breaking news
Palnadu
-
ప్రజల మద్దతున్న పీఆర్కేపై కేసులా?
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు మాచర్ల రూరల్: పల్నాడు చరిత్రలో వరుసగా నాలుగుసార్లు గెలిచి ప్రజల మద్దతు ఉన్న పీఆర్కేను రాజకీయంగా అణచివేసే ధోరణిలోనే అక్రమ కేసు నమోదు చేశారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు అన్నారు. అక్రమ కేసులకు, వేధింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడబోరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులకు దిగుతూ, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగనన్న నాయకత్వంలో ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొని మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. -
టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రథమ ప్రాధాన్యం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జే.రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణాజిల్లా డీఈఓగా పనిచేస్తున్న రామారావు పల్నాడు జిల్లాకు బదిలీపై వచ్చారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రామారావును పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు సంఘం, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే ప్రథమ ప్రాధాన్యతగా గుర్తిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. మెగా డిఎస్సీ– 2025 ఉపాధ్యాయ నియామకాలతో పాటు విద్యా వాలంటీర్లను ప్రభుత్వం నియమించిందని వివరించారు. అలాగే ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారిని పరిశీలకునిగా నియమిస్తున్నదని తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన 100 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా విభజించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్లో స్లిప్ టెస్ట్లు నిర్వహిస్తూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా బోధన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పది విద్యార్థుల నూరు శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు, సిబ్బంది సహకరించాలని కోరారు. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. జిల్లా డీఈఓగా పి.వి.జే.రామారావు బాధ్యతలు స్వీకరణ -
తప్పిపోయిన బాలిక పోలీసు రక్షణలో
●36 గంటల్లో కేసు ఛేదన ● పెంపుడు తల్లిదండ్రుల నుంచి పారిపోయానన్న ఏడేళ్ల పాప కారంచేడు: తప్పిపోయిన ఏడు సంవత్సరాల బాలిక చెవుటూరి నాగేంద్రాన్ని పోలీసులు గురువారం కనుగొన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతకడం ప్రారంభించారు. కేసు నమోదు అయిన 36 గంటల్లో పాపను పట్టుకున్నారు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా అందించిన సమాచారం మేరకు.. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన చెవుటూరి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతుల పెంపుడు కుమార్తె నాగేంద్రం ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బైటకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఖాదర్బాషా బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య సారథ్యంలో కారంచేడు, ఇంకొల్లు ఎస్ఐ సురేష్, చినగంజాం ఎస్ఐ రమేష్లు తమ సిబ్బందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తమ సిబ్బంది చిలకలూరిపేట ప్రాంతంలో వెతుకుతుండగా పాప ఆ ప్రాంతంలో సంచరించిన విషయం గమనించిన పోలీసులు పాపను జాగ్రత్తగా విచారించారు. తన పెంపుడు తల్లిదండ్రులు కొడుతుండటంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలపడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎస్ఐ ఖాదర్బాషా విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలపడంతో వారి సూచనలతో పాపను బాపట్ల వన్స్టాప్ సఖి సెంటర్కు తరలించామన్నారు. పాప ఇష్ట్రపకారమే ఆమె పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించలేదని తెలిపారు. -
దేశంలోనే ఏపీ టూరిజాన్ని నెం.1 గా చేసేందుకు కృషి
విజయపురిసౌత్: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు యం.దారు నాయక్ తో కలిసి పర్యాటక కేంద్రాలైన నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్, ఎత్తిపోతలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ టూరిజం 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు తెలిపారు. సాగర్ లాంచీ స్టేషన్లో రెండు చిన్న బోట్లను త్వరలోనే నూతనంగా ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, జీఎం నాంచారయ్య, డీవీఎం కృష్ణ చైతన్య, జిల్లా టూరిజం ఆఫీసర్ నాయుడమ్మ, మేనేజర్లు మస్తాన్ బాబు, యల్లాల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
‘రొంపిచర్ల’ టీడీపీలో ముసలం
రొంపిచర్ల: మంత్రి లోకేశ్ పీఏ పేరుతో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు చేస్తున్న అరాచకాల నుంచి తమను కాపాడాలంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో గ్రామ టీడీపీ నాయకులు గురువారం నిరాహారదీక్షకు దిగారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు జాష్ఠి శ్రీనివాసరావు, జాష్ఠి ప్రసాదు, వెలగటూరి వెంకటనారాయణ నిరాహారదీక్ష చేపట్టారు. చల్లా సుబ్బారావు గత 18 నెలల కాలంలో చేసిన దందాలు, అక్రమవసూళ్లు, రౌడీలతో ఊళ్లో చేస్తున్న అల్లర్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలిప్పిస్తానని దళితవాడలో కొందరి నుంచి డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అన్నవరపు పంతులు నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని, అడిగితే బెదిరిస్తున్నారని తెలిపారు. పదవి ఇప్పిస్తానని జాష్ఠి ప్రసాద్తో రూ.10 లక్షల వరకు ఖర్చుచేయించినట్లు పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇళ్లపై రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.30 లక్షల బిల్లులను సైతం అడ్డుకుంటున్నాడన్నారు. కోడెల శివప్రసాద్ హయాంలో నిర్మించిన నీటిసంఘం భవనానికి రంగులు వేసి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల బిల్లు చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆ భవనం పక్కనున్న స్థలాన్ని సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆక్రమించారన్నారు. కోడెల ఆవిష్కరించిన మూడు శిలాఫలకాలను సుబ్బారావు ధ్వంసం చేశారన్నారు. ఈ విషయమై రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. సుబ్బారావు అరాచకాల గురించి ఎమ్మెల్యే అరవిందబాబుకు, ఎంపీకి, ఇన్చార్జి మంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వీరవట్నంలో తెలుగుదేశం నాయకులు నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లి మాట్లాడి విరమింపజేశారు. గ్రామంలో పార్టీ నాయకులు కూడా ఆందోళనకు దిగినవారికి సర్దిచెప్పారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు నుంచి తమను కాపాడాలంటూ వీరవట్నంలో పార్టీ నేతల నిరాహారదీక్ష లోకేశ్ పీఏ పేరుతో సుబ్బారావు చేసిన అరాచకాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు -
ప్రకృతి వ్యవసాయం ద్వారా వరిలో అధిక దిగుబడులు
●స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్ ●నర్సింగపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న రైతు సాధికార సంస్థ ప్రతినిధులు, రైతులు నకరికల్లు: ప్రకృతి వ్యవసాయ విధానంలో తక్కువ ఖర్చులో అధిక దిగుబడులు సాధించవచ్చని స్టేట రిసోర్స్పర్సన్ రామచంద్రన్ అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐసీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగపాడు గ్రామంలో రైతు గ్రామ సుబ్బారెడ్డికి చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ అన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్పర్సన్కు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్కు డిస్టిక్ మోడల్ మేకింగ్ ట్రైనర్ బృందాలకు ఐదు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రకృతి వ్యవవసాయ కార్యాలయం ద్వారా క్షేత్ర సందర్శన నిర్వహించామన్నారు. పిడుగురాళ్ల, క్రోసూరు, సత్తెనపల్లి డివిజన్ల నుంచి సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందనున్నారు. రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట సాగు చేస్తే దిగుబడి అధికంగా ఉంటుందని, పంట పొలంలో గట్లపై పలు మొక్కలను వేయడం వలన అధిక ఆదాయం వస్తుందన్నారు, పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. పల్నాడు జిల్లాలో వరి, ప్రత్తి, మిరప పంట పొలాలను సాగు చేస్తున్న రైతులందరు భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగుచేస్తే భూమి ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్రాజు, ఎన్ఎఫ్ఏలు అప్పలరాజు, సైదయ్య, మాస్టర్స్, ట్రైనర్స్, ప్రకృతి వ్యవసాయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
యొనుమలను అడ్డుకున్న పోలీసులు
మాచర్ల రూరల్: జంట హత్యల కేసులో అక్రమంగా ఇరికించిన పిన్నెల్లి సోదరులను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు, వినుకొండ నియోజక వర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గురువారం బస్టాండ్లో మురళీధర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు నేడు కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మాట్లాడదామని వస్తుంటే పోలీసులు అడ్డుకోవటం పై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలని, అధికార పార్టీకి సలాం కొడుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ పోలీసులను హెచ్చరించారు. సంఘీభావం తెలిపే హక్కు కూడా లేదా గురజాల : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లోంగిపోతున్నారనే సమాచారం రావడంతో సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,యెనుముల మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నించారు. కోర్టు కేవలం వారిని సరండర్ కావాలని అర్డర్ ఇచ్చిందే కానీ సంఘీభావం తెలపకూడదని అని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఒక నిర్భందమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎమర్జెన్సీ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక శనివారం జరగనున్నట్లు కేకేఎఫ్ఐ ప్రెసిడెంట్ ఎం. సీరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి సీనియర్ (మెన్), జూనియర్(బాయ్స్) క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పొల్గొనే క్రీడాకారుల్లో జూనియర్ బాలుర విభాగంలో 31 డిసెంబర్ 2025 నాటికి 18 సంవత్సరాలు లోపు ఉండాలని, 1జనవరి 2008 తరువాత పుట్టిన వారు అయి ఉండాలని తెలిపారు. సెలక్షన్లకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా అధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు. సీనియర్ (పురుషుల) విభాగంలో ఆధార్ కార్డు, టెన్త్ మార్కులిస్టు మెమో తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9848156652 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
బెదిరించినా ఎదిరించారు!
మాచవరం: మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతలు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా ఎదిరించి నిలబడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మండల సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, 11 మంది వచ్చారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. టీడీపీకి ఆరుగురు సభ్యులు మద్దతు ఇచ్చారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ సభ్యురాలు కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్ వేశారు. ఆకు రాజు పల్లి, కొత్త గణేశునిపాడు, వేమవరం, పిల్లుట్ల–2 ఎంపీటీసీలు మద్దతు ఇచ్చారు. వైఎస్సార్సీపీ తరఫున మొర్జంపాడు ఎంపీటీసీ సభ్యురాలు ముంగి మంగమ్మ నామినేషన్ వేయగా, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ ముండ్లపాటి సత్యనారాయణ, మల్లవోలు ఎంపీటీసీ చుక్క సువార్తమ్మ, మాచవరం ఎంపీటీసీ మద్దు అనూరాధ మద్దతు ఇచ్చారు. మాచవరం –2 ఎంపీటీసీ చిట్టిప్రోలు గురవయ్య ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు. మెజార్టీ సభ్యులు టీడీపీ మద్దతు ఇవ్వడంతో అంజమ్మను ఎంపీపీగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పార్టీకి అండగా నిలిచారు. మల్లవోలు సభ్యురాలు చుక్కా సువార్త, మాచవరం సభ్యురాలు మధు అనూరాధ, మొర్జంపాడు సభ్యురాలు ముంగి మంగమ్మ, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణలు పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిని, వారి కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలు చూపినా లొంగకుండా గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎంపీటీసీ గురవయ్యకు సీఐ బెదిరింపు సమావేశానికి హాజరయ్యే ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసుల తీరు మారలేదు. మాచవరం ఎంపీటీసీ సభ్యుడు చిట్టిపోలు గురవయ్యను దాచేపల్లి సీఐ భాస్కరరావు సమావేశంలో బెదిరించడంతో ఓటింగ్లో తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఎంపీటీసీని బెదిరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పు పట్టాయి. సీఐ తీరుపై ఆక్షేపణ తెలిపాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బలం లేకున్నా బరితెగింపు వాస్తవానికి టీడీపీకి తగిన బలం లేకున్నా వైఎస్సార్సీసీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించి, తమకు మద్దతు ఇవ్వకుంటే అక్రమ కేసులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనేక ప్రలోభాలకు గురి చేశారు. బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి బెదిరించారు.మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీ దారం అమ్ములమ్మ ఇటీవల మృతి చెందారు. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశుని పాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. వైఎస్సార్సీపీకి 10 సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రలోభాలకు గురి చేయడంతో టీడీపీకి ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఇచ్చారు. గంగిరెడ్డిపాలెం సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణ, మాచవరం ఎంపీటీసీ–2 మధు అనూరాధ, ఎంపీటీసీ– 1 చిట్టిప్రోలు గురవయ్య, మొర్జంపాడు ఎంపీటీసీ ముంగి మంగమ్మ, మల్లవోలు ఎంపీటీసీ చుక్కా సువార్తలు వైఎస్సార్సీపీలో కొనసాగారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేయడంతో ఐదుగురు సభ్యులు ఆమెకు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ తరఫున మొర్జంపాడు–1 ఎంపీటీసీ ముంగి మంగమ్మ నామినేషన్ వేయగా ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించారు. కొక్కెర అంజమ్మను ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. -
మాతృ మరణాలను నిరోధించాలి
నరసరావుపేట రూరల్: మాతృ మరణాలను నిరోధించే విధంగా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్ర స్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రక్తంలో హీమో గ్లోబిన్ స్థాయి, గర్భిణులు, ఆరోగ్య, ఆదాయ స్థితిగతులను బట్టి హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో చోటుచేసుకున్న ఐదు మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డీసీహెచ్ఎన్ ప్రసూన, డీఐవో రాంబాబు, డీఎల్వో మాధవీలత పాల్గొన్నారు. సత్తెనపల్లి: పెను ప్రమాదం త్రుటిలో తప్పిన సంఘటన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం ఉప్పలపాడు నుంచి పత్తి లోడుతో ట్రాక్టర్ గుంటూరు వెళుతుంది. అదే సమయంలో సత్తెనపల్లి వైపు నుంచి సిమెంటు లోడుతో లారీ గుంటూరు వెళుతుంది. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన లారీ తగిలి పత్తి లోడు ట్రా క్టర్ ముందు చక్రం ఊడి పోవడంతో ట్రాక్టర్కు ఉన్న పత్తి లోడు ట్రక్కు బోల్తా కొట్టింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్ షేక్ సలీమ్ బాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాను కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో సలీమ్ బాషాను పలువురు ఎంఈవోలతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ తాను రెగ్యులర్గా పాఠశాలలను సందర్శిస్తానని, పాఠశాలల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. విద్యాబోధన తీరుతెన్నులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని పేర్కొన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు హెచ్ఎం తలమల దీప్తి గురువారం తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఈనెల 9, 10 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయి బాల, బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయని తెలిపారు. పోటీల్లో ఆరో తరగతి విద్యార్థి ఎం.దీపక్ రామ్ హర్షిత్ ప్రతిభ కనపర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థిని క్రీడల్లో ప్రోత్సహించడానికి స్టాఫ్ సెక్రటరీ బుద్ది మోహనరావు రూ.1000 బహూకరించి అభినందించారు. పీఈటీ కర్ణ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు అభినందించారు. -
కన్నీరు పెట్టించిన కుటుంబసభ్యుల ఆవేదన
విలపించిన పీఆర్కే తల్లి, సోదరి మాచర్ల: ‘ఇంట్లో ఉన్నా.. నీకు ఏమీ తెలియకున్నా... హత్య కేసు పెట్టి నిన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి వద్ద లేకుండా చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందయ్యా...’ అంటూ వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీవీఆర్లను పట్టుకొని ఏడుస్తూ వారి తల్లి రమణమ్మ, సోదరి నాగలక్ష్మిలు విలపించారు. గురువారం వారు కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో వారిని పట్టుకుని బాధపడుతూ ’మనకిదేందయ్యా.. మంచి చెయ్యటమే మనం చేసిన పాపమా’ అంటూ వారు ఆవేదన చెందారు. ఆ సమయంలో విషాద వదనంతోనే పీఆర్కే, పీవీఆర్లు వారిని ఓదార్చారు. ‘ఏం కాదులే’ అంటూ ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, న్యాయవాది రామలక్ష్మీరెడ్డిలు ఓదార్చారు. వారిద్దరూ తల్లికి, చెల్లికి కరచాలనం చేసి కోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఆ దృశ్యాలు అందరిని కలచివేశాయి. వెల్లువెత్తిన సానుభూతి.. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం నాయకులు కుట్ర పూరితంగా జంట హత్య కేసులో వీరిని ఇరికించి ఇబ్బందులు పెట్టడంపై వారి పట్ల సానుభూతి నెలకొంది. ఎక్కడ చూసినా ఇదేం రాజకీయం అనుకుంటున్నారు. పిన్నెల్లి సోదరులను జైలు పాలు చేసేలా టీడీపీ చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. -
అడ్డంకులు దాటుతూ ముందుకు సాగిన మురళీకృష్ణ
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పల్నాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కేతోపాటు పీవీఆర్ను అక్రమంగా కేసులో ఇరికించడంతో కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మద్దతు తెలిపేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాన్ని, తన అనుచరులను విడిచి ఆయన ఒక్కరే ఆర్టీసీ బస్సులో ఎక్కి మాచర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ బస్సును నిలిపారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన బస్సులోని చివరి సీటులోకి వెళ్లి పడుకొని వారికి కనిపించకుండా మాచర్ల పట్టణ శివారుకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు పోలీసులు ఆయనను గుర్తుపట్టి అక్కడ నుంచి దించివేశారు. మురళీకృష్ణ పట్టణ శివారులో ఉన్న పొలాల్లో పయనించి ఆ ప్రాంతంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి సాయం తీసుకొని, అడ్డదారుల్లో ఇబ్బంది పడుతూనే కోర్టు వద్దకు చేరుకొని పిన్నెల్లి సోదరులను కలిసి పార్టీ తరఫున మద్దతు తెలిపారు. మురళీకృష్ణ పట్టుదలతో గమ్యానికి చేరుకున్న తీరును పార్టీ నాయకులు అభినందించారు. -
ముక్కోటి మహోత్సవాలను విజయవంతం చేయాలి
మంగళగిరి టౌన్ : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను ప్రశాంతంగా సజావుగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలని మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సూచించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గురువారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూషలతో పాటు విద్యుత్శాఖ, ఎస్సైజ్శాఖ, ఆర్టిసి, అగ్నిమాపక శాఖల అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బీ.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బీ.ఫార్మసీ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే స్టేషన్లో 500 కేవీపీ, గ్రిడ్ సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించడం సంతోషకరమని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ సుధేష్ణసేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ను డీఆర్ఎం ప్రారంభించారు. ముందుగా సౌర విద్యుత్ ప్లాంట్ వివరాలు సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సౌర ప్లాంట్ సుమారు 8.10 లక్షల యూనిట్లు శుద్ధ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూపొందించడం జరిగిందన్నారు. నేటి నుంచి గుంటూరులో క్రెడాయ్ ఎక్స్పో నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్రెడాయ్ 8వ ప్రాపర్టీ ఎక్స్పోను ఈనెల 12, 13, 14 తేదీల్లో సిద్ధార్థ కన్వెన్షన్ హాల్ (గుంటూరు రింగు రోడ్లో) నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రాపర్టీ షో కొనసాగుతుందని అన్నారు. బ్యాంక్లు, బిల్డర్స్, మెటీరియల్ దుకాణాలు, కన్స్ట్రషన్స్ దుకాణాల నిర్వాహ కులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ మామిడి రాము, షో కన్వీనర్ తియ్యగూర వినోద్రెడ్డి, క్రెడాయ్ కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ షోకు వచ్చేందుకు ప్రవేశం ఉచితమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు, కోశాధికారి ఆళ్ళ నాగార్జునరెడ్డి, ఈసీ కళ్యాణ్చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కిల్కారి సేవలు
నరసరావుపేట రూరల్: మాతా శిశు మరణాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కిల్కారి సేవలు ప్రవేశపెట్టినట్టు జిల్లా ఆశ అధికారి సురేష్ తెలిపారు. నరసరావుపేటలోని బాబాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిల్కారి సేవలపై ఆశ, ఏఎన్ఎమ్లకు గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గర్భిణీ నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు నెలకు ఒక సారి వాయిస్ కాల్స్ ద్వారా సమాచారం ఇస్తుందని తెలిపారు. కిల్కారి కాల్ వచ్చే నెంబరును 911600403660 గర్భిణులు, బాలింతలు సేవ్ చేసుకోవాలని సూచించారు. అప్పుడే కాల్ వినగల్గుతారని, మళ్లీ వినాలంటే 14423, 18005321255 టోల్ఫ్రీ నెంబర్కి చేసి వినవచ్చని సూచించారు. ఈ కిల్కారి కాల్లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్, టీకాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, తల్లి బిడ్డలకు సలహాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రాజు పాల్గొన్నారు. -
దొడ్లేరు రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
క్రోసూరు: దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం వస్తువుల కోసం బాధితులందరూ సమష్టిగా పోరాటం చేసిన ఫలితంగానే పరిహారం లభించిందని కౌలు రైతు, రైతు, వ్యసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కిందట దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో బంగారం కోల్పోయి, సరైన రసీదులు లేక అయోమయ పరిస్థితిలో ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన రైతన్నలకు కౌలురైతు, రైతు – వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలిచాయని తెలిపారు. 2500 ఖాతాలు పరిశీలించి 500 మంది ఖాతాదారులు బంగారం కోల్పోయినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మొదటి దశలో 370 మందికి వడ్డీతో సహా రూ.2 కోట్ల 50 లక్షలు నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన 120 మందికి సరైన ఆధారాలు లేకపోవడం వలన నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పిన నేపథ్యంలో మరింత పట్టుదలతో ప్రజా సంఘాల సహకారంతో 2 సంవత్సరాల 4 నెలలపాటు పోరాటం చేసి చివరగా 474 మంది రైతులకు రూ.3.50 కోట్ల నష్టపరిహారాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. దొడ్లేరు రైతాంగం చేసిన ఈ పోరాటం ఎలాంటి సమస్యనైనా సమష్టిగా పోరాటం చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని రుజువు చేసిందని, నేటి ప్రజానీకానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో శిలర్షా, ఈశ్వర్రెడ్డి, దగ్గు నటరాజు, తదితరులు పాల్గొన్నారు.కౌలు రైతు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు -
టీడీపీ కుట్రలకు తగిన రీతిలో సమాధానం చెబుదాం
మాచర్ల రూరల్: చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నాయకులు కుట్రపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా హత్య కేసులో ఇరికించి పిన్నెల్లి సోదరులను వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. దీనికి కారణమైన నాయకులకు, కొందరు పోలీసులకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గురువారం మాచర్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చటంలో టీడీపీ నేతల కుటిల బుద్ధి బయటపడిందన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఆ బెయిల్ రద్దు చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్ర చేసినట్లు తమకు అర్థం అవుతోందని చెప్పారు. ప్రజల్లోకి పిన్నెల్లి సోదరులు మళ్లీ వచ్చి జగనన్న పాలనను తీసుకు వస్తారని ఆమె స్పష్టం చేశారు. మాజీ కౌన్సిలర్ అన్నెం అనంతరావమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్రెడ్డి, అరుణ్రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శివలింగరాజు, మద్దికర శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘పోలీసులను అడ్డుపెట్టుకుని మా నేతలను నిర్బంధించారు’
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్భందిస్తున్నారన్నారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెళ్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలు ఉన్నారని ఎస్పీనే చెప్పారనే సంగతిని మాజీ మంత్రి విడదల రజిని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. ప్రతి ఒక్కరి సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతల హౌస్ట్ అరెస్ట్
సాక్షి, పల్నాడు జిల్లా: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసన వెల్లువ
మాచర్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ పేదలకు, పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని, వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరిపిన అనంతరం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంతకాల పత్రాల వాహనాన్ని జెండా ఊపి పంపారు. మాచర్ల నియోజక వర్గంలో మొత్తం 72,452 మంది సంతకాలు చేశారని పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలకు విశేష స్పందన లభించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్ బాక్స్లను బుధవారం లింగంగుంట్లలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. గుంటూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గుత్తికొండ అంజిరెడ్డిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గంలో 62,500 సంతకాలు సేకరించారు.. చిలకలూరిపేట నియోజకవర్గంలో... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సమర శంఖారావాన్ని వైఎస్సార్ సీపీ పూరించిందని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీమంత్రి నివాసం నుంచి నియోజకవర్గ పరిధిలో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి సంతకాల ప్రతులు ఉన్న వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించించారు. వినుకొండ నియోజకవర్గంలో... కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పూర్తి చేసిన 63వేల సంతకాల ప్రతులను బుధవారం భారీ ర్యాలీగా నరసరావుపేట జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో... కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం చంద్రబాబు ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడుతుందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమంలోని 66,507 ప్రతులను బుధవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు తరలించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో... పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 55వేల మంది ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరు వైఎస్సార్సీపీ కార్యాయలంలో కోటి సంతకాల ఉద్యమ ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయానికి తరలిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలో... కోటి సంతకాల కార్యక్రమం ప్రజా ఉద్యమంలా జరిగిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాల కాపీల బాక్సులను పల్నాడు జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసు మహేష్రెడ్డి ముందుగా సంతకాల సేకరణ బాక్సులను పరిశీలించి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జెండాను ఊపి వాహనాన్ని ప్రారంభించారు.క్రోసూరులో సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు -
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
●అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు ●సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్త, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు నకరికల్లు: విధి నిర్వహణలో అలసత్వం వ్యవహరించినా, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ మెంబర్ ఈ.లక్ష్మీరెడ్డి హెచ్చరించారు. ఆహార భధ్రత చట్టం అమలులో భాగంగా ఫుడ్కమిషన్, ఐసీడీఎస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు మండలంలోని నర్శింగపాడు, నకరికల్లు, దేచవరం గ్రామాల్లోని అంగన్వాడీకేంద్రాలు, ప్రభుత్వపాఠశాలల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం, కోడిగుడ్లు, సరుకుల నిల్వలు, వంటగదులు, పరిశుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్టర్ నిర్వహణలో తప్పులు, గర్భిణులకు కోడిగుడ్లు పంపిణీలో నిబంధనలు పాటించకపోవడంతో అంగన్వాడీ సూపర్వైజర్ షేక్.రమీజున్, నర్శింగపాడు–2 అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణికు షోకాజ్ నోటీస్ జారీచేయాలంటూ ఐసీడీఎస్ పీడికి సిఫారసు చేశామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో వండించకుండా బయట వండించి తీసుకువస్తున్న కారణంగా ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయురాలు బి.శివకుమారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీచేశారు. ఐసీడీఎస్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం నకరికల్లులోని ఉన్నతపాఠశాలలో మధ్యాహ్నభోజనం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమారాణి, డిఎస్ఓ ఎం.వి.ప్రసాద్, జీసీడీఎస్ఓ శ్రీలత, జీసీడీఓ దొండేటి రేవతి, డిప్యూటి డీఈఓ ఏసుబాబు, తహసీల్దార్ కె.పుల్లారావు, డిప్యూటి తహసీల్దార్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనైతిక బంధం..అంతం !
నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణం పెద్ద చెరువు రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న త్రోవగుంట బాల సుబ్రమణ్యాచారికి శ్రీలక్ష్మి (35)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేరు. సుబ్రహ్మణ్యాచారి హార్డ్వేర్ షాపు నిర్వహిస్తుంటాడు. భార్య శ్రీలక్ష్మికి పట్టణానికి చెందిన షేక్ బాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొద్ది రోజులకు భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తన భార్య జోలికి రావద్దని బాజీని హెచ్చరించాడు. అయినా లెక్క చేయకుండా శ్రీలక్ష్మితో ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో బాజీని హతమార్చాలని నిర్ణయించుకుని అత్త రాంబాయమ్మతో కలిపి పథకం పన్నాడు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన బాజీ ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద హోటల్లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని సుబ్రహ్మణ్యాచారి, రాంబాయమ్మ కలిసి హతమార్చారు. వీరిద్దరినీ గత శనివారం నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. బాజీ మృతి చెందడం, తల్లి, భర్త కటకటాల పాలవడంతో శ్రీలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. ములాఖత్లో చివరి పలకరింపు.. రాత్రికి బలవన్మరణం.. సబ్జైల్లో ఉన్న భర్త, తల్లిని ములాఖత్ ద్వారా శ్రీలక్ష్మి మంగళవారం కలిసింది. అక్కడ ఏం జరిగిందో ఏమో ... అర్ధరాత్రి సమయంలో శ్రీలక్ష్మి ఉరేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆమె సోదరుడు మల్లిఖార్జునరావు పిలిచినా పలకపోవడంతో అనుమానంతో గది తలుపులు పగలగొట్టి చూశాడు. ఉరేసుకుని కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ ప్రభాకర్, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వివాహేతర బంధం నేపథ్యంలో వ్యక్తి హత్య కటకటాల పాలైన వివాహిత భర్త, తల్లి చివరకు ఉరేసుకున్న వివాహిత నరసరావుపేటలో కలకలం రేపిన ఘటన ఆకర్షణ పునాదులపై కట్టుకున్న తాత్కాలిక ప్రేమ సౌధం అర్ధంతరంగా కూలిపోయింది. కనిపెంచిన తల్లి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త కటకటాల పాలవగా పశ్చాత్తాపంతో నిలువునా కుంగిపోయింది. కట్టుకున్నోడు దూరం కాగా.. కలుపుకొన్న బంధం మట్టిలో కలిసిపోగా.. ఒంటరి జీవితాన్ని భరించలేక, జీవచ్ఛవంలా బతకలేక తానూ ఉరికొయ్యకు వేలాడింది. అనైతిక బంధాల ఉచ్చులో పడి నరసరావుపేటలో ఓ మహిళ నిండు ప్రాణాలు బలి తీసుకుంది. -
22న వినుకొండలో జాబ్మేళా
నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో జాబ్మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్మేళాకు దాదాపు 35 కంపెనీలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లోమో, ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత జాబ్మేళాకు హాజరు కావాలని సూచించారు. విద్యార్హత, ఎంపిక చేసుకున్న కంపెనీల పరంగా రూ.13వేలు నుంచి రూ.35వేలు వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు మాట్లాడుతూ, అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావచ్చని తెలిపారు. వివరాలకు డి.జానీబాషా (99512 14919), సురేష్ (91005 66581), ఎం.వీరాంజనేయులు (91602 00652), ఏ.రమ్య (77029 21219) నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
రండి .. ప్రధానితో మాట్లాడండి
సత్తెనపల్లి: ప్రధాన మంత్రితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా, ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలు అంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలలోపు ఉండాలి. ఇందులో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే... ‘పరీక్షా పే చర్చ’లో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంది. లాగిన్ ఇలా... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్టీటీపీఎస్://ఇన్నోవేటివ్ఇండియా.మైజీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్ కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్ నేరుగా ఫోన్ నెంబర్, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ప్రవేశ అవకాశం కల్పించారు. ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు 2026 జనవరి 11 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు/ ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్ను ఎంచుకొని 500 అక్షరాల లోపు వివరించాలి. -
● సిబ్బంది, పోలీసులకు గాయాలు ● ఆక్టోపస్ సిబ్బంది చేతికి చిక్కిన ఐదుగురు మావోయిస్టులు ● ఆక్టోపస్ అధికారులు నిర్వహించిన మాక్డ్రిల్
నరసరావుపేట రూరల్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షను జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఆర్వో అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఈవో చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో మాట్లాడుతూ పట్టణంలోని ఐదు కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్షలకు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. స్క్వాడ్స్ నియమించి శాఖాపరమైన అధికారులు పరీక్ష కేంద్రాలను తరచూ తనిఖీ చేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద మావోయిస్టుల కాల్పులు అచ్చంపేట: అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు, ప్రాజెక్టుకు సమీపంలోని చెక్పోస్టులపై మావోయిస్టులు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దాడి చేశారు. అక్కడ డ్యూటీలో ఉన్న ప్రాజెక్టు సిబ్బంది, సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద కాపలాగా ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. డ్యామ్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న మావోయిస్టులు డ్యూటీలో ఉన్న ఏఈ రాజుతోపాటు ప్రాజెక్టు సిబ్బందిని నిర్బంధించారు. ప్రాజెక్టు ఏఈ రాజు సమయస్ఫూర్తితో అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. మావోయిస్టులు తమను నిర్బంధించారని త్వరగా రావాలంటూ సమాచారం అందించారు. అచ్చంపేట సీఐ హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సీఐ శ్రీనివాసరావు ఆక్టోపస్ అధికారులకు తెలియజేయడంతో ప్రత్యేక వాహనంలో బెటాలియన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆక్టోపస్ బెటాలియన్ యూనిట్ మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను అచ్చంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. గాయపడిన డ్యామ్ సిబ్బందిని, పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం అచ్చంపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. ఇదంతా ప్రాజెక్టుకు మావోయిస్టుల వల్ల ప్రమాదం వాటిల్లితే పోలీసులు, ప్రాజెక్టు సిబ్బంది ఏవిధంగా వ్యవహరించాలి, ఎవరెవరికి సమాచారం అందించాలి, ఆపరేషన్ చేసి మావోయిస్టులను ఎలా లొంగతీసుకోవాలో ప్రయోగాత్మకంగా ఆక్టోపస్ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీలు జి.విశ్వనాథం, బి.మధు, పల్నాడు డీఎస్పీ ఏఆర్ జీయం గాంధీరెడ్డి, ఇన్స్పెక్టర్స్ ఆర్ రాంబాబు, డి.మధుబాబు, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ, పల్నాడు బీడీ టీమ్, ఆక్టోపస్ మాక్స్ డ్రిల్ స్బింది పాల్గొన్నారు. -
రూ.12.28 లక్షల బయో ఉత్పత్తులు స్వాధీనం
నరసరావుపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.12,28,740 విలువైన బయో ఉత్పత్తులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పార్సిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వివిధ కంపెనీల బయో ఉత్పత్తులను నిలుపుదల చేశారు. వ్యాపారులు అందజేసిన బిల్లులు, అనుమతి పత్రాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి బయో ఉత్పత్తులు రవాణా చేస్తున్నట్టు నిర్దారించారు. ఈ మేరకు రూ.12లక్షల విలువైన 188.8లీటర్ల ఆరు రకాల బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏవో సీహెచ్ ఆదినారాయణ, సీఐ కె.చంద్రశేఖర్, నరసరావుపేట ఏవో ఐ.శాంతి పాల్గొన్నారు. -
జిల్లా విద్యాశాఖాధికారిగా రామారావు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జె.రామారావు నియమితులయ్యారు. ప్రభుత్వం మంగళవా రం విద్యాశాఖలో చేపట్టిన డీఈఓల బదిలీలలో భాగంగా కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తు న్న రామారావు బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలతోపాటు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి(డీఎస్ఈఓ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామారావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట డిప్యూటీ డీఈఓగా, అడిషనల్ డైరెక్టర్–1 బాధ్యతలు నిర్వర్తించారు. బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఎల్.చంద్రకళ కృష్ణాజిల్లా అంగలూరు డైట్ కళాశాల ప్రిన్సిపల్గా, ఎన్టిఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఎస్ఈఓ)గా బదిలీపై వెళ్లనున్నారు. శిలాఫలకాలు, ఆర్చీలపై వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లు ధ్వంసం నాదెండ్ల: మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అభివృద్ధి పథకాల శిలాఫలకాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేసిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. మోడల్ స్కూలు–బీసీ కాలనీ రహదారికి అప్పటి మంత్రి విడదల రజిని పేరిట ఆర్చి నిర్మించారు. తాజాగా ఆర్చిలోని ఆమె పేరును తొలగించారు. శ్మశానవాటికలో నిర్మించిన ఆర్చిని, కమ్యూనిటీ హాలుకు గల వైఎస్సార్ సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి పేరును ధ్వంసం చేశారు. అమూల్ డెయిరీ, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ సెంటర్లో శిలాఫలకాలపై సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు సింగారెడ్డి కోటిరెడ్డి పేర్లను తొలగించారు. టీడీపీ వర్గీయుల దుశ్చర్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్నారు. -
నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
రేపల్లె: నాయీ బ్రాహ్మణులకు రాష్ట్రంలో అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్రాక్షారపు సూరిబాబు అన్నారు. రేపల్లెలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు, హాస్టల్స్, హెల్త్ శాఖలలో క్షౌర వృత్తి పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వం క్షౌ రశాలలకు 200ల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని, ఇది త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యడ్లపల్లి కిషోర్బాబు, కె.అప్పారావు, విజయ్, కె.శివయ్య, సుబ్రహ్మణ్యం, కె.శివబాజీ, కొడాలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి తెనాలి మీదుగా గూడూరు వరకు నిర్మించిన మూడో రైల్వే లైన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రత్యేక రైలులో సాయంత్రం తెనాలి వచ్చారు. విండో ఇన్స్పెక్షన్లో భాగంగా జీఎం రైలులోనే ఉండి ట్రాక్ను పరిశీలిస్తూ ప్రయాణించారు. ఇదే రైలులో వచ్చిన విజయవాడ, గుంటూరు డీఆర్ఎంలు మోహిత్ సొనాకియా, సుదేష్ణసేన్ తెనాలిలో దిగిపోయారు. అమృత్ భారత స్టేషన్గా ఎంపికై న తెనాలి స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.28 కోట్లు మంజూరు కాగా, వాటికి సంబంధించి జరుగుతున్న గూడ్స్ షెడ్డు నిర్మాణం, స్టేషన్లో కాలినడక వంతెనలు, ఇతర పనులను విజయవాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా అధికారుల బృందంతో పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ టీవీ రమణకు పలు సూచనలు చేశారు. గుంటూరు మెడికల్: సుమారు 30 ఏళ్ల తర్వాత మళ్లీ మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు గుంటూ రు మెడికల్ కళాశాల విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ టైటిల్, పోస్టర్ను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ సమక్షంలో అధ్యాపకులు, వైద్య విద్యార్థులు మంగళవారం ఆవిష్కరించారు. ఎగ్జిబిషనన్కు ‘గుంటూరు మెడికల్ కాలేజ్ మెడ్ ఫ్యూషన్’ అని నామకరణం చేశా రు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సమాచారం, అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఉండాలని సూచించారు. విశిష్ట అతిథి రాజా కర్ణం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారికి రూ.లక్ష అందజేసి ఎగ్జిబిషన్ విజయవంతానికి తన మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు. వేమూరు: కో ఆప్షన్ మెంబర్ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రైసెడింగ్ అధికారి పి.పద్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 12 గంటలలోపు నామినేషన్ పరిశీలన, అనంతరం చెల్లుబాటు నామినేషన్ పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ ఉపసంహరణ, తర్వాత కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరుగుతుందన్నారు. -
ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాం
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద మెడికల్ కళాశాలను నిర్మాణం చేసి పేదలకు మెరుగైన వైద్యంతోపాటు నిరుపేద విద్యార్థులకు మెడికల్ చదివే అవకాశం కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీపీ విధానంతో కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించే పనిలో ఉన్నారు. నిరసనగా మేము చేపట్టే సంతకాల సేకరణలో మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అందించే వైద్య సేవలు, వాటి ప్రాముఖ్యతను తెలుపుతున్నాం. – డేగల సునీల్ కుమార్, గురజాల -
బలం లేకున్నా బరిలో టీడీపీ
మాచవరం: అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. తమకు మెజార్టీ లేకున్నా మాచవరం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. టీడీపీ నాయకుల అరాచకాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల బంధువులను దాచేపల్లి సీఐ స్టేషన్కు పిలిపించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాచవరం మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 11న ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ క్రమంలో మెజారిటీ లేకున్నా టీడీపీ నేతలు ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. వాటిలో 13 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకోగా, టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల జరిగిన పరిణామాలలో వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశునిపాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య పార్టీ ఫిరాయించారు. దీంతో ఫిరాయింపుదారులతో కలిపి టీడీపీ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో గెలుపు అసాధ్యమని గుర్తించిన టీడీపీ నాయకులు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికపై మండల ప్రజానీకంలో ఉత్కంఠ నెలకొంది. న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు. పోలీసుల అండదండలు మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సపోర్ట్ లక్ష్మీబాయికి బావ వరుసైన బాలు నాయక్, మల్లవోలు ఎంపీటీసీ సభ్యురాలు చుక్క సువార్త కుమారుడు పెదరాజారావులను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మంగళవారం ఉదయం అక్రమంగా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారంటూ బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ శ్రేణులు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని ఆశ్రయించారు. పోలీసుల తీరును మండల ప్రజలు తప్పుబడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ శ్రేణులు మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు న్యాయం చేస్తుందని కాసు పేర్కొన్నారు. -
గురజాల నియోజకవర్గంలో జోరుగా కోటి సంతకాల సేకరణ
గురజాల: రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భరోసా కల్పించే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైద్య కళాశాలలను నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి పీపీపీ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సారధ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నాయి. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఒక మహాయజ్ఞంగా జరుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తూ వైద్య విద్యను వ్యాపారమయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురజాలలో ఇలా... వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. గురజాల నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 40వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. గురజాల నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో సంతకాల సేకరణ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా సామాన్యులు, చిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, కార్మికులు ప్రతి ఒక్కరూ విధిగా వచ్చి సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యను పేదలకు దూరం చేయొద్దు.....నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం దూరం చేయొద్దు అంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. -
కంత్రీని పట్టించిన నిఘా నేత్రం
సాక్షి, నరసరావుపేట: వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు పోయిందనేది సామెత. వంద తప్పులు తర్వాతే శిశుపాలుడి పాపాలు పండాయి. అలాగే లెక్కకు లేనన్ని తప్పులు చేసిన ఆ ఖాకీ కంత్రి కొడుకు పాపాలు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణంతో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తండ్రి అధికారం.. ఉన్నతాఽధికారుల సహాయసహకారాలతో ఇప్పటివరకు బయటపడినట్టే ఈసారి బయటపడాలని చూసినా ప్రమాద ఘటనలో ఉన్న సీసీ కెమెరాలు అసలు నేరస్తులను పట్టించాయి. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థుల మరణానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడి గ్యాంగ్ ప్రమేయం గురించి తెలిసినా తొలుత పోలీసులు మిన్నుంకుండిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్లతో వెళ్తున్న ట్రాలర్ను రవాణాశాఖ అధికారులు కారులో వెంబడించి ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. ప్రమాదం జరగగానే రవాణాశాఖ అధికారులు జారుకున్నారని సోషల్మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఈ సమయంలో తన కొడుకును తప్పించేందుకు సదరు ఏఎస్ఐ తనకు అండగా నిలిచే జిల్లా పోలీసు కార్యాలయంలోని కీలక అధికారి ద్వారా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. చేతులెత్తేసిన ‘స్పెషల్’ అధికారి... ప్రమాదానికి కారణం రవాణాశాఖ అధికారులని ప్రచారం జరగడంతో వెంటనే స్పందించిన పల్నాడు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగినచోట ఉన్న సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించామని.. ప్రమాదానికి కారణమైన టీఎస్08హెచ్వై 3158 కారు రవాణాశాఖకు సంబంధం లేదని, ఆ వ్యక్తులు మా ఉద్యోగులు కాదని స్పష్టం చేశారు. దీంతో ఏఎస్ఐ కొడుకును కాపాడే ప్రయత్నాలకు బ్రేక్ పడిందని మృతుల బంధువులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు కారు అతివేగంతో ప్రమాదం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారని, రవాణాశాఖ వారి వీడియోతో వాస్తవం బయటపడిందంటున్నారు. మరోవైపు మీడియాలో ఏఎస్ఐ కుమారుడి పాత్రపై వార్తలు రావడంతో తానేమి చేయలేని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి చేతులెత్తేసినట్ట సమాచారం. గుడి కోసం చందాలు భారీగా వసూలు... ఆ స్పెషల్ అధికారే తండ్రి కొడుకుల ఆగడాలకు అండగా నిలిచాడని, తన గ్రామంలో కడుతున్న గుడి కోసం వీరిద్దరి ద్వారా భారీగా చందాలు వసూళ్లు చేశారని పోలీసుశాఖలో వినిపిస్తోంది. గత జిల్లా ఎస్పీ ఉన్నసమయంలో స్పెషల్ అధికారి తరఫున అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారితో భారీగా మూమూళ్లు వసూలు చేసే బాధ్యత సైతం ఇదే తండ్రి కొడుకులు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యభిచార గృహాలు, స్పా సెంటర్లు, రేషన్ మాఫీయా, పేకాట, పోలీసుశాఖలో సిబ్బంది బదిలీలు వంటివాటిలో సదరు అఽధికారి, ఏఎస్ఐ భారీగా వెనుకేసినట్టు బయటపడుతున్నాయి. యాక్సిడెంట్ విషయం పెద్దది కావడం ఉన్నతాఽధికారులు రంగప్రవేశం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏఎస్ఐ కొడుకును అదుపులోకి తీసుకున్నారట. బదిలీతో సరిపెట్టేస్తారా..? ఏఎస్ఐ కంత్రి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిద్దరి ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఏఎస్ఐ కొడుకు ఏపీ, తెలంగాణలో పదుల సంఖ్యలో వాహనాలను దొంగలించి విక్రయించాడు. అందులో ప్రమాదానికి గురైన కారుతోపాటు మరో ఐదు కార్లు ఏఎస్ఐ ఇంటి వద్దే ఉండగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో వాటిని పక్కకు తప్పించారు. ఏఎస్ఐ కొడుకు దొంగిలించిన కార్లలో నరసరావుపేట డివిజన్ పరిధిలోని పోలీసులు సైతం తిరుగుతుండటం విశేషం, ఏఎస్ఐ వల్ల పోలీసుశాఖకు వస్తున్న చెడ్డపేరును గమనించిన అధికారులు ఏఎస్ఐ శ్రీనివాస్ను వెల్దుర్తి పోలీసుస్టేషన్కు బదిలీచేశారు. అయితే బదిలీతోనే సరిపెడతారా .. తండ్రి కొడుకులపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఏఎస్ఐకి అండగా ఉంటూ, అక్రమాలు చేయించిన పోలీసు అధికారులపై చర్యలుండవా అని ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు. -
మక్కీకి..మక్కీ..!
సేమ్ టు సేమ్.. నకిలీ స్కామ్ క్లీనింగ్కు ఉపయోగించేటప్పుడు ముక్కు పుటాలు బద్ధలవుతున్నా అనుమానానికి ఆస్కారం లేదు.. ఆ వాసన శ్వాసకోశ వ్యాధులకు గురి చేస్తున్నా ఆరా తీసే అవకాశం లేదు.. లేబుళ్లు, బాటిల్ ఆకృతిలో మార్పు లేదు.. రంగులో తేడా లేదు.. కానీ కల్తీ మాత్రం నట్టింట చేరి ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్న చందంగా బాత్ రూములు క్లీన్ చేసే హార్పిక్, ఫ్లోరింగ్ తుడిచే లైజాల్ కు నకిలీ మకిలీ అంటించేశారు. నరసరావుపేట కేంద్రంగా కల్తీ హార్పిక్, లైజాల్ను మార్కెట్లోకి పంపించేశారు. అధికారుల నిర్లక్ష్యానికి సవాల్ విసురుతూ యథేచ్ఛగా వ్యాపారం సాగించేస్తున్నారు. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నకిలీ హార్పిక్, లైజాల్లు పట్టుబడటం కలకలం రేపుతుంది. ఇటీవల నకిలీ బాస్మతి బియ్యం పట్టుబడిన విషయం మరువక ముందే హార్పిక్, లైజాల్ నకిలీవి వెలుగు చూడటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వంట నూనె, దీపారాధన నూనెలతో మొదలైన కల్తీ వ్యాపారం ఇంటి పరిశుభ్రత ఉత్పత్తుల వరకు విస్తరించింది. అసలుకు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీలను అక్రమార్కులు మార్కెట్లో ప్రవేశపెట్టారు. వీటిని వినియోగదారులు గుర్తు పట్టడం ఆసాధ్యంగా మారింది. దీంతో అక్రమార్కులు కల్తీకి కాదేది అన్న చందంగా ప్రతి వస్తువునూ డూప్లికేట్ తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారుల నిఘా కూడా అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బాత్రూంలు శుభ్రపరిచే హార్పిక్, ఫ్లోరింగ్ శుభ్రం చేసే లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను దిగుమతి చేసి ఇక్కడ గత కొన్ని నెలలుగా విక్రయిస్తున్నారు. ఇందులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న హార్పిక్, లైజాల్ కంపెనీల ప్రతినిధులు గత గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దాడితో ఈ నకిలీ వ్యవహారం వెలుగు చూసింది. ఆందోళనలో వినియోగదారులు.. కల్తీల కారణంగా మార్కెట్లో దొరికే వస్తువుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అక్రమార్కులు ప్రతి వస్తువును మక్కీకి మక్కీ తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతన్నప్పటికీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ప్రముఖ షాపింగ్ మాల్స్లో దొరికే వస్తువుల సైతం అనుమానించాల్సి వస్తుంది. పోలీసుల అదుపులో నిందితులు.. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి రోడ్డులోని కామాక్షి జనరల్ స్టోర్పై దాడులు నిర్వహించారు. అక్కడ హార్పిక్, లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాతూరులోని మరో దుకాణంపై దాడులు నిర్వహించి నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని దుకాణ నిర్వాహకుడిని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు.. హార్పిక్, లైజాల్ సంస్థ ప్రతినిధి గరికముక్కు వినోద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. డూప్లికేట్ బాటిళ్లు విక్రయిస్తున్న దుకాణ నిర్వాహకులు మధుసూదనరావు, మణికంఠ లపై కేసు నమోదు చేశామన్నారు. మొత్తం 15 కల్తీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. విచారణలో కల్తీ తయారీలో కీలక నిందితుల పాత్ర తేలనుందన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డూప్లికేట్ హార్పిక్, లైజాల్ బాటిళ్లు -
ప్రజారోగ్యాన్ని అంగట్లో పెడితే సహించేది లేదు
నాడు జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల రావాలని కలగంటే ....నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీ విధానంతో స్కెచ్ వేసింది. మా ప్రభుత్వంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందాలన్న ఉద్దేశంతో నిర్మించిన భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే. ఇది ముమ్మాటికి నిరుపేదలపై జరుగుతున్న దాడిగా పరిగణిస్తాం. ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. కూటమి ప్రభుత్వం మెడలు వంచే ఆయుధాలు ఈ నెల 16న గవర్నర్కు సమర్పిస్తాం. చంద్రబాబునాయుడు కుట్రలను బట్టబయలు చేస్తాం. – కాసు మహేష్రెడ్డి మాజీ ఎమ్మెల్యే, గురజాల. -
200 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించాలి
సత్తెనపల్లి: జాతీయ లోక్అదాలత్లో సత్తెనపల్లిలో 200 సివిల్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలని గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై.నాగరాజా పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 13న స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి మంగళవారం న్యాయవాదులు, పోలీసు అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై నాగరాజా మాట్లాడుతూ సత్తెనపల్లిలో సివిల్ కేసులు సుమారు 200 రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే న్యాయాధికారులు సహకరిస్తారన్నారు. నగదుకు సంబంధించిన ఈపీలు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి సహకరించాలని కోరారు. నగదు ఈపీలు పరిష్కారంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఫిర్యాదుదారులకు, నిందితులకు తమ సూచనలు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి సహకరించాలని పోలీసు అధికారులను కోరారు. సమావేశంలో మూడో అదనపు జిల్లా న్యాయ అధికారి సీహెచ్వీఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, స్థానిక న్యాయాధికారులు వి.విజయ్కుమార్రెడ్డి, తౌషీద్ హుస్సేన్, పి.ప్రియదర్శిని, జె.సృజన్కుమార్, న్యాయవాద సంఘం అధ్యక్షుడు గంగూరి అజయ్కుమార్, న్యాయవాదులు, సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కేసుల పరిష్కారానికి సహకరించండి నరసరావుపేట టౌన్: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 13వ అదనపు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్కు సంబంధించి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయాధికారి వై. నాగరాజా మాట్లాడుతూ నరసరావుపేటలో సివిల్ కేసులు సుమారు 200 రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలన్నారు. ఈ మేరకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే న్యాయాధికారులు సహకరిస్తారన్నారు. నగదుకు సంబంధించిన ఈపీలు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి సహకరించాలని కోరారు. నగదు ఈపీలు పరిష్కారంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఫిర్యాదుదారులకు, నిందితులకు తమ సూచనలు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి సహకరించాలని పోలీసు అధికారులను కోరారు. సమావేశంలో మూడో అదనపు జిల్లా న్యాయ అధికారి సీహెచ్వీఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, స్థానిక న్యాయాధికారులు మధుస్వామి, లావణ్య, ఆశీర్వాదం పాల్, సలోమి, గాయత్రి, న్యాయవాద సంఘ అధ్యక్షులు గన్నే వెంకట సుబ్బారావు, ఏపీపీ సురేష్, సీఐలు ఫిరోజ్, సీహెచ్ ప్రభాకరరావు, ఎం.వి సుబ్బారావు, సీహెచ్ లోకనాథం, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 12న ధర్నా
నరసరావుపేట: రాష్ట్రంలోని అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి వారి వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) నాయకులు కోరారు. ఈ మేరకు సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 12న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్కు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించాలని, సంక్షేమ పథకాలు అమలుచేసి, అన్ని యాప్లు కలిపి ఒకేయాప్గా మార్చాలని, సెంటర్ నిర్వహణకు 5జి ఫోన్లు ఇవ్వాలని, ఎఫ్అర్ఎస్ రద్దు చేయాలని, గ్రాట్యూటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు. నందిగామ టౌన్: చెడు వ్యసనాలకు బానిసై ఖరీదైన మోటారు సైకిళ్లను అపహరించి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి చోరీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరి గ్రామానికి చెందిన ఏపురి శివ, నకిరేకల్ మండలం చీమలగడ్డ గ్రామానికి చెందిన కుర్రి మహేంద్ర, మేడిపల్లి ఉమేష్చంద్ర, నకిరేకల్కు చెందిన కంచుకొమ్మల సంజయ్ కుమార్, నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఊదర సంతోష్ గత కొంత కాలంగా ఖరీదైన ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తాకట్టు పెడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నందిగామ శివారు వై జంక్షన్ వద్ద ఎస్ఐలు మోహనరావు, సూర్యవంశీ వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఐదుగురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పిడుగురాళ్ల ఒకటి, నరసరావుపేట ఒకటి, పెనమలూరు ఒకటి, కృష్ణలంక ఒకటి, రెంటచింతల ఒకటి తో పాటు ఆయా ప్రాంతాలలో చోరీకి పాల్పడిన మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐలను అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో ఏసీపీ తిలక్, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్టీయూ జిల్లా సీపీఎస్ కన్వీనర్గా విజయప్రసాద్
సత్తెనపల్లి: ఎస్టీయూ జిల్లా సీపీఎస్ విభాగం కన్వీనర్గా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జెల్ది విజయప్రసాద్ ఎన్నికయ్యారు. నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఎస్టీయూ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సోమవారం విజయప్రసాద్ మాట్లాడుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఓపీఎస్ సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలు జయప్రదం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్వీ రామిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జెల్ది విజయప్రసాద్ నియామకంపై పలువురు ఉపాధ్యాయులు హర్షం వెలిబుచ్చారు. -
ఆర్థిక అంశాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: ఆర్థిక పరమైన అంశాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు అందాయి. సోదరుడు కష్టాల్లో ఉన్నాడని జాలిపడి బంగారం ఇస్తే ఆ తరువాత స్పందించకుండా పట్టణం విడిచివెళ్లిపోయారని నరసరావుపేటకు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. డబ్బు లు కోసం అప్పుల వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని పరిచయస్తురాలు మాటలు నమ్మి రూ.15లక్షలు ఇస్తే, చెక్, ప్రోనోటు మీద చెల్లకుండా సంతకాలు చేసి మోసం చేసిందని మరో మహిళ ఫిర్యాదులో పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో తన బిడ్డ చనిపోయాడని, నకిలీ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్తో నిందితుడు, ఇన్స్యూరెన్స్ సంస్థ మమ్మల్ని మోసం చేసిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం వంటి సమస్యలకు సంబంధించిన 134 ఫిర్యాదులు అధికారులకు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ అధికారుల దృష్టికి 134 ఫిర్యాదులు -
పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా
రొంపిచర్ల: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంతగుడిపాడు జీడీసీసీ బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. బ్యాంక్, పలు ఉద్యోగ సంఘాల నాయకులు సొసైటీ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చా లని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 12 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో విప్పర్ల, సంతగుడిపాడు, రొంపిచర్ల, సుబ్బయ్యపాలెం, బుచ్చి బాపన్నపాలెం, పీఏ సీఎస్ల సీఈవోలు భవనం వెంకటేశ్వరరెడ్డి, ఎన్. లక్ష్మీరెడ్డి, డి.వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, సిబ్బంది దీపక్, సాంబయ్య, మల్లికార్జున్, ఎస్.వీరారెడ్డి, సిహెచ్.శివనాగిరెడ్డి, వై.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. -
పురుగుమందుల అక్రమ రవాణాపై కేసు
వినుకొండ: ఆర్టీసీ కార్గో కేంద్రంగా పురుగుమందులు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు వినుకొండ పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. వినుకొండ ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ కార్యాలయంలో ఆదివారం వినుకొండ ఏడీఏ సీహెచ్.రవికుమార్ తనిఖీలు నిర్వహించి ఎలాంటి బిల్లులు లేని బీఏఎస్ఎఫ్ పురుగుమందులను, ఎఫ్ఎంసీ మార్షల్ 36 లీటర్లు సీజ్ చేసి రూ.3లక్షలకు పైగా విలువ గల పురుగుమందులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ కేంద్రంగా జీరో వ్యాపారం కొంతకాలంగా వినుకొండ ప్రాంతంలో నకిలీ బయో ఎరువులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తూ రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పండు, చరణ్ అనే ఇద్దరు వ్యక్తుల పేరుతో కార్గో ద్వారా వినుకొండకు పురుగుమందులు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఈపూరు మండలానికి చెందిన ఎమ్మెల్యే సమీప బంధువు వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్గోలో పెద్దఎత్తున పురుగుమందులు సరఫరా జరిగాయని, సరుకు మొత్తం పంపిణీ అయిన తరువాత కేవలం రూ.మూడు లక్షల పురుగుమందులను పట్టుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వ్యవసాయాధికారులు కేసును పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు అప్పగించడం కొసమెరుపు. -
సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పెదకూరపాడు: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిపూడి పీఏసీఎస్ సీఈఓ జాన్ సైదా డిమాండ్ చేశారు. పెదకూరపాడులోని కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో సోమవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించి, మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 36 ను వెంటనే అమలుచేసి, పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ చట్టాన్ని అమలుపరిచి చట్టపరంగా చెల్లించాలన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. రైతులకు సకాలంలో జిల్లా బ్యాంకుల ద్వారా కాకుండా సహకార సంఘాల ద్వారానే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫణిదం సీఈఓ శ్రీనివాసరావు, పర్సన్ తాళ్లూరు సీఈఓ శివకుమారి, అర్చన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్సైదా -
టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ వీరగంధం వెంకటసుబ్బారావుకు చెందిన 4.22 ఎకరాలు ఎలాంటి ఆధారాలు లేకుండా గ్రామానికి చెందిన అదే పార్టీ నాయకుడు వీరగంధం రత్తయ్య ఆన్లైన్లో తనపేరు ఎక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మేనల్లుడు ముండ్రు సత్యనారాయణ, అతని కుమారుడు వెంకటేశ్వర్లు ఈ ఏడాది జూలై నెలలో తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోవడంపై కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కోర్టులో సోమవారం ఇరువర్గాలను పిలచి విచారించే క్రమంలో అక్కడకు వచ్చిన వీరగంధం రత్తయ్య, అతని కుమారుడు అజయ్, గ్రామసర్పంచ్ వీరగంధం ఆనంద్, మక్కెన శ్రీనులు మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వెంకటేశ్వర్లుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచారు. బాధితుడు పక్కనే ఉన్న పోలీస్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసే క్రమంలో స్టేషను ముందు కూడా దాడి చేసి గాయపరచారు. బాధితుడు చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. స్వామి మాలలో ఉన్నా దాడులు శివస్వామి మాలలో ఉన్నప్పటికీ కనికరం లేకుండా తనపై కర్రతో దాడి చేశారని శ్రీశైలం వెళ్లి దీక్ష విరమంచే సమయంలో ఈ రోజు దాడిచేశారని బాధితుడు వాపోయాడు. టీడీపీ ప్రభుత్వంలో పార్టీ నాయకులకే రక్షణలేదని, భూములకు కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రామంలో ఎస్సీ ఎస్టీల భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయని, కనీసం రక్షణ లేకపోవటంతో 40 కుటుంబాలు గ్రామం విడచి వెళ్లాలని చూస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులే టీడీపీ కార్యకర్తల మాదిరిగా భయం లేకుండా ఎవరి భూములైనా మరొకరి పేరుతో ఆన్లైన్ చేస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను వేడుకున్నాడు. -
సీసీఐ రాజ్యం..దళారుల భోజ్యం
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ స్థానిక ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకై ్క తేమ నిబంధనల పేరుతో రైతులను దగా చేస్తున్నారు. రైతులు వద్ద తేమ శాతం 14 వస్తే పత్తి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల పత్తి విషయంలో తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఉన్న తేమ నిబంధనాలు, వ్యాపారులకు వర్తించవా. సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తుంటే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – పెండ్యాల మహేష్ , సత్తెనపల్లి మండల కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
లభించని బాలుడి ఆచూకీ
●శుక్రవారం తల్లి, బిడ్డను కాలువలో నెట్టివేసిన తండ్రి ●రెండు రోజులైన లభించని బాలుడు శరత్ ఆచూకీ ●గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసు సిబ్బంది నరసరావుపేట రూరల్: కాలువలో గల్లంతైన ఏడు నెలల బాలుడు శరత్ ఆచూకీ ఆదివారం కూడా లభించలేదు. శుక్రవారం రాత్రి రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ తన భార్య త్రివేణి, ఏడు నెలల కుమారుడు శరత్ను చిలకలూరిపేట మేజర్ కేనాల్కి నెట్టివేయడంతో త్రివేణి మృతి చెందింది. త్రివేణి మృతదేహాన్ని శుక్రవారం రాత్రి ఆమె బంధువులు ఇక్కుర్రు సమీపంలో గుర్తించారు. అప్పటి నుంచి ఏడు నెలల బాలుడు శరత్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు. శనివారం పోలీసు సిబ్బందితో పాటు బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం ఎన్ఎస్పీ కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, పోలీసు, ఎన్ఎస్పీ సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. రావిపాడు సమీపంలోని ఘటనా స్థలం నుంచి చిలకలూరిపేట వరకు బృందాలుగా విడిపోయి బోటులతో గాలింపు చేపట్టారు. దాదాపు 20 కిమీ వరకు గాలింపు నిర్వహించారు. ఘటనా జరిగిన రోజు కాలువ ఉధృతి ఎక్కువగా ఉంది. ఘటన జరిగిన రెండు గంటల్లో గాలించిగా రెండు కిలోమీటర్ల దూరంలో త్రివేణి మృతదేహం లభ్యమైంది. ఏడు నెలల బాలుడు కావడం, తక్కువ బరువు ఉండటంతో నీటి ఉధృతికి ఎక్కువ దూరం వెల్లిఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట శివారు వరకు పోలీసులు గాలింపు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. మరో వైపు క్లూస్ టీమ్ ఆదివారం ఘటనా స్థలంలో నమూనాలు సేకరించారు. -
క్రీడలతో క్రమశిక్షణతో కూడిన జీవితం
●ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు ●ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఫ్లోర్బాల్ పోటీలు నరసరావుపేట ఈస్ట్: క్రమశిక్షణతో కూడిన జీవనానికి క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల అంతర్ జిల్లాల ఫ్లోర్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ, విద్యార్థి దశలో క్రీడల పట్ల ఆసక్తి గలవారు క్రమశిక్షణతోపాటు శారీరక, మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, ఎంఏఎం కళాశాల చైర్మన్ ఎం.శేషగిరిరావు, పాఠశాల చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, డైరెక్టర్ నాగోతు సబిత, ప్రిన్సిపల్ రేఖా ఫూలేకర్, ఏపీ ఫ్లోర్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రత్నకుమార్, జాయింట్ సెక్రటరీ ఎం.కిషోర్బాబు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి సురేంద్ర, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాదు, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. పోటీలకు 15 జిల్లాల నుంచి దాదాపు 250 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ హాజరయ్యారు. మహిళా విభాగంలో పల్నాడు, నెల్లూరు జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ టైగా ముగియగా షూట్ అవుట్లో పల్నాడు జిల్లా జట్టు 2–1 తేడాతో నెల్లూరుపై విజయం సాధించింది. అలాగే పురుషుల విభాగంలో బాపట్ల జట్టుపై వైఎస్సార్ కడపజిల్లా జట్టు 1–0 తేడాతో గెలుపొందింది. -
ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి!
●80ఏళ్ల వృద్ధుడు మురుగు కాలువ బాగు చేసుకునే పరిస్థితి దారుణం ●గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: ఓ 80ఏళ్ల వృద్ధుడు ఇంటి ముందు మురుగు కాలువను బాగు చేసుకోవడం పురపాలక సంఘ పరిస్థితికి అద్దం పడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో భాగంగా ఆదివారం ఐదో వార్డు క్రిస్టియన్పాలెం, శివసంజీవయ్య కాలనీలో ఆయన పర్యటించారు. శివసంజీవయ్య కాలనీలో అల్లూరి బాలయ్య అనే ఓ వృద్ధుడు ఇంటిముందున్న కాలువలోకి దిగి బాగు చేసుకోవడాన్ని పరిశీలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మున్సిపాల్టీలో ఉందా? అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. పట్టణంలో 80ఏళ్ల వ్యక్తి కాలువలోకి దిగి శుభ్రం చేసుకునే పరిస్థితి రావటం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
104 ఉద్యోగుల సమస్యలు తక్షణమే తీర్చండి
నరసరావుపేట: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ప్రజా సంజీవనిగా పేరుతెచుకున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు వెంటనే తీర్చాలని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధ్యక్ష, కార్యదర్శులు కోటిరెడ్డి, బాలు, కోశాధికారి షేక్ జిలాని మాట్లాడుతూ తామంతా చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. గ్రాట్యువిటీ, ఎర్న్లీవ్ల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, ప్రస్తుత యాజమాన్యం కూడా ఇప్పటివరకు నియామక పత్రాలు, పే స్లీప్స్ కూడా ఇప్పటివరకు ఉద్యోగులకు అందచేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి జీతాలు రూ.18,500లకు పెంచాలని, అదేవిధంగా ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన డ్రైవర్లకు ఆటోమెటిక్ గా స్లాబ్ అమలు చేయాలని, ప్రతి డివిజన్కి ఒక బఫర్ సిబ్బందిని నియమించాలని, కార్మిక చట్ట ప్రకారం క్యాజువల్ లీవ్లు కోరారు. ప్రధాన కార్యదర్శి డి.బాలు, జిల్లాలోని 104 ఉద్యోగులు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంలో వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 12మంది ఉద్యోగులను సస్పెండ్ చేయటం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణ చినరామిరెడ్డి, కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సస్పెండ్కు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. ఈనెల 3వ తేదీన గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సందర్శించారనీ, ఆ సమయంలో ఆరోగ్య కేంద్రాన్ని తాళం వేసి ఉండటాన్ని గమనించి కేంద్రంలోని 12 మందిని సస్పెండ్ చేయటం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఆరోజున కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు సెలవుపై ఉన్నారనీ, మిగిలిన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధి నిర్వహణలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల వివరణ కోరకుండా సస్పెండ్ చేయటం బాధాకరమని తెలిపారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై పునరాలోచించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ షేక్.బాజీ, తాలూకా యూనిట్ నాయకులు ఎం.ఫ్లోరెన్స్, ఎస్.చలమారెడ్డి, ఆనంద్కుమార్ పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
●వివాహేతర సంబంధం నేపథ్యంలో బాజీ హత్య ●ఈనెల 24న ఎస్ఆర్కేటీ జంక్షన్ సమీపంలో ఘటన ●వివాహిత భర్త, తల్లులే నిందితులు ● కేసు వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ సుబ్బారావు నరసరావుపేట రూరల్: సంచలనం సృష్టించిన షేక్ పెద్దబాజి హత్యకేసులో ఇద్దరు నిందితులను నరసరావుపేట రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు కేసు వివరాలు వెల్లడించారు. టీ మాస్టర్గా పనిచేస్తున్న కొండలరావుపేటకు చెందిన పెద్ద బాజీకి వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సుబ్రహ్మణ్యచారి తన భార్యతో సంబంధాన్ని వదిలివేయాలని కోరాడు. బాజీ విన కుండా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతోపాటు వివాహితను తీసుకెళ్లి దాచాడు. దీంతో బాజీపై కక్ష పెంచుకున్న సుబ్రహ్మణ్యచారి అతడిని హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకు తన అత్త రాంబాయమ్మ సహకారం కోరగా ఆమె అంగీకరించింది. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో చిలకలూరిపేట రోడ్డు ఎస్ఆర్కేటి జంక్షన్ సమీపంలో టీ స్టాల్కు వెళుతున్న బాజీపై కత్తితో దాడిచేసి హత్యచేశారు. తీవ్రంగా గాయపడిన బాజీని ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యలు నిర్ధారించినట్టు సీఐ తెలిపాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను వల్లప్పచెరువు వద్ద అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూరల్ ఎస్ఐలు కిషోర్, ఫాతిమాలు రెండు టీమ్లుగా ఏర్పడి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు వివరించారు. ●త్రికోటేశ్వరస్వామికి మహా రుద్రాభిషేకం ● పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ●కనీస సౌకర్యాలు కల్పించిన అధికారులు ● క్యూలైన్లో పలుమార్లు తోపులాట ● తీవ్ర ఇబ్బందులు పడిన భక్తులు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాన్ని శనివా రం అర్ధరాత్రి నుంచి వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆరుద్రోత్సవంలో పాల్గొన్నారు. పాతకోటయ్య స్వామి ఆలయం వద్ద జ్యోతి వెలిగించి భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు. అనంతరం అర్ధరాత్రి 12గంటల నుంచి స్వామికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధం, కుంకుమ, తైలంతో నేత్రపర్వంగా అభిషేకాలు జరిపారు. చివరిగా అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామికి విశేష అలంకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తాళ్ల వెంకటరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్లు అన్నసంతర్పణకు సహకారం అందించారు. – ఆరుద్రోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జ్యోతి దర్శనం అనంతరం స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. చిన్నారులతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు భక్తులు ఆలయ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసిన ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. దీంతో క్యూలైన్లో భక్తుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. ఆలయంలోకి భక్తులు రాకుండా తాళాలు వేయడంతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ సైతం కొంతసేపు బయటనే వేచి ఉండాల్సి వచ్చింది. పవిత్రమైన ఆరుద్రోత్సవం రోజున ఆలయానికి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేస్తారు. గాలిగోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ ఏడాది అటువంటి ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు విమర్శలు వ్యక్తం చేశారు. -
కోటి ఆశల ఉద్యమం
అచ్చంపేట/పెదకూరపాడు: రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెదకూరపాడులో ఉద్యమంలా కొనసాగుతోంది. పేదలకు, పేద విద్యార్థులకు ఉపయుక్తంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కనీవీనీ ఎరుగని రీతిలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారు. వాటిలో 5 కళాశాలలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభింపచేశారు. మరో ఆరు కళాశాలలు వివిధ దశలలో ఉన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాగానే పారిశ్రామిక వేత్తలతో చేతులు కలిపి, కాలేజీ నిర్వహణ బాధ్యతను వారికి కట్టబెట్టాలన్న దురుద్దేశ్యంతో పీపీపీ విధానం అంటూ అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసే పన్నాగం పన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సీఎం చంద్రబాబు చేపట్టిన అనాలోచిత నిర్ణయంపై అట్టడుగు వర్గాలకు అవగాహన కల్సించడంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సఫలీకృతం అయ్యాయి. ప్రజా సంఘాలతో పాటు వివిధ పార్టీలు కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తప్పు బడుతున్నాయి. కలగానే వైద్య విద్య ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతుందని, తమ పిల్లలను డాక్టర్ చదివించుకోవాలన్న తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని పేద, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులు వైద్యవిద్యను చదవకూడదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం కార్పొరేట్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. నియోజకవర్గంలో 50వేలకు పైగా సంతకాలు.. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి, వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 50వేలకు పైగా సంతకాలు సేకరించారు. నియోజకవర్గంలోని అచ్చంపేట మండల కేంద్రంలో 5వేలమంది పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీని సైతం నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గంలో ముమ్మరంగా కోటి సంతకాల సేకరణ మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపుతో ఉప్పెనలా కదిలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం కోటి సంతకాల సమాచారంమండలం సేకరించిన సంతకాలు అచ్చంపేట 14,200 పెదకూరపాడు 9300 అమరావతి 9000 క్రోసూరు 10,600 బెల్లంకొండ 6900 -
ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు గుర్తింపు
●కారులో ఐదుగురు ఉన్నట్లు గుర్తింపు ●పోలీసుల అదుపులో ముగ్గురు..! నాదెండ్ల/యడ్లపాడు: 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లాంగ్ ట్రైలర్ లారీని వెంబడిస్తూ వచ్చిన కారు, కారులోని వ్యక్తులు లారీని ఓవర్టేక్ చేసి ఆపటంతో లారీ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమవైపుకు మళ్లించటంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వడ్లమూడి విజ్ఞాన్ లారా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిడుగురాళ్ల, వినుకొండ, తాళ్లూరు, విఠలాపురం తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృత్యువాతపడగా, మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. లారీని ఓవర్టేక్ చేసిన కారు రవాణాశాఖకు చెందిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేశాయి. దీంతో స్పందించిన పల్నాడు జిల్లా డీటీవో సంజీవ్కుమార్ హైవే కంట్రోల్ సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు తమ శాఖకు చెందింది కాదంటూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ అధికారిగా జిల్లా డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు, నాదెండ్ల ఎస్సై పుల్లారావు దర్యాప్తు చేపట్టారు. కారు ఎవరిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం... లారీని వెంబడించి ఓవర్టేక్ చేసిన కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టీఎస్08హెచ్వై3158 నంబరు గల కారు ఎవరిది, ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. కారు నరసరావుపేట పరిసర ప్రాంతాలకు చెందినదంటూ తేలినట్లు సమాచారం. సీసీ ఫుటేజీలు సోషల్ మీడియాలో రావటంతో అప్రమత్తమైన నిందితులు కారును రాష్ట్రం దాటించారని గుర్తించారు. లోకేషన్ ఆధారంగా కారు ఎక్కడుందనే విషయం తెలుసుకుని స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో ఐదుగురు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించి వారిలో నరసరావుపేటకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణాలు, కారుకు సంబంధించిన వివరాలు, అందులో ఉన్న వారు ఎవరనేది, లారీని ఎందుకు ఆపారనే వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
పల్నాడు
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.98 టీఎంసీలు. 7దాచేపల్లి: స్థానిక పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్, ఎస్ఐ పాపారావు పాల్గొన్నారు. నరసరావుపేట: ట్రాన్స్పోర్టు కంపెనీల ద్వారా అక్రమంగా రవాణా చేసిన పురుగుమందుల బాక్స్లను వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. -
సందడిగా మారిన సముద్ర తీరం
చీరాల టౌన్: మండలంలోని వాడరేవు సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో చీరాల, పర్చూరు, గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన పర్యాటకులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వాడరేవుకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. సముద్రపు అలలతో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ సముద్రపు మన్నుతో ఆటలాడుకుంటూ సరదాగా గడిపారు. పర్యాటక ప్రాంతాలైన వాడరేవు, రామాపురం, తదితర సముద్ర తీర ప్రాంతాలు పోలీసుల భద్రత పహారాలో ఉన్నాయి. తీరం మొత్తం పోలీసుల నిఘాలో ఉండటంతో పాటుగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా చేయడంతోపాటు సముద్రంలో లోపలికి వెళ్లకుండా గజ ఈతగాళ్ల్లతో పహారా, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
వైద్య కేంద్రం తరలింపుపై ప్రజాగ్రహం
చిలకలూరిపేట: గత మున్సిపల్ ఎన్నికలకు ముందు చిలకలూరిపేట పట్టణానికి మూడు కిలో మీటర్లలోపు ఉన్న గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాలకు సంబంధించి కొత్తగా 8 వార్డులు ఏర్పడ్డాయి. గణపవరం, పసుమర్రు గ్రామాలకు సంబంధించి విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ రెండు గ్రామాలకు సంబంధించి పన్ను వసూళ్లు, రికార్డుల నిర్వహణ ఆయా గ్రామ పంచాయితీలే నిర్వహించుకుంటున్నాయి. కానీ మానుకొండవారిపాలెం గ్రామానికి సంబంధించి ఎవరూ కోర్టును ఆశ్రయించలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించి పన్ను వసూళ్లు, అభివృద్ధి పనులు కూడా పురపాలక సంఘం వారే నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఎస్టీ కాలనీకి సంబంధించి పైపులైన్ ఏర్పాటు, గ్రామంలో రోడ్డు నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల నిర్వహణ వంటివి మున్సిపాలిటీ నిర్వహిస్తోంది. అక్కడ ఇప్పటికే కొనసాగుతూ ఉన్న, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ విషయంలో మాత్రం వివాదం ఏర్పడింది. అసలు కారణం ఇదే.. గ్రామంలోని పాత పంచాయతీ భవనంలో 2022లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. ఒక డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్, శానిటరీ వర్కర్ విధులు నిర్వహిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే ప్రస్తుతం గ్రామ సచివాలయం వద్ద స్థలం కేటాయించారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. విలీన గ్రామాలకు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం పెండింగులో ఉందని... పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో యూపీహెచ్సీ భవనం నిర్మిస్తామని నవంబరు 29న నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 16వ అంశంగా అజెండాలో పొందుపరిచారు. దీంతో సంబంధిత 11వ వార్డు కౌన్సిలర్ మానుకొండ మాధవి ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామం నుంచి ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని.. మున్సిపాలిటీలోనే కొనసాగుతామన్నారు. పన్నులు కూడా మున్సిపాలిటీ వారే వసూలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. వీటికి లేని అభ్యంతరం యూపీహెచ్సీ నిర్మాణానికి ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. దీనికి సంబంధించి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు యూపీహెచ్సీ తరలింపును వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్కు డిసెంట్ నోట్ అందించారు. తల్లీపిల్లల ఆసుపత్రి కోసం... యూపీహెచ్సీ భవన నిర్మాణ విషయంలో వివాదం ఇలా ఉండగా... పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆసుపత్రి సాధన అఖిలపక్ష కమిటీగా ఏర్పడ్డారు. ఆసుపత్రి సాధనకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా పలువురికి వినతి పత్రాలు పంపారు. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మిస్తారా? లేదా మానుకొండవారిపాలెంలో యూపీహెచ్సీ భవనం ఇక్కడికి తరలిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోనే యూపీహెచ్సీ భవనం నిర్మించి, పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబును వివరణ కోరగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం గ్రామంలో యూపీసీహెచ్ కొత్త భవన నిర్మాణానికి గతంలోనే నిధులు మంజూరు మున్సిపాలిటీలో విలీనమైనా తరలింపు యత్నాలపై వ్యతిరేకత మానుకొండవారిపాలెంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తరలింపు ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పురపాలక సంఘంలో విలీనమైన గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్ను తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భవనానికి మంజూరై ఉన్న స్థలంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు. -
మధ్యవర్తిగా వచ్చి మృత్యువాత
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు ● నరసరావుపేట మండలం కేఎం అగ్రహారంలో ఘటన ● మధ్యవర్తిగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న పర్వతాలు ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నరసరావుపేట రూరల్: స్వల్పవివాదం నేపథ్యంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కేఎం అగ్రహారంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి పక్కన వారితో ఏర్పడిన వివాదం పరిష్కారంలో మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తి దాడిలో మృత్యవాత పడ్డాడు. నరసరావుపేట రూరల్ పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు. నరసరావుపేట మండలం కేఎం అగ్రహరానికి చెందిన ఓర్సు ముసలయ్య, వేముల వెంకటేశ్వర్లు పక్కపక్క ఇంటిలో నివసిస్తున్నారు. స్థలం విషయంలో గతంలో ఇరువురి మధ్య వివాదం ఉంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలు మార్లు స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వేముల వెంకటేశ్వర్లు కుమారుడు అంకారావు ద్విచక్రవాహనంపై గడ్డి తీసుకొస్తుండగా రోడ్డుపై నిలిపి ఉంచిన ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానికి తగిలి బండి కింద పడింది. దీనిపై ముసలయ్య కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో అంకారావు రాడ్తో ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానంపై దాడిచేయడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. మధ్యవర్తిగా వచ్చి.. ఇంటి వద్ద ఆదివారం జరిగిన వివాదాన్ని దేచవరంలో ఉంటున్న తన సోదరుడు పర్వతాలుకు ముసలయ్య తెలియజేశాడు. గ్రామానికి వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. తన కుమారుడు హనుమంతరావుతో కలిసి పర్వతాలు అగ్రహారం వచ్చాడు. ముసలయ్య కుమారుడు కోటేశ్వరరావు, భార్య రమణలు, పర్వతాలు, హనుమంతరావులు నలుగురు రెండు ద్విచక్రవాహనాలపై వెంకటేశ్వర్లుకు చెందిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు అంకారావుతో వీరికి వాగ్వివాదం జరిగింది. వెంకటేశ్వర్లు, అంకారావులు గడ్డపార, కర్రలతో వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో పర్వతాలు అక్కడికక్కడే మృతిచెందాడు. కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. పర్వతాలు కుమారుడు హనుమంతురావుకు స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడి జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దాడికి ఉపయోగించిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్టీమ్ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు. -
అక్కడ తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి
పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి. దీనికి అనుబంధంగా బ్లడ్బ్యాంకు, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్ష కమిటీగా ఏర్పడి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాం. ఇప్పటికే సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశాం. ఇక్కడ యూపీహెచ్సీ బదులు తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి. – నాయుడు శివకుమార్, ఆసుపత్రి సాధన కమిటీ కార్యదర్శి -
బాబు కుట్రలపై సంతకాల ఉద్యమం
● వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు ● పేద, మధ్యతరగతి వారికి వైద్యం, వైద్య విద్య ఇంకా దూరం ● సర్కారు తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ● విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావుల మద్దతు ● జిల్లా వ్యాప్తంగా 3.77 లక్షలకుపైగా సంతకాల సేకరణ పూర్తి సాక్షి, నరసరావుపేట: పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వైద్య విద్య చదవాలని, పేదలతోపాటు మధ్య తరగతి వారికి వైద్య సేవలు మరింత చేరువ కావాలని వైఎస్సార్సీపీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చేది. అయితే వారి పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను చంద్రబాబునాయుడు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్యను అభ్యసించాలనుకునే నీట్ విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రయివేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. దీనిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఊరూరా రచ్చబండ నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో నష్టాలను వివరిస్తున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేఽత్తలు, ప్రజాసంఘాల వారు పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని నియోజకవర్గాలలో అనుకున్న లక్ష్యాలకు మించి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి సంతకాలు చేస్తుండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా మాచర్లలో 66 వేలు, గురజాల – 40 వేలు, సత్తెనపల్లి– 66 వేలు, పెదకూరపాడు– 49,600, నరసరావుపేట – 52 వేలు, చిలకలూరిపేట–52 వేలు, వినుకొండలో 52 వేల సంతకాలు సేకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 నూతన మెడికల్ కళాశాలలను ప్రవేశపెట్టారు. ఇందులో ఐదు వైద్య కళాశాలలు 2023–24లో ప్రారంభించి వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వరంగా మార్చారు. వైద్య విద్యతో పాటు నర్సింగ్ లాంటి అనుబంధ కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. చంద్రబాబు సర్కారు కొలువుదీరాక వైద్యరంగం నిర్వీర్యమైంది. పేద విద్యార్థుల డాక్టర్ కల చిదిమేసేలా నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారిపోతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభిస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్పరం చేయడం వల్ల జరిగే అనర్థాలను ఉదాహరణలతో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. గతంలో జరిగిన వాటితో పోల్చితే కోటి సంతకాల ఉద్యమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద కుటుంబాలు మద్దతు తెలుపుతున్నాయి. జిల్లాలోని వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఇప్పటికే 3.77 లక్షలకుపైగా సంతకాలు పూర్తి అయ్యాయి. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి జరిగిన అర్చనలు, విశేష పూజలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీరామనామక్షేత్రం ఆవరణలో 99వ శ్రీరామకోటి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ట్రస్టీస్ రాగం వెంకటలీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్రావు ఆధ్వర్యంలో జరగ్గా, సాయంత్రం క్రోసూరి మురళీకృష్ణమాచార్యుల బృందం అంకురారోపణం, అగ్నిస్థాపనం, రుత్విగ్వరణం, అఖండ జ్యోతిస్థాపన, శ్రీరామ పతాకావిష్కరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్ (సీతానగరం) కార్యదర్శి శ్రీమాన్ స్వామి వినిశ్చలానంద పతాకావిష్కరణ చేసి, అనుగ్రహభాషణం చేశారు. 99 ఏళ్లుగా శ్రీరామకోటి మహోత్సవాలను నిర్విరామంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వంశపారంపర్యంగా ఆ సీతారాముల అనుగ్రహంతో పలు ప్రాంతాల భక్తులు, దాతల సహకారంతో చేపట్టడం ఒక బృహత్తర యజ్ఞంగా పేర్కొన్నారు. కలియుగంలో తరించేందుకు రామనామ సంకీర్తనే సరైన మార్గమని చెప్పారు. క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలకరించారు. పట్నంబజారు: గుంటూరు డిపో 1 నుంచి హైకోర్టుకు వయా తుళ్లూరుకు నిత్యం ఉదయం 8.00గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరే జనరల్ బస్సు టైమ్ను 7.45 నిమిషాలకు మార్చినట్లు డిపో 1 అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 15 నిముషాల ముందుగా మార్చినట్లు వివరించారు. సోమవారం నుంచి మారిన బస్సు సమయం మార్పులను ప్రయాణికులు, ఉద్యోగులు గమనించాలని కోరారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 578.00 అడుగులకు చేరింది. ఇది 277.2460 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లో 20,167 క్యూసెక్కులు కాగా... శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 20,167 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,010 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 10.2 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కి నీటిని నిలిపివేశారు. బ్యాంక్ కెనాల్కు 196, తూర్పు కాలువకు 92 క్యూసెక్కులు వదిలారు. పశ్చిమ కాలువకు, నిజాంపట్నం కాలువకు నీటిని విడుదల చేయలేదు. కొమ్మూరు కాలువకు 1,703 క్యూసెక్కులు విడుదల చేశారు. -
బంగారు ఆభరణాల దుకాణ నిర్వాహకుడు ఆత్మహత్య
తెనాలి రూరల్: వ్యాపారలలో నష్టం రావడం, తాకట్టు పెట్టిన బంగారం వ్యాపారి మోసం చేయడంతో మనస్తాపానికి గురై బాంగారు ఆభరణాల దుకాణ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ రజకపేటకు చెందిన కడప వెంకట్రావు చేబ్రోలు మండలం వేజండ్లలో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అక్కడి ప్రజలు తాకట్టు పెట్టిన ఆభరణాలను తెనాలిలో శ్రీరామమూర్తి వద్ద తాకట్టు పెట్టాడు. వెంకట్రావు వద్ద గతంలో పని చేసిన వ్యక్తి మరో దుకాణాన్ని ప్రారంభించాడు. ఓ వైపు వ్యాపారంలో నష్టాలు రావడం, తెనాలిలో తాకట్టు పెట్టుకున్న శ్రీరామమూర్తి మోసం చేశాడని భావించిన వెంకట్రావు శనివారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ తెనాలి: మధుమేహ బాధితుల గాయాలు కేవలం వారి శరీర సమస్య మాత్రమే కాదనీ వారి రోజువారీ జీవనాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక సౌకర్యాలను ప్రభావితం చేసే సమస్యగా యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ చెప్పారు. మధుమేహ గాయాలు వేగవంతంగా మానేందుకు అవసరమైన పరిశోధన చేసి పీహెచ్డీ స్వీకరించిన డాక్టర్ శుభశ్రీ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చికిత్సను సులభతరం చేయడం, రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, సామాజిక బాధ్యతను తీర్చడమనే లక్ష్యంతో ఈ పరిశోధన అంశాన్ని తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనను విస్తరించి, కొత్త సాంకేతికతలు, రీజనరేటివ్ వైద్య పరిష్కారాలు, స్మార్ట్ డ్రెస్సింగ్ పద్ధతులను రూపొందించాలని భావిస్తున్నానన్నారు. తన తల్లిదండ్రులు, సోదరి కుటుంబం తనను ఎంతో ప్రోత్సహించాయని, భవిష్యత్లో తన లక్ష్యాలను గౌరవిస్తూ కెరీర్, శాస్త్ర పరిశోధన, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను గుర్తించగల జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని భావిస్తున్నట్టు వివరించారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
నరసరావుపేట రూరల్: హోంగార్డుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం శనివారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. కవాతు ప్రదర్శనను వీక్షించి, గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడటంలో హోంగార్డులు ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ పరమైన సమస్యలు ఉంటే నేరుగా కలవాలని తెలిపారు. జిల్లాలో హోంగార్డ్స్ బెనిఫిట్ ఫండ్ ఏర్పాటుచేసి తక్షణ సహాయం అందిస్తున్నట్టు వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురు హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అడిషనల్ ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, అడిషనల్ ఎస్పీ (క్రైం) లక్ష్మీపతి, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతురావు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, హోంగార్డు ఆర్ఐ ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ ఫొటోలు
లక్ష్మీపురం: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేక్ ఐడీతో ఫేస్బుక్లో పెట్టిన వ్యక్తిని సాంతకేతిక పరిజ్ఞానంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో శనివారం సీఐ వివరాలు వెల్లడించారు. జేకేసీ కళాశాల రోడ్డులో నివాసం ఉండే ఓ మహిళకు చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, కృష్ణంశెట్టి పల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి మధుసూదనరెడ్డిని శనివారం మధ్యాహ్నం అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో మధుసూదనరెడ్డి జేకేసీ కళాశాల రోడ్డులో నివాసం ఉండే బంధువు అయిన ఒక మహిళతో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడె, అయితే సుమారు మూడు నెలల క్రితం మధుసూదనరెడ్డి మహిళకు ఫోన్ చేసినప్పుడుల్లా కట్ చేయడం, సరిగా మాట్లాడక పోవడం.. తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే మహిళతో ఎక్కువ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్నదనే కోపంతో రగిలిపోయాడు. ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఫొటోలను ఫేస్ బుక్లో సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే వారి పేరుతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. సోషల్ మీడియాను మంచికి వాడాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పట్టాభిపురం ఎస్ఐ నరేంద్ర, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
సైనికుల త్యాగాలు స్మరణీయం
నరసరావుపేట: దేశ రక్షణలో సైనికుల త్యాగాలు స్మరణీయమని జిల్లా కలెక్టర్, జిల్లా సైనిక బోర్డు చైర్మన్ కృతికా శుక్లా తెలిపారు. ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఎన్సీసీ క్యాడెట్ల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సైనిక కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుందన్నారు. కలెక్టర్ విరాళం అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల పాల్గొన్నారు. సత్తెనపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పని చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆరాధ్యుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అయ్యారు. సత్తెనపల్లి మండలం పణిదంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఏసీఎస్ల ద్వారా కాకుండా, డీసీసీబీల ద్వారా రైతులకు నేరుగా రుణాలు ఇవ్వకూడదన్నారు. ఖాళీల భర్తీ, వేతనానికి సంబంధించిన సమస్యలు, పర్మినెంట్ చేయడం వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా పణిదం పీఏసీఎస్ చైర్మన్ యర్రగుంట్ల వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఉద్యోగులు తిరుమల, మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు
తెనాలి: రక్తం కనబడకుండా, ఆయుధం కనిపించకుండా, హింస లేకుండా ఏ తెలుగు సినిమా అయినా వుందా? ఎంత దుర్మార్గమిది...! ఎంత సాంస్కృతిక నేరస్తులు వీళ్లు, సినిమాలు తీసేవాళ్లు...వేషాలు వేసేవాళ్లు అని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. సినిమాల్లో ఒక్కోడు వందమందిని చంపటం, ఏ నేరారోపణ లేకుండా బయటకెలా వస్తారు... ఆలోచించాలని చెప్పారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
ఉత్సాహంగా ఎద్దుల బండ లాగుడు పోటీలు
గురజాల : పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్లను పురస్కరించుకుని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు సంఘం నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు శనివారం ఉత్సాహభరితంగా జరిగాయి. డీఎస్పీ జగదీష్ ప్రారంభించారు. జూనియర్ విభాగంలో ఆరు జతలు పోటీపడ్డాయి. హైదరాబాద్కు చెందిన మేకా ప్రతీక ఎద్దుల జత 2750 అడుగులు లాగి ప్రథమ బహుమతి, గుంటూరు జిల్లా లింగాయపాలేనికి యల్లం సాంబశివరావు ఎద్దుల జత 2000 అడుగులు లాగి ద్వితీయ బహుమతి, గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన నల్లమోతు వీర శంకరరావు ఎద్దుల జత 1934.10 అడుగులు లాగి మూడవ బహుమతిని గెలుచుకున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన యర్రసాని సుబ్బయ్య ఎద్దుల జత 1845.8 అడుగులు లాగి నాలుగో బహుమతిని, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎద్దుల జత 1766.10 అడుగులు లాగి ఐదో బహుమతి, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్ బాబు ఎద్దుల జత 1300 అడుగులు లాగి ఆరో బహుమతిని గెలుచుకున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పోటీల కమిటీ సభ్యులు నల్లా లక్ష్మయ్య, తన్నేటి బుచ్చిబాబు, నెల్లూరి మల్లయ్య, పోటు నాగేశ్వరరావు, విశ్వనాథం, నవులూరి శ్రీరామమూర్తి, చలవాది శ్రీనివాసరావు, షేక్ నాగులు షరీఫ్ పాల్గొన్నారు. డీఎస్పీ జగదీష్ను కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రారంభించిన డీఎస్పీ జగదీష్ -
‘సంతకమే’ సమర శంఖం
సత్తెనపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంతో వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేతృత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని పట్టణంతో పాటు అన్ని మండలాల్లో సంతకాల సేకరణ ఉప్పెనలా సాగుతోంది. పార్టీ శ్రేణులు గ్రామ, గ్రామాల్లో పర్యటి స్తుండగా ప్రజలు మమేకమవుతున్నారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్న వైనాన్ని నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రత్యేకించి యువత చైతన్యవంతులై సంతకాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఊరు వాడా ఊపందుకుంది. స్వచ్ఛందంగా సంతకాలు పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లిరూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి ఆధ్వర్యంలో బృందం సంతకాల సేకరణ చురుగ్గా చేస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 66 వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పేద, మధ్యత రగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమంలో సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారు. ఆవిరైపోతున్న ఆశలు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో తమ ఆశలు ఆవిరైపోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆవేదన, ప్రజల ఆశల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. ఆధ్వర్యంలో నిర్వహణ -
నేటి నుంచి అండర్–17 ఫుట్బాల్ టోర్నీ
నరసరావుపేట రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ అంతర జిల్లాల అండర్–17 బాలబాలికల పుట్బాల్ పోటీలకు సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియం, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలు సిద్ధమయ్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొననున్నాయి. బాలుర జట్లు డీఏస్ఏ స్టేడియంలో, బాలికల జట్లు ఈశ్వర్ మైదానంలో తలపడనున్నాయి. దాదాపు 520 మంది క్రీడాకారులు, 80మంది కోచ్లు పోటీలకు హజరుకానున్నారు. వీరికి వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈనెల 7వ తేదీ పోటీల ప్రారంభంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఈవో చంద్రకళ పాల్గొంటారని జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.సురేష్కుమార్, అడ్మిన్ సెక్రటరీ వి.పద్మావతి తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోల్డ్ చైన్ పరికరాలు, ఐఎల్ఆర్, డీప్ ఫ్రీజర్, వ్యాక్సిన్ క్యారియర్, ఐస్ ప్యాక్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టులదేనని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఫార్మాసిస్టులు లేని చోట స్టాఫ్ నర్సులను, ఎంపీహెచ్ఎస్ సిబ్బందికి కోల్డ్ చైన్ పరికరాలు పాడవకుండా నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారి అప్పజెప్పాలన్నారు. తప్పనిసరిగా వ్యాక్సిన్లు ఏవిధంగా నిల్వ ఉన్నాయి, వాటి కాలపరిమితి ఎప్పటి వరకు ఉంది తదితర విషయాలను ప్రతిరోజూ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెలలో జరుగనున్న పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కోల్డ్చైన్ సిస్టాన్ని పరిశీలించాలన్నారు. డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత మాట్లాడుతూ ప్రతి ఫార్మసీ అధికారి తమకు కేటాయించిన సమయాల్లో పీహెచ్సీ లేదా అర్బన్ పీహెచ్సీల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఫార్మసీని, స్టోర్స్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిదీ తప్పనిసరిగా రికార్డులో నమోదు చేయాలని తెలిపారు. -
పీహెచ్సీకి ‘విభేదాల’ రోగం
గత ప్రభుత్వ హయాంలో నలుగురు వైద్యులతో కళకళలాడిన అచ్చంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఇప్పుడు గతి తప్పింది. మూడు నెలలుగా జీతాలు లేక సిబ్బంది వీధికెక్కారు. వైద్యాధికారిపై సిబ్బంది అంతా డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేశారు. ఒక డాక్టర్ సస్పెండ్ కాగా, మరో డాక్టర్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట: ఇంటింటికి వైద్యం (ఫ్యామిలి ఫిజీషియన్ ప్రోగ్రామ్) విధులు నిర్వహించాల్సిన వైద్యాధికారి తరచూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్గా పిలువబడే ఆయుష్మాన్భవ భవనాలలో పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్ఎంఎస్) పనితీరును ప్రతి నెలా ఆన్లైన్ చేయవలసి ఉండగా వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఆన్లైన్కు నోచుకోలేదు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్లతో అచ్చంపేట పీహెచ్సీకి నూతన భవనం నిర్మించి నలుగురు వైద్యులను నియమించారు. ఆ నలుగురిలో ఇప్పుడు ఒకరు బదిలీకాగా, మరొకరు సస్పెండ్ అయ్యారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన ఒక్కరూ ఓపీ చూసుకోవడానే పరిమితమైతే ఎఫ్పీపీ (ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రామ్)కి మరొక డాక్టర్ అవసరం ఉంది. దీంతో మాదిపాడు వైద్యాధికారి డాక్టర్ రాంబాబు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అచ్చంపేటలో విధులు నిర్వహిస్తున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారి డ్రాయింగ్ పవర్ ఉన్న మరో వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాకుండా వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది డాక్టర్ స్రవంతిపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటింటికి వెళ్లి వైద్యం నిర్వహించే ఫ్యామిలి పిజీషియన్ ప్రోగ్రామ్కు డాక్టర్ స్రవంతి తరచూ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే హెల్త్ ప్రొవైడర్ స్థితిగతులను ప్రతినెల 25 నుంచి 30వ తేదీలోపు ఆన్లైన్లో నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపాల్సిన బాధ్యత వైద్యాధికారిపై ఉంది. ఇక్కడ ఆవిధంగా నమోదు కావడం లేదు. మూడు నెలలుగా జీతాలు లేక... స్థానిక పీహెచ్సీలో పనిచేసి 12 మంది రెగ్యులర్, 15 మంది క్రాంట్రాక్టు సిబ్బందికి సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలకు సంబంధించిన జీతాలు రాలేదు. తమపై అక్కసు వల్లనే డాక్టర్ స్రవంతి మూడు నెలలుగా జీతాలు వేయలేదంటూ వైద్య సిబ్బంది ఏకంగా గురువారం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి బి.రవికి ఫిర్యాదు చేశారు. నాపై వచ్చే ఆరోపణలలో వాస్తవం లేదు. ఆన్లైన్కు సంబంధించిన పాస్వర్డ్ను గతంలో పనిచేసిన ఉద్యోగి చెప్పకపోవడం, దాని కోసం కంప్యూటర్ సెక్షన్లో వెతకడం వల్ల ఫ్యామిలి ఫిజీషియన్ ప్రోగ్రామ్కు వెళ్లలేకపోయా. యూడీసీ లేకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు వేయడంలో జాప్యం జరిగింది. డీఎంఅండ్హెచ్వో ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీలోపు అందరికి జీతాలు వచ్చేలా పనిచేస్తా. – డాక్టర్ స్రవంతి, వైద్యాధికారి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి గాయాలు క్రోసూరు: మండలంలోని ఊటుకూరు శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ పి.రవిబాబు శనివారం తెలిపారు. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన గొర్రెపాటి చందు(18), గొర్రెపాటి బుల్లిబాబు ద్విచక్ర వాహనం పై అచ్చంపేట మండలం కస్తలలో వివాహానికి హాజరై తిరిగి వెళుతున్నారు. ఊటుకూరు శివారు మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో తీవ్రగాయాలపాలై చందు అక్కడిక్కడే మృతి చెందాడు. బుల్లిబాబుకు స్వల్ప గాయాలు కావడంతో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు చెప్పారు. -
భూ దాహానికి నిండు ప్రాణం బలి
కారెంపూడి: ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూమి తనది కాదనే చిచ్చు పెట్టడంతో మనస్తాపానికి గురై గుండెపోటుతో పేద రైతు బత్తుల ముసలయ్య (45)మృతి చెందిన ఘటన కారెంపూడిలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన బంధువులు శనివారం ఉదయం మృతదేహంతో భారీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రధాన గేటు ముందుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. చాలాసేపటి తర్వాత ముసలయ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు జోక్యం చేసుకున్నారు. భూమి జోలికి ఎవరూ రాకుండా చూస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారని వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సమయంలో వివాదంలో తలదూర్చిన రెవెన్యూ అధికారులు తమను రూ.3 లక్షలు డిమాండ్ చేసి తీవ్ర మనోవేదనకు గురి చేశారని ఆరోపించారు. దీనిపై కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా.. చాలా కాలంగా ముసలయ్య కుటుంబం పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులో ఎర్రగుంట సమీపంలో 1.02 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో ఆ భూమికి పట్టా కూడా ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆ భూమి తమదని అధికారుల అండతో ముసలయ్య గుండెల్లో మంట పెట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఆ వ్యక్తి మాట విని పదే పదే కార్యాలయానికి రావాలని కబురు చేస్తుండడంతో ముసలయ్య మనోవేదనకు గురయ్యాడు. రూ.3 లక్షలలిస్తే సమస్య లేకుండా చూస్తామని వేధించారని భార్య బంధువులు ఆరోపించారు. ఈ మనో వేదనతోనే ముసలయ్య ఆకస్మికంగా మృతి చెందాడని, ఇప్పుడు తమకు న్యాయం ఎవరు చేస్తారని.. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాగలరా? అంటూ వారు విలపించారు. ముసలయ్యకు భార్య అంజమ్మ దత్తత తీసుకుని పెంచుకున్న కుమార్తె ఉన్నారు. -
ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పసుపులేటి
చేబ్రోలు: ఏపీ రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా చేబ్రోలు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావును నియమిస్తూ ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. చేబ్రోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న పసుపులేటి శ్రీనివాసరావు గతంలో కాంగ్రెస్ పార్టీ మండల, నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆదేశాలు, సూచనల ప్రకారం అందరి సహకారంతో పనిచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కన్వీనర్గా నియమితులైన పసుపులేటిని పలువురు అభినందించారు. -
ఆయిల్ పామ్కు మార్కెట్లో డిమాండ్
సత్తెనపల్లి: ఆయిల్ పామ్కు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని శాస్తవేత్త సుభాష్ శ్రీ సంజయ్ తెలిపారు. ఏటా రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి విదేశాల నుంచి 150 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు, లక్కరాజు గార్లపాడు గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు శనివారం ఉద్యాన శాఖ, గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు పోను ఎకరాకు నికరంగా రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలు, యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. సత్తెనపల్లి ఉద్యాన అధికారి యన్. సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆయిల్ పామ్ మొక్కలు ఖరీదు పై 100 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. ప్రోత్సాహంలో భాగంగా అంతర పంటల సాగుకు హెక్టారుకి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 21 వేలు మించకుండా రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ నరేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీల గురించి వివరించారు. గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కంపెనీ ద్వారా ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాకాలపాడు పీఏసీఎస్ చైర్మన్ కొణికినేని సత్యనారాయణ, గోద్రెజ్ కంపెనీ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్లు జి.వి. రమణ, కె. నాని, ఐ.జగదీశ్ పాల్గొన్నారు. శాస్తవేత్త సుభాష్ శ్రీ సంజయ్ -
కోటప్పకొండలో ప్రారంభమైన ఆరుద్రోత్సవ పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి మాలధారులు కొండకు చేరుకొని ఇరుముళ్ళు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి ఆరుద్రోత్సవ అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. యడ్లపాడు: మండలంలోని నాలుగు పురాతన ఆలయాలు అభివృద్ధి కానున్నాయి. పల్నాడు జిల్లాలోని 17 ఆలయాలకు రాష్ట్ర దేవదాయ శాఖ రూ.12.45 కోట్లు తాజాగా మంజూరు చేసింది. దీనిలో మండలంలోని మూడు గ్రామాల్లోని నాలుగు ఆలయాలకు రూ.289.56 కోట్లు నిధులు కేటాయింపు జరిగింది. దింతెనపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.కోటి, దండేశ్వరస్వామి గుడికి రూ.83.33 లక్షలు, తిమ్మాపురం చంద్రమౌళేశ్వర స్వామి ఆలయానికి రూ.56.25లక్షలు, కొండవీడు శివాలయానికి రూ.50 లక్షలు నిధులు మంజూరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నిధులకు స్థానిక ప్రజలు 33శాతం సొమ్మును జోడించి ఆయా పనులు చేపట్టాలని తెలిపారు. నిధులకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మాచవరం: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నీరు కలుషితం కావడంతో స్థానిక అధికారులు శనివారం శానిటేషన్ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీవో విష్ణు చిరంజీవి తెలిపారు. నది ఎగువ ప్రాంతాన రసాయన వ్యర్థాలు కలవడంతో నీరు కలుషితమై దుర్వాసన రావడం, నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా మండలంలోని రేగులగడ్డ , వెల్లంపల్లి, వేమవరం, గోవిందాపురం గ్రామ సమీప ప్రాంతాల్లో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దుర్వాసన రావడం, నదిలో నీటిని పశువులు తాగడంతో రోగాల బారిన పడటం ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు నదిలో నీటిని వాడుకోవద్దని తెలియజేశారు. తాడికొండ/గుంటూరు మెడికల్: రాజధాని అమరావతిలోని ‘విట్’ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ విశ్వనాథన్ జన్మదినం సందర్భంగా శనివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. గుంటూరు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం శిబిరం ద్వారా విట్ విద్యార్థులు 449 యూనిట్ల రక్తాన్ని గుంటూరు జీజీహెచ్కు అందించినట్లు డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. -
భార్య, బిడ్డను కడతేర్చిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యతో పాటు ఏడు నెలల చిన్నారిని కాలువలోకి నెట్టి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్కు, నాదెండ్లకు చెందిన త్రివేణికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడు నెలల వయసుగల కుమారుడు శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్గా పనిచేస్తున్నాడు.త్రివేణి గతంలో నర్స్గా పనిచేసేది. వివాహం అనంతరం ఇంటికే పరిమితమైంది. శరత్కు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం వైద్యం కోసం దంపతులు నరసరావుపేట తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి, శరత్ను బంధువులు ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి, శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10.30గంటల సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎదురుగా వచి్చన కారు లైటింగ్కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి, శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య, బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, కాలవలో గల్లంతైన శరత్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? శ్రీకాంత్కు తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరూ ఘర్షణ పడినట్టు సమాచారం. కొత్తపల్లికి ద్విచ్రవాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడిచేయడంతో పాటు, ఏడు నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు. -
మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్
నరసరావుపేట టౌన్: సీఎం చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రులు నానాటికీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేదల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల కాకినాడ తుని ఏరియా ఆస్పత్రిలో యువకుడి కాలికి శస్త్రచికిత్స చేసి సర్జికల్ బ్లేడ్ శరీరం లోపలే వదిలేసిన ఘటన మరువకముందే... పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ను ఆమె శరీరంలోనే వదిలేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. నరసరావుపేట పట్టణంలోని బాలయ్యనగర్కు చెందిన రమాదేవికి ఈ నెల 26వ తేదీన ఏరియా ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి తీవ్రంగా నొప్పి వస్తోందని రమాదేవి మళ్లీ వైద్యులను సంప్రదించింది. వైద్యులు పరీక్షలు చేయకుండానే ఆపరేషన్ తర్వాత నొప్పి సహజమని చెప్పి పంపారు. అయితే, రమాదేవి నొప్పితో అల్లాడుతుండటంతో బంధువులు స్కానింగ్ చేయించారు. తొడ భాగంలో సర్జికల్ బ్లేడ్ ఉందని స్కానింగ్ రిపోర్టులో బయటపడింది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా, ఆపరేషన్ చేసి ఆ బ్లేడ్ తొలగించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ సమయంలో సర్జికల్ బ్లేడ్ శరీరంలో వదిలేశారని రమాదేవి బంధువులు శుక్రవారం ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆపరేషన్ చేసేందుకు వైద్యులు, సిబ్బంది రూ.2,500 లంచం కూడా తీసుకున్నారని రమాదేవి చెప్పారు. -
గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
నూజెండ్ల: ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటారని తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలింది. చిలకలూరిపేట సమీపంలో గణపవరం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతిచెందిన విషయం విదితమే. నూజెండ్ల మండలం ములకలూరు గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఇరువురి మృతదేహాలను గ్రామానికి తీసుకువచ్చారు. విగత జీవులుగా మారిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడు గొడవర్తి యశ్వంత్సాయి (20) గుంటూరులోని చలపతి ఇంజినీరింగ్ కాలేజీ, వంగవల్లు వాసు (22) విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు తోటి మిత్రులతో కలసి అయ్యప్పమాల ఽవేసుకున్నారు. శనివారం గ్రామంలో ఇరుముడి కార్యక్రమం ఉండటంతో స్నేహితులతో కలిసి కారులో బయలుదేరారు. కంటైనర్ను వేగంగా ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. సుబ్బరామయ్య, కుమారి దంపతుల రెండో కుమా రుడు యశ్వంత్సాయి. భార్యాభర్తలు ఇరువురూ ఉద్యోగస్తులే. సుబ్బరామయ్య సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్గాను, భార్య కుమారి నూజెండ్లలోని వైద్యశాలలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారు డు దూరమవటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. చేతికి అందివచ్చాడనుకున్న కొడుకు దూరమయ్యాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటాడిన మృత్యువు.. చలపతి కాలేజీలో చదువుతున్న యశ్వంత్సాయిని మృత్యువు వెంటాడింది. సాయి వినుకొండ రావడానికి గుంటూరు రైల్వేస్టేషన్కు వెళ్లాడు. అదే సమయంలో మిత్రులు ఫోన్ చేసి కారులో వెళ్తున్నాం, రావాలని కోరారు. మిత్రులతో కలసి వినుకొండ బయలుదేరాడు. మార్గంమధ్యలో జరిగిన ప్రమాదంలో సాయి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఒక్కడు... వెంకట్రావు, నాగరాజ దంపతుల ఏకై క సంతానం వంగవల్లు వాసు. వెంకట్రావుది వ్యవసా య నేపథ్యం కావడంతో కొడుకుని చక్కగా చదివించి మంచి ఉద్యోగస్తుడిగా చూడాలని కలలు కన్నారు. ఆ కలలు కల్లలుగా మారాయి. కొడుకు మృత్యు ఒడికి చేరడంతో ఆ తల్లిదండ్రులు పెట్టిన రోదనలు అక్కడ ఉన్న వారందరినీ కంటితడి పెట్టించాయి. కన్నీరు మున్నీరుగా.. పిడుగురాళ్ల: ఇంజినీరింగ్ చదువుతున్న కొడుకును చూసి మురిసిపోయిన తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం చిలకలూరిపేట సమీపంలో కారు లారీని ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన శివరాత్రి మహేష్ ఉన్నాడు. తండ్రి చిన్ని, తల్లి నాగమణిలకు మహేష్ రెండో కుమారుడు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకుంటున్నా డు. తండ్రి చిన్ని తాపీ వర్కర్గాను తల్లి నాగమణి మిషన్ కుడుతూ కుటుంబానికి పోషిస్తున్నారు. -
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించిన విషయం విదితమే. ఆ సమయంలో ఆసుపత్రికి తాళాలు వేసి ఉండటం గమనించి విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ కె పద్మావతి, పల్నాడు డీఎంహెచ్వో రవికి సమాచారమిచ్చారు.గురువారం డాక్టర్లు కవితా అనసూయ, ప్రసాద్నాయక్, ఎంపీహెచ్ఈవో శ్రీనివాసరెడ్డి, హెచ్ఈ అంజమ్మ, ఎస్ఎ హనుమంత్నాయక్, స్టాఫ్నర్సు లు అరుణ, విజయ, మస్తాన్బి, ఎల్టీ అరుణకుమారి, సూపర్వైజర్లు రహిమాన్బాషా, జానకీదేవి, ఎఫ్ఎన్వో పుట్లమ్మలను సస్పెండ్ చేశారు. వీరి స్థానంలో చిలకలూరిపేట ఏరి యా ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న షేక్ సుమయా, హరిహరన్తో పాటూ ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం వీరు పీహెచ్సీలో వైద్య సేవలందించారు. ఎన్జీ రంగా వ ర్సిటీలో ప్రపంచ మృత్తికా దినోత్సవం గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో ప్రపంచ మృత్తికా ది నోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ 5న నేల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవటానికి ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మృత్తికా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మృత్తికాశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.శైలజ ఈ ఏడాది ఆరోగ్య పట్టణాల కోసం ఆరోగ్యమైన నేలలు అనే అంశంపై అవగాహన కల్పించారు. పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఏవీ రమణ మాట్లాడుతూ నేల లోపల కోటాను కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, డాక్టర్ డి.సంతప్కుమార్, డీన్ డాక్టర్ పి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్కు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈఓ శీనునాయక్ తెలిపారు. డాక్టర్ భరత్కుమార్కు జాతీయస్థాయి గౌరవం పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్కు జాతీయ స్థాయి గౌరవ అవార్డు దక్కింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సర్బారీ దత్త ఈ అవార్డు ప్రకటించటం జరిగిందని తెలిపారు. భరత్కుమార్ చేసిన ఫీల్డ్ వర్క్, నాయకత్వ లక్షణాలకు ఈ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గౌరవ అవార్డు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మోడ్రన్ మెడికల్ సేవలు, సంఘ సేవలు, నాయకత్వంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన శాఖ అధ్యక్షులకు ప్రదానం చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భరత్కుమార్కు ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ అభినందనలతో కూడిన గౌరవ అవార్డు దక్కింది. భరత్కుమార్ను పలువురు అభింనందించారు. -
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల సెక్టార్ కట్టమూరు ఎస్సీ–2 అంగన్వాడీ కేంద్రంలో గత నెల 6న ఆయా నాగప్రసన్న వెనుక వైపు నుంచి వచ్చిన పాప సాంబార్ గిన్నెకు తగలగా సాంబార్ నేలపై దొర్లడంతో అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న పాప బేబీ తమ్మిడి హారిక పడటంతో బొబ్బలు వచ్చాయి. ఈ విషయాన్ని వెంటనే హారిక తల్లిదండ్రులు తమ్మిడి నాగలక్ష్మి, శ్రీనులకు తెలియపరచి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిని విచారణ జరిపారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందజేశారు. నియమ నిబంధనల మేరకు అంగన్వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి, అంగన్వాడీ సహాయకురాలు ఈ నాగప్రసన్న జాబ్ చార్ట్ ప్రకారం ఆహార, భద్రత, శుభ్రత నియమాలు పాటించలేదని విచారణలో రుజువు కావడంతో వారిరువురిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కట్టమూరు ఎస్సీ–2 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి, సహాయకురాలు ఈపూరి నాగప్రసన్నలను విధుల నుంచి తొలగిస్తూ సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ టి శ్రీలత జారీ చేసిన ఉత్తర్వులను సెక్టార్ సూపర్వైజర్ షేక్ ఆషా గురువారం కట్టమూరు ఎస్సీ–2 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఉత్తర్వులు అందజేయడంతో కార్యకర్త హైమావతి, ఆయా నాగప్రసన్నలు స్వీకరించలేదు. అంగన్వాడీ కేంద్రానికి, వారి గృహలకు ఉత్తర్వుల కాపీని అంటించారు. అంగన్వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి మనస్తాపానికి గురైంది. దీనికి తోడు గ్రామానికి చెందిన చుట్టుపక్కల మహిళలు హేళనగా మాట్లాడటంతో మరింత అవమానంగా భావించి ఆమె గురువారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమెను హుటాహుటీన సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉండటంతో వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ స్థానిక నేతల వేధింపులు అంగన్వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతిని తొలగించేందుకు స్థానిక టీడీపీ నేతలు కొంతకాలంగా పథకం ప్రకారం వేధిస్తున్నట్లు సమాచారం. పొరపాటున సాంబార్లో చిన్నారి హారిక పడిన విషయాన్ని గ్రామానికి చెందిన ఇరువురు టీడీపీ నాయకులు 1098 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. మెమో జారీ చేసి సంజాయిషీ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ పదేపదే ఆ నంబరుకు ఫోన్ చేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ టీడీపీ నాయకులు కోరడంతో తప్పని పరిస్థితుల్లో వారు ఇరువురిని తొలగించినట్లు తెలుస్తోంది. తమకు చెందిన వారిని నియమించుకునేందుకు టీడీపీ నేతలు ఈ వ్యవహారం నడిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జరిగిన ఘటన పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమిస్తామని చెప్పారు. -
11న స్థానిక సంస్థల్లో ఖాళీల భర్తీకి ఉప ఎన్నికలు
గుంటూరుఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ మండల పరిషత్లలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈనెల 11న ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మాచవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవితోపాటు, ఫిరంగిపురం మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్, రాజుపాలెం, వేమూరు మండల ప్రజా పరిషత్ కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా ఎన్నికల నిర్వహణకు అధికారులను నియమించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఫార్మకాలజీ జాతీయ సదస్సు పర్యావరణహితంగా పరిశోధనలు జరగాలి గుంటూరుమెడికల్:గుంటూరు మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. సదస్సు రెండు రోజులపాటు జరగ నుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సంయు క్తంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫార్మకాలజీ సొసైటీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మీనాకుమారి పాల్గొన్నారు. నెక్ట్స్జెన్ ఫార్మా అనే థీమ్తో రెండు రోజులపాటు జరగనున్న జాతీయ కాన్ఫరెన్స్లో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ఫార్మ కాలజీ ప్రొఫెసర్లు, అసోసియేట్–అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ గుంటూ రు మెడికల్ కాలేజీ వేదికగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించ డం ఆనందంగా ఉందన్నారు. దీర్ఘకాలిక రోగాలకై కొత్త ఔషధాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మరిన్ని పరిశోధనలు జరగాలనే అన్నారు. -
శివాపురం గ్రామంలో విషాదఛాయలు
వినుకొండ: మండలంలోని శివాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. గుంటూరు విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మేరుగ శ్రీకాంత్రెడ్డి (21) ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన వేరుగ సుబ్బారెడ్డి, కృష్ణకుమారి దంతులకు ఇరువురు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేయాలని కష్టపడి చదివిస్తున్నారు. మొదటి సంతానమైన శ్రీకాంత్రెడ్డి ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కుమారుడు భీమవరంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీకాంత్రెడ్డి మృతిని తట్టుకోలేక తల్లి కృష్ణకుమారి విలపిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. శ్రీకాంత్రెడ్డితో చదువుకునే సహచర విద్యార్థులు, యూనివర్సిటీ ఉపాధ్యాయులు కూడా గ్రామానికి వచ్చి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
అంగన్వాడీ కేంద్ర నిర్వాహకుల తప్పులేదు
కట్టమూరు ఎస్సీ–2 అంగన్వాడీ కేంద్రంలో సాంబార్లో తమ కుమార్తె హారిక పడటంలో అంగన్వాడీ కేంద్ర నిర్వాహకుల తప్పేమీ లేదు. ఆడుకుంటూ తమ కుమార్తె పొరపాటున పడింది. వెంటనే వైద్య సేవలు అందించడంతో పూర్తిగా నయమైంది. 20 రోజులుగా యథావిధిగా తిరిగి తమ కుమార్తె హారిక అంగన్వాడీ కేంద్రానికి వెళుతుంది. అంగన్వాడీ కార్యకర్త, ఆయా పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఈ ఉద్దేశంతో అంగన్వాడీ కార్యకర్త హైమావతి, అంగన్వాడీ సహాయకురాలు నాగ ప్రసన్నను తొలగించడం సరైనది కాదు. తమ్మిడి హారిక తల్లి నాగలక్ష్మి -
నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం
నరసరావుపేట రూరల్: శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఆరుద్రోత్సవానికి ముస్తాబైంది. శనివారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల తరువాత ఆలయంలో నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం ఆరుద్రోత్సవం. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆరుద్రోత్సవంలో పాల్గొంటారు. దీంతోపాటు కోటయ్య మాలధారులు కొండకు చేరుకుని మాలవిరమణ చేపడతారు. ఇందు కోసం ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శనివారం అర్ధరాత్రి నుంచి స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మహారుద్రాభిషేకం ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని త్రికోటేశ్వరస్వామి వారికి మహారుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించనున్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, విబూది, గంధం, కుంకుమ, తైలం, అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేయనున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభయ్యే అభిషేకాలు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఆలయ యాగశాలలో ఆదివారం ఉదయం 8గంటలకు గణపతి హోమం, రుద్రహోమం, శాంతి హోమం, వాస్తు హోమం, పుర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. మాలధారులకు ప్రత్యేక ఏర్పాట్లు కోటయ్య మాల దీక్ష చేపట్టిన భక్తులు ఆరుద్రోత్సవం రోజున కోటప్పకొండకు చేరుకుంటారు. నరసరావుపేటతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మాలధారులు కొండకు వస్తారు. లింగంగుంట్ల కాలనీ శివాలయం నుంచి భక్త బృందం కాలినడకన కొండకు చేరుకుని ఇరుముడులు స్వామి వారికి సమర్పించి మాల విరమణ చేస్తారు. మాలధారుల కోసం ఆలయం వెనుక ఉన్న అభిషేక మండపంలో ఏర్పాట్లు చేశారు. మాలధారులకు జ్యోతిదర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం ఆరుద్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలుగా స్వామి వారి భక్తుల సహకారంతో అన్నప్రసాదాల పంపిణీ నిర్వహిస్తున్నారు. నరసరావుపేటకు చెందిన తాళ్ల వెంకట కోటిరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్లు ప్రతి ఏడాది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా వీరు భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు. -
8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 కార్యక్రమానికి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిలువనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు పేర్కొన్నారు. గుంటూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు నోడల్ సెంటర్లలో కిట్స్ కళాశాల ఒకటిగా ఉందని వివరించారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా కిట్స్ కళాశాలకు 21 రాష్ట్రాల నుంచి విద్యార్థి బృందాలు రానున్నాయని చెప్పారు. 8వ తేదీ ఉదయం 8 నుంచి 9వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామంగా హ్యాకథాన్ జరగనుందన్నారు. అత్యుత్తమమైన ఒక్కో గ్రూప్నకు రూ.1.50 లక్షల నగదు బహుమతిని కేంద్రం అందజేస్తుందని చెప్పారు. సమావేశంలో కిట్స్ కళాశాల కార్యదర్శి కోయి శేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాబు, హ్యాకథాన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ అరుణ పాల్గొన్నారు. -
మిస్టరీగా మారిన ఘోర రోడ్డు ప్రమాదం
నాదెండ్ల/యడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన రాత్రి పూట హైవేపై బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒకరు వాహనాల తనిఖీ చేపట్టారని, తనిఖీల్లో భాగంగా భారీ ట్రైలర్ లారీని, దానితో పాటు మరో వాహనాన్ని బైపాస్ రోడ్డుపై వెంబడించి ఓవర్ టేక్ చేశారని వాటిని పక్కకు తీసుకురావాలని ఆదేశించడంతో ట్రైలర్ ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పారని, అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న కారులోని విద్యార్థులు గమనించి ట్రైలర్ను తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వేగంలో ఉన్న కారు అప్పటికే ట్రైలర్ వెనుక ఢీకొని టాప్ మొత్తం ముక్కలై హైవేపై చెల్లాచెదురుగా పడ్డాయి. కారు మొత్తం పూర్తిగా లారీ కిందకు దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి జారుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రచారం అవాస్తవం –ఆర్టీఏ అధికారుల స్పష్టీకరణ చిలకలూరిపేట బైపాస్లో శుక్రవారం సాయంత్రం ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పల్నాడు జిల్లా రవాణా శాఖ (ఆర్.టి.ఏ) అధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి జిల్లా రవాణా అధికారి (డి.టి.ఓ) జి. సంజయ్ కుమార్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన వెలువరించారు. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదిగా ఆయన ఖండించారు. హైవే కంట్రోల్ సెంటర్ కెమెరా ఫుటేజీలను పరిశీలించామని, ప్రమాద స్థలంలో ఉన్న టీఎస్ 08 హెచ్ వై 3158 నంబరు గల వాహనం తమ శాఖలో ఏ అధికారి ఉపయోగించడం లేదని పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. వాహనం నుంచి దిగిన వ్యక్తులు కూడా ఆర్టీఏ ఉద్యోగులు కారని తెలియజేస్తూ, అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. అయితే నిలుపుదల చేసిన ఆ కారు ఎక్కడిది, ఎవరిదీ, అందులో ఉన్న వారు అధికారులా లేక నకిలీలా అన్న భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
మెగా పీటీఎం అట్టర్ ఫ్లాప్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చంద్రబాబు ప్రభుత్వం శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎం 3.0 అట్టర్ ప్లాపైంది. బాబు ప్రచారం కోసమే నిర్వహించినట్లు ఉందని విద్యావేత్తలు పెదవివిరిచారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల పురోగతి వంటి అంశాలు మచ్చుకై నా కనిపించలేదన్నారు. టీడీపీ ప్రచారం కోసమే ఈ సమావేశాలను పావుగా వాడుకున్నారన్న విమర్శ వచ్చింది. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంతో ఏదో నిర్వహించమనే ధోరణిలో అధికారులు, ఉపాధ్యాయులు చేతులు దులుపుకున్నారు. ఇదిగో ఇలా.. సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా 1,568 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటం మినహా ఇంకేమీ కనిపించని పరిస్థితి. ఈ సమావేశం ఉద్దేశాన్ని పూర్తిగా నీరు గార్చేశారు. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిందేమీ లేదు. అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం జమ కాకపోవడంతో .. ఇవన్నీ తల్లిదండ్రులు ప్రశ్నిస్తారోనని ఏమార్చేందుకు ప్రచార స్టంట్ కోసం మెగా పీటీఎం 3.0 ను నిర్వహించారనే విమర్శలు గుప్పుమన్నాయి. మొక్కుబడి పోటీలు తప్ప .. సాగని చర్చలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటల పోటీలు, నృత్యాలు, కరాటే వంటివి చేయించారు. విద్యార్థులు విద్యలో ఎలా రాణిస్తున్నారు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు, వారి అభ్యున్నతికి చేపట్టే చర్యలు ఏమిటి, పాఠశాల, కళాశాల అభివృద్ధికి చేయాల్సిన పనులేమిటి ఇలా పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ దిశగా చర్చలు జరగని పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగాలు చేసి వెళ్లి పోయారు. దాదాపు 90 శాతం పైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను సైతం కొన్ని పాఠశాలల్లో ఇవ్వని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు అధికంగా గైర్హాజరు... జిల్లాలోని 1,568 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే 1,554 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే నిర్వహించగా, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వీటి జాడే కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,40,761 విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,821 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో స్వల్ప సంఖ్యలోనే తల్లిదండ్రులు హాజరయ్యారు. -
ఉత్తమ వైద్య సేవలతో ప్రజాభిమానాన్ని పొందాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించి అభిమానాన్ని పొందాలని గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట యడవల్లి వారి వీధిలో కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ను డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి.వెంకటరమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి వల్ల సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఆధునిక చికిత్సలతో వారి కలలు నెరవేర్చుకోవచ్చని తెలిపారు. చికిత్స కోసం వచ్చే ప్రతి జంటకు శాసీ్త్రయ పరిష్కారాలతో ఆధునిక చికిత్సలతో భరోసా కల్పించాలన్నారు. తల్లిదండ్రులు కావాలనుకునే ప్రతి జంటకు కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ భరోసా ఇచ్చేలా చికిత్సలు అందించాలని కోరారు. జిల్లాలో తొలి ఎంసీహెచ్ సూపర్ స్పెషలిస్టులతో తమ కేంద్రంలో సంతానం లేని వారికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కిమ్స్ యాజమాన్యం తెలిపింది. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారని, ప్రపంచ స్థాయి ఐవీఎఫ్ లేబరేటరీ, పరికరాలు ఉన్నాయన్నారు. ఐవీఎఫ్, ఇక్సి, ఐయూఐ, డోనర్, ప్రొగ్రామ్స్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, యండ్రాలజీ సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. కిమ్స్ శిఖర హాస్పటల్, కిమ్స్ సన్షైన్ హాస్పటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్, కిమ్స్ శిఖర హాస్పటల్ యూనిట్ హెడ్ డాక్టర్ ఎన్.వి.హరికుమార్, సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, రీప్రొడెక్టీవ్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నాగప్రత్యూష, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష గురిజాల, ఎంబ్రియాలజిస్ట్ ఎల్.ఎం.ఉదయ్, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ నసీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. ఆలయ అభివృద్ధికి విరాళం దుగ్గిరాల:కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారి దంపతులు రూ.1,02,555 విరాళం అందించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 578.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,668 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలి
సత్తెనపల్లి: న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకురావాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ తీర్మానం మేరకు శుక్రవారం నాలుగు న్యాయస్థానాల్లో విధులను బహిష్కరించి న్యాయవాదులు నినాదాలు చేస్తూ పట్టణంలోని కోర్టు ఆవరణలో గల న్యాయదేవత విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తీసుకురావాలన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిన్నం మణిబాబు, కార్యదర్శులు షేక్ జానీ ఖాజావలి, బయ్యవరపు నరసింహారావు, న్యాయవాదులు సయ్యద్ అబ్దుల్ రహీం, దివ్వెల శ్రీనివాసరావు, నీలగిరి కోటయ్య, కేఎన్వీ హరిబాబు, బొక్కా సంగీతరావు, రాజారపు నరసింహారావు, గంపా మదన్, మేదర అనిల్, ఉడుముల విద్యాసాగర్రెడ్డి, ఉల్లం మధు, జూపల్లి శేషయ్య, కోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారార్భాటం మీ కోసమే!
తూతూ మంత్రంగా ‘రైతన్నా..మీ కోసం’ కార్యక్రమం● చంద్రబాబు సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సిద్ధమైన అన్నదాతలు ● నూజెండ్ల మండలం తలార్లపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును నిలదీసిన రైతులు ● ఏ పంటకు గిట్టుబాటు ధర లేదంటూ ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలు ● మిగిలిన గ్రామాలలోనూ నిలదీస్తారన్న భయంతో తూతూ మంత్రంగా ముగించేసిన వైనం ● ఒక్క రైతు సమస్య తీర్చని ప్రభుత్వం సాక్షి, నరసరావుపేట: అరకొర దిగుబడులు... పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..దీంతో రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకాలను ప్రచారం చేయడం, రైతుల ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ‘రైతన్నా..మీ కోసం’ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 29న నూజెండ్ల మండలం తలార్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును రైతులు నిలదీసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సొంతపార్టీకి చెందిన రైతులే ఇలా మాట్లాడటం గమనించిన ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వెళ్లాలంటే ఆలోచనలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా తూతూమంత్రంగా సచివాలయ ఉద్యోగులతో కార్యక్రమాన్ని ముగించారు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు రైతుల వద్దకు వెళ్లి ప్లెక్సీ లు పెట్టి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగారు. రైతన్నా మీ కోసం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకోవడం విస్మయం కలిగిస్తోందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యలు తీర్చకపోగా కనీ సం బాధలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కర్షకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు. ప్రస్తు తం అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య 2.41 లక్షలుగా ఉంది. ఏకంగా 40వేల మంది లబ్ధిదారు ల సంఖ్య తగ్గిపోయింది. అన్నదాత సుఖీభవ పథ కం ద్వారా రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్న చంద్రబాబు గెలిచాక గతేడాది పథకం అమలు చేయలేదు. కౌలు రైతులకు సుఖీభవ అందజేస్తా మని హామీ ఇచ్చి అమలు చేయకుండా సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులను మోసం చేశారు. ఏడాదిన్నారగా వ్యవసాయం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిర్చి, పత్తి, పొగాకు, కంది పంటల రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెటింగ్ సౌక ర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. రైతులు రోడ్డెక్కి విత్తనాలు, ఎరువులు కావాలని అడిగే దుస్థితి ఏర్పడింది. బస్తా యూరియా కోసం కుస్తీ లు పడాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఎరువులు సరఫరా చేసి మిగిలిన వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించారు. అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలను ప్రకృతి ప్రకోపాలకు గురై తీవ్రంగా నష్టపోయారు. వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలులో ఉండేది. నష్టపోయిన రైతుకు అదే సీజన్లో నష్టపరిహారం అందేంది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో ప్రస్తుతం అందరికి పరిహారం అందడం లేదు. మరోవైపు పండించిన పంటలను అమ్ముకోవడంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మిర్చి, పత్తి, పొగాకు రైతుల బాధలు వర్ణనాతీతం. సీసీఐ నిబంధనలతో పత్తి పంటను అమ్ముకోలేక రైతులు తమ పొలాలను దున్నేస్తున్న ఘటనలు చూస్తున్నాం. వరి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. -
మెగా..పెద్ద దగా
● నేడు మెగా పేరెంట్స్–టీచర్స్ 3.0 మీటింగ్ ● చంద్రబాబు ప్రభుత్వం మరో ప్రహసనం ● సమస్యల పరిష్కారానికి చర్యలు శూన్యం ● తాగునీటి కోసం విద్యార్థుల అవస్థలు ● మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బాలికల కష్టాలు ● ఇవేమీ పట్టని ప్రభుత్వంఈ చినిగిన బ్యాగ్ చూడండి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని హ్యాండిల్స్ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. దానికి భిన్నంగా బ్యాగ్లు నాసి రకంగా ఉన్నాయి. కొద్ది రోజులకే చినిగిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షలు లేవు. నిబంధనలు ఉండవు. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల ఆదాయం, 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, భూములు, కార్లు, చిరుద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, తదితర వారికి తల్లికి వందనం లేదని తేల్చి చెప్పేశారు. సత్తెనపల్లి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితులు తెలుసుకునేందుకు పై ఉదాహరణలు చాలు. చంద్రబాబు ప్రభుత్వం అటు పాఠశాలలు, ఇటు విద్యార్థులను మోసం చేసింది. ఇప్పుడు గొప్పల కోసం మెగా పేరెంట్స్, టీచర్స్ 3.0 మీటింగ్ అంటూ హడావుడి చేస్తోంది. దీనికే సమయం అంతా కేటాయించడంతో 10 రోజులుగా పాఠాలు చెప్పేవారు కరువై మెగా కాస్త దగాగా మారిందని పలువురు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారలేదు. ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులతో పోటీపడేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టి ప్రచార ఆర్భాటానికి తెర తీయడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. డిసెంబర్ నెల ప్రారంభమైనప్పటికీ సిలబస్ పూర్తి కాలేదు. 100 రోజులుగా మెగా పీటీఎం 3.0 పనులే సరిపోయాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పరిష్కారం కాని సమస్యలు... ● పాఠశాలల్లో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● మరుగుదొడ్లు సమస్య పలు పాఠశాలలను వేధిస్తోంది. ఉన్న మరుగుదొడ్లు సరిపోక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ● ముఖ్యంగా వర్షాలకు నీరు నిలిచి పాఠశాలలోకి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి 31వ వార్డులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మోంథా తుఫాన్కు వర్షం నీరు నిలిచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. ● పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయక తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఉన్నా ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారాయి. ● పాఠశాలల్లో అనేక రకాల సమస్యలు ఉన్నా, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చిన వైఎస్ జగన్ నాడు–నేడు కింద గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చింది. ఈ ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదు. పాలకుల నిర్లక్ష్యంతో నాడు–నేడు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లా పరిధిలో రూ. 165 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నాడు–నేడు మొదటి దశలో 746 పాఠశాలల్లో పనులు చేపట్టాల్సి ఉంది. 88 పాఠశాలలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. రెండో దశలో 629 పాఠశాలలకు గాను కేవలం 33 పాఠశాలల్లోనే పనులు పూర్తి చేశారు. 233 పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభించని దుస్థితి. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పొన్నూరు: పట్టణంలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి వార్లను గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, సతీసమేతంగా సందర్శించారు. 9గుంటూరు ఎడ్యుకేషన్: జనవరిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను డాక్టర్ గజల్ శ్రీనివాస్ కోరారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. -
కంటైనర్ను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే ఐదుగురు దుర్మరణం
పల్నాడు, సాక్షి : పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ను వెనుక నుంచి మారుతి షిప్ట్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదు మంది మృతి చెందారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
గురువుల జేబుకు చిల్లు!
సత్తెనపల్లి: ఈ నెల 5న ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్– టీచర్స్ డే (పీటీఎం) 3.0 కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండగా, అరకొర నిధుల కేటాయింపుపై గురువులు పెదవి విరుస్తున్నారు. దీని నిర్వహణకు పరిమితంగా నిధులు కేటాయించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని ప్రభుత్వం చెబుతోంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న దీని వెనుక టీడీపీ ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ. 900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా మార్కెట్లో ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయి చాచమని పరోక్షంగా చంద్రబాబు సర్కార్ సూచిస్తోందని, గురువుల జేబులకు చిల్లు పడటం ఖాయమంటూ పలువురు మండిపడుతున్నారు. డబ్బులు లేకుండా పండుగ ఎలా? ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎం 3.0 ను పండుగలా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి స్కూలు ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్న ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని గురువులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం 3.0 నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి... జిల్లాలో 1,568 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,40,761 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తొమ్మిది ఉన్నాయి. వీటిల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 992 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 829 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం 3.0 నిర్వహణకు జిల్లాకు రూ.38,99,250 నగదును విడుదల చేస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఎంత కేటాయిస్తారో చెప్పలేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం పండుగలా చేయాలంటే ఈ నిధులు చాలవని ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. మెగా పీటీఎం 3.0 సమావేశ నిర్వహణకు నిధులు పెంచాలి. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలి. ఈ సమావేశ ఫొటోలు, వీడియోలు యాప్లలో అప్లోడ్ లేకుండా చేసినట్లు అయితే సమావేశం ఉద్దేశం నెరవేరుతుంది. – మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాఠశాల బోధన సమయం చాలా వృథా అవుతోంది. మెగా పీటీఎం సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి ఈవెంట్ని లీప్ యాప్లో అప్లోడ్ చేయటం ప్రధానోపాధ్యాయులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. –బంకా వాసుబాబు, పీఆర్టీయూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి -
పల్నాడు
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చైర్పర్సన్ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 579.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,445 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.దాచేపల్లి: కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ విషయాన్ని పల్నాడులోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరిని అడిగినా చెబుతారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. కాసు కుటుంబ చరిత్ర తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కాసు కుటుంబంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. కాసు కుటుంబ చరిత్ర, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి పలు దిన పత్రికలలో రాసిన కథనాలను ఆయన చదివి వినిపించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు తాను, ఎమ్మెల్యే కూడా పుట్టి ఉండమని చెప్పారు. పుస్తకాలు, వ్యాసాలు చదివితే చరిత్ర తెలుస్తుందన్నారు. రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి అని, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయ్యేందుకు భగీరథ ప్రయత్నం చేశారని తెలిపారు. సీఎంగా ఉండగానే సాగర్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించారని గుర్తుచేశారు. ఆ రోజుల్లోనే రూ.10 కోట్ల హడ్కో రుణాలు ఎల్ఐసీ ద్వారా పొంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీనవర్గాల వారికి ఇళ్లు కట్టించిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని వివరించారు. 1970లో 70 బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఎవరో రాసిచ్చింది చదివితే అది చరిత్ర కాదన్నారు. వరికపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అన్ని రకాల అనుమతులు తమ ప్రభుత్వంలో తెచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించామని గుర్తుచేశారు. గతంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పదవిలో ఉన్నా ఎందుకు అనుమతులు తీసుకురాలేదని ప్రశ్నించారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్, టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుతో జెడ్పీటీసీలు ఏళ్ల తరబడి పనులు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి జెడ్పీతోపాటు కేంద్ర నిధుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండాల ఆమోదానికి పరిమితమవుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధ్యాన్యత ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. గతంలో సర్వసభ్య సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన జెడ్పీటీసీలు గత నెల 26న ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. కీలకమైన ప్రణాళిక, ఆర్థిక అంశాలతో కూడిన సమావేశాల అజెండాలను తిరస్కరించడం ద్వారా జెడ్పీలో ఏకపక్ష వైఖరిపై యుద్ధం ప్రకటించారు. ప్రచ్ఛన్న యుద్ధం జెడ్పీలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాకు, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీగా గెలిచాక చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించి, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన హెనీ క్రిస్టినా వైఖరితో జెడ్పీటీసీలు తీవ్రంగా విభేదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ మండలాల్లో పనులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును సహించలేక పోరుకు సిద్ధమయ్యారు. ఎవరితోనూ పనిలేకుండానే... జెడ్పీ వార్షిక బడ్జెట్లో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు 2025–26 బడ్జెట్లోనే కేటాయింపులు పూర్తయ్యాయి. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సైతం పనులు కేటాయించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్పర్సన్కు సిఫార్సులు పంపడం, వాటిని చైర్పర్సన్ వెంటనే ఆమోదించేయడం పరిపాటిగా మారింది. జెడ్పీటీసీలతో చర్చించకుండా నేరుగా స్టాండింగ్ కమిటీ, అక్కడి నుంచి జనరల్ బాడీ సమావేశాల అజెండాల్లో పొందుపర్చి ఆమోదింపచేసుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై సభ్యులతో చర్చించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి భిన్నంగా కోరం అయిందా, లేదా అని చూసి ఆమోదించేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో.. జెడ్పీటీసీలకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో చైర్పర్సన్ పెద్ద సంఖ్యలో కేటాయింపులు జరిపేశారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... వేమూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో రూ.29.30 లక్షలు, నరసరావుపేట ఎమ్మెల్యే సిఫార్సులతో రూ.20 లక్షలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలతో రూ.30 లక్షలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాదనలతో అత్యధికంగా రూ.కోటి పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల మేరకు ముందస్తు అనుమతులతో పనులు కేటాయించడంతో భగ్గుమన్న జెడ్పీటీసీలు వాటిని అడ్డుకున్నారు. 7ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం కావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జెడ్పీని వాడుకుంటున్న పాలకుల తీరుతో జిల్లా ప్రజా పరిషత్ పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి. -
వేస్ట్ రాళ్లకు కూడా మైనింగ్ సెస్సు చెల్లించాలా!
చిలకలూరిపేట టౌన్: ఏఎంఆర్ మైనింగ్ సంస్థకు సంబంధించి మండల పరిధిలో మరోమారు వివాదం జరిగింది. ఆలయానికి వేస్ట్ రాతిని తరలిస్తున్న వాహనాల్ని ఏఎంఆర్ సిబ్బంది అడ్డుకోవడంతో సమస్య నిరసన తెలిపే వరకు వెళ్లింది. వివరాలల్లోకి వెళితే..పురుషోత్తమప ట్నం గ్రామంలో షిరిడీ సాయిబాబా ఆలయం ట్రస్ట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, కమిటీ సభ్యుల నేతృత్వంలో దత్రాత్రేయ స్వామి ఆలయంలో 158 అడుగుల ఏకశిలా స్తూపం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల శంకుస్థాపన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో లోతైన గుంతల్లో వేసేందుకు రాళ్లు అవసరం కావడంతో బుధవారం మద్దిరాల లోని గ్రానైట్ మిల్లుల వద్ద వేస్ట్గా పడేసిన రాళ్లను రెండు వాహనాల్లో తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలో మద్దిరాలలోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద సదరు సంస్థ సిబ్బంది చలానా చెల్లించాలంటూ వాహనాన్ని నిలుపుదల చేశారు. ఇది రోడ్ల వెంట వేస్ట్గా పడేసిన రాళ్లని, ఆలయ పనులకు స్థానికులను అడిగి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. సిబ్బంది వినతి మేరకు సంస్థ అధికారులతో వారు ఫోన్లో మాట్లాడగా మాలధారుల్ని దురుసుగా, హేళనగా సమాధానం ఇచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహించారు. భక్తులు, ఏఎంఆర్ అధికారులతో వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పురుషోత్తమపట్నానికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు, దత్తాత్రేయ మాలధారులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఏఎంఆర్ సంస్థ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటకు పైగా కూర్చొని అక్కడే భజన చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. దీంతో రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ జి.అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, దత్తాత్రేయ మాలధారులు, మహిళలు ఉన్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని వ్రత మహోత్సవం
బెల్లంకొండ: బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్రత మహోత్సవాల సందర్భంగా దేవదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో స్వామివారి దీక్షలను చేపట్టిన మాలధారులు మండల కాలం దీక్ష చేసి బుధవారం స్వామివారికి ఇరుముడులను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ చార్యులు, అనంతాచార్యులు వ్రత పూజల అనంతరం విశేష అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వామివారి సంకీర్తన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో సనిమెళ్ల కోటిరెడ్డి, ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆసుల జగన్, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా సంతకాల సేకరణ
మాచర్ల: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ మాచర్ల నియోజక వర్గంలో ముమ్మరంగా కొనసాగుతోంది. పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఐదు మండలాలు, పట్టణం నుంచి 63,556 సంతకాలు సేకరించారు. విద్యార్థులు, మహిళలు, యువజనులు, వ్యాపారస్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయా మండల, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, మండల ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. త్వరలోనే నియోజక వర్గం నుంచి 70వేలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 31వ వార్డులో బుధవారం పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, నియోజకవర్గ ఎస్సీ నేత కందుకూరి మధు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికీ వెళ్లారు. సంతకాలు సేకరించి పత్రాలను పార్టీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు, కౌన్సిలర్ గురవయ్య, జిల్లా ఎస్సీ విభాగ నాయకులు కొమ్ము బొంగురు, పిన్నెల్లి హనిమిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, పుల్లారావు, అజయ్ పాల్గొన్నారు. -
వైభవంగా పునీత శౌరి తిరునాళ్ల
ప్రత్తిపాడు: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులోని పునీత శౌరి తిరునాళ్ల మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. నవంబరు 24వ తేదీన జెండా ప్రతిష్టతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి జరిగిన సమిష్టి దివ్య పూజాబలితో ముగిశాయి. ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజాబలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్యతో పాటు ఆయా చర్చిల ఫాదర్లు, గురువులు హాజరై సమిష్టి పూజాబలిని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన విశ్వాసులు పుణ్యక్షేత్రం ఆవరణలో ఒత్తుల ప్రదక్షిణను దేవుని స్తుతిస్తూ చేపట్టారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లయబద్దంగా వాయిస్తున్న కళాకారుల విన్యాసాలు, కోలాట ప్రదర్శనలు, కర్ర సాములను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. తిరునాళ్లకు గ్రామానికి విచ్చేసిన బంధువులతో ఊరంతా సందడితో కళకళలాడింది. రాత్రి పది గంటల సమయంలో పునీతశౌరి వారిని స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గీతాలాపనలు చేశారు. తేరు ప్రదక్షిణలో వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
‘కృష్ణా’లో కలుషిత నీటి కలకలం
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు కలవడం వలన నీరు కలుషితమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట, కాట్రపాడు గ్రామాల పరిధిలో కృష్ణానదిలో నీరు తీవ్ర దుర్వాసన వస్తోంది. ఆ కలుషిత నీటినే తాగిన తంగెడ, ఏలియంపేట గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. మూగజీవాలు కూడా తాగటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా ఆరు రోజులు గడిచినా కృష్ణానదిలో నీరు సాధారణ స్థితికి రాలేదు. రసాయనాలు కలపటం వలన నీరు రంగు మారింది. నాలుగు రోజులపాటు తంగెడ గ్రామస్తులకు ఈ నీటినే సరఫరా చేశారు. నదిలో పేరుకుపోయిన కెమికల్ తెట్టును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాట్రపాడు గ్రామం సమీపంలో గతంలో తీసిన గుంతల్లో నిల్వ ఉన్న నీరు కూడా రంగు మారినట్లు స్థానికులు చెబుతున్నారు. నదిలో రసాయనాలు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఊరంతా సర్వే చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేస్తే పెనుప్రమాదం నుంచి ప్రజలను కాపాడవచ్చు. పరిస్థితి చక్కబడేంత వరకు ప్రభుత్వం నుంచి సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకోవాలి. – షేక్ సైదా, తంగెడ -
ఫోర్జరీ సంతకాలతో భూముల విక్రయం
రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతుల డిమాండ్ మంగళగిరి టౌన్ : రైతుల భూములను చేజిక్కించుకునే లక్ష్యంతో సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ దస్తావేజులు సృష్టించి భూములు విక్రయించిన రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని చినకాకానిలో బుధవారం ఈ ఘటనపై రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నెం. 182/1లోని 10 ఎకరాల 25 సెంట్ల వ్యవసాయ భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి, రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన సహచరులతో కలసి భూమిలోకి చొరబడి రైతులను బెదిరించిన ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. రైతులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. రైతుల భూములపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి తప్పుడు నమూనా సర్వేలు చూపిస్తూ భూమిని వదిలివేయాలని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. పలువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయితీ, రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేయడం వంటి చర్యలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రౌడీషీటర్ జలీల్, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటేశ్వరరావు, నరసింహారావు, శివన్నారాయణ, కొండలరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలికల హ్యాండ్ బాల్ విజేత పశ్చిమ గోదావరి
పిడుగురాళ్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ అండర్ –15 బాలికల విబాగం విజేతగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నిలిచింది. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో పోటీలు హోరోహోరిగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్లో పశ్చిమ గోదావరి, విజయనగర్ జట్లు పోటీ పడ్డాయి. పశ్చిమ గోదావరి విజయం సాధించి మొదటి స్థానంలోను, రెండవ స్థానంలో విజయనగరం, మూడవ స్థానంలో కడప, కర్నూలు జట్లు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు షీల్డ్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
బొల్లాపల్లి: పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవాలను పురస్కరించుకుని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 15 టీంలు పాల్గొన్నాయని, వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగవ స్థానాల్లో బాపట్ల, బేతపూడి, మాచవరం, యడ్లపాడు జట్లు గెలుపొందాయని నిర్వాహకులు కె. ప్రకాష్రావు, సీహెచ్ రాజేశ్వరరావులు తెలిపారు. ప్రథమ బహుమతి బాపట్ల జట్టుకు శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ 30,116, ద్వితీయ శివ శక్తి లీలా అంజన్ ఫాండేషన్ రూ. 25,116లు చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెవ ఫాదర్ వై. జాకోబ్ రెడ్డి, జాన్ శేఖర్, గ్రామ సర్పంచ్ కె. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ బాలల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్ను
నరసరావుపేట రూరల్: దివ్యాంగ బాలబాలికల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచేందుకు పథకాలు అమలు చేస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని నరసరావుపేటలోని భవిత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, సమీకృత విద్య కో–ఆర్టినేటర్ ఆర్.సెల్వరాజ్, నవభారత దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భవిత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్, ఆయాల సేవలు మరువలేనివని తెలిపారు. దివ్యాంగుల ఉన్నతకి భవిత కేంద్రాలు మూల స్తంభాలని కొనియాడారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఓసీటీబీ పాఠశాల సెక్రటరీ నాయక్, ఫిజియోథెరపిస్ట్ పెదన్నారావు నాయక్, ఉపాధ్యాయులు కె.పద్మజ, జి.మేరీ కుమారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలి సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు దాచేపల్లి : మానసిక దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు తెలిపారు. నారాయణపురంలోని ఫాతిమా మాత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరిపి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులను అంతా గౌరవించాలని, సమాజంలో వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు షేక్ జానీ బాషా, మందపాటి శ్రీనివాసరెడ్డి, గురుప్రసాద్, వలంటీర్ అహ్మద్ పాల్గొన్నారు. డీఈవో చంద్రకళ -
బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్
స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టిన వెంటనే నొప్పి ఉండదు. మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. 6 నుంచి 21 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడిదగ్గు, జీర్ణ సమస్యలు ఉంటాయి. ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యనభ్యసించే విద్యార్థినికి అక్టోబర్ 16న జ్వరం రావడంతో మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్ 1న మృతి చెందింది. అలాగే రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్కు చెందిన యాగసిరి.నాగమ్మ(65) నవంబర్లో జ్వరంతో గుంటూరు జీజీహెచ్లో చేరింది. 10 రోజుల క్రితం ఆమె మృతి చెందింది. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన బట్టు సాలమ్మ జ్వరంతో గుంటూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందింది. ఆమె కోలుకుని పది రోజుల క్రితమె ఇంటికి వచ్చింది. సత్తెనపల్లి: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు జిల్లాలో 11 మంది ఉన్నారు. తొలుత సాధారణ జ్వరంగా భావించి అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించినా, తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో గుంటూరుకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇరువురు ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ అంటే.. పచ్చని పొదల్లో దాగి ఉన్న సూక్ష్మ కీటకం స్క్రబ్ టైఫస్. నల్ల జాతికి చెందిన ‘ట్రాంబికులిడ్ మైట్స్’ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇది కుట్టినప్పుడు ‘ఓరియాంటియా సుత్సుగముషి’ అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు – ఫిబ్రవరి మధ్యకాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పంట పొలాలు, పార్కులు లేదా చెట్ల పొదల్లో పని చేసేవారు కాళ్లకు, చేతులకు పూర్తిగా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ లేదా యాంటీ–ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయాలి. పిల్లలు పార్కులు లేదా మైదానాల్లో ఆడుకునేటప్పుడు కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో 11 పాజిటివ్ కేసులు జిల్లాలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు 11 ఉన్నట్లు గుంటూరు జీజీహెచ్ ద్వారా వచ్చిన సమాచారం. జిల్లాకు చెందిన ఇరువురు మృత్యువాత పడ్డారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలతోనే వారిరువురు మృతి చెందారా లేదా అనేది తెలుసుకునేందుకు కేస్ షీట్లు తెప్పిస్తున్నాం. – డాక్టర్ బి రవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, -
వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గుంటూరు బ్రాడీపేట 2వ లైన్లోని భవిత స్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వివరించారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. చిన్నారులు ఆత్మనూన్యతాభావానికి గురికాకుండా చదువుపై శ్రద్ధ వహించి, పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులతో స్నేహభావంగా మెలిగి, ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్థానిక చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ప్యానెల్ అడ్వకేట్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ ఎన్.శ్రీనివాసరావు, రిసోర్స్పర్సన్ సువర్ణ లత, హెచ్ఎం ఎండీ అస్సన్ బేగ్, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
రాజధాని నడిబొడ్డున చెరువు కబ్జా
మందడం(తాడికొండ): రాజధాని నడిబొడ్డున సచివాలయానికి కూతవేటు దూరంలో తుళ్ళూరు మండలం మందడం చెరువులో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సుమారు 35 ఎకరాల్లో ఉన్న చెరువులో గతంలో పలువురు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం అప్పట్లోనే వారికి పట్టాలు అందజేసింది. ఇటీవల తెలుగు తమ్ముళ్లు తెగించడంతో నెల రోజుల వ్యవధిలో 4 షెడ్లు వెలిశాయి. వీరిని చూసి మరి కొంతమంది ఆక్రమణలకు తెరలేపడంతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరం, సీఆర్డీఏ స్థానిక కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఈ ఆక్రమణలు జరుగుతుండటంతో ముక్కున వేలేసుకోవడం అందరి వంతవుతోంది. త్వరలో ఇటుగా రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఈ గృహాలను తొలగిస్తే పరిహారం భారీగా వస్తుందంటూ ప్రచారం సాగుతోంది. -
ప్రగతిపై చర్చకు సిద్ధం
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి కాసు మహేష్ రెడ్డి సవాలు సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, కాసు కుటుంబ ప్రతిష్టపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఒక్కడినే లెక్కలతో వెళతానని సవాలు విసిరారు. నారా లోకేష్, చంద్రబాబు, యరపతినేనిలకు 2019 ముందు నుంచి సవాలు విసిరానని, బ్రహ్మారెడ్డి వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. నరసరావుపేటలోని కాసు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్రెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ.. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే జూల‘కంత్రి’ బ్రహ్మారెడ్డి ప్రెస్మీట్లో నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. తాను పుట్టక ముందే సొసైటీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమ వారిదన్నారు. 50 ఏళ్ల క్రితమే సుమారు రూ.1.50 లక్షలు చెల్లించి దీనికోసం స్థలం కొన్నామన్నారు. అదే మొత్తంతో ఆ సమయంలో తమ పెద్దలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 20 ఎకరాలు కొంటే, అది ఇప్పుడు సుమారు రూ.3 వేల కోట్లు పలికేదన్నారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కాసు సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. మారుతున్న కాలంతో ఎయిడెడ్ కళాశాలలకు ఆదరణ తగ్గడంతో వాటి నిర్వహణకు మాల్ కట్టి కొంత ఆదాయం సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణం కోసం ప్రభుత్వం జీవోలు, హైకోర్టు ఉత్తర్వులతోపాటు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అక్రమార్జన చేసి ఉంటే సొంతంగా ఆస్తులు కొనేవాడినని, సొసైటీలో ఎందుకు మాల్ నిర్మిస్తానని ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి, కృష్ణారెడ్డిలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. నాగార్జున సాగర్, బుగ్గవాగు, జాతీయ రహదారులు మొదలు తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కళాశాల, తాగునీరు, హైవేలు నిర్మించామన్నారు. హత్యారాజకీయాలు బ్రహ్మారెడ్డికి అలవాటేనని, ఏడు మర్డర్ల కేసులో ఆయన పేరు ఎందుకు ఉందో, టీడీపీ ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్పాలన్నారు. 2019 ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డి వైఎస్సార్సీపీలోకి రావాలని ప్రయత్నించినా ఆయన గురించి తెలిసి పార్టీలో చేర్చుకోవడానికి పీఆర్కే ఒప్పుకోలేదన్నారు. 18 నెలల్లో అవినీతి ఏ స్థాయిలో చేస్తే కుమారుడి పెళ్లి రూ.10 కోట్లు పెట్టి చేశావని ప్రశ్నించారు. పిన్నెల్లి సోదరులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది. పిన్నెల్లి బ్రదర్స్కు ఏ మాత్రం సంబంధం లేని కేసులో వారి పేర్లు పెట్టడం దారుణం. అసలు జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్కు ఏమిటి సంబంధం? టీడీపీ గ్రూపుల మధ్య గొడవే కారణమని అందరికీ తెలుసు. చివరకు నాపైనా ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిలో ఎవ్వరినీ రేపు మా ప్రభుత్వం వచ్చాక వదలి పెట్టబోం. వారికి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కాసు కుటుంబం రాష్ట్రానికి చేసిన సేవలు అందరికీ తెలిసినవే. వారి గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, అవన్నీ విఫల ప్రయత్నాలు. – విడదల రజిని, మాజీ మంత్రి గుండ్లపాడు జంట హత్యలకు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు టీడీపీ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు అరెస్టు అయిన అయిదుగురిలో పిన్నెల్లి సోదరులు లేరు. ఆ తర్వాత కావాలనే రాజకీయ కక్షతో వారిని కేసులో ఇరికించారు. పిన్నెల్లి సోదరులకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. శిక్షలు పడిన వారికి సైతం చంద్రబాబు టికెట్లు ఇచ్చారు, పిన్నెల్లిపై నిందలు తప్ప ఆధారాలు లేవు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ -
గుంతల రోడ్లే గతి..!
సత్తెనపల్లి: అధికారంలోకి వస్తే, సంక్రాంతి పండుగలోపే రోడ్లన్నీ బాగు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ అటకెక్కింది. సంక్రాంతి పండుగ పోయి మళ్లీ సంక్రాంతి పండుగ వస్తున్నా మరమ్మతులు చేయకపోగా రోడ్లు మరింత అధ్వానంగా మారాయని ప్రజలు మండిపడుతున్నారు. ఏ రోడ్డు చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారుల దుస్థితి ఇలా ఉంది. వివిధ పనుల మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి సత్తెనపల్లికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూపు కోల్పోయిన రహదారులు.. సత్తెనపల్లి–మాదిపాడు, సత్తెనపల్లి–నరసరావుపేట, కొండమోడు–పేరేచర్ల ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారాయి. కొండమోడు–పేరేచర్ల జాతీయ రహదారిని విస్తరించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మంజూరై చివరి దశకు వచ్చాక ప్రభుత్వం మారడంతో ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే కనీసం గుంతలకు మరమ్మతులు చేస్తే రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. అవేమీ పట్టించు కోకపోవడంతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎటు చూసినా గుంతలే కనిపిస్తుండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. -
బాబు పాలనలో భవిత శూన్యం
భవిత కేంద్రాల్లో మానసికంగా, శారీరకంగా అవస్థలు పడుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ప్రభుత్వం భరోసానివ్వడం లేదు. ఏటా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందజేయాలి. కానీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలను ఏటా అందించేది. పరికరాలను కొనే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ చేయూత కోసం తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు. తప్పని ఎదురుచూపులు..సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భరోసా కల్పించేందుకు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయా కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతున్న ఎంతోమంది చిన్నారులు ఉపకరణాలు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫిజియోథెరపీ వైద్యుల కొరత వేధిస్తోంది. నాలుగు మండలాలకు ఒకరు చొప్పున సేవలందిస్తున్నారు. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 540 మంది ఉన్నారు. పాత పరికరాలతోనే చదువుకు దూరంగా ఉన్న ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి భవిత కేంద్రంలో విద్యనందిస్తున్నారు. అలాగే మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం, దృష్టిలోపంతో బాధపడే వారికి కేంద్రంలోనే ఫిజియోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు మండలాలకు ఒక్కరే ఫిజియోథెరపీ వైద్యులు ఉండడంతో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చి సేవలు అందించాల్సిన పరిస్థితి. దీంతో సక్రమంగా ఫిజియోథెరపీ సేవలు అందడం లేదు. ఏళ్ల క్రితం అందజేసిన పరికరాలు ఇప్పుడు బాగా పాడవడంతో వాటితోనే సేవలందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీలుగా పని చేస్తున్న వారే పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బ్రెయిలీ నైపుణ్యాలతోపాటు నడవడికను నేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు అనుసరించాల్సిన ప్రత్యేక శ్రద్ధపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ఆగస్టులో శిబిరాలు నిర్వహించారు. ఇంకా యంత్ర పరికరాలు రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పంపిణీ చేస్తాం. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల విషయంలో అన్ని ప్రభుత్వాలు వారికి చేయూతను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధిస్తున్నాం. – సెల్వరాజ్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్, పల్నాడు ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రంలో ఉచితంగా ఉపకరణాలు అందించాలి. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి దివ్యాంగుల అవసరాన్ని గుర్తించాలి. ఎవరికి ఏ పరికరం అవసరమో గ్రహించి, అందించాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉపకరణాలు అందించేవారు. దృష్టి, వినికిడి లోపం ఉన్నవారు కూడా సాధారణ విద్యార్థుల్లా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ట్యాబ్లు పంపిణీ చేసింది. ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్)కు ఇలా మొత్తంగా 148 ట్యాబ్లను అందజేసింది. ట్యాబ్స్ను ఎలా వినియోగించాలన్న అంశంపై ఉపాధ్యాయులకు, చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించారు. వారికి ఉపకరణాలు అందించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు. -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
గుంటూరు మెడికల్: సాధారణ జ్వరం మాదిరిగా సోకి ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తున్న స్క్రబ్ టైఫస్తో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు, చేబ్రోలు, వేజండ్ల, తుళ్లూరు, గుంటూరు అర్బన్ పరిధిలోని గోరంట్ల, ఇతర ప్రాంతాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి జ్వరంతో ప్రారంభమవుతోంది. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్గా అనుమానించాలి. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చు. వర్షాకాలంలో ఈ జ్వరాలు ఎక్కువ సాధారణంగా స్క్రబ్ టైఫస్ కేసులు వర్షా కాలంలో ఎక్కువగా నమోదవుతాయి. జిల్లాలో ఒక్క వేసవి కాలంలో మినహా వర్షా కాలం, చలి కాలంలో కేసులు నమోదయ్యాయి. జ్వరంతోపాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటాయి. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. వాంతులు, తీవ్రమైన చలి, అలసట, దగ్గు, కళ్లు ఎర్రబడడం ఉంటాయి. శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధి సోకిన వారిలో సగం మందికి పైగా వీపు, ఛాతి, కడుపుపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. వాటిని నొక్కినప్పుడు మసక బారుతాయి. అనంతరం ఎరుపుగా మారతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో చర్మంలో కొద్దిగా రక్తస్రావం కావచ్చు. కీటకం ద్వారా సోకుతోంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగించే చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ఈ క్రమంలో దానిలో ఉండే లాలాజలం (ఓరిజెంటియా తుత్సుగముషి అనే బ్యాక్టీరియా) రక్తంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 31 మందికి ఈ వ్యాధి జ్వరాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు శరీరంపై నల్ల మచ్చ గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావంతో స్క్రబ్ టైఫస్ -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
గుంటూరు వెస్ట్: మాజీ భారత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నాయకులు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ నిస్వార్థమైన సేవతో దేశానికి దిశానిర్ధేశం చేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని రింగు రోడ్డులోని ఐటీసీ హోటల్, మెడికల్ క్లబ్ ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతి కోసం వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, బీజేపీ నాయకులు భజరంగ్ రామకృష్ణ, తాడువాయి రామకృష్ణ, దర్శనం శ్రీనివాస్, ఆలపాటి రవికుమార్, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి -
అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో బయో డీజిల్ బంక్లో నవంబర్ 23న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగం భాగ్యారావు (52) మంగళ వారం మృతి చెందాడు. పాలువాయి జంక్షన్ సమీపంలో బయోడీజిల్ దుకాణంలోని స్టీల్ క్యాన్లకు బయో డీజిల్ ట్యాంకర్ వచ్చి బయోడీజిల్ నింపుతుండగా ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో రషీద్(30) అక్కడికక్కడే అగ్నికి ఆహుతైన విషయం పాఠకులకు తెలిసిందే. బయోడీజిల్ దుకాణానికి 10 అడుగుల బయట ఉన్న భాగ్యారావుకు మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్నవారు అతనిని రోడ్డు వద్దకు లాగి దుస్తులు తీసివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే భాగ్యారావును అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు మృతి చెందినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. -
నేడు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం గ్రామసభలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద బుధవారం రైతన్న మీకోసం గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభలలో 2025–26 రబీ, 2026 ఖరీఫ్, 2026–27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో చర్చించాలన్నారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాల (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు) ఆధారంగా పంట ప్రణాళిక తయారీలో అధికారులు, రైతులు భాగస్వాములు కావాలన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను మంగళవారం మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ప్రచార నిమిత్తం గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ చాంపియన్షిప్ విజేత ‘పశ్చిమగోదావరి’
పిడుగురాళ్లరూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలలో విజేతగా పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. పిడుగురాళ్ల మండలం జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్కు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల జట్లు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆక్స్ఫర్డ్స్ స్కూల్ డైరెక్టర్ బొల్లా గిరిబాబు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతమైన తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి జిల్లా జట్టు అద్భుతమైన ఆటను కనబరిచాయని ఆయన తెలియజేశారు. విజేత పశ్చిమ గోదావరి జిల్లా జట్టుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు పాల్గొన్నారు. -
లూజు పత్తిని మాత్రమే తీసుకురావాలి
నాదెండ్ల: రైతులు నాణ్యత గల పత్తిని సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చి గరిష్ట మద్దతు ధర పొందాలని ఉమ్మడి గుంటూరు జిల్లా సీసీఐ ఏజీఎం సంజయ్ ద్వివేది చెప్పారు. గణపవరం శ్రీ వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. బయ్యర్ రమేష్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సూచనలు చేశారు. రైతులు ప్లాస్టిక్ సంచుల్లో పత్తిని తీసుకురావద్దని, సాధ్యమైనంత వరకూ లూజ్గా తీసుకురావాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పత్తిలో కలిసి నాణ్యత తగ్గడంతోపాటూ రైతులు ధరలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రతి సోమవారం నుండి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకూ పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. తేమ 8–12 శాతంలోపు ఉండాలన్నారు. తడిచిన పత్తి ఆరబెట్టుకోవాలని, గుడ్డికాయ ఉన్నట్లయితే విదిలించి మేలు రకం పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు. సంబంధిత రైతులు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దిష్ట సమయానికి పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించాలని సూచించారు. -
నలుగురు యువకులు అరెస్ట్
కిలో గంజాయి స్వాధీనం ముప్పాళ్ల: మహిళపై దాడికి పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పీ.అనిల్కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల కిందట మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. నలుగురు యువకులు ఆమైపె దాడికి దిగారు. ముప్పాళ్ల పోలీస్స్టేషన్లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన బొరిగర్ల నాగరాజు, మధిర లక్ష్మీరెడ్డి, కుమ్మెత మహేశ్వరరెడ్డి, లంకెలకూరపాడు గ్రామానికి చెందిన కిష్టిపాటి శివనాగిరెడ్డిలను లంకెలకూరపాడు గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. కారెంపూడి: స్థానిక ఎస్సీ కాలనీలోని మురికి కాలువలో మంగళవారం నవజాత శిశువు మృతదేహం కన్పించింది. కన్న వెంటనే పాపను కాల్వలో పడేసినట్లుగా ఉంది. బొడ్డుపేగు కూడా అలాగే ఉంది. ఇది చూసి స్థానికులు చలించిపోయారు. కాల్వలో ఉన్న శిశువును వెలికితీసి పూడ్చి పెట్టారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది. -
సర్టిఫికెట్ కోసం ఎన్నాళ్లు తిరగాలి?
రామిరెడ్డిపేటలో నాకు సొంత ఇల్లు ఉంది. అందులో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నా. నా ఇల్లు శారదా ఇంటితో కలిసి జాయింట్ శ్లాబు ఉంది. ఇద్దరికి కలిపి వాటర్ ట్యాంకు నిర్మాణం చేశారు. ఆ ట్యాంకు నుంచి నీరు లీకై శ్లాబ్ తడుస్తూ ఇల్లు అంతా డ్యామేజ్ అయింది. విద్యుత్ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయి. 2023లో స్పందనలో ఫిర్యాదుచేస్తే మున్సిపాల్టీకి అప్పచెప్పారు. కమిషనర్ ఆదేశాలతో టీపీఓ, టీపీఎస్, టౌన్ సర్వేయర్ వచ్చి చూసి వాటర్ లీకేజ్ పరిశీలించి ఇంటి పక్కనున్న వారిని మరమ్మతు చేయించాలని చెప్పారు. వారు తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. అయినా సమస్య తీరలేదు. ఇంటిపక్కనున్న వారిని ట్యాంకు తొలగించాలని కోరినా వారు వినట్లేదు. ఆ ట్యాంకు తొలగించి డ్యామేజ్ రిపోర్టు ఇప్పించండి. శ్లాబ్ మరమ్మతు చేయించుకుంటాం. –నంద్యాల అనసూర్య, రామిరెడ్డిపేట, నరసరావుపేట -
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీసీఓ
నూజెండ్ల: నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఏపీఎస్డబ్ల్యూఆర్ఈస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి సోమవారం తనిఖీ చేశారు. ‘కుక్కలు తిన్నాకే తినాలా’ అనే శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీపీ మేడం జయరామిరెడ్డి, ఎంఈఓలు సత్యనారాయణ, రవిచంద్ర, ఎంపీడీఓ ఉమాదేవిలు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి ప్రహరీ పడిపోయి ఉండటం గమనించి రెండు సంవత్సరాలైనా నిధులు కేటాయించలేకపోయారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆమె ఉన్నప్పుడే 30 పైగా శునకాలు ఆవరణలో తిరుగుతుండటం విశేషం. ప్రిన్సిపల్ రమణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని విచారించారు. కుక్కలు ఆహారాన్ని తింటుంటే చూస్తూ ఉంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం చికెన్ పెడుతున్నారా అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ప్రిన్సిపల్ స్థానికంగా ఉండాల్సిందేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నామని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా అసోసియేషన్ హాలులో సోమవారం ఏకాగ్రీవంగా నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా వి.హనుమంతరావు, జిల్లా అధ్యక్షులుగా ఎం.చంద్రశేఖర్, జిల్లా సెక్రటరీగా ఎం.శ్రీను, అసోసియేట్ ప్రెసిడెంట్గా సీహెచ్.నాగేంద్రబాబు, కోశాధికారిగా భాస్కరరెడ్డి, జాయింట్ సెక్రటరీగా విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్గా వెస్ట్ గోదావరి జిల్లా సెక్రెటరీ కిషోర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఏలూరు జిల్లా అసోసియేషన్ సభ్యులు ఆనంద్, ఎలక్షన్ అబ్జర్వర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూర్తి వ్యవహరించారు. ఎన్నికలు చక్కగా నిర్వహించినందుకు ఎలక్షన్ ఆఫీసర్స్కు రాష్ట్ర సంఘం తరఫున పసుపులేటి రఘుబాబు ధన్యవాదాలు తెలియజేశారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభం
పిడుగురాళ్లరూరల్: ప్రతి క్రీడాకారుడు దేశానికి మంచి పేరు తేవాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి ఆటల పోటీలను సోమవారం ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహించారు. అండర్–14 బాలికలు, అండర్–19 బాలురలకు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు 17 జిల్లాల నుంచి సుమారుగా 350 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాసంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు క్రీడా జ్యోతిని వెలిగించగా, గురజాల డీఎస్పీ జగదీష్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ...గెలుపునకు ఓటమి నాందిగా క్రీడాకారులు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ నరేష్, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్ బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు, ఎస్ఐలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
చలిలో వెచ్చని నేస్తం
సత్తెనపల్లి: నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. దీనికితోడు వాయుగుండం కారణంగా వాతావరణంలో మార్పుతో చల్లని గాలులు వీస్తూ చలి చంపేస్తోంది. వేకువ జాము నుంచే మంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి వణికిస్తుండడంతో కొందరు మంటలు వేసుకుని చలి కాచుకుంటుంటే .. మరికొందరు చలికి బయటకు రాలేకపోతున్నా రు. దీంతో జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట, పెదకూర పాడు, గురజాల నియోజకవర్గాల్లో ఉన్ని దుస్తుల కు గిరాకీ పెరిగింది. రకరకాల డిజైన్లతో స్వెటర్లు, రెయిన్కోట్లు, శాలువాలు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, గ్లౌజులు, బెడ్ షీట్లు అందుబాటులో ఉంచి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిస్తున్నాయి. జోరుగా ఉన్ని దుస్తుల విక్రయం... జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల పరిధిలో రోడ్ల వెంబడి రంగురంగుల ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వర కు ధరించే వివిధ డిజైన్లలో ఈ విక్రయాలు జోరందుకున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నా యి. తమకు తెలిసిన స్వెటర్లు, తదితర వాటిని తెచ్చి ప్రజలందరికీ పరిచయం చేసి తమపై నమ్మకాన్ని పెంచుకుంటున్నామని వ్యాపారులు అంటున్నారు. స్థానికులతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఉన్ని దుస్తులు, టూ ఇన్ వన్ రెయిన్ కోట్లు, బెడ్ షీట్లు(రగ్గులు) విక్రయిస్తున్నారు. ప్రధాన రహదారులు పక్కనే వీటిని అందుబాటులో ఉంచి విక్రయిస్తూ ఆ ప్రాంతాల్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఏటా ఆక్రమణల పన్ను చెల్లిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారాలు చేస్తున్నారు. నాణ్యమైన ఉన్ని దుస్తులను సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నాం. ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఏటా నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారం చేస్తాం. వినియోగదారులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. 2013 నుంచి ఈ వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. – చేవూరి జయరావు, వ్యాపారి, సత్తెనపల్లి -
కృష్ణా నదిని పరిశీలించిన అధికారులు
దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిని పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలన చేశారు. కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు కలపడంతో నీరు కలుషితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సాక్షి దినపత్రిక సోమవారం ‘కృష్ణాలోకి కెమికిల్’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ, పర్యావరణ శాఖ అధికారులు అప్రమతమయ్యారు. కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని సంబంధిత అధికారులు పరిశీలన చేసి వివరాలు సేకరించారు. కృష్ణానదిలో నీటిపై రసాయనాల తెట్టు ఇంకా పేరుకు పోయి ఉండడాన్ని గమనించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు కెమికల్స్ కల్పిన ప్రాంతంలో మూడు చోట్ల శాంపిల్స్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపి పరీక్ష చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మండల తహసీల్దార్ జి.శ్రీనివాస్యాదవ్, పంచాయతీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వీఆర్ఓ బి. యలమంద, గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ అంగడి సోమయ్య, కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని పరిశీలన చేసి ప్రాథమిక ఆధారాలపై కూపిలాగారు. కృష్ణానది నుంచి తంగెడకు తరలించే నీటిని నిలిపివేశారు. తంగెడలోనే అందుబాటులో ఉన్న బోర్ల ద్వారా తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. గ్రామం మొత్తం బ్లీచింగ్ చల్లించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కృష్ణానది వద్ద రసాయనాలు కల్పిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించారు. కృష్ణా నదిలో రసాయనాలు కలపటంపై విచారణ చేస్తున్నామని, రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడెక్కడ కలిపారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కి నివేదిక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలి
పమిడిమర్రులోని దళితుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకు లు డిమాండ్ చేశారు. సోమవారం వారు పమిడిమ ర్రులో ఆక్రమణకు గురవుతున్న అసైన్డ్ భూములను పరిశీలించారు. 16 ఏళ్ల కిందట 100 మంది దళితు లకు భూములను కేటాయించి బీ ఫారాలు ఇచ్చార ని తెలిపారు. వారి ప్లాట్లు చూపకపోవడంతో భూ ములను చేపల చెరువుగా మార్చి వచ్చిన ఆదాయం ఉమ్మడిగా అనుభవిస్తున్నారని తెలిపారు. కోటప్పకొండకు, జేఎన్టీయూఎన్కు కూతవేటు దూరంలో ఉన్న భూములకు ధరలు రావడంతో వీటిని ఆక్ర మించేందుకు పలుమార్లు ప్రయత్నించారని తెలిపా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫి యా ఈ భూములపై కన్నెసినట్టు పేర్కొన్నారు. భూ మాఫి యాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై.వెంకటేశ్వరరావు,జి.రామకృష్ణ, ప్రసాద్ ఉన్నారు.ప్రజాసంఘాల నాయకులు -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరువెస్ట్): ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులతోపాటు దొంగిలించిన సొత్తు విక్రయించి దొంగలకు సహకరించే వ్యక్తిని కూడా గుంటూరు సీసీఎస్, లాలాపేట పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సంపత్నగర్ మెయిన్రోడ్డులో ఉంటున్న అవ్వారి వెంకటప్పయ్యశాస్త్రి గత నెల 8న తిరుపతి వెళ్లి 12న ఇంటికొచ్చారు. ప్రధాన ద్వారం తాళాలు పగుల కొట్టి ఉంది. బీరువాలో దాచిన 152 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. బాధితుడు లాలాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు సీసీఎస్, లాలాపేట పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లో సంచరిస్తున్న గోరంట్ల తూర్పుబజార్కు చెందిన చిల్లర సురేష్, విజయవాడ రామలింగేశ్వరనగర్ గంగానమ్మ గుడి పక్కన ఉంటున్న కాజా నాగవీరభాస్కరరావులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం ఒప్పుకోవడంతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నాలుగు కేసుల్లో రూ.26.50 లక్షల ఖరీదు చేసే 227 గ్రాముల బంగారు, 182 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ చెప్పారు. దొంగలించిన సొత్తుని విక్రయించి వారికి సహకరిస్తున్న సుగాలినగర్ 4వ వీధికి చెందిన లంకా రాజేష్ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. -
గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
యడ్లపాడు: దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పా ట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి సిబ్బందిని ఆదేశించారు. యడ్లపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్నవారి వివరాలు సేకరించి ఈనెల 7న ప్రత్తిపాటి గార్డెన్లో జరిగే ప్రత్యేక వైద్య శిబిరానికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ పరిస్థితులను పరిశీలించి, జ్వరాలు, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన పనుల పురోగతిని పరిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి భరద్వాజ, సూపర్వైజర్ వి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.రవి -
రెండు రాష్ట్రాల ఎద్దుల బండ లాగుడు పోటీలు
గురజాల: పట్టణంలో వేంచేసియున్న శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్లను పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ నుంచి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, రైతు సంఘం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఏపీ ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదనలు అనుసరించి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.80 వేలు, మూడో బహుమతి రూ.70 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదో బహుమతి రూ.50 వేలు, ఆరో బహుమతి రూ.30 వేలు, ఏడో బహుమతి రూ.20 వేలు, ఎనిమిదో బహుమతి రూ.15 వేలు, తొమ్మిదో బహుమతి రూ.10 వేలు, జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.55 వేలు, రెండో బహుమతి రూ.45 వేలు, మూడో బహుమతి రూ.30 వేలు, నాల్గవ బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరో బహుమతి రూ.8వేలు, ఏడో బహుమతి రూ.7వేలు, ఎనిమిదో బహుమతి రూ.5వేలు, న్యూ కేటగిరి విభాగంలో ప్రథమ బహుమతి రూ.45వేలు, రెండో బహుమతి రూ.35వేలు, మూడో బహుమతి రూ.25 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు, ఆరో బహుమతి రూ.7 వేలు, ఏడో బహుమతి రూ.5వేలు, 6 పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.15వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరవ బహుమతి రూ.7వేలు, ఏడవ బహుమతి రూ.5వేలు, నాలుగు పళ్ల జతల విభాగంలో ప్రథమ బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, నాల్గవ బహుమతి రూ.10 వేలు, ఐదో బహుమతి రూ.8వేలు, ఆరో బహుమతి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీల స్థలం పరిశీలించిన పులుకూరి ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహించే గ్రౌండ్ను నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు సోమవారం పరిశీలించారు. గతంలో మాడుగుల రోడ్డులో పోటీలు నిర్వహించేవారని, అనివార్య కారణాల వలన ఈ ఏడాది పులిపాడు రోడ్డులోని సిరి వెంచర్ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అందరూ పాల్గొని పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పోటు నాగేశ్వరరావు, నవులూరి శ్రీరామమూర్తి, నెల్లూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఐదు నుంచి ప్రారంభం -
గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు అరెస్ట్
నగరంపాలెం: గంజాయి విక్రయించే ఇద్దరు యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రెండు రోజుల కిందట కాకాని రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్ సిబ్బందితో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ క్రమంలో అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయంలో ఉంటున్న మహంకాళి శివమణికంఠ, నెహ్రూనగర్ ఒకటో వీధికి చెందిన భేటి బద్రినారాయణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారిద్దర్ని అరెస్ట్ చేసి, 1,160 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. స్నేహితులైన ఇద్దరు గంజాయికి బానిసయ్యారు. మార్టూరు క్వారీ వద్ద ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు మంగల్ పాండే అలియాస్ మాము వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. చిన్న ప్యాకెట్లగా తయారుచేసి ఎక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు. -
పేదల భూముల నుంచి
నరసరావుపేట రూరల్: పమిడిమర్రులోని పేదల భూముల నుంచి యంత్రాలను సోమవారం తరలించారు. పేదలకు చెందిన అసైన్డ్ భూముల ఆక్రమణపై ‘ అసైన్డ్ భూముల్లో పచ్చ గద్దలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. ఈ కథనం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రజా సంఘాల నాయకులు భూములను పరిశీలించారు. దీంతో స్పందించిన ఆక్రమణదారులు హడావిడిగా యంత్రాలను అక్కడి నుంచి తరలించారు. పచ్చనేతల వద్ద పాస్బుక్లు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో మండలంలోని పమిడిమర్రులో 82 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని పేదలకు కేటాయించారు. ఈ భూమిపై కన్నెసిన పచ్చనేతలు నరసరావుపేటకు చెందిన దళిత నాయకుడి సహకారంతో వ్యూహం రచించారు. పేదలకు డబ్బులు ఆశ చూపిన దళిత నాయకుడు వారి నుంచి ప్రభుత్వ పాస్బుక్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాంతలో ఎకరా భూమి రూ.10లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.2లక్షలకే కొనుగోలు చేసేలా రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. మొదట విడతగా కేవలం రూ.10వేలు చెల్లించి రైతులు నుంచి భూములు స్వాధీనం చేసుకుని చదును చేసే పనిని ప్రారంభించారు. ఆక్రమణలకు ప్రజాప్రతినిధి వత్తాసు అసైన్డ్ భూములు చేతులు మారుతున్నాయనే సమాచారంతో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పది రోజుల కిందట పమిడిమర్రు గ్రామంలో పర్యటించారు. అసైన్డ్ భూములను పరిశీలించి అక్కడ జరుగుతున్న భూమిని చదును చేసే పనులను నిలిపివేయించారు. దీనిపై పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ప్రజాప్రతినిధిని ఆశ్రయించినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారిని పిలిచి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధి మద్దతుతోనే పచ్చనేతలు నేరుగా రంగంలోకి దిగి చెరువులను ధ్వంసం చేయడంతోపాటు భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం ఉంది. -
సంపూర్ణ ఆరోగ్య సూత్రమే యోగా
గుంటూరువెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ అన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధ కులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధ నే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్ అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతిశ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించా రు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల ఉన్నారు. -
అర్జీలు నాణ్యతగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి
112 అర్జీలు స్వీకరించిన డీఆర్ఓ, అధికారులు నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు నాణ్యంగా పరిష్కరించటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్ఓ ఏకా మురళి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అధ్యక్షత వహించి జిల్లా అధికారులతో కలసి 112 అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ మాట్లాడుతూ అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలన్నారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతివారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్న్స్ జాబితా సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పాలని సూచించారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ఒకటి, రెండు అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్బ్యాక్ అందించాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్లు వారి దగ్గరికి వచ్చిన అర్జీలు సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలని, దీనిపై దృష్టి పెట్టాలని, అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీస్ ద్వారా తపాల్లను పంపించడం జరుగుతోందని, రోజువారీగా వాటిని చూసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
6,7 తేదీల్లో తెలుగు సాహితీ మహోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగే ఈ వేడుకల ఆహ్వానపత్రికను సోమవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ‘తెలుగుభాష–సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై సదస్సు, అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు 200 మందితో జాతీయస్థాయి కవి సమ్మేళనం ఉంటాయి. 11 నంది అవార్డులు పొందిన ఎం.సైదారావుచే జుగల్బందీ, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందంచే ‘భువన విజయం’నాటకం ఉంటాయని తెలిపారు. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెనాలి కూచిపూడి కళాకారిణులు దాదాపు 500 మందితో మహానాట్య సమ్మేళనం, విభిన్న రంగాల్లో చేతివృత్తుల్లో కొనసాగుతున్న శ్రామిక యోధులు, కళారంగ ప్రముఖులకు చిరుసత్కారం ఉంటా యని వివరించారు. 7వ తేదీ ముగింపు సభలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరిస్తారు. ముందురోజున గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల కళాపురస్కారం, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ సత్కారాన్ని రూ.25 వేల చొప్పున నగదుతో అందజేస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు, మైత్రీ హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిశోర్బాబు, మొవ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సినీనటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం -
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు
గుంటూరు రూరల్: రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–14 బాలుర క్రికెట్ పోటీలలో పశ్చిమగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. గత మూడురోజులుగా రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామం లోగల గ్రౌండ్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా చివరిరోజు సోమవారం తొలుత జరిగిన సెమీ ఫైనల్స్లో గుంటూరుపై కర్నూలు విజయం సాధించింది. అదేవిధంగా అనంతపురంపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. 3వ స్థానంలో గుంటూరు, 4వ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన ఫైనల్స్లో కర్నూల్ను పశ్చిమ గోదావరి ఓడించి విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ బంగారు రాజు, దిలీప్చక్రవర్తిలు పర్యవేక్షించారు. విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జట్టును పెదకాకాని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం కె.భాస్కరరావు అభినందించారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మైనేనీ నాగేశ్వరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సిహెచ్ గోపి, సుమేధ స్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ త్రిమెన్ కమిటీ సెలక్టర్ సుధాకర్, ఏపీ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరిముల్లాచౌదరి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆయుర్వేద సంఘం జనరల్ సెక్రెటరీ డాక్టర్ నామాల శ్రీనివాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాలుర విభాగంలో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు -
కుడికాలువలో ఇరువురు గల్లంతు
ఒకరు మృతి.. మరొకరి కోసం గాలింపు మాచర్ల రూరల్: నాగార్జునసాగర్ కుడి కాలువలో నీటి ప్రవాహానికి ఓ మహిళ కొట్టుకుని పోగా, ఆమెను రక్షించేందుకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని 25వ వార్డులో ధరణికోట శ్రీలక్ష్మి (25) నివసిస్తోంది. అదే వార్డులో వీర్ల గోవర్ధన్ నివసిస్తున్నాడు. శ్రీలక్ష్మి నాలుగు సంవత్సరాల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. ఆమెకు 7 సంవత్సరాల కుమారుడు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు మద్యం తాగి కుడికాలువ వద్ద పడి ఉన్నాడని సమాచారంతో శ్రీలక్ష్మి, గోవర్ధన్లు కలిసి కాలువ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావును లేపి ఇంటికి పంపించే నేపథ్యంలో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు కాలువలోకి దిగారు. శ్రీలక్ష్మి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు ఒడ్డుపై ఉన్న వీర్ల గోవర్ధన్ కాలువలోకి దూకాడు. అతను కూడా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కొద్ది దూరంలో చేపలు పడుతున్న కొంతమంది శ్రీలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. దీనిపై పట్టణ పోలీసులను వివరణ కోరగా కుటుంబ సభ్యులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కుడికాలువలో గల్లంతైన వీర్ల గోవర్ధన్ (ఫైల్) , మృతి చెందిన డి శ్రీలక్ష్మి -
ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని హైద్రాబాద్ విల్ టూ కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ప్రేరణ తరగతులను ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి 200మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ట్రైనర్గా హాజరైన రామేశ్వర్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా చేయడమే కార్యక్రమ ఉదేశమని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో 53 వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తిచేసినట్టు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, అన్నమయ్య జిలాల్లో పూర్తిచేసామని వివరించారు. ఏపీలో 16జిల్లాల్లో 25వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి రోజూ దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమానికి అవకాశం కల్పించిన డీఈవో చంద్రకళకు ఽకృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వేమూరి శ్రీనివాస్, సుందర్రావు, షేక్ కరీముల్లా, కొండం రాజులు పర్యవేక్షించారు. -
తప్పుడు కేసులపై సీబీఐ విచారణ జరపాలి
●పిన్నెల్లి సోదరులపై బనాయించినవి అక్రమ కేసులు ●ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు ●న్యాయం ఎప్పటికై నా గెలుస్తుంది ●గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిపిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై బనాయించిన తప్పుడు కేసుపై దమ్ముంటే అధికార పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్చేశారు. పిన్నెల్లి సోదరులపై బనాయించినవి తప్పుడు కేసులనే విషయం జిల్లాలో ఎవరిని అడిగిన వెంటనే చెబుతారని అన్నారు. నరసరావుపేటలోని తన నివాసంలో మహేష్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులకు పాపం పండింది.. జైలుకు పోతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, ప్రత్యర్థితో రాజకీయంగా పోటీపడాలే గాని తప్పుడు కేసులు బనాయించి జైలు పంపాలని చూడడం చేతకానితనం అని పేర్కొన్నారు. పోలీసుల వల్ల కాక చివరికి కోర్టులను ప్రభావితం చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డితో పాటు జిల్లాలోని ప్రతి కార్యకర్తా వెన్నంటి ఉంటారని తెలిపారు. వెల్దుర్తి మండలం గొల్లపాడులో నాలుగైదు నెలల క్రితం జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు, చంపించిన వాళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ప్రధాన నాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయటం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విలువ ఇస్తామని, తప్పకుండా రామకృష్ణారెడ్డి హాజరవుతారని, న్యాయం కోసం తమ వంతు గట్టిగా పోరాడుతామని మహేష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ సీపీదే ! మాచర్ల నుంచి శ్రీశైలం వరకు, మళ్లీ అక్కడ నుంచి బాచిపల్లి వరకు జాతీయ రహదారి సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మహేష్రెడ్డి అన్నారు. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒరికెపూడిశెల ప్రాజెక్టును కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొచ్చింది.. రూ.3000 కోట్లు బడ్జెట్ మంజూరు చేయించింది రామకృష్ణారెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. పల్నాడు అభివృద్ధిలో దూసుకుపోయిందని, ఇలా అభివృద్ధి చేయడమేనా? రామకృష్ణారెడ్డి చేసిన పాపం అని బ్రహ్మారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికలు నాలుగు నెలలు ఉందనంగా జంగమహేశ్వరంలో వైఎస్సార్ సీపీ నాయకుడిని, టీడీపీ నాయకులు చంపారని అంతమాత్రాన తాము శ్రీనివాసరావు మీద తప్పుడు కేసులు పెట్టలేదు కదా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి విషయాలను ఎప్పుడూ రాజకీయంగా ఉపయోగించుకోలేదని తెలిపారు. తాము ఎప్పటికీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రామకృష్ణారెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారని, జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడేందుకు తామంతా కష్టపడతామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. -
స్వర్ణం సాధించిన కేఎల్యూ విద్యార్థి ముఖేష్
తాడేపల్లి రూరల్:ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కేఎల్యూ విద్యార్థి స్వర్ణపతకం సాధించినట్లు వర్సిటీ స్పోర్ట్స్ విభాగ డీన్ హరికిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయని, రాజస్థాన్ స్టేట్ షూటింగ్ రేంజ్లో ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కేఎల్యూకి ప్రాతినిధ్యం వహించిన నేలవల్లి ముఖేష్ స్వర్ణ పతకం సాధించాడని తెలిపారు. తమ యూనివర్సిటీ నుంచి తనిష్క్ మురళీధర్ నాయుడు, నాగసాయి తరుణ్ కూడిన బృందం రజత పతకాలు సాధించారని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన ముఖేష్ను రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి. రాజకుమార్, వర్సిటీ పీడీలు గౌతమ్,శ్రీహరి పాల్గొన్నారు. -
విజేతలకు పతకాలు ప్రదానోత్సవం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏడాది జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2025 ఏపీ విజేతలకు ఆదివారం స్థానిక వెల్కమ్ హోటల్లో పతకాల బహుకరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సలాలిత్ తొట్టెంపూడి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపి నుంచి మొత్తం 520 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో 204 పతకాలు సాధించారన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మల్లిఖార్జున నాయక్, కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, రోడిక్ కన్సల్టెంట్ ఎండీ రాజ్కుమార్లు క్రీడాకారులకు అందజేశారన్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకుల అరెస్టు
మాచర్ల రూరల్: గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి బాటిల్స్లో నింపి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 494 గ్రాముల 260 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువకులలో ఒకడైన మచిలీపట్నానికి చెందిన రమణీ అరవింద్, షేక్ నాగూర్ షరీఫ్, షేక్ నజీర్, షేక్ పఠాన్ సిరాన్ ఖాన్, షేక్ సలీం అనే యువకులు ఒడిస్సాలోని చిత్రకొండ పరిసరాలలో గంజాయితో తయారు చేసే హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తెచ్చి మాచర్ల పట్టణ, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నారు. రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా నేతృత్వంలో వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్ తనకు వచ్చిన సమాచారంతో మండాదిలోని కానాగు వాగు దగ్గరకు సిబ్బందితో వెళ్లారు.అక్కడ గంజాయి ఆయిల్ను 5ఎం.ఎల్. బాటిళ్లలో నింపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువకులు సులభమార్గంలో డబ్బులు సంపాదించేందుకు విద్యార్థులు, యువకులను టార్గెట్గా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలేజీలలో అవగాహన కార్యక్రమాలతో పాటు యాజమాన్యంతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ షేక్ నసీబ్ బాషా, వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్, సిబ్బందిలను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. వీరికి రివార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. 494 గ్రాముల లిక్విడ్ స్వాధీనం -
13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా క్ట్రెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
బాలోత్సవంలో సందడే.. సందడి
●ఆకట్టుకున్న దేశభక్తి, జానపద గీతాలు ●కోలాటంతో కదం తొక్కిన బాలలు నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆకట్టుకుంది. చిన్నారులు సృజనాత్మకత, నైపుణ్యాలు వారిలో ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చాయి. పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మూడవ పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజు ఆదివారం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగాయి. చిన్నారులు జానపద వేషధారణలతో మైమరిపించారు. కళాశాల ప్రాంగణం బాలల కేరింతలు, చిన్నారుల నవ్వులతో నిండిపోయింది. ముఖ్య అతిథులుగా ఎంఏఎం కళాశాలల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, ఎస్ఎస్ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామినేని వినోద్కుమార్రెడ్డి హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కోలాటం, లఘు నాటికలు, జానపద నృత్యం–గ్రూపు, పాటలు, స్పెల్ బీ, ప్రాజెక్ట్ పని, రంగ వల్లులు, బుర్రకథ, కథ చెప్పడం, తెలుగు పద్యాలు, అభినయ గేయాలు, దేశభక్తి గేయాలు, రైమ్స్, విచిత్ర వేషధారణ, మెమరీ టెస్ట్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, వక్తృత్వం, మ్యాథ్స్ క్విజ్, మట్టితో బొమ్మలు తయారీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటికలు, పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయాల్లోనూ ప్రతిభ కనబరిచారు. నృత్య ప్రదర్శనల్లో బాలలు -
డాక్టర్ జున్ను సాహెబ్కు డబుల్ ధమాకా
●కొండవీడు హైస్కూల్ టీచర్కు రెండు అవార్డులు ●రెండురోజులు రెండు సంస్థల నుంచి అందుకున్న జాతీయ పురస్కారాలు యడ్లపాడు: కొండవీడులోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ షేక్ జున్ను సాహెబ్కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయస్థాయి పురస్కారాలను అందించాయి. విద్య, మానవ సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు ఆమె అందుకున్నారు. ఇందులో విద్యార్థులకు వినూత్న బోధన, చేతిరాత నైపుణ్యాలు, గ్రీన్ వారియర్స్ పేరిటా అందించిన సేవలకు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘జాతీయ ఉపాధ్యాయ ప్రేరణ అవార్డ్స్–2025’ శనివారం అందుకున్నారు. పేదలకు నిస్వార్థ సహాయం, విద్యార్థులకు కాలిగ్రఫీ ఉచిత శిక్షణ ఉద్యమం, జీవ వైవిధ్య అవగాహన రంగాలలో చేసిన విశేష కృషికి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో ‘ఉత్తమ్ భారత్ పురస్కార్ 2025’ను ఆదివారం అందించింది. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కుమార్, ఎంపీ మల్లు రవి, బయో డైవర్సిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమల మనోహర్, జీహెచ్ఆర్టీ వ్యవస్థాపకులు షేక్ రెహమాన్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు. అతిథులు జున్నుసాహెబ్ నిబద్ధత, సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. అవార్డు గ్రహీత జున్నుసాహెబ్ మాట్లాడుతూ ఈ పురస్కారాలతో బాధ్యత మరింత పెరిగిందని, తన సంకల్పాన్ని మరింత విస్తరింపజేస్తానని చెప్పారు. పలువురు విద్యవేత్తలు, ప్రముఖులు, సహోపాధ్యాయులు జున్ను మాస్టారుకు అభినందనలు తెలిపారు. -
కుక్కలు తిన్నాకే తినాలా?
నూజండ్ల: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేర్టేకర్ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. -
దయచేసి ధాన్యం కొనండి !
రైతుల వేడుకోలు కారెంపూడి: మండలంలో వరి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, పంట చేతికొచ్చినా రైతుల మొహంలో నవ్వులేదు. ధాన్యం కొనే దిక్కు లేదు. బీపీటీ, కేఎన్ఎం రకాలను వ్యాపారులు అసలు అడగడం లేదు. ఒక వేళ అడిగినా రూ.1,200లోపు 75 కేజీల బస్తా అడుగుతున్నారు. నిల్వ చేసుకునే అవకాశం, ఆర్థిక వెసులుబాటు లేని రైతులు ఆ ధరకే తెగనమ్ముతున్నారు. ఇంత తక్కువ రేటుకు అమ్మితే మిగులు ఉండదని దిగులు చెందుతున్నారు. ఎకరానికి సగటు దిగుబడి 35 బస్తాలు వస్తున్నాయి. ఎరువుల కొట్లలో బాకీలుంటే మాత్రం వారు ఏదో ఒక రేటుకు కొంటున్నారు. కాని మిగిలిన రైతులు వ్యాపారులను బతిమిలాడుకుని అమ్ముకుంటున్న పరిస్ధితులు కూడా తలెత్తుతున్నాయి. దిగుబడి ఉన్నా ధర లేదు మండలంలో 18 వేల ఎకరాలలో ఖరీఫ్లో వరి సాగైంది. ప్రస్తుతం మండలంలో సగం దాకా వరి నూర్పిళ్లు పూర్తయ్యాయి. అయినా కూడా ధర మాత్రం పెరగడం లేదు. చిట్టిపొట్టి రకం ధాన్యం మాత్రం బస్తా రూ.1,650 దాకా పలుకుతోంది. ఆరబెట్టకుండా ఉన్న బస్తా కనీసం రూ.1,500 లేకపోతే గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధర అయినా కల్పించాలని వేడుకుంటున్నారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని తాము గతంలో చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం బాధను బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్ధితి కన్పిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్ఎస్పీ కాలనీ గురుకుల పాఠశాల వద్ద ఒక చిన్నకారు రైతు బస్తా రూ. 1,300కు అమ్మానని వాపోయాడు. ఎకరాకు 35 బస్తాలయ్యాయని ఈ రేటుకు రెక్కల కష్టం కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగైతే వ్యవసాయం చేయడం కంటే కూలికి పోవడం మేలని సాటి రైతుకు చెప్పి వాపోయాడు. ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు. గ్రామాల్లో ధాన్యం రాసుల కళకళలతో ఆనందంగా ఉండాల్సిన రైతులు ధాన్యం కొనే దిక్కు లేరని బాధపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. మద్దతు ధర కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శని, ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. దీంతో లాంచీ స్టేషన్కు లక్షా 20 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె మస్తాన్బాబు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. -
నవోదయ మోడల్ టెస్టుకు 150 మంది హాజరు
నరసరావుపేట: జిల్లాలోని విద్యార్థులు ప్రతిభ, విద్యానైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆదివారం కేర్ పబ్లిక్ స్కూలులో జవహర్ నవోదయ విద్యాసంస్థల ఆరో తరగతి ప్రవేశానికి మోడల్ టెస్ట్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 150 మందికిపైగా విద్యార్థులు హాజరై మోడల్ పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ షేక్ నాగూర్వలి పేర్కొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్య ప్రాముఖ్యత వివరిస్తూ ఒక వ్యక్తి జీవితం సమూలంగా మార్చే ఆయుధం విద్యకు ఉందన్నారు. మోడల్ టెస్టులో ప్రథమ విజేతగా నిల్చిన రొంపిచర్లకు చెందిన ఎన్ హర్షిణికి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు సాధించిన ఒంగోలుకు చెందిన డి.అశ్రీత్, మూడవ బహుమతి రూ.3వేలును బొగ్గవరానికి చెందిన జి.సహస్రకు శాసనసభ్యులు అందజేశారు. ఛైర్మన్ కె.కోటిరెడ్డి, కరస్పాండెంట్ కె.జ్ఞానసుందరి, డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, రిటైర్డు అధ్యాపకులు కె.రాజారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గన్నవరం: జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్ జిల్లాల రగ్బీ అండర్–14 చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్కు చేరాయి. -
స్వాహా..!
పల్నాడుసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అసైన్డ్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల్లో ఎవరి భూములు ఎక్కడ అనే దానిపై రైతులకు స్పష్టత లేదు. భూ ఆక్రమణదారులు మాత్రం ప్రధాన రహదారికి ఒక పక్కన ఉన్న చెరువులను మొత్తం ఆక్రమించి చెరువు కట్టలను ధ్వంసం చేయడంపై పలువురు రైతులు ప్రశ్నించారు. దీంతో ఈ ముఠా సభ్యులు వారిపై బెదిరింపులకు దిగారు. అధికారం మాది.. మేం చెప్పినట్టు వింటే డబ్బులు వస్తాయి లేకుంటే మీ భూమి కూడా మీకు ఉండదు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. భూముల ఆక్రమణ వెనుక పెద్దల హస్తం ఉందని భావించిన రైతులు దీనిపై మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. నరసరావుపేట రూరల్: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములపై అధికారపార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. మాయమాటలతో పేదలను లోబర్చుకుని నామమాత్రంగా డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. 20 ఎకరాలకు పైగా ఇప్పటికే భూ బకాసురుల చేతుల్లోకి వెళ్లగా భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. మండలంలోని పమిడిమర్రు గ్రామంలోని వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో గ్రామంలోని పేదలకు ఈ భూములను కేటాయించారు. సర్వే నెంబరు 44, 45లో దాదాపు 92 మంది రైతులకు 82 ఎకరాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆధీనంలోనే భూములు ఉన్నాయి. రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ఎవరి భూమి ఎక్కడ అనేది అధికారులు చూపలేదు. దీంతో రైతులు ఉమ్మడిగా చేపల చెరువుల నిర్వాహకులకు కౌలుకు ఇచ్చి ప్రతి ఏడాది కౌలు పొందుతున్నారు. పేదలకు కేటాయించిన భూముల్లో ఉన్న చేపల చెరువులను ఆక్రమణదారులు పొక్లెయిన్లతో పూడ్చివేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా గ్రామంలో భూ ఆక్రమణదారుల హడావుడి నెలకుంది. ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో చెరువు కట్టలను పగులకొట్టి భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఇదే విధంగా చదును చేశారు. పమిడిమర్రులో ఆక్రమణకు గురవుతున్న భూములు విలువ ఎకరం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణదారులు రైతులకు ప్రస్తుతం ఎకరానికి రూ.50వేలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. విడతల వారీగా ఎకరానికి రూ.2లక్షలు చెల్లిస్తామని నమ్మించి భూములను ఆక్రమిస్తున్నారు. పొక్లెయిన్తో చేపల చెరువు కట్టలను ధ్వంసం చేస్తున్న దృశ్యం 7పమిడిమర్రు నుంచి కాకాని జేఎన్టీయూఎన్కు వెళ్లే దారిలో ఉన్న ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఒక్క చోటే ఉండటంతో దీనిని సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. గ్రామంలోని టీడీపీ నాయకుడిని రంగంలోకి దింపి పేదలకు డబ్బు ఆశ చూపి భూములను సొంతం చేసుకుంటున్నారు. గ్రామంలోని టీడీపీ నాయకుడితో పాటు పట్టణానికి చెందిన దళిత సంఘం నాయకుడు ఇందులో కీలకపాత్ర పొషిస్తున్నారు. దళితులకు చెందిన భూములు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెరమీదకు తెచ్చి ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికి 20 మందికి పైగా రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు కేటాయించిన భూములు కొనుగోలు చేసిన వారికి ఆ భూములపై ఎటువంటి హక్కు ఉండదు. అసైన్డ్ భూముల విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాలరావు, తహసీల్దార్ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం. -
కష్టాల ‘ప్లాజా’ !
● బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లు ● ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేయించిన అధికారులు ● అంబులెన్సులు సైతం క్యూలో రావల్సిందేనంటూ హుకుంమార్టూరు: జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు, సిబ్బంది తీరుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి సంవత్సరానికి రూ.కోట్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా.. వారి అవసరాలకు సరిపడా సౌకర్యాలను సమకూర్చడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మరో కొత్త సమస్యకు తెర లేపడం గమనార్హం. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఫ్రీ లెఫ్ట్ పేరుతో రెండు మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వీవీఐపీల వాహనాలు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కలెక్టర్, కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారుల వంటి అత్యవసర వాహనాలు టోల్ ఫీజుతో సంబంధం లేకుండా వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు టోల్ ప్లాజా పరిసర గ్రామాలకు చెందిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం లోకల్ పాస్తో ఈ మార్గాల్లోనే వెళ్లి పోతుంటాయి. ఈ కారణంగా ఈ అత్యవసర వాహనాలు ఆలస్యం లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదు. ● అదే రోజు అర్ధరాత్రి మార్టూరు వైపు నుంచి ఒంగోలుకు రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ ఫ్రీ లెఫ్ట్ మార్గం మూసి వేసి ఉండటంతో మిగిలిన వాహనాలతో పాటు క్యూలోనే ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధులే అంబులెన్సకు దారి వదులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బొల్లాపల్లి టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇందుకు మినహాయింపులాగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఈ విషయమై సిబ్బందిని వివరణ కోరగా.. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఆదేశాలతో తాము ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా టోల్ ప్లాజా ఉన్నతాధికారులు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది సైతం కోరటం విశేషం. -
అత్యవసర వాహనాలు సైతం క్యూలోనే..
గత నెల రోజులుగా ఫ్రీ లెఫ్ట్ మార్గాలను రెండు వైపులా అధికారులు సిబ్బందితో మూసి వేయించారు. దీనివలన అత్యవసరంగా వెళ్లవలసిన వాహనాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతుల వాహనాలు సైతం మిగిలిన వాహనాలతో పాటు ప్లాజా రూటులోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణంలో జాప్యం పెరిగి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటిలాగే ఫ్రీ లెఫ్ట్ మార్గంలోనే వెళ్తామంటూ సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు గత గురువారం ట్రాక్టర్తో ఆ మార్గానికి అడ్డుగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రైతులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ఆ మార్గంలో ఉంచిన అడ్డంకులను తొలగించకపోవడం గమనార్హం. -
హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం
పల్నాడు జిల్లా: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా ్రక్టెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైసూ్కల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
AP: కుక్కలు తిన్నాకే తినాలా?
పల్నాడు జిల్లా: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేర్టేకర్ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యారి్థనులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. -
అక్క కంట నీరు చూడలేక..బావ, అత్త హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు (30), కృష్ణకుమారి (55)పై మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. కత్తులతో పొడిచి, నరికి చంపేశారు. స్థానికుల కథనం మేరకు.. ధూళ్లిపాళ్ల గ్రామానికి చెందిన దొప్పలపూడి వీరయ్య, కృష్ణకుమారి దంపతులకు కుమారుడు సాంబశివరావు, కుమార్తె మౌనిక ఉన్నారు. మౌనికను ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.తాడికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాంబశివరావుకు 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితితో వివాహం చేశారు. సాంబశివరావు, సాహితి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్లపాటు కేసులు పెట్టుకుని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో ఆరునెలల కిందట విడాకులు తీసుకున్నారు. సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికి ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం నిత్యావసర సరుకులు తీసుకుని ధూళ్లిపాళ్ల వచ్చాడు. తన సోదరిని హింసించారని.. తన సోదరి వైవాహిక జీవితంలో భర్త, అత్త, మామ కలిసి శారీరకంగా, మానసికంగా వేధించారని వారిపై సాహితి సోదరుడు చెరుకూరి రోహిత్చౌదరి కక్ష పెంచుకున్నాడు. ఆ ముగ్గురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్తిపాడు మండలం చోడవరంలోని కళ్లం హరినాథ్రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రోహిత్చౌదరి.. చిలకలూరిపేటలోని పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లో తనకు స్నేహితులైన ఇద్దరు బాలురకు ఈ విషయం చెప్పాడు.గుంటూరు నారాయణ జూనియర్ కళాశాలలోను, చిలకలూరిపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలలోను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ ఇద్దరితో కలిసి హత్యలకు పథకం వేశాడు. ఆదివారం సాంబశివరావు ధూళ్లిపాళ్లలో ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న రోహిత్చౌదరి తన స్నేహితులిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ ఇంటివద్దకు చేరుకున్నాడు. సాంబశివరావు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా, తల్లి కృష్ణకుమారి ఇంట్లోనే ఉంది. ఒక్కసారిగా మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. వారిద్దరిని కత్తులతో పొడిచి, తలపై నరికి.. ద్విచక్రవాహనంపై పరారయ్యారు. సాంబశివరావు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.కొన ఊపిరితో ఉన్న కృష్ణకుమారిని స్థానికులు 108 వాహనంలో సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైనవైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు చెప్పారు. అప్పటివరకు ఇంట్లో ఉన్న దొప్పలపూడి వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.హైమారావు, ఎస్ఐ షేక్ అమీరుద్దీన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సాంబశివరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు ఇంట్లో ఉన్న తల్లి, కుమారులను దారుణంగా హత్యచేయడం కలకలం సృష్టించింది. పరారైన ముగ్గురు నిందితులను గ్రామస్తులు, పోలీసులు కలిసి నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో పట్టుకున్నట్లు తెలిసింది. -
కృష్ణాలోకి కెమికిల్!
దాచేపల్లి: కృష్ణానదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు ప్రజలను కలవర పెడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట గ్రామాల వద్ద కృష్ణానదిలో ఇటీవల భారీగా రసాయనాల తెట్టుని స్థానికులు గుర్తించారు. నీటిపై రంగురంగులుగా రసాయనాల తెట్టు తేలియాడుతూ దిగువకు వెళుతోంది. కొన్నిచోట్ల నది ఒడ్డుకు వచ్చి పేరుకుపోయింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నదిలోని నీరు రంగు మారిపోయింది.రకరకాల రంగులు, కెమికల్స్ కలిసి ఉండటంతో ఆ తెట్టు పేరుకుపోయిన ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోంది. తెట్టు ఉన్న ప్రాంతంలో నీటిని పట్టుకుంటే చేతులు మంటలు వస్తున్నాయని నదిలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు చెబుతున్నారు. దాచేపల్లి మండల పరిధిలో ఉన్న కెమికల్, సిమెంట్ పరిశ్రమల నుంచి రసాయనాల వ్యర్థాలు తెచ్చి నదిలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నీటిని తాగితే ప్రాణాలు పోతాయని భయాందోళనలకు గురవుతున్నారు.ఆ నీరే ప్రజలకు సరఫరా కృష్ణానది నుంచి తంగెడ గ్రామంలోని సుమారు 6వేల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా నదిలో నీటిని పంపింగ్ చేసి పైపుల ద్వారా ట్యాంకుల్లో నింపి అక్కడ నుంచి కుళాయిల ద్వారా తాగునీటిని ఇళ్లకు సరఫరా చేస్తారు. కొద్ది రోజులుగా కృష్ణానదిలో రసాయనాల తెట్టు ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ఆ నీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డునే ఏలియంపేట గ్రామం ఉంది. ఇక్కడున్న 50 కుటుంబాలవారు నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు పూర్తిస్థాయిలో కృష్ణానది నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు నదిలోని నీటిని తాగుతున్న వారంతా తమకు ఏమవుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు కృష్ణానదికి అవతలి వైపు ఉన్న తెలంగాణలోని కొన్ని గ్రామాల వెంట కూడా నదిలో ఈ రసాయనాల తెట్టు కనిపిస్తోంది.అధికారుల ఆరా... నది నుంచి నీటి సరఫరా నిలిపివేత కృష్ణానది నీటిలో రసాయనాలు కలవటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్కడ నుంచి అయినా రసాయనాలు తెచ్చి ఇక్కడ నదిలో వదిలేశారా? దాచేపల్లి మండల పరిధిలో ఎక్కువగా ఉన్న కెమికల్, సిమెంట్ పరిశ్రమల వారే వ్యర్థ రసాయనాలను నదిలో కలిపేశారా? అనే దానిపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు విభాగాల అధికారులు ఆదివారం తంగెడ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామానికి నది నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. గ్రామంలోని బోర్ల ద్వారా నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.


