్రియ (సర్) జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై రాజకీయపార్టీల ప్రతినిధులతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. డీఆర్ఓ నారదముని పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు -
రైళ్లలో చోరీలు.. వ్యక్తి అరెస్టు
చీరాల రూరల్: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జీఆర్పీ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సీహెచ్.కొండయ్య నిందితుని వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లపు సాయిప్రియ ఈనెల 25వ తేదీ తన కుటుంబ సభ్యులతో తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి నాందేడ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా రైలు చీరాల రైల్వేస్టేషన్లో ఆగిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె హ్యాండ్బ్యాగును అపహరించాడు. బ్యాగులో 9 గ్రాముల బంగారు నల్లపూసల దండ, ఒక సెల్ఫోన్, రూ.1,500 నగదు ఉన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరు డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఒంగోలు ఐఆర్పీ ఎస్కే మౌలా షరీఫ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు పాత నేరస్తుడు వేటపాలం మండలం కొత్తపేట ప్రసాద్నగర్కు చెందిన పెరికల సందీప్గా గుర్తించారు. చీరాల రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 4లో ఉన్న అతడిని అరెస్టు చేసినట్లు ఎస్సై కొండయ్య తెలిపారు. నిందితుని వద్ద నుంచి 9 గ్రాముల బంగారు నల్లపూసల దండ, మూడు సెల్ఫోన్లు రికవరీచేసి రిమాండ్ నిమిత్తం నెల్లూరు రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు. కొద్ది రోజుల్లోనే కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొద్దిరోజుల్లో ఛేదించిన జీఆర్పీ ఎస్సై సీహెచ్. కొండయ్య, పోలీసు సిబ్బందిని నెల్లూరు డీఎస్పీ ఎం.మురళీధర్, ఒంగోలు ఐఆర్పీ మౌలా షరీఫ్ అభినందించారు. నిందితుని నుంచి బంగారం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం -
పల్నాడు
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారంనాటికి ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 521.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 6,906 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది. 7 -
ఉత్తమ ప్రదర్శన ‘చెరిగిపోని చిరునామా’
నాదెండ్ల: సాతులూరు గ్రామంలో ఈ నెల 24 నుండి 28 వరకూ జరిగిన నాలగవ జాతీయ స్థాయి నాటికల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ హర్షా క్రియేషన్స్ ‘చెరిగిపోని చిరునామా’ నాటిక ఎంపికై ంది. పొన్నూరు శ్రీ విశ్వకళా చైతన్య వేదిక ‘సూక్తం’ నాటికకు ద్వితీయ స్థానం, ఏలూరు హేలాపురి కల్చలర్ అసోసియేషన్ ‘అనగనగా ఒక రాత్రి’ నాటికకు తృతీయ స్థానం దక్కింది. ఉత్తమ ప్రోత్సాహక నాటికగా హైదరాబాద్ స్వర్ణసూ ర్య డ్రామా లవర్స్ ‘శ్రీమాత్రే నమః’, ఉత్తమ హాస్య నాటికగా యడ్లపాడు మానవతా క్రియేషన్స్ ‘బావా ఎప్పుడు వచ్చితివి’ పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ దర్శకుడిగా ‘సూక్తం’ నాటిక దర్శకుడు జీవీ మనోహర్, ఉత్తమ రచయితగా ‘మలిసంధ్య’ నాటిక రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు, ఉత్తమ నటుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటికలో సుబ్బారావు క్యారెక్టర్ ధరించిన కట్టా శ్యామ్ప్రసాద్, ఉత్తమనటిగా ‘చెరిగిపోని చిరునామా’నాటికలో సావిత్రి పాత్ర పోషించిన అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటుడిగా ‘అనగనగా ఒకరాత్రి’ నాటికలో ఎమ్మెల్యే పాత్ర ధరించిన విజయ్కుమార్, ద్వితీయ ఉత్తమనటిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో శ్వేత పాత్ర ధరించిన సురభీప్రియాంక, ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో సత్యానంద పాత్రధారుడు ఉదయ్ భాగవతుల, ఉత్తమ క్యారెక్టర్ నటిగా ‘అనగనగా ఒక రాత్రి’ నాటికలో కీలా పాత్రధారిణి వై భవాని, ఉత్తమ ప్రతినాయకుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటిక లో రఘురామ్ ప్రాతధారి భాగ్యరాజ్, ఉత్తమ హాస్యనటుడిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’ నాటికలో సుబ్బారావు పాత్రధారి ముత్తవరపు సురేష్బాబు, ఉత్తమ హాస్యనటిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’నాటికలో సుబ్బలక్ష్మి పాత్ర పోషించిన లహరి, ఉత్తమ బాల నటిగా ‘విజేతలు’ నాటికలోని నాగప్రభ పాత్రధారిణి ఉహాశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సంగీతం వై సాయితేజ, ఉత్తమ ఆహార్యం పి శేషగిరి, ఉత్తమ రంగాలంకరణ అనిల్, శ్రీకర్, జ్యూరీ–1 సాత్విక, జ్యూరీ–2 శొంఠినేని శ్రీనివాసరావు అందుకున్నారు. విజేతలకు పరిషత్ నిర్వాహకులు బండారుపల్లి సత్యనారాయణ, నడింపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నగదు, మెమోంటో అందించారు. -
పురాతన మసీదులో జుమ్మా నమాజ్
యడ్లపాడు: చారిత్రక కొండవీడు కొండలు శుక్రవారం ఆధ్యాత్మిక చేతనతో విరాసిల్లాయి. కొండలపై ఉన్న అత్యంత పురాతనమైన షాహీ జుమ్మా మసీదులో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక జుమ్మా నమాజ్ ఆచరించారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనేందుకు అమరావతి, గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వేములూరిపాడు, అమీనాబాద్, కొమ్మెరిపూడి, తురకపాలెం, పెదకాకాని తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు, మత పెద్దలు కొండవీడు కోటకు తరలివచ్చారు. లోకకల్యాణం కోసం ప్రత్యేక దువా నమాజ్ అనంతరం దేశ, ప్రపంచ శాంతి కోసం ముస్లిం పెద్దలు ప్రత్యేక దువా(ప్రార్థన) చేశారు. భారతదేశంలో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సౌభ్రాత్వత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోయి, అందరికీ సమాన అవకాశాలు లభించాలని ప్రార్థించారు. మానవాళికి వెన్నుముక అయిన రైతన్నల కష్టాలు తీరాలని, ప్రకృతి కరుణించి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పండిన పంటకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర దక్కాలని, అంతర్జాతీయ ఎగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని అల్లాహ్ను ప్రార్థించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొహమ్మద్ ఇస్హాక్ నద్వీ మాట్లాడుతూ..కొండవీడు కోట పర్యాటక అభికృద్ధితో పాటు ఇక్కడి చారిత్రక షాహీ జుమ్మా మసీదును, కొండలపై ఉన్న హజరత్ సూఫీ సయ్యద్ షా రహతుల్లా అలైహ్ దర్గాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం భక్తులంతా కలిసి పురాతన దర్గాను సందర్శించారు. కార్యక్రమంలో నౌ అవర్ హిస్టరీ(గుంటూరు) సంస్థ అధ్యక్షులు, మసీదు అభికవృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్, పెద్దలు మస్తాన్, అహ్మద్, అబ్దుల్ రజాక్, ఇమ్రాన్, అఫీజుల్లా, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన చట్టం తప్పనిసరిగా పాటించాలి
పిడుగురాళ్ల: జిల్లాలోని విత్తన డీలర్లు విత్తన చట్టం ఖచ్చితంగా పాటించి విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు అన్నారు. పట్టణంలోని కె కన్వెక్షన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విత్తన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం పిడుగురాళ్ల ఏడీఏ శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు. పిడుగురాళ్ల సబ్ డివిజన్లోని ఐదు మండలాల విత్తన డీలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగ్గారావు మాట్లాడుతూ వీరంతా ఖచ్చితంగా విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వులతోపాటు 1983 విత్తన రూల్స్, పర్యావరణ పరిరక్షణ చట్టం పూర్తిగా తెలుసుకొని విత్తనాలు అమ్మకాలు చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని, అమ్మిన ప్రతి రైతుకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. విత్తన డీలర్లపైన రైతుల ఫిర్యాదులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత డీలర్లదేనని తెలిపారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే డీలర్లపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల సబ్ డివిజన్లోని ఐదు మండలాల ఏవోలు ఎం.సంధ్యారాణి, కె. రామమ్మ, కె.వెంకటేషే, నరసింహారావు, కె.దేవదాసు, ఐదు మండలాల విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు -
ఎన్రోల్మెంట్పై దృష్టి సారించాలి
నాదెండ్ల: జూన్ 13న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్రోల్మెంట్పై హెచ్ఎంలు, సీఆర్పీలు దృష్టి సారించి గతేడాది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని డీఈవో పీవీజే రామారావు అన్నారు. నాదెండ్ల మండల విద్యా వనరుల కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎంఈవోలు, సీఆర్పీలు, పీఐటీలు, ఎమ్మార్సీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలో డ్రాపవుట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్రాపవుట్లు సుమారు 600 మంది ఉన్నారని, తాము విద్యార్థు ఇళ్లను సందర్శించినపుడు ఇతర ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని, మరికొన్ని కుటుంబాలు వలస వెళ్లాయన్నారు. ఇప్పటి వరకూ ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ 5100 మంది విద్యార్థులు ఎన్రోల్ అయినట్లు వివరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈవో షేక్ మాబుసుభాని ఉన్నారు. డీఈవో రామారావు -
ఈదురు గాలులకు కూలిన జీవ ధ్వజస్తంభం
నాదెండ్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచింది. సుమారు గంట పాటు భీకరంగా ఈదులు గాలులు వీయటంతో గణపవరం గ్రామంలోని రుక్మిణిసత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభం విరిగిపడింది. సుమారు 160 ఏళ్ళ క్రితం గ్రామానికి చెందిన అనుమంచి హనుమంతరావు నిర్మించిన ఆలయంలో 1987 సంవత్సరంలో జీవధ్వజ స్తంభం ప్రతిష్ట నిర్వహించారు. 2018 జూన్లో నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్టించారు. అప్పట్లో ధ్వజస్తంభానికి అమర్చిన మానికల నుంచి వర్షపునీరు దిగి ధ్వజస్తంభం మొదలు చచ్చుబడటంతో ఈదురుగాలులకు విరిగిపడింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదురుగా చెట్టు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో తీగలు తెగి ఉదయం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేడు ‘రాష్ట్ర స్థాయి వాటర్ పోలో’ జట్ల ఎంపికలు నరసరావుపేట: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ‘3వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ పోలో సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వైవీ. సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేస్తారన్నారు. ఇక్కడ ఎంపికై న జట్లు 2026 జూలై 17 నుండి 24 వరకు గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లోని ‘సరదార్ పటేల్ అక్వాటిక్ కాంప్లెక్స్’లో జరగబోయే ‘78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియనన్షిప్‘ పోటీలలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, ఉదయం 7:30 గంటలకు ఎంపిక పోటీలు (ట్రయల్స్) మొదలవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ ఎంపికలలో పాల్గొనవచ్చని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి వేదికకు చేరుకోవాలని కోరారు. క్రీడాకారుల ప్రతిభను పారదర్శకంగా అంచనా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో వాటర్ పోలో క్రీడాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ నాయకులు స్థలాలు మావని ముందుకు వస్తే దాడులు తప్పవని టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి దిగిన సంఘటన పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకులు ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు దుర్గారావు, ఓర్సు శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తన్నీరు కల్యాణికి రెండు సెంట్ల స్థలాన్ని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలంలో మున్సిపల్ కార్యాలయానికి చెందిన పొక్లెయినర్ వచ్చి గుంతలు తీస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు దుర్గారావు, ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావులు ఈ స్థలంలో గుంతలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించటంతో పొక్లెయినర్ గుంతలు తీయటం నిలిపివేసింది. ఇంతలోనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బుత్తుల శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్యాలయంలో పని చేసే బత్తుల నాగరాజు, చెన్నయ్యతోపాటు మరికొంత మంది మహిళలు సుమారు 30 మంది దాకా హాజరై దాడికి పాల్పడ్డారు. దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావు, ఓర్సు దుర్గారావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా సరే స్థలం వద్దకు వచ్చి తమదేనంటే వారిపై దాడులు చేయటానికి తామంతా సిద్దంగా ఉన్నామని టీడీపీ నాయకులు బహిర్గతంగానే తెలుపుతున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేనే వైఎస్సార్సీపీ స్థలాలు అక్రమించుకొని తెలిపినట్లుగా టీడీపీ నాయకులు బహిరంగంగా చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందని, తాము చేసిందే రైట్ అని, అడ్డు ఎవరు చెప్పినా వారిని ఉపేక్షించేది లేదని, భయపెడుతున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. -
నిజమైన ఓటు తొలగించకుండా చూడాలి
పిడుగురాళ్ల: అధికారులు నిజమైన ఓటు తొలగించకుండా బూత్లెవల్ ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల పట్టణ, మండల బూత్లెవల్ ఏజెంట్లకు సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని కె కన్వెక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అధికారులు నిజమైన ఓటును తొలగించే ప్రయత్నం చేస్తే వారిపైన కోర్టుకు వెళ్లి, అవసరమైతే ఎంత దూరమైన పోదామని తెలిపారు. తప్పున చేసిన అధికారులకు శిక్ష పడేలా చేద్దామన్నారు. నిజమైన ఓటు ఒక్కటి తొలగించినా వదిలే ప్రసక్తే లేదన్నారు. వీధిపోరాటం అంటే ఏమిటో అధికారులకు చూపిద్దామని తెలిపారు. తప్పు చేసిన అధికారులు సస్పెండ్ అయ్యేంత వరకు మన పోరాటం ఆగదని పేర్కొన్నారు. మనకు ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉందని ప్రతి ఒక్కరు బూత్లలో పనిచేసి, నిజమైన ఓట్లు తొలగకుండా చూడటం, అర్హత ఉన్న ఓట్లను నమోదు చేయించటం, దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడటం కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాలను సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రొఫార్మలో స్పష్టంగా ఉందని తెలిపారు. పట్టణంలో ఉన్న 53 ఎన్నికల బూత్లు, పిడుగురాళ్ల మండలంలోని 61 ఎన్నికల బూత్లలో బూత్ లెవల్ ఏజెట్లతోపాటు సీనియర్ నాయకులు 10 నుంచి 15 బూత్లకు ఒకరు ఏర్పాటు చేసి ఐక్యంగా విధులు నిర్వహించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం స్టేట్ బూత్ వింగ్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి ఈ అంశాలపై క్షుణ్ణంగా బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. డిజిటల్ స్క్రీన్పై సర్ సంబంధించిన అంశాలను అర్దమయ్యే విధంగా చూపిస్తూ వివరించారు. ఈ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కూడా కూర్చొని డిజటల్ స్క్రీన్ ద్వారా బూత్లెవల్ ఏంజెట్లకు వివరింపజేయించారు. కార్యక్రమం వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ మందాల కిరణ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జైలాబ్దిన్, పట్టణ ఉపాధ్యక్షులు కందులూరి శివయ్య, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కొమెర వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కాలే మాణిక్యరావు, వైస్ ఎంపీపీ సాతులూరి బాబు, మాజీ ఎంపీపీ గండికోట కోటేశ్వరరావు, బూత్ వింగ్ కన్వినర్ ఇల్లూరి వెంకయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్లా, కొక్కెర శ్రీను, గుర్రం అప్పిరెడ్డి, జూలకంటి శ్రీనివాసరావు, కత్తెరపు వాసుదేవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కత్తెరపు రామ్గోపాల్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏంజెట్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
మూడు పల్టీలు కొట్టిన కారు
తాత, మనవరాలికి గాయాలు యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో తాతా మనవరాలికి గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన జగదీష్(75) తన 8 ఏళ్ల మనవరాలు జగదీశ్వరితో కలిసి కారు లో తిమ్మాపురం వైపు బయలుదేరారు. కారు తిమ్మాపురం సమీపానికి చేరుకునే సరికి ఒక్కసారిగా అదుపు తప్పి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపీరిపీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 అత్యవసర వాహన సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని..ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు లారీలు ఢీ.. దాచేపల్లి: రెండు లారీలు ఢీకొని డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుంచి చైన్నె వెళుతున్న లారీని తంగెడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి దాచేపల్లిని ముత్యాలంపాడు రోడ్డు సెంటర్లో ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల క్యాబిన్లు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయాయి. ఈ ఘటనలో హైదరాబాద్ వైపు నుంచి చైన్నె వెళుతున్న లారీ డ్రైవర్ తిరుపతిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ తిరుపతిరెడ్డిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాసీంవలి చెప్పారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ఒకరు మృతి.. పలువురికి గాయాలు నూజెండ్ల: మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన పోతుగంటి బాలిశెట్టి (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మేడపి సమీపంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాలిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లి వస్తుండగా మేడపి సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలిశెట్టి మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య సుబ్బమ్మ ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించగా శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలిశెట్టి గ్రామంలో 22 సంవత్సరాలుగా ప్రభుత్వ రేషన్ దుకాణం నిర్వహిస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకొన్నారు. నాలుగు కేసుల్లో నిందితుడికి శిక్ష పిడుగురాళ్ల: నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి శిక్ష పడినట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మాచర్ల పట్టణానికి చెందిన అడిగే మనీ పవన్కుమార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి(కాపర్) వైర్ చుట్టలను దొంగలించిన కేసులో కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలో రెండు కేసులు, మాచరవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మాచర్ల పట్టణంలో ఒక కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కేసును న్యాయమూర్తి టి. ప్రవల్లిక విచారణ చేసి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 1000 చొప్పున అపరాధ రుసుం విధించారు. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు. కోర్టును ఆశ్రయించిన భూమి యజమాని నాదెండ్ల: నా తండ్రి ద్వారా సంక్రమించిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆక్రమించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు చిలకలూరిపేట పట్టణంలో నివాసం ఉండే సిద్ధాబత్తుని కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో నా తండ్రి నరసింహారావుకు 1971లో నాదెండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 476–2బి సర్వే నెంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టా మంజూరు చేసిందన్నారు. కొన్నేళ్లు తామే వ్యవసాయం చేసుకుని పంట పండించి జీవించామన్నారు. తాను డ్రైవర్గా పనిచేస్తూ సుమారు 1990లో పొలాన్ని గ్రామానికి చెందిన బత్తిన కోటేశ్వరరావు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు తెలిపాడు. ప్రతి ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చిన కోటేశ్వరరావు, కొన్నేళ్ళుగా సదరు పొలం తనదంటూ కౌలు ఇవ్వకుండా తనను, తన కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయాడు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపాడు. న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ బత్తిన కోటేశ్వరరావును పొలంలోకి వెళ్ళకుండా అధికారులు అడ్డుకోవాలని కోరాడు. -
విశ్వాసం.. త్యాగం.. బక్రీద్
గుంటూరురోడ్డు పెద్ద మసీదులో ప్రార్థనలు ప్రకాష్నగర్ ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు ప్రేమ, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. నరసరావుపేట ప్రకాష్నగర్లో గల ఈద్గా మైదానం, గుంటూరురోడ్డులోని నాయబ్ బజారు పెద్ద మసీదులో వందలాదిమంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమస్త మానవాళికి శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. – నరసరావుపేట -
అభయమేది... బాబూ?
పట్నంబజారు: హైదరాబాద్కు చెందిన ఒక మహిళ గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమె ఆటో ఎక్కిన తరువాత ఆటో డ్రైవర్ దుర్బుద్ధితో ఆమైపె అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయాడు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో కూడా పోలీసులు మాత్రం చెప్పటం లేదు. అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఒక యువతిని నలుగురు తాగుబోతులు ఆటోలో ఎక్కించుకుని మణిపురం ఓవర్ బ్రిడ్జి వద్దే ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు ఏ ఒక్క పరికరం అందుబాటులో లేకుండా పోయింది. అభాగ్యులకు అండగా.. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ‘‘అభయం’’ ప్రాజెక్టు. అర్ధరాత్రి, ఇతర ఆపత్కర పరిస్థితుల్లోనైనా.. డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకుని వెళ్లినా.. వెంటనే బాధితులకు అండగా నిలవాలన్నదే అభయం ఉద్దేశం. మహిళలు, యువతులు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వారికి క్షణాల వ్యవధిలో రక్షణ కలిగించేలా రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తూ.. గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూట తిరిగే ఆటోల్లో అభయం మిషన్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యూఆర్ స్కానింగ్లోనే వివరాలు... అభయం ప్రాజెక్టు కింద ఆటోల్లో పరికరం బిగించే సమయంలో ఇంజిన్కు కనెక్షన్ ఇస్తారు. దీంతో జీపీఎస్ ట్రాకింగ్తోపాటు, ప్యానిక్ బటన్ ఉంటాయి. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా అభయం యాప్ ఇన్స్టాల్ చేసుకుని, ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే.. ఆటో నంబర్, డ్రైవర్ ఫొటో, అతని పేరు, సెల్నెంబర్లు అందులో వచ్చేస్తాయి. త్వదారా అసలు ఆటోలో ఉన్న వ్యక్తి సంబంధిత వ్యక్తా? వేరే వారా? అని నిర్ధారించుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోల్లో అమర్చుతారు. వాహనానికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. వాహనాన్ని స్టార్ట్ చేసే సమయంలో డ్రైవర్ తనకు జారీ చేసిన స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఐఓటీ డివైస్ పరికరం వద్ద ట్యాప్ చేయగానే డ్రైవర్ వివరాలన్నీ అభయ పరికరంలో నిక్షిప్తమవుతాయి. ఆటో ఎక్కిన తరువాత దారి తెలియని ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వివరాలను సన్నిహితులకు పంపటం ద్వారా ఎటు వెళుతున్నారో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న యాప్లో గమ్యస్థానాన్ని నమోదు చేస్తే.. వెళ్ళాల్సిన మూడు దారులు కనపడతాయి. ప్యాసింజర్ ట్రిప్ను అంగీకరించగానే ట్రిప్ ట్రాక్ అవటం మొదలుపెడుతుంది. నమోదు చేసిన రూట్లు కాకుండా వేరే రూటుకు వెళ్లినా.. డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకపోయినా.. పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కగానే.. సెకన్ల వ్యవధిలో కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం వెళుతుంది. ప్యానిక్ బటన్ నొక్కిన సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆటో నిలిచిపోతుంది. దీంతో తక్షణమే సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ట్రిప్లో ఉన్న డ్రైవర్ ఫోన్ నెంబర్కు నేరుగా ఫోన్ చేస్తారు. తమకు ప్యానిక్ బటన్ ద్వారా సమాచారం అందిందని, తక్షణమే ఫోన్ను వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఇవ్వాలని ఆదేశిస్తారు. పొరపాటున నొక్కారా.. లేక ఆపదలో ఉన్నారా.. డ్రైవర్ దురుద్దేశంతో ఏదైనా కావాలని రూటు మార్చి వెళుతున్నాడా.. అని ప్రయాణికులనే నేరుగా కనుక్కుంటారు. డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దగ్గర్లోని పోలీసుస్టేషన్కు కమాండ్ కంట్రోల్ రూము నుంచే సమాచారం అందుతుంది. జీపీఎస్ లోకేషన్ ట్రాకింగ్ ద్వారా బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఆపేసి... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అభయం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్లను రద్దు చేసిందని తెలుస్తోంది. అధికారంలో వచ్చి రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పించే ఇలాంటి ప్రాజెక్టును కనీసం పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంట్రాక్ట్ సంగతి దేవుడికెరుక.. ఇప్పుడున్న రవాణాశాఖ అధికారులకు ఈ పథకం గురించి కూడా అవగాహన లేదంటే ప్రభుత్వ పనితీకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 40వేలకుపైగా ఆటోలు ఉన్నాయి. వాటిలో 20 వేల ఆటోలకు అభయం మిషన్లు ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిషన్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలో అప్పుడు అధికారులు నెలల వ్యవధిలో 2 వేలకుపైగా మిషన్లు ఏర్పాటు చేశారు. తొలుత గుంటూరు, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తిగా సఫలం కావటంతో ప్రతి ఆటోలో బిగించేలా దృష్టి సారించారు. అనంతరం ఎన్నికలు రావటంతో ఆ అభయం ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ విషయాన్నే గాలికి వదలేసింది. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని విధానాలతో ప్రాజెక్ట్ కొండెక్కింది. -
లిఫ్టర్లకు మంత్రి మనోహర్ అభినందన
తెనాలి: చైనాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాలను సాధించిన స్థానిక కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన మంత్రి, అంతర్జాతీయ పతకాలను సాధించిన ఈఎల్ వినయశ్రీ, ఎం.షానూన్ను అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అకాడమీ కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, శివరామకిరణ్ రాజులు క్రీడాకారిణుల ప్రతిభను, సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. సత్తెనపల్లి: విత్తన దుకాణదారులు ప్రతి దుకాణంలోనూ ధరల పట్టిక, విత్తన నిల్వల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా విత్తన అమ్మకాల బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న విత్తన అధీకృత డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు పంట విత్తన కాలం మొత్తం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామాలలో గుడ్డ సంచుల్లో, ప్యాకింగ్ లేని విత్తనాలు అమ్మకాలు జరిపినట్లయితే సమచారం వ్యవసాయశాఖ అఽధికారులకు తెలియజేయాలన్నారు. తనిఖీల్లో సత్తెనపల్లి సబ్డివిజన్ సహాయ వ్యవసాయసంచాలకులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల విద్యాశాఖాధికారి బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యడ్లపాడు: చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కొండవీడు కోటపై మరో అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటపై దాదాపు 700 ఏళ్ల క్రితం నిర్మితమై, కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన షాహీ జుమ్మా మసీదులో ఈ శుక్రవారం సామూహిక జుమ్మా నమాజ్ నిర్వహించనున్నట్లు గుంటూరు నౌ అవర్ హిస్టరీ సంస్థ అధ్యక్షులు, మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్ వెల్లడించారు. ఒకప్పుడు రాజుల కాలంలో వైభవంగా వెలిగిన ఈ మసీదుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దీని చారిత్రక ప్రాధాన్యతను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అరబిక్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన ప్రముఖ పండితులు డాక్టర్ మొహమ్మద్ ఇస్తాక్ నద్వీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం టీచింగ్ ఆస్పత్రిలో ఎంఆర్డీ ఎంతో కీలకమని చెప్పారు. జనన మరణాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో ఎంఆర్డీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ యడ్లపాటి అశోక్కుమార్, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని హాయ్లాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళగిరి రూరల్ పోలీసులకు స్థానికులు గురువారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి వివరాలు లభించలేదు. బహుశా వడదెబ్బవల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, నలుపురంగు గీతలు కలిగిన ప్యాంటు, తెలుపు, ఆకుపచ్చ గళ్ల చొక్క, గెడ్డం ఉన్నాయని, మృతుడి వయస్సు సుమారు 30–35 ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే మంగళగిరి రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
ఉద్యో‘గాల’మేస్తారు
చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్న యువత తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆన్లైన్లో ఉన్న వివిధ జాబ్ పోర్టల్స్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్తో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. విదేశాలలో ఉద్యోగాలంటూ వీసా, వర్క్ పర్మిట్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు రూ.లక్షలు తీసుకొని ఫేక్ జాయినింగ్ లెటర్లు అందజేసి ఉడాయిస్తున్నారు.సాక్షి, నరసరావుపేట: ‘మంచి ఉద్యోగం.. భవిష్యత్తు బంగారం.. ఆలోచిస్తే నీకే నష్టం.. ఇది ఖర్చు కాదు పెట్టుబడి.. నీవు కాదంటే చెప్పు.. నీకంటే డబుల్ ఇచ్చేవాళ్లు సిద్ధంగా ఉన్నారు..’ ఇవీ నిరుద్యోగులను బుట్టలో వేసుకునేందుకు మోసగాళ్లు చెప్పే బురిడీ మాటలు. వీరి మాటల్లో పడి, వారు చూపే ఆశలకు లొంగి వందలాది మంది యువత, తల్లిదండ్రులు డబ్బులు చెల్లించి నిలువునా మోసపోతున్నారు. తీరా చూస్తే ఉద్యోగం రాక, ఇచ్చిన నగదు వెనక్కి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఉద్యోగం సాధించలేకపోగా ఇలా డబ్బులు పోగొట్టుకున్నారని సమాజంలో తెలిస్తే పరవుపోతుందని మోసపోయినా ఏం చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఏడాది కాలంలో 66 ఫిర్యాదులు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు 66 మంది ఉద్యోగాల పేరిట మోసపోయామని ఫిర్యాదులు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల, చిలకలూరిపేట రూరల్, నరసరావుపేట రూరల్, నరసరావుపేట టూటౌన్, పిడుగురాళ్ల స్టేషన్ల పరిధిలో ఎక్కవగా జాబ్ పేరిట మోసాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కష్టాన్ని నమ్ముకొని నైపుణ్యం పెంచుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని, దళారుల మాటలకు మోసపోవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. టాస్కులు సైతం అప్పగిస్తూ.. కేటుగాళ్లు మరొక అడుగు ముందుకేసి ఉద్యోగాలు వచ్చినట్టు నమ్మించి కొన్ని టాస్క్లు అప్పగించి వారితో పనిచేయిస్తున్నారు. తొలుత చిన్న మొత్తంలో నగదు జమ చేసి మరింత పెద్ద ఉద్యోగం కోసమంటూ భారీ స్థాయిలో నగదు తీసుకుంటున్నారు. బంధుమిత్రులను చేర్పిస్తే కమీషన్ అంటూ ఆశచూపి మరింత మందిని మోసం చేసి ఫోన్లు, వెబ్సైట్లను నిలిపేసి జెండా ఎత్తేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలబారిన పడిన వారు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వారం వారం వస్తుంటారు. సైబర్ నేరాల బారిన పడ్డామనే అనుమానం రాగానే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా కంపెనీ ఉద్యోగం ఇచ్చేముందు నగదు చెల్లించమని అడగదన్న విషయాన్ని మొదట నిరుద్యోగులు గుర్తిస్తే మోసం పోయే అవకాశముండదని హెచ్చరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... పిడుగురాళ్లకు చెందిన ఓ యువకుడు చదువుపూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.5లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఎంతకు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని డబ్బులు అడగ్గా ఏవేవో చెప్పి చివరకు చెక్కులపై సంతకం చేసి ఇచ్చాడు. బ్యాంక్కు వెళ్లి చూస్తే వాటిలో డబ్బులు లేవని తేలింది. నిందితుడు నుంచి డబ్బులు వచ్చేలా చూడమని, ఇప్పటికే మూడుసార్లు పోలీసుల చుట్టూ తిరిగానని న్యాయం చేయలేదని పోలీసు పీజీ ఆర్ఎస్లో ఎస్పీని కలసి విన్నవించాడు. -
వెంకటేశ్వరరావుది ముమ్మాటికీ టీడీపీ హత్యే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ ఇన్చార్జ్ బలసాని గుంటూరు రూరల్: కారంపూడిపాడుకు చెందిన సందు వెంకటేశ్వరరావుది కేవలం టీడీపీ నాయకులు చేసిన హత్యేనని కావాలని పింఛన్ నిలిపివేసి అ తనికి వైద్యం అందకుండా చేసి టీడీపీ నాయకులు హత్య చేశా రని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు ధ్వజమెత్తారు. గురువారం వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో సందు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘటన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదని కక్షగట్టిన నాయకులు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు దివ్యాంగులకు, ఒక డయాలసిస్ పేషెంట్కు, ఇద్దరు వృద్ధులకు పింఛను తొలగించాలని ఫిర్యాదు చేయగా రెండు నెలలుగా పింఛన్ నిలిపేశారన్నారు. టీడీపీ కుట్రకు నిండు ప్రాణం బలి మృతుడు వెంకటేశ్వరరావు తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కొడుకును బతికించుకునేందుకు స్థానికంగా ఉన్న రైస్మిల్లులో రోజువారీ కూలీగా పనిచేసేదన్నారు. వచ్చి న కొద్దిపాటి నగదుతో కొడుకును, కుటుంబాన్ని పోషించుకునేందని తెలిపారు. వెంకటేశ్వరరావుకు 2018 నుంచి డయాలసిస్కోసం పింఛన్ మంజూరై పింఛన్ వస్తూ ఉండేదని తెలిపారు. ఆ వచ్చే పింఛన్తో వైద్యం చేయించుకుంటూ ఉండేవాడ న్నారు. 2019లో తనకు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపార ని, అప్పటినుంచి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ బతుకుతు న్నాడన్నారు. రెండు నెలలుగా పింఛన్ నిలిపివేయటంతో కనీసం చార్జీలకు కూడా డబ్బులేక ప్రభుత్వాసుపత్రిలో సమయానికి డయాలసిస్ చేయక ప్రాణాలు కోల్పోయాడన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనే ఒకే ఒక్క కారణంతో స్థానిక టీడీపీ సర్పంచ్ చేసిన కుట్రకు ఒక నిండు ప్రాణం బలైందన్నారు. టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు తిరిగి అతని ప్రాణాలు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికార దాహానికి ఎందరి ప్రాణాలు బలితీసుకుంటారని ప్రశ్నించారు. బతిమాలినా కనికరించలేదు.. నియోజకవర్గం ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే అనుమానంతో కారంపూడి గ్రామ టీడీపీ నాయకుడు టి. శ్రీనివాసరావు, కొండపల్లి అంకమ్మరావు, సంధు కృష్ణయ్య, సంధు వెంకటేశ్వరరావు, తోటకూర రామారావు, మాదాసు సాంబయ్య, కొండపల్లి వెంకటసుబ్బారావులు మృతుడు వెంకటేశ్వరరావు అక్రమంగా పింఛను పొందుతున్నాడని గత నెల 29న ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వరరావు బంధువులు టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు వద్దకు వెళ్లి కిడ్నీలు పాడైపోయి ఇబ్బందులు పడుతున్న విషయం చెప్పి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. కావాలని టీడీపీ నాయకులు చేసిన కుట్రకు ఒక నిరుపేద కుటుంబం నేడు రోడ్డున పడిందన్నారు. వెంకటేశ్వరరావు మృతికి కారణమైన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పింఛన్ నిలిపేసిన ఆరుగురికి మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్చేశారు. మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్యం
మాతా–శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్లో గురువారం ప్రారంభమైన శస్త్ర చికిత్సలు గుంటూరు మెడికల్:రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి లో ఒకే భవనంలో మహిళలు, గర్భిణులు, శిశువులు, పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.127 కోట్ల వ్యయంతో 600 పడకలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డాక్టర్ కానూరి–జింఖానా ’మాతా శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్ ’లో మహిళల మాతృత్వానికి సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన శస్త్ర చికిత్సల కోసం సిద్ధం చేసిన ఏడు ఆపరేషన్ థియేటర్లు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. తొలి రోజు (గురువారం)) రెండు ఆపరేషన్లు జరిగాయని, ఇవి కాకుండా శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశామన్నారు. ఎక్విప్మెంట్స్ పనితీరు గమనించడం పూర్తి కావడంతో అత్యాధునిక సౌకర్యాల మధ్య శస్త్ర చికిత్సలు మొదలయ్యాయి. శిశు సంరక్షణలో కీలకంగా వ్యవహరించే ‘టోటల్ బాడీ కూలింగ్’, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు వంటి అత్యాధునిక సదుపాయలు ఈ బ్లాక్ లో కల్పించారు. ఐదు అంతస్తుల్లో 600 పడకల్లో 300 గైనిక్, 120 నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు కలిగిన చిన్నారుల కోసం 180 చొప్పున పడకలు కేటాయించారు. నిర్మాణాలకు రూ.100 కోట్లను జింఖానా వారు వ్యయం చేయగా మిగిలిన రూ. 27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ వెల్లడించారు. ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు,ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 60 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్స్ ప్రస్తుతం గైనిక్ విధుల్లో ఉన్నారని తెలిపారు. అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు గాలి పీల్చుకునే విధంగా హై ప్రిక్వెన్సీ వెంటిలేటర్లు 10 వరకు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు పేగులో చేరే వ్యర్థం ద్వారా శ్వాశ పీల్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ’నైట్రిక్ ఆకై ్సడ్’ (వాయువు) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ దేవకుమార్ తెలిపారు. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
ఐలవరం(భట్టిప్రోలు): జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాపట్లలో జనవరి తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వి.హరికృష్ణ, ఎం.రోహిత్ నాగసాయి మణికంఠ, పి.విజయ్కుమార్రెడ్డి, సీహెచ్ డోలా పూర్ణచంద్ దినేష్ విశేష ప్రతిభ కనబరచి శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు మార్టూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యరు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఎం. మోహన్రావు, ప్రస్తుత ఇన్చార్జి హెచ్ఎం చిలుకోటి తాండవకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ బాబు, గ్రామ మాజీ సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
సామాజిక రుగ్మతల నిర్మూలనలో నాటికల పాత్ర అమోఘం
నాదెండ్ల: టీవీ, సినిమారంగం రాకమునుపు నాటకాలు, నాటికలే ప్రజలకు వినోదాన్ని అందించటమేకాక, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలనలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు బుధవారం కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తున్న సాతులూరు గ్రామస్తులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సాతులూరు గ్రామం కళలకు పెట్టింది పేరన్నారు. రంగస్థల కళలను బతికించేందుకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆకట్టుకున్న నాటికలు... హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉదయ భాగవతుల రచన, దర్శకత్వంలో సీ్త్ర మాత్రే నమః నాటిక ఆకట్టుకుంది. విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి కత్తి శ్యామ్ప్రసాద్ దర్శకత్వంలో, పి.టి. మాధవ్ రచించిన చెరిగిపోని చిరునామా, గుంటూరు శ్రీకరణం సురేష్ మోమోరియల్ థియేటర్స్ వారి రామకృష్ణ బొమ్మిది రచనా దర్శకత్వంలో ప్రదర్శించిన తరమెల్లి పోతున్నదో నాటిక ఆకట్టుకున్నాయి. అనంతరం పత్తిపాటి భార్గవి బృందంచే నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, ముత్తవరపు సురేష్, సినీనటి మౌనికచౌదరి, మాజీ సర్పంగ్ గొట్టిపాటి వెంకటరమణ, నడింపల్లి వెంకటేశ్వరరావు, బండారుపల్లి రామారావు, గొట్టిపాటి రామారావు, డాక్టర్ శాఖమూరి బాజి, కొల్లి బ్రహ్మయ్య, ప్రముఖ న్యాయవాది కట్టా వరలక్ష్మీ, బండారుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోండి
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: అగ్నిప్రమాద బాధితులు ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి బర్న్ సర్వైవర్ మిషన్ – సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలను ఉచితంగా హైదరాబాద్లో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తద్వారా బాధితులకు పునర్జన్మ, మెరుగైన జీవనం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల సర్జరీలు చేయించుకోలేని బాధితులకు ఒక అద్భుత అవకాశమని వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా బాధితులకు వైద్యసహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో తమ రెండు సంస్థలు కలసి మరింత విస్తృతంగా సామాజిక బాధ్యతలను చేపట్టనున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలితో కలసి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలు మే 28 నుండి జూన్ 2 వరకు జరుగుతాయని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలు, పేర్ల నమోదు కోసం 7816079234ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ కరపత్రాలను ఆవిష్కరించారు. -
దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు
పొన్నూరు: మండలంలోని మామిళ్లపల్లి గ్రామ మొక్కజొన్న రైతులు, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో అడ్డగించి దౌర్జన్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 23వ తేదీన మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్న సమయంలో తొట్టెంపూడి గ్రామ సమీపంలో పొన్నూరు రూరల్ ఎస్ఐ వి.శ్రీహరి, సీఐ పి.కృష్ణయ్యతో పాటు కొందరు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ కృష్ణయ్య దురుసుగా ప్రవర్తించి పోలీసు జీపులోకి వస్తువును పడేసినట్లుగా నెట్టి, నా మెడపై మోచేతితో పొడిచి ఇబ్బంది పెట్టారని చెప్పారు. కారణం చెప్పకుండానే బలవంతంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి దుర్భాషలాడుతూ గంటన్నర పాటు పోలీస్ స్టేషన్లో బంధించారని వివరించారు. మళ్లీ బలవంతంగా అక్కడి నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని పేర్కొన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబుతో పాటు నాయకులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మళ్లీ పోలీసు స్టేషన్లో కూడా తనతో దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గౌరవానికి భంగం కలిగించి దౌర్జన్యం చేసి అక్రమంగా నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీట నాగమోహన కృష్ణ, ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. వరికూటి అశోక్ బాబు, పార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ -
బాలికపై దాడి.. కేసు నమోదు
అమరావతి: మద్యం మత్తులో ఓ బాలుడు బాలికపై దాడి చేసిన ఘటన అమరావతి గ్రామంలోని పల్లపు వీధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లె గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మత్తులో ఉండి బుధవారం రాత్రి పల్లపువీధిలో ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో బాలికకు పలుచోట్ల గాయాలు కావటంతో స్థానికులు మైనర్ బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలిక స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్లో చికిత్స పొందుతుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.అచ్చియ్య తెలిపారు. తాడికొండ: తాడికొండ మండలం ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావుకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టారనే ఆరోపణలతో మంగళవారం వెనిగండ్లలోని నివాసంలో చిన్ని రామారావును పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చేబ్రోలు: కొద్ది రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలం వడ్లమూడి యాదవపాలేనికి చెందిన తోట బసవమ్మ(104) మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు బసవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వంద సంవత్సరాలు దాటినప్పటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. స్థానిక పెద్దలు, బంధువులు మృతదేహానికి నివాళులర్పించారు. నగరంపాలెం: ఉమ్మడి జిల్లాలోని విత్తన దుకాణాల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల తనిఖీలు బుధవారం కొనసాగాయి. గుంటూరు ప్రాంతీయ విజిలెన్న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ నేతృత్వంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నుతల గ్రామంలోని మెస్సర్స్ కర్షక్ క్రాప్ సన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్, ప్రాసెసింగ్ సీడ్ రిజిస్టర్ నిర్వహించకపోవడం, అలాగే విత్తనాలకు సంబంధించి ఇన్వాయిస్లు, సోర్స్ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. దీంతో రూ.45.88 లక్షల విలువ చేసే 11,677.5 కిలోల సూపర్–10 (మిరప), ఎర్ర మిరప, రెమినెంట్ విత్తనాల విక్రయాలు నిలిపివేస్తూ నోటీసులు జారీచేశారు. కొరిటెపాడు (గుంటూరు): ప్రస్తుతం వీస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపడినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన వెంటనే గుంటూరు విద్యుత్ శాఖకు తెలియజేయాలని ఆ శాఖ ఆపరేషన్ డివిజన్ టౌన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పీహెచ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం గుంటూరు డివిజన్ కార్యాలయంలో 9440817527 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ టోల్ నెంబర్లో విద్యుత్ సిబ్బంది నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించి సమస్యను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేస్తున్నారని వెల్లడించారు. విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని ముట్టుకోకుండా వెంటనే శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనవసరపు ఆందోళనకు గురి కావద్దని, సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పల్నాడు
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026సర్దిద్దేందుకు సన్నాహాలుజాతీయ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలో ఓటరు జాబితా పక్కాగా రూపొందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓటరు జాబితా ప్రకారం బీఎల్వోలు వారి పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ వెళ్లి నేరుగా పరిశీలన చేయనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి నిర్దేశిత కార్యక్రమాలను అధికారులు రూపొందించారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఓటరు జాబితాలోని ప్రతి ఓటరును కలిసేందుకు సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 17,41,512 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఎవరికి వారు తాము ఓటర్లుగా ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోలేని వారి పేరును జాబితా నుంచి తొలగిస్తారు. ఎలా రుజువు చేసుకోవాలి...? ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారంలను ఇస్తుంది. వాటిని పూరించి ఎన్నికల సంఘానికి ఒకటి ఇచ్చి, రెండోది ఓటరు వద్దే ఉంచుకోవాలి. ఎన్నికల అధికారులకు ఫారం ఇవ్వకపోతే పేరు జాబితా నుంచి తొలగిస్తారు. గతంలో ఓటరు తన గుర్తింపు కోసం ఆధార్, ఓటరు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఫొటో తదితరాలను ఇచ్చేవారు. సర్లో ఎన్యుమరేషన్ ఫారం – 2 ఇవ్వడమే ప్రత్యేకం. తద్వారా మృతుల పేర్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది. వలస వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించనున్నారు. ఒక వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అక్రమ మార్గాల ద్వారా ఓటరుగా నమోదై ఉంటే ఈ ప్రక్రియతో తొలగించడం సులభం అవుతుందని, ప్రతి ఓటరూ దీనికి సహకరించాలని ఎన్నికల సంఘం కోరింది. షెడ్యూల్ ఇదే... 7జిల్లాలో నియోజకవర్గాలవారీగా ఓటర్ల్ల వివరాలు నియోజకవర్గం ఓటర్ల సంఖ్య నరసరావుపేట 2,33,723 చిలకలూరిపేట 2,26,910 సత్తెనపల్లి 2,42,991 పెదకూరపాడు 2,34,049 వినుకొండ 2,65,990 గురజాల 2,75,061 మాచర్ల 2,62,788 మొత్తం 17,41,512 -
త్రిచక్రవాహనం అదుపుతప్పి దివ్యాంగుడు మృతి
చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన సయ్యద్ దరియా హుస్సేన్(56) దివ్యాంగుడు. ఈనెల 23వ తేదీన మూడు చక్రాల స్కూటీపై కూరగాయల నిమిత్తం చిలకలూరిపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పింది. దీంతో స్కూటీపై నుంచి కిందపడిన హుస్సేన్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించగా, గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు సయ్యద్ బుడే ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ జి.అనిల్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. -
సమానత్వాన్ని చాటే బక్రీద్ పండుగ
యడ్లపాడు: ఇస్లాంలో ఖురాన్ ప్రకారం ముస్లింలకు అతిముఖ్యమైన పండగ బక్రీద్ (ఈద్–ఉల్–అజ్హా). హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జులహజ్జ 12వ నెల 10వ రోజున ముస్లింలు బక్రీద్ జరుపుకొంటారు. ఈ పండుగ వెనుక త్యాగ చరిత్ర ఉంది. ఇబ్రహీం ప్రవక్తకు తన ఎనభయ్యో ఏట అల్లాహ్ ప్రసాదించిన ఏకై క కుమారుడు ఇస్మాయిల్. కొడుకును దైవానికి బలి ఇస్తున్నట్లు ఇబ్రహీంకు కల వస్తుంది. దాన్ని దైవాజ్ఞగా భావించి తనయుడితో సంప్రదిస్తాడు. దైవకార్యానికి తాను సిద్ధమని ఆ కుమారుడు చెబుతాడు. ప్రేమపాశం ఎక్కడ అడ్డుపడుతుందోనని తండ్రి కళ్లకు గంతలు కట్టుకుని కుమారుడి గొంతుపై కత్తి పెట్టవలసి వస్తుంది. మూడుసార్లు ప్రయత్నించినా ఆ ఖడ్గం బాలుడిని ఏమీ చేయలేకపోయింది. అసహనంతో ఇబ్రహీం ఆ కత్తిని పక్కకు విసరగా, అది ఒక రాతి గుండును తాకి రెండు ముక్కలు చేసింది. ఆ క్షణంలోనే దైవదూత జిబ్రాయిల్ ప్రత్యక్షమై, ఇబ్రహీం విశ్వాస పరీక్షలో నెగ్గాడని ప్రకటించినట్లు ముస్లింల నమ్మకం. ఇస్మాయిల్ స్థానంలో స్వర్గం నుంచి తెచ్చిన ఒక బలమైన పొట్టేలు (దుంబా) ప్రత్యక్షమైంది. కుమారుడికి బదులుగా ఆ పొట్టేలును బలి ఇవ్వడమే ఖుర్బానీగా నిలిచింది. నాటి తండ్రీకొడుకుల అచంచల విశ్వాసానికి, త్యాగనిరతికి ప్రతీకగా ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తారతమ్యాలు లేకుండా... ఇస్లాంలోని పంచసూత్రాలైన అల్లాహ్పై విశ్వాసం(ఇమాన్), ప్రార్థన(నమాజ్), ఉపవాసం(రోజా), దానం(జకాత్, మక్కాయాత్ర(హజ్) ఆచరించేందుకు పరితపిస్తారు. స్తోమత ఉన్నవారు మక్కా వెళ్లి హజ్ ఆరాధనలో పాల్గొంటారు. లేనివారు స్థానికంగానే ఖుర్బానీ ఇస్తారు. ఇది మానవుల ఐక్యతను సూచిస్తుంది. ఎవరైనా ముస్లిం.. బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు, మరో దానిని బంధువులకు ఇవ్వాల్సి ఉంటుంది. పేద, ధనిక అనే తారతమ్యాలు లేని సమాజాన్ని స్థాపించడమే ఈ పండుగ మానవాళికి నేర్పే జీవన పాఠంగా ముస్లింలు భావిస్తారు. సాధారణంగా పండుగ అంటే పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. బక్రీద్ అంతరార్థం కొత్త బాధ్యతలను భుజానకెత్తుకోవడం. మానవత్వాన్ని ఎలా చాటి చెప్పాలో నేర్పిస్తోంది. ఆకలి లేని సమాజం కోసం ఒక మనిషి చేసే గొప్ప సంకల్పమే ఈ పండుగ అంతరార్థం. -
కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలి
గుంటూరు రూరల్: కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలైన సంఘటన రూరల్ మండలంలోని నాయుడుపేట అంబేడ్కర్ కాలనీలో చోటుచేసుకుంది. అక్రమ సంపాదన కోసం కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో చేస్తున్న 80 అడుగులకుపైగా లోతులో అక్రమ మైనింగ్ క్వారీ గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘఽటనల్లో ఇప్పటికే ఆరుగురు చిన్నారులు ప్రాణాలను విడిచారు. శుభకార్యానికి వచ్చి... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కటికల శిరీష, డేవిడ్లకు ముగ్గురు ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నాయుడుపేట అంబేడ్కర్ కాలనీలో బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం మంగళవారం వచ్చారు. చిన్నకుమారుడు ఆనంద్ (6) ఇంటి సమీపంలో సాయంత్రం ఆడుకుంటూ క్వారీ గుంతవైపు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమీపంలోని గజ ఈతగాళ్లకు సమాచారం అందించగా గంటకుపైగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా స్పందించకపోవడం, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంపై వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. నిండు ప్రాణం బలి తీసుకున్నారు అక్రమ మైనింగ్ వల్ల ఒక నిండు ప్రాణాన్ని కూటమి నేతలు బలి తీసుకున్నారని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ధ్వజమెత్తారు. చిన్నారి ఆనంద్ మృతి చెందడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. బాలుడి మృతి విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రలోభాలకు యత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పేరుతో అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ముఖ్య కారణమేన్నారు. బాలుడు కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని హెచ్చరించారు. బాలుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
పరారైన ఖైదీ కోసం ముమ్మర గాలింపు
సత్తెనపల్లి: సత్తెనపల్లి సబ్జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ పరారైన తమ్మినేని శ్రీనివాసరావు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. ఖైదీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం అందించవచ్చన్నారు. ఎక్కడ కనిపించినా వెంటనే 94407 96230 ఫోను నంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుంటూరు అరండల్పేట్లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ సీపీ మరింత బలోపేతంపై చర్చ
మాచర్ల రూరల్: రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయడంతోపాటు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలపై రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో బుధవారం ఆయన నివాసంలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) చర్చించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ప్రలోభపెట్టిన చంద్రబాబు గెలిచాక దారుణంగా మోసం చేశారని, చంద్రబాబు రెండేళ్ల పాలన అక్రమాలకు, అరాచకాలకు, అబద్ధాలకు, దోపిడీలకు పరిమితమైన నేపథ్యంలో దానిపై వారు చర్చించారు. ఎన్నికల ముందు 143 రకాల హామీలతో అధికారంలోకి వచ్చి నేడు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్ వంటి ప్రధాన హామీలను నెరవేర్చలేని పరిస్థితి నెలకొందని పీఆర్కే తెలిపారు. నిరుద్యోగులను మోసం చేస్తూ డీఎస్సీలోనూ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో ఆ విషయాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాల్సిన తీరుపై వారు చర్చించారు. ‘సర్’ పేరిట ఓటర్ జాబితా సవరణలో ప్రతి బూత్ ఏజెంటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లాలో చేపట్టనున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ సుబ్బారెడ్డితో సమావేశమైన పీఆర్కే -
సబ్సిడీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి డాక్టర్ వేణుగోపాల్ బాపట్లటౌన్: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణా, గడ్డి విత్తనాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మండలంలోని ఈతేరు గ్రామంలో బుధవారం పశుపోషకులకు సబ్సిడీపై అందిస్తున్న దాణా, గడ్డివిత్తనాలను పంపిణీ చేశారు. డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈతేరు గ్రామంలో 4 టన్నుల దాణా, 3 క్వింటాళ్ళ జొన్న విత్తనాలను అందజేశామన్నారు. బాపట్ల సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, పశు వైద్యాధికారిణి రేచెల్ దివ్య, స్పెషల్ ఆఫీసర్ శారద, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. పర్చూరు(చినగంజాం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పర్చూరు ఎస్ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. కారంచేడు నుంచి పర్చూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న తల్లీ కుమారుడు షేక్ నజీర్(36), షేక్ మీరాబీ (55)లను మంగళగిరి నుంచి చీరాల వైపు వెళుతున్న కారు ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మీరాబీ అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనం నడుపుతున్న నజీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోపి.. గాయాలపాలైన అతన్ని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జిల్లా విద్యాశాధికారి పీవీజే రామారావు పిడుగురాళ్ల: జిల్లాల్లో ఒక డ్రాప్ అవుట్ కూడా లేకుండా చూడాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే డ్రాపవట్లు లేని జిల్లాగా పల్నాడును నిలబెట్టాలన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సచివాయాల్లో డేటా తీసుకొని ప్రతి మండలాన్ని జల్లడి పట్టి డ్రాప్ అవుట్లు లేకుండా చూడాలని తెలిపారు. దీనిలో భాగంగానే బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇండియన్ మోడల్ హంట్ విజేతగా దివ్యశ్రీ..
కారంచేడు: ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఇండియన్ మోడల్ హంట్ విజేతగా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన కే దివ్యశ్రీ ఎంపికవ్వడం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుగ్రామమైన కుంకలమర్రులో వ్యవసాయ కుటుంబానికి చెందిన దివ్యశ్రీ చిన్నతనం నుంచే ఫ్యాషన్ షోలు, మోడలింగ్లపై మక్కువ ఉండేది.ఈ క్రమంలో చదువులతోపాటు మోడలింగ్లోను రాణిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ సిరియల్ ఆర్టిస్ట్గాను ఆమె రాణిస్తున్నారు. ఈ క్రమంలో మోడలింగ్ ఆకాడమీ డైరెక్టర్ సతీష్ అడ్డాల, దీక్షల ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జరిగిన ఇండియన్ మోడల్ హంట్ సీజన్–4లో పాల్గొన్న దివ్యశ్రీ తన ప్రతిభ కనబరిచి ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించారు.దేశవ్యాప్తంగా వందల మంది పాల్గొనగా ఫైనల్కు కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. వారిలో తనను ఎంపిక చేసిన డైరెక్టర్ సతీస్ అడ్డాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దివ్యశ్రీ తల్లిదండ్రులైన కనపర్తి రాములు, జ్యోతి, గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అక్షరాస్యతలో పల్నాడును అగ్రస్థానంలో నిలుపుదాం
నరసరావుపేట: పల్నాడు జిల్లాను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అన్నీ శాఖలు కలిసికట్టుగా కృషిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో ’అక్షర ఆంధ్ర–ఉల్లాస్’ కార్యక్రమం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించగలమని అన్నారు. ఈ ఏడాదికి మొత్తం 1,39,168 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. జిల్లా ప్రగతికి నిరక్షరాస్యత ఒక పెద్ద అవరోధంగా మారిందని, దీనిని అధిగమించేందుకు స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన ప్రతి మహిళను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా మార్చేందుకు మెప్మా, డ్వామా, డీఆర్డీఏ శాఖల సహాయ సహకారాలు కావాలన్నారు. అక్షర ఆంధ్ర – ఉల్లాస్ కార్యక్రమం నిరక్షరాస్యులకు ఒక గొప్ప సువర్ణావకాశమని, జూలై 7వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఉల్లాస్ అక్షర ఆంధ్ర తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మెప్మా పీడీ మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీపీఓ నాగేశ్వర నాయక్, డీఆర్డీఏ ఏపీడీ రాంబాబు, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి గోపి, సీపీఓ రాజు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నారదముని -
శేకూరు చానెల్ పునరుద్ధరణ పనుల పరిశీలన
శేకూరు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శేకూరు చానెల్ పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం మంగళవారం పరిశీలించారు. జలధార–జలహారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా తక్కువగా ఉన్న గ్రామాల్లో శేకూరు ఒకటి. ఇంకుడు గుంతల ఏర్పాటుకు అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించి పనులు చేపట్టేలా చూడాలన్నారు. వర్షాకాలం నాటికి జిల్లాలో గుర్తించి చేపడుతున్న చెరువు పనులను పూర్తి చేసి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నృసింహుని ఆలయంలో ‘ఆక్టోపస్’ మాక్డ్రిల్ మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులను ఏవిధంగా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఉగ్రవాదులు ఆలయంలోని జొరబడితే ఎంత వేగంగా వారిని అదుపులోకి తీసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. కమాండోలు ఉగ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కె. రామచంద్రమూర్తి, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శివాజీ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని మంగళవారం తెలిపారు. మంగళగిరి పట్టణ పరిధిలోని వారి కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈనెల 15 –20వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో క్రీడాకారులు బి.లిఖిత, వినయశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లిఖిత, వినయశ్రీలతోపాటు చైనాలో జరిగిన ఏషియన్ సబ్జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన షానూన్ను కూడా అభినందించారు. సంఘం కోశాధికారి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చంద్రిక, భాస్కరరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి: జీవిత ఖైదీ పరారైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలులో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు అరండల్పేటలో గతంలో జరిగిన హత్య కేసులో తమ్మినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్నాడు. అతడు నెల్లూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని సత్ప్రవర్తనతో నెల్లూరు జైలు నుంచి ఓపెన్ జైలులో భాగంగా సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. సత్తెనపల్లిలోని సబ్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పరారయ్యాడు. దీనిపై సబ్జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
గంజాయి ముఠా అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు): గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుగ్గిరాల పీఎస్ పరిధిలో రెండు వారాల క్రితం మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్లతో గంజాయి వినియోగదారులైన గండికోట నాగేంద్ర, కోటేశ్వరరావులకు పరీక్షలు చేయించారని చెప్పారు. వారిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైందన్నారు. దీంతో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి నేతృత్వంలో ఇద్దరిని విచారించగా, మొత్తం 12 మంది ఉన్నారని వెల్లడైందని అన్నారు. ఐదుగురు గంజాయి తాగి, విక్రయాలు, సరఫరా చేసేవారని, మిగతా ఏడుగురు తాగేవారని చెప్పారు. ఈ క్రమంలో 12 మందిని దుగ్గిరాల లాకుల వద్ద అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దుగ్గిరాల బంగ్లా సెంటర్లో ఉంటున్న దగ్గుబాటి రాజశేఖర్ అలియాస్ చంటిపై దుగ్గిరాల, తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి కేసులు, ఎన్బీడబ్ల్యూ పెండింగ్లో ఉందన్నారు. పంజగల మునీంద్ర, షేక్నాగూర్బాబు (తెనాలి, పాండురంగపేట)పై తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి, పేకాట, చోరీ కేసులు, ఏమినేని లక్ష్మీనారాయణపై దుగ్గిరాల పీఎస్లో రౌడీషీట్, గంజాయి కేసు, విజయవాడ రెండో పట్టణ పీఎస్లో దోపిడీ కేసులున్నాయని చెప్పారు. యార్లగడ్డ శశాంక్, గంజాయి వినియోగదారులైన వట్టిప్రోలు చక్రవర్తి(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), ప్రస్తుతం పెదకాకాని నంబూరు గ్రామంలో ఉంటున్న ఈమని గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), గండికోట నాగేంద్రబాబు, జముడుగాని కోటేశ్వరరావు అలియాస్ సత్తిపండు(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), తెనాలి చినరావూరుకి చెందిన షేక్ నజీముద్దీన్ అలియాస్ నయూం, పఠాన్ ఇస్మాయిల్, కుందర చందులను అరెస్ట్ చేశారని అన్నారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయి, రూ.2 వేలు, మోటారు సైకిల్ సీజ్ చేశారని చెప్పారు. దగ్గుబాటి రాజశేఖర్ ఒడిశాలోని కోరాపుట్ వెళ్లి గంజాయి కొనుగోలు చేసేవాడని అన్నారు. తద్వారా మునీంద్ర, నాగూర్బాబు, లక్ష్మీనారాయణ, శశాంక్లకు విక్రయించేవారు. వీరు గంజాయి తాగి, దుగ్గిరాల, ఈమని, రేవేంద్రపాడు గ్రామాల్లో యువకులకు విక్రయించేవారు. విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. కేసు ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ ఎస్.వెంకటరవి, హెచ్సీ ఎం.కోటేశ్వరావు, కానిస్టేబుళ్లు డి.మరియకుమార్, అబ్దుల్ఫరీద్, కె.విజయ్ కుమార్, వై.సాంబయ్య, హోంగార్డు షేక్ సైదాలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. -
ఈదురు గాలులకు చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి
దమ్మాలపాడు(ముప్పాళ్ళ): గేదెలు తోలుకొని పొలానికి వెళ్లిన దివ్యాంగుడు వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళ్లగా ఈదురుగాలులకు చెట్టు విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జక్కిరెడ్డి కోటిరెడ్డి(53) పుట్టుకతోనే బదిరుడు. సోమవారం గేదెలు తోలుకొని గ్రామంలోని పడమర వైపు పొలాలకు వెళ్లాడు. సాయంత్రానికి అకస్మాత్తుగా మబ్బులతో పాటుగా చిరుజల్లులు కురుస్తుండటంతో తడవకుండా ఉండేందుకు గాను చెట్టుకిందకు వెళ్లాడు. పెద్ద పెద్ద ఈదురుగాలులకు చెట్టు విరిగి కోటిరెడ్డిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చీకటి పడిన తర్వాత గేదెలు ఇంటికి వచ్చినప్పటికీ కోటిరెడ్డి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతుకులాట చేపట్టగా చెట్టుకింద మృతి చెంది ఉండటాన్ని గమనించి ఇంటికి తీసుకొచ్చారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బేస్బాల్ టోర్నీలో రాష్ట్ర జట్లు ముందంజ రొంపిచర్ల: భువనేశ్వర్లో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ నేషనల్ బేస్బాల్ టోర్నమెంట్లో రాష్ట్ర బాలికల, బాలుర జట్లు క్వార్టర్ ఫైనల్కి చేరాయని రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సైదయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర జట్టు కేరళం మీద 6–3 తేడాతో, మధ్యప్రదేశ్ మీద 7–3 తేడాతో విజయం సాగించగా, బాలికల జట్టు రాజస్థాన్ జట్టుపై 10–0, పశ్చిమ బెంగాల్ జట్టుపై 15–0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాయన్నారు. బాలుర జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండగా, బాలికల జట్టులో 13 మంది ఉన్నారు. భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్ దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రాజేష్ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్ జాన్బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్ చెప్పారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్ ముప్పాళ్ళ: ద్విచక్రవాహనం పై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యచేయబోయిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నిర్దేశిత గడువులోగా రెవెన్యూ సేవలు పూర్తి
సీసీఎల్ఏ సమీక్ష సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నరసరావుపేట: జిల్లాలో రీసర్వే పనులు, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, ఈ–కేవైసీ ప్రక్రియ, వెబ్ల్యాండ్ పోర్టింగ్, రెవెన్యూ వన్ డిజిటౖలైజేషన్ కార్యక్రమాలను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్ష్మి నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో పెండింగ్లో ఉన్న అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనులు పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసు, ఫీల్డ్ హాజరు, 9(2) నోటీసు, డ్రాఫ్ట్ పట్టాదారు పాస్బుక్ ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని అధికారులను ఆదేశించారు. -
బాబోయ్... భాష్యం!
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెదకూరపాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మిగిలిన నియోజకవర్గాలలోని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్మీడియా యాక్టివిస్టులపై కక్షకట్టి దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే పెదకూరపాడులో మాత్రం వీరితోపాటు ఏకంగా అధికార తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై ముసుగు దాడులు జరుగుతున్నాయి.వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఇలా ప్రశ్నించిన వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేయడం ఆ నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. నెలలు గడుస్తున్నా పోలీసులు సైతం దాడులు చేసింది ఎవరో కనిపెట్టలేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తన ప్రతాపం ప్రస్తుతం ప్రభుత్వ అధికారులపై చూపుతున్నారు. దీంతో బాబోయ్ మేం ఈ నియోజకవర్గంలో పనిచేయలేపోతున్నామని పారిపోతున్నారు.ఏఈకి బెదిరింపులు...అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో గత 18 ఏళ్లుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ తాళ్లూరి లక్ష్మీనారాయణ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. సొంత పొలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 20 లీటర్ల నీటిని కేవలం రూ.3 నుంచి సరఫరా చేయడం ప్రారంభించి ప్రస్తుతం రూ.5కే అందజేస్తూ సొంత గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే సదరు తాళ్లూరి లక్ష్మీనారాయణ కుటుంబం సొంత పార్టీకే చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కక్ష కట్టారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది.ఇందులో భాగంగా వాటర్ ప్లాంట్ మూతకు అధికారుల నుంచి ఒత్తిడి తెచ్చారు. వాటర్ ప్లాంట్ మూసివేస్తున్నారన్న విషయం తెలిసి అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు భాష్యం ప్రవీణ్కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. తనకు జరుగుతున్న అన్యాయం గురించి తాళ్లూరి లక్ష్మీనారాయణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యాలయం, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు రాసిన ఉత్తరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ను కలచివేసింది.ఎలాగైనా వాటర్ ప్లాంట్కు మూత వేయాలని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారట. అయితే అప్పటికే తాళ్లూరి లక్ష్మీనారాయణ హైకోర్టుకు వెళ్లి వాటర్ ప్లాంట్ అడ్డుకోకుండా ఉత్తర్వులు తెచ్చుకోవడంతో తానేమీ చేయలేనని సదరు విద్యుత్ శాఖ ఏఈ చేతులెత్తేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే ప్రవీణ్ తాళ్లచెరువు పబ్లిక్ మీటింగ్లో ఏఈతో దురుసుగా ప్రవర్తించి బెదిరించారట. లంచం అడిగాడని కేసు నమోదు చేయిస్తానని అనడంతో కేసు పెడతారని భయపడిన ఏఈ ఆందోళన చెంది దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోకుండా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఎలా అని వారు వాపోతున్నారు.భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అయిన రోజు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన వర్గీయులు కొందరు షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. అచ్చంపేట మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అడ్డకునే ప్రయత్నం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మండల పరిధిలోని కృష్ణానదిపై నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్టు, పడవలను నడుపుతున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో బల్లకట్టు టెండర్ ముగిసింది.ఏప్రిల్ 8, మే 8వ తేదీలలో వేలంపాట నిర్వహించాలని జిల్లా పరిషత్ అధికారులు ప్రయత్నించినా స్థానిక టీడీపీ నేతలు వేలం పాట జరగకుండా అడ్డకొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారు. తాడువాయి, జింజుపల్లి, మాదిపాడు, చల్లకరిగ, కోగంటివారిపాలెం, పుట్లగూడెం తదితర ప్రాంతాల్లో నిత్యం నదిపై అనధికారికంగా పడవల నడిపి అధికారపార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. వీరి దోపిడీకి సహకరించని ప్రభుత్వ అధికారులపై కక్ష కట్టి ఇక్కడి నుంచి పంపేస్తున్నారు.అచ్చంపేట మండలంలో ఆరు నెలల క్రితం ఏకంగా 40 రోజుల్లో నలుగురు ఎమ్మార్వోలు మారారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజల మధ్యన ఉన్నామన్న విషయం మరచి చెప్పలేని పదాలతో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా పనిచేసేదని, ప్రభుత్వం కలుగచేసుకొని అధికారులపై ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. -
వడదెబ్బతో మాజీ సర్పంచ్ మృతి
రొంపిచర్ల: రొంపిచర్ల మాజీ సర్పంచ్ పడాల వెంకిరెడ్డి (82) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొద్దిరోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలకు అస్వస్థతకు గురై, వడదెబ్బ తగిలి నరసరావుపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ స్తంభంపై నుంచి పడి కార్మికుడు మృతి రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోనె గోపి (22)అనే కార్మికుడు విద్యుత్ లైన్ మరమ్మతుల సమయంలో స్తంభంపై నుంచి కిందపడి మృతి చెందాడు. రొంపిచర్లలోనీ రాజుల బజారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. గోపి విద్యుత్ స్తంభం మీద ఉండగా విద్యుత్ షాక్ భయంతో కిందపడి పోయాడు. కింద పడిన గోపి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గోపి జార్ఖండ్ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సత్తా చాటిన స్వర్ణ మైసూరు ఎడ్ల జత స్వర్ణ(కారంచేడు): రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు ఆకట్టుకున్నాయి. మండలంలోని స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా స్వర్ణ–దగ్గుబాడు రోడ్డులోని గ్రామ సచివాలయం (పార్కు) సమీపంలో రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల బండలాగుడు పందేలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన రామాంజనేయులుకి చెందిన మైసూర్ ఎడ్ల జత ఈ ఏడాది ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. పోటీల్లో 14 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా ఎండల కారణంగా కేవలం 10 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. మొదటి స్థానం పొందిన రామాంజనేయులు ఎడ్ల జత నిర్దేశించిన 15 నిమిషాల సమయంలో 2498 అడుగుల దూరం లాగి గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన మందుల నజీర్, మందుల ఖాజావలీలకు చెందిన ఎడ్ల జత 2400 అడుగుల దూరం లాగాయి. మూడో స్థానాన్ని కూడా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఉప్పు పండుకు చెందిన ఎడ్ల జత 2195 అడుగుల దూరం లాగాయి. నాలుగో బహుమతిని చీరాల–పేరాలకు చెందిన ఎడ్ల జత 2100 అడుగుల దూరం లాగాయి. విజేతల యజమానులకు ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన పగడాల బసవయ్య, సుబ్బారావులు రూ.20 వేలు, రెండో బహుమతిని రూ.15 వేలను కేళం శివరామకృష్ణప్రసాద్ అందించారు. మూడో బహుమతిని రూ.10 వేలు కటికి శింగయ్య, కొండే వెంకటేష్లు అందించారు. నాలుగో బహుమతిని రూ.5 వేలను ఎర్రిబోయిన రామాంజనేయులు అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. 108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం రేపల్లె: అత్యవసర పరిస్థితుల్లో తరలిస్తున్న గర్భిణికి 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. వైద్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో తల్లి, శిశువు సురక్షితంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రేపల్లె మండలం లంకెవానిదిబ్బకు చెందిన చెందిన గర్భిణి నంబూరి అంకమ్మ (23)కు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇది రెండో గర్భం కాగా, ఏడో నెలలోనే నొప్పులు అధికమవడంతో వైద్యులు పరిశీలించారు. మొదటి కాన్పు శస్త్రచికిత్స ద్వారా జరగడం, ప్రస్తుతం రక్తహీనత ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 108 వాహనంలో అంకమ్మను తెనాలికి తరలించే ఏర్పాట్లు చేశారు. వాహనం రేపల్లె – పెనుమూడి హైవేకు చేరుకున్న సమయానికే అకస్మాత్తుగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించిన ఈఎంటీ కేసన మహేష్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు. అంకమ్మ సురక్షితంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని తెనాలి హాస్పిటల్కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించారు. -
పచ్చగడ్డి వేస్తే రియల్ భగ్గు!
టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారి ఆధిపత్య పోరు కారణంగా ఇటు ప్రజలు నష్టపోవడమే కాకుండా, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం మార్టూరులో అక్రమంగా గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అక్రమ లే అవుట్లను బయట నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ టీం అధికారులు మంగళవారం ధ్వంసం చేయబోగా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. ఇంత హఠాత్తుగా లేఅవుట్ల ధ్వంసానికి కారణం మార్టూరుకు చెందిన టీడీపీ నాయకుడే అంటూ మిగిలిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్టూరు: టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధ నేతృత్వంలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు పదిమంది అధికారులు మంగళవారం మార్టూరు అనధికార లేఅవుట్లను ధ్వంసం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల ఆదేశాలపై తాము వచ్చినట్లు అనూరాధ మీడియాకు తెలిపారు. మార్టూరు పంచాయతీ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావుతో కలిసి మొదటగా పక్క నియోజకవర్గ నేతకు చెందిన అనుచర వర్గం ప్రారంభించిన అనధికార లే అవుట్ను కొంతమేర రాళ్లు తొలగించి ధ్వంసం చేశారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్ యజమానులు ఇద్దరూ తమ వాహనాలు రిపేర్కు వచ్చాయంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. అడ్డుకున్న నాయకులు అంతట అధికారులు మరొక జేసీబీ సాయంతో సమీపంలోని జనసేన పార్టీ నాయకుడికి చెందిన లేఅవుట్లోని రాళ్లు తొలగించే ప్రయత్నం చేశారు. సదరు నాయకుడు జేసీబీకి అడ్డంగా నిలబడి మొదట ప్రారంభించిన లేఅవుట్లోని రాళ్లు తొలగించాకే తన భూమిలోకి రావలసిందిగా ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎటూ పాలుపోని అధికారులు ఆ లేఅవుట్ను ఆనుకొని ఉన్న మరో లేఅవుట్ తాలూకు ప్రహరీని ధ్వంసం చేయబోగా దానికి సంబంధించిన టీడీపీ నాయకులు అక్కడ కూడా అడ్డుకున్నారు. అధికారులు ప్రహరీరి వదిలి లే ఔట్లోనికి వెళ్లే మార్గాన్ని జేబీసీతో ధ్వంసం చేయించారు. అనంతరం రాజుగారిపాలెం గ్రామం వైపు వెళ్లే మార్గంలో వేసిన రెండు అనధికార లేఅవుట్లలోని రాళ్లను తొలగించారు. అసలు సంగతి ఇదా... ప్రస్తుతం మార్టూరులో కొద్దో గొప్పో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్న ప్రాంతం స్థానిక హర్షిణి విద్యాసంస్థల పరిసరాల్లో మాత్రమే. మార్టూరు టౌన్పై పెత్తనం చేస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులలో ఓ మైనారిటీ నాయకుడు ఇటీవల ఈ ప్రాంతంలో కొంత భూమి కొనుగోలు చేసి లేఅవుట్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు. సదర్ లే అవుట్లో ఆ నాయకుడికి తక్కువలో తక్కువ సుమారు రూ.కోటి లాభం రావచ్చనేది ఆ పార్టీ నాయకుల మాటా. ఇక రెండో నాయకుడు స్థానిక జాతీయ రహదారికి ఎదురుగా అత్యంత సుందరంగా అప్రూవల్ లే అవుట్ను వేసినప్పటికీ విక్రయాలు జరగటం లేదనేది కొందరి వాదన. ఈ సందర్భంగా హర్షిణీ విద్యాసంస్థల పరిసరాల్లోని అనధికారిక లేఅవుట్లను తొలగిస్తే పచ్చనేతకు చెందిన అప్రూవ్డ్ లే అవుట్లోని విక్రయాలు పెరుగుతాయనే ఆలోచనతో చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇలా ఆయనే దాడులు చేయించినట్లు బాధితులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి బలం ఏమిటో త్వరలోనే తేలుస్తామని మాటల కత్తులు దూసుకోవటం విశేషం. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో చిచ్చుకు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణమై ఆధిపత్య పోరుకు దారితీసిందని ప్రజలు పేర్కొంటున్నారు. దీని ప్రభావం ఇంతటితో ఆగక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ఉంటుందని స్థానికంగా చర్చ జరగటం విశేషం. మాట్లాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధఈ సందర్భంగా మీడియాతో టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధ మాట్లాడుతూ... మార్టూరు కేంద్రంగా 2009 – 23 మధ్యకాలంలో అనధికారికంగా వేసిన లేఅవుట్లలోని రాళ్లను తొలగించాలని ఉన్నతాధికారులు తమను ఆదేశించారని జాబితా చూపారు. అందులో 25 మంది వ్యక్తులకు చెందిన 50కిపైగా సర్వే నంబర్లలో 85 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ లేఅవుట్లు ఉండటం గమనార్హం. -
ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు తొలగించాలి
తాడికొండ: ఎన్–8 రహదారి నిర్మాణం వలన ఇళ్లు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి ప్రత్యామ్నాయం చూపిస్తే ఇళ్లు నిర్మించుకున్న అనంతరం తమ గృహాలను తొలగించాలని ఏపీ సీఆర్డీయే నిర్వహించిన గ్రామసభలో బాధితులు కమిషనర్ విజయ రామరాజుకు తెలిపారు. ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో మంగళవారం మందడం గ్రామంలో భూ సేకరణ గ్రామసభను నిర్వహించారు. రంజిత్ అనే రైతు మాట్లాడుతూ గ్రామకంఠం కింద తనకున్న 58 సెంట్లు భూమిలో పాలవాగు, ఎన్–8 రహదారి పోతుందని, అది పోగా మిగిలిన భూమిని కూడా తీసుకొని తనకు మొత్తం ఒకే చోట భూమి ఇవ్వాలని కోరాడు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో అడిషనల్ కమిషనర్లు ఏ భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఏపీ సీఆర్డీయే ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి సురేష్ కుమార్, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంత రాయుడు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎస్ రవీంద్ర ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి మధుసూదనరావు, ఎం శేషిరెడ్డి, తహసీల్దార్లు పి సతీష్, డి సునీల్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మందడం గ్రామసభలో సీఆర్డీయే అధికారులకు మొరపెట్టుకున్న గ్రామస్తులు -
రోడ్డు పక్కన పడిపోయిన మహిళ
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారి ఫస్ట్ గేటు సమీపంలో ఓ మహిళ స్పృహ తప్పి మంగళవారం మధ్యాహ్నం పడిపోయింది. ఆమెతో ఉన్న ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ సహాయం కోసం ఎదురుచూశారు. గమనించిన స్థానికులు వెంటనే చైల్డ్ కేర్ హెల్ప్లైన్ టోల్ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం ఇచ్చారు.గంటల తరబడి అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి అపస్మారక స్థితిలో ఉండగా, చిన్నారులు ఆకలితో, భయంతో రోడ్డు పక్కనే ఉండిపోవడం చూపరులను కలచివేసింది. చైల్డ్ ప్రోటెక్షన్ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన అక్కడకు చేరుకున్నారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను కనిగిరికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. కాస్త తేరుకున్న తర్వాత మహిళ, చిన్నారులను వాహనంలో వన్స్టాప్ కేంద్రానికి తరలించారు. -
కొనసాగిన జాతీయస్థాయి నాటిక పోటీలు
నాదెండ్ల: నాటకాలు, నాటికలు అంతరించిపోతున్న ప్రస్తుత రోజుల్లో నాలుగేళ్లుగా జాతీయస్థాయి నాటికల పోటీలు నిర్వహించటం అభినందనీయమని ప్రముఖ కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ చెప్పారు. నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో సాతులూరు గ్రామంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు మంగళవారం మూడోరోజు ఆసక్తిగా జరిగాయి. ప్రముఖ కళాకారులు ముత్తవరపు సురేష్, ఎన్టీఆర్ పురస్కార గ్రహీత, రంగస్థల సినీనటుడు, దర్శకుడు నాయుడు గోపి, పాటిబండ్ల సాంబశివరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, ప్రభు ధనుంజయ్, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు హాజరయ్యారు. ● చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వంలో అట్టాడ అప్పలనాయుడు రచించిన విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెన వేలు, పాగర్తి నాగేశ్వరరావు దర్శకత్వంలో సుఖమంచి కోటేశ్వరరావు రచించిన గుంటూరు శ్రీ రమణా కళానిలయం వారి మాతృత్వం, జీవీ మనోహర్ దర్శకత్వంలో కేవీవీ సత్యనారాయణ రచించిన పొన్నూరు శ్రీ విశ్వకళా చైతన్యవేదిక వారి సూక్తం నాటికలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రసభరితంగా సాగిన నాటికలు, కళాకారుల ప్రదర్శనలతో ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో కోలాహలంగా సాగా యి. అనంతరం నిర్వాహకులు బండారుపల్లి సత్యనారాయణ, నడింపల్లి వెంకటేశ్వరరావు, జరుగుల రామారావు, చెరుకూరి సాంబశివరావులు అతిథులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. -
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో రవాణా వాహనం.. కారు ఢీకొని 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. మేడికొండూరుకు చెందిన టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ తన క్లీనర్ లింగాల నరసింహారావుతో కలసి టాటాఏసీ వాహనంలో విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో టాటాఏసీ బుడంపాడు సమీపంలోని సత్యసాయిబాబా ట్రస్ట్ ప్రాంతంలో ఎన్హెచ్ 16 వైవేలో వెళుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని గాల్లోకి లేచి అవతలవైపు రోడ్డుపై పడింది. ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ తీవ్రగాయాలపాలవ్వగా, అదే సమయంలో విజయవాడ నుంచి బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన షేక్ జాఫర్సాదిక్, అతడి భార్య గౌషార్సుల్తాన్, కుమారుడు నవాజ్షరీఫ్, కుమార్తె వజీహాసుల్తానా, బావ సయ్యద్ మహబూబ్హుస్సేన్, షేక్ మామానాజిన్ ఆరుగురు కారులో వేటపాలెంకు వెళుతున్నారు. అదేసమయంలో రోడ్డు అవతలవైపునుంచి టాటాఏసీ వాహనం కారు ముందు సడన్గా పడటంతో కారు టాటాఏసీ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు యువకులకు స్వల్ప గాయాలు కాగా వారు తమ వాహనం తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురిని, టాటాఏసీలోని ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదంలేదని టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణకు తీవ్రగాయాలవ్వటం వలన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈదురు గాలులకు గాల్లోకి ఎగిరిన సోలార్ ప్లేట్లు ఇద్దరు చిన్నారులపై పడి గాయాలు చిలకలూరిపేటటౌన్: ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దండమూడి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి సోలార్ ప్లేట్లు గాల్లోకి ఎగిరి అక్కడే ఉన్న మూడేళ్ల కౌశిక్, పదేళ్ల తరుణ్లపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విత్తన దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు. గాయాలపాలైన షేక్ జాఫర్ సాధిక్, గౌషార్ సుల్తానా తీవ్రగాయాలైన డ్రైవర్ శివరామకృష్ణ -
పిల్లలు బడి బయట ఉండకూడదు
డీఈఓ పీవీజే రామారావుయడ్లపాడు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు వంద శాతం నమోదు లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. సోమవారం యడ్లపాడు మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎంఈఓ ఎంవీ నాగరత్నం సిబ్బంది, సీఆర్పీలు, పీటీఐలు, ఐఈఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ యూ–డైస్ పోర్టల్లో ఇంకా నమోదు కాని పిల్లల వివరాలను తక్షణమే సేకరించి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకటవ తరగతిలో చేరాల్సిన పిల్లల గుర్తింపు, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వివరాలపై క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వసతులు, విద్యా కానుక వంటి పథకాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి విద్యా సంవత్సరానికి దూరం కాకూడదనే లక్ష్యంతో పనిచేయాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. -
డీ మార్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మోసపూరిత మాటలే పెట్టుబడిగా బ్యాంకులను మోసం చేస్తున్న కార్పొరేట్ శక్తులు, డీ–మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ వంటి షాపింగ్ మాల్స్ స్థాపించి అందులో పనిచేసే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ ఆరోపించారు. దళిత యువతి స్వర్ణలత సర్టిఫికెట్లతోపాటు ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఫెస్టిసైడ్ లైసెన్స్ పొందిన నరసరావుపేట డీ–మార్టు యాజమాన్యం మోసాలను బట్టబయలు చేస్తూ కేఎన్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ దళిత యువతి స్వర్ణలతను మోసం చేసి ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఫెస్టిసైడ్ లైసెనన్స్ పొందిన నక్కరాజుతోపాటు కాసులకు కక్కుర్తి పడి దొంగ లైసెనన్స్ ఇచ్చిన అగ్రికల్చర్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు అమలుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వర్ణలత పేరుతో నక్కరాజు తీసుకున్న లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీమార్టు యాజమాన్యంతో కుమ్మకై ్క బాధితులను భయపెడుతున్న సీఐ ఫిరోజ్, కానిస్టేబుల్ పాండురంగారావులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.ఽ ధర్నా అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఓర్సు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్న ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు కొయ్యలమూడి జయమ్మ, రొంపిచర్ల మండల కమిటీ సభ్యులు బి రామయ్య, బాధితులు స్వర్ణలత, రామచంద్రరావు, అనిల్, వినుకొండ కోటి పాల్గొన్నారు. -
పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం
యడ్లపాడు: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ద్వారానే వేగవంతమైన, సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కొండవీడు రెవెన్యూ పరిధిలోని కాటూరి మెడికల్ హాస్పిటల్ వెనుక ఏర్పాటుచేసే శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్ కార్యక్రమంలో వారు స్థానికంగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026 వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పార్కు పనుల్ని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాల సహాయంతో స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఈ పార్కు స్థానిక నిరుద్యోగ యువతకు ఒక వరం లాంటిదని, ఇక్కడ లభించే ఉపాధి అవకాశాలలో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యత ఇచ్చేలా పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశిస్తామని పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రాంతంలో జిన్నింగ్, నూలు మిల్లులు, సుగంధ ద్రవ్యా రంగాల ద్వారా రూ.5 వేల కోట్ల వ్యాపార లావాదేవీలతో దాదాపు 35 వేల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. పరిశ్రమల్ని మరింత విస్తరణ చేసి యువతకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తమ లక్ష్యం అన్నారు. పార్కు ప్రమోటర్ డాక్టర్ ఏబీఎస్ శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు ఉచితంగా ఆధునిక సాంకేతికతను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా ఎంఎస్ఎంఈ మేనేజర్ సురేష్, తహసీల్దార్ అనురాధ, సొసైటీ చైర్మన్ మద్దినేని సుబ్బారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, ఎం వీరారెడ్డి, కందిమళ్ల రఘురామారావు, ముద్దన నాగేశ్వరరావు, తోకల రాజేష్, రాఘవయ్య, శిలార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బగళాముఖి అమ్మవారి ఆదాయం రూ.7.65 లక్షలు
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకల ద్వారా రూ.7,65,584ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకలను భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరిపారు. 114రోజులకు గాను లెక్కింపు జరిపామని, గతం కంటే రూ.95,546లు అధిక ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. పొన్నూరు హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం.గోపి, దేవస్థానం ట్రస్ట్బోర్డు అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు, పూజారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించిన రంజిత్ బాషా సీటింగ్ ఏర్పాట్లతో పేస్టు సీసీ టీవీల పనితీరు, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వేసవి తాపం దృష్ట్యా పరీక్షల సమయంలో విద్యార్థులకు, సిబ్బందికి చల్లని తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు కేటాయించిన 16,812 మంది విద్యార్థుల్లో 15,396 మంది హాజరయ్యారు. విజయపురిసౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ కుడికాలువకు తాగునీటిని అధికారులు సోమవారం విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కుడికాలువకు మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కుడి కాలువ గేట్ల ద్వారా 6000 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపుకొని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, ఏఈఈ సుధా, డ్యాం సిబ్బంది యాంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి వెళ్లే కాలువ కట్ట వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నా యి. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం నుంచి చండ్రాజుపాలేనికి చెందిన మిరప కూలీలతో వాహనాన్ని పాకాలపాడు నుంచి ఎదురుగా వస్తున్న థమ్సప్ కూల్డ్రింక్ లోడుతో వస్తున్న ఆటో ఢీకొంది. మిరప కూలీలు ఇరువురు పిల్లలు, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరువురు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ఒకరు 36 కేసుల్లో నిందితుడు కాగా, మరొకరు 41 కేసుల్లో.. ● రాష్ట్రంతోపాటు కర్ణాటకలోనూ చోరీలు
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు చిలకలూరిపేట: వివిధ దొంగతనం కేసుల్లో నిందితులైన ఇరువురు అంతరాష్ట్ర దొంగలను చిలకలూరిపేట అర్బన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ పి.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన జయరామ్ విజయలక్ష్మి ఈ ఏడాది జనవరి మూడోతేదీన ఆర్యవైశ్య కళ్యాణమండపం ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పూజల కోసం వచ్చారు. పూజల అనంతరం ఆమె బంధువైన శ్రీనివాసరావు మోటార్ సైకిల్పై బ్యాంకు కాలనీ మెయిన్రోడ్డు వద్ద వదిలివెళ్లాడు. ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న విజయలక్ష్మిని వెనుకగా బైక్పై ముఖానికి మాస్కు ధరించి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం, విజయనగర్కాలనీకి చెందిన షేక్ కృపారావు, ఎలియాస్ బాషా ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. అనంతరం దొంగించిన చైన్ను తన మిత్రుడైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి వద్ద దాచి కర్ణాటకకు వెళ్లిపోయాడు. కర్నాటకలోని చిత్రదుర్గ, గౌరీబీదానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, చైన్ స్నాచింగులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి చిలకలూరిపేటకు రాగా ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద ఇరువురిని పట్టణ ఎస్ఐ వి.సోమేశ్వరరావు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగతనానికి గురైన చైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొదటి నిందితుడైన షేక్ కృపారావు అలియాస్ బాషాపై ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కలిపి 36 కేసులు ఉండగా, రెండో నిందితుడు కొండారెడ్డిపై 41 కేసులు ఉండటం విశేషం. పట్టణ ఎస్ఐ పి.హజరతయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీలో ఆదర్శంగా నిలుద్దాం
నరసరావుపేట: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పల్నాడును మార్చేందుకు అధికారులంతా కృషిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా మండల పరిషత్ అభివృద్ధి, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి నెల జిల్లాలో రూ.118 కోట్లు పింఛను రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది తప్పనిసరిగా ప్రతినెల ఒకటో తేదీనే పింఛనుదారుకు ఇంటి వద్దే పింఛను అందించాలన్నారు. లబ్ధిదారులతో సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈవిషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పింఛన్ దారుల ఫోన్ నెంబర్లు మ్యాపింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పింఛను తీసుకున్న వారికే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వెళ్తున్నది, లేనిదీ నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీజీఎస్డబ్ల్యూఎస్ సీఈఓ స్లీవారెడ్డి, డీఎల్డీఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ -
పల్నాడు
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి తాడేపల్లికి చెందిన కే శిరీష రూ.1,00,120 విరాళాన్ని సోమవారం అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.5,000, మోడల్ ధర రూ.3,700 వరకు పలికింది. 7 -
పరీక్షిస్తే శిక్షే..!
గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు నేరం సత్తెనపల్లి: పుట్టబోయే బిడ్డ ఆడ అయినా, మగ అయినా సమానమే. సమాజంలో ఇద్దరికీ భేదం లింగపరమైనదే తప్ప ఆధునిక జీవన విధానంలో వ్యత్యాసం లేదు. వైద్య రంగంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో కడుపులోని బిడ్డ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోగలుగుతున్నాం. బిడ్డ ఎదుగుదలలో సమస్యలు తలెత్తితే సరిచేసే చికిత్స పద్ధతులుండనే ఉన్నాయి. అందుకోసం రూపుదిద్దుకున్న సాంకేతికతను కడుపులోని బిడ్డ లింగ నిర్ధారణ కోసం ఉపయోగిస్తే నేరమవుతుంది. గర్భస్థ పిండ లింగ నిర్ధా రణ నిషేధ (పీసీపీఎన్డీటీ) చట్టం పటిష్ట అమలుకు కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభు త్వం లింగ నిర్ధారణ పరీక్షల కట్టడిపై అధికారులను అప్రమత్తం చేసింది. ఇటీవల జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పీసీపీఎన్డీటీ చట్టం పటిష్ట అమలుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పటిష్ట చట్టం అండ భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో ప్రీ కన్సప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(పీసీపీఎన్డీటీ) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు చేయడం నేరం. ప్రభుత్వం వద్ద లైసెన్స్ పొందిన స్కానింగ్ సెంటర్లు నిబంధనలను మీరితే చర్యలు తీసుకుంటుంది. అల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు అవ్వడంతో పాటు వైద్యులపై కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే వైద్య పట్టా రద్దు చేయడంతో పాటు, మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. చట్టం అమల్లో భాగంగా డెకాయ్ ఆపరేషన్ పేరుతో మూడు నెలలకు ఒకసారి స్కానింగ్ సెంటర్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ మగ, ఆడ ఎవరనేది లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు శ్రేయస్కరం. మాతా శిశు సంరక్షణ సేవలు నాణ్యతతో అందిస్తున్నాం. –డాక్టర్ బి.రవి, డీఎంహెచ్ఓ -
చిట్ఫండ్ బాధితుడి ఆత్మహత్యాయత్నం
నరసరావుపేట టౌన్: ప్రభుత్వం సాయిసాధన చిట్ఫండ్ బాధితులకు న్యాయం చేయటంలో తీవ్ర అలసత్వం వహిస్తుండటంతో బాధితుల్లో ఒకరు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాసనగర్కు చెందని పాలపర్తి లక్ష్మీనారాయణ సాయిసాధన చిట్ఫండ్లో రెండు రూ.40 లక్షల చీటిపాటల్లో సభ్యుడిగా ఉన్నాడు. పాటమొత్తం అయిపోగా డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో గతేడాది ఫిబ్రవరి నెలలో చిట్ఫండ్ నిర్వహకుడు సాయిసాధన పుల్లారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చిట్ఫండ్తోపాటు అప్పుల రూపంలో సుమారు రూ.400 కోట్ల వరకు సేకరించి ఉడాయించినట్టు తేలింది. ఈ మేరకు బాఽధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా గుంటూరుకు చెందిన మహీ అగ్రీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దండా రాజ్యలక్ష్మి రియల్ ఎస్టేట్లో రూ.11.62 కోట్లు పెట్టుబడులు పెట్టించి పుల్లారావు మోసం చేశాడని ఆమే ఇచ్చిన ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాఽధితులంతా రోడ్డెక్కి ఆందోళన చేపడ్డంతోపాటు ముఖ్యమంత్రి, హోంమంత్రిలను కలసి వినతిపత్రాలను అందజేశారు. స్పందించిన ప్రభుత్వం కేసును ఏడాది క్రితం సీఐడీకి అప్పగించింది. బాపట్ల ఎస్పీతో కలిపి సిట్ను ఏర్పాటు చేసింది. అప్పటి నంంచి కేసును పక్కనపడేశారు. నేటికి బాధితులకు న్యాయం జరగలేదు. న్యాయస్థానం ద్వారా బెయిల్ పొందని నిందితుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. న్యాయం కోసం అధికారుల చుట్టూ బాధితులు తిరిగి తిరిగి విసిగిపోయారు. ఒకవైపు బాధితులకు ఆర్థికసమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు న్యాయం జరుగుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది పుల్లారావు బాధితులు ఇప్పటికే ఊర్లను వదలిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా పాలపర్తి లక్ష్మీనారాయణ క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సీజ్ చేసిన పుల్లారావు ఆస్తులను విక్రయించి వచ్చిన నగదునున అందరికి అందజేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
మాచర్లలో గుట్టలు తవ్వేస్తున్న అక్రమార్కులు భారీగా తవ్వకాలు సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ సంపదల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రావెల్ మాఫియా నిత్యం వందలాది ట్రక్కుల మట్టిని అక్రమంగా తరలించి రూ.కోట్లు దోచుకుంటోంది. నియోజకవర్గంలోని గుట్టలు, చెరువులు, ప్రభుత్వ బీడు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా తవ్వేస్తు జేబులు నింపుకొంటున్నారు. అడ్డుకోవాల్సిన ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోవడంతో సహజవనరులను కాపాడేవారు లేకుండా పోతున్నారు. తాను ధర్మాత్ముడని చెప్పుకొనే ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే మట్టి దోపిడీ జరుగుతుండటంతో తామేమి చేయలేమని అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోందట. మరోవైపు మట్టి మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో అధికారపార్టీ పెంచి పోషిస్తున్న రౌడీ గ్యాంగ్ కాపాలకాస్తుండటంతో ఆ దిశగా చూడటానికి సైతం ప్రజలు, అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్లవీడు, ఆత్మకూరులో యథేచ్ఛగా.. మాచర్ల నియోజవర్గంలోని దుర్గి, వెల్దుర్తి, మాచర్ల రూరల్ మండలాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా దుర్గి మండలంలోని అడిగొప్పల సమీపంలోని ఆత్మకూరు చెరువు సుమారు 800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మట్టిపై కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధి బృందం నిత్యం వందలాది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఇటుకలు, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఆత్మకూరు చెరువు మట్టికి బాగా డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని స్థానిక టీడీపీ నేతను ముందుపెట్టి ప్రజాప్రతినిధి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇదే చెరువుపై ఆశపెట్టుకున్న కొందరు టీడీపీ నేతలను బెదిరించి మట్టి తవ్వకాలు చేస్తుండటంతో స్థానికులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వెల్దుర్తి మండలం పట్లవీడు చెరువులో సైతం భారీఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నేతను ఒకర్ని ముందుపెట్టి మట్టి తవ్వకాలు జరుపుతున్నా డబ్బులు నేరుగా ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్తున్నాయని, నాదేముందని చెడ్డపేరు తప్ప అని సదరు చోటా నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. సొంతపార్టీ నేతలకూ బెదిరింపులు... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశించిన మాచర్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనంలో ఉన్నారు. మట్టి, రేషన్, గ్రానైట్ ఇలా అన్ని అక్రమార్జనలు ప్రజాప్రతినిధి నేతృత్వంలో చేస్తుండటంతో మాకేం దక్కుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు, పట్లవీడు, కొత్తపల్లిలో మట్టి తవ్వకాలలో స్థానిక నేతలు కూటమి గా ఏర్పడి మట్టి తవ్వకాలు చేపడదామని అనుకున్నారు. కొంత గ్రామ అవసరాలకు, మరికొంత పార్టీకి పనిచేసిన నేతలు తీసుకుందామని ఆశించారు. అది వీలుకాకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్న ఓ స్థానిక నేత మట్టి అక్రమ తవ్వకాలపై ప్రశ్నించి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నేరుగా సదరు ప్రజాప్రతినిధి తాను పార్టీకి చాలా ఖర్చుచేశానని, మట్టి అక్రమార్జనలో అడ్డువస్తే సహించనని బెదిరించడంతో అవాక్కయ్యాడు. దీని కోసమా మేము టీడీపీలో పనిచేసిందని వాపోతున్నారట. ఇదే విషయంపై ఉన్నతాధికారులతోపాటు టీడీపీ అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట. తమ సామాజికవర్గానికి చెందిన ఓ ఎంపీ, ఎమ్యెల్యేల ద్వారా ఇప్పటికే అధిష్టానానికి తమ గోడును నివేదికల రూపంలో వెల్లడించినట్టు చెప్పుకొస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలలో ముఖ్యనేత ఒంటెత్తు పోకడలపై విసిగిపోయిన టీడీపీ అసమ్మతి నేతలు నేరుగా పల్నాడు జిల్లా కలెక్టర్కు ఎద్దులబోడులో జరుగుతున్న మైనింగ్పై ఫిర్యాదు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 22న కొత్తపల్లి గ్రామంలో గల ఎద్దులబోడును మైనింగ్ అధికారి సుధాకర్, వీఆర్వో షేక్ ఖాజావలి, గ్రామ సర్వేయర్ కసిన్యాక్లు తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం ఉండటంతో ఆసమయంలో మట్టి తవ్వకాలు నిలిచిపోవడంతో మట్టి తవ్విన గోతులను అధికారులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులు ఇస్తామని వెళ్లిపోయారు. దీంతో పది రోజులుగా తాత్కాలింగా మట్టి అక్రమ తవ్వకాలు ఆగిపోయాయి. ఈ విషయంపై అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మాచర్ల నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడిని వెంటనే అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాచర్ల రూరల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో ఎద్దులబోడులో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరిగాయి. తాను అవినీతిని సహించనని గొప్పలు చెప్పే సదరు ప్రజాప్రతినిధే ఈ మట్టి తవ్వకాలు జరిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. 20 ఏళ్లపాటు తాము కష్టపడి టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తే ఎన్నికల ముందు వచ్చిన వారు దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇందులో భాగంగా ఎద్దులబోడు మైనింగ్పై స్థానిక నేతలు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి, అతని గూండాలకు భయపడి స్థానిక అధికారులు అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. -
సాయుధ దళాలకు కోస్టల్ బ్యాంకు రూ.50వేలు అందజేత
నరసరావుపేట: కోస్టల్ బ్యాంక్ ప్రతినిధులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నుంచి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.50వేలు విరాళంగా అందించారు. సోమవారం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహను కలిసి చెక్కును అందజేశారు. ఈ నిధిని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. కోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, చంద్రశేఖరకుమార్, డిప్యూటీ మేనేజర్ జె.అరవింద్, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి ఆర్.గుణశీల పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు అన్నారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు హెచ్పీవీ వ్యాక్సిన్, ఎన్సీడీ, హీట్ వేవ్స్, జాతీయ ఆరోగ్య కార్యక్రమములపై సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు మాట్లాడుతూ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రియాంక, శివ సాంబి రెడ్డి, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నెహ్రూనగర్: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమని గుంటూరు జిల్లా డీఆర్డీఏ జీవనోపాధుల మేనేజర్ డాక్టర్ టి అశోక్కుమార్ తెలియజేవారు. కొత్తపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఆర్డీఏ బ్యాంకు రుణాల మేనేజర్ కేశవ మాట్లాడారు. ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ విధానం, బ్యాంకు రుణాలు పొందే ప్రక్రియ, రుణాల చెల్లింపు విధానాలపై అవగాహన కల్పించారు. ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ టి సందీప్బాబు మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్స్, తక్కువ వ్యయంతో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకునే మార్గాలపై సూచనలు చేశారు. రూ.24.78 లక్షల విత్తనాలు స్వాధీనం నగరంపాలెం(గుంటూరువెస్ట్): నగర పరిధిలోని విత్తన దుకాణంలో సోమవారం గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని వాసవి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పరిశీలించగా, రికార్డులు సరిగాలేకపోవడం, విత్తనాల తయారీకి వాడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ లైసెన్న్స్ పొందకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఐదు రకాల విత్తనాలైన సూపర్ బిబి–11 గోల్డ్, సూపర్ యమునా గోల్డ్ 1904, వరి, ప్రాసెస్ చేయబడిన/ రసాయన పూత పూసిన వరి(వదులుగా ఉన్నవి), ప్రాసెస్ చేయబడని/ శుద్ధి చేయని వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.24.78 లక్షల విలువ చేసే 26,791 కిలోల విత్తనాలు అని అధికారులు తెలిపారు. -
పెనుగాలుల విధ్వంసం
యడ్లపాడు: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో యడ్లపాడు మండలం అతలాకుతలమైంది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. సోమవారం పగలంతా నిప్పుల వర్షం కురిపించిన భానుడు, సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభిస్తుందని ఆశించిన జనంపై ప్రకృతి పగబట్టినట్లయింది. ఈదురు గాలుల తీవ్రతకు యడ్లపాడు సవళ్ల ప్రాంతంలో నాలుగు ఇళ్లపై ఉన్న సిమెంటు రేకులు ఒక్కసారిగా పెకలించుకుపోయి గాల్లోకి లేచాయి. ఆ రేకులు సుదూరంగా ఉన్న స్థానికులపై వచ్చి పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతానికి చెందిన పల్లపు పింకీ అనే బాలికకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మైదవోలు – లింగారావుపాలెం మధ్య ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలం వ్యాప్తంగా సుమారు 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి లైన్లు తెగిపోయాయని విద్యుత్శాఖ అధికారులు తెలిపారు. దాచేపల్లి: దాచేపల్లిలో ఈదురు గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలుల తో కూడిన వర్షం కురవడంతో దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో సుమారుగా 42 స్తంభాలు గాలికి కూలిపోయాయి. కొన్నిచోట్ల స్తంభాలు నివాస గృహాలు, దుకాణాలపై విరిగి పడ్డాయి. కరెంటు తీగలు కూడా తెగి నేలపై పడ్డాయి. నగర పంచాయతీ పరిధిలో ఆరుకు పైగా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దాచేపల్లి మండల పరిధిలో సుమారుగా 58 పైగా విద్యుత్ స్తంభాలు విరిగాయి. విద్యుత్ శాఖకు సుమారు రూ. కోటిన్నరకు పైగా నష్టం జరిగి ఉంటుందని ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మాచవరం: మండలంలోని పిన్నెల్లి, చెన్నాయపాలెం వేమవరం, మాచవరం గ్రామాల్లో సోమవారం సాయంత్రం భీకర గాలులతో కూడిన వర్షం కురిసింది. పెనుగాలులకు అనేకచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపైన వేసిన రేకులు నెగిరిపోవడంతో గృహాల్లోని వస్తువులు తడిచి ముద్దయ్యాయి. సజ్జ, జొన్న, మొక్కజొన్న కోసిన కంకులు నేలపై ఆరబోయడంతో అవి తడిసి ముద్దయ్యాయి. బొప్పాయి, అరటి తోటలు నేలకొరిగాయి. ముప్పాళ్ళ: అకస్మాత్తుగా మబ్బులతో పాటుగా ఈదురుగాలులు కూడిన వర్షం పడటం తో మండల వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం సాయంత్రానికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ గాలులతో కూడిన వర్షం కురవటంతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం లభించినట్లయింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటుగా వడగండ్ల కూడా పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పిడుగురాళ్ల: పట్టణంలో సోమవారం సాయంత్రానికి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీయటంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈదురు గాలుల ప్రభావం వలన పట్టణంలో కరెంట్ కోత విధించారు. -
సామాజిక చైతన్యం పెంపొందించటంలో నాటికల పాత్ర ఎనలేనిది
నాదెండ్ల: డిజిటల్ హవా నడుస్తున్నా... ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని సామాజిక చైతన్యం పెంపొందించటంలో నాటికలు నేటికీ సజీవ కళలుగా నిలిచాయని నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ చెప్పారు. సాతులూరులోని బండారుపల్లివారిపాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారతీ కళావేదికపై కరణం సురేష్ కళాప్రాంగణంలో నాలుగవ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వజ్జా మధుసూదనరావు ప్రదర్శించిన విశ్వామిత్ర ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. యడ్లపాడు మానవతాసాగరి సమర్పణలో జరుగుల రామారావు దర్శకత్వంలో అందరూ మంచివారే కానీ అనే నాటిక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ వారి సరిగమ పాప ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండోరోజు సోమవారం మహమ్మద్ ఖాజావలి దర్శకత్వంలో పీవీ సత్యనారాయణ రచించిన ఏలూరు వారి హేలాపురి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో అనగనగా ఓ రాత్రి, పొన్నాడ ముత్యాలరావు దర్శకత్వంలో గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన అనకాపల్లి ఎన్.ఎమ్.ఆర్. క్రియేషన్స్ సమర్పించిన మలిసంధ్య, అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ఆరాధ్యుల తేజశ్విప్రఖ్య రచించిన తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ సమర్పించిన విజేతలను ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా అశ్వనీ ఆసుపత్రి వైద్యులు ఆవుల శ్రీనివాసరావు, మక్కెన వంశీకృష్ణ, డాక్టర్ కిలారి సునీల్కుమార్, జీబీఆర్ హేచరీస్ యజమాని గడ్డం బుచ్చారావు, సినీనటి వర్షిణి, కందుల రాజు, లైఫ్లైన్ హాస్పటల్స్ పేరం రాజానందరెడ్డి, మైనేడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. సాతులూరులో ప్రారంభమైన జాతీయస్ధాయి నాటికల పోటీలు -
సూపర్ సిక్స్ పథకాలతో 20 శాతం మందికే లబ్ధి
వినుకొండ: చంద్రబాబు ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాల పేరుతో కేవలం 20 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూర్చి, మిగిలిన 80 శాతం మందికి అన్యాం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మహిళా నేతలతో కలిసి ఆమె మాట్లాడారు. గతంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో కులమతాలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన తీరును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ తీరును సరిపో ల్చడానికి తాము ఇంటింటికీ వెళ్తామని చెప్పారు. ఏ ప్రభుత్వంలో పథకాలు బాగా అమలయ్యాయో ప్రజలే తేలుస్తారన్నారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు పరోక్షంగా మూడు రాజధానుల పాలననే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ఐటీ రంగం తరలిపోయిందని, అమరావతి నిర్మాణం పేరుతో మట్టి అమ్ముకోవడం తప్ప అక్కడ జరిగిందేమీ లేదన్నారు. నలుగురు పిల్లల్ని కనండి.. రాష్ట్ర సంపాదన పెంచండి అని పిలుపునిస్తున్న చంద్రబాబు, పిల్లలు లేని పేద కుటుంబాల కోసం ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లు నెలకొల్పి ఉచిత వైద్య సదుపాయం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. రొంపిచర్ల మాజీ ఎంపీపీ టి.మంగమ్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరికీ సమానంగా పథకాలు అందించేలా కృషిచేయాలని సూచించారు. సత్తెనపల్లి మండల కన్వీనర్ స్వాతి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పేరుతో బాండ్లు ఇచ్చి ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారనిఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మహిళా హోం మంత్రి ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువైందని, హోం మంత్రి సొంత నియోజకవర్గంలోనే 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి రాష్ట్ర అంగన్వాడీ విభాగం మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ హెల్డా ఫ్లారెన్స్ మాట్లాడుతూ.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో తాగునీటి సమస్య పరిష్కారం, ఘాట్ రోడ్డు నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, మున్సిపల్ కాంప్లెక్స్ స్థల కేటాయింపు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యే అయ్యాక కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు బాగా అమలవుతున్నాయని ప్రగల్భాలు పలుకుతున్న జీవీ ఆంజనేయులు, తాము అడిగిన ప్రశ్నలకు క్షేత్రస్థాయికి వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రజనీరెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఖిల్లా రత్నకుమారి, సంతగుడిపాడు మహిళా అధ్యక్షురాలు ఎన్.మీనా, వినుకొండ టౌన్ కన్వీనర్ సీహెచ్.దుర్గ, బొల్లాపల్లి మండల కన్వీనర్ తిప్పిశెట్టి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు రజకులను నిర్లక్ష్యం చేస్తున్నాయి
దాచేపల్లి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రజకుల సమస్యలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విజయభాస్కర్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో రజకుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ రజక సమాఖ్య సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రజకులు రాజ్యాధికారం కోసం... ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవాప్తంగా 36 లక్షల మందికి పైగా రజక జనాభా ఉందని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు. అంటు బట్టల దగ్గరనుంచి శరీరంపై ఉన్న అన్ని బట్టలను శుభ్రం చేసేది రజకులని, వారిని సైతం గ్రామాల్లో అంటరానివారిగానే చూస్తారని, మరి ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చరన్నారు. ఎస్సీ హోదానే ఏక లక్ష్యంగా రజకులందరు ఐక్య పోరాటాలు చేయాలనన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసే ప్రతీ ఆందోళన కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుందని తెలిపారు. ఇప్పటికే తాము చేసిన ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని బాలయ్య అన్నారు. ఈ సమావేశంలో రజక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరు షణ్ముఖం, రజక చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు,రాజమండ్రి నారాయణ, పోకల వెంకటేశ్వర్లు, గంధం అప్పాజి, లాయర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మాస్టర్ లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, కల్లేపల్లి శైలజ, పొదిలి శ్రీనావాసరావు, భగత్, టి.భాస్కర్, సిహెచ్ రామకోటేశ్వరరావు. కె.సత్యనారాయణ, కోయ రామారావు, పిడుగురాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై ఎరువు బరువు
పల్నాడుసోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు ● 50 కిలోల బస్తాపై రూ. 75 – రూ. 350 వరకు పెంపు ● చంద్రబాబు పాలనలో ఇప్పటికే మూడుసార్లు పెరుగుదల ● జిల్లాలో గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 1,55,607 హెక్టార్లు ● ఖర్చుల భారంతో సాగుకు వెనుకడుగు వేస్తున్న అన్నదాతలు సత్తెనపల్లి: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350 వరకు పెరగడం రైతుల్లో కలవరం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం డీఏపీ, యూరియా ధరలను నియంత్రిస్తూ రాయితీని భరిస్తోంది. భాస్వరం, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. ఎరువుల ధరల పెంపుతో రైతులపై రూ.కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలో ఏటా పెట్టుబడుల వ్యయం పెరిగిపోతుండడం.. చేతికి వచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు పెరుగుదల రైతుల నెత్తిన పెనుభారం మోపి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ రెండేళ్ల కాలంలోనే మూడుసార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం. జిల్లాలో గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 1,55,607 హెక్టార్లుగా ఉంది. పంటలు సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ఫాస్పేట్ ఎరువుల వాడకంతోపాటు పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో టన్ను పై రూ.వెయ్యి నుంచి రూ. 4 వేల వరకు ఎరువుల ధరలు పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే సన్న, చిన్నకారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పులు పెడుతున్నారు. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత అసలు, వడ్డీతో అప్పు తీర్చవలసి రావడంతో ఆదాయం ఎరువుల దుకాణాల వద్దే సరిపోతోందని వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో పెట్టుబడి సాయం అందించి సీఎం జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్టపరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచేవారు. గిట్టుబాటు ధరలు కూడా అందించడంతో రైతులు లాభపడ్డారు. ఎరువులు పాత ధర కొత్త ధర పెంపు పొటాష్ 1,850 1,975 125 సూపర్ ఫాస్ఫేట్ 615 775 160 16–20–13 1,400 1,750 350 20–20–13 1,450 1,800 350 10–26–26 1,950 2,025 75 12–32–16 1,850 1,950 100 16–16–16 1,675 1,950 275 14–35–14 2,150 2,350 200 7నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అసాధారణంగా వీస్తున్న తీవ్రమైన వడగాడ్పులు, రికార్డు స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. కావున సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్కు రావద్దని, ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ బయట తిరగవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటూ డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలని కోరారు. 2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత రెండేళ్ల పాలనలో తాము పడేపాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాన్ని ఆదుకొనే పనులు చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి ఎరువుల కోటాను రప్పించుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. ఎరువుల కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయం .. వారికి అన్ని విధాలా నిత్యం అండగా ఉంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మాటలు అబద్ధమని తేలిపోయింది. పైగా వారిపై ఏటా అదనపు ఆర్థిక భారం మోపుతోంది. సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకవైపు పంటలకు మద్దతు ధరలు లేవు... మరోవైపు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయి. ఇప్పుడు ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమ్మర క్రాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి గుంజి రమేష్బాబు, అబ్జర్వర్గా చక్రవర్తి, జిల్లా ఒలింపిక్ అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ధ్రువీకరించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఎ. వెంకట చంద్రశేఖర్రావు, టి.శ్రీనివాసరావు, అంజలిదేవి, కోశాధికారిగా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా దుర్గామోహన్, మానస, బ్రహ్మేష్, వి.రాజేష్, జె. రాజేష్, జి.ప్రసన్న కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఇద్దరు మహిళలను కార్యవర్గంలోకి తీసుకున్నామని క్రాంతికుమార్ తెలిపారు. తెనాలిరూరల్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ07జడ్0261 నంబరు గల బస్సు ఆదివారం సాయంత్రం కొల్లపర మండలం వల్లభాపురం నుంచి తెనాలి వస్తుండగా తెనాలి– విజయవాడ రహదారిలో కంచర్లపాలెం వంతెన వద్ద లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. దీంతో డ్రైవరు బస్సును ఎడమ వైపును లాగాల్సి వచ్చింది. అప్పటికే వర్షం కురిసి ఉండడంతో రోడ్డు మార్జిన్లో తూర్పు కాల్వ గట్టుపై మట్టిలో ఇరుక్కుపోయింది. ఇంకొంచెం వెళ్లి ఉంటే బస్సు కాల్వలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సును పొక్లెయిన్తో లాగాల్సి వచ్చింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెదకూరపాడు: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని రామాపురం – అత్తలూరు గ్రామాల మధ్య కొత్తలూరు గ్రామానికి చెందిన పుట్టి ఆంజనేయులు ఐదు ఎకరాలలో జామాయిల్ తోటలో సాగు చేశాడు. కర్ర కొట్టించేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. -
శిక్షణకు సిద్ధం.. సత్తా చాటుతాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒకప్పుడు క్రికెట్ అంటే కుర్రాళ్లే ఉత్సాహంగా ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలికలు, యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వసతులను సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని శ్రమిస్తున్నారు. అప్పట్లోనే సకల వసతులు గతంలో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ గుంటూరులోని జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఉండేది. ఇక్కడ ఆటతోపాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో జాగర్లమూడి నరేంద్రనాథ్ వంటి కొందరు మహిళా క్రికెట్ అకాడమీని ఇక్కడకు తీసుకు రావడానికి తీవ్ర కృషి చేశారు. క్రికెట్కు సేవలందించారు. ఆయన మరణంతో మహిళా క్రికెట్ అకాడమీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయింది. జిల్లాలో క్రికెట్ ఆడే యువతుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకానొక దశలో అన్ని ఫార్మెట్లలో కలిపి 15 మంది కూడా ఉండేవారు కాదంటే నమ్మాల్సిందే. గత ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అందుకుంది. దీంతో మన దేశంలో యువతుల్లో క్రికెట్పై జోష్ పెరిగింది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇక్కడ క్రికెట్ అంతా బాగుంది. మాలాంటి వారికి మహిళా క్రికెట్ కోచ్ ఉంటే మరింత బాగుంటుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. అండర్–19, 23 స్టేట్ ఆడాను. గత ఏడాది చేసిన రెండు సెంచరీలు నాలో ఆత్మ విశ్వాసం పెంచాయి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. – ఎం.హాసినీ చౌదరి, గుంటూరు నేను దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా. ఒక పక్క చదువుతోపాటు క్రికెట్ సాధన చేస్తున్నా. ఈ క్రమంలో అండర్–16, 19, 23 స్టేట్తోపాటు సీనియర్ విభాగంలోనూ రాణిస్తున్నా. 2021లో జోనల్స్లో 5 వికెట్లు తీయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆల్రౌండర్గా రాణించాలని , జాతీయస్థాయిలో ఆడాలనేదే లక్ష్యం. – ఎస్.లక్ష్మీ ప్రసర్తి, గుంటూరు అదరగొడుతున్న మహిళా క్రికెటర్లు అవకాశాలు కల్పిస్తున్న ఏసీఏ గుంటూరు జిల్లాలో వందమందికిపైగా క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం త్వరలో మహిళా క్రికెట్ కోచ్ నియామకం ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లోనూ కలిపి క్రికెట్ ఆడే వారు దాదాపు 100 మంది ఉన్నారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఆదివారం స్థానిక అరండల్పేటలోని జీడీసీఏ సారథ్యంలో త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్లో సుమారు 70 మంది హాజరయ్యారు. దీనికి తోడు రంజీ మాజీ క్రీడాకారులు సరస్వతి రెడ్డి, శరత్తోపాటు సీనియర్ కోచ్ ఇండ్ల భాస్కర్లు శిక్షణ, అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లు త్రీమెన్ కమిటీలో ఉండడం మహిళా క్రికెట్లో జోష్ పెంచుతోంది. త్వరలో ఇక్కడకు మహిళా కోచ్ కూడా రానున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ, జిమ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పించారు. -
భార్య పుట్టింటికి వెళ్లటంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
నాదెండ్ల: వ్యవసాయంలో నష్టాల కారణంగా అప్పుల బాధ, మరోపక్క భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందన్న మనస్థాపంతో కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. తూబాడు గ్రామానికి చెందిన దన్నవరపు వెంకటేశ్వర్లు (35) గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సాగులో నష్టాల కారణంగా అప్పుల భారం పెరిగి ఆర్థికంగా సతమతమయ్యేవాడు. ఈ నేపధ్యంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈక్రమంలో భార్య, ఇరువురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 11 గంటల సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. చికిత్స సమయంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య పుట్టింటికి అలిగి వెళ్లినందుకు మనస్తాపానికి గురైనట్లు తెలిపాడు. పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీలు నరసరావుపేట: పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణ్రోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల మండలంలో 41.6 డిగ్రీలు, వెల్దుర్తి 42.5, దుర్గి 42.6, రెంటచింతల 44.0, గురజాల 44.1, దాచేపల్లి 44.8, కారెంపూడి 44.0, పిడుగురాళ్ల 48.1, మాచవరం 44.3, బెల్లంకొండ 43.5, అచ్చంపేట 45.4, క్రోసూరు 45.8, అమరావతి 45.0, పెదకూరపాడు 43.3, సత్తెనపల్లి 42.5, రాజుపాలెం 43.9, నకరికల్లు 41.9, బొల్లాపల్లి 42.9, వినుకొండ 42.9, వినుకొండ 42.9, నూజెండ్ల 42.6, శావల్యాపురం 43.6, ఈపూరు, రొంపిచర్ల 44.1, నరసరావుపేట, ముప్పాళ్ల, చిలకలూరిపేట 44.3, యడ్లపాడు 43.9, నాదెండ్ల 44.2 డిగ్రీలు నమోదయ్యాయి. ముప్పాళ్ళ: పాత కక్ష్యల నేపధ్యంలో వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొని చంపేందుకు యత్నించిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ ఆదివారం తెలిపారు. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా బొల్లవరం అడ్డరోడ్డు వద్ద అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి మట్టి లోడుతో ట్రాక్టర్తో వస్తూ వెనుకగా ఢీ కొట్టాడు. శివారెడ్డి ద్విచక్రవాహనంతో పక్కనే పంట కాలువలో పడటంతో కాలుకు తీవ్రగాయమైంది. గాయపడిన శివారెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై శివారెడ్డి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తెలిపారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు ఆదివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లటంతో లాంచీస్టేషన్కు రూ.45వేల ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని 9 అడుగుల బుద్దుని పాలరాతి విగ్రహం, బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. -
క్షయ విభాగంలో జాగ్రత్తే లేదయా..
● వైద్యశాలలో ప్రశ్నార్థకంగా ఆరోగ్య భద్రత ● గర్భిణులు, టీబీ పేషెంట్లకు పక్కపక్కనే వైద్యసేవలు ● రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో గర్భిణుల్లో ఆందోళన ● ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రోగుల మండిపాటు ● వైద్యాధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు నరసరావుపేట టౌన్: ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి నేడు అంటువ్యాధుల కేంద్రంగా మారింది. వైద్యాధికారుల నిర్లక్ష్యం తల్లీబిడ్డల ప్రాణాలమీదకు తెస్తోంది. టీబీ రోగులకు, గర్భిణులకు పక్కపక్కనే వైద్యసేవలు అందించటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల్లో టీబీ వంటి అంటువ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఒకవైపు వైద్యసేవలు అందిస్తూనే పక్కనే గర్భిణులకు పరీక్షలు నిర్వహించటం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా గర్భిణులు, బాలింతల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యంత సున్నితమైన సమయంలో టీబీ రోగుల పక్కగదిలోనే పరీక్షించటం దారుణమని గర్భిణులు వాపోతున్నారు. అడుగు పెట్టినప్పటి నుంచి కష్టాలే.. పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలకు నిత్యం పల్నాడు జిల్లాతో పాటు మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది వైద్యసేవల కోసం వస్తుంటారు. గర్భిణులుప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు ఓపీ సేవల నిమిత్తం వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా మరో వంద మంది వరకు సేవలు పొందుతున్నారు. ఏరియా వైద్యశాలలో గర్భిణులకు కొన్నేళ్లుగా మెరుగైన సేవలు అందక అష్ట కష్టాలు పడుతున్నారు. వైద్యశాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి దశలో వారిని సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. గర్భిణులకు ప్రత్యేక క్యూలైను ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో సేవల కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గైనిక్ విభాగం ఆనుకొని టీబీ రోగుల విభాగం కొనసాగుతోంది. అక్కడే రోగులకు చికిత్స అందించడం, కళ్లె పరీక్షలు నిర్వహిస్తుంటారు. పసిపిల్లలను చేతుల్లో పెట్టుకొని గైనిక్ విభాగానికి వచ్చే తల్లులు అక్కడి పరిస్థితులను చూసి భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందని కలవరపడుతున్నారు. ప్రస్తుతం వైద్యశాల్లో ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. గైనిక్ విభాగానికి ఆనుకొని ఉన్న టీబీ యూనిట్ను వెంటనే మరో భవనానికి లేదా ప్రాంతానికి తరలించాలని గర్భిణులు డిమాండ్ చేస్తున్నారు. కనీస ఆరోగ్య భద్రత ప్రమాణాలు పాటించకుండా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. అమ్మ కాబోతున్న వారి కన్నుల్లో చిన్నారి నవ్వుల కలలు మెదులుతుంటే.. పక్కనే టీబీ రోగులకు చికిత్స చేస్తున్నారనే భయమే ఎక్కువగా ఉంటోంది. పరీక్షలంటూ చీటీ చేతిలో పట్టుకుని లైనులో టీబీ రోగుల పక్కనే నిలబడితే ఆరోగ్యానికి రక్షణ ఎక్కడని గర్భిణుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలే ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన గైనిక్ సేవలు తల్లీబిడ్డల ఆరోగ్యంపై వందల ప్రశ్నలు సంధిస్తున్నాయి. వార్డులు వేరు చేయడం అంత కష్టమా అంటూ గర్భిణుల జాలిచూపులు వైద్య యంత్రాంగాన్ని నిలదీస్తున్నాయి. -
ఎండల నుంచి కాస్త ఉపశమనం
పిడుగురాళ్ల: గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో పిడుగురాళ్ల ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా నిప్పుల కొలిమిలా మారి తీవ్ర ఆందోళన చెందే సమయంలో అకస్మాత్తుగా ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. వర్షంతోపాటు చిన్న చిన్న వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులు వీయటంతో వాతావరణం అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. సాయంత్రం 3 గంటల వరకు ఎండ భారీగా పెరిగి ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదు అయింది. అనంతరం ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణ ప్రజలు కాస్త సేదతీరారు. ఈదురు గాలుల దెబ్బకు పట్టణంలో విద్యుత్తు సరఫరా ఆపివేశారు. మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత రాత్రికి సరఫరా పునరుద్ధరించారు. -
రఘురామ కృష్ణరాజును పదవి నుంచి తొలగించాలి
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల దళిత సామాజిక వర్గం ఓట్లపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే అని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ఒక వర్గాన్ని అవమానించేలా మాట్లాడడంపై సామాజిక, రాజకీయ రంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమతున్నాయని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోరాడి సాధించిన శక్తివంతమైన ఓటు హక్కును, దళిత సమాజ ఆత్మగౌరవాన్ని తక్కువచేసి మాట్లాడం తగదని పేర్కొన్నారు. చట్టసభల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీల జెండాలను పక్కన పెట్టి, తమ సామాజిక వర్గ హక్కుల కోసం గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామంలో ఈనెల 17వ తేదీన ఆస్తి కోసం వృద్ధురాలిని హత్య చేసిన హంతకులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సురేష్, ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాగవరం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వివాహం సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ అదనపు కట్నంతోపాటు అత్త పేరున ఉన్న ఇంటిని రాయించుకురావాలని వేధిస్తున్నాడు. అదే సమయంలో తాకట్టులో పెట్టిన వెండి వస్తువుల గురించి అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్ తరచూ అడుగుతున్నారు. దీంతో వారిని హత్య చేస్తే అడ్డు తొలగిపోతుందని పథకం వేసుకున్నారు. దీంతో సాయంత్రం భార్య కరిష్మా, అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్(75), ఇర్ఫాన్లపై ఇనుపరాడ్లు, కర్రలు, కారంతో దాడిచేయగా వృద్ధురాలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న మస్తాన్వలి, సోదరులు ఇమాంసా, షేక్ ఇబ్రహీం, తండ్రి షేక్ మస్తాన్ వలి, తల్లి షేక్ సైదాబిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు నాటు కర్రలు, రెండు ఇనుపరాడ్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. -
కిశోరీ వికాసం!
సత్తెనపల్లి: కిశోరి బాలికల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమం తూతూమంత్రంగా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్య దశలోనే లైంగిక వేధింపులు, పదో తరగతి పూర్తి కాకముందే మూడు ముళ్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు అనేక రకాల వేధింపులు వంటి చర్యలతో ఏం చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు కిశోరి వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కార్యక్రమం నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం పైసా నిధులు విదల్చని పరిస్థితి ఉంది. నిధుల కొరతతో కౌమార దశలో ఉన్న బాల,బాలికల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిశోరి వికాసం కార్యక్రమం గాడి తప్పుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు వారి సొంత డబ్బులు వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా .. ఫొటోలకు ఫోజులిస్తూ ప్రచార ఆర్బాటం చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు... జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఈ నెల 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు 11 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాలలోపు బాలురను గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. ఇందులో విద్య, ఆరోగ్యం సచివాలయం, మెప్మా, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ, ఆర్పీలు భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే ఐసీడీఎస్ అధికారులు బాల,బాలికలకు కలిపి ఉదయం పూట ఈ కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎగ్గొట్టేస్తున్నారని తెలు స్తుంది. ఈ కార్యక్రమంలో కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది కూడా గైర్హాజరవుతున్నా రన్న విమర్శలు లేకపోలేదు. -
విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
కారెంపూడి: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సెక్షన్ ఆఫీస్ వద్ద మండలంలోని పేటసన్నెగండ్ల శివారు సింగరుట్ల తండా రైతులు శుక్రవారం రాత్రి ఽఆందోళనకు దిగారు. తమ తండాకు నాలుగు రోజులుగా కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందికి అధికారులకు ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదన్నారు. తండాకు వచ్చే జంపర్లు ఎత్తేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని రోజుకు అనేక సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కరెంటు లోవోల్టేజీ హైలోవోల్టేజి వల్ల 10 మోటార్లు దాకా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జొన్న రైతుల సమస్యలపై స్పందించండి జిల్లా కలెక్టర్కు అంబటి వినతిపత్రం గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గంతోపాటు, జిల్లాలో జొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మకు శనివారం సాయంత్రం కలెక్టరేట్లో కలిసి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా, పొన్నూరు శాసనసభ్యుడితోపాటు, మరికొందరు దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, నేతలు పాల్గొన్నారు. -
జంతు వధలో నిబంధనలు పాటించాలి
నరసరావుపేట: బక్రీద్ పండుగను ముస్లింలు సుహృద్భావ వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ కోరారు. పండుగ నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాంస విక్రయాలను నిర్దేశిత ప్రాంతాలలోనే చేపట్టాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జీవాలను అక్రమంగా తరలించరాదని, జంతు వధలో నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి కోసం నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాసమూర్తిని నియమించామన్నారు. 88973 74437 ఫోనులో నంబరులో ఆయన్ను సంప్రదించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎస్పీ, ఆర్డీఓ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఒక కమిటీ, డివిజనల్ స్థాయిలో డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఒక కమిటీ, మండల స్థాయిలో తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. వారు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ‘జలధార–జలహారతి’ పనులపై దృష్టి నరసరావుపేట: రాష్ట్రంలో చేపట్టిన ‘జలధార– జలహారతి’ పనులను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో పురోగతి వివరాలు వెల్లడించారు. మొత్తం 736 పనులను గుర్తించగా, 635 పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ప్రస్తుతం 577 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా, 15 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 43 పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రూ.19.32 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. జూన్ 30 నాటికి చెల్లింపులతో సహా అన్ని ప్రక్రియలను ముగించాలని స్పష్టం చేశారు. పీడీ డ్వామా సిద్ధ లింగమూర్తి, భూగర్భ జలాల శాఖ డీడీ రాంబాలాజీరెడ్డి, మైనర్ ఇరిగేషన్ డీఈ, పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ -
విత్తన దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
రూ.6.76 లక్షల విత్తన విక్రయాలు నిలిపివేత నగరంపాలెం: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ అధికారులతో కలిసి శనివారం విత్తనాల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలను నిశితంగా పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణం బోస్రోడ్డులోని వాసవి ఎంటర్ప్రైజెస్, అనంతలక్ష్మి ట్రేడర్స్ల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. రికార్డులను నిర్వహించకపోవడం, విత్తనాలకు సంబంధించి మూల సంస్థ ధృవీకరణ పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ రెండు దుకాణాల్లో రూ.6.76 లక్షల విలువ చేసే 889 ప్యాకెట్ల విత్తన విక్రయాలను నిలుపుదల చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారాలన్న లక్ష్యంతో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా బీచ్ వద్ద పర్యాటకులు, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనన్ ఇన్నిస్టిట్యూట్ ఛైర్మనన్ విక్రమ్ నారాయణ ఉచితంగా జూట్ బ్యాగులను సమకూర్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల తీర ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార (జూట్) సంచులను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్న్చార్జి పర్యాటక శాఖ అధికారి సత్యపాల్ ఆనంద్, బీచ్ సూపర్వైజర్ జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: కొండవీడు కోటను శనివారం పర్యాటకులు విశేషంగా సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ చొరవతో చేపట్టిన ఈ పర్యాటక కార్యక్రమాలు శనివారం సాయంత్రం నుంచి కోట ప్రాంగణంలో ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటు చేసిన నైట్ టెంటెడ్ అకామడేషన్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. యువత, ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, సాంప్రదాయ ఆటలు, వినోదాత్మక గేమ్స్ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. పర్యాటకులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, కొండవీడును రాష్ట్రస్థాయి ఎకో–టూరిజం గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.ఔట్ రైవల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ దలవాయి ఆషా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం రాజు, ఏబీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
● జీవిత చక్రం.. జాగ్రత్తన్నా!
డ్రైవింగ్ అంటే ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. ఎంతో మంది జీవితాలు వారి చేతిలోనే ఉన్నాయి. అలాంటి బస్సు డ్రైవర్ సెల్ ఫోన్లో ఏదో చూస్తూ వాహనాన్ని నడిపేస్తున్నాడు. మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఎక్కారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా సెల్ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారు. గుంటూరు నుంచి కొండమోడు వరకు బైపాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒక లైన్ మాత్రమే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలోనూ డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. – పిడుగురాళ్ల -
పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం
సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.మధ్యాహ్నం రేపల్లె ఇన్ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు. -
రైతులపై రుణ భారం
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, మధ్యతరగతి వర్గాల బతుకులు అధ్వానంగా మారాయి. పంట సాగు చేయడం మొదలు దాన్ని విక్రయించే వరకూ నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినా పరిహారం సొమ్ములు రాక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా అన్నదాతలను రెన్యూవల్ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. పంట, బంగారం రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ కట్టాలంటూ బ్యాంకులు తేల్చి చెబుతుండడంతో వడ్డీ వ్యాపారులు కర్షకులు ఆశ్రయించి నష్టపోతున్నారు. సత్తెనపల్లి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన కొత్త బంగారు, పంట రుణాల నిబంధనలు రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి. గతంలో కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను మరో ఏడాది పాటు రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం అసలు, వడ్డీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తేనే పాత అప్పును క్లోజ్ చేసి... ఒక రోజు తరువాత మళ్లీ కొత్త రుణం మంజూరు చేస్తున్నారు. ఈ విధానంతో రైతులే కాకుండా చిరు వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. అన్నదాతలకు కష్టాలు జిల్లాలో వ్యవసాయ పెట్టుబడులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందడం సర్వసాధారణం. బ్యాంకుల్లో పంట, బంగారు రుణాలు తీసుకున్న రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సాధారణంగా మే, జూన్, జూలై మాసాల్లో వ్యవసాయం కోసం పట్టాదారు పాస్పుస్తకాలు పెట్టి రుణాలు తీసు కుంటారు. మరి కొందరు బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రుణాలు తీసుకుంటారు. వాటిని ఏటా వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకుంటారు. అయితే బ్యాంకుల్లో తీసు కున్న అప్పునకు వడ్డీ కడితే చాలు రెన్యూవల్ చేస్తారు. అయితే ప్రస్తుతం బ్యాంకులు వడ్డీతో పాటు గత ఏడాది తీసుకున్న అసలుతో కలిపి చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలనే నిబంధనలు పెట్టారు. దోచుకుంటున్న వడ్డీవ్యాపారులు రెక్కాడితే కానీ డొక్కాడని రైతన్నలు రుణాలు రెన్యూవల్ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అసలుతోపాటు వడ్డీ కట్టాలని బ్యాంకర్లు చెబుతుండడంతో చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల ముందే తిష్ట వేసి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న రైతులను గుర్తించి వారికి అధిక వడ్డీలకు ఇచ్చి దోచుకుంటున్నారు. వారం వ్యవధిలో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని బ్యాంకులో ఉన్న అసలు, వడ్డీ డబ్బులు అందిస్తున్నారు. బ్యాంకులు రెన్యూవల్ చేసిన రోజే డబ్బు తిరిగి రైతుకు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులు రుణ మొత్తాన్ని వారం రోజులకు చెల్లిస్తుండడంతో వడ్డీ వ్యాపారులకు అడిగినంత చెల్లించాల్సిన దుస్థితి. జిల్లాలో అత్యధికంగా రైతులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సహకార పరపతి సంఘాల్లో వ్యవసాయ పంట రుణాలు, బంగారు రుణాలు తీసుకుంటారు. రూ. లక్షకు వారానికి వడ్డీ రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పాత విధానాన్ని కొనసాగించాలని రైతులు, పేద, మధ్య తరగతి కుటుంబాలు మొర పెట్టుకుంటున్నాయి. కేవలం వడ్డీ మాత్రమే తీసుకొని పునరుద్ధరించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులను అప్పు కోసం ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని వారు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏదీ కలిసి రావడం లేదు. సంక్షేమ పథకాలు అందక, గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహారం అందక, ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారులు చేతికి చిక్కి రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం ఎన్ని అగచాట్లు పడాలో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదని, ప్రభుత్వం కనీసం ఈ ఏడాదైనా అన్నదాత సుఖీభవ మొత్తాన్ని ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఈసారి వ్యవసాయం కత్తి మీద సామే అవుతుందంటున్నారు. -
పిడుగురాళ్లపై భానుడి పగ
పిడుగురాళ్ల: ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని పిడుగురాళ్ల ప్రాంతంలో ఎండ తీవ్రత భారీగా స్థాయిలో పెరిగింది. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా గత రెండు రోజుల్లో 47. 6 నుంచి 48.1 డిగ్రీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ప్రాంత ప్రజలు షాక్ అయ్యేలా నమోదు అయ్యాయి. అదే క్రమంలో శుక్రవారం కూడా అత్యల్పంగా 31 డిగ్రీల నుంచి అత్యధికంగా 46.8 డిగ్రీల వరకు నమోదు అయింది. మరో వారం రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండ దెబ్బకు ప్రజల రాకపోకలకు కూడా ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ సైతం మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిచ్చింది. నిత్యం ప్రజలతో, వ్యాపారులతో కళకళలాడే ఐలాండ్ సెంటర్, పిల్లుట్ల రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. చిరు వ్యాపారులు సైతం తోపుడు బండ్లపై దుప్పట్లు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అత్యవసరంగా బయటకు వచ్చే మహిళలు, యువకులు టవల్, ఇతర వస్త్రాలు వంటివి ధరిస్తున్నారు. చిన్నారులు ట్యూషన్కు వెళ్లేందుకు తలకు రుమాళ్లు ధరించి, గొడుగులు వేసుకొని వెళ్తున్నారు. పరిశ్రమలు ఎక్కువ... చెట్లు తక్కువ... పిడుగురాళ్ల పట్టణంలో సున్నపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో లైమ్ సిటీ అనే పేరు వచ్చింది. ఈ లైమ్సిటీలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, చెట్లు లేకపోవటంతో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి తోడుగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు, అద్దంకి నార్కెట్పల్లి నిర్మించే సమయంలో పెద్ద పెద్ద చెట్లను అడ్డగోలుగా తొలగించారు. తిరిగి రోడ్లను నిర్మించిన తర్వాత మొక్కలను నాటలేదు. ఇటీవలే జానపాడు రోడ్డులో కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణలో భాగంగా భారీ చెట్లను తొలగించారు. తిరిగి మొక్కలు నాటలేదు. అలాగే పట్టణంలో కూడా రోడ్డు విస్తరణ చేసినపుడు పెద్ద చెట్లను తొలగించారు. పిల్లుట్ల రోడ్డు విస్తరణ, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మొక్కలు నాటక పోవటంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సున్నపు పరిశ్రమలో బొగ్గురాయిని కాల్చి సున్నంలా తయారు చేసే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలలో కాల్చటం కూడా కారణంగా చెబుతున్నారు. భూగర్భజలాలలో ఉన్న రాయిని వెలికి తీయటం వలన కూడా ప్రకృతిలో ఉష్ణోగ్రతలు మార్పులు జరగటం వలన గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలోనే పిడుగురాళ్లలో అత్యధికంగా నమోదు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్న ఐలాండ్ సెంటర్ కూలీలు లేక ఖాళీగా దర్శనమిస్తున్న సున్నపు పరిశ్రమ -
బంగారంలోనూ మాఫియా!
నరసరావుపేట టౌన్: నరసరావుపేట బంగారం వ్యాపారానికి ఎంత ప్రసిద్ధి చెందిందో.. అదే స్థాయిలో అక్రమ బంగారం వ్యాపారానికి కూడా కేరాఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అక్రమ మార్గంలో బంగారం రవాణాకు పాల్పడుతున్నారు. చైన్నె, కేరళం రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని బంగారం బిస్కెట్లను రహస్యంగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తూ కొందరు వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచటంతో అక్రమ వ్యాపారులకు కనకవర్షం కురిపిస్తోంది. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారంపై అధిక పన్నులు ఉండటంతో స్మగ్లింగ్ ద్వారా వచ్చే బంగారం మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తోంది. ఈ తేడానే అక్రమార్కులకు భారీ లాభాలను చేకూర్చుతోంది. ఫలితంగా రోజు రూ.కోట్ల ల్లో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. రూ.45 లక్షలతో పట్టుబడ్డ మధ్యవర్తి నరసరావుపేటకు చెందిన హనీఫ్ గత మంగళవారం చైన్నెలో అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా చిలకలూరిపేట రూరల్ పోలీసులకు చిక్కాడు. లెక్క చూపని సుమారు రూ.45 లక్షలు అతని వద్ద స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. దీంతో అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగు చూసింది. చైన్నెలో పన్ను చెల్లించని బంగారం బిస్కెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నరసరావుపేటలో కొంతమంది హోల్సేల్ వ్యాపారులకు కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటివరకు కొంతమంది ముఠా వేల సంఖ్యలో బిస్కెట్లు రహస్యంగా తరలించి వ్యాపారులకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు హనీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో నరసరావుపేట అక్రమ వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. తమ పేర్లు బయట పడతాయన్న భయంతో అప్రమత్తమైన వ్యాపారులు ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి జారుకున్నారు. మరికొంత మంది వ్యాపారులు బంగారం నిల్వలను రహస్య ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు రూ.45 లక్షల నగదుతో పట్టుబడ్డ నరసరావుపేట వాసి హనీఫ్ (ఫైల్) అక్రమ బంగారం వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చట్టబద్ధంగా దిగుమతి చేసుకొనే బంగారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే స్మగ్లింగ్ ద్వారా వచ్చే బంగారం మార్కెట్లోకి చేరటంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల మేరకు గండి పడుతోంది. విదేశాల నుంచి అక్రమంగా వచ్చే బంగారం మార్కెట్ ధరకంటే తక్కువగా లభిస్తుండటంతో ఒక్కో బిస్కట్పై సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బంగారంపై ఉన్న 6 శాతం ట్యాక్స్ను ఇటీవల 15 శాతానికి పెంచటంతో అక్రమ రవాణాకు మరింత ప్రోత్సాహం పెరిగింది. దిగుమతి పన్నులు చెల్లించకుండా తక్కువ ధరకు వచ్చిన బంగారాన్ని స్థానిక మార్కెట్లో జీఎస్టీ సైతం లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. బహిరంగ ధర కంటే కొంత తక్కువ ధరకు విక్రయించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో వ్యాపారుల్లో ఎక్కువ శాతం ఈ అక్రమ కార్యకలాపాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ బంగారం అక్రమ వ్యాపారం ఒకరిద్దరితో పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. చైన్నె, కేరళం రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వ్యక్తులు, రవాణా చేసే యువకులు వాటిని దాచిపెట్టి చివరకు మార్కెట్లో విక్రయించే వ్యాపారులు ఇలా ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్లో బిల్లులు లేని బంగారం బిస్కెట్లను కోడ్ భాషలో (ఎస్పీ) అని పిలుస్తున్నారు. సాధారణ వ్యాపార లావాదేవీల మాదిరి కాకుండా రహస్య సంకేతాలతో ఈ వ్యాపారం సాగుతొంది. స్మగ్లింగ్ ముఠా ప్రతి రోజు నలుగురు నుంచి ఐదుగురు యువకులను చైన్నెకు పంపుతున్నట్లు సమాచారం. అక్కడ బిల్లులు లేని బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసి బస్సులు, రైలు మార్గం ద్వారా నరసరావుపేటకు తీసుకొస్తున్నారు. కొంత మంది యువకులకు ఇది ఉపాధిగా మారింది. పట్టుబడితే ప్రధాన నిందితుల వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు నిర్వాహకులు తెరవెనుక మంతనాలు నడుపుతారని తెలుస్తోంది. -
ల్యాప్టాప్ లంచం డిమాండ్కు షోకాజ్ నోటీస్
తెనాలి: ‘పేరు మార్చాలంటే ల్యాప్ట్యాప్లు ఇవ్వాల్సిందే’...శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. పట్టణంలో కొత్తగా వివిధ అపార్టుమెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు, తమ పేరిట పన్ను విధింపునకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 మంది దరఖాస్తుదారులు, ఆ పరిధిలోని సచివాలయం బాధ్యతలు చూస్తున్న మున్సిపల్ ఉద్యోగిని కలిసి పన్ను మార్పు చేయించమని కోరారు. సదరు ఉద్యోగి రెండు ల్యాప్ట్యాప్లు కొని ఇస్తేనే పేరు మార్పు చేస్తానని షరతు విధించారు. నెలలు గడుస్తున్నా ఇంటి పన్నుకు పేరు మారకపోవటంతో ప్లాట్ల యజమానులు మున్సిపల్ అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. దీనిపై అధికారులు విచారించినపుడు ఆ ఉద్యోగి వాస్తవమేనని అంగీకరించాడు. హెచ్చరికలతో వదిలేసిన అధికారులు ఈ వ్యవహారమంతా ‘సాక్షి’లో ప్రచురితం కావటంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంటు ఏడుకొండలుకు షోకాజ్ నోటీసు జారీచేశారు. సమాధానం ప్రకారం అనంతర చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేశారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
పట్నంబజారు: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట పోలీసు స్టేషన్ సీఐ ఎం.వీరయ్యచౌదరి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అప్పిఆలూరు గ్రామానికి చెందిన హిరేకాంక్షి నిషార్ అహ్మద్ అలియాస్ ఆరీఫ్ అనే యువకుడు విశాఖపట్నం వెళ్లి ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. తిరిగి వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి కర్ణాటక రాష్ట్రం వెళ్లేందుకు వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిషార్ అహ్మద్ వద్ద ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
అమెరికాలో పల్నాడు జిల్లా ఫాదర్ వేళంగిణిరెడ్డి మృతి
అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువుకు చెందిన విచారణకర్త రెవ.ఫాదర్ తుమ్మా వేళంగిణిరెడ్డి (45) సువార్త ప్రచారం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. వీరి స్వగ్రామం తాళ్లచెరువు కాగా ఇదే గ్రామంలోని బాలయేసు చర్చిలో విచారణకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో విచారణకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి యేటా మే నెలలో సువార్త ప్రచారం కోసం అమెరికా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేశారు. ఆయన సోదరుడు సాగర్థామస్రెడ్డి సినిమా డైరెక్టర్కా గా, తల్లి నిర్మలామేరి విశ్వాసురాలు. తండ్రి పీటర్రెడ్డి దైవసేవకులుగా పనిచేస్తూ క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. ఆయన విచారణ గురువులుగా ఫిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, యనమదల, పెద్దపలకలూరు తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాళ్లచెరువు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పాలువాయిలో విషాదం రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు. యడ్లపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రమైన యడ్లపాడు 16వ జాతీయరహదారిపై రామాలయం సమీపాన ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటుతుండగా అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం అతన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నిలుపుదల చేయకుండా వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, అతని వయస్సు సుమారు 35 నుండి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతను భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా భావిస్తున్నామని తమ ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. వినుకొండ: పట్టణంలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. -
పల్నాడు
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,000, గరిష్ఠ ధర రూ.6,200, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. 7 -
పలు రైళ్లు తాత్కాలిక రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉన్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ – గుంటూరు(రైలు నంబర్ 57201), గుంటూరు – మాచర్ల (57203), మాచర్ల – నడికుడి (57206), నడికుడి–మాచర్ల (57205), మాచర్ల –గుంటూరు (57204), గుంటూరు – విజయవాడ (57202), విజయవాడ – గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67223), రేపల్లె–తెనాలి (67224), తెనాలి– విజయవాడ (67222), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె– తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233), రేపల్లె–గుంటూరు (67234), గుంటూరు– రేపల్లె (67235), మార్కాపురం రోడ్ – తెనాలి (67239), తెనాలి – గుంటూరు (67236), గుంతకల్లు–మార్కాపురం రోడ్ (57407) రైళ్లు ఈనెల 23, 24, 30, 31 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం రోడ్డు– గుంతకల్లు (నంబర్ 57408) రైలు ఈ నెల 24, 25, 30, జూన్ 01వ తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రేపల్లె –మార్కాపురం రోడ్డు (67238) రైలు గుంటూరు, మార్కాపురం రోడ్డు మీదుగా ఈనెల 23, 24, 30, 31 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షిత్ జ్యూయలర్స్లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను, నగదును అపహరించారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. షాపు లోపల డిజిటల్ వీడియో రికార్డు బాక్స్ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్ కుక్కలు పసికట్టకుండా కారం చల్లినట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు రూరల్: మండలంలోని చిన్నపలకలూరు రైల్వే గేట్ వద్ద నల్లపాడు–బండారుపల్లి స్టేషన్ల మధ్య రైల్వే గేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణానికి శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, మెరుగైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా భద్రతను పెంపొందించడం అవసరమన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.శోభారాణికి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడుజిల్లా డీఎంహెచ్ఓగా గతంలో విధులు నిర్వహించారు. రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్టుగా పనిచేస్తూ ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. జి.శోభరాణిని ఆర్టీ కార్యాలయం డీడీ పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, విజయకుమార్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీక్రాంత్, బి.శ్యామ్అనిల్ అభినందించారు. -
కారు, ద్విచక్రవాహనం ఢీ
నలుగురికి గాయాలు మాచర్ల రూరల్: కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీశైలం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించే సమయంలో గొట్టిపాళ్ల నుంచి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు పులిమెల కోటయ్య తలకు తీవ్ర గాయాలై, ఎడమ కాలు విరిగింది. మరొక వ్యక్తి పులిమెల అశోక్కు కారు గ్లాసు ముఖం పై గుచ్చుకుంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు రాష్ట్ర పదవులు
ఆందోళనలో బాఽధితులు మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లోను ఫిర్యాదు చేశారు. -
సముద్రతీరంలో మృతదేహం లభ్యం
చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్ ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్ ఎస్ఐ 9121102144, చీరాల రూరల్ సర్కిల్ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట టౌన్: ముస్లిం మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు శుక్రవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో రోజురోజుకు అతని ఆగడాలు పెరిగిపోయాయన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ముస్లిం మహిళ పట్ల దారుణంగా వ్యాఖ్యలు చేశాడన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వన్టౌన్ సీఐ ఫిరోజ్ ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మస్తాన్వలి, మౌలాలి, లియాజ్ బాషా తదితరులు ఉన్నారు. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.వి.సుందరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డీసీఆర్ సమావేశ మందిరంలో నిర్వహించబడనని వెల్లడించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర అంశాలు ఉన్న అభ్యర్థులు అవసరమైన ఆధారాలతో హాజరై తమ అభ్యంతరాలను డీపీసీ సభ్యుల ముందు వినిపించవచ్చని తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి పేర్కొన్నారు. భువనగిరి(బీబీనగర్): ఏపీని నుంచి వలస వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగోముల గ్రామంలో డెయిరీ ఫాంలో పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల శౌరిబాబు తన భార్య మౌనికతో కలిసి నెమురగోముల గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా శౌరిబాబు పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తుంటాడు. గత రెండు నెలలుగా పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లకపోవడంతో అతడి సోదరుడు మల్లేశ్వర్రావు శుక్రవారం నెమురగోముల గ్రామానికి వచ్చాడు. ఇక్కడ శౌరిబాబు లేకపోవడం, అతడి భార్య పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
ఖాతార్నాక్ సమస్యలు
నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల తరువాత ఆ హోటల్ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. స్థానిక అరండల్పేటలోని బ్యాంక్కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ క్రికెట్ యాప్ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్కు వచ్చి తిని ఫోన్ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్ నేరాలు, క్రికెట్ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి.సాక్షి, నరసరావుపేట: క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైం, మనీలాండరింగ్ వంటి వాటితో ఏమాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేకపోయినా కొందరి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నోయో తెలియక బ్యాంకులకు వెళ్లిన వారు పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది. మీ ఖాతాకు క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వినియోగించే వారి నుంచి నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తి నగదు జమ చేశాడని చెబుతున్నారు. మీ ఖాతాలు తిరిగి వినియోగించాలంటే సదరు క్రికెట్ బుకీపై కేసు నమోదైన పోలీసుస్టేషన్కు వెళ్లి ఎన్ఓసీ తీసుకురావాలని పేర్కొంటున్నారు.కొన్నిసార్లు కేసులు ఉత్తర భారతదేశంలో నమోదు కావడంతో అక్కడికి వెళ్లలేక ఖాతాలను అలానే వదిలేసిన సందర్భాలు లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బ్యాంక్ సిబ్బంది మామూళ్లు తీసుకొని ఫ్రీజ్ అయిన ఖాతాలను తెరిపించే దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న సమస్యలు ముఖ్యంగా వ్యాపారాలు, అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసే వారే ఉంటున్నారు. దీంతో చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వారి ఖాతాలు నెలల కొద్దీ ప్రీజ్ అయ్యి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఏటీఎం కేంద్రాల వద్ద...బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వినియోగదారులలో ఆన్లైన్ లావాదేవీల తరువాత ఎక్కువ మంది ఏటీఎం కేంద్రాల వద్ద మోసపోతున్నారు. నగదు జమ కోసం వచ్చిన వారితో కొందరు క్రికెట్ బుకింగ్ ఏజెంట్లు మాట కలుపుతున్నారు. బంగారం కొంటున్నామని, దుకాణదారుడు నగదు రూపంలో అడుగుతున్నారని, క్యాష్ ఇస్తే చెప్పిన ఖాతాలో తమ మిత్రుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు జమ చేస్తారని చెబుతున్నారు. సులభంగా పని అవుతుండటంతో కొందరు సరేనని చెప్పి తమ వద్ద తెచ్చుకున్న నగదును క్రికెట్ బుకీలకు ఇస్తున్నారు.నగదు ఆన్లైన్లో జమ చేయించుకుంటున్నారు. అయితే సదరు క్రికెట్ బుకీలు ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే వారి ఖాతాలను పరిశీలించినప్పుడు వారితో ఏమాత్రం సంబంధం లేని నగదు అందజేసిన వ్యక్తి ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. అదే విధంగా కొందరు నగదు ఉపసంహరణ సమయంలో సైతం తాము క్యాష్ ఇస్తామని.. తమ మిత్రుడి ఖాతాకు ఫోన్ పే చేయాలని చెబుతున్నారు.వెయిటింగ్ లేకుండా వెంటనే నగదు మార్పిడి అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయడం ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరు నగదు ఇస్తున్నారు, ఎవరికి పంపుతున్నామో తెలియని వాటికి దూరంగా ఉండాలన్నారు. క్రికెట్ బుకీలు, సైబర్ క్రైం, ఇతర ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తుల ఖాతాలైతే సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పవు.ఎఫ్ఐఆర్ నమోదైన చోటకు వెళ్లాల్సిందే...అపరిచిత వ్యక్తులతో నగదు మార్పిడి వల్ల ఖాతాలు ఫ్రీజ్ అవ్వడంతోపాటు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయించుకోవడానికి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని ఖాతాలు ఉత్తరభారత దేశంలో ఉండటంతో అక్కడికి వెళ్లలేక కొత్త ఖాతాలు తెరిచిన సందర్భాలు లేకపోలేదు. సైబర్ మోసాల్లో నగదు కోల్పోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తామేమీ చేయలేమని బ్యాంక్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు నమోదైన చోటుకు వెళ్లి నో అబ్జక్షన్ సర్టీఫికెట్ (ఎన్ఓసీ) తెస్తేనే ఖాతాను పునరుద్ధరించగలమని చెబుతున్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి జాగ్రత్త పడటమే సులువైన మార్గమని అంటున్నారు. -
పరీక్షలు సమన్వయంతో నిర్వహించండి
నరసరావుపేట: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించే పదవ తరగతి రెగ్యులర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఎపాస్ (ఏపీఓఎస్ఎస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నీ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ నారదముని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయా విభాగాల అధికారులతో కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ నాలుగు వరకు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని 399 పాఠశాలల నుంచి 3112 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. నరసరావుపేట డివిజన్లో 13, సత్తెనపల్లి డివిజన్లో 11తో మొత్తం 24 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిని సమన్వయపర్చేందుకు 24 మంది చీఫ్ సూపరిండెంట్లు, 24మంది డిపార్టుమెంట్ అధికారులు, పరీక్షల పర్యవేక్షణకు మూడు ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అపాస్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహిస్తారని చెప్పారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ రెండు నుంచి ఆరు వరకు జరుగుతాయన్నారు. ఎస్ఎస్సీ పరీక్షలకు 765మంది, ఇంటర్మీడియెట్ పరీక్షలకు 1828తో కలిపి మొత్తం 2593మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ పరీక్షలు జరిగేందుకు 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలుచేయాలని, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసి మాల్ ప్రాక్టీస్కు అవకాశంలేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాచర్ల రూరల్ : మాచర్లలోని లక్ష్మీచెన్నకేశవస్వామికి విద్యాసంస్థల అధినేత జున్నా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.4లక్షల విలువైన సువర్ణ విష్ణు చక్రం గురువారం అందజేశారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదయ్యలకు అందించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతలు సమర్పించిన సువర్ణ చక్రం లక్ష్మీచెన్నకేశవస్వామి ఎడమ చేతికి అలంకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి భవిష్యత్తులో మరింత సహాయ సహకారమందిస్తామన్నారు. కార్యక్రమంలో జున్నా పద్మావతి, చక్రధర్రెడ్డి, వెంకట దీప్తి, అభిరామ్రెడ్డి, అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రథసారధి సుంకె వాసు పాల్గొన్నారు. మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా చెస్ అకాడమి నేతృత్వంలో గురువారం పల్నాడు జిల్లా అండర్–13 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక బీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ పోటీలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. ఎంపికై న వీరు ఈనెల 23 నుంచి మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు కోచ్ కిరణ్ తెలిపారు. మొదటి స్థానం అమర్నాఽథ్ యాదవ్, ద్వితీయ స్థానం సాత్విక్, బాలికల్లో మొదటి స్థానం మేఘశ్రీ కోమలి, ద్వితీయ స్థానం సుస్మితలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులకు ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ షేక్ నాగూర్వలి, రంగమ్మ చిన్న పిల్లల హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దశరఽథ్లు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులు తదితరులున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 32 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్కు 2,156 మంది హాజరు కాగా మరో 168 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఏడు కేంద్రాల్లో నిర్వహించిన ఒకేషనల్ పరీక్షకు 211 మంది హాజరయ్యారు. కాగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 31 కేంద్రాలలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,026 మంది హాజరు కాగా మరో 106 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విద్యార్థులు 143 మందికి గాను 125 మంది హాజరయ్యారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సూచించారు. తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అన్నవరం సొసైటీలో అవకతవకలు నిజమే
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు ● రైతుల ఫిర్యాదుతో విచారణ ● అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాలు ● సొసైటీలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం ● అదేశాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆర్థిక, పరిపాలనపరమైన అవకతవకలు జరిగినట్టు జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు స్పష్టంచేశారు. రైతుల ఫిర్యా దుతో జరిపిన విచారణలో అవకతవకలు వెలుగు చూసినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 కింద పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23వ తేదీన తనిఖీలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. సొసైటీలో అక్రమాలపై ‘అక్రమాలకు సహకారం’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నాగరాజు స్పందించారు. అన్నవరం పీఏసీఎస్లో అవకతవకలు జరిగాయని, సొసైటి సీఈథో దొప్పలపూడి శ్రీనివాసరావు, అప్పటి అధికార పర్సన్ ఇన్చార్జ్ నర్రా సురేంద్రబాబు వీటికి పాల్పడినట్టు సొసైటీ పరిధిలోని 45మంది రైతులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ డి.రవికుమార్ను విచారణ జరిపి ఆర్ధిక, పాలనాపరమైన అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 ప్రకారం సొసైటీ తనిఖీ నిర్వహించాలని ఆయన సిఫార్స్ చేసినట్టు వివరించారు. ఈ మేరకు సొసైటీలో తనిఖీలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం తదు పరి ఉత్తర్వులు వచ్చేవరకు తనిఖీలు నిలిపివేస్తూ ఈ నెల 23వ తేదీన మెమో ద్వారా ఆదేశించినట్టు తెలిపారు. సొసైటీలో అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ లు నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు కొనసాగి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చేవని వారు చెబుతున్నారు. -
చక్కటి ప్లాట్ పామ్
జిల్లాలో విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగు సాక్షి, నరసరావుపేట: పల్నాడు రైతులకు గత రెండేళ్లుగా వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లా రైతులు అధికంగా పండించే మిర్చి సాగు చేసినా ఒక్కోసారి కనీసం పెట్టుబడి రాకపోగా అప్పుల పాలవుతున్నారు. మరోవైపు పత్తికి పంటకు చీడపీడలు అధికంగా వస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. పొగాకు కొనేవారు లేక రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెట్ట రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆయిల్ పామ్ తోటలంటే పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలే గుర్తుకువస్తాయి. రెండు మూడేళ్లుగా పల్నాడులో ఆయిల్ పామ్ సాగు క్రమంగా పెరుగుతోంది. సాగుకు అనుకూల వాతావరణం, భూసారం, నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో తొలి విడతలో 8 మండలాలను అనుకూలంగా గుర్తించారు. ఇందులో పిడుగురాళ్ల, అమరావతి, రాజుపాలెం, బెల్లంకొండ, నాదెండ్ల, ఈపూరు, మాచవరం, సత్తెనపల్లి మండలాలు ఉన్నాయి. సాగు చేసిన రైతుల నుంచి ఆయిల్ పామ్ గెలలను నేరుగా పొలంలోనే కొనుగోలు చేస్తారు. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థకు ఆరు మండలాలు, గోద్రేజ్ ఆగ్రోవేట్ సంస్థకు రెండు మండలాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆయా రైతులకు ఆయిల్ పామ్ సాగులో మెలకువలు నేర్పడంతోపాటు మద్దతు ధరకే ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేస్తాయి. 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం... పల్నాడు జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 8 మండలాల పరిధిలో రెండు కంపెనీల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,236 మంది రైతులు 2,906 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఈ ఏడాది 23 మండలాల పరిధిలో నాలుగు కంపెనీల ఆధ్వర్యంలో సుమారు 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఆయిల్ పామ్ దిగుమతిపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం రైతులకు ప్రోత్సహకాలు అందిస్తోంది. అందుకు వంట నూనెల మిషన్ ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ సాగు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరానికి 52 మొక్కలను 9/9 మీటర్లకు ఒకటి చొప్పున నాటాల్సి ఉంది. హెక్టారుకు 130 మొక్కలను ఉచితంగా అందజేస్తారు. ఒక మొక్కకు రూ.193 చొప్పున 130 మొక్కలకు కలిపి రూ.25,090 రాయితీ లభిస్తుంది. తోట నిర్వహణకు హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తారు. అంతర పంటల సాగుకు మరో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.5,250 చొప్పున అందజేయనున్నారు. మొత్తం నాలుగేళ్లలో హెక్టాకు రైతుకు రూ.67,090 వరకు అందనుంది. బిందు సేద్యం పరికరాలను సైతం రాయితీపై అందజేస్తారు. విద్యుత్ సౌకర్యం లేని రైతులకు పీఎం–కుసుమ పథకం ద్వారా సోలార్ మోటార్లు అందిస్తారు. ఆయిల్ పామ్ హెక్టారుకు సగటున 25 నుంచి 30 టన్నుల గెలలు దిగుబడి అవుతుంది. టన్ను ధర సుమారుగా రూ.18 వేల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశా. గతంలో పండిస్తున్న కూరగాయలను అంతరపంటగా వేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎరువులు, మొక్కలు రాయితీ మీద వస్తున్నాయి. పండించిన పంటను స్థానికంగా బల్క్ డిపోకు తరలించి కంపెనీలకు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో పల్నాడులో ఆయిల్ పామ్ ఆధారిత కంపెనీలు ఏర్పడితే రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి మరింత సాగుకు ఊతం లభిస్తుంది. – నారిశెట్టి చంద్రయ్య, రైతు, గణపవరం, నాదెండ్ల మండలం పల్నాడు జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ కృషి చేస్తోంది. ఎంపిక చేసిన 8 మండలాల్లో ఇప్పటికే 2,906 ఎకరాల్లో పామ్ సాగైంది. పామాయిల్ మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తాం. సాగుకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు అంతర్ పంటల సాగుకు రాయితీ అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో సాగును మరింత పెంచుతాం. – ఇంటూరు వెంకట్రావు, పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి తొలి దశలో 8 మండలాల్లో ప్రారంభం జిల్లా వ్యాప్తంగా 1,408 ఎకరాల్లో ఇప్పటికే తోటలు ఉచితంగా మొక్కల పంపిణీ, డ్రిప్, అంతర పంటలకు సబ్సిడీ మిర్చి, పత్తి వంటి పంటల నష్టాల నుంచి తేరుకునేందుకు మొగ్గు చూపుతున్న రైతులు -
నిప్పుల కొలిమి
రెంటచింతలలో 47.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు రెంటచింతల: రెంటచింతలలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 47.2 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామం భగభగ మంటూ మండింది. రెంటచింతల మండలంలోని గోలి, జెట్టిపాలెం, పశర్లపాడు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో నల్ల నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం కారణంగా ఈ ప్రాంతంలో వేసవిలో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కొద్ది రోజులుగా గ్రామంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతకు వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల తరువాత ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026@48.1 పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం ఏకంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో స్థానికంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం 47.6 డిగ్రీలు నమోదయి పెరుగుతూ పోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్రాంతంమంతా అగ్నిగుండంగా మారింది. అత్యవసరమైతేనే ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటికి వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉష్ణోగ్రత భారీస్థాయిలో నమోదవుతోంది. వడదెబ్బకు వృద్ధురాలు మృతి మాచర్ల రూరల్: తీవ్రమైన వడగాల్పులకు, ఎండ దెబ్బకు తాళలేక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మాచర్ల మండలం రాయవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని 23వ వార్డు, యాదవ బజారులో నివసిస్తున్న శాఖమూరి హేమలత (65) పూజలు చేసేందుకు తరుచూ పలు దేవాలయాలను సందర్శిస్తుంటుంది. ఈ నేపథ్యంలో గురువారం రాయవరం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి అనంతరం స్పృహ తప్పి పడిపోయింది. గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై రూరల్ పోలీసులను వివరణ అడగ్గా కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు. -
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
రూ.1.20 లక్షల నగదు అపహరణ నరసరావుపేట టౌన్: ఎలక్ట్రికల్ దుకాణం తాళాలు పగులగొట్టి కౌంటర్లో రూ.1.20 లక్షలు నగదు అపహరించుకెళ్లిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వరవకట్ట నుంచి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఆజాద్ ఎలక్ట్రికల్ షాప్ తాళాలను గుర్తుతెలియని దుండగులు పగలగొట్టి దుకాణంలోని నగదు అపహరించుకు వెళ్లారు. దుకాణ యజమాని ఆజాద్ రోజు మాదిరిగానే షాప్నకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. కౌంటర్లో నగదు కనిపించక పోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వంశీకృష్ణా చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చిలకలూరిపేటటౌన్: ప్రమాదవశాత్తు వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సూదావారిపాలెంకు చెందిన ప్లంబ్లింగ్ వర్కర్ ఇమ్మడి శ్రీనివాసరావు(50) రోజు సాయంత్రం వేళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత సమీపంలో ఉన్న బావిపై కూర్చొని కాలక్షేపం చేయడం పరిపాటి. అయితే మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంలో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అనుమానంతో బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఇరుక్కొని విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. భార్య మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిడుగురాళ్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్కు కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ. 1100 జరిమానా విధించినట్లు పట్టణ సీఐ ఎస్.వెంకట్రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు...2018లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరెడ్డి పిడుగురాళ్ల బస్టాండ్ ఎదురు నిర్లక్ష్యంగా మలుపుతిప్పుతున్న క్రమంలో యూసప్ అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటి ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై పిడుగురాళ్ల పట్టణ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి టి.ప్రవళిక బుధవారం తీర్పు వెలువరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 1100 విధించినట్లు సీఐ తెలిపారు. వ్యవసాయ కళాశాలలో ప్రపంచ తేనెటీగల దినోత్సవంబాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్న్స్ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్ సెటిల్మెంట్గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్.భాస్కరరెడ్డి, రాజేష్, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం: బక్రీద్ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్ కార్పొరేషన్ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్కలెక్టర్– 9849904008, రెవెన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041. -
భానుడు భగభగ
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 524.00 అడుగు లకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం. సత్తెనపల్లి: వేసవిలో మండుతున్న ఎండలు ప్రజలను ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మునుపెన్నడు లేని విధంగా మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాధులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తు న్నాయి. జిల్లాలోని ఏరియా వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ, టైఫాయిడ్, అతిసార, పచ్చకామెర్లు వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. వడదెబ్బకు ఆస్కారం ఎక్కువ ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతోంది. దీనివల్ల మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థాలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే హీట్స్ట్రోక్ లేదా సన్స్ట్రోక్ అంటారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, నీటి శాతం తగ్గి సత్తువలేని స్థితికి చేరడాన్ని వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడటం, చర్మం ఎర్రగా మారడం, వాంతులు కావడం, మూర్ఛ రావడం, తలనొప్పి తదితర లక్షణాలు ఉంటే వడదెబ్బగా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు.. వడదెబ్బ బారిన పడకుండా రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. పండ్లు, నిమ్మరసం, పలచటి మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం ఎక్కువగా తీసుకోవాలి. తెల్లటి దుస్తులు ధరించడం శ్రేయస్కరం. మసాలాలు, కారం, నూనె, ఫాస్ట్ ఫుడ్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ తగిలితే ఆ వ్యక్తిని ఏదైనా చల్లని ప్రాంతం, నీడలో పడుకోబెట్టాలి. చల్లని నీటితో చర్మాన్ని తుడిచి, బట్టలను తడపాలి. ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసి, చల్లని తాగునీటి అందించాలి. ఐస్ పెట్టడం కానీ, కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి. అతిసార బాధితులకు.. అతిసార సోకిన వారికి నీళ్ల విరోచనాలు అవుతాయి. పిల్లలు, వృద్ధులకు చాలా ఇబ్బంది. సకాలంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, శరీరంలో నీటి శాతాన్ని కోల్పోవడం జరుగుతుంది. నిల్వ ఉన్న ఆహారం, నీరు తీసుకోకూడదు. ఎలక్ట్రాల్ పౌడర్తో నీటి శాతం, లవణాలు పెంచుకోవచ్చు. పచ్చకామెర్లు వస్తే... తాగునీరు కలుషితమైతే పచ్చకామెర్లు వస్తాయి. దీన్ని హెపటైటిస్–ఏ అని కూడా అంటారు. చర్మం పచ్చబడటం, మూత్రం పచ్చగా రావడం, చర్మంపై దురద, ఆకలి మందగించడం, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శుభ్రమైన నీటినే తాగాలి. నూనె వినియోగం బాగా తగ్గించాలి. టైఫాయిడ్ వస్తే ఇలా.. ఇది అపరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అతి జ్వరం, అలసట, నిస్సత్తువ, కడుపునొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటివి టైఫాయిడ్ లక్షణాలు. అలాగే చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. శుభ్రమైన తాగునీటిని, ఆహారాన్ని తీసుకోవాలి. బయట దొరికే చిరుతిళ్లు పూర్తిగా మానేయాలి. వైద్యుడిని సంప్రదించి మందులను వాడాలి. జిల్లాలో ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉపాధి హామీ కూలీలపై భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. చిరు వ్యాపారులు ఎండ తీవ్రత తట్టుకోలేక దుకాణాలను మూసి వేస్తున్నారు. 40–42 డిగ్రీల సెల్సియస్ నుంచి ఉష్ణోగ్రత ప్రతిరోజు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధిక ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో భానుడు నిప్పుల వర్షం కురిపించాడు. ఎండల దెబ్బకు గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. బుధవారం గ్రామంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.3గా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రెంటచింతల గ్రామంలో ఈ ఏడాది నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కొన్ని రోజులుగా 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతోపాటు ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతోపాటు భూమి నుంచి సుర్రుమంటూ వచ్చే వెచ్చని సెగలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధాన రహదారితోపాటు గ్రామంలోని అంతర్గత రహదారులు నిర్మానుష్యంగా మారాయి. భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అత్యవసరమైతే తప్ప గ్రామస్తులు ఇట్లోంచి బయటకు రావడం లేదు. తీవ్రమైన ఉక్కపోతకు తట్టుకోలేక పలు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలకు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, గర్భిణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు
పిడుగురాళ్ల: పల్నాడు అంటేనే వేసవిలో భానుడు భగభగ అంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తాపానికి అల్లాడిపోయారు. మంగళవారం 45.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం ఏకంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. చిరువ్యాపారులు సైతం గొడుగులను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎండలు మండుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సున్నపురాయి క్వారీలు, పరిశ్రమలు ఉండటంతోనే ఉష్ణోగ్రత భారీగా పెరిగిందని చెబుతున్నారు. అచ్చంపేటలో 44 డిగ్రీలు అచ్చంపేట: మండలంలో బుధవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం రద్దీగా అచ్చంపేట ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. వడగాల్పులు ఎక్కువ కావడంతో జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. అచ్చంపేట – సత్తెనపల్లి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు పలుచగా కనిపించారు. -
ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
నిందితుల వద్ద నుంచి రూ.6లక్షలు నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనంనరసరావుపేట రూరల్: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు. రూరల్ ఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. -
అనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు
యడ్లపాడు: కార్మికుల సంక్షేమాన్ని, సామాజిక బాధ్యతను అత్యున్నత ప్రాధాన్యతగా భావించే బోయపాలెంలోని శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు దక్కింది. మేడే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏటా అందించే ఈ అవార్డులు ఈ ఏడాది విజయవాడ కేంద్రంగా ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు పరిశ్రమల యాజమన్యాలు అందుకున్నాయి. కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలో విశేష కృషి చేసిన సంస్థలను ప్రభుత్వం గుర్తించి వీటిని అందించనట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో పల్నాడు జిల్లా బోయపాలెంకు చెందిన శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు సంస్థ ఎండీ సామినేని కోటేశ్వరరావు, ఈడీ ఫణికుమార్ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ గుర్తింపు పరిశ్రమల నిబద్ధతను మరింత పెంచుతాయన్నారు. సంస్థకు దక్కిన ఈ గౌరవం కేవలం తమ ఒక్కరిది మాత్రమే కాదని, కార్మికులందరి సహకారం అన్నారు. అలాగే ఈ అవార్డు జిల్లాతో పాటు ఇది ఏపీ టెక్స్టైల్ రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు, కార్మిక కమిషనర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ.. యువకుడు మృతి
మరొకరికి తీవ్ర గాయాలునరసరావుపేట రూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. నాదెండ్ల మండలం జంగాలపల్లికి చెందిన మద్ది శ్రీకాంత్(24) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పట్టణంలో పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై వస్తుండగా.. జొన్నలగడ్డ చప్టా వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నల్లపాడుకు చెందిన వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేష్ను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డును సీనియర్ మేనేజర్ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. నరసరావుపేట: జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్ఓ వెంకయ్యలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహా బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తెనాలిరూరల్: ప్రేమ పేరుతోబాలికను వేధించిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు. బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతూ ప్రతి రోజు సాయంత్రం గ్రామంలో ఇళ్లకు వెళ్లి పాలు పోస్తుండేది. బాలికను వేమూరుకు చెందిన వర్రె గోపి ప్రేమించమంటూ వేధించేవాడు. 2020 మే 24వ తేదీన పాలు పోసేందుకు వెళుతున్న బాలిక సైకిల్ను గోపి అడ్డగించి తనను ప్రేమించాలని ఇబ్బంది పెట్టాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి వేమూరు ఎస్ఐ ఎల్.లోకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో పరిశీలించిన తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఐ. ఇందిరాప్రియదర్శిని, నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 341 కింద నెల రోజుల జైలు శిక్ష, జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల జైలు శిక్ష విధించారు. సెక్షన్ 12 పోక్సో యాక్టు కింద ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహ హింస బాధితులు 181, అత్యవసర సేవల కోసం 112, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు గుంటూరు ఎడ్యుకేషన్: ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతిలో 540, జూనియర్ ఇంటర్లో 420, సీనియర్ ఇంటర్లో 900 మార్కులకు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తులను ‘133–8–1878, హిమనీనగర్ 3వ లైన్, నగరాలు, అమరావతిరోడ్డు, గుంటూరు–522035’ చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 99594 14333, 79894 78961, 63043 57686 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, అందువల్ల గురువారం కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ పేర్కొన్నారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల ముఖ్య మండల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా బందగీ సాహెబ్ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా వీఆర్ఏలకు జీతాలు పెరగలేదని, పక్క రాష్ట్రాలలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందన్నారు. అధికారులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చదువుకున్న వీఆర్ఏలు ఎప్పటికై నా ప్రమోషన్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, ప్రభుత్వం వీఆర్ఏల రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగే కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమంలో వీఆర్ఏలు అందరూ పాల్గొని, తమ గళం వినిపించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి మునాఫ్, క్రోసూరు మండల అధ్యక్షుడు డేవిడ్, దుర్గి మండలం అధ్యక్షుడు వెంకటేష్, నరసరావుపేట, పెదకూరపాడు మండల అధ్యక్షుడు రోశయ్య, కొండలు, ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు.
రాబోయే నాలుగు రోజులపాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు వైద్య శాఖ అందుబాటులో ఉంచాలి. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేయాలి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలి. మూగ జీవాలకు ఇబ్బంది కలగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలి. వడగాల్పుల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – సంజనా సింహ, ఇన్చార్జ్ కలెక్టర్, పల్నాడు జిల్లా -
తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య వినుకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వినుకొండలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రూ.500 కోట్లతో పూర్తయ్యే వరికపూడిశెల ప్రాజెక్టును క్యాబినెట్ పూర్తిగా విస్మరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు కేవలం అమరావతి, పోలవరం జపమే చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం, ఊరూరా బెల్ట్ షాపులు పెంచి మద్యం ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాడుడే బాదుడు అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. 35 శాతం వ్యాట్ ట్యాక్స్తో ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. అసలే ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగం తాండవిస్తుంటే ముగ్గురు, నలుగురు పిల్లలను కనమనడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కన్నారు... మరి ప్రజలకు ఈ ఉచిత సలహాలెందుకని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దళితులు క్రైస్తవంలోకి మారింత మాత్రాన వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయడం తగదని, వారికి సీపీఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం నేత ఉలవలపూడి రాము పాల్గొన్నారు. -
తవ్వారు.. వదిలేశారు.. ఉసురు తీశారు
● పైపులైన్ మరమ్మతుల కోసం తీసిన గుంతతో ప్రమాదం ● చీకట్లో గుంత తాలూకా మట్టిదిబ్బను ఢీకొన్న బైక్ ● అక్కడికక్కడే వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మోటార్ బైక్పై వస్తున్న ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో నివాసం ఉండే షేక్ మొహమ్మద్ (38) కార్పెంటర్గా జీవనం కొనసాగిస్తాడు. ఇతనికి భార్య షేక్ జాహెదాతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు షేక్ మాలిక్తో పాటు ఏడో తరగతి చదువుతున్న షేక్ మొహమ్మద్ ఆలి ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 సమయంలో చిలకలూరిపేట నుంచి తన మిత్రుడు షేక్ సర్ధార్తో కలసి మోటార్బైక్పై పసుమర్రుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. ● మృతుడి నివాసమైన పసుమర్రు మసీదు వీధి ప్రాంతం శోక సంద్రంలో మునిగి పోయింది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తీరా ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయాక ఉదయాన్నే సంబంధిత గుంతను మూసివేయడం విశేషం. ఇదే పని సకాలంలో చేసి ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తవ్వాం..పనిచూసుకున్నాం.. వదిలేశాం.. మాపని మేం చేసేశాం ఎవరెటు వచ్చి పడి చస్తే మాకేం.. అనుకున్నారేమో పురపాలక సిబ్బంది పనిముగించుకుని తాపీగా ఇళ్లకెళ్లిపోయారు. గుంత లోతుగా ఉందని, గుంత చుట్టూ వేసిన మట్టికుప్ప ఎత్తుగా ఉందని, రాత్రిళ్లు ఎవరైనా కనబడక వచ్చి అందులో పడతారనే కనీస స్పృహలేకుండా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా గత పదిరోజులుగా గాలికి వదిలేశారు. చీకట్లో పాపం ఆ గుంత, చుట్టూ ఉన్న మట్టి కనబడక ఓ అమాయకుడు మృత్యవాత పడగా.. అతనిపై ఆధారపడిన భార్య, 9,7 తరగతులు చదువుతున్న పిల్లలు రోడ్డున పడ్డారు. పురపాలక నిర్లక్ష్యం ఓ అన్నెం పున్నెం ఎరుగని వ్యక్తిని బలితీసుకుని, ఓ కుటుంబంలో పెనువిషాదం నింపగా.. ఉదయాన్నే వచ్చిన సిబ్బంది గుంతతో పాటు తమ తప్పులను కప్పేయాలని చూడడం విశేషం. సుమారు పది రోజుల కిందట చీరాల రోడ్డులో కక్కెరదాసయ్య గోడౌన్ల సమీపంలో పైపులైన్ మరమ్మతుల కోసం రోడ్డు మార్జిన్లో గుంత తీయించిన మున్సిపల్ సిబ్బంది దానిని పూడ్చి వేయించకుండా వదలివేశారు. గుంత చుట్టూ బ్యారికేడ్, లేదా రేడియం రిబ్బన్ వంటిది ఏర్పాటు చేయలేదు. ప్రమాద ప్రదేశం చీకటిగా ఉండటం, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే చీరాల రోడ్డులో ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ కారణంగా ద్విచక్రవాహనం రోడ్డు మార్జిన్ దిగింది. ఈ క్రమంలో పైప్లైన్ మరమ్మతుల కోసం గుంత తీసి వేసిన మట్టి దిబ్బను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొహమ్మద్ తల సమీపంలో ఉన్న రాళ్లకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చొన్న సర్ధార్ తీవ్ర గాయాలపాలుకాగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మొహమ్మద్ మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. భర్తను కోల్పోయి భార్య, తండ్రిని కోల్పోయిన కుమారులు, కొడుకును కోల్పోయి వృద్ధులైన తల్లిదండ్రులు ఫరీసా, ఫాతిమాలు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. -
టీడీపీ ఆఫీసుకోసం చెరువునే ఎండబెట్టారు
● పార్టీ కార్యాలయం పేరుతో యథేచ్ఛగా మట్టి తరలింపు ● చెరువులోని నీటిని బయటకు తరలించి మరీ తవ్వకాలు ● చెరువులో పెద్ద ఎత్తున గోతులు.. వందలాది ట్రిప్పులు ● పట్టించుకోని అధికారులు ముప్పాళ్ళ: మట్టి కోసం ఏకంగా నిండుకుండలా ఉండే ముప్పాళ్ళ చెరువునే ఎండబెట్టారు తెలుగుదేశం పార్టీ ముప్పాళ్ల నాయకులు. ముప్పాళ్ళలోని పెదనందిపాడు బ్రాంచి కాలువ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో ముప్పాళ్ళ చెరువును ఖాళీ చేశారు. ఎల్నినో ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు కురిసే అవకాశం లేదని, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, చెరువుల్లో ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని బయటకు వెళ్లబెట్టకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకుండా పోయింది. జలధార పేరుతో చెరువులను బలోపేతం చేయాల్సింది పోయి చెరువులోని నీటిని బయటకు పంపి మట్టి అమ్ముకుంటున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు గాలికొదిలేశారు. చెరువులో పెద్ద ఎత్తున గోతులు పెట్టి వందలాది ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్స్టేషన్ ఎదురు గుండా మట్టి ట్రాక్టర్లు తరలివెళుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రైతులు పొలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలంటూ ఇబ్బందులు పెట్టే అధికారులు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువులో నీటిని వెళ్లబెట్టడమే కాకుండా, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పై ఆ పార్టీలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్పీ స్థలంలో పార్టీ కార్యాలయమా..? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూమిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణపనులు చేపట్టారు. అప్పట్లోనే సాగర్ ఆయకట్టు పరిధిలో దిగువ భూములకు నీటి తరలింపు కోసం నిర్మించిన కాలువలకు ఇరువైపులా 100 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదిలి పెట్టి కాలువలు తవ్వారు. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రమాదం సంభవించి కాల్వలకు గండి పడితే పక్కనే ఉన్న ఎన్ఎస్పీ స్థలంలోని మట్టిని కట్టలకు వినియోగించుకోవాల్సి ఉండేందుకు వినియోగించుకోవాల్సి ఉంది. రైల్వే, ఎన్ఎస్పీ స్థలాలు ఆక్రమించటం చట్టరీత్యా నేరం. అలాంటి స్థలాల్లో అనుమతులు లభించటం కూడా అరుదు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చట్టాలు వర్తించకుండా పోయాయి. ఏకంగా ఎన్ఎస్పీ కాలువకు సంబంధించిన 0.20 సెంట్ల భూమినే కబ్జా చేస్తున్నారు. అందులో ఏకంగా నిర్మాణాలకు తెర లేపారు. ఎన్ఎస్పీ అధికారులు కూడా ఏమీ తెలియనట్లుగానే మౌనముద్ర వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాల్లోను, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లోను రాజకీయ పార్టీలకు చెందిన భవనాల నిర్మాణాలు జరిగే ఆస్కారం లేక పోలేదనే అనుమనాలు పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎన్ఎస్పీ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నారు. -
25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతోపాటు, ఓపెన్ స్కూలింగ్ పదవ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలలో మొత్తం కలిపి మూడు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించడం జరుగుతుందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియామకం పూర్తి చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా మాట్లాడుతూ 18 పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులందరు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుదారులకు కష్టాలు
ఈ–కేవైసీ పూర్తి కాకుంటే సరుకులు నిలిపివేతజిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్ కార్డుదారులకు సరుకుల సరఫరా నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్ షాపుల వద్దకు వెళ్లలేక పలువురు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలూ ఆగిపోనున్నాయి. సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. 6,41,180 మంది రేషన్ కార్డులలో 18,47,940 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు 17,97,721 మంది ఈ–కేవైసీ పూర్తి చేయించుకున్నారు. 0–5 సంవత్సరాలలోపు చిన్నారులు 19,595 మంది ఉండగా వారికి ఈ–కేవైసీ అవసరం లేదు. ఇక మరో 30,624 మంది వివరాలు పెండింగ్లో ఉన్నాయి. 5 నుంచి 80 ఏళ్లలోపు వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. వీరంతా ఈ నెలాఖరులోపు ఈ– కేవైసీ చేయించుకోకుంటే రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలస పోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడక పోవటం, చౌకదుకాణాల డీలర్ల నిర్లక్ష్యం, తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. ఎక్కువగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో 2,040, పిడుగురాళ్లలో 2,014, చిలకలూరిపేటలో 1,888, మాచర్లలో 1,823, వినుకొండలో 1,798, సత్తెనపల్లిలో 1,537 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. నెలాఖరు వరకు అవకాశం... ఈ–కేవైసీ నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈ–కేవైసీ చేయించారు. రేషన్ కార్డుదారుల్లోని కుటుంబ సభ్యులు ఎవరు వేలిముద్ర వేసినా సరుకులు ఇస్తారు. ప్రత్యేకించి మృతుల పేర్లు తొలగించే విధానం లేకపోవడంతో వారికి రేషన్ పంపిణీ జరుగుతోంది. తాజాగా ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో వీరి వివరాలు తొలగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే వారుంటే వారిని గుర్తించనున్నారు. ప్రస్తుత ప్రక్రియతో రేషన్కార్డుల్లోని మృతులు, అనర్హుల వివరాలు తొలగి అసలైన లబ్ధిదారులకే నిత్యావసర సరకులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మండలాలు : 28 రేషన్ కార్డులు : 6,41,180 రేషన్ కార్డుల్లోని సభ్యులు : 18,47,940 మొత్తం చౌకదుకాణాలు : 1,289 ఈ–కేవైసీ చేయించుకోనివారు : 30,624 -
నేడు జూపుడి ప్రభాకరరావు మామిళ్లపల్లి రాక
పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు చేసిన దాడిలో నష్టపోయి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకరరావు బుధవారం మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్నారని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. మంగళగిరి టౌన్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విశాఖపట్నం అగనంపూడికి చెందిన వరసాల ప్రవీణ్కుమార్(32) మంగళగిరి మండలంలోని నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్ సెల్లో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ కుటుంబ సభ్యులందరూ కాకినాడ వెళ్లడంతో ప్రవీణ్కుమార్ కూడా కాకినాడ వెళ్లాడు. 17వ తేదీ కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలో బస్సులో బయలుదేరి 18వ తేదీన మంగళగిరికి చేరాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద బస్సుదిగి రాజీవ్ సెంటర్కు వచ్చే క్రమంలో ప్రవీణ్కుమార్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సహ ఉద్యోగి సునీల్ మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చికిత్స పొందుతూ ప్రవీణ్కుమార్ మృతి చెందాడు. మృతుడు తండ్రి జేమ్స్రాజ్ ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 112 దొంగతనాల కేసులు నమోదు నగరంపాలెం: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడే చిల్లర సురేష్ అలియాస్ చల్లా సురేష్పై పీడీ యాక్ట్ను గుంటూరు జిల్లా పోలీసులు ప్రయోగించారు. ఈ మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 112 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. అతను అనేకమార్లు జైళ్లకు వెళ్లినా నేర ప్రవత్తి మారలేదన్నారు. ప్రజల్లో భయాందోళనలు స్పష్టిస్తున్న చిల్లర సురేష్పై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పీఎస్ పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు నిఘాలో వెల్లడైందని అన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్వర్మకు సిఫార్సు చేశారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిఫార్స్తో ముద్దాయిపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. 38 ఏళ్ల వయసున్న చిల్లర సురేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 2024 –26 వరకు సుమారు 112 చోరీల కేసులు నమోదైనట్లు జిల్లా పోలీసులు తెలిపారు. -
లెక్క చూపని రూ.45.30 లక్షలు పట్టివేత
చిలకలూరిపేట టౌన్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.45.30 లక్షల నగదు వెలుగుచూసింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ను విచారించారు. చైన్నెలో బంగారం కొనుగోలుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడు. ఆధారాలు చూపలేకపోవడంతో ఎస్ఐ నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. -
తీవ్ర వడగాలులకు అవకాశం
నరసరావుపేట: రాబోయే నాలుగు రోజుల పాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. ఈ మేరకు ఆమె జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేసి, నీడ, చల్లని తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించాలని అన్నారు. గ్రామ, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎండల వల్ల మూగజీవాలకు ఇబ్బంది కలుగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద మాజీ న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె.చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తిలు జడ్జికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని మాజీ జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ట్రాన్స్కో పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ పి.విజయకుమార్ సిబ్బందికి సూచించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సెక్షన్ పరిధిలో 33/11 కేవీ, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, రావులాపురం, గండి గనుముల సబ్స్టేషన్లను ఎస్ఈ మంగళవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్ సిబ్బందికి, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. తనిఖీల్లో వినుకొండ డీఈఈ తన్నీరు శ్రీనివాసరావు, రేమిడిచర్ల సెక్షన్ ఏఈ బాణావత్ రామాంజనేయులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి. కుమార్లు స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తిక్కన కాన్ఫరెన్సు హాలులో మంగళవారం గుంటూరు రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానిక్ ఇన్చార్జులతో ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో అధికారుల పనితీరు, ఆదాయ మార్గాలు పెంపొందించేలా కేఎంపీఎల్ విధానాలపై సమీక్షించారు. బస్సులు మార్గంమధ్యలో ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
స్వర్ణకారులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయం చూపండి
సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల బంగారు నగల విక్రయాలు పూర్తిగా పడిపోతున్నాయని, కొనేవారు లేక వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు అల్లాడుతున్నారని ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శిరసాల వాసుబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన స్వర్ణకార సంఘం పిలుపు మేరకు నిర్వహించిన బంద్కు యూనియన్ పూర్తి మద్దతు తెలియ జేస్తుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో వాసుబాబు మాట్లాడుతూ.. సాక్షాత్తు ప్రధానమంత్రి సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకండి అని పిలుపు నివ్వటం వల్ల స్వర్ణకార వృత్తిపై, వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి నెల కొందన్నారు. ఆర్టీజీఎస్ కాకుండా అప్రైజర్స్ కూడా ఆర్థికంగా నష్టాలు పాలవుతార న్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు వెంటనే వెనక్కి తీసుకొని స్వర్ణకారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. స్వర్ణకారులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరఫున స్వర్ణకార సంఘం చేస్తున్న ఆందోళన, బంద్లకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నయీమ్ అహ్మద్, యూనియన్ బాధ్యులు చిన్ని, సందీప్, వెంకటా చారి, సభ్యులు తదితరులు ఉన్నారు. ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుబాబు


