breaking news
Palnadu
-
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తెనాలి టౌన్: అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి మాట్లాడుతూ ఈకేవైసీ, ఫేస్ రికగ్నేజేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వలన లబ్ధిదారులకు సకాలంలో ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నట్లు ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల వలన నెట్వర్క్ సరిగా పనిచేయక లబ్ధిదారులు ఒకటికి మూడు సార్లు అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో లబ్ధిదారులకు ఫీడింగ్ ఇవ్వడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం సీడీపీవో విజయగౌరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె.రంగపుష్ప, రాధిక, రాజకుమారి, రామలక్ష్మి, రాహెలమ్మ, ఎస్కే ముని, వహీదా, సీహెచ్ శివకుమారి, కె.మాధవి, డి.కళ్యాణి, ఎం.సుజాత, వై.నాగమల్లేశ్వరి, కె.లక్ష్మి , బుల్లెమ్మ, ఎలిజిబెత్ రాణి, రమాదేవి, త్రివేణి, అలిషా బేగం, జ్యోతి, సునీత, రజియా తదితరులు ఉన్నారు. -
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇళ్ల పట్టాల మీద లోన్ ఇస్తామని పేదలను నమ్మించి ఇంగ్లీషులో ఉన్న అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. 12 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వరకు వసూలు చేస్తూ పేదలను పీడిస్తున్నారన్నారు. రాత్రి ఆరు గంటల తర్వాత లోన్ రికవరీ పేరుతో మహిళలకు ఫోన్ చేసి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధిత మహిళలు సింధు దేవి, తిరుపతమ్మ, కృష్ణంరాజు, దుర్గాప్రసాద్, మోషే, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట తిపాఠి ఆదేశించారు. గుంటూరు పశ్చిమ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, కేసు డైరీలు, క్రైమ్ రిజిస్టర్, పెండింగ్ కేసుల ఫైల్స్, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నిందితుల అరెస్టులు, కోర్టు హాజరు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ నేర నిరోధక చర్యలను మరింత వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు త్వరగా న్యాయస్థానాల్లో శిక్షలు అమలయ్యేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ల కార్యకలాపాలలో పారదర్శకత చూపాలని ఆదేశించారు. క్రమ శిక్షణ, సంక్షేమంపై దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్, పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం, అరండల్పేట, నగరంపాలెం పీఎస్ల సీఐలు పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశం -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ, యాజమాన్యం పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు. ఎండు తెగులు ఆశించిన జామ చెట్లకు 1గ్రా. కార్బెన్డజిమ్ లేదా 3గ్రా.కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి చెట్టు మొదట్లో పోయాలని తెలిపారు. జింక్, మెగ్నీషియం ధాతు లోప నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్, 2గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల హార్టీకల్చర్ ఆఫీసర్ అంజలి బాయి, విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ కరుణ కుమారి, ప్రభాకర్ రెడ్డి, సాగర్ బాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బి. ఆగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నాడు అండగా వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారన్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన పొగాకు కొనుగోళ్లపై మండిపాటు
నాదెండ్ల: పొగాకు కొనుగోళ్లు మందకొండిగా సాగుతుండటంతో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని నాయకులు అధికారులపై మండిపడ్డారు. చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కె. బంగారురాజు, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్లు నరసింహారెడ్డి, రమేష్, యార్డు కార్యదర్శి తిరుపతిరాయుడు సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ షేక్ కరిముల్లా, తెలుగు రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు, మండల నాయకులు మదన్మోహన్, సాయిబాబు, యార్డు డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి పొగాకు కొనుగోళ్లపై అధికారులను ప్రశ్నించారు. రెండు నెలలుగా కొనుగోలు జరుగుతున్నా ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదని, ఇంకా కొనాల్సిన పొగాకు ఎక్కువగా ఉందని తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున, రైతులు పొగాకు అమ్ముకునేందుకు యార్డు వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు రైతులకు దక్కడం లేదని తెలిపారు. ఇప్పటి వరకూ చిలకలూరిపేట ప్రాంతంలో 15–20 వేల క్వింటాళ్ల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 90 వేల క్వింటాళ్లకు పైగా పొగాకు రైతుల వద్ద నిల్వ ఉందని, కొందరు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సి వచ్చిందని వివరించారు. అధికారులు త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ బంగారురాజు ఎదుట నాయకులు, రైతుల ఆక్రోశం -
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్ఈ ప్రత్తిపాటి విజయ్కుమార్ తెలిపారు. కార్యాలయంలో గురువారం పోటీల్లోని విజేతలు పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, సన్నిబోయిన రామాంజినేయులు, అచ్యుత్, మల్లికార్జున్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అంకితభావంతో విధుల నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించటం ప్రశంసనీయమని తెలిపారు. మానసిక వికాసం, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పిన్నబోయిన వెంకటేశ్వరరావు ఎంపిక కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో డీఈ రాంబొట్ల, ఏడీఏ భవనం వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సంపెంగుల గాంధీ ఉన్నారు. -
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ట్రయాండ్ సిటీ హోటల్లో గురువారం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం నాయకుల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక చట్టం వల్ల బీసీలకు రక్షణతో పాటు వారిపై వివక్షను సమూలంగా అరికట్టగలదని నమ్మకం వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం నియమించిన అన్ని కమిషన్లు రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు సామాజికం, ఆర్థికం, రాజకీయంగా వెనకబాటులో ఉన్నారని పేర్కొన్నాయని తెలిపారు. బీసీ నిరుద్యోగుల కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల విద్యాలయాలు, స్టడీ సర్కిళ్లు, వసతి గృహాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరిన సంఘ నాయకులు -
అమరావతిలో సూపర్వైజరీ కమిటీ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతిలో కేంద్ర పర్యావరణం, అటవీ– వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అమన్దీప్ గార్గ్ తదితరులు గురువారం పర్యటించారు. తొలుత ఉండవల్లిలోని రివర్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్, కొండవీటి వాగు వరద పంపింగ్ స్టేషనును పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్లు ఇక్కడి ఏర్పాట్లను ఆయనకు వివరించారు. సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ఆధ్వర్యంలో అమరావతిలో వరద నిర్వహణ చర్యల నిమిత్తం ప్రస్తుతం అమలవుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యకలాపాలు, ప్రణాళికలపై సూపర్వైజరీ కమిటీ తరఫున విచ్చేసిన అమన్దీప్ గార్గ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. అనంతరం అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, గ్రీనరీ, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి పనుల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. అనంతరం అధికారులతో కలసి అమన్దీప్ గార్గ్ అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల కోసం నిర్మించిన భవనాల సముదాయాలను సందర్శించారు. నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని ట్రాన్స్లొకేటెడ్ నర్సరీని అమన్దీప్ గార్గ్ సందర్శించారు. అనంతరం అమరావతి సచివాలయంలో సూపర్వైజరీ కమిటీతో సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులలోని మరొక ముగ్గురు అధికారులు ఆన్లైన్ ద్వారా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనాల పనులలో పురోగతి, రాజధాని ప్రాంత నివాసితులకు అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణకు చేపట్టిన కార్యకలాపాలు, కార్మికులు, మహిళల భద్రతకు అమలవుతున్న చర్యల గురించి సీఆర్డీఏ అధికారులు వారికి వివరించారు. సమావేశంలో ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభా ష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. 21 కిలోల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన అక్షయ గౌతమి(20), షేక్ మహమ్మద్ జాకీర్ (19), ఒంగోలుకు చెందిన పెర్లి విజయవర్ధన్ రాజు (25)గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. వీరు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభా ష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు. -
దుర్వాసన.. నరకయాతన
నరసరావుపేట టౌన్: షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారుల ఇష్టారాజ్యం.. అధికారుల నిర్లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ దుర్గంధంగా మారింది. రైతులు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. దుకాణాల్లో వినియోగించిన వ్యర్థపు నీటిని మార్కెట్ యార్డులోకి వదులుతుండటంతో ఆవరణంతా కంపుగొడుతోంది. దుకాణాల ముందున్న మురుగు కాల్వను ఆక్రమించి వ్యాపారాలు నిర్మాణాలు చేపట్టారు. మురుగు పారేందుకు దారి లేదు. దుకాణాల వెనుక పైపులైన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా వినియోగించిన నీటిని పంపుతున్నారు. అయితే పైపులు లీకై మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో యార్డు పరిసరాలంతా దుర్వాసన వెదజల్లుతోంది. రైతులకు అవస్థ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మురుగు సమస్య ఎప్పటి నుంచో ఉన్నా శాశ్వత పరిష్కారంపై అధికారులు దృష్టి సారించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో పంటల అమ్మకానికి రావాలంటే నరకయాతన తప్పటం లేదని రైతులు వాపోతున్నారు. దుర్వాసనలో రోజంతా కూర్చోలేక పోతున్నామని వాపోతున్నారు. అధికారులకు సైతం తప్పని తిప్పలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజా పంపిణీ బియ్యం నిల్వ చేసే ఎంఎల్ఎస్ పాయింట్తో పాటు భూసార పరీక్ష కేంద్రం, అగ్రి టెస్ట్ ల్యాబ్, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం, 108 డివిజనల్ కార్యాలయం, ఈవీఎంలు భద్రపరిచిన గోదాం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వెనుక భాగం నుంచి ప్రతిరోజు పైప్లైన్ ద్వారా వృథా నీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో అక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది, హమాలీలు దుర్గంధానికి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అనారోగ్యానికి గురవుతున్నామని పలువురు కార్మికులు వాపోతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం ప్రతిరోజు వచ్చే వందల మంది సైతం మురుగు దుర్వాసనకు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. వ్యర్థ జలాలు పారకుండా ఆక్రమణ మార్కెట్ యార్డు దుకాణ సముదాయానికి, రోడ్డుకు మధ్యలో 50 అడుగుల ఖాళీ స్థలం ఉంది. అక్కడ గతంలో మురుగు పారేందుకు సైడ్ కాల్వ ఉండేది. కాలక్రమేణా దుకాణదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. మురుగు తొలగించేందుకు అవకాశం లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో దుకాణదారులు వెనుక భాగంలో పైప్లైన్ ఏర్పాటు చేసి వ్యర్థ జలాలను మార్కెట్ యార్డులోకి వదులుతుండటంతో సమస్య జటిలంగా మారింది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి, మురుగు కాల్వను మెరుగు పరచాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు దుకాణ సముదాయ నిర్వహణ ఆ శాఖ అధికారులే చూసుకోవాలి. కాల్వను ఆక్రమించిన విషయంపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. గతంలో అక్కడ మురుగు కాల్వ ఉంటే దాన్ని పునరుద్ధరించి సక్రమంగా పారేలా చూస్తాం. జస్వంత్రావు, మున్సిపల్ కమిషనర్ -
రియల్టర్ దందా.. అడ్డుకట్ట ఉందా ?
నరసరావుపేట రూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రమణలకు వాగులు, వంకలు, కాలవలు.. కాదేది అనర్హం అన్నట్టుగా నరసరావుపేటలో పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు పూర్తి సహకారం అందిస్తుండటంతో వీరి ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నూతనంగా జిల్లాగా ప్రకటించిన తరువాత నరసరావుపేటలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రూ. లక్షలో ఉన్న ఎకరం భూమి రూ.కోట్లకు చేరింది. నరసరావుపేట పట్టణం సమీపంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించింది. వందలాది ఎకరాల్లో వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. పొలాల్లోని పంట కాలువలను కూడా వెంచర్ల నిర్వాహకులు పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పంట కాలువలు పూర్తిగా మూసివేయడంతో సాగునీరు అందక రైతులు పలు చోట్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. కాకానిలో మూడు ఎకరాలకు పైగా ఆక్రమణ నరసరావుపేట మండలంలోని కాకాని సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ భూములను కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. కాకాని సమీపంలో జేఎన్టీయూఎన్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో అనేక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేశాయి. ఈ భూములకు సమీపంలో ఉన్న వరద కాలువను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పూర్తిగా ఆక్రమించింది. 505డీఏ1ఏ సర్వే నంబర్లో ఉన్న ఈ వరద కాలువ దాదాపు రెండున్నర ఎకరాల్లో ఉంది. లక్ష్మీపురం, కాకాని పంట పొలాల్లోని వర్షం నీరు ఈ కాలువ ద్వారా ప్రవహించాల్సి ఉంది. దిగువున నీటిని నిల్వచేసేందుకు చెక్ డ్యామ్ కూడా నిర్మించారు. దాదాపు 50 ఎకరాలకు పైగా పంట పొలాలకు ఈ చెక్డ్యామ్ నీరే ఆధారం. వెంచర్ ఒక వైపు కనిపిస్తున్న వరద కాలువ మధ్యలో అక్రమణకు గురైంది. మరో వైపు చెక్ డ్యామ్ ఉన్నా అక్కడకు నీరు వచ్చి చేరే అవకాశం లేకుండా రియల్ వ్యాపార సంస్థ ప్లాట్లు వేసి గోడను నిర్మించింది. మౌలిక సదుపాయాల కోసం వెంచర్ నిర్వహకులు దాదాపు ఎకరం ఖాళీ స్థలాన్ని కేటాయించారు. అసైన్డ్ ల్యాండ్ను ఆక్రమించి అదే భూమిని మౌలిక సదుపాయాలు కోసం కేటాయించినట్టు అధికారులకు చూపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అసైన్డ్ ల్యాండ్ను ఆక్రమించి వెంచర్ వేసిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. –కె. మధులత, ఆర్డీఓ, నరసరావుపేట -
చోర్.. పల్నాడు బేజార్ !
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో దొంగలు చెలరేగిపోయి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. దొంగతనాలు చేసే క్రమంలో పాశవికంగా ప్రాణాలు కూడా తీస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా చేసుకుని హత్యలు, చోరీలు చేయడం ఆందోళనకరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వినుకొండ పట్టణ పరిఽధిలో ఏకంగా ముగ్గురు మహిళలను హత్య చేసి దొంగలు చోరీలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గురువారం వినుకొండ పట్టణంలో ఒంటిమీద బంగారం కోసం మహిళను హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. కళ్యాణపురి కాలనీలో ఉదయం ఆలపాటి పుష్పలత(39) ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, ఆమెను చంపాడు. ఒంటిపై ఉన్న బంగారపు అభరణాలు తీసుకెళ్లినట్టు మృతురాలి భర్త తెలుపుతున్నాడు. పట్టణంలో గతేడాది జూన్ 19న కోటిరత్నం(75) , ఈ ఏడాది మార్చి 17న కొప్పరపు సావిత్రి(69)లను హత్య చేసి, దొంగతనాలకు పాల్పడ్డారు. దాదాపుగా అదే తరహాలో వినుకొండలో మూడో హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురజాల సబ్ డివిజన్లో వరుస చోరీలు గురజాల సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో వరుస దొంగతనాలతో దొంగలు హడల్ పుట్టించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారే లక్ష్యంగా గురజాల పట్టణంలో మూడు, పులిపాడు గ్రామంలో ఆరు, నడికుడి, శ్రీనివాసపురం గ్రామాల్లోని పలు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలను పగలగొట్టి మరీ ఇళ్లలో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల , రెంటచింతలలో వరుస దొంగతనాలు చేశారు. ఈ దొంగతనాలు ఒకే ముఠా చేశాయని, నార్త్ ఇండియాకు చెందిన ఈ దొంగలు సాయంత్రం రైళ్లలో దిగి రాత్రిపూటి దొంగతనాలు చేసి, తెల్లవారుజామున తిరిగి వెళ్లిపోతారని విచారణలో పాల్గొన్న పోలీసులు తెలుపుతున్నారు. ఈ ముఠాలను అరికట్టడంలో వారు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో రెక్కీ పల్నాడు జిల్లాలో కీలకమైన రైల్వేలైన్ అయిన గుంటూరు–బీబీనగర్ లైన్లో ముఖ్యంగా పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన పార్థీ గ్యాంగ్, సోలాపూర్, మీర్జాపూర్, జూమ్కేడ్, బీడ్ తదితర ప్రాంతాలకు చెందిన నేరస్తులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి, రైలు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దొంగతనాలకు లోకల్ పోలీసులకు సంబంధం ఉండదు. రైల్వే పోలీసులే విచారణ జరుపుతారు. అయితే, దొంగతనాలకు ముందు ఆయా ముఠాలు రైల్వే స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సంచరించి, రెక్కీ నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ గట్టిగా పనిచేస్తే వారి సంచారాన్ని గుర్తించి దొంగతనాలు జరగకముందే అరెస్ట్ చేసే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులుపెట్టి వేధించడానికే సిబ్బందిని వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఖాకీలు బిజీగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలు అధికమయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలతో వరుసగా పోలీసులు హైకోర్టుతో చివాట్లు తింటున్నారు. అయినా, వారి తీరులో మార్పు రావడం లేదు. పోలీసులు ఇప్పటికై నా జిల్లాలో దొంగతనాలు, హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అధికారుల కుమ్మక్కు
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఆక్రమించుకున్న అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో ఉంది. దీంతో సదరు సంస్థ సర్వే నంబరు మార్చి దర్జాగా ప్లాట్లను విక్రయించింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించారు. అసైన్డ్ భూమి ఆక్రమణలో గతంలో ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన వ్యక్తి కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. ఆయన ఆశీస్సులతోనే ఈ వ్యవహరాన్ని నిశ్చింతంగా పూర్తి చేశారని సమాచారం. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. వరద కాలువను ఆక్రమించి ప్లాట్లు వేసి, వాటిని బహిరంగ మార్కెట్లో సెంటు రూ.3లక్షల వరకు సంస్థ అమ్మేసింది. -
ఓట్ల తొలగింపు అన్యాయం
దాచేపల్లి : త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి గెలుపు కోసమే వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని మూడో వార్డుకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత ఓటరు జాబితాలో 1,596 ఓట్లు ఉన్నాయి. తాజాగా అధికారులు తయారు చేసిన జాబితాలో 1,112 ఓట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా వెలువరించిన జాబితాలో 484 ఓట్లు మాయం అయ్యాయి. వీటిల్లో అత్యధికంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లే ఉన్నాయి. విషయం తెలుసుకున్న నేతలు గురువారం నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 3వ వార్డులో తమ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లు 484 మాయం చేశారని, కూటమి అభ్యర్థిని గెలిపించడం కోసమే అధికారులు కుమ్మకై ్క ఈ కుట్ర చేశారని ఆరోపించారు. కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని నేతలు చెప్పారు. వినతి పత్రం అందించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్ సుభాని, కోట కృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్లు చాట్ల క్రాంతికుమార్, నగుబండి గురువులు, ఈదా వెంకటరెడ్డి, దేవళ్ల రఘు, నాయకులు కొప్పుల కృష్ణ, కుందూరు తిరుపతిరెడ్డి, కోలా జంపాల రెడ్డి, కోలా శ్రీనివాస్ రెడ్డి, షేక్ సైసావల్లి, డాడీ, కోలా నరసింహారెడ్డి, పాపా ఉన్నారు. ● వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు ● వైఎస్సార్ సీపీ నేతల న్యాయ పోరాటం -
నల్ల బ్యాడ్జీలతో అటవీ సిబ్బంది నిరసన
నరసరావుపేట రూరల్: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి నిరసనగా పల్నాడు డివిజన్ సిబ్బంది గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈనెల 19వ తేదీ రాత్రి శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విధుల్లో ఉన్న అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన డివిజన్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ డి.వి. రమణ, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అమీర్ జానీ బాషా, డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంకొండ: అటవీ ప్రాంతంలో విద్యుత్తు లైన్కు ఇనుప తీగలు అమర్చి జంతువులను వేటాడటాన్ని సిబ్బంది అడ్డుకున్నారు. మండలంలోని వెంకటాయపాలెం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ లైన్కు కనెక్షన్ ఇచ్చి జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు తీగలను అమర్చారు. గమనించిన విద్యుత్ సిబ్బంది అక్కడకు వెళ్లగా పరారయ్యారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు, రెండు బైక్లను స్వాధీనం చేసుకుని సబ్ స్టేషన్ తరలించారు. వేటగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏఈ పవన్ కుమార్ తెలిపారు. నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం సామూహిక శ్రావణలక్ష్మి పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఆలయ ఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తిరువంజనం, 9 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు స్వామి వారి వస్త్రాలు వేలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు దిగువ సన్నిధిలోని ఆలయ ఆవరణలో పాట ఉంటుందని ఈవో తెలిపారు. ఫ్లెక్సీ తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులు భట్టిప్రోలు(వేమూరు): భట్టిప్రోలు మండలం చింతమోటులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీలు తొలగించేందుకు అధికారులు సిద్ధంకాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయాన్ని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. చింతమోటుకు చేరుకున్న అశోక్బాబు గ్రామంలో ప్రభుత్వం అనుమతి లేని ఫ్లెక్సీలు అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వేమూరు, చుండూరు సీఐలు ఆంజనేయులు, శ్రీనివాసరావు, భట్టిప్రోలు, కొల్లూరు ఎస్ఐలు శివయ్య, జానకీ అమర్వర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ఫ్లెక్సీలని తొలగిస్తే వెళ్లిపోతామని వరికూటి వారికి స్పష్టం చేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా పోలీసులు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీల వ్యవహారం పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు పడమటి శ్రీనివాసరావు, బొల్లెదు ప్రతాప్, ఇమామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతో కూటమి కుట్ర
సాక్షి టాస్క్ఫోర్స్: చిన్న వార్డులోను ఓటమి భయం వెన్నాడుతున్న కూటమి నేతలు కుట్రలు పన్ని వార్డును విచ్ఛిన్నం చేశారు. ఉప ఎన్నికల సమయంలో వార్డులో ప్రాంతాలను తొలగించకూడదని నిబంధనలున్నా.. నేతల కుట్రకు అధికారులు వత్తాసు పలికారు. వార్డులోంచి ఈ ప్రాంతాలను ఎందుకు తొలగించారని స్థానికులు ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నములుతున్నారు. 484 ఓట్లున్న ఈ ప్రాంతాలు వైఎస్సార్సీపీకి అనుకూలమైనవనే కారణంతోనే ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఈ అప్రజాస్వామిక పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి.. దాచేపల్లి, నడికుడి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయించారు. ఈ నగర పంచాయతీకి 2023లో తొలి ఎన్నికలు జరిగాయి. మూడోవార్డు నుంచి విజయం సాధించిన మునగా రమాదేవి వైఎస్సార్సీపీ తరఫున తొలి నగర పంచాయతీ చైర్పర్సన్ అయ్యారు. అప్పుడు ఈ వార్డులో 1,596 ఓట్లున్నాయి. రమాదేవికి 189 ఓట్ల మెజార్టీ లభించింది. తరువాత అనారోగ్యంతో రమాదేవి మరణించడంతో మూడోవార్డుకు ఉప ఎన్నిక నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు నగర పంచాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి నేతల్లో భయం మొదలైంది. ఈ వార్డులో గెలిచే సత్తా లేదు కాబట్టి వార్డునే విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నారు. వారు చెప్పినట్లే అధికారులు చేసేశారు. గతంలో ఈ వార్డు పరిధిలో ఉన్న చేపలగడ్డ, రంగనాయకస్వామి దేవాలయం, బొడ్రాయి సెంటర్ ప్రాంతాలను ఈ వార్డు నుంచి తొలగించారు. గతంలో 1,596 ఓట్లున్న ఈ వార్డులో ఇప్పుడు 1,112 ఓట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు ఓటర్ల జాబితా నమూనా సిద్ధం చేశారు. ఈ వార్డు నుంచి తొలగించిన మూడు ప్రాంతాల్లో 484 ఓట్లున్నాయి.స్పందించని కమిషనర్ ఈ విషయంలో నగర పంచాయతీ కమిషనర్ జి.వెంకటేశ్వర్లు వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో తమ ప్రాంతాలను వార్డులోంచి ఎందుకు తీసేశారని అడిగితే ఆయన స్పందించడంలేదని ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు. ఉప ఎన్నిలో టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఆయన వ్యవహారశైలి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి నేతలు చెప్పినట్లే కమిషనర్ పనిచేస్తున్నారు దాచేపల్లి 3వ వార్డులో 484 ఓట్లు మాయం కావటంపై కమిషనర్ను కలిసి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించాం. మేం వెళ్లిన ప్రతిసారి కమిషనర్ దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. కూటమి నేతలు చెప్పిన విధంగానే కమిషనర్ పనిచేస్తున్నారు. – షేక్ సుభాని, వైఎస్సార్సీపీ దాచేపల్లి పట్టణ కన్వినర్మా ఓట్లు తీసే అధికారం కమిషనర్కు ఎక్కడిది? మూడోవార్డులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మాయమయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా ఓట్లను ఈ వార్డు నుంచి మాయం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీనికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతాం. – కోలా శ్రీనివాసరెడ్డి, 3వ వార్డు ఓటర్ఓట్ల మాయంపై పరిశీలిస్తాం దాచేపల్లి మూడోవార్డులో 484 ఓట్లు మాయం కావడంపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై బీఎల్వోల ద్వారా సమాచారం తెప్పించుకుంటాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వర్లు, కమిషనర్, దాచేపల్లి నగర పంచాయతీ -
చిన్న వర్షానికే మునక
పెదకూరపాడు: పాటిబండ్ల వాగు ఉధృతికి ప్రతి ఏటా వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకు సైతం వాగు పొంగిపొర్లి సాగు భూములపై పడుతుంది. పాటిబండ్ల వాగు పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల, పొడపాడు, జలాల్పురం, పెద్దమక్కెన, పెదకూరపాడు, బలుసుపాడు, కంభంపాడు, పరస, నరుకుళ్లపాడు, లింగాపురం, వైకుంఠపురం మీదుగా పారుతుంది. పేరమ్మవాగు, పిల్లవాగుల నీరుకూడ ఇందులోనే కలుస్తాయి. ఈ వాగు కింద సుమారు మూడువేల ఎకరాలు ఉన్నాయి. ప్రతి ఏడాది చిన్నపాటి వర్షాలకు సైతం వాగు పొంగిపొర్లుతుండడంతో పంటలు జలమయమవుతున్నాయి. వ్యర్థాలు, ఆక్రమణలే కారణం ఏళ్ల తరబడి వాగుకు పూడిక తీయకపోవడం, వాగులో కొట్టుకు వచ్చే వ్యర్థాలు, వాగు ఇరుపక్కల ఉన్న ముళ్లకంప ఎండి, ఇందులో పడటం, తదితర కారణాలతో వాగులో నీరు ముందుకు పారడం లేదు. అంతేకాకుండా పలువురు ఈ వాగు గట్ల వరకు ఆక్రమిస్తూ, తమ సరిహద్దులను విస్తరిస్తుండడం కూడా ఏటా ఈ దుస్థితికి కారణం అని చెప్పుకోవచ్చు. వాగులో పూడిక తీయాలని, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం శూన్యమని స్థానిక రైతులు వాపోతున్నారు.పాటిబండ్ల వాగు పూడికతీస్తే పంటలు మునగవు. నేను వేసిన రెండు ఎకరాల పైరు ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాగు పొంగడంతో నీట మునిగింది. ప్రతి ఏడాది ఇదే సమస్య. ఆశతో సాగు చేస్తే వాగు పొర్లడం, పంట పీకడం జరుగుతుంది. వాగు పక్కన ఆక్రమణలు కూడా తొలగించాలి. – పఠాన్ ఇసూబ్ఖాన్, రైతు, పాటిబండ్ల -
పింఛన్ల పంపిణీలో
వెరిఫికేషన్ పేరిట భారీగా తొలగింపు ప్రమాదంలో నాకు రెండు కాళ్లు విరిగిపోయాయి. పెద్ద సర్జరీ చేసి రెండు కాళ్లలో రాడ్లు వేశారు. అయినా సరిగా నడవలేని పరిస్థితి. నా దుస్థితి చూసి వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. అయితే నాకు వైకల్యం లేదని వికలాంగ పింఛన్ రద్దు చేస్తున్నామని నోటీసు ఇచ్చారు. ఏ పనిచేసుకోలేని నాకు ఆ రూ.6 వేలు జీవనాధారంగా ఉపయోగపడేది. ఉన్నఫళంగా ఇలా తొలగిస్తే నేను ఏమైపోవాలి. – బత్తుల వీరబ్రహ్మం, దొండపాడు, వినుకొండ రూరల్ సాక్షి, నరసరావుపేట: అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగ పింఛన్ నగదు మొత్తాన్ని రూ.6 వేలకు పెంచామని ఓ వైపు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మరోవైపు ఉన్నఫళంగా అర్హుల పింఛన్లు నిర్దయగా తొలగించేస్తోంది. వికలాంగ ధ్రువపత్రాలతో దశాబ్దాల కాలంగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ పేరిట పరిశీలన చేసి పింఛన్ రద్దు చేస్తున్నట్టు నోటీసులు పంపుతున్నారు. అర్హతుంటే మళ్లీ దరఖాస్తు చేసుకొని పింఛన్ పొందాలంటూ చెబుతున్నారు. ఒక కాలు, ఒక కన్ను లేకపోయినా వారు దివ్యాంగులు కాదంటూ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. 3162 మందికి అనర్హత పల్నాడు జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో గత నాలుగైదు రోజులుగా ఏకంగా 3,162 మందిని వికలాంగ పింఛన్కు అనర్హులుగా పేర్కొంటూ నోటీసులు అందజేస్తున్నారు. ఇందులో దివ్యాంగులు 3,086 మంది, పక్షవాతంతో మంచానపడ్డ వారు 51 మంది, ప్రమాదాలు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు 25 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 35,096 మందికి వికలాంగ పింఛన్లు ఉండగా అందులో రానున్న నెలలో 3,162 పింఛన్లు రద్దు కానున్నాయి. వీరంతా మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు అన్యాయం చేయొద్దని, వైకల్యం చూసి కనికరించమని వేడుకుంటున్నారు. కొత్త పింఛన్లు లేవు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడు జిల్లావ్యాప్తంగా సుమారు 11 వేలకు పైగా పింఛన్లు తొలగించారు. కొందరు హైకోర్టు మెట్లు ఎక్కి మళ్లీ పింఛన్ను తిరిగిపొందారు. తాజాగా ఇప్పుడు మరో 3 వేలకు పైగా పింఛన్లను తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్న హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వ తీరుతో జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలో అర్హులైన వారు ఏడాదికి సుమారు రూ.960 కోట్లు కోల్పోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదిలో రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హతే ప్రామాణికంగా ఏటా జనవరి, జూలై నెలల్లో ఎటువంటి సిఫార్సు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా, ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండా పింఛన్కు అర్హత సాధించేవారు. కూటమి ప్రభుత్వ ఏర్పడిన తరువాత జిల్లాలో ఒక్కటంటే ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అన్ని అర్హతలుండి కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారో కూడా చెప్పలేని దుస్థితి నెలకొనడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు గ్రామ, వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గం దివ్యాంగులు పక్షవాతంతో ప్రమాదాలు, మొత్తం మంచాన కండరాల వ్యాధితో పడ్డవారు వైకల్యం గల వారు చిలకలూరిపేట 824 8 6 838 గురజాల 702 7 4 713 మాచర్ల 168 11 0 179 నరసరావుపేట 532 12 3 547 పెదకూరపాడు 171 3 3 177 సత్తెనపల్లి 360 1 5 366 వినుకొండ 329 9 4 342 మొత్తం 3,086 51 25 3,162 -
డీఏ బకాయిల కోసం హైకోర్టుకు..
ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు శాంతిబాయిమాచర్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన డీఏ బకాయిల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సాంబేలు శాంతిబాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది ఉద్యమ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏల కోసం అసోసియేషన్ తరఫున ఈ నెల 14న హైకోర్టులో పిటీషన్ వేసినట్లు ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర దాటుతున్నా ఉద్యోగులకు అందించాల్సిన టీఏ, డీఏలను చెల్లించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హై కోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు.తెనాలిఅర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తేదీలోపు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాలలో 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈ నెల 29, 30వ తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నెంబర్ 93914 02683లో సంప్రదించాలని సూచించారు.తెనాలి రూరల్: తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణలో కస్టమర్ సర్వీస్ సెంటర్ను ప్రవేటు ఏజెన్సీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ తెనాలి టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె. పద్మావతి చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. 10 రోజులుగా ఆమె దీక్ష చేస్తుండడంతో అఖిల భారత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు గుంటూరు నుంచి తెనాలికి వచ్చారు. దీక్షలో కూర్చున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆమెకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేటు ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. సరిపడా ఉద్యోగులు ఉన్న తెనాలిలో ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వారు అధికారులకు సూచించారు. అనంతరం పద్మావతి చేత దీక్ష విరమింపజేశారు.రూ.4 లక్షలు గుంజుకుని పరారీవేటపాలెం: బంగారు వ్యాపారిపై రౌడీషీటర్ దాడి చేసి రూ.4 లక్షలను బలవంతంగా లాక్కున్న ఘటన అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడిన బంగారు వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలలో చిక్కిత్స పొందుతూ, అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అక్కాయపాలెం లక్ష్మీపురానికి చెందిన రౌడీషీటర్ మల్లెల రాజేష్ తన వద్ద పాత బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్ముతామని తన సెల్ నంబర్ను ఆన్లైన్లో ఉంచాడు. విజయవాడకు చెందిన బంగారు వ్యాపారి రెహమాన్ ప్రకటన చూసి రాజేష్కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మీపురం రావాలని రెహమాన్కి చెప్పాడు. ఇది నమ్మిన అతడు బంగారం కొనుగోలు కోసం లక్ష్మీపురంలోని రౌడీషీటర్ ఇంటికి వచ్చాడు. వెంటనే వ్యాపారిపై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.4 లక్షలను రాజేష్ లాక్కున్నాడు. అక్కడ నుంచి తప్పించుకొన్న వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలకు చేరి ఫిర్యాదు చేశాడు. రౌడీ షీటర్పై అనేక పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. -
‘గుడ్ మార్నింగ్’ ఆపేందుకు కుట్ర
నరసరావుపేట: ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందనే కారణంతో ఎలాగైనా ఆ కార్యక్రమాన్ని ఆపాలనే కుట్రతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల ఆదేశాలతోనే పోలీసులు తనపై కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగు వారాల నుంచి తాను పట్టణంలో పారిశుద్ధ్యం, పెన్షన్లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించే నిమిత్తం ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం ప్రారంభించినప్పుడు పోలీసులు పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, కార్యక్రమం నిర్వహించటానికి వీలులేదని నోటీసు ఇచ్చారన్నారు. అదే రోజు టీడీపీ పట్టణ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం పేరుతో భారీగా ర్యాలీ చేశారని, వారికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, ర్యాలీ సందర్భంగా ఎంత ట్రాఫిక్ ఆగిపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ వారికో న్యాయం.. మాకో న్యాయమా ? గత ఆదివారం కార్యక్రమం అనంతరం ప్రకాష్నగర్ రిక్షా సెంటర్లో కాఫీ తాగేందుకు ఆగామని, అక్కడ తమ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్య దర్శి పుట్టినరోజు అని తెలిసి రోడ్డు మార్జిన్లో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగనీయకుండా కేక్ కట్ చేశామన్నారు. కార్యక్రమం మొత్తం పది నిమిషాల్లో ముగిసిందని, అయినప్పటికీ తమ నాయకులు పదహారు మందిపై కేసు పెట్టారన్నా రు. పుట్టినరోజు జరుపుకొన్న తమ పార్టీ నాయ కుడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు స్టేషన్లో కూర్చోబెట్టడం అన్యాయమన్నారు. మంగళవారం నాడు టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పేరుతో మూడు గంటలపాటు పట్టణంలో అనేక రోడ్లు బ్లాక్ చేశారని, మరి వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు, ఎన్ని అరెస్టులు చేసినా గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేవునికి ప్రార్థనలు చేసుకునే హక్కు కూడా లేదా? అక్రమ కేసులో ఎంపీ మిధున్రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో ఉంచారని, ఆయన యోగక్షేమాల నిమిత్తం భగవంతుని ప్రార్థించుకునే క్రమంలో ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు కొంతమంది మెట్ల మార్గం ద్వారా పాదయాత్రగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వద్దకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేయటం దారుణమన్నారు. -
● గణపూజకు సిద్ధం
చిన్నా, పెద్ద సంతోషంగా జరుపుకొనే పండుగ వినాయక చవితి. ఈనెల 27న పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వినాయక కమిటీలు, నిర్వాహకులు, యువకులు సిద్ధమవుతున్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నారు. రాజస్థాన్, హైదరాబాద్, విజయవాడ, వరంగల్, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో భారీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 20 అడుగుల ప్రతిమలను తీర్చిదిద్ది, విక్రయిస్తున్నారు. అయితే పర్యావరణానికి హానిచేసే విగ్రహాలు వద్దని, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. – సత్తెనపల్లి -
తాత్కాలిక వైకల్యమట..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కాసర్ల వెంకటరెడ్డి. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం. ఇతనికి ఓ ప్రమాదం వల్ల కుడి కాలు మోకాలి పైవరకు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఒంటి కాలితో కర్రల సహాయంతో కష్టంగా నడవగలడు. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఆధారంగా వికలాంగ పింఛన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ పేరిట పరిశీలన చేసి పింఛన్ను రద్దు చేసింది. ఆ విషయాన్ని ధ్రువపరుస్తూ ఇచ్చిన నోటీసులో వారు చెప్పిన సాకు కూటమి ప్రభుత్వం కుతంత్రాలను అద్దంపట్టేలా ఉంది. వెంకటరెడ్డికి ఒక కాలు మోకాలిపై వరకు పోవడం తాత్కాలిక వైకల్యమని తేల్చారట. ఈ కారణంతో పింఛన్ రద్దు చేశామని రాతపూర్వకంగా తెలిపారు. తాత్కాలికమంటే పోయిన కాలు భవిష్యత్తులో పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
వరినాట్లు వేసిన జిల్లా కలెక్టర్
పిడుగురాళ్ల రూరల్: నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే జిల్లా కలెక్టర్ కాసేపు రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. మండలంలోని వీరాపురం గ్రామంలో బుధవారం కూలీలు వరి నాట్లు వేస్తుంటే అటుగా కారులో వెళ్తున్న కలెక్టర్ అరుణ్ బాబు కూలీల వద్దకు వచ్చారు. వారిని పలకరిస్తూ రోజుకు ఎంత ఆదాయం వస్తుంది అని తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో యూరియా, డీఏపీకి కొరతలేదని రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్కు సమృద్ధిగా నీరు చేరడంతో పాటు భూగర్భ జలాలు కూడా గత సంవత్సరం కంటే అధికంగా పెరిగాయని నీటికి ఇబ్బంది లేదన్నారు. ఏడీఏ బి.కృష్ణదేవరయలు, ఆర్డీఓ మురళి, తహసీల్దార్ మధుబాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆయన వెంట ఉన్నారు. -
ఈమె అనర్హురాలట...
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పచ్చవ వీరమ్మ, నాదెండ్ల. అవివాహితురాలు, వయసు 55 ఏళ్లు. పుట్టుకతోనే శారీరక, మానసికంగా వైకల్యం ఉంది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వం నుంచి వికలాంగ పింఛన్ తీసుకొని జీవనం సాగిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంలో వెరిఫికేషన్ పేరిట ఈమె పింఛన్కు అనర్హురాలని నోటీసులు అందించి తొలగిస్తున్నామని తెలిపారు. కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోమని సూచించారు. అన్ని సరిగా ఉన్నవారే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేరు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న మహిళ మళ్లీ పింఛన్ తెచ్చుకోవడం ఎలా? ఇలాంటి ఉదాహరణలు జిల్లాలో కోకొల్లలు. -
పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చిలకలూరిపేట: ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద అన్ని రకాల సుంకాలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం దారుణమని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం పత్తి రైతులకు మరణ శిక్ష విధింపుతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇది రైతు వ్యతిరేక చర్య అని ఖండించిందని వెల్లడించారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించే ప్రభుత్వ నోటిఫికేషన్ పత్తి రైతులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో పండించే పత్తి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. దేశీయంగా పండించే పత్తి ధర ఖచ్చితంగా తగ్గుతుందని, రైతులు మరింత అప్పుల పాలవుతారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,075 రావాలని, కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,710 మాత్రమే ఉందని వెల్లడించారు. ఆ ధరకు కూడా పత్తి అమ్ముడు పోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పత్తి రైతులకు తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
దాచేపల్లి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన దొడ్డా శ్రీను(30) మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ నుంచి దాచేపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ వాహనంలో గామాలపాడుకు చెందిన అన్నదమ్ములైన దొడ్డా సైదులు, దొడ్డా శ్రీను ఉన్నారు. కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం కిందపడి శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన తర్వాత ఈ రెండు వాహనాలు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో ఆటోను బలంగా ఢీకొట్టాయి. ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు శ్రీనుకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
మృతుల కుటుంబాలను మోసం చేసే కేటుగాడు అరెస్ట్
యడ్లపాడు: మృతి చెందిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని..బీమా డబ్బులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని యడ్లపాడు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరు రాజీవ్గాంధీ నగర్కు చెందిన చెందిన 27 ఏళ్ల చొక్కా బాబు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చనిపోయిన వారి ఇంటికి వెళ్లి తాను ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చానని నమ్మబలికేవాడు. బీమా కోసం డబ్బులు అవసరమని చెప్పి అమాయకుల నగదు స్వాహా చేసి మోసానికి పాల్పడేవాడు. తాజాగా ఈనెల 14వ తేదీన యడ్లపాడు గ్రామంలో మృతి చెందిన బండి ఆంజనేయులు ఇంటికి వెళ్లి రూ.7.5 లక్షల బీమా వస్తుందని నమ్మబలికాడు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఖర్చుల నిమిత్తం రూ.28 వేలు కావాలంటూ వారి నుంచి ఫోన్పే ద్వారా వసూలు చేశాడు. అనుమానం వచ్చి బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి స్కూటీతో పాటు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.. గుంటూరు అర్బన్ దిశ స్టేషన్లో బాలికపై లైంగికదాడి కేసు, మంగళగిరి టౌన్ స్టేషన్లో హైకోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.59 లక్షల మోసగించిన కేసు, గుంటూరు దిశ స్టేషన్, రాజమండ్రి వన్టౌన్ స్టేషన్లలో ఆత్మహత్యాయత్నం కేసులు, గుంటూరు దిశా స్టేషన్లో నిందితుడి భార్య ఫిర్యాదుతో నమోదైన కేసులు ఉన్నాయని సీఐ వెల్లడించారు. నవ వధువు ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్హెచ్జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారు. -
పేదల స్థలంలో పండ్ల తోట
వినుకొండ: కూటమి ప్రభుత్వంలోకి జగనన్న కాలనీ స్థలాలకు రక్షణ లేకుండా పోయాయి. అక్రమార్కులు యథేచ్ఛగా ఎకరాలకు ఎకరాలు ఆక్రమిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మిన్నుకుంటుండడంతో వారు చెలరేగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలోని సర్వే నం.194–3లో 1.80 ఎకరాలు ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీ కోసం అప్పట్లో రెవెన్యూ అధికారులు సేకరించి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బాగు చేశారు. అదే గ్రామానికి చెందిన పిడిరిడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కలుపుకొని ఉండటంతో అధికారులు అతనివద్ద నుంచి ప్రభుత్వ భూమిని విడగొట్టి జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సదరు వ్యక్తి మళ్లీ జగనన్న కాలనీకి ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి ఏకంగా కొబ్బరి, బత్తాయి మొక్కల సాగు చేపట్టాడు. నా భార్య మల్లీశ్వ రి పేరుతో జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. అయితే స్థలాల్లో ఇళ్ల నిర్మా ణాలు చేపట్టేందుకు జాప్యం కావడం, ఇంతలోనే ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఆ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి ఏకంగా బత్తాయి, కొబ్బరి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలి. – మిరియాల కోటయ్య, అందుగుల కొత్తపాలెం -
చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్స్, జెట్ లూమ్స్లకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ అంశాలను అక్టోబర్ 6, 7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 11వ మహాసభలో చర్చించి పోరాటాలకు పిలుపునిస్తామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ హెచ్చరించారు. సత్తెనపల్లిలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గరావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేతపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర మహాసభలలో చర్చించి, భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అనుముల వీర బ్రహ్మం, కమిటీ సభ్యులు బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి యేసు రత్నం, వలపర్ల చిన్న దెబ్బయ్య, మోపత్తి బాబు రాజు పాల్గొన్నారు. -
సాఫ్ట్బాల్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి/రొంపిచర్ల: ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి బాలికల జట్టు ఎంపికలు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 15 మందిని జట్టుకు, మరో ఐదుగురిని స్టాండ్బైకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో పల్లపాడుకు చెందిన సిహెచ్ అనిత, జి.సునందిని, ఎం.శృతి, సిహెచ్ పావని, బి.నందిని, కె.తేజస్విని, కె.చందన, ఇ.చంద్రిక, వి.లిద్య/ఎం.తిరుపతమ్మ, రొంపిచర్లకు చెందిన వి.శ్రీదేవి, పీవీఎన్ చంద్రిక, కొమెరపూడికి చెందిన బి.ప్రసన్న జ్యోతి, వినుకొండకు చెందిన ఆర్.రాగసుధ, క్రోసూరుకు చెందిన కె.దీవెన ఏంజల్, కేఎల్ఎస్ ప్రవల్లికలు ఉన్నారు. స్టాండ్ బైలుగా బి.శ్రీలక్ష్మి (రొంపిచర్ల), కె.సంజన (బ్రాహ్మణ కోడూరు), పి.శైలజ, జె.ధనలక్ష్మి, కె.తన్మయిసాయి (రామకృష్ణాపురం)లు ఎంపికయ్యారు. ఎంపికై న బాలికలు ఈనెల 30, 31 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ జిల్లా సెక్రెటరీ పి.సామంతరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నర్రా శ్రీనివాసరావు, ట్రెజరర్ జనార్దన్ రెడ్డి యాదవ్లు పాల్గొన్నారు. ఎంపికలకు సెలక్షన్ కమిటీ మెంబర్లుగా పీడీలు సైదయ్య, వెంకటేశ్వరరా వు, సుబ్బారావులు వ్యవహరించారు. ఎంపికై న బాలికలకు గురువారం నుంచి కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని హెచ్ఎం బి.విజయ తెలిపారు. -
రైతులు పొగాకు సాగుచేయొద్దు
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబునరసరావుపేట: జిల్లాలో పొగాకు పంటను రైతులు ఎవరూ సాగుచేయెద్దని, నారుమళ్లు వేయరాదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2024–25లో 3124మంది రైతులు 10,954 ఎకరాల్లో బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగుచేశారని, దీని వలన 1,21,010 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. అధిక దిగుబడితో పొగాకు వ్యాపారులు రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందువలన ఈ ఏడాది రైతులు ఎవరూ కంపెనీ వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకోరాదని, పొగాకు నారుమళ్లు వేయరాదని కోరారు. పొగాకుకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగుచేయాలని కోరారు. మధ్యవర్తులు ఎవరైనా సాగుకు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది పండిన పొగాకు నిల్వలను కొనుగోలుచేయకుండా ఈ ఏడాది సాగుచేయాలని ప్రోత్సహించటం క్షమించరాని నేరమన్నారు. రైతులు కంపెనీ వారి మాటలు వినిమోసపోవద్దని సూచించారు. పూర్తి బాధ్యతను గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.25న సీజ్ చేసిన బియ్యానికి మళ్లీ వేలంనరసరావుపేట: ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండర్ సెక్షన్ 6ఏ కింద సీజ్ చేసిన 6,453 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమక్షంలో ఈనెల 25న మరోసారి వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు బుధవారం పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈనెల 12న నిర్వహించిన వేలంలో సరైన ధర రానందున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. బహిరంగ వేలం ప్రకటనలోని నియమ నిబంధనల మేరకు ఔత్సాహికులు పాల్గొనాలని కోరారు.పోస్టల్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోండినరసరావుపేట టౌన్: తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జాఫర్ సాధిక్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కాలర్షిప్ను తపాలా శాఖ ప్రవేశపెట్టిందన్నారు. తపాలా శాఖ నిర్వహించే ఫిలాటెలి క్విజ్ మరియు ఫిలాటెలి ప్రాజెక్ట్ల ఆధారంగా ఏడాదికి రూ.6 వేలు స్కాలర్షిప్ పొందవచ్చన్నారు. విద్యార్థి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతూ, సంబంధిత పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ సభ్యుడై ఉండాలన్నారు. పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ లేకపోతే అభ్యర్థి తన సొంత ఫిలాటెలి అకౌంట్ కలిగి ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలన్నారు.నీట్ పీజీ సెట్లో డాక్టర్ ప్రవల్లికకు 1820 ర్యాంక్నరసరావుపేట ఈస్ట్: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ–2025 పరీక్షలో పట్టణానికి చెందిన డాక్టర్ ముద్దా ప్రవల్లిక ఓపెన్ క్యాటగిరీలో 1820 ర్యాంక్ సాధించింది. వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రవళ్లిక నీట్ పీజీ సెట్లో 613 మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించింది. డాక్టర్ ప్రవల్లిక తండ్రి ముద్దా రమేష్ పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తుండగా, తల్లి ఉషారాణి గృహిణి. చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించేందుకు తాను పిడియాట్రిక్ విభాగంలో పీజీ చేయనున్నట్టు డాక్టర్ ప్రవల్లిక తెలిపారు.జిల్లాలో 69.4 మి.మీ వర్షంనరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకు గాను 14 మండలాల్లో వర్షం పడలేదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. మిగిలిన మండలాల్లో 69.4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. అత్యధికంగా మాచర్లలో 20.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా 0.6 అమరావతిలో కురిసింది. వెల్దుర్తి 7.0, దుర్గి 8.0, గురజాల 2.0, కారంపూడి 2.4, బొల్లాపల్లి 2.4, వినుకొండ 2.8, నూజెండ్ల 1.8, శావల్యాపురం 1.4, ఈపూరు 2.6, రొంపిచర్ల 5.6, నరసరావుపేట 3.6, చిలకలూరిపేట 5.0 మి.మీ వర్షం కురిసింది.‘డీ ఫార్మసీ’లో ప్రవేశాలకు గడువు పొడిగింపుగుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వా రు సర్టిఫికెట్లతోపాటు పాస్పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుము రూ.400తో కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
పొన్నూరు: సాగులో రసాయన ఎరువులను తగ్గించాలని గుంటూరు బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ఏడీఏ సునీత రైతులకు సూచించారు. బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్డిముక్కల, ఆలూరు గ్రామాల్లో స్థానిక ఏడీఏ రామకోటేశ్వరితో కలిసి ఆమె పంట పొలాలను సందర్శించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవన ఎరువులైన పాస్ఫరస్ సాల్యుబ్ లైజింగ్ బ్యాక్టీరియాను (పీఎస్బీ)వినియోగించడం వలన పొలంలో భాస్వరాన్ని కరిగించి పంటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని వలన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని అన్నారు. ఏడీఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ నగదు జమ కానివారు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ పి. ప్రసాదు, ఎంపీఈఓ ఎస్. సురేష్బాబు, రైతులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కావడం.. పిన్నెల్లి ఫొటో పెట్టుకోవడమే పాపం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడమే ఆ యువకుడు చేసిన పాపం. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ యువకుడిని పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్ఐ షమందర్ వలీ, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకటనాయక్ కలిసి విచక్షణారహితంగా చావబాదారు. కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ, జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తనను కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వతేదీ నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశించింది. పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 45 నిమిషాల పాటు చిత్రహింసలు..! అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘వెల్దుర్తి పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్ ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటి నుంచి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ వలీ, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు, బెల్టుతో చావబాదారు. కాళ్లు, చేతులు మెలిబెట్టి అదే పనిగా కొట్టారు. రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు రూ.15 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్కు రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు బెదిరించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని రామలక్ష్మణరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది ఏ.జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్పై నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నారని, ఇందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫుటేజీ భద్రపరచడానికి ఏం ఇబ్బంది? ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశి్నంచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ టీవీ ఉండి తీరాలని గుర్తు చేశారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని తగిన అధికారికి అందించేందుకు వీలుగా భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అవసరమైతే ఈ క్లినిక్ను సందర్శించాలని తెలిపారు. దీనికి ప్యానెల్ అడ్వకేట్గా పి.రాజేష్ లింగం, పారా లీగల్ వలంటీర్గా పి.శిరీషను నియమించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల, మాజీ సైనిక ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సూట్ కేసులు
రైతులపై కేసులు...పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రైతుల పక్షాన పోరాడే వారిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కేసులు పెడుతున్నారని, ఆయనకు మాత్రం సూట్కేసులు వెళ్తున్నాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. కూటమి ఏడాదిన్నర కాలం పాలనలో రైతుల సమస్యలను నరేంద్ర పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు చానల్కు గండ్లు పడ్డాయన్నారు. ఫలితంగా పెదకాకానిలో 11 వేల ఎకరాలు, చేబ్రోలులో 5 వేల ఎకరాలు, పొన్నూరు రూరల్లో 15 వేల ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు చానల్లోకి చేరడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంతటి భారీ నష్టం సంభవిస్తే గుంటూరు చానల్ లాకులు మూసినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమేనన్నారు. అయితే ఆ నీరంతా ఆకాశం నుంచి వచ్చిందా, భూమి లోపలి నుంచి పైకి వచ్చిందా అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలన్నారు. రైతులు మాత్రం కొండవీటి వాగు నుంచే భారీగా నీరు వచ్చి నష్టం చేసిందని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలి గత ఏడాది పంటలు మునిగిపోయిన నేపథ్యంలో రూ.16 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారని, అయితే ఈ ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనవసరం లేదా అన్ని అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అంతేగాక గతంలోనే నష్టపరిహారం చెల్లించామని, కాల్వలు కూడా బాగు చేయించామని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అదే నిజమైతే ఈ వర్షాలకు గండ్లు ఎలా పడ్డాయో చెప్పాలన్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రెండుసార్లు రూ. 20 వేలు ఖర్చు చేశారన్నారు. మూడోసారి నారుమడి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే ఎకరాకు తాత్కాలిక పరిహారంగా రూ.10 వేల నగదు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాతలు ఇంతటి దయనీయ స్థితిలో ఉంటే రెండు నెలలుగా ఎమ్మెల్యే నరేంద్ర నియోజకవర్గంలోనే కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. పంటల నష్టపోయినట్టు రైతులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెబితే... పంటలు పోతే పోయాయని, రియల్ ఎస్టేట్కు ఇవ్వాలని చెప్పడం ఆయన దుర్బుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చేబ్రోలు, కొమ్మమూరు బ్రిడ్జికి సంబంధించి గుంతలు తీసి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు భారీగా వచ్చి నడిరోడ్డుపై గుండాలు ఏర్పడ్డాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని అంబటి మురళీకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపణ -
బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
మేదరమెట్ల: వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల ఫైలాన్ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జే.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ (37) భార్య వెన్నెలతో కలసి ఒంగోలులో ఉంటున్న కుమారుని కలసి మోటారు బైకుపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. బైకు ఫైలాన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్ను లారీ కొద్ది దూరం లాక్కొనిపోయింది. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ భార్య వెన్నెల రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ
గుంటూరు ఎడ్యుకేషన్: సనాతన హిందూ ధర్మం ప్రకారం సంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా మండపాలతో గణేష్ మహోత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రరాజు అన్నారు. మంగళవారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరాజు మాట్లాడుతూ.. ప్రజల్లో ఆధ్యాత్మిక భావన వెల్లువిరిసి మన సంస్కృతీసంప్రదాయాల ప్రకారం గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం సమితి పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎవరికీ ఇబ్బంది లేని విధంగా మండపాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి లక్ష్మీపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలచిన భక్తులు సమితి ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావును సంప్రదించి దరఖాస్తు అందిస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. వివరాలకు 81064 33594 ఫోను నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మదన్ పురోహిత్, ఉపాధ్యక్షుడు హరిహరరాయలు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు కంచర్ల ఆంజనేయులు, రవి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రరాజు -
త్వరలో అనుబంధ విభాగాల నియామకాలు
నెహ్రూనగర్: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, డివిజన్ అనుబంధ విభాగాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్లు తెలిపారు. గుంటూరు నగరంలోని అంబటి రాంబాబును, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ను వారి కార్యాలయాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి షేక్ మస్తాన్వలి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాతోపాటు, గుంటూరు పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీల గురించి ప్రస్తావించారు. త్వరితగతిన కమిటీలు పూర్తి చేసేలా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించేలా పదవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు తగవు
మంగళగిరి: కొండవీడు వాగు వరద మళ్లింపుతోపాటు కృష్ణా నది నుంచి నీరు వెనక్కి తన్నడం వలనే మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని తదితర మండలాలు మునిగాయని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. మండలంలోని నీరుకొండ, కురగల్లుల మధ్య వాగు ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్ సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి వాగు వరద మళ్లిపు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా 70 వేల ఎకరాలు పంటలు మునిగాయని చెప్పారన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారన్నారు. టీడీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వర్షం తగ్గినా మంగళవారం వరకు ఇక్కడ కనుచూపు మేర నీరు నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జంగాల నాగిరెడ్డి, మల్లవరపు సుధారాణి, సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఆర్ధల చిన్నారి, కట్టెపోగు భూషణం, షేక్ గౌస్ పాల్గొన్నారు. -
బాలుడి మృతిపై అనుమానాలు
క్రోసూరు: మండలంలోని విప్పర్ల గ్రామంలోని ఎస్సీకాలనీ (గోవిందపురం)కు చెందిన బాలుడు రెండు మాసాల క్రితం మృతి చెందగా, బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసుస్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన జరిగింది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాల మేరకు.. జూన్ నెల రెండవ తేదీన విప్పర్ల గ్రామానికి చెందిన ఎర్రగుండ్ల జోష్ణప్రకాశ్ (8) బావిలో పడి మృతి చెందాడు. అప్పుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనుకుని ఖననం చేశారు. పది రోజుల క్రితం మృతుడి తల్లి శ్రావణి తన కుమారుడిని చంపి బావిలో వేసారన్న అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని క్రోసూరు సీఐ రమేష్, ట్రైనీ ఎస్ఐ గోపిల పర్యవేక్షణలో గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులు, తహసీల్దార్ వి.వి.నాగరాజు, వీఆర్వోల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి ఫిర్యాదు మేరకు మరణించిన రెండు మాసాల తర్వాత పోస్టుమార్టం -
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్వలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. వాహన మిత్ర కింద రూ.25 వేల సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకి రుణాలు అందించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని కోరారు. లేకుంటే ఈ నెల 24వ తేదీన ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి ఆందోళన చేపడతామన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
నిలబడేందుకు కూడా ఇబ్బందే..
బస్సుల సంఖ్య పెంచకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని బస్సులకు ఉచితం అమలు చేయకపోవడంతో వచ్చే ఒకటీ, రెండు బస్సుల కోసం తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోంది. సీట్లు దొరక్కపోగా నిలబడేందుకు చూడా చోటు లేకుండా మారింది. – వేముల గురవమ్మ, పిడుగురాళ్ల మా గ్రామానికి బస్సు లేదు మా పల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేసినా మాకు పెద్దగా ఉపయోగం లేదు. దీంతో ఆటోలలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మా గ్రామ విద్యార్థులు కాలినడక, ఆటోలలో బడులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే మా గ్రామానికి ఆర్టీసీ బస్సులను తిప్పాలి. అప్పుడే మేం పూర్తిగా ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోగలం. – బుదాటి మరియమ్మ, నందిరాజుపాలెం, బెల్లంకొండ మండలం -
వరద ఉధృతం.. భయం భయం
దాచేపల్లి: కృష్ణా నదిలో వరద నీటి ఉధృతితో స్థానిక మత్స్యకారుల కాలనీ ముంపు ముంగిట్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోని మత్స్యకారుల కాలనీని ఆనుకొని కృష్ణానది మంగళవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలనీలోని నివాస గృహాలకు కూతవేటు దూరంలో వరద నీరు ప్రవహిస్తుండంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాలనీలో 50కి పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడం వలన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి విడుదల పెరిగితే కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగితే మత్స్యకారులను అక్కడి నుంచి ఖాళీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
బస్సులు పెంచరే!
సాక్షి, నరసరావుపేట: సీ్త్ర శక్తి పేరుతో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుపుకొంది. అన్ని రకాల బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పించకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు గుంటూరుకు ఎక్కువగా సూపర్ లగ్జరీ బస్సు సర్వీ సులు నడుస్తున్నాయి. వీటిలో మహిళలకు ఉచిత సౌకర్యం లేదు. అలాగే నరసరావుపేట – గుంటూరు నగరాల మధ్య సుమారు 17 నాన్స్టాప్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో మహిళలు నగదు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. పోనీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు ల్లో అయినా ప్రయాణిద్దామంటే ఆ బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొత్తవి కొనుగోలు చేసి బస్సుల సంఖ్య పెంచుతామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోలేదు. బస్సు ముఖం చూడని గ్రామాలు గ్రామీణ జనాభా అధికంగా ఉన్న పల్నాడు జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వాటిలో చాలా వరకు కండీషన్లో లేవు. ఇటీవల కాలంలో వినుకొండ, మాచర్ల బస్సుల్లో స్టీరింగ్ రాడ్ విరిగిపోయి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటనలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 195 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ముఖ్యంగా మాచర్ల, వినుకొండ డిపోల పరిధిలోని గ్రామాలలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నా ఉపయోగం లేదని మహిళ లు పెదవి విరుస్తున్నారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా ఉచితమంటే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకుంటే కూటమి ప్రభుత్వ ప్రచారానికి మాత్రమే ఈ పథకం పరిమితం కానుంది. నరసరావుపేట బస్టాండ్లో పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు పాట్లునరసరావుపేట బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుంది కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సీ్త్ర శక్తి పథకం తీరు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఆర్భాటంగా ప్రారంభించి, ఆనక చేతులు దులుపుకొన్నారు. బస్సులు లేక.. కేటాయించిన అరకొర బస్సుల్లో సీట్లు లేక.. కష్టపడి ఎక్కితే నిలబడేందుకు సైతం తావు లేక.. మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండుల వద్ద ఉచిత బస్సు ఎక్కాలంటే యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. జిల్లాలోని 195 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమే లేకపోవడంతో వేలమంది మహిళలు పథకానికి దూరమై.. ప్రమాదకర స్థితిలో ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఉచితం సరే.. బస్సులు పెంచరే.. అని మహిళలు పెదవి విరుస్తున్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆరు ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో మొత్తం 439 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయి. ఇందులో ఉచిత బస్సు పథకం కింద 364 పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మహిళలకు ఉపయోగపడుతున్నాయి. ఇవే పల్నాడు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. సుమారు 14 లక్షల మహిళలున్న జిల్లాలో కేవలం 364 బస్సులకు మాత్రమే ఉచిత సదుపాయం ఇవ్వడమేంటని మహిళామణులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉచిత బస్సు పథకం అమలు చేయకముందు సగటున రోజు రూ.12 నుంచి 13 లక్షల ఆదాయం లభించేదని, ప్రస్తుతం ఆదాయం రూ.18 లక్షలకు పైగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. అంటే దాదాపు 30 నుంచి 50 శాతం దాకా ఆక్యుపెన్సీ పెరిగింది. గతంలోనే జిల్లాలో తీవ్ర బస్సుల కొరత ఉంది. అలాంటి సమయంలో ఆక్యుపెన్సీ పెరిగిన నేపథ్యంలో కొత్త సర్వీసులు పెంచాలి. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదించారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలలో వెళుతున్నాం.. అన్ని గ్రామాలకు బస్సులను నడపకపోతే ఉపయోగం లేదు. మా గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఆటోలలో ప్రయాణించాల్సి వస్తోంది. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తేనే పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలం. – తిరువీధి శివకుమారి, పిచ్చుకలపాలెం, శావల్యాపురం మండలం -
‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ సెల్వరాజ్ సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఉచిత వైద్య నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోవాలని సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ సెల్వరాజ్ అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం విద్యాశాఖ, సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అలింకో వారిచే మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెల్వరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 28 భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు 540 మంది ఉన్నారన్నారు. వీరు కాక ప్రతి మండలంలో సుమారు 100 నుంచి 150 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరి అవసరాల నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ నిర్ధారణ వైద్య శిబిరాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఈ శిబిరాలు 25 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 25న జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిబిరం జరుగుతుందన్నారు. బెంగళూరు వైద్యులు అవసరమైన ఉపకరణాలను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఉపకరణాలను త్వరలోనే ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. -
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు
సాక్షి, నరసరావుపేట: గుడ్ మార్నింగ్ నరసరావుపేట పేరిట వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తలపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే కుట్రతో తప్పుడు కేసులను బనాయించింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుడ్ మార్నింగ్ నరసరావుపేట పేరిట నెల రోజులుగా కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజు ఉదయం ప్రజలతో మమేకమవుతున్నారు.ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. దీన్ని ఓర్వలేక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రోద్బలంతో ఇప్పటికే అధికారులు అనేక అడ్డంకులు సృష్టించారు. కార్యక్రమం నిర్వహించరాదంటూ గోపిరెడ్డికి నోటీసులిచ్చారు. అయినప్పటికీ గోపిరెడ్డి ముందుకు సాగారు. అదివారం ఎమ్మెల్యే అరవింద్ బాబు నివాసముండే ప్రకాష్ నగర్ రిక్షాసెంటర్కు వెళ్లి గుడ్మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమాన్ని గోపిరెడ్డి నిర్వహించారు.ఆ సమయంలో మైనార్టీ నేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ నాగూర్ వలీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి గోపిరెడ్డి ముందుకు సాగారు. కేక్ కటింగ్ రెండు మూడు నిమిషాల్లోనే ముగిసింది. ఈ సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిందన్న సాకుతో టీడీపీ సానుభూతిపరులైన ఆటో డ్రైవర్తో గోపిరెడ్డిపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని నాగూర్తోపాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో 14 మందిపై నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా పుట్టిన రోజు నాడు నాగూర్ను ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చివరకు పూచీకత్తుపై పంపారు. -
డబ్బు, పలుకుబడి ఉంది.. రాజీ చేసుకో..
నరసరావుపేట రూరల్: తనపై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, పైగా.. ‘నిందితుడికి రాజకీయ పలుకుబడి, ధన బలం ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసారు. రాజీ చేసుకుంటే మంచిది’.. అని వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన బాధిత దళిత మహిళ కన్నీటిపర్యంతమైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి విన్నవించుకునేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆమె రెండోసారి వచ్చింది. తొలుత.. ఈనెల 11న జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె. శ్రీనివాసరావుకు ఆమె ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కానీ, విచారణ పేరుతో తనను వినుకొండ రూరల్ పోలీస్స్టేషన్కు పిలిపించిన అక్కడి సీఐ ప్రభాకర్ నిందితుడు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయకపోగా రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. అందుకు తాను అంగీకరించలేదని బాధితురాలు తెలిపింది. -
టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి!
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యాదుతో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాలివీ.. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తుల రోశమ్మ (70) ఎస్పీ కె. శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేసింది.తనకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో నిరుపేదల కోటా కింద 1.50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని.. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళ నాయకురాలు చల్లా అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే, తన భర్త అనారోగ్యంతో చనిపోవడం.. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం.. కుమారుడికి మతిస్థిమితం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు ఓ పత్రికా విలేకరి సాయంతో అనువకళ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేధించడం ప్రారంభించిందని.. భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.అంతేగాక.. జూలై 30న అనువకళ, మరికొందరు కలిసి తనపై దాడిచేశారని.. కాలు విరిగి తీవ్రంగా గాయపడడంతో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రోశమ్మ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ పదిరోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి, మనవడు సాయిరాం సాయంతో రోశమ్మ సోమవారం అంబులెన్స్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనువకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. అనంతరం జిల్లా కలెక్టర్కు కూడా అర్జీని అందజేశారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకవైపు కృష్ణమ్మ వరద దోబూచులాటలు.. మరోవైపు ముసురుతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వరుణుడి ప్రకోపంతో అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గడంతో పంట ముంపు నుంచి బయటపడతామనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. మళ్లీ వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో పాటు ఉపరితల అవర్తన ప్రభావంతో జిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా కాకుమాను మండలంలో 37.2 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 0.6 మి.మీ. పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బ్యారేజీకి వరద నీరు తాకిడి మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి క్రమేపీ పెరుగుతోంది. రెండు రోజుల కిందట రెండో ప్రమాద హెచ్చరిక వరకూ వెళ్లి, మళ్లీ వరద ప్రవాహం తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నిదానంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం బ్యారేజీకి వచ్చిన 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు వద్దకు వచ్చే అవకాశముందని, ఆ తర్వాత రోజుకు సుమారు ఏడు లక్షల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగితే మరింత ఉధృతి పెరిగే అవకాశం కనపడుతోంది. 26 క్రస్ట్గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం 26 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 2,51,182 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 3,31,699 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. రెంటచింతల మండలం సత్రశాల వద్ద నున్న నాగా ర్జున సాగర్ టైల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 16 క్రస్ట్గేట్లు ద్వారా 2,92,192 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా పులి చింతల మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 2,47,951 క్యూసెక్కులు వచ్చి చేరింది. దిగువకు 10 క్రష్ట్ గేట్లద్వారా 3,10,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద ఇనుప కంచెలుతాడేపల్లి రూరల్: కృష్ణా నదికి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్లలో భద్రత దృష్ట్యా సోమవారం తాడేపల్లి పోలీసులు ఇనప ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందర్శకులు మెట్ల మీద నుంచి నీళ్లలోకి దిగుతున్నారని తెలిపారు. -
సీజీహెచ్ఎస్లో ఆధునిక సౌకర్యాలు
చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోటేశ్వరరావు గుంటూరు మెడికల్: మారుతున్న కాలానుగణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సీహెచ్.కోటేశ్వరరావు పేర్కొన్నారు. నగరంపాలెంలోని సీజీహెచ్ఎస్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఏర్పాటైన లేబొరేటరీ, ఇంజెక్షన్, బీపీ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సీజీహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమాసుందరి అధ్యక్షత వహించారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా, సీజీహెచ్ఎస్ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన స్థితికి తీసుకొస్తామని వెల్లడించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవాల ద్వారా మరిన్ని వైద్య సౌకర్యాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. రోగుల ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. సీజీహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి, ఫార్మాసిస్టు ఆయోషా బేగం, సునీల్, లేబొరేటరీ అసిస్టెంట్లు మురళి, రామారావు, సిబ్బంది మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు
రేపల్లె: ద్విచక్ర వాహన దుండగులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం దుండగుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన పట్టణంలోని రింగు రోడ్డు సెంటర్లో బొర్రా కృష్ణ తన ద్విచక్ర వాహనాన్ని సెంట్రల్ పార్కింగ్ చేసి దుకాణానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తన వాహనం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె–పెనుమూడి రోడ్డులో పోలీసులు సోమవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొల్లూరుకు చెందిన ముగ్గురు బాలురు పట్టుబడ్డారు. వారిని విచారించగా ద్విచక్ర వాహనాన్ని దొంగిలించడంతోపాటు పలు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.9.6 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరికి గతంలో నేర ప్రవృత్తి లేదని పేర్కొన్నారు. డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడటం ప్రారంభించారన్నారు. యూట్యూబ్లో వచ్చే వివిధ అంశాలను పరిశీలించి ఈ దొంగతనాలు సులభంగా చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను గమనిస్తూ ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పవిత్రోత్సవాలకుశాస్త్రోక్తంగా అంకురార్పణ
తాడికొండ: అమరావతిలోని వేంకటపాలెంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్థం మొదటిసారిగా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. 19వ తేదీ ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ ఎం.మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ. రామకృష్ణ, ఎం.సందీప్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
వైఆర్ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
రెంటచింతల: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘మహాత్ముడు నడయాడిన రెంటచింతల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు స్పందించి, నాడు మహాత్ముడు బస చేసిన వైఆర్ఎస్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో గ్రామానికి చెందిన పల్నాటి గాంధీగా పేరు పొందిన నాళం మట్టపల్లి కుటుంబ సభ్యులను కలువడానికి అవకాశం ఉందా? ఆయన వారసులు ఎవరు.. ఎక్కడున్నారని.. వాకబు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమ యంలో ఈ ప్రాంతంలో నెలకొన్న సంగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైఆర్ఎస్ పాఠశాలలో విద్యార్థులతో మమేకమై, వారికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య, విద్యా వలంటీర్ల వేతనాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాఠ శాల వెనుకనున్న గదులను ఎందుకు మూసివేశారని అడిగారు. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్నారని, మిగిలిన వారు విద్యా వలంటీర్లుగా పనిచేస్తున్నారని వా రికి పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాలతో వేతనాలు అందచేస్తున్నామని గతంలో 700 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని హెచ్ఎం కొత్త చంద్రశేఖర్, కరస్పాండెంట్ యేచూరి వెంకట సైదయ్యలు కలెక్టర్కు వివరించారు. -
బాపట్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
బాపట్ల అర్బన్: వర్షాలు, వరదలు దృష్ట్యా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు డ్రెయినేజీలు, నీటి కుంటలలో దోమలు ఉత్పత్తి జరగకుండా గంబూషియా చేప పిల్లలను సోమవారం వదిలే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఖాళీలను యజమానులు శుభ్రం చేయించుకోవాలని, పిచ్చిమొక్కలు, అపరిశుభ్రంగా ఉంటే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. పురప్రజలు కూడా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సీహెచ్ కరుణ, నజీర్ ఉన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు ద్వారా జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి 141 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో సంతృప్తే ధ్యేయంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్బాబు -
ఉచిత ఉపకరణాలు వినియోగించుకోండి
పెదకూరపాడు: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సెల్వరాజ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో 520 మంది విద్యార్థులు భవిత పాఠశాలలో ఉన్నారని తెలిపారు. వారిలో ఉపకరణాల అవసరమైన వారికి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రత్యేక ప్రతిభావంతులను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకారణాలను అందించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం డాక్టర్ నితీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు, సత్యనారాయణ, హెచ్ఎం కేవీ రమణ, స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారావు, సుశితాప్రియ, లక్ష్మీనారాయణ, నూర్జహాన్, అచ్చయ్య, నసీమా బిగ్, బాబు, ఐఈఆర్పీ టీచర్లు లక్ష్మీ, కమల, స్వాతి, రమాదేవి, రహీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ -
పిడుగు గుట్టు.. పసిగట్టు !
కలర్తో కనుక్కోవచ్చుబెల్లంకొండ: వర్షాకాలం వచ్చిందంటే ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు పడుతుందో.. ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు వాటిల్లి ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అదేవిధంగా మెరుపుల దాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతూ ఉంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో పిడుగు నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. పిడుగుపాటును ముందే తెలుసుకోగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ పిడుగు ప్రమాదాన్ని ‘దామిని లైట్నింగ్ యాప్’తో అరగంట ముందే గుర్తించగలిగే అవకాశం ఉంది. ముప్పు ముందే తెలుసుకోవచ్చు పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ (ఐఐటీఎం) నాలుగేళ్ల క్రితం ఈ యాప్ను రూపొందించింది. పిడుగుపాటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. కాపర్ ఎర్త్వైర్తో ప్రమాదాలకు చెక్.. ఇంటి పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు నుంచి కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి ఆవరణలో కొంత ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైర్ ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటు చేయడం ద్వారా దాదాపుగా కిలోమీటర్ దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఇదే ఆకర్షించుకుంటుంది. ఎర్త్ వైర్ను ఉప్పు, కర్ర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమి లోపలికి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎరుపు : మీరు ఉన్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే యాప్లోని సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. పసుపు : మరో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే యాప్ లోని సర్కిల్ పసుపు కలర్ లోకి మారుతుంది. నీలం : 15 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్లోకి మారిపోతుంది. వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా పనులు ఆపుకొంటే మంచిది. అత్యవసర పనులు ఉండి వర్షంలో బయటకు వెళ్లిన సమయంలో దామిని లైటింగ్ యాప్ ఉపయోగించి పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో పసికట్టవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు. – ప్రవీణ్ కుమార్, తహసీల్దార్, బెల్లంకొండ -
ఇంతేనా.. రికవర్రీ!
నరసరావుపేట టౌన్: ఒక్కసారిగా ధనవంతులు కావాలంటే.. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటే నమ్మకమే పెట్టుబడి. అమాయకుల అత్యాశే రాబడి. ఇదే సూత్రాన్ని అమలు చేసి కొందరు మాయగాళ్లు.. జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ కోవలో మోసాలకు నరసరావుపేట కేంద్రంగా మారింది. కొన్ని నెలల కిందట బయటపడిన యానిమేషన్ స్కామ్లో బాధితులు అత్యధికంగా నరసరావుపేటలోనే ఉన్నారు. రూ.పది పెట్టుబడి పెడితే రూ.వంద వస్తాయని నమ్మబలకటంతో బాధితులంతా నమ్మి పెట్టుబడి పెట్టారు. ఇలా నరసరావుపేటలోనే సుమారు రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టి మోసపోయారు. అధిక లాభాలకు ఆశపడి.. విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో గుంటూరుకు చెందిన మిట్టపల్లి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజు నరసరావుపేటకి చెందిన ఓ ప్రముఖ బంగారం వ్యాపారి అల్లుడు. దీంతో అతనికి నరసరావుపేటలోని వ్యాపారులు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. యానిమేషన్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి అనేక మందితో రూ.కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. నిందితుడికి సమీప బంధువైన నరసరావుపేటకు చెందిన పొగాకు వ్యాపారి అతని మాటలు నమ్మి పెద్ద మొత్తంలో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి మోసపోయి దీవాళా తీశాడు. ఉన్న అస్తుల కంటే అప్పులే అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే పరిస్థితికి వచ్చాడు. మరో బంగారం హోల్సేల్ వ్యాపారి కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. నిందితుడు మిట్టపల్లి రాజును శుక్రవారం నరసరావుపేటలోని అతని బావమరిది ఇంట్లో అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు శనివారం అరెస్ట్ చూపారు. రాజు జనాల వద్ద దోచుకున్న డబ్బును అనేక రూపాల్లో దారి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. బంగారం, బినామీల పేరుతో ఆస్తులు కూడగట్టినట్టు సమాచారం. అయితే పోలీసులు వాటిపై దృష్టి సారించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదు బెజవాడలో.. యానిమేషన్ స్కాంపై మొదట పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కేసు నమోదు అవ్వాల్సి ఉంది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు తొలుత నరసరావుపేట పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. అయితే ఈ స్కామ్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితులు విజయవాడ పోలీసులను సంప్రదించారు. అక్కడ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కేసు స్థాయినిబట్టి సిట్ను ఏర్పాటు చేయడంతో బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే పోలీసు విచారణ అనంతరం రికవరీని చూసిన బాధితులు నీరుగారిపోయారు. పదోవంతు కూడా లేదు యానిమేషన్ స్కాం మొత్తం రూ.400 కోట్ల దాకా ఉండగా అందులో నరసరావుపేటకు చెందిన అనేక మంది వ్యాపారుల సొమ్మే సుమారు రూ.200 కోట్ల వరకు ఉంది. తమ పెట్టుబడికి అధికంగా డబ్బులు వస్తాయని నమ్మారు. అయితే బోర్డు తిప్పేశాక వారంతా వేదనలో ఉన్నారు. చివరకు పోలీసులపై ఆశలు పెట్టుకుంటే.. వారు చేసిన రికవరీ అంతా కలిపినా కూడా పోగొట్టుకున్న దానిలో పదో వంతు కూడా లేదు. ఇదే కాకుండా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి ఆస్తులను పూర్తిస్థాయిలో అటాచ్ చేయలేదు. దీంతో తమకు న్యాయం ఎప్పుడు? ఎలా ? జరుగుతుందో తెలియక బాధితులు వేదన పడుతున్నారు. పోగొట్టుకుంది కొండంత.. వసూలు గోరంత ఒకటికి పది రెట్లు వస్తాయన్న ఆశతో యానిమేషన్ వలలో చిక్కుకున్న బాధితులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలేలా ఉంది. ఇంతకాలం పోలీసులపై పెట్టుకున్న నమ్మకం తాజాగా అరెస్టులతో నీరుగారింది. నష్టం రూ.వందల కోట్లలో ఉంటే రికవరీ మాత్రం అందులో పది శాతం కూడా లేకపోవడం గమనార్హం. రూపాయి రూపాయి కూడగట్టిన సొమ్ము నమ్మకంగా పెట్టుబడి పెడితే నట్టేట మునిగిపోయామనే దిగులు నిలువెల్లా కుంగదీస్తోంది. ఇప్పటికే ఈ స్కాముకు ఒకరు బలికాగా.. మిగతావారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.స్కాంలకు కేంద్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసరావుపేట స్కాముల కేంద్రంగా మారింది. ఇక్కడ పుల్లారావు సాయిసాధన చిట్ ఫండ్ పేరిట భారీగా వసూళ్లు చేసి బోర్డు తిప్పేశాడు. పోలీసులు ఈ కేసులో హడావుడి చేసి చివరకు బాధితులను వదిలేశారు. బాధితులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. యానిమేషన్ స్కాములోనూ అత్యధిక మంది నరసరావుపేట వాసులే ఉన్నారు. వీరు కూడా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి న్యాయం కోసం వేడుకున్నా.. చివరకు అన్యాయమే జరిగిందని గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికే ఓ బాధితుడు మోసాన్ని భరించలేక గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. రికవరీ జరుగుతుంది.. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులు తాజా పరిణామాలతో ఢీలాపడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే అనేకమంది బాఽధితులు నేడు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. -
సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర సమస్యలకు సంబంధించిన 86 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై శ్రద్ద వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. జాబ్తో పాటు కమీషన్ ఇప్పిస్తామని ఓ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు రూ.35.50లక్షలు మోసం చేశారు. నా ఫోన్ నెంబరుతో వర్క్ ఫ్రం హోం ప్లాట్ఫామ్తో పాటు ఐడీని క్రియేట్ చేసి డబ్బులు వస్తాయని ఆశ చూపించారు. ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి 20 ప్రాజెక్ట్ల నుంచి కమీషన్ ఇస్తామని నమ్మించారు. దీనిని నమ్మి ఈ ఏడాది జూలై 28వ తేదీ నుంచి ఈనెల 13వ తేదీ వరకు సుమారు రూ.35.50లక్షలు ఫోన్ పే ద్వారా పంపించాను. కమీషన్ నగదు అడగ్గా సదరు ప్రాపర్టీస్ ప్రతినిధులు మరో రూ.5లక్షలు చెల్లిస్తే మొత్తం ఇస్తామని చెబుతున్నారు. మోసపోయాను.. సదరు సంస్థ నుంచి నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. – తోట అజయ్, వినుకొండ మేం ముగ్గురం ఎంసీఏలు పూర్తిచేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాం. అక్కడ కాసరగడ్డ నరేంద్ర అనే అతను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇందుకు రూ.4లక్షలు చెల్లించాలని చెప్పాడు. నమ్మి ముగ్గురం కలిపి రూ.4లక్షలు చెల్లించాం. అయితే ఆరు నెలలు గడుస్తున్నా, జాబ్లు చూపించకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. – షేక్ రబ్బాని, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్బాషా గ్రామంలోని ఎస్టీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా గణేశ్ పందిరి ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నాం. నిమజ్జనం సందర్భంగా గత ఏడాది గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. ఈ ఏడాది కూడా అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం ఉంది. గ్రామంలో ఊరేగింపు సక్రమంగా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – ఎస్టీ కాలనీ వాసులు, పెద రెడ్డిపాలెం -
బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తులు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో 54 బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 49, గీత కార్మిక కులాలకు 5 బార్ అండ్ రెస్టారెంట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి ఏడాదికి రూ.55 లక్షలు, నగర పంచాయతీలకు రూ.35 లక్షలుగా ఫీజు నిర్థారించిందన్నారు. ఆరు విడతలుగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే గీత కార్మికులకు కేటాయించిన బార్లకు నిర్థేశించి లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. -
‘అసెస్మెంట్ బుక్’పై ఉపాధ్యాయుల అసంతృప్తి
నరసరావుపేట ఈస్ట్: అసెస్మెంట్ బుక్ విధానంపై ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్.జోసఫ్ సుధీర్బాబు తెలిపారు. ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మూల్యాంకనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కో ఉపాధ్యాయుడు మౌఖిక పరీక్షలు, విద్యార్థుల ప్రతిస్పదనలను వందలాది పేజీలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైమరీ తరగతులకు 240 పేజీలు, ఉన్నత తరగతులకు 147 పేజీల్లో విద్యార్థి ప్రతిస్పందనలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుడు వందలాది పేజీలను నమోదు చేసుకుంటూ ఉంటే బోధనకు సమయం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు ముగిసిన పది రోజుల పాటు ఉపాధ్యాయుడు మూల్యాంకన పుస్తకాలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదేమి మదింపు విధానమంటూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై మండి పడ్డారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ పెడుతున్న పరీక్షలు ఉపాధ్యాయులకా.. విద్యార్థులకా ? అని ప్రశ్నించారు. ఇప్పటికే మోడల్ స్కూల్ పేరిట చేపట్టిన సంస్కరణల కారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ప్రైవేటుకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఎసెస్మెంట్ బుక్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటకోటయ్య, ఆర్థిక కార్యదర్శి ఏ.ఏమండీ పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు -
రైతులపై యూరియా బాదుడు!
● మార్కెట్లో యూరియా కొరత ఉందంటూ జోరుగా ప్రచారం ● అడ్డగోలుగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ● బస్తాపై రూ.వంద వరకు పెంచి రైతులను దోచుకుంటున్న వైనం ● కొరత భయంతో సీజన్ మొత్తం సరిపోయేలా కొంటున్న అన్నదాతలు ● సమస్య పరిష్కారంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కొరతను సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. దీంతో సాగుకు అవసరమైన మొత్తం యూరియాను రైతులు ఒకేసారి అధిక ధరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట రూరల్: జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఒక వైపు జోరుగా వర్షాలు, మరో వైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడంలో ఈ ఊపు కొనసాగుతోంది. వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తుగా బోరు బావుల కింద నారుమళ్లు వేసిన రైతులు నాటు వేసే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూమి పదునెక్కడంతో పత్తి విత్తనాలను పెద్ద ఎత్తున విత్తారు. వ్యాపారుల మాయాజాలం రైతులను యూరియా కొరత వేధిస్తోంది. వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం బస్తా ధర రూ.280గా నిర్ణయించగా, వారు రూ.380 వరకు విక్రయిస్తున్నారు. దాదాపు రూ.100 అధికంగా రైతుల నుంచి అదనంగా పిండేస్తున్నారు. సీజన్ మొత్తానికి అవసరమైన యూరియాను రైతులు భయంతో ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ఎరువుల వ్యాపారులు యూరియా ధరలు అడ్డగోలుగా పెంచుకుంటూ పొతున్నారు. మొద్దు నిద్రలో అధికారులు ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చేస్తున్న ప్రకటనలను వ్యాపారులు పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా కొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. జిల్లా అధికారులు ఉండే నరసరావుపేటలోనే బస్తాకు రూ.100 అధికంగా దోచుకుంటున్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు,. పిడుగురాళ్లలోనూ ఇదే దోపిడీ కొనసాగుతోంది. దుకాణాల వద్ద స్టాక్, ధరల బోర్డు పెట్టిన వారే లేరు. అదనపు భారం యూరియా కోసం వచ్చే రైతులకు వ్యాపారులు కొన్ని నిబంధనలు పెడుతున్నారు. ఇతర ఎరువులు కూడా కొనాల్సిందే అని బెదిరిస్తున్నారు. డీఏపీతోపాటు నానో యూరియాను తీసుకుంటేనే యూరియా విక్రయిస్తామని చెబుతున్నారు. అవసరం లేకున్నా అదనపు భారం మోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు నెలకు 18,595 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 33 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. ఇప్పటికే 11 వేల మెట్రిక్ టన్నుల వరకు విక్రయించాం. యూరియా కొరత అనేది అవాస్తవం. వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎం.జగ్గారావు, జిల్లా వ్యవసాయ అధికారి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరతను వ్యాపారులు సృష్టించుకుండా ఆర్బీకేలు కీలకపాత్ర పోషించాయి. సీజన్కు అవసరమయ్యే ఎరువులను ఇక్కడే అందుబాటులో ఉంచేవారు. రైతులు నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుసేవా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. ఎరువులను కేటాయించకుండా కేవలం సొసైటీల ద్వారానే పంపిణీ చేస్తోంది. అధికార పార్టీ సానుభూతిపరులకే ఈ ఎరువులు అందుతున్నాయి. మిగతావారు దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి పాలనలో అదనపు భారంతో అన్నదాతలు విలవిలవ్యాపారులు చెప్పిన ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎక్కడా లేదు. గతంలో రూ.50 వరకు అధికంగా తీసుకునేవారు. ఇప్పుడు రెట్టింపు అయింది. – చెంచయ్య, రైతు, గొనెపూడి యూరియా కొరత ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. పంపిణీపై ప్రభుత్వం పర్యవేక్షణ లేదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి ఎరువులను అందుబాటులో ఉంచాలి. – అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అద్యక్షుడు -
మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’
సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం ఉద్యోగుల ప్రయోజనాలకు గండి జీజీహెచ్కు జనవరిలో వచ్చిన ఫైల్ జూలై నెలలో ప్రత్యక్షం క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్ తొక్కిపెట్టిన వైనం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు ఒకరికి బదులు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు యత్నం -
ఇంజినీరింగ్కు ఫుల్ డిమాండ్
● ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇంజినీరింగ్ సీట్లు దాదాపు భర్తీ ● 36 కాలేజీల్లో తొలి విడత కౌన్సెలింగ్లోనే 90 శాతానికిపైగా భర్తీ ● ప్రస్తుతం చివరి విడతలో మిగతా సీట్ల భర్తీకి సన్నాహాలు ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత ప్రక్రియ ముగిసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా మొదటి విడతలో ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఆటో: ద్విచక్ర వాహనం ఢీ
పెదకూరపాడు: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని పెదకూరపాడు– లింగంగుంట్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాటిబండ్లకు చెందిన మన్నవ జోసఫ్, జలాల్పురం గ్రామానికి చెందిన మన్నవ కిరణ్లు పెదకూరపాడు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఇదే సమయంలో పొడపాడు నుంచి ఆటోలో ప్రయాణికులతో సారెకుక్క జోసఫ్ పెదకూరపాడు వస్తున్నాడు. ఈ క్రమంలో పెదకూరపాడు–లింగంగుంట్ల వద్ద మూల మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జోసఫ్, కిరణ్లు నాలుగు అడుగులు మేర ఎత్తుకు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జోసఫ్కు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సారెకుక్క జోసఫ్కు కూడా గాయాలయ్యాయి. ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించారు. ఇందులో కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పులిచింతలకు 2,04,138 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 11 క్రస్ట్ గేట్ల ద్వారా 2,04,138 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 11 క్రస్ట్ గేట్లు 3.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,04,138 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.33 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.963 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 59.80 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 1,99,781 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వంశీకృష్ణారెడ్డి
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లిథమ్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఈ.వంశీకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి జిల్లా ముఖ్య శిక్షణ అధికారి పి. నర్సింహారెడ్డి పర్యవేక్షణ అధికారిగా క్రీడా కోడ్– 2011 అనుసరించి ఎన్నికల నిర్వహించడానికి నిర్ణ యించారు. సమావేశానికి సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.కృష్ణకిశోర్రెడ్డి, పి.శివపార్వతి వ్యవహరించారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.రమణ, రాష్ట్ర ఎగ్జిక్యూ టివ్ మెంబర్ బి.లక్ష్మీప్రసన్న పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా న్యాయవాది ఎస్.వి. రమణారెడ్డి వ్యవహరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా ఈ. వంశీకృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సంతోష్ ప్రభుకుమార్, కార్యదర్శిగా పి. సామంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నర్రా శ్రీనివాస్, కోశాధికారిగా ఏ. జనార్దన్ యా దవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వి.శబరినాథ్, పి. శివపార్వతి, బి. యామిని, వై. రంజాన్బీలు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. -
25న కలెక్టరేట్ వద్ద కౌలు రైతు సంఘం ధర్నా
నరసరావుపేట రూరల్: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న ‘చలో కలెక్టరేట్’ నిర్వహిస్తున్నట్టు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ తెలిపారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మండలలలోని కేసానుపల్లి, చిన్నతురకపాలెం, చింతలపాలెం, గోనెపూడి, గురవాయపాలెం, అర్వపల్లి, ఉప్ప లపాడు తదతర గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు మంజూరు చేయాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైన్సాన్స్ ప్రకారం రూ.2లక్షల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ప్రత్యేక రాయితీలు, పంట రుణాలు అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడమే తప్పా అమ లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమ ర్శించారు. కౌలు రైతు గుర్తింపు కార్డుల వల్ల ఆశించిన మేర ప్రయోజనం దక్కడం లేదని తెలిపారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కౌలు రైతులను గుర్తించి ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. పల్నాడు జిల్లాలో 60శ ాతం కౌలు రైతులే పంటల సాగు చేస్తున్నారని తెలి పారు. జిల్లాలో 1.50లక్షలు కౌలు రైతులు ఉంటే 65 వేల మందికే గుర్తింపు కార్డులను లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించడం బాధాకరమని తెలిపారు. కార్డులు లేని వారు ప్రభుత్వ పథకాలు అందక ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, ప్రజానాట్యమండలి కార్యదర్శి టి.పెద్దిరాజు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ప్రతిజ్ఞను జయప్రదం చేయండి
లక్ష్మీపురం: ఈనెల 28వ తేదీన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి వంటి యువకిశోరాలు ప్రాణ త్యాగంతో 20 సంవత్సరాలు పాటు విద్యుత్ చార్జీలు పెంచడానికి పాలకులు భయపడ్డారన్నారు. నేడు సర్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టమని పిలుపు ఇచ్చారని, నేడు అదానీతో ఒప్పందం వల్ల దగ్గరుండి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆగస్టు 28వ తేదీన జరిగే విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినంగా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి ఎం.సాంబశివరావు, జిల్లా కార్యదర్శిలు వై.నేతాజీ, జి.రమణ, బి.ముత్యాలరావు, నన్నపనేని శివాజీ, సిహెచ్ నాగ బ్రహ్మచారి, ఎస్ఎస్ చెంగయ్య, ఎం.భాగ్యరాజు, లక్ష్మి జిల్లా ఉపా ధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, ఎస్కే హుస్సేన్ వలి, కె.బాబు ప్రసాద్ పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి -
‘నాన్స్టాప్’ అబద్ధాలు
అతివలకు ● ‘ఉచిత ప్రయాణం’ పేరిట మహిళలకు మరో కుచ్చుటోపీ ● నరసరావుపేట డిపోలో ఎక్స్ప్రెస్లు నాన్స్టాప్గా మార్పు నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ (సీ్త్ర శక్తి ) పథకం మరో మోసమని తేలిపోయింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆయా సర్వీసుల్లో కేవలం పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలు లేదా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం మహిళలకు వర్తింపచేసింది. మరోవైపు ఎక్స్ప్రెస్లను నాన్స్టాప్గా మార్చి ఎక్కనీయడం లేదు. నరసరావుపేట డిపోలో పథకం అమలు తీరును పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం కుటిల వైఖరి వెల్లడవుతోంది. మొత్తం బస్సులు 84 ఉండగా... వీటిలో 20 అద్దె బస్సులు ఉన్నాయి. 40 పల్లె వెలుగు కాగా.. ఎక్స్ప్రెస్ బస్సులతో నరసరావుపేట–గుంటూరు నాన్స్టాప్ సర్వీసులను నడుపుతున్నారు. శ్రావణ మాసంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బస్సుల్లో రద్దీ అధికంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆరు బస్డిపోలు ఉండగా వాటిలో 489 బస్సులు ప్రజారవాణా చేస్తున్నాయి. ఎక్స్ప్రెస్లు 73, పల్లెవెలుగు 325 బస్సులు ఉచిత ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. 91 బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని అధికారులు చెప్పారు. కానీ ఎక్కువ బస్సులు నాన్స్టాప్ అని చెబుతూ అధికారులు ఎక్కనీయడం లేదని మహిళలు వాపోతున్నారు. -
గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
వినుకొండ: గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్తో అ సెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని తెలి పారు. ఇప్పటికీ రేషన్, ఆధార్ కార్డులు లేక దుర్భర మైన జీవితాలు గడుపుతున్నారని పేర్కొన్నారు. నేటికి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులు దారి మళ్లించకుండా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణా నాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగ నాయక్, గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేత బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సామి, రేమిడిచర్ల సర్పంచ్ బ్రహ్మం, రాంజీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని.. -
కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు
తాడేపల్లిరూరల్: ఉండవల్లి అమరావతి కరకట్టపై గల ఆక్వా డెవిల్స్ అసోసియేషన్లో సిమ్మింగ్ కాంపిటేషన్ను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆడ్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని పలు సముద్రాలను ఈదుతున్న క్వీన్ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్లు 1.5 కి.మీ. కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటేషన్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏడు సముద్రపు చానల్స్లో భాగంగా రెండవది అయిన అమెరికాలోని మెయిన్ ల్యాండ్ నుంచి సౌత్ కాలిఫో ర్నియా బీచ్ వరకు 33.5 కి.మీ స్విమ్మింగ్ చేయడానికి సెప్టెంబర్ నెలలో వెళ్తున్న సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు సూచన మేరకు వారికి రూ. 25,116 చెక్కును అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి వై.వి. రమేష్ కుమార్మాట్లాడుతూ క్వీన్ విక్టోరియా తన పిల్లలను శిక్షణ శిబిరంలో చేర్పించి, తాను కూడా పిల్లలతో పాటు ఈత నేర్చుకుని మాస్టర్ స్విమ్మింగ్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని సముద్రాలను ఈదుతున్న మొట్టమొదటి తెలుగు మహిళ , ఆమె కుమారుడు ఆక్వా డెవిల్స్ గౌరవ సభ్యులు కావడం గర్వకారణమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఎ.రామిరెడ్డి, కోశాధికారి కె.వి.రామయ్య, కార్యవర్గ సభ్యులు కె.సాంబశివరాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, కర్రిసాంబయ్య, పి.శ్రీనివాసులు, కె.ఆశీర్వాదం, అబ్దుల్ గఫూర్ తదితరులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లను అభినందించారు.ఈత పోటీల్లో ప్రతిభ చూపుతున్న తల్లీకుమారులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్కుమార్లకు ఘనసన్మానం -
భవనం శిథిలం.. భద్రత శూన్యం
పెదకూరపాడు: పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, సిబ్బంది ప్రతి క్షణం భయం భయంగా గడుపుతున్నారు. పాత భవనం కావడంతో పెచ్చులూడుతూ, వర్షాలకు కారుతూ ప్రమాదకరంగా మారింది. చినుకు పడితే చాలు వారు గజగజ వణుకుతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వైద్యశాలలోని ఫార్మసిస్ట్ గది, ఇన్ పేషెంట్లు గదులు, వరండాలు, శ్లాబు కారుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడులో రూ.8 కోట్లతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఆ వైద్యశాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా వైద్యశాలలో ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో సిబ్బంది నేటికీ పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే పాత భవనం కూలేలా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రతిసారి వారు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నూతన ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందితోపాటు ప్రజలు కూడా వేడుకుంటున్నారు. -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి ● దొడ్లేరు గ్రామంలో పర్యటన దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమరాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. క్లీనరు మృతి -
పేదింటిపైనా కూటమి కక్ష
పేదలందరికీ సొంత గూడు కల్పించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఐదేళ్లలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇళ్లు కాదు.. నూతనంగా ఊళ్లే ఏర్పాటయ్యాయి. నరసరావుపేటలోనూ వైఎస్సార్ జగనన్న కాలనీ వెలిసింది. 6 వేల మందికి స్థలాలు కేటాయించగా, వెయ్యి కుటుంబాలు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి లేదు. సౌకర్యాలు కల్పించకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసరావుపేట రూరల్: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేదల కోసం ఉప్పలపాడు రోడ్డులో వైఎస్సార్ జగనన్న కాలనీని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. పట్టణంలో నివసిస్తూ సొంత ఇళ్లు లేని 6 వేల మందికి పట్టాలు మంజూరయ్యాయి. లింగంగుంట్ల, ఇక్కుర్రు పరిధిలో 150 ఎకరాలను దీనికోసం సేకరించారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకం ద్వారా పేదలు కూడా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.కోట్ల వ్యయంతో... పేదల సొంతింటి కల తీర్చేందుకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. పట్టణానికి సమీపంలోని అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి సేకరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికోసం తీవ్రంగా శ్రమించారు. రైతులతో పలు దఫాలుగా చర్చించి, ఒప్పించారు. పట్టాల పంపిణీ అనంతరం కాలనీలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయించారు. ఈ వసతికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. వినుకొండ–నరసరావుపేట హైవే నుంచి కాలనీ వరకు ప్రధాన రోడ్డును రూ.కోటితో నిర్మింపజేశారు. కాలనీలోని అంతర్గత రోడ్లు కోసం రూ.కోటి ఖర్చు పెట్టారు. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్న నమ్మకంతో దాదాపు వెయ్యి కుటుంబాలు కాలనీలో గృహప్రవేశాలు చేశాయి. కూటమి పాలకుల దగా ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గృహనిర్మాణాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను దుండగులు ధ్వంసం చేశారు. ఇక అభివృద్ధి పనులు మచ్చుకై నా మొదలు పెట్టలేదు. దాదాపు 2 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో వాటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. -
ఆటోవాలా బతుకు డీలా
ముప్పాళ్ళ: కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. సీ్త్ర శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించడంతో జీవనోపాధికి గండి పడుతోంది. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీసం చర్చలు జరపడం లేదన్నారు. ‘వాహన మిత్ర’ తరహాలో తమకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొండిచేయి నెలకు వాహన కిస్తీ, ఇంధనం, నిర్వహణకోసం దాదాపు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. రవాణాశాఖ అధికారుల తనిఖీలో నమోదయ్యే కేసులు, ప్రతి ఏడాది బ్రేక్ ఫిట్నెస్ కోసం ఖర్చులు అదనమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మ బలికింది. అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా ఇవేమీ అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేల సాయం అందించారు. వాహనాల తనిఖీలు, అక్రమ కేసులు నమోదు లేకుండా అండగా సర్కారు నిలిచింది. కానీ, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరును ప్రయివేటు ఏజన్సీలకు అప్పగించేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. జీఓ నెంబర్ 21 పేరుతో ట్యాక్స్లు, జరిమానాలు భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది. -
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శనివారం వైభవంగా జరిగాయి. ముఖ్యంగా వైష్ణవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. హరే కృష్ణ ... హరే కృష్ణ ... కృష్ణ కృష్ణ ... హరే హరే అంటూ భక్తులు కృష్ణ నామస్మరణ చేశారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. సామూహిక గీతా పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బరంపేటలోని శ్రీరాధా గోవింద చంద్ర మందిరం ఇస్కాన్లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యడ్లపాడు: యడ్లపాడు మండలంలోని చెంఘీజ్ఖాన్పేటలో 363 ఏళ్ల నాటి శ్రీరాజ్యలక్ష్మి సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువున్న వెన్నముద్దల బాలకృష్ణునికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యన్నారాయణ చార్యులు, రాఘవేంద్ర, జితేంద్ర ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. బాలకృష్ణుని నిజరూపదర్శనం చేసుకున్న భక్తులు పులకించిపోయారు. అనంతరం నరసరావుపేట భజన సమాజం విశేష భజన కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఏడాదికి ఒకసారి భక్తులకు అందించే మోడికారంతో పాటు స్వామివారి పూజల్లో ఉంచిన వెన్న, ఇతర ప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి 7 గంటలకు తులువ వంశీయులచే ఆలయం వద్ద ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈఓ నెమలిరెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఆలయాలు కిటకిటసత్తెనపల్లి: పట్టణంలోని ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడవల్లి ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయం, ఐదు లాంతర్ల సెంటర్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, గుంటూరు రోడ్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనసారా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయ ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయంలో నిర్వహించిన వేడుకలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లడంతో లాంచీస్టేషన్కు రూ.1,78,450 ఆదాయం సమకూరినట్లు యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, రామకృష్ణ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు. మాచర్ల: మాజీ ఎంపీపీ బూడిద వెంకమ్మ కుమారుడు శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వివరాలు చెప్పకుండా తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ బంధువులు అందరూ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి బూడిద శ్రీనివాస్ను విజయపురి సౌత్ పోలీసు స్టేషన్కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించారు. శ్రీనివాస్కు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. -
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డు
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్న్పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు. పేద విద్యార్థులకు సాయం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్గా నిలిచారు. -
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య -
మహనీయుల త్యాగాలు స్మరించుకోవాలి
నరసరావుపేట రూరల్: స్వేచ్ఛ, సమానత్వం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జాతీయ జెండాను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉట్టి పడే విధంగా కుల, మత, వర్గ, ఆర్థిక భేదాలు పక్కన పెట్టి దేశమంతా జరుపుకునే ఏకై క వేడుక స్వాతంత్య్ర దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిబాబు, అదనపు ఎస్పీ(క్రైమ్)లక్ష్మీపతి, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్బీ సీఐలు బి.సురేష్బాబు, పి.శరత్బాబు, ఆర్ఐలు ఎస్.కృష్ణ, ఎల్.గోపినాథ్, ఎం.రాజా తదితరులు పాల్గొన్నారు. -
వరదకు కొట్టుకుపోయిన పెదమద్దూరు రోడ్డు
నిలిచిపోయిన అమరావతి– విజయవాడ రాకపోకలు అమరావతి: కొద్ది రోజుల కింద వచ్చిన వరదకు పెదమద్దూరు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అమరావతి నుంచి విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెదమద్దూరు వద్ద సుమారు అర కిలోమీటరు మేర పూర్తిగా ధ్వంసమైంది. వైకుంఠపురం, పెదమద్దూరు గ్రామాల ప్రజలతోపాటుగా అమరావతి నుండి విజయవాడకు వెళ్లే వారికి విజయవాడ నుంచి అమరావతి వచ్చే యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అమరావతి నుండి వైకుంఠపురం పెదమద్దూరు వెళ్లాలంటే నరుకుళ్లపాడు, ఎండ్రాయి, చావపాడు మీదుగా సుమారు 12కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం విజయ వాడ–అమరావతి బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి అక్కడి నంండి వెనుతిరుగుతున్నాయి. గురువారం రాత్రి పెదమద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ సిబ్బంది కాపాలా కాస్తున్న అమరావతికి చెందిన ట్రాక్టర్ అమరావతి నుంచి వైకుంఠపురం వైపు వెళ్ళటానికి ఈ రోడ్డు గుండా వచ్చి ప్రమాదవశాత్తు వాగులో పడి వరదనీటిలో మునిగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్కు ప్రాణాపాయం తప్పింది. వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మాజీ ఎమ్మెల్యే బొల్లా
జాతీయ జెండాను అవమానించడం బాధాకరం గుంటూరు: వినుకొండలో జాతీయ జెండాకు అవమానం జరగటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులుకు జాతీయ జెండా కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కోట్లాది మంది భారతీయులు దైవంగా భావించే జాతీయ జెండాను బూటు కాళ్లతో తొక్కడం బాధాకరమన్నారు. గతంలో వినుకొండలో ఉన్న ఒకే ఒక్క గాంధీ విగ్రహం ట్రాఫిక్కు అడ్డంగా ఉందని తొలగించారని పేర్కొన్నారు. నేడు జాతీయ జెండాను అవమానించారు. ఇప్పటికై నా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. కోతకు గురైన బుగ్గువాగు బ్రిడ్జి మూడు రోజుల నుంచి రాకపోకలు బంధ్ స్పందించని అధికారులు పిడుగురాళ్ల: ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని బుగ్గువాగు బ్రిడ్జి ఇరువైపులా కోతకు గురవ్వటంతో రాకపోకలు స్తంభించాయి. మూడు రోజుల నుంచి రాకపోకలకు త్రీవ అంతరాయం ఏర్పడింది. అటువైపు వెళ్లే ప్రజలు బైపాస్ రోడ్డుపై నుంచి పట్టణంలోనికి రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 200 గృహాల వారు నిసిస్తున్నారు. వారందరికి రాకపోకలకు పట్టణంలోకి వచ్చే అవకాశం లేకుండా ఈ బ్రిడ్జి కోతకు గురైంది. తప్పనిపరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర పిడుగురాళ్ల పట్టణంలోకి రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే కోతకు గురైన రోడ్డును పూడ్చాలని, తరచూ వచ్చే వరదలకు కోతకు గురవుతుంది కాబట్టి శాశ్వత పరిష్కారం వైపు అధికారులు అడుగులు వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. -
గంజాయితో పాటు నగలు, నగదు స్వాధీనం
గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్ చిలకలూరిపేట: గంజాయి విక్రయాలకు పాల్పడటంతోపాటు సేవిస్తున్న ముఠా సభ్యులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ యువత, విద్యార్థులను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ముఠాపై రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్న గణపవరం రాజీవ్గాంధీ కాలనీకి చెందిన అన్నంరాజు ఈశ్వరసాయికుమార్తోపాటు నేలపాటి ఠాగూర్, షేక్ హుస్సేన్భాష, షేక్ బాజీ, పల్లపు నాగబాబు, కుంచాల రవితేజ, పల్లపు కళ్యాణ్కుమార్, తెప్పలి వెంకటేష్, గుద్దంతి సురేష్, సింగంశెట్టి ప్రవీణ్కుమార్, షేక్ జాన్బాష, సొంటినేని పవన్కళ్యాణ్, పులగం సాయివెంకటేష్, నక్కల ఏసుబాబు, నాగండ్ల ఆదిత్యలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల 440 గ్రాముల గంజాయి, రూ. 3500 నగదు, ఒక సెల్ఫోన్, 117 గ్రాముల బంగారం స్వాఽధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అన్నంరాజు ఈశ్వరసాయికుమార్ తొలినుంచి గంజాయి కొనుగోలు చేస్తూ మిగిలిన వారితో విక్రయాలు చేయిస్తున్నాడు. ఈ నెల 11న ఒడిశాకు చెందిన వలస కార్మికుడు ఉత్తం రౌత్ను గంజాయి మత్తులో బీర్ సీసాతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంకా ఈ ముఠాలో సభ్యులను గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్కుమార్, నాదెండ్ల ఎస్ఐ జి పుల్లారావు, ఏఎస్ఐలు డి రోసిబాబు, జీవీ సుబ్బారావు, పి రమేష్, కానిస్టేబుళ్లు కె దేవరాజు, జె శ్రీధర్, ప్రసాద్, అనిల్కుమార్, వెంకట్రావు, ఎం. ఇర్మియా తదితరులు పాల్గొన్నారు. -
దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర
లక్ష్మీపురం: భారతీయ రైల్వేలు కేవలం రవాణా సాధనం కాదు, మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రైల్వే పోలీసులు నిర్వహించిన పరేడ్లో పాల్గొని జాతీయ పతాకాన్ని డీఆర్ఎం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో డివిజన్ అనేక రకాల విజయాలను, లక్ష్యాలను సాధించిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. నగరంపాలెం: దేశ వ్యాప్తంగా అందరూ నిర్వర్తించుకునే వేడుక స్వాతంత్య్ర దినోత్సవమని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరగ్గా, జాతీయ జెండాను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఎగురవేశారు. జిల్లా ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, సురేష్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపు మంగళగిరిటౌన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలను అదుపు చేస్తున్నామని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. శాఖ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మతో కలసి కమిషనర్ నిశాంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని(ఏఎన్యూ): భారతదేశం విదేశీయుల పాలన నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించేందుకు కృషిచేసి అశువులు బాసిన త్యాగధనుల పోరాటాలను నేటి యువత స్మరించుకోవాలని ఏఎన్యూ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. వర్సిటీలోని వ్యాయామ విద్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిపిఎస్ పాల్కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఇన్చార్జి రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపల్స్ ఆచార్య ఎం.సురేష్కుమార్, ఆచార్య వీరయ్య, ఆచార్య సిహెచ్ లింగరాజు, ఆచార్య ప్రమీళారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి చంద్రమౌళి, డిగ్రీ, పీజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య కృష్ణారావు, ఆచార్య సుబ్బారావు, సీడీఈ డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ రామచంద్రన్, విదేశీ విద్యార్థుల సెల్ డైరెక్టర్ ఆచార్య పద్మావతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆచార్య దివ్యతేజోమూర్తి, సోషల్వర్క్ విభాగాధిపతి ఆచార్య యం త్రిమూర్తిరావు, సీఐ, ఏసిఇ, ఇంజనీర్, డిప్యూటీ ఇంజినీర్లు, అధ్యావకులు, గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం కొరిటెపాడు(గుంటూరు): ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని, వాటి ఫలాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. జీటీ రోడ్లోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. యశ్వంత్కుమార్, విశ్వశ్రీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని, మన దేశప్రగతిని, సాధించిన లక్ష్యాలను గుర్గుపెట్టుకొని మనమంతా ముందుకు సాడాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో.... తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్జైన్ త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, యోధులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎన్డీఆర్ఎఫ్,ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. దాతలు యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మిల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో మూడోరోజున మండప పూజలు జరిగాయి. అనంతరం ఉపాలయాలలో పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం కలశానికి ఉద్వాసన చేసి కలశాలలోని పుణ్యజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పవిత్రాలను తొలగించిన తర్వాత స్వామివారికి విశేషాలంకారం చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళల అభివృద్ధే ధ్యేయం నరసరావుపేట రూరల్: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్డీవో మధులతలు పాల్గొన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపీ లావు మాట్లాడుతూ మహిళల సాధికారితకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలు పురోగతి సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అజితకుమారి, డీఎం బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
చీరాల టౌన్: జెండా వందనం సాక్షిగా తోటవారిపాలెం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జెండా వందనం అనంతరం నిర్వహించిన గ్రామసభలో వారు బాహాబాహీకి దిగారు. ఒక వర్గానికి కుర్చీలు వేసి మరో వర్గానికి వేయకపోవడంతో వారు దాడులకు తెగబడ్డారు. దీంతో అటు అధికారులు, ప్రజలు విస్తుపోయారు. తోటవారిపాలెం పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఎం.భారతి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. టీడీపీలోని రెండు వర్గాల వారు కూడా హాజరయ్యారు. గ్రామసభ వేదికపై అధికారులకు మాత్రమే కుర్చీలు వేయాలి. పంచాయతీ కార్యదర్శి మాత్రం ప్రోటోకాల్ పదవులు లేని వారిని వేదికపై కూర్చోబెట్టారు.. మాజీ వైస్ ఎంపీపీ వర్గానికి చెందిన ఓ డీలర్ ... మాజీ వార్డు మెంబర్ ఆదాంపై వేదికపై ఉండటంతో ఆగ్రహానికి గురయ్యారు. ‘మేం అసలైన టీడీపీ నాయకులం... మేం చెప్పిన వారినే కుర్చీలో కూర్చోబెట్టాలి. టీడీపీ నాయకులకు అధికారులు ప్రోటోకాల్ ఇవ్వాలని’ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేశారు. గతంలో ఉన్న పాత గొడవల నేపథ్యంలో డీలర్ సురేష్.. మాజీ వార్డు మెంబర్ ఆదాంపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు తెగపడటంతో అటు ప్రజలు, ఇటు అధికారులు విస్తుపోయారు. తరచూ ఆధిపత్య పోరు తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు కారణంగా గ్రామాల్లో తరచుగా ఇలా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, ఈవోఆర్డీని రామకృష్ణను వివరణ కోరగా తోటవారిపాలెం గ్రామసభలో ఇరువర్గాల వారు తన్నుకున్నారని తెలిసిందన్నారు. దీని గురించి పంచాయతీ కార్యదర్శి భారతి వివరణ తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరి శివరామప్రసాద్పై కూడా దాడి చేసి కొట్టారు. పంచాయతీ కార్యదర్శి మేడికొండ భారతి తీరు వల్లే ఈ ఘర్షణ జరిగిందనే ప్రచారం సాగుతోంది. -
చిన్నబాబుకు అధికారులు సెల్యూట్
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు తమ హోదాలను మరిచి చిన్నబాబు సేవలో తరించారు. ఇతరులను అనుమతించకుండా తమ అనుకూల మీడియాకే అధికారం మొత్తం అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడి మంత్రి లోకేష్ ప్రసంగంలో రాజకీయాలకు, కులమతాలతకతీతంగా పాలన సాగిస్తామంటూనే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ బురద జల్లారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. స్వాతంత్య్ర వేడుకల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లా ఇన్చార్జి మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. కానీ లోకేష్ ప్రసంగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడిగా సాగింది. జిల్లా అభివృద్ధి గురించి పక్కన పెట్టారు. ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే ప్రారంభించారు. లక్షల ఉద్యోగాలు, అద్భుతమైన ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటూ త్రిశంకు స్వర్గాన్ని చూపించారు. లోకేష్ స్వోత్కర్షపై కొందరు అధికారులు ఇదేంటి అంటూ గుసగుసలాడారు. కార్యక్రమాన్ని కూడా అధికారులు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి. అయితే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్, జిల్లా అధికారులు కూడా హుందాగా వ్యవహరించలేదు. పలుమార్లు మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నించగా, వారిని గదమాయించే ప్రయత్నం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశ్రుతులు పోలీసు పరేడ్ మైదానం రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చిత్తడిగా మారింది. అధికారులు కూడా ఏర్పాట్టను అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఆహూతులు కూర్చునే వేదికల్లో కూడా నీరు చేరింది. శకటాలు ప్రదర్శన సందర్భంగా కొన్ని బురదలో కూరుకుపోయాయి. క్రేన్తో వాటిని బయటకు తీయించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. ప్రదర్శించిన కొందరు కూడా బురద కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. లోకేష్ రాగానే ఆయన కాన్వాయిని రోడ్డుకు అడ్డంగా నిలిపి మొత్తాన్ని బారికేడ్లతో మూయించారు. -
తిరంగా.. ఎగిరె సగర్వంగా..
సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట రూరల్: నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. సమరయోధుడి కుమారుడు రామకృష్ణారెడ్డి, రమాదేవి దంపతులతోపాటు దేశం కోసం ప్రాణాలర్పించిన క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన అమర జవాన్ నేతాజీ తల్లిదండ్రులు ఎన్.భాస్కరరావు దంపతులు, రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంకు చెందిన రమకాంత్రెడ్డి భార్య సావిత్రి సత్కారం పొందిన వారిలో ఉన్నారు. సమగ్ర ప్రగతికి చర్యలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహాత్ములు కలలుగన్న స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగ స్ఫూర్తితో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు పీ–4 కింద కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దే పింఛన్ నగదు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సీ్త్ర శక్తి పేరుతో ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం 8,546 మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనల తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ సూరజ్ గనోరే, అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. ప్రభుత్వ శాఖల శకటాలు అలరించాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్, విప్పర్ల రెడ్డిపాలెం, క్రోసూరు మోడల్స్ స్కూల్స్ విద్యార్థులు దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. శావల్యాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. ఎత్తిపోతల గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన కోయ సంప్రదాయ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి, అధికారులు తిలకించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్వో మురళి, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్థానాచార్యులు పొత్తూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదంగా పసుపుకుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మీ దేవి రూపు, కంకణం అందజేశారు. భ్రమరాంబ అమ్మవారు లక్ష గాజుల ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. -
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
నరసరావుపేట రూరల్: ఎందరో మహానుభావుల త్యాగఫలం వలనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం, కోట సెంటర్లోని గాంధీ విగ్రహాల వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర భారతావని నేడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలిపారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అడుగులు పడ్డాయని తెలిపారు. గ్రామ సచివాలయాలు నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆర్బీకేలను నాడు జగనన్న నిర్మించారని తెలిపారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామగ్రామాన బెల్ట్షాపులు పెట్టి మద్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరి చేయిస్తున్నారని విమర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. పంటతోపాటు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. వరద నీటిలో రాజధాని నిర్మాణం సాధ్యమా? అమరావతి రాజధానిని చూస్తే బాధగా ఉందని, వరదలతో రాజధాని నదిలా మారిందన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నీళ్లు తోడటం తప్ప నిర్మాణం చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని రాజధానిని గుంటూరు–మంగళగిరి మధ్య ఏర్పాటు చేస్తే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. అమరావతిలోనే రాజధాని కట్టాలనుకుంటే మరో ఏళ్లు అయినా అది పూర్తికాదని, అక్కడ అభివృద్ది జరగదన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో దాదాపు రెండేళ్లు పూర్తికావచ్చిందని, మిగిలిన కొద్ది కాలంలో ఎలా నిర్మాణం చేయగలరో ఆలోచన చేయాలని చంద్రబాబుకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
ఎమ్మెల్యే నసీర్కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
మద్యంతోనే అనర్థాలన్నీ...
చంద్రబాబు మొదటి సారి సీఎం అవ్వగానే అప్పటి వరకు ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచాడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీలైనంతగా మద్యం విక్రయాలను తగ్గించి దశలవారీగా మద్యనిషేధానికి చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చింది. పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వడమంటే పరోక్షంగా నేరాలను ప్రోత్సహించడమే. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచించి తక్షణమే రద్దు చేయాలి. –ఈదర గోపీచంద్, గాంధేయవాది, నరసరావుపేట -
పల్నాడు
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, నరసరావుపేట : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పగటి పూట వర్షం పడకపోవడంతో రైతులు, ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. మంగళ, బుధవారాల్లో కురిసన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ప్రవహించిన వాగులు, వంకలు కొంతమేర శాంతించాయి. అయినప్పటికీ గురువారం కూడా చప్టాలపై వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. పంట పొలాలలో నీరు తగ్గడంతో మొక్కలు మేట పడిన దృశ్యాలు కనిపించాయి. రాజుపాలెం మండలం బలిజేపల్లి దగ్గర చప్టాపై వర్షపునీరు ప్రవహించడంతో బలిజేపల్లి–ఉప్పలపాడు మధ్య రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై ఐదు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించింది. దీంతో ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. గురజాల మండలం మాడుగుల వద్ద ఎద్దుల వాగు, చర్లగుడిపాడు జంగమేశ్వరపురం మధ్య నల్లవాగు, రెంటచింతల మండలంలో గోలివాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం వద్ద పిల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో శ్రీరుక్మిణిపురం, పిల్లుట్ల, బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు మండలం పాటిబండ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించండంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 120 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వ్యాప్తంగా సగటున 4.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకరికల్లు మండలంలో 9 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా రెంటచింతలలో 0.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి, కారంపూడి, రాజుపాలెం మండలాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఆగస్టు మాసం 14వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 6.31 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. క్రోసూరులో నీట మునిగిన పత్తి మొక్కలుఉధృతంగా ప్రవహిస్తున్న పిల్లేరు వాగుగురువారం తెల్లవారుజామున వరకు కొనసాగిన భారీ వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు రాజుపాలెం మండలంలో బలిజేపల్లి వద్ద ప్రమాదక స్థాయిలో వర్షపు నీరు వర్షాలకు దెబ్బతిన్న ముదురు పత్తి, కంది, వరి పంటలు 2,561 హెక్టార్లలో పంట నీట మునిగిందంటున్న వ్యవసాయశాఖ బొల్లాపల్లి : స్థానిక వెలుగు పథకం కార్యాలయంలో గురువారం ఆడిట్ నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిధులకు సంబంధించి ఆడిట్ జరిగింది. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు గురువారం చద్ది సమర్పించారు. భక్తులు పూజలు జరిపారు. భారీ వర్షాలవల్ల పంట పొలాలలో వర్షపునీరు భారీగా చేరి పంటలు నీట మునిగాయి. అమరావతి, క్రోసురు, పెదకూరపాడు, రెంటచింతల మండలాల పరిధిలో పత్తి, కంది, వరి పంటలు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గురువారం ప్రకటించారు. మొత్తం 2,561 హెక్టార్లలో పంట నీటమునగగా అందులో 2,530 హెక్టార్లలో పత్తి, 20 హెక్టార్లలో వరి, 11 హెక్టార్లలో కంది పంట నీటమునిగింది. వర్షాలు కొనసాగి, వర్షపునీటిలో మొక్కలు మునిగితే నష్టం అపారంగా ఉండనుంది. జిల్లాలో ఉద్యానపంటల సాగు పూర్తిస్థాయిలో మొదలుకాకపోవడం వల్ల పంటలకు పెద్దగా నష్టం లేదని అధికారులు తెలిపారు. -
ఇక్కడే తాగండి
ఎక్కడో ఎందుకు..వైన్ షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మద్యం ప్రియులు ఇప్పటి వరకు చెట్ల కింద, రోడ్ల వెంట తాగుతూ భయపడుతున్నారు. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే వైన్ షాపుల్లోనే సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం దుకాణంలో ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటే.. ఉత్తరం గదిలో గ్లాసులు, మంచింగ్, దక్షిణం గదిలో టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంది. పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. నరసరావుపేటటౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రైవేటు పెత్తనాన్ని పక్కకు నెట్టేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఇదే సమయంలో ప్రజలను మద్యానికి దూరం చేయాలనే సంకల్పంతో కొన్ని బ్రాండ్ల విక్రయాన్ని నిలిపేసింది. మరో వైపు పేదలకు అందుబాటు ధరలో ఉంచకుండా చర్యలు తీసుకుంది. ఇలా మద్యం నియంత్రణకు తీవ్రంగా కృషి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త మద్యం పాలసీని ప్రవేశపెడుతున్నామని చెబుతూనే.. గత వైఎస్సార్ సీపీపై విపరీతమైన విమర్శలు గుప్పించారు. మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మద్యం నియంత్రణతోపాటు డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ అధికారం చేపట్టిన వెంటనే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లారు. వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీంతో రాత్రి వేళ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు అర్ధరాత్రి ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా క్రైమ్ రేటు పరిశీలిస్తే మద్యం మత్తులోనే ఎక్కువగా నేరాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారుల కళ్లకు మామూళ్ల మత్తు కమ్మడంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద ఘర్షణలు పెరిగిపోయాయి. వీటిపై దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చేసింది. ఎక్కడో ఎందుకు.. ఇక్కడే తాగండి.. తాపించండి.. అంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 129 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు రానున్నాయి. పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఇందులో 5 లక్షల జనాభాలో లోపు ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్లకు వార్షిక ఫీజు రూ.5లక్షలుగాను, 5 లక్షల నుంచి 7.5 లక్షల జనాభా గల మద్యం దుకాణాలకు వార్షిక ఫీజు రూ.7.5 లక్షలుగాను నిర్ణయించారు. జిల్లాలో రూ.5 లక్షల పరిధిలో వచ్చే పర్మిట్ రూమ్లు 33 ఉండగా, రూ.7.5 లక్షల ఫీజు చెల్లించాల్సిన దుకాణాలు 96 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి ఎకై ్సజ్ శాఖకు రూ.8.85 కోట్ల ఆదాయం రానుంది. మందుబాబులకు మద్యంతోపాటు సకల సౌకర్యాలు ఇప్పటికే నియంత్రణ లేక ఛిద్రమవుతున్న కుటుంబాలు పర్మిట్ రూములతో మరింత పెరిగే అవకాశం తీవ్రంగా మండిపడుతున్న ప్రజా, మహిళా సంఘాలు -
● మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా!
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసుకుని ప్రతి ఏటా వారిని స్మరించుకుంటాం. ఆ మహనీయులకు తీరని అవమానం జరిగింది. పిడుగురాళ్లలోని రైల్వేస్టేషన్రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జమునా స్కూల్) ఆవరణలో జాతిపిత మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు, లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాలను ఏర్పాటుచేశారు. మూడేళ్ల కిందట పాఠశాల పునఃనిర్మాణం చేపట్టారు. విగ్రహాలను తీసి పక్కన పెట్టారు. విగ్రహాలను పునఃప్రతిష్ట చేయలేదు. – పిడుగురాళ్ల -
వేడుకలకు ముస్తాబు
స్వాతంత్య్ర ● వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల ● ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: 79వ స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడకలు నిర్వహించే ప్రాంగణాన్ని తివర్ణ పతాకాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు పరేడ్ను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసు, ఎన్సీసీ దళాల అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ సందేశం అందిస్తారు. తరువాత మువ్వన్నెల బెలూన్లు ఎగురవేయడం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, శకటాల ప్రదర్శన ఉంటుంది. 10.15గంటలకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 11.41గంటలకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు. ఏర్పాటు చేసిన స్టాల్స్ను అతిథులు సందర్శించిన అనంతరం జాతీయ గీతాలాపనలో కార్యక్రమం ముగుస్తుంది. ఏర్పాట్లు పరిశీలన.. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు గురువారం పరిశీలించారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీల గ్యాలరీలు, స్టాల్స్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో మురళీ, ఆర్డీఓ మధులత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
తటాకం కాదు మైదానం!
ఈ చిత్రం చూసి, ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది.. అనుకుంటే బురదలో కాలేసినట్లే.. వారు అలా ఈత కొడుతుంది ఎటూపోయే మార్గంలేక నిలిచిపోయిన వర్షం నీటిలో.. బెల్లంకొండ జెడ్పీ హైస్కూల్ మైదానంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురవడంతో వర్షపు నీరు పాఠశాల మైదానంలో నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో చిన్నారులు గురువారం ఇలా ఈత కొడుతూ కనిపించారు. వర్షం పడిన ప్రతిసారి పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోజుల తరబడి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. – బెల్లంకొండ -
పొంగిపొర్లుతున్న వాగులు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వరద నీరు రోడ్లపై ప్రవహించే సమయంలో వాహనాలను నడపవద్దని, లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకల వద్దకు ఎవరూ వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. లో–లెవెల్ వంతెనల వద్ద నీరు ప్రవహించే ప్రదేశాలలో ప్రజలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వరద ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొంగిన వాగులు – నిలిచిన రాకపోకలు నాదెండ్ల: భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గణపవరం–చిలకలూరిపేట డొంక రోడ్డులోని కుప్పగంజివాగు లోలెవల్ చప్టాపై నాలుగడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ సిబ్బంది రాకపోకలను నిలిపివేయించారు. తహసీల్దార్ ఎస్. చంద్రశేఖర్, ఎస్సై జి. పుల్లారావు వరద ఉధృతిని పరిశీలించారు. గణపవరం కుప్పగంజివాగు పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. అమీన్సాహెబ్పాలెం, గొరిజవోలు రోడ్లపై వరదనీరు ప్రవహించింది. మరో రెండు రోజుల పాటు వర్షాల ప్రభావంతో వరద కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు
సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితుడు రంజిత్ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్ అంగీకరించాడు. జగదీష్ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగనే ఇద్దరు వ్యక్తులు జగదీష్ కారును అడ్డగించారు. పోలీస్ దుస్తులలో ఉన్న వారు విజిలెన్న్స్ అధికారులం అంటూ, జగదీష్ కారులో ఉన్నఐ రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్ తన స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మేడికొండూరు సీఐ నాగూర్ మీరాసాహెబ్, ఎస్ఐ సుబ్బారావు, కానిస్టేబుల్ జాన్ సైదా, బాజీ సాహెబ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
గుంటూరు ఆర్డీగా డాక్టర్ శోభారాణి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు. -
పరవళ్లు తొక్కుతున్న శింగరేశ్వర జలపాతం
బెల్లంకొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలోని శింగరేశ్వర జలపాతం పరవళ్లు తొక్కుతుంది. శ్రీ కొండ శింగరేశ్వర స్వామి వద్ద గల కొండల మీద నుంచి భారీగా వస్తున్న నీటితో ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. దాదాపు100 అడుగుల ఎత్తు కొండల మీద నుంచి పాల నురగల్లా జాలు వారుతున్న నీటిధారలతో జలపాతం అబ్బురపరుస్తుంది. బుధవారం వర్షం పడుతున్నప్పటీకీ పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతంలో తడుస్తూ సందడి చేశారు. -
త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గా పీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం మంగళ వాయిద్యాలతో బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేశారు. మహా సరస్వతి సమేత దుర్గామాతకు దశవిధాభిషేకాలు చేశారు. 108 కళాశాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పణ చేశారు. త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి సభ్యుల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం, అమ్మవార్లకు అర్చన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, సామూహిక కర్పూర హారతి నిర్వహించారు. అర్చకుడు కలవకొలను సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిశక్తి దుర్గా పీఠం పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వినుకొండ ఫొటోగ్రాఫర్కు గోల్డ్మెడల్
వినుకొండ: ఇండియా ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 186వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్లో ఫొటో ట్రావెల్ విభాగంలో వినుకొండ పట్టణానికి చెందిన వంగపల్లి బ్రహ్మయ్య తీసిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రథోత్సవం ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11గంటలకు విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి సీఈవో, డైరెక్టర్ ఆర్ .మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు. -
కూలిన పాటిబండ్ల చిన్న బ్రిడ్జి
పెదకూరపాడు: పెదకూరపాడులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృతికి కూలిపోయింది. 75త్యాళ్ళూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాటిబండ్ల వద్ద బ్రిడ్జిని సత్తెనపల్లి ఆర్డీవో రమకాంత్రెడ్డి, పెదకూరపాడు తహసీల్దార్ ధనలక్ష్మీ, ఎంపీడీవో సోమయాజులు పరిశీలించారు. సంబంధిత ఇంజనీరులకు ఫోన్ చేసి యుద్ధప్రతిపాదికన పనలు చేయాలని ఆదేశించారు. పాటిబండ్ల రోడ్డు పలు చోట్ల కోతకు గురైంది. పాటిబండ్ల బ్రిడ్జి కూలేందుకు సిద్ధం అంటూ గత నెల 29న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. కోతకు గురైన చప్టాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు చోట్ల కోట్టుకు పోయిన రోడ్లు ముందే హెచ్చరించిన ‘సాక్షి’ -
నూతన మూల్యాంకన విధానం పెనుభారం
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు చిలకలూరిపేట: ప్రభుత్వం రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పెనుభారంగా మారిందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు విమర్శించారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష పేపర్ ద్వారా నిర్వహించటం దానిని మరలా బుక్లెట్లో నమోదు చేయించడం వలన సమయం వృధా అవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ ముద్రించిన పుస్తకాలను సకాలంలో పాఠశాలకు చేర్చలేకపోవడం వలన ఆ వివరాలు నమోదు చేసుకోవడానికి ఒక రోజు పూర్తి టైం సరిపోతుందని వాపోయారు. మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలకు తెప్పించుకోవడం పాఠశాల నుంచి తరగతి, సబ్జెక్టుల వారీగా వేరు చేసుకుని విద్యార్థుల వివరాలు నమోదు చేయడం తలకు మించిన భారం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అనేక యాప్లతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ బుక్లెట్లను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ పట్టణ అధ్యక్షుడు మేకల కోటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి వి.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పాఠశాలలకు సెలవు
నరసరావుపేట ఈస్ట్: నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి చంద్రకళ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పాఠశాలలకు ప్రకటించాలని కోరారు. వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ దొడ్లేరు(క్రోసూరు): భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలతో వచ్చిన వరదలను బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో హసనాబాద్ రోడ్డు లో లోలెవల్చప్టా పై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఊటుకూరు, బయ్యవరం మీదుగా అమరావతి వెళ్లారు. వారి వెంట తహసీల్దార్ వి.వి.నాగరాజు, ఎస్ఐ పి.రవిబాబు ఉన్నారు. అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్నగర్లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్కు చెందిన నేలపాటి సురేష్బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. -
చిరస్మరణీయులు ‘ఉన్నవ’
యడ్లపాడు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించారు. అహింస అనే ఆయుధంతో తెల్లదొరల పాలనకు ముగింపు పలికి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. హిందీలో ఆయన చేసిన ఉపన్యాసాలు లక్షలాది ప్రజలను కదిలించాయి. అయితే ఆంధ్ర ప్రజల హృదయాల్లో గాంధీ సందేశాన్ని నింపిన ఒక మహనీయుడు ఉన్నారు. ఆయనే ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన రాజగోపాలకృష్ణయ్య హిందీ భాషలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. గాంధీజీ ఉపన్యాసాలను తెలుగులోకి తర్జుమా చేసి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హిందీ అనువాదం... ఆయన ఉపన్యాసాలు హిందీలో ఉన్నప్పటికీ, వాటిని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర ప్రజలకు దేశభక్తిని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. గాంధీజీ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడల్లా ఆయన ఉపన్యాసాలను అద్భుతంగా తెలుగులోకి అనువదించేవారు. గాంధీజీ సైతం ఆయన భాషా నైపుణ్యాన్ని గుర్తించి, తన పక్కనే ఉంచుకుని అనువాదం చేయించుకునేవారు. రాజగోపాలకృష్ణయ్య కేవలం అనువాదకుడిగా మాత్రమే కాకుండా, ఒక గొప్ప దేశభక్తుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. ఎడ్లబండ్లపై భారీ ప్రదర్శన... గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఆయన, అప్పట్లో ఉన్నవ గ్రామంలో మహాత్ముని విగ్రహాన్ని ఎడ్లబండిపై ఉంచి, కాంగ్రెస్ జెండాలు, గాంధీ టోపీలతో 62 బండ్లతో ఒక భారీ ఊరేగింపు నిర్వహించారు. నాడు ఈ ఊరేగింపు యువతలో ఉత్తేజాన్ని నింపి, గొప్ప దేశభక్తిని రగిలించింది. 1946 ఫిబ్రవరి 5న ఖమ్మంలో జరిగిన బాపు చివరి బహిరంగ సభలో కూడా రాజగోపాలకృష్ణయ్య గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. గాంధీజీ ఆలోచనలను, సందేశాలను తెలుగు ప్రజల గుండెల్లోకి చేర్చడంలో ఆయన చేసిన కృషి అమోఘం, అనిర్వచనీయం. అందుకే ఆయన్ని గాంధీజీ ఉపన్యాసాలకు ‘అనువాద బ్రహ్మ’ అని పిలుస్తారు. రాజగోపాలకృష్ణయ్య వంటి నిస్వార్థ దేశభక్తులు తమ త్యాగాల వల్ల రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారు.గాంధీ ఉపన్యాసాలకు తెలుగు అనువాదకులు ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య -
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
అడిషనల్ ఎస్పీ సంతోష్ నరసరావుపేట రూరల్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ నడుం బిగిద్దామని జిల్లా అడిషనల్ (అడ్మిన్) ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్పై కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంతోష్ పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు, వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశానికి హానికరమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించిందని, యువతను మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్ధలు భాగస్వామ్యం కావాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం రవాణా వలన ఏర్పడే చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో అడిషనల్ ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎం.వెంకటరమణ, ఎస్బీ–2 సీఐ పి.శరత్బాబు, ఈగల్ సెల్ ఎస్ఐ జె.శ్యామ్యూల్ రాజీవ్కుమార్, రూరల్ ఎస్ఐ కిషోర్, ఫాతిమా, కళాశాల చైర్మన్ ఎం.రామశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన
దెబ్బతిన్న పత్తి పంటకృష్ణమ్మ ఉగ్రరూపంజిల్లాలో ముందస్తు ఖరీఫ్లో భాగంగా వేసిన ముదురు పత్తి పంట భారీ వర్షాలకు దెబ్బతింది. పత్తి విరుపులు స్తంభించిపోతున్నాయి. పగిలిన పత్తి తడిసిపోయింది. అలాగే పక్వానికి వచ్చిన కాయలు బాగా తడవడం వల్ల కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. లేత పత్తికి వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. భారీ వర్షాలకు నారుమళ్లు దెబ్బతింటున్నాయి. వరదనీటితో నారుమళ్లు కోతకు గురవుతున్నాయి. మళ్లీ నారుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం సంభవించే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారీవర్షాలకు రైల్వేశాఖ అప్రమత్తమైంది. పిడుగురాళ్ల – బెల్లంకొండ మధ్య భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి నెంబర్ 59 వద్ద నీరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. రైళ్ల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు తగ్గించారు. సాక్షి, నరసరావుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పల్నాడు జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షాలు కురిసాయి. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం దాకా సుమారు 190 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రామాలకు బుధవారం ఉదయం రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాస్థాయిలో పల్నాడు జిల్లా కలెక్టరేట్లో 08647052999 నెంబర్తో కంట్రోల్ రూమ్ నెంబర్ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. క్రోసురు మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని భారీ వదరనీరు చుట్టిముట్టిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డిలు పర్యటించారు. గ్రామంలో హసనాబాద్ రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు. జిల్లాలో 189 సెం.మీ వర్షపాతంనరసరావుపేట రూరల్: జిల్లాలో బుధవారం రికార్డు స్ధాయి వర్షపాతం నమోదు అయింది. గడిచిన 36 గంటల్లో జిల్లాలో 189 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు 169 సెం.మీ, అప్పటినుంచి సాయంత్రం 4గంటల వరకు 20 సెంమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా పెదకూరపాడులో 19 సెం.మీ, బెల్లంకొండలో 14సెం.మీ, దాచేపల్లి రూ.14సెం.మీ, అచ్చంపేటలో 13 సెం.మీ, మాచవరం 11 సెం.మీల వర్షం కురిసింది. అలాగే కారంపూడి, రాజుపాలెం, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో భారీ వర్షం నమోదు అయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జిల్లాలోని 28 మండలాల్లో భారీ వర్షాలు నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు వర్షాలు ఇలాగే కొనసాగితే ముదురు పత్తి, నారుమళ్లకు తీవ్ర నష్టం పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ నిలిచిన రాకపోకలు భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల – జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి – కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పెదకూరపాడు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చపాట్లు కూలిపోయ్యియి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృత్తికి కూలిపోయింది. 75 త్యాళ్లూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యడ్లపాడు మండలం సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట – ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. గురజాల – కారంపూడి రహదారిలో చర్లగుడిపాడు వద్ద లో లెవల్ చప్టా ఉండటం వలన వర్షపు నీరు నిలిచి రోడ్డుపైకి చేరింది. మాచర్ల – గుంటూరు రహదారిపై రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై గుండా పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల – గుంటూరు మధ్య అన్నివాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్దీకరించారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి. కష్ణానది పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలకు కష్ణమ్మ పోటెత్తింది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 2,30,540 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 22గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు స్పిల్వే మీదుగా 2,34,850 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,339 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన గల కష్ణానదిలోకి మొత్తం 2,63,189 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్గేట్లు ద్వారా 2,75,166 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. టెల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 10 క్రస్ట్గేట్లు 3.5 మీటర్లు, 6 క్రస్ట్గేట్లు మూడు మీటర్లు ఎత్తు ఎత్తి 2,75,166 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో 3,50,841 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి నదిలోకి 3,64,082 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణానది ఉధృతంగాప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం అలెర్ట్ జారీ చేసింది. -
పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు
రాజుపాలెం: భారీవర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు–మాచర్ల రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎద్దువాగు పొంగడంతో 8 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల–గుంటూరు మధ్య అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్ధీకరించారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇనిమెట్ల, ఉప్పలపాడు, బలిజేపల్లి, రామిరెడ్డిపేట, లక్ష్మీపురం చల్లాపల్లితండా– గణపవరం, రెడ్డిగూడెం, బీర్లవల్లిపాయ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వాగుల సమీప ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. మెట్టపైర్లు సాగుచేస్తున్న రైతులు నష్టపోవాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. బలిజేపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. తహసీల్దార్ సరోజిని మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వీఆర్వోలను ఆదేశించామన్నారు. అంచులవారిపాలెం, అనుపాలెం, గణపవరం ప్రాంతాల్లోని వాగుల వద్ద వీఆర్వోల ఆధ్వర్యంలో భధ్రతా చర్యలు చేపట్టామన్నారు. వర్షప్రభావానికి సహాయక చర్యల కోసం 24 గంటలు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, అత్యవసర సహాయం కోసం 9949098622 నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య పొంగిపొర్లిన ఎద్దువాగు 8 గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అనుపాలెం సమీపంలో మాచర్ల – గుంటూరు రహదారిపై పొంగిన మరో వాగు మాచర్ల–గుంటూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు బలిజేపల్లిలో నిలిచిన విద్యుత్ సరఫరా -
తెరిపివ్వని వాన..పొంగుతున్న వాగులు
సొలస గ్రామంలో లోలెవల్ చప్టాపై నీరు ప్రవహించడంతో రాకపోకలు బంద్ యడ్లపాడు: యడ్లపాడు మండలం పరిధిలో అన్ని గ్రామాల్లోనూ వానలు కురిశాయి. మంగళవారం రాత్రి మొదలైన ఈ వర్షం బుధవారం కూడా చిరుజల్లుల రూపంలో వర్షిస్తూనే ఉంది. దీంతో 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలంలోని గ్రామాల్లో ప్రజలకు, పశువులకు, అలాగే ఆస్తినష్టం వంటివి ఏమీ లేవని తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు. వర్షం, వాగుల నుంచి వరద పూర్తిగా తగ్గేవరకు సెల్నంబర్: 9849904026, 88862 70330 ప్రత్యేక నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమైతే తక్షణమే గ్రామస్థాయి అధికారులకు లేదా కంట్రోల్ రూం నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఎగువ నుంచి వాగుల ద్వారా వచ్చే వరద నీరు అధికమైతే నక్కవాగు పొంగే అవకాశం ఉంటుందని, లోతట్టు గ్రామాలైన జాలాది, దింతెనపాడు, గణేశునివారిపాలెం, తుర్లపాడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు కురిసిన వానలకు, ఇలాగే కొనసాగినా పంటలకు ఎలాంటి నష్టం ఉండదని ఏవో ఎ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం రాత్రి వీచిన గాలులకు పలుచోట్ల విద్యుత్తీగలు తెగిపోవడంతో లింగారావుపాలెం, సొలస, ఉన్నవ గ్రామాల్లో సరఫరా నిలిచిందని, సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందిని బృందాలుగా అప్రమత్తం చేసి తిరిగి పునరుద్ధరణ చేసినట్లు విద్యుత్ ఏఈ జెస్సీ జయకర్ తెలిపారు. అక్కడ రాకపోకలు బంద్... వానలకు మండలంలోని వాగులు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి. సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట –ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. -
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
నాగార్జునసాగర్ డ్యామ్పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ
విజయపురిసౌత్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భద్రతా దళాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ గిరీష్ భట్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలతో పాటు విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టుకొని సాగర్ డ్యామ్పై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా విజయపురిసౌత్ కాలనీలో జరిగింది.అనంతరం మానవ హారంగా ఏర్పడ్డారు. గిరీష్ భట్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్కె మహమ్మద్బాష, ఎన్సీసీ కెప్టెన్ కె. విజయకుమార్, జువాలజీ అధ్యాపకుడు టి. రాజశేఖర్, నాగార్జునకొండ సీఏ వెంకటయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరిస్తాం దాచేపల్లి: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోజ్ సూరజ్ అన్నారు. నారాయణపురంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఇటీవల ఈ హాస్టల్ లో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తీరును అక్కడున్న విద్యార్థులతోమాట్లాడి జేసీ తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జేసీ వెంట ఆర్డీఓ మురళీకష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బీసీ హాస్టల్ను సందర్శించిన ఎమ్మెల్యే నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా సందర్శించారు. నేటి నుంచి త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గ, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గాపీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి 15 వరకు వైభవంగా జరగనున్నాయని పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి మంగళవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 108 కళాశాలతో అభిషేకాలు జరుగుతాయన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళాలతో (తమల పాకులు) విశేష పూజలు, శ్రీ జగన్నాథ భజన మండలి సభ్యుల కోలాటంతో అమ్మవార్ల ప్రభ ఉంటుందన్నారు. ముగింపు రోజు ముఖ్య శిష్యులచే గురుపూజ, అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఘనంగా వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల ఫుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్ళను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఎద్దువాగు
ఉధృతంగా నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్నగర్లకు నిలిచిన రాకపోకలు నకరికల్లు: మండల కేంద్రమైన నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి వాగునీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు నకరికల్లు రిజర్వాయర్కు ఆనుకొని ఉన్న ఎద్దువాగు పొంగి ప్రవహిస్తుంది. స్థానిక చెరువు వద్ద నుంచి ఇనిమెట్ల, ఉప్పలపాడు వరకు ప్రవహించే ఈ వాగు పొంగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి నడుములోతు నీరు వచ్చిచేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. వాహనదారులు నర్శింగపాడు మీదుగా నకరికల్లు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదచారులు చేసేదిలేక నడుములోతు వాగులో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. గతంలో కూడా భారీవర్షాలకు రోడ్డుపై వాగునీరు చేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. రెండుగ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు చూస్తూ మిన్నకుండిపోతున్నారు. వాగును పరిశీలించిన ఏఐకెఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి తూమాటి మణికంఠ మాట్లాడుతూ వాగుపై కల్వర్టు నిర్మాణం చేసి రెండుగ్రామాల ప్రజల అవస్థలు తీర్చాలని కోరారు. పీసపాడు వద్ద... పీసపాడు(క్రోసూరు): ఎగువన బెల్లంకొండ, పిడుగురాళ్ల వైపు కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పీసపాడు గ్రామంలో ఎద్దువాగు బ్రిడ్జి ఎత్తులో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు జోరుగా ఇతర అందుకూరు, బాలెమర్రు, బయ్యవరం గ్రామాల వాగులు గుండా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. 2016, 2017లో పీసపాడు ఎద్దువాగు మీద ఉన్న హైలెవల్ బ్రిడ్జి మీదుగా వరద పొంగింది. -
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి మాచర్ల: రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు, ఉత్తమ సేవలందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఇంజినీర్లపై ఉందని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజినల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజినల్ పరిధిలోని ఇంజినీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో కరెంట్ బిల్లుల వసూళ్ల విధానం మారిపోతుందని, బకాయిలు పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు. బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులను కలిసి బకాయిలు క్లియర్ చేయకపోతే చర్యలు తప్పవని సూచించాలని తెలిపారు. టెక్నికల్ ఎలక్ట్రికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, విజయ్కుమార్, ఈఈ ఎన్.సింగయ్యతో పాటు పలువురు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మాచర్లలోని కేసీపీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. -
ఈ–పంట నమోదు ప్రారంభం
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా 330 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఈ–పంట నమోదు ప్రారంభమైంది. అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంది. వెబ్ల్యాండ్ ఆధారంగా జిల్లాలో 10.06 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 99.96 ఎకరాల్లో పంటల సాగు అవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. దీనిలో ఇప్పటివరకు 3,985 ఎకరాల్లో ఈ–పంట నమోదు చేశారు. వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలకు ఉద్యాన శాఖ అధికారి, ప్రభుత్వ/వ్యవసాయతర భూములకు తహసీల్దారులకు నమోదు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇప్పటివరకు గ్రామాల్లో సాగు చేసే పంటలను మాత్రమే ఈ–పంట నమోదు చేస్తుండే వారు. అయితే కొత్తగా ప్రభుత్వభూములు, వ్యవసాయేతర భూములు, బీడు భూములు, పశువుల పాకలను కూడా ఈ–పంట నమోదు చేయాలన్న ఆదేశాలు వ్యవసాయ అధికారులకు అందాయి. దీంతో ఏయే పంటల సాగు చేస్తున్నారనే వివరాలతో పాటు అదనంగా వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేయనున్నారు. షెడ్యూల్ ఇలా.. పంట నమోదుకు గడువు : సెప్టెంబర్ 15 వరకు గ్రామ సభల నిర్వహణ : సెప్టెంబర్ 19–24 వరకు ఫిర్యాదుల స్వీకరణ : 25 నుంచి 28 వరకు తుది జాబితా ప్రచురణ : సెప్టెంబర్ 30 -
ప్రజాస్వామ్యం అపహాస్యం
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుపై డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మిగులుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పులివెందులలో టీడీపీని గెలిపించడానికి ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంత దారుణంగా ఎన్నికల జరిగిన ఘటనలు లేవన్నారు. స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్లలోపు ఉండాలని ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నప్పటికీ నాలుగు కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలోకి మార్చారన్నారు. దాదాపు నాలుగు వేల మంది ఓటింగ్లో పాల్గొనకూడదనే కుట్రతోనే ఎన్నికల కమిషన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం అధికారపార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు. ప్రజలు ఓటు వేయరని తెలిసే అక్రమాలు తెల్లవారుజామున కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, సతీష్రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు మంత్రి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను స్వేచ్ఛగా తిరగనిచ్చారన్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ పోలింగ్బూత్లలోకి ప్రవేశించి భయబాంత్రులకు గురిచేసారని తెలిపారు. ఒంటిమిట్ట పరిధిలోని పోలింగ్బూత్లో రాంప్రసాద్రెడ్డి వీరంగం సృష్టించి వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్పై దాడికి పాల్పడ్డారన్నారు. జమ్మలముడుగు, ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓటింగ్ జరిపించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసులే బయటకు పంపడం విడ్డూరన్నారు. ఇంతకన్నా జెడ్పీటీసీ సభ్యులుగా టీడీపీ వ్యక్తులను ప్రకటించుకుంటే సరిపోయేదన్నారు. పులివెందుల ప్రజలు తమకు ఓట్లు వేయరని అంచనాకు వచ్చిన కూటమి నాయకులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు బాధకరమని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ఈ తరహా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాలని కోరారు. -
నేర రహిత సమాజానికి కృషి చేయాలి
సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని, నేర రహిత సమాజ కోసం అందరూ కృషి చేయాలని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్కుమార్రెడ్డి అన్నారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ చేయాలని, దీనిపై పోలీస్ అధికారులతో పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయా స్టేషన్లలో ఉన్న రాజీ పడదగిన సెక్షన్లు ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. ఆయా స్టేషన్లు పరిధిలో ఉన్న కాంపౌండబుల్ నేరాల కేసులు అన్నీ వచ్చే నెల 13న జరిగే లోక్ అదాలత్ పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. సమీక్షలో న్యాయమూర్తులు తౌషిద్ హుస్సేన్, జె.సృజిన్కుమార్, సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, ఆయా పోలీస్స్టేషన్ల ఏస్హెచ్ఓలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట: ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా వానలు కురిసాయి. నాగార్జున సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి జూలై చివర వారంలోనే నీటిని కిందకు వదిలారు. దీంతో పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పూర్తిస్థాయిలో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఖరీఫ్ సాగు ప్రారంభమై రెండున్నర నెలలైనా జిల్లాలో ఇప్పటివరకు సాధారణ లక్ష్యంలో కనీసం 30 శాతం కూడా పంటలు సాగుకాలేదు. ముఖ్యంగా పల్నాడు రైతులు ఎక్కువగా ఆధారపడే తెల్లబంగారమైన పత్తి పంట సంగతి సరే సరి. పత్తి సాగుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడమే... పత్తి పంట సాగు తగ్గిపోవడానికి ప్రధాన కారణం పత్తి సాగు ఖర్చు పెరగడం, పంటలకు చీడపీడల ప్రభావం అధికంగా ఉండటం. గులాబీ రంగు పురుగుతో రైతులకు మందుల ఖర్చు అధికంగా అవుతోంది, మరోవైపు గులాబీ రంగు పురుగుతో దిగుబడి రాను రాను తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతున్న క్రమంలో గిట్టుబాట ధర లేకపోవడం శాపంగా మారుతోంది. ఏటా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు పత్తిపంట సాగుకు విముఖత చూపుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెడుతున్నారు. గత కొన్నేళ్లుగా పల్నాడు ప్రాంతంలో పత్తిసాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడటంతో మొక్కజొన్న సాగుతోనైనా తమ వెతలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు.పిడుగురాళ్ల రూరల్ మండల పరిధిలో పత్తిసాగున్యూస్రీల్ సాగర్ నిండినా, సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న ముందుకు సాగని ఖరీఫ్ పత్తి సాగుకు గడువు ముగుస్తున్నా ముందుకురాని రైతులు 91,566 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 35,958 హెక్టార్లలోనే.. గులాబీ రంగు పురుగు ఉధృతితో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడులు ప్రభుత్వ ‘మద్దతు’ కూడా లేని వైనం మొక్కజొన్న, అపరాల పంటల వైపు మొగ్గుచూపుతున్న కర్షకులు లక్ష్యంలో సగమైనా లేదు జిల్లా సాధారణ లక్ష్యం ఈ ఖరీఫ్లో 91,566 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి కేవలం 35,958 హెక్టార్లలో సాగైంది. పత్తి పంట సాగుకు అనువైన సమయం దాదాపుగా పూర్తయిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట సాగు చేసే పత్తి పంటకు చివర్లో గులాబీ రంగు పురుగుల బెడద అధికంగా ఉండి తీవ్రంగా నష్టపోతామంటున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో పత్తి పంట సాగు 40 వేల హెక్టార్లు కూడా దాటే పరిస్థితి లేదంటున్నారు.గిట్టుబాటు ధర లేదు గతంలో పత్తి, మిర్చి పంటలను అధికంగా సాగుచేసేవాడిని. కానీ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు ఉధృతితో పాటు, గిట్టుబాటు ధర లేక పత్తి పంట సాగు గణనీయంగా తగ్గించుకున్నాను. రైతులు గత కొంత కాలంగా కంది, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ ఉండటం, అధిక ఆదాయం ఉండటం కలసి వస్తుంది. – వెంకట్రామిరెడ్డి, రైతు, రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం -
ఇదేంది రొయ్యో..!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకం బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రొయ్యల ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ధరలు పతనం కావడంతో జిల్లాలో 60 శాతానికి పైగావున్న కౌలు రైతులు మరింతగా నష్టపోతున్నారు. పెట్టుబడి రాని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వనామీ 100 కౌంట్ ధర రూ. 270 ఉండగా ప్రస్తుతం రూ.225కు తగ్గింది. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర నెల రోజుల క్రితం రూ. 680 ఉండగా ప్రస్తుతం 570కి తగ్గింది. ఈ లెక్కన నెలరోజుల్లో వనామీ ధర రూ. 45, టైగర్ ధర రూ. 100 తగ్గింది. దీనివల్ల లాభాల సంగతి దేవుడెరుగు పెట్టు బడులు కూడా రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు రొయ్యల సాగు పెట్టుబడులు ఏడాది కేడాదికి పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపవగా, జీవ రసాయన మందుల ధరలు అయాంతం పెరిగాయి. పెరిగిన వర్కర్స్ జీతాలు దీనికి తోడయ్యాయి. దీంతో ఎకరం రొయ్యల సాగుకు రూ.4లక్షల నుంచి 5 లక్షల ఖర్చవుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు రావాలంటే వనామీ 100 కౌంట్ కౌలు రైతు అయితే రూ. 250 అమ్మాలి. సొంత రైతు అయితే రూ.225 అమ్మాలి. కానీ ప్రస్తుతం ధరలు అంతకు మించి తగ్గాయి. దీంతో లాభాల సంగతి దేవుడెరుగు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కానరావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు రూ.లక్షపైనే నష్టం రొయ్యల ఉత్పత్తి బాగా ఉంటే ఎకరానికి 2 టన్నులు దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం సగటున ఎకరానికి 1.50 టన్నులకు మించి దిగుబడి రావడంలేదు. ఈ లెక్కన వున్న ధరతో ఎకరాకు రూ. 3.50 లక్షలకు మించి రాబడి వుండడంలేదు. దీంతో ఎకరాకు సొంత రైతుకు రూ.లక్షకు తగ్గకుండా, కౌలు రైతు రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఎకరం కౌలు చెరువులనుబట్టి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష ఉంది. కౌలు రైతులకు వడ్డీలు అదనపు భారంగా మారనున్నాయి. దీంతో రొయ్య రైతులు లబోదిబోమంటున్నారు. ట్రంప్ సుంకాల బూచి చూపి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. వాస్తవానికి 100 కౌంట్ రొయ్య అమెరికాకు వెళ్లదు. కేవలం 20, 30, 40, 50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో వనామీలో అధికంగా 100 కౌంట్ రొయ్యల విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి. వనామీ 100 కౌంట్ రొయ్య చైనా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అమెరికాకు రొయ్య ఎగుమతి కాకుండానే ఎగుమతి దారులు, వ్యాపారులు ట్రంప్ సుంకాల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ధరలు తగ్గించి రొయ్య రైతును దోపిడీ చేస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం రొయ్య రైతులను ఎగుమతి వ్యాపారులు, కంపెనీలు ట్రంప్ సుంకాల పేరుతో వంచిస్తున్నా కూటమి సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఆది నుంచి రైతులంటే గిట్టని బాబు సర్కార్ రొయ్య రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ధరలు స్థిరంగా ఉండేలా చూసి నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సబ్సిడీతో విద్యుత్ అందించారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపి రొయ్య రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. రొయ్య రైతుకు ధరాభారం ట్రంప్ సుంకాల బూచి చూపి ధరల తగ్గింపు అమెరికాకు 100 కౌంట్ రొయ్యల ఎగుమతి లేకపోయినా ధర తగ్గింపు జిల్లాలో 21 వేల ఎకరాల్లో రొయ్యలసాగు 70 శాతం వనామీ, 30 శాతం టైగర్ సాగు సాగు దారుల్లో 60 శాతం మంది కౌలు రైతులే.. ఎగుమతి కంపెనీలు, వ్యాపారులు కలిసి వంచిస్తున్నారంటూ రైతుల గగ్గోలు -
అర్జీల పరిష్కారమే ధ్యేయం కావాలి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ఆర్జీల పరిష్కారంలో బాధితుల సంతృప్తే ధ్యేయంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిస్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 131 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదు. దీనిపై గ్రామానికి చెందిన శిఖా రమాదేవి, ఆవుల శివపార్వతి, ముత్యాల గంగమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అడిగితే కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వడం లేదని చెప్పారన్నారు. కలెక్టర్ను కలిసి అర్జీ పెట్టుకుందామని వచ్చినట్లు వివరించారు. శిఖా ప్రియాంక అనే మహిళ దివ్యాంగ పింఛను కోసం అర్జీ ఇచ్చారు. ప్రస్తుతం నరసరావుపేట మండలం లింగంగుంట్ల రాజుపాలెంలో ఉంటున్నాను. మాకు రేషన్ కార్డు మాచర్ల మండలంలో ఉంది. కార్డును రాజుపాలెంకు మార్చాలని సచివాలయంలో అడిగినా మార్చడం లేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం లేదు. కనీసం సరకులు ఇవ్వాలని కోరినా రాజుపాలెంలో డీలర్ నిరాకరిస్తున్నారు. – తాళ్లూరి సామ్రాజ్యం, రాజుపాలెం -
దళిత, గిరిజనులకు నేటికీ స్వాతంత్య్రం రాలేదు
మంగళగిరి టౌన్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ దళిత, గిరిజనులను స్వాతంత్య్రం రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధి టిప్పర్ల బజారులోని కేవీపీఎస్ (కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం) గుంటూరు జిల్లా 6వ మహాసభ ఆదివారం రాత్రి నిర్వహించారు. సామాజిక న్యాయం అంశంపై జరిగిన సెమినార్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా దళిత ఉద్యమానికి కంచుకోట అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరు జిల్లాలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ దళిత, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ చట్టం అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లో పాలకులు లేరన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదానీకి భూములు అప్పగించడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీ–4 పథకం ఓ చెత్త పథకమన్నారు. అనంతరం 15 మందితో కూడిన కేవీపీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వై.కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ ప్రకాష్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, లూదర్ పాల్, సహాయ కార్యదర్శులుగా దుర్గారావు, రమేష్లను ఎన్నుకున్నారు. -
ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఢీల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ హన్స్రాజ్ గంగరామ్ అహీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 63 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యా, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల పరిరక్షణకు తగిన చొరవ చూపాలన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో నీట్ సీట్ల భర్తీ విషయంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. దేశంలో 52శాతానికి పైగా జనాభా కలిగిన ఓబీసీల సాధికారిత కోసం ఓబీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఓబీసీల్లోని అన్ని కులాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేసేలా చూడాలని కోరారు. ఆయనవెంట ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్ సింగ్, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, సంఘ నాయకులు ఉరిటి అశోక్కుమార్, ముంగమూరి హైమారావు, ఖాసీం పాల్గొన్నారు. -
పొగాకు కొనాలని రైతుల ధర్నా
నరసరావుపేట రూరల్: రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐటీసీ సంస్థ సహకారంతో గత మూడు సంవత్సరాలుగా వైట్బర్లీ పొగాకు పంటను సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. గత ఏడాది పంట చేతికొచ్చే సమయానికి ఐటీసీ సంస్థ పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఈ ఏడాది పొలాలను కౌలుకు తీసుకొని షెడ్లు నిర్మించి పంట సాగుకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఐటీసీ సంస్థ పొగాకు సాగుచేయొద్దంటూ రైతులను అడ్డుకుంటుందని తెలిపారు. దీనివలన పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వెంటనే కొనుగోలు చేయడంతో పాటు ఈ ఏడాది పంట సాగుకు ఐటీసీ సంస్థ ద్వారా బాండ్లు ఇప్పించి సహకరించాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబుకు వినతిపత్రం అందజేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, గిరిజన సంఘ నాయకులు వి.కోటనాయక్, పీడీఎం జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, రైతులు వెంకటకోటిరెడ్డి, దూదేకుల చిరంజీవి, గంటా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి, మోసం తదితర సమస్యలపై 90 అర్జీలు అందాయి. పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
చిన్నారులపై ఔదార్యం చూపండి
గుంటూరు వెస్ట్: సమాజంలో ఏ పాపం చేయకపోయినా అనాధలుగా జీవించే వారిపట్ల ఔదార్యం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారితో కలిసి కలిసొచ్చే కాలానికి – నడిచొచ్చే పిల్లలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. సమాజంలో ఎవరైనా చిన్నారులను పెంచుకోవాలి అనుకున్న వారికి హోమ్స్లో ఉన్న 6–18 సంవత్సరాల వయస్సున్ను వారిని తాత్కాలికంగా తొలి 6 నెలలు తమ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చన్నారు. ఇద్దరికీ నచ్చితే మరో ఆరు నెలలు ఇలా 2 సంవత్సరాల వరకు పెంచుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో దత్తత తీసుకునే వీలుంటుందని వెల్లడించారు. దీనికిగాను బిడ్డ ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4000 ఉచితంగా అందజేస్తుందన్నారు. దీనివలన ఎంతో మంది అనాధలకు తల్లిదండ్రులు, గార్డియన్స్ లభిస్తారని, పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఐసీడీఎస్ పీడీ ప్రసూన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏడుగురు కమిటీ సభ్యులు దత్తత కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వెండి, బంగారు ఆభరణాలు, నగదు మాయం పిడుగురాళ్ల: వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన ఒకరి ఇంట్లో చోరీ జరిగిన ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు వి.ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... వరుసగా ప్రభుత్వ సెలవులు రావటంతో బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో తామెళ్లామని, తిరిగి సోమవారం ఉదయం రావటంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని, తలుపులు తీసి చూస్తే, బీరువాలోని దుస్తులన్నీ కింద పడవేసి ఉన్నాయని, బీరువా లాకర్ పగలగొట్టి ఉందని తెలిపారు. బీరువాలోని నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కూ్ల్స్ టీమ్కు సమాచారం అందించారు. దీంతో కూ్ల్స్ టీమ్ ఎస్ఐ రహీమ్, ఏఎస్ఐ సురేంద్రల బృందంతో దొంగతనం జరిగిన విధానాన్ని, దొంగలు ఏమైనా ఆధారాలు విడిచిపెట్టారనే విషయాన్ని, వేలిముద్రలను సేకరించారు. బాధితుడు ఆంజనేయులు బీరువాలో రూ. 50 వేల నగదు, సుమారు రూ. 15 లక్షల విలువ చేసే బంగారు అభరాణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. -
జాతీయ సమైక్యతను చాటాలి
నరసరావుపేట రూరల్: జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడు ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో ఘర్ తిరంగా అభియాస్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ప్రారంభించారు. పల్నాడు బస్టాండ్ నుంచి గాంధీ పార్క్ వరకు భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఆర్వో మురళీ, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్ దాచేపల్లి : నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ డి.దీపిక సస్పెండ్ అయ్యారు. అలాగే హాస్టల్ నైట్వాచ్మన్ సంజేశ్వరావును విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో జూనియర్ విద్యార్థిపై ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు రక్షణలేని అంశాలపై సాక్షి దినపత్రిక ఈనెల 11న సంక్షేమం ప్రశ్నార్థకం శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ దీపికను సస్పెండ్ చేయగా, నైట్ వాచ్మన్ సంజేశ్వరావుని విధుల నుంచి తొలగించారు. బీసీ బాలురు వసతి గృహానికి వార్డెన్గా గంగాధర్రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా హాస్టల్లో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ఆరుగురు విద్యార్థులపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలు మంజూరు చేశారు. -
ప్రకృతి సేద్యం ప్రపంచానికి ఆదర్శం
యడ్లపాడు: ఆదాయం.. ఆరోగ్యంతో పర్యావరణాన్ని పరిరక్షించే ప్రకృతి వ్యవసాయ విధానం వైపు ప్రతి రైతు దృష్టి సారించాలని అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో సోమవారం పర్యటించింది. బృందం సభ్యులైన చంద్రశేఖర్ బ్రీడర్, సిద్ధార్థ సచ్దేవ్, వేదసుంకర, అనుశెట్టి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతుల పద్ధతులు, పంటల వైవిధ్యాన్ని పరిశీలించారు. రసాయన క్షేత్రాలకు, ప్రకృతి సాగు క్షేత్రాలకు వ్యత్యాసాల అధ్యయనంపై వీరు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులతో కలిసి బృందం మునగ తోట, దొండ పందిరి, సొర, కాకర, బీర వంటి అంతర పంటలు, కనకాంబరం, లిల్లీ పూల రకాల సాగును ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రకృతి సేద్యం విధానాలను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించడం, అంతర పంటల ద్వారా ఒక ఎకరంలోనే ఐదు ఎకరాల పంట తీసుకోవడం వంటివి అద్భుతమని కొనియాడారు. ముందుగా గ్రామంలోని శివాలయం వద్ద ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమల కుమారి ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని, ఇన్పుట్స్ తయారీ విధానాన్ని వివరించారు. విత్తన గుళికల తయారీ డెమోను చేసి చూపించారు. అనంతరం కొత్తపాలెంలోని శ్రీనివాస గ్రామైక్య సంఘంలో మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రకృతి సేద్యం రైతులు శ్రీకాంత్, భానుచంద్ర, పల్నాటి తిరుపతిరావు, బద్దేటి కోటేశ్వరమ్మ, మలమంటి గణేష్ తమ సేద్యం విధానం, నీటి యాజమాన్యం, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ గుంటూరు ఏడీఏ వాణిశ్రీ, యంగ్ప్రాజెక్ట్లీడ్ సౌమ్య, డీపీపీ భవానీరాజ్, నందకుమార్, వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, ఐలయ్య, శివయ్య, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. -
రజక దివ్యాంగురాలిపై దాడి
పర్చూరు(చినగంజాం): దివ్యాంగురాలైన ఓ రజక యువతిపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై కారంచేడు ఎస్ఐ ఖాదర్ బాషా, బంధువులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. కారంచేడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ యార్లగడ్డ శ్రీకృష్ణ, సుజాతలు నివాసముంటున్న అదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నివాసముంటోంది. ఈనెల 8వ తేదీ ఉదయం సుజాత ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో ఆమెను చూసి నవ్వారనే సాకుతో రజక కుటుంబంతో వివాదానికి దిగారు. అంతేగాకుండా నగదు అప్పు తీసుకొని ఇవ్వలేదనే కోపంతో రజక కుటుంబానికి చెందిన కృష్ణకుమారి, కోటిరత్నం, సునీత, నాగేశ్వరరావులపై సుజాత ఆమె భర్త శ్రీకృష్ణలు దాడికి దిగారు. కర్రలతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచారు. అంతటితో ఆగక ఇనుపరాడ్లతో అదే కుంటుంబానికి చెందిన మూగ, చెవిటి యువతి పొదిలి దేవికపై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించి అసభ్యంగా వ్యవహరించారు. ఆ సంఘటనలో దివ్యాంగురాలు స్పృహ కోల్పోగా చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ఆమెకు ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని సమాచారం. ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. దాంతోపాటు దాడికి పాల్పడిన శ్రీకృష్ణ కూడా రజక కుటుంబంపై ఫిర్యాదు చేయగా రెండు కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాదరబాషా తెలిపారు. న్యాయం చేయాలి రజక సామాజిక వర్గానికి చెందిన చెవిటి, మూగ యువతి పొదిలి దేవికపై అగ్రవర్ణాలకు చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్య దాడి చేసి గాయపరచిన సంఘటనకు సంబంధించి ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి చీరాల ఎన్జీ ఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. రజక కుటుంబంపై దాడి చేసి మూగ, చెవిటి యువతి దేవికను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచిన సంఘటనపై జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పెద్దిడపు కొండయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కంచర్ల చిట్టిబాబు, రాష్ట్ర చేనేత నేత మాచర్ల మోహనరావు, సీఐటీయూ నాయకులు పి.వసంతరావు, రజక కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జనార్దన్, కొండవీటి శ్రీనివాసరావు, పొదిలి సూర్య పాల్గొన్నారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు కలెక్టర్, ఎస్పీలను కలవనున్న ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ నాయకులు -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..!
సత్తెనపల్లి: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యాసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గత ఏడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకు సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈనెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈనెల 11 కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్ కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్ తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రాం పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యాసన లోపాలను గుర్తించడంతోపాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికి తీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1,3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్ బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఏలు, రెండు సమ్మెటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు నిర్వహణ విద్యార్థి అభ్యసన మదింపునకు ప్రక్రియ డీసీఈబీ నుంచి మండలాలకు ప్రశ్నపత్రాలు బైలింగ్విల్ ప్రశ్న పత్రాలు.. సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిషులో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్న పత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాతపూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్ .. అండర్ స్టాండింగ్ .. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది. -
ఈ ఏడాదికి కొత్త బ్రిడ్జి లేనట్లేనా...!
ముప్పాళ్ల: సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిలో గుంటూరు బ్రాంచి కాలువపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాదికి లేనట్టే. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన నిర్మాణం పనులు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. సుమారు రూ.120 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులకు జిల్లా ఇన్చార్జి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాల్వలకు నీటి విడుదల ఆగిపోయిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంది. అయినప్పటికీ రెండు నెలలు కాలం గడిపి తీరా కాల్వలకు నీటి విడుదల చేసే సమయంలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఆ మేర కాల్వలో దోనెలు ఏర్పాటు చేసి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాల్వలకు నీరు విడుదల చేయటంతో నిర్మించిన అప్రోచ్ రోడ్డును తొలగించారు. కాల్వలకు నీటిని నిలిపివేస్తే తప్ప పనులు ప్రారంభించడానికి వీలు లేదు. మరో ఏడాదిపాటు శిథిలావస్థకు చేరిన వంతెనపై రాకపోకలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. -
రాష్ట్ర స్థాయి ఆట్యా–పాట్యాలో ప్రథమస్థానం
నకరికల్లు: రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా క్రీడాపోటీల్లో పల్నాడు జిల్లా జట్లకు ప్రథమస్థానం దక్కింది. ఒంగోలులో ఈ నెల 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లా బాలికల, బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నకరికల్లు ఉన్నతపాఠశాల విద్యార్థులు 11 మంది, దేచవరం ఆదర్శపాఠశాల విద్యార్థులు ముగ్గురు పల్నాడు జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు నకరికల్లు ఉన్నత పాఠశాలలోనే శిక్షణ ఇచ్చారు. బాలికల జట్టు కోచ్గా నకరికల్లు ఉన్నతపాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి, బాలుర జట్టుకు కోచ్గా ఫిజికల్ డైరెక్టర్ చింతా పుల్లయ్య, మేనేజర్గా పి.తిరుపతిరావు వ్యవహరించారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈఓ రంభ.ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, అధ్యక్షుడు జాబేబ్, జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం తదితరులు అభినందించారు. -
తొలితరం తెలుగు రచయిత్రులు పుస్తకావిష్కరణ
నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య సీహెచ్.సుశీలమ్మ రచించిన తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ నిర్వహించారు. కేంద్ర సాహితీ అకాడమి అనువాద పురస్కార గ్రహీత పి.సత్యవతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు అంకితం చేసి సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో గ్రంథాన్ని విశ్లేషిస్తూ కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగించారు. ఈ పుస్తకంలో వితంతు, సీ్త్రల బాధలను, వాటి వెనుకనున్న సామాజిక దుర్మార్గాన్ని, అస్పృశ్యత, అంటరానితనం, అగ్రవర్గ దురహంకారం వంటి అనేక విషయాలను ప్రస్తావించడం విశేషమని అన్నారు. ఈ పుస్తకంలో 1902 నుంచి 1955 వరకు రచించిన కథ, రచన చేసిన 25 మంది కథారచయిత్రుల రచనలను పరిచయం చేయడంతో పాటు రచయిత్రుల జీవన రేఖలను అందించడం మంచి విశేషమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకావిష్కరణ సత్యవతి, సుశీల, రచయిత్రి అతిథులను సత్కరించారు. -
మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు
సత్తెనపల్లి: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు అన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటున్న తమ బిడ్డలు హాస్టళ్ళల్లో, రూముల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తల్లి దండ్రు లు కాయా కష్టం చేసి డబ్బు పంపుతుంటే కొందరు యువత చెడు అలవాట్లకు బానిసలై అర్థంతరంగా తమ జీవితాలను ముగించుకుంటున్నారన్నారు. యువకులు బాగా చదువు కొని ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టాలను సైతం పక్కనపెట్టి ఖర్చు అయినప్పటికీ చదివిస్తున్నారన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో యువత మాదక ద్రవ్యాలు, మద్యం, మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు యువతీ,యువకులు తప్పు దోవ పట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల్లో కూడా కొంత మార్పు రావాలని, బిడ్డల ముందు మద్యం తాగడం లాంటివి మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల జోలికి వెళ్ళబోమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఐకమత్యంతో జరుపుకోవాలి... ఈ నెల 27న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి గొడవలు లేకుండా ఐక్యమత్యంతో పండుగ నిర్వహించుకోవాలన్నారు. వినాయక విగ్రహలకు అనుమతులు తీసుకోవాలని, డీజేలు పెట్టడం, పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, రెచ్చగొట్టే పాటలు వంటివి పెట్టి లేనిపోని గొడవలు సృష్టించవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్లో భాగంగా ఇంటింటికి తనిఖీలు చేపట్టి కాగితాలు సక్రమంగా లేని 37 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలతో పాటు 3 గొడ్డళ్లు, 2 బరిశలు స్వాధీన పరుచుకున్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు కిరణ్, ఎంవి సుబ్బారావు, సురేష్, శ్రీనివాసరావు, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమినుద్దీన్, మరో నలుగురు ఎస్ఐలు, నలుగురు ట్రైనీ ఎస్ఐలు, 80 మంది పోలీసులు పాల్గొన్నారు. గొడవలు లేకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు లక్కరాజుగార్లపాడు గ్రామంలో కార్డెన్ సెర్చ్ -
అదుపుతప్పి ఆటో బోల్తా
క్రోసూరు: ఊటుకూరు–కస్తల మధ్యలో ఆదివారం అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ పి.రవిబాబు తెలిపిన వివరాలు.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలేనికి చెందిన 10 మంది అచ్చంపేట మండలం కస్తలలోని తమ బంధువుల ఇంటిలో జరిగే పుష్పాలంకరణ వేడుకకు ఆటోలో బయలుదేరారు. క్రోసూరు మండలం ఊటుకూరు మీదగా కస్తల వెళ్లి తిరిగి వస్తూ ఊటుకూరు పరిధిలో అదుపు తప్పి ఆటో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, డ్రైవర్తో కలిపి 11 మంది ప్రయాణిసున్నారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చావలి వెంకటేశ్వర్లు(66) అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరు మృతి 11 మందితో వెళ్తుండగా ప్రమాదం -
వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా వేమారెడ్డి
రొంపిచర్ల: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దుద్దుకుంట వేమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జె.జగదీశ్రావు నుంచి నియామాక ఉత్తర్వులు అందుకున్నారు. వేమారెడ్డి గతంలో జిల్లా అసోసియేషన్లో పలు పదవులు నిర్వహించారు. రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపికై న వేమారెడ్డిని సహచర ఉద్యోగులు, ఆ గ్రామ పెద్దలు అభినందించారు. 12 సొసైటీలకు త్రీమెన్ కమిటీల నియామకం నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రభుత్వం ఆదివారం త్రిసభ్య కమిటీ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 821 పీఏ సీఎస్లకు కమిటీలను నియామకం చేసింది. కాగా పల్నాడు జిల్లాలోని వీరాపురం సొసైటీకి వై. శివన్నారాయణను చైర్ పర్సన్గా నియమించగా, పెదఅగ్రహారం సొసైటీకి పి. మరియమ్మ, మాచవరం సొసైటీకి పసుపులేటి పూర్ణయ్య, మాచర్ల సొసైటీకి జి. సత్యనారాయణరెడ్డి, దుర్గి సొసైటీకి కటకం రామ్మోహన్రావు, నందిరాజుపాలెం సొసైటీకి ఓర్చు ఆనందరావు, ధూళిపాళ ఏబీఎఫ్ఎస్సీఎస్కు కె.సుబ్బారావు, ముప్పాళ్లకు జెట్టి నాగమల్లేశ్వరరావు, మాదల సొసైటీకి చిమటా పోల్రాజు, మర్రిపాలెం సొసైటీకి కుర్రా రత్తయ్య, యడ్లపాడు సొసైటీకి ఎం. వెంకట సుబ్బారావు, బొల్లాపల్లి సొసైటీకి పి.వెంకటనారాయణను చైర్ పర్సన్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు సొసైటీకి ఇరువురు చొప్పున పర్సన్ల నియామకం చేసింది. వీరు ఈ పదవుల్లో 2026 జనవరి 30వ తేదీ వరకు కొనసాగుతారు. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి జె.పంగులూరు: మండలంలోని రేణింగవరం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పర్వతరెడ్డి వెంకటస్వామి (52) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వెంకటస్వామి రేణింగవరం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం చిన్నగంజాం మండలం సోపిరాల. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారివురికి వివాహం చేశాడు. వెంకటస్వామి భౌతికకాయాన్ని రేణింగవరం ఎస్సై వినోద్బాబు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. -
పోరాటానికి, క్రమశిక్షణకు మారుపేరు యూటీఎఫ్
యూటీఎఫ్ సీనియర్ నాయకుడు జోజయ్య గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటానికి, క్రమశిక్షణకు యూటీఎఫ్ మారుపేరుగా నిలిచిందని యూటీఎఫ్ సీనియర్ నాయకుడు కె.జోజయ్య అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ 52వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించిన జోజయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ నిజాయతీకి, త్యాగానికి నిలయం అన్నారు. ఆవిర్భావం మొదలు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సంఘాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ●మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ సంస్కరణల రూపకల్పనలో అకడమిక్ అంశాలతో పాటు, ఉపాధ్యాయుల కృషి, సమాజ భాగస్వామ్యంలో రావలసిన మార్పులపై దృష్టి పెట్టాలని అన్నారు. ●మరో సీనియర్ నాయకుడు జి.ప్రభుదాస్ చెన్నుపాటి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ యూటీఎఫ్లో పని చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తల్లో ఆ స్ఫూర్తి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సీపీఎస్ కన్వీనర్ సీహెచ్ ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బి. ప్రసాదు ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్ రాష్ట్ర కౌన్సిలర్ బి.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వారికి మౌలిక వసతులు ఎలాగూ కల్పించడం లేదు. దీనికితోడు కనీస రక్షణ కూడా లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల ఉన్న కొద్దిమందే
దాచేపల్లి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస రక్షణ సౌకర్యాలు లేని హాస్టళ్లలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ వసతిగృహాలలో బయట వ్యక్తుల ప్రమేయాలు ఎక్కువ అయ్యాయి. వారు దందాలు చేస్తూ విద్యార్థులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఓ జూనియర్ విద్యార్థిపై బయట చదువుకుంటున్న ఓ సీనియర్ విద్యార్థి దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు కనీస రక్షణ సౌకర్యాలు లేవనే విషయం మరోసారి స్పష్టమైంది. ప్రైవేటు వ్యక్తుల హల్చల్ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రైవేట్ వ్యక్తులు దందాలు సాగిస్తున్నారు. తమ వ్యక్తిగత కార్యకలాపాలతోపాటుగా అక్కడి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. దాచేపల్లి బీసీ హాస్టల్లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. హాస్టలుకు సంబంధం లేని ఓ విద్యార్థి తన వ్యక్తిగత విషయంపై మరో విద్యార్థిని అక్కడి తన స్నేహితుల వద్దకు పిలిచి చితకబాదాడు. హాస్టల్లో తన స్నేహితులు ఉండటం వల్ల వారి అండతో చితకబాది హత్య చేసేందుకు ప్రయత్నాలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సదరు సీనియర్ విద్యార్థి ఇదే హాస్టల్లో ఉంటున్న ఎంతోమంది విద్యార్థులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేసినట్లు కొందరు బాధితులు చెబుతున్నారు. అతడితోపాటు హాస్టల్లో ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ విద్యార్థులపైనా వార్డెనుకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. దాచేపల్లితోపాటు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో కూడా జూనియర్లకు, సీనియర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తరచూ బయట వ్యక్తులు వచ్చి యథేచ్ఛగా దందాలు అడ్డగోలు వ్యవహారాలకు నిలయాలుగా మారిన వైనం తాజాగా దాచేపల్లి హాస్టల్ లో విద్యార్థిపై దుర్మార్గంగా దాడి హాస్టళ్లలో ఉండేందుకు భయపడుతున్న విద్యార్థులు కనీస రక్షణ ఏర్పాట్లు లేని సంక్షేమ వసతి గృహాలువేధిస్తున్న సిబ్బంది కొరత వసతి గృహాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యత కత్తి మీద సాములా మారింది. దాచేపల్లిలో రెండు హాస్టళ్లకు మాచర్లలో హాస్టల్ వార్డెన్గా ఉన్న వ్యక్తి ఇన్చార్జిగా ఉన్నారు. బాలుర వసతి గృహానికి కూడా సదరు మహిళా వార్డెనే ఇన్చార్జిగా ఉండటంతో విద్యార్థులపై నియంత్రణ కొరవడింది. ఇక్కడ బీటెక్, డిగ్రీ విద్యార్థులు కూడా ఉండటం వలన సీనియర్లకు చెప్పేందుకు మహిళా వార్డెన్ చొరవ తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల వార్డెన్, కుక్, కమాటి, వాచ్ మెన్లలో ఒకరుంటే ఒకరు లేరు. అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకుంటున్నా కొరత ఎక్కువగానే ఉంది. ఇకనైనా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఘనంగా దివ్యబలిపూజ
విజయపురి సౌత్: ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో జీవించాలని సాగర్మాత ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాల సాగర్ ఉద్బోధించారు. ఆదివారం సాగర్మాత దేవాలయంలో జరిగిన దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తోటివారిని ప్రేమించటం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఏసుప్రభువును ఈ ప్రపంచానికి అందించిన దివ్యమూర్తి మేరిమాత అని కొనియాడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో జరిగిన తేరు ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు.దుర్గమ్మ ఆలయానికి విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ ఆలయానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు ఇచ్చారు. గుంటూరు పట్టాభిపురానికి చెందిన విజయ్ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని అందజేశారు. డోనర్ సెల్కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన బాలా ప్రగడ ఎన్ఎస్ కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది.కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీతెనాలి: కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదివారం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పచ్చ కామెర్లకు చికిత్స తీసుకుంటున్న రోగితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30–40 మంది రోగులతో మాట్లాడానని, వారంతా ఆసుపత్రిలో వైద్యసేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. రోగనిర్ధారణకు వినియోగించే సీటీ స్కాన్ చెడిపోయి చాలా కాలమైనా కొత్త పరికరం ఏర్పాటు చేయకపోవటం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
ధరల దరువు.. ఎరువు బరువు
ముప్పాళ్ళ: వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావటంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది. కంటితుడుపు చర్యలతో సరి మండలంలో ఏడాదికి దాదాపు 4 వేల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తుంటారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా. ఒక్కో బస్తా (50 కేజీలు)పై కనిష్టంగా రూ.50–గరిష్ఠంగా రూ.300 వరకు పెరిగింది. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4 వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాగును ప్రోత్సహించేందుకు కంటితుడుపు చర్యలే తప్ప కూటమి ప్రభుత్వంలో రైతుకు ప్రోత్సాహకాలు అందటం లేదు. పెరుగుతున్న వాడకం వర్షాలతో ఖరీఫ్ సీజన్ కూడా ముందుగానే మొదలైంది. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో వ్యయం విపరీతంగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపకపోవటంతో సాగు భారంగా మారింది. ఖరీఫ్లో సాగు చేసే పత్తి, మిరప, పసుపు, మొక్కజొన్న పంటలకు యూరియాతోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వీటితో పాటుగా 14–35–14, 20–20–0–13, 10–26–26 ఎరువులను వాడుతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 16 బస్తాల వరకు వినియోగిస్తున్నారు. ఆ మేర నిల్వ చేసుకుంటారు. దరలు పెరగటంతో రైతులకు శాపంగా మారింది. ఒక్కో రైతుపై రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మేలు 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 కాలంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిచేలా మూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. పైగా రైతు భరోసా కేంద్రాల నేరుగా రైతులకు గ్రామంలోనే ఎరువులు అందించారు. నేడు వాటి కోసం రైతులు పట్టణాలకు, మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.ముప్పాళ్ళ సొసైటీ గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలు అమాంతం పెరిగిన ఎరువుల ధరలు మూడు సార్లు పెంచిన కంపెనీలు నోరు మెదపని కూటమి ప్రభుత్వం ఒక్కో రైతుపై రూ.4 వేల అదనపు భారం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు పెట్టుబడి భారం పెరగడంతో కష్టాలు పెరిగిన ఎరువుల ధరలు (రూ.లలో) ఎరువు రకం పాతధర కొత్త ధర 20–20–0–13 (గ్రోమోర్) 1,300 1,350 20–20–0–13 (ఫ్యాక్ట్) 1,300 1,425 20–20–0–13 (పీపీఎల్) 1,300 1,400 10–26–26 1,470 1,800 14–35–14 (గ్రోమోర్) 1,700 1,800 సూపర్పాస్ఫేట్ 580 640 పొటాష్ 1,535 1,700 16–20–0–13 1,250 1,300మూడు నెలలకోసారి పెంపు నేను ఏటా పది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, వరి, అరటి పంట సాగు చేస్తుంటాను. మూడు నెలలకొకసారి ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగిపోతోంది. అదే రీతిలో పంటలకు గిట్టుబాటు ధర కూడా పెంచితే సాగు చేసేందుకు రైతు ఆసక్తి చూపుతాడు. గిట్టుబాటు ధర మాత్రం ఏడాది ఒకసారి మొక్కుబడిగా పెంచుతారు. – లోకసాని నర్సిరెడ్డి, రైతు, ముప్పాళ్ళ గిట్టుబాటు ధరలూ పెంచాలి పెరిగిన ఎరువుల ధరలతో ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పండిన పంటలకు గిట్టుబాటు ధర అందక సాగులో కష్టాలు పెరిగాయి. అయినప్పటికీ ఫర్టిలైజర్ కంపెనీలు మాత్రం ఇష్టానురీతిలో ధర పెంచుకుంటూ పోతున్నాయి. ఎరువులపై సబ్సిడీ అందించి రైతులను ప్రోత్సహించాలి. –బత్తుల శ్రీనివాసరావు, రైతు, చాగంటివారిపాలెం -
నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధుల బృందం
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను ఆదివారం శ్రీలంక దేశానికి చెందిన 45 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు నాగసిరి లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడి మ్యూజియంలో ఉన్న 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి సామగ్రి, సింహాళ విహార్లోని మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురువు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లిన నేపథ్యంలో పర్యాటక శాఖకు 72 వేల రూపాయల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు. లాంచీ స్టేషన్ను సందర్శించిన జీఎం విజయపురిసౌత్: పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆదివారం లాంచీస్టేషన్ను పరిశీలించారు. మరమ్మతులకు గురైన లాంచీని రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హరిత రిసార్ట్స్ ఉద్యోగులకు సూచనలు చేశారు. లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా, విజయవాడ అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, రిసార్ట్స్ మేనేజర్ మస్తాన్ రావు, పులుసు వీరారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్టు
సత్తెనపల్లి: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇరువురుని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారన్నారు. పార్కు రోడ్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను కొట్టి గాయపరిచి ఆమె మెడలో రూ.3.42 లక్షలు విలువ చేసే 36.3 గ్రాముల బంగారు గొలుసు అపహరించి రెండు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడం జరిగిందన్నారు. పలు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా చైన్స్నాచింగ్ చేసే దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి పూర్తి బంగారం రికవరీ చేశామని, రెండు మొబైల్ ఫోన్లు, హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ స్వాధీన పరుచుకున్నామన్నారు. ఇరువురిని కోర్టుకు హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. మరొకడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసు ఛేదించిన పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్ఐ పవన్కుమార్, ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు లు అందించటం జరుగుతుందన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు, పట్టణ ఎస్ఐ పవన్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
అంతిమ ప్రయాణం
రహదారి ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పుట్టెంట్రుకలు తీయడానికి ఆలయానికి వెళ్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చాగల్లు వద్ద ట్రాలీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇలా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు/మాచవరం: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతుల కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణకు పుట్టెంట్రుకలు తిరుమలలో తీయించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో కలిసి 11 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలో ముందు వెళుతున్న ట్రాలీ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. తర్వాత వారి వాహనం బోల్తాకొట్టింది. కుటుంబం కకావికలం... చిన వెంకటేశ్వర్లు, సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిడుగురాళ్లలో చిన వెంకటేశ్వర్లు వెల్ఫేర్ అసిస్టెంట్గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ సంతోష జీవితం గడపాల్సిన సమయంలో ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. చిన వెంకటేశ్వర్లు తన కుమారుడు, భార్య, తల్లిని పోగొట్టుకున్నారు. సుభాషిణి తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. చిన వెంకటేశ్వర్లు వదిన కూడా చనిపోయింది. రైలులో వెళ్లాలని భావించినా.. ముందు తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. రైలు అయితే ఇబ్బందులు ఉండవని చిన వెంకటేశ్వర్లుకు సోదరుడు చెప్పాడు. కానీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని, కారులో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.. అని పేర్కొనడంతో పిడుగు రాళ్లకు చెందిన గంగరాజు తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. 9 గంటలకు బయలుదేరారు. మధ్యలో టీ తాగేందుకు ఆగారు. మళ్లీ బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. రైలులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదని మిగతా కుటుంబసభ్యులు, బంధువులు వాపోతున్నారు. మృతదేహాలు అప్పగింత... ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలలో వెంకట నరసమ్మ, సుభాషిణి, తేజస్విని అభినయ్ కృష్ణ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతులందరూ ఒక్క కుటుంబానికి చెందిన వారే బాలుడి పుట్టెంట్రుకలు తీయడానికి వెళ్తుండగా దుర్ఘటన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి కూడా మృత్యువాత ఘోర ప్రమాదంతో కకావికలమైన కుటుంబం మృతుల వివరాలివీ... ప్రమాద స్థలిలోనే చిన వెంకటేశ్వర్లు తల్లి వెంకట నరసమ్మ (55), భార్య సుభాషిణి (30)లు మృతి చెందారు. చిన వెంకటేశ్వర్లు కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణ (3)ను కావలి ఏరియా వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఆయన వదిన రుక్మిణమ్మ (35) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మామ యర్రం శ్రీనివాసరావు (58) నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శ్రీనివాసరావు స్వస్థలం గణేశునిపాడు పక్కనే ఉన్న అగ్రహారం గ్రామం. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నరసరావుపేట రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాంచాలని కోరారు. గిరిజనులకు అధార్కార్డు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. గిరిజనులకు ఆధార్కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. భారత ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకంలో తొమ్మిది ప్రభుత్వ శాఖల సహకారంతో 11 స్కీమ్ల ద్వారా గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా చెంచుగూడెంలో అర్హులైన వారికి ఇళ్లు కట్టించడం, రోడ్లు వేయడం, తాగునీటి వసతి కల్పిచండం, అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో 550మార్కులు పైగా సాధించిన గిరిజన విద్యార్థులు బి.సాయితేజనాయక్, కె.సంపత్నాయక్లకు రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జోస్న, గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, పాండునాయక్, విష్ణునాయక్, మేడా పోతురాజు, శ్రీరావుల కొండలు, కె.దాసు తదితరులు పాల్గొన్నారు.