breaking news
Palnadu
-
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన.. ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలు గడువు పెంపు
డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియేట్ (దూరవిద్య) కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.ఎం.ఏ.హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ ఆర్.నరసింహారావు ఉత్తర్వులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. అపరాధ రుసుం రూ.200 చెల్లించి ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటి వద్ద ఉంటూనే దూరవిద్య విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తిచేసే అవకాశం ఉందని వివరించారు. ప్రవేశాలు పొందిన అభ్యాసకులు సెలవు రోజుల్లో నిర్వహించే క్లాసులు, ప్రాక్టికల్స్కు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అభ్యాసకుల అడ్రస్కు నేరుగా పుస్తకాలు పంపుతారని పేర్కొన్నారు. రెగ్యులర్ కోర్సు ద్వారా పొందే సర్టిఫికెట్లకు ఎంత విలువ ఉంటుందో ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు అంతే విలువ ఉంటుందన్నారు. సదరు సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సమీపంలోని ఏఐ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి నాదెండ్ల: టూత్ పేస్ట్గా భావించి ఎలుకల నివారణ పేస్ట్ను వినియోగించి వృద్ధురాలు మృత్యువాత పడిన సంఽఘటన సాతులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ జి పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. జెట్టిపాటి పోలేరమ్మ (69) ఈనెల 8న ఉదయం పళ్లు తోముకునేందుకు టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల నివారణ పేస్ట్ను వినియోగించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త, కుమార్తె గతంలో మృతి చెందగా, ప్రస్తుతం ఈమె మనవళ్ల సంరక్షణలో ఉంటుంది. వృద్ధురాలి మనుమడు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట: స్థానిక పాలపాడు రోడ్డులోని ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో ఆదివారం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఏపీ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా ఉన్నం వేణుగోపాల్, కార్యదర్శిగా అబ్దుల్ కరీం, కోశాధికారిగా ఎన్.అక్షయ్కుమార్, గౌరవ అధ్యక్షులు జీపీ రంగయ్య, గౌరవ సలహాదారుగా జీవీ రఘురాం, ఉప అధ్యక్షులుగా బి.కోటేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యఅతిఽథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాంబాబు, చైర్మన్ కుమార్ మంగళం, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్ హాజరై ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాజీ అధ్యక్షులు దాసరి నాగ్శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాసకుమార్, సంయుక్త కార్యదర్శి బొందిలి శ్రీనివాససింగ్ హాజరయ్యారు. -
ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం వినుకొండరోడ్డులోని రోటరీక్లబ్ భవనంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు జమ్ముల రాధాకృష్ణ ఏపీ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని అభినందనసభ, జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కేవీ, కార్యదర్శిగా కసుకుర్తి రాజశేఖర్, కోశాధికారిగా రాంబాబు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లకు చెందిన జిల్లా సభ్యులతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నరసరావుపేట ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నేపల్లి శ్రీనివాసరావు, పడవల వంశీకృష్ణ, కోశాధికారి చిన్ని వెంకటేష్ల ఆధ్వర్యంలో జమ్ముల రాధాకృష్ణను సన్మానించారు. ప్రింటింగ్ రంగంలో రాబోతున్న మార్పులు, అడ్వాన్స్ మిషనర్, క్లస్టర్స్, ఇతర విషయాలపై చర్చించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలియచేశారు. -
పట్టపగలు చోరీ
సంతమాగులూరు(అద్దంకి రూరల్): తాళం వేసిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బంగారం వెండి, నగదు దొంగిలించిన ఘటన ఆదివారం మండలంలోని కుందుర్రులో జరిగింది. ఎస్ఐ ఎం.పట్టాభి అందించిన వివరాలు... మండలంలోని కందుర్రులో ఎస్కే ఖాశింసైదా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పనిమీద బయటకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని వారు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటికి బీరువా తెరిచి రూ.20 వేల నగదు, సవర బంగారం, 35 తులాల వెండి వస్తువులు అపహరించారు. ఇంటికి వచ్చిన ఖాశింసైదా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
కానుక భూములు అన్యాక్రాంతం
యడ్లపాడు: రాజుల పాలనా కాలంలో తమ పూర్వీకులు సర్వీసు ఈనాం (కానుక)గా పొందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని తిరిగి వారి వారసులకు అప్పగించాలని కోరుతూ యడ్లపాడు మండలంలోని బోయ సంక్షేమ సంఘం 19 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది. చిలకలూరిపేట జమీందారు రాజా మానూరు వెంకట హనుమంతరాయణం పాలన కాలంలో భటులుగా ఉన్న వీరి కుటుంబాల జీవనోభృతికి సర్వీస్ ఈనాం కింద వంకాయలపాడు, కొండవీడు, మైదవోలు, సొలస, యడ్లపాడు, తిమ్మాపురం, జాలాది, కారుచోల వంటి 8 గ్రామాల్లో దాదాపు 2,500 ఎకరాల భూముల్ని ఇచ్చారని, మొదట ఉన్నవ గ్రామంలో నివాసం ఉన్న ఈ బోయలు తర్వాత ప్రస్తుతం 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పరచుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా బోయలు ఉన్నందున బోయపాలెంగా రూపాంతరం చెందిందని వీరు చెబుతుంటారు. అక్రమాల పర్వం ఎలా మొదలైంది? 1956లో ప్రభుత్వం ‘ఇనాం ఎబాలేషన్ యాక్ట్’ను ప్రవేశపెట్టింది. దీంతో భూముల రికార్డులు సరిదిద్దే రీసెటిల్మెంట్ ప్రక్రియ అప్పటి అధికారులకు వరంగా మారింది. దీంతో హక్కుదారులైన బోయలకు అప్పగించకుండా రికార్డుల్లో బీనామీ పేర్లను చేర్చినట్లు బోయ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా నమోదైన వాటికి ఇంటిపేరు, తండ్రిపేరు, చిరునామా లేకపోవడమే భూ అక్రమాలకు నిదర్శనమని చెబుతున్నారు. ఈనాం భూములకు ప్రధాన ఆధారాలైన ఈనాం బీ రిజిస్టర్, రైత్వారీ పట్టా(ఫారం–8)లో అడంగళ్ 1బీలోని వివరాలు కనిపించకపోవడం గమనార్హమని అంటున్నారు. 19 ఏళ్ల పోరాటం.. తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని గుర్తించిన బోయల వంశీయులు సమస్యను 2006లో యడ్లపాడు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. నాటి నుంచి రెవెన్యూ శాఖకు 34 దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి స్పందన లేక 2022లో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. సంఘం ఆరోపణల్లోని ప్రధాన అంశాలు... ఒకే సర్వే నంబర్లో ఈనాం బీ రిజిస్టర్లో ఒక పేరు, ఫారం–8లో మరో పేరు, క్షేత్రస్థాయిలో మరో పేరు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు 2 శాతం కూడా లేరని బోయ సంక్షేమ సంఘం ఆరోపిస్తోంది. అక్రమంగా భూములు అనుభవిస్తున్న వారి వద్ద చట్టబద్ధమైన రైత్వారీ పట్టాలు లేవు. ఇవన్నీ లేకుండానే వంశపారంపర్యంగా సంక్రమించినట్లు అధికారుల ద్వారా రీసర్వే సమయంలో ఎల్పీ నంబర్లు, పాస్పుస్తకాలు పొందారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారుల వాదన ఇలా.. ఈనాంగా భటులు భూములు పొందినట్లు, సదరు భూములు వారి స్వాధీనంలో ఉన్నట్లు రికార్డులు ఏవీ అందుబాటులో లేవన్నది అధికారులు వినిపిస్తున్న వాదన. ఇనాం ఎబాలిషన్ యాక్ట్ నుంచి రైతుల పేర్లు మాత్రమే రికార్డుల్లో నమోదై ఉన్నాయని, నాటి నుంచి నేటి వరకు అవి ఎన్నో లావాదేవీలు జరిగి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.భట వృత్తిదారులకు భూములిచ్చిన జమీందారు భూములను మింగేసిన పెద్దలున్యాయం చేయాలంటూ 19 ఏళ్లుగా బోయల పోరాటం ఈనాం భూములపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించాం. అన్యాక్రాంతమైన భట వృత్తిదారుల భూములను ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. బోయ(భటవృత్తిదారుల)వారసులు, నిజమైన హక్కుదారులకు గుర్తించి వాటిని అప్పగించేందుకు కృషి చేయాలి. – దగ్గు నరసింహారావు, బోయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
సెపక్తక్రా విజేత కృష్ణ
●ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, తూర్పు గోదావరి ●క్రీడాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేత చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సెపక్తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. స్థానిక మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన పోటీలకు రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచి ప్రథమ స్థానాలను కై వసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా జట్టు గెలుచుకుంది. అలానే బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా ద్వితీయ స్థానాన్ని ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. తృతీయ స్థానంలో అనంతపురం జిల్లా జట్టు నిలిచింది. ఈ పోటీలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా జరిగాయి. బరువైన బాలును ఒక్క కాలితో గాలితో ఎగిరి కొట్టి అవతలి కోర్టులోని పంపాల్సి ఉంది. అయినప్పటికీ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో గెలుపుకోసం ఆటపై పట్టు సాధిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెపక్తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు, ఏపీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, నరసరావుపేట ఎంఎం కాలేజెస్ చైర్మన్ ఎంఆర్ రామశేషగిరిరావు, సెపక్తక్రా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇస్తర్ల సుభాషిణి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా సెపక్తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర, జిల్లా అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ కోచ్ వి.వనజ, గజవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అరవ చాకిరీపై ఆగ్రహం
గురువుల తిరుగుబాటు ● ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత ● బోధనేతర కార్యక్రమాల బహిష్కరణకు పిలుపు ● ఫ్యాప్టోలో 12 ఉపాధ్యాయ సంఘాలు భాగస్వామ్యం ● జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులు బోధనలకు దూరం ● బోధన కాలాన్ని హరించి వేస్తున్న యాప్లపై వ్యతిరేకత సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమను బోధనేతర పనుల నుంచి దూరం చేసి, పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ పిలుపుతో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్లో ఫ్యాప్టో చేపట్టిన మహా ధర్నాలో వేలాదిగా పాల్గొన్న ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వం అప్పగిస్తున్న అనవసరమైన బోధనేతర పనులతో అసలు తమ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. యాప్లతో అవస్థలు విద్యాశాఖ అమలు చేస్తున్న బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులను విద్యార్థులకు పాఠాలను చెప్పనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పనులు, మూల్యాంకన విధులు మినహా అనవసరమైన గూగుల్ షీట్స్ పూర్తి చేయడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 వంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని స్పష్టం చేస్తూ ఫ్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్, డీఈవోలకు మెమోరాండంలు సమర్పించారు. మండల స్థాయిలో ఎంఈవోలకు కూడా ఇచ్చారు. బోధనేతర విధులకు దూరంగా ఉండాలని ఫ్యాప్టో నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం నుంచి నిరసన చేపట్టనున్నారు. ఫ్యాప్టోలో భాగస్వాములైన 12 ఉపాధ్యాయ సంఘాలు బోధనేతర విధులు, అర్థం లేని యాప్లపై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. -
తురకపాలెం ఘటనతో భయాందోళనలు
గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితో పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన మరువక ముందే జిల్లాలో ఆ వ్యాధి లక్షణాలు బయటపడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం తురకపాలెం మాదిరి అలసత్వం వహించకుండా వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విరివిగా రక్త పరీక్షలు చేసి మెలియాయిడోసిస్ లక్షణాలను గుర్తించాల్సి ఉంది. జ్వరపీడితుల వివరాలు ఇంటింటికి వెళ్లి ఆరా తీసి తగిన చికిత్స అందించాల్సి ఉంది. సుమారు 342 మంది జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రమే రక్త నమూనాలను తీసి ల్యాబ్కు పంపినట్టు సమాచారం. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితులకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు పారిశుద్ధ్యం సరిగా లేకపోతే మెలియాయిడోసిస్ వ్యాఽధి మరింత మందికి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇళ్ల మధ్య, రోడ్లు, కాలువులను శుభ్రం చేయాల్సి ఉంది. -
ఎన్ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్వోసీ క్లియరెన్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. గుంటూరు నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్ జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్ఎఫ్వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. యాజమాన్యాలు, ఫామ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుఫెన్సీ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని అన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
మెలియాయిడోసిస్ కలకలం
సాక్షి, నరసరావుపేట : వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ దావుపల్లితండాలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో పల్నాడు జిల్లాలో కలకలం మొదలైంది. తండాకు చెందిన హర్యా నాయక్ దోమవత్కి తీవ్ర జ్వరం రావడంతో యర్రగుండపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. ఎంతకూ జ్వర లక్షణాలు తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సూచనతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లాడు. నెలరోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటం, జ్వర తీవ్రత తగ్గకపోవడంతో అనుమానం వచ్చి రక్త నమూనాలను ల్యాబ్కు పంపారు. మెలియాయిడోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి రవి, ఇతర వైద్య బృందం దావుపల్లితండాలో పర్యటించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామంలో ఇంకా ఎవరైనా వ్యాఽధి లక్షణాలతో బాధపడుతున్నారేమో ఆరా తీశారు. మట్టి, ధూళితో వ్యాధి ప్రభలే అవకాశాలు ఉండటంతో తండాలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. మెలియాయిడోసిస్ అంటువ్యాధి కాదంటూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్యానాయక్ శనివారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. ఆరోగ్యం నయమవ్వడానికి మూఢనమ్మకంతో తాయత్తు కట్టించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వైద్యాఽధికారులు తండాకు చేరుకొని రోగికి అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరు జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెలియాయిడోసిస్ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మారుమూల ప్రాంతాలైన తండాలలో నివసిస్తున్న గిరిజనులకు వైద్య సేవలు అందించడంతోపాటు, వారికి వ్యాధి పట్ల అవగాహన కల్పించి మంచి పౌష్టికాహారం అందిచాల్సి ఉంది.మెలియాయిడోసిస్ ఇదో అరుదైన వ్యాధి. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మొత్తం 28 మంది ప్రాణాలను వ్యాధి బలిగొంది. ఈ వ్యాధి ఇప్పుడు పల్నాడులో ప్రవేశించింది. పొరుగు జిల్లాలో జరిగిన ప్రాణ నష్టం గురించి విన్న పల్నాడు ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం, వైద్యాధికారులు అప్రమత్తమై నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకుంటే పెనుప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు.వెల్దుర్తి మండలందావుపల్లితండావాసికి లక్షణాలుమంగళగిరిలోని ఓ ప్రైవేట్ఆసుపత్రిలో చేరికచికిత్స పొందకుండా ఆసుపత్రినుంచి గ్రామానికి చేరుకున్న రోగికౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరుజీజీహెచ్కి తరలించిన వైద్యాధికారులుగ్రామంలో మరెవరిలో లక్షణాలులేవంటున్న జిల్లా వైద్యాధికారిగుంటూరు జిల్లా తురకపాలెంలోవరుస మరణాల నేపథ్యంలోభయాందోళనలో స్థానికులుప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసిఅనుమానితులకు పరీక్షలునిర్వహించకపోతే పెను ప్రమాదం -
కాటేసిన కడలి
చీరాల: వారంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. బీటెక్ చదివేందుకు ఒకే కాలేజీలో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా సముద్ర తీరంలో స్నానం చేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ లోతును అంచనా వేయలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే గల్లంతయ్యారు. స్థానికులు గమనించి నలుగురిని ఒడ్డుకు చేర్చిగా, మిగిలిన ముగ్గురు కడలిలో కలిసిపోయారు. మరో సంఘటనలో సరదాగా సాగరతీరానికి వచ్చిన వారిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. రెండు ఘటనల్లో ఐదుగురు విద్యార్థులు కడలి కెరటాలకు బలి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఎగసిపడిన అలలు అమరావతిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల రూరల్ మండలం వాడరేవు సముద్రతీరానికి వచ్చారు. అలల ధాటిని కూడా లెక్కచేయకుండా సముద్రంలో కేరింతలు కొట్టారు. కొద్దిసేపటికి అలలు ఎక్కువగా రావడంతో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానిక మైరెన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. అయితే, వీరిలో సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్)లు సముద్రంలో గల్లంతయ్యారు.కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితులు విగత జీవులుగా మారడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలను సేకరించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వివాహ వేడుకకు వచ్చి.. వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన మరో ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. శనివారం వివాహ వేడుక జరిగింది. ఆదివారం సరదాగా గడిపేందుకు వాడరేవు తీరానికి కుటుంబంతో వచ్చారు. సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లగా వడ్డె సంఘానికి చెందిన గౌతమ్ (15), షారోన్ (18) గల్లంతయ్యారు. షారోన్ సోదరి వివాహానికి అదే ప్రాంతానికి చెందిన గౌతమ్ మరికొందరు ఆదివారం సముద్రతీరానికి వచ్చారు. అయితే, వీరి మృతదేహాలు ఇంకా తీరానికి రాలేదు. షారోన్ రాజమండ్రిలో బీటెక్ చదువుతుండగా, గౌతమ్ కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వాడరేవు సముద్రతీరంలో ఐదుగురు యువకులు మృత్యువాత పడడంతో సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఉమామహేశ్వర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. అలలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం జరిగిన సంఘటనలో కూడా మైరెన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు కొంతమందిని కాపాడారని చెప్పారు. పర్యాటక ప్రాంతంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విషాదం నింపిన విహారం కన్నీటి సంద్రంగా మారిన తీరం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు గల్లంతు ముగ్గురి మృతదేహాలు లభ్యం జాడలేని మరో ఇద్దరి మృతదేహాలు మృతుల్లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒకరు పదో తరగతి విద్యార్థి -
పాఠాలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి మే, జూన్ నెలల్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాం. జూన్ నెల ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక బోధనేతర పనులు అప్పగించి ఉపాధ్యాయుల బోధన సమయాన్ని ప్రభుత్వమే వృథా చేస్తుంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను పాఠాలకే పరిమితం చేయాలి, బోధనేతర పనులు, యాప్లను ఫ్యాప్టో పక్షాన బహిష్కరిస్తున్నాం. – మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సత్తెనపల్లి -
బోధనేతర పనులను విరమించుకోవాలి
ఉపాధ్యాయులపై భారం మోపేలా ఉన్న బోధనేతర పనులను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. గిన్నిస్బుక్ రికార్డుల కోసం ఇప్పటికే యోగాంధ్ర, మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పేరుతో కార్యక్రమాలకు ముందు, తరువాత ఫొటోల అప్లోడ్ చేయించింది. దీనివల్ల బోధన పనిగంటలు వృథా అయ్యాయి. పరీక్షల్లో అసెస్మెంట్ బుక్లెట్ విధానంతో ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోంది. అందుకే బోధనేతర పనులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లను బహిష్కరిస్తున్నాం. –ఎస్ఎం సుభాని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సత్తెనపల్లి -
సమన్వయంతో ఉత్తమ సేవలు అందించాలి
నరసరావుపేట రూరల్: పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నేర సమీక్ష సమావేశం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్స్టేషన్ రిసెప్షన్లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి ఫిర్యాదుతో వచ్చే ప్రజలతో మర్యాదతో వ్యవహరించి బాధ్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. 60, 90రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయాల్సిన కేసులను వేగంగా పూర్తిచేసి, న్యాయస్థానంలో ప్రాథమిక చార్జిషీట్ సమర్పించాలని స్పష్టంచేశారు. మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాత్రి గస్తీ వ్యవస్ధను పటిష్టం చేయాలని ఆదేశించారు. డ్రంక్అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్తోపాటు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించి వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయ దుకాణాలను పరిశీలించి అనుమతి లేని విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం జాబ్ చార్టుకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల విధులను అప్పగించటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని డెమోక్రటిక్ ఏపీసీఎస్డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బండికల్ల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలోని సామ్రాట్ హోటల్లో శనివారం అత్మగౌరవ సభను నిర్వహించారు. సమావేశానికి జేఎసీ రాష్ట్ర చైర్మన్ జి. జోసఫ్ కిశోర్ అధ్యక్షత వహించారు. సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారి విధులను కూడా సచివాలయంలోని ఉద్యోగులకు అప్పగించడం వల్ల సతమతమవుతున్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్లను ఉద్యోగులకు బదలాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగులపై పని భారం పెంచటం వల్ల మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జేఎసీలుగా చలామణి అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రెండు వేల మందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం దిగిందని, వెంటనే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అప్పికట్ల కిశోర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాబ్ చార్టును ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ ప్రకటించటంతో పాటు హేతుబద్ధంగా పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ దుర్గాప్రసాద్, కన్వీనర్లు జీవన్ సాగర్, మదన్ మోహన్, శంకరరావు, శామ్యూల్, డైమండ్ బాబు, కీర్తి సాగర్ పాల్గొన్నారు. తెనాలిలో కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర జేఎసీ నాయకులు -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
క్రోసూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆయన పార్టీ నాయకులతో కలసి శనివారం ఆవిష్కరించారు. శంకరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు జరిగే కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, బెల్లంకొండ ఎంపీపీ పద్మావెంకటేశ్వరరెడ్డి, అచ్చంపేట మండల అధ్యక్షుడు చిలకా చంద్రయ్య, సీహెచ్ఆర్కే సాయిరెడ్డి, ఎంపీపీ పి.కోటయ్య, జెడ్పీటీసీ షేక్ గఫూర్, గార్లపాటి దాసు, వైస్ ఎంపీపీ విప్పల వెంకట్రామిరెడ్డి, అల్లా, కాల్వపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ క్రోసూరు మండల అధ్యక్షుడు వెలది అప్పారావు, సుంకర శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు అనుముల కోటిరెడ్డి, అమరావతి మండల అధ్యక్షుడు భవిరిసెట్టి హనుమంతరావు, ఖాదర్, యార్డు మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాసరెడ్డి, వేజండ్ల రవి, నర్రా వాసుదేవరాయలు, ముస్తఫా, భిక్షమయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణే యూటీఎఫ్ లక్ష్యం
నరసరావుపేట: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం యూటీఎఫ్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏర్పాటు చేసిన మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని పూర్వ ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి, యూటీఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు ఎ.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వేసవి సెలవుల్లో విస్తృత ప్రచారం చేశామన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారని, అవసరమైతే అదనంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ అగ్రభాగాన ఉండి పోరాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో రెండు డీఏలను తక్షణమే విడుదల చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని మెమో నెం.57అమలు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయాలని, బోధనేతర పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో 2021లో ఐదేళ్లు కాలానికి ప్రపంచబ్యాంక్తో ఆంధ్ర సపోర్టింగ్ లెర్నింగ్ ట్రాన్స్పర్మేషన్ ఒప్పందం చేసుకుని రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నారన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం, నాణ్యమైన విద్య అందించడం కాగా లక్ష్యాన్ని నీరుగారుస్తూ ఆన్లైన్లో సమాచారాన్ని పంపించే పాఠశాలలుగా మార్చారన్నారు. విద్యకు బడ్జెట్లో కోత విధించడంతో, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య తగ్గి విద్యార్థుల సామర్ాధ్యలు తగ్గాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడి లేకుండా పనిచేయడం కోసం సాల్టు పథకం రద్దు చేయాలని, దీనికై సామాజిక పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టిఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ మండల శాఖలు బలోపేతం చేయాలని సభ్యత్వం పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. నూతన ఉపాధ్యాయులకు తగు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష మోడల్ బుక్లెట్ ఆవిష్కరణ ఎనిమిద తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెటీరియల్ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రచురించిన బుక్లెట్ను రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ కాసిం పీరా, సహాధ్యక్షులు జెవిడి నాయక్, జిల్లా సహాధ్యక్షురాలు ఎ.బాగేశ్వరిదేవి, కోశాధికారి ఎం.రవిబాబు, జిల్లా కార్యదర్శిలు మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు -
క్రోసూరులో ఇంటిపై పడిన పిడుగు
క్రోసూరు: పిడుగుపాటులో ఇంటి శ్లాబ్ పాక్షికంగా ధ్వంసమైన ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. క్రోసూరులోని కటకం కల్యాణ మండపం ఎదురు బజారు(కొత్తూరు)లో షేక్ నాగూరు ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంటిపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఇంటి వరండా స్లాబ్ బీటలు వారింది. ఇంటిలోని విద్యుత్మీటర్ కాలిపోయింది. ఫ్రిజ్, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు పూర్తిగా పాడయ్యాయి. ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడిపోయాయి. అంతేకాకుండా అదే వీధిలోని అనేక మంది ఇళ్లలో విద్యుత్ పరికరాలు, నీళ్ల మోటార్లు, టీవీలు, పాడయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరావు సందర్శించి బాధితుడిని పరామర్శించారు. వీఆర్వో లేళ్ల బ్రహ్మనాయుడు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. -
ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత భారతీయులందరిది అని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఆయన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ సభ్యులతో కలసి శనివారం అమరావతిని సందర్శించారు. ఠాగూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాచీన వారసత్వ కట్టడాలను పరిరక్షించటానికి ప్రస్తుతం 241 ఇంటాక్ చాప్టర్లు పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చారిత్రక ప్రాచీన వారసత్వ సంపదను గుర్తించటానికి రాష్ట్రంలోని సంస్థ సభ్యులు పనిచేయాలన్నారు. లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలను అమరావతి మ్యూజియంలో ఉంచాలన్నారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అమరావతి శిల్పాలలో ప్రాచీన నాగరికతలు, అనాటి చారిత్రక పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయన్నారు. అమరావతి అర్కియాలజీ మ్యూజియం, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయంలను సందర్శించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, ఇంటాక్ చాప్టర్స్ డివిజన్ డైరెక్టర్ కెప్టెన్ అరవింద్ శుక్లా, ఇంటాక్ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రవి శ్రీనివాస్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మేకల రవీంద్రబాబు, పురావస్తు శాఖ అధికారి సూర్యప్రకాష్, ఇంటాక్ సభ్యులు వేణుగోపాల్, విజయ్ కుమార్, శ్రీధర్ బాబు, యల్లాప్రగడ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ -
నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఉదయ్చంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడాడని.. నా చావుకు మధునే కారణం’’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. స్నేహితులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసినట్లు ఉదయ్చంద్ర తెలిపాడు. దీనిపై ఏఈ మధుసూదన్రావును వివరణ కోరగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్చంద్రపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేశారన్నారు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, లైట్లు ఆన్/ఆఫ్ సక్రమంగా చేయడం లేదని, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారన్నారు. కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించడం లేదని, ఉదయ్చంద్రను విధుల నుంచి తీసివేయాలని సూచించడంతో కొన్ని రోజులు ఆపామని ఏఈ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయనని చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 29, 30వ డివిజన్లలో పనిచేస్తున్న ఉదయ్చంద్రను బుడంపాడు లైట్లు ఆన్/ఆఫ్కు మార్చినట్లు తెలిపారు. ఆ విధులకు కూడా హాజరు కాకపోవడంతో అతన్ని ప్రశ్నించడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరింపులకు దిగాడని మధు వివరించారు. జె.పంగులూరు: వేగంగా వస్తున్న కారు టైరు పగిలి బోల్తా పడిన సంఘటన ముప్పవరం జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడు నుంచి నెల్లూరు కారు నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ముప్పవరం జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో కారు టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎం. బాబురావు, సీహెచ్ అనిల్కుమార్ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రేణింగవరం ఎస్సై వినోద్బాబు, బీట్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. -
పేటలో దంచికొట్టిన వాన
నరసరావుపేట రూరల్/నరసరావుపేట: మండలంలో శుక్రవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు హడలెత్తారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాన ఉరుములు, పిడుగులతో క్రమంగా పెరిగింది. భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దాదాపు రెండు గంటలపాటు నరసరావుపేట సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. భారీ వర్షంతో మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదరెడ్డిపాలెం, గోనెపూడి గ్రామాల సమీపంలోని చప్టాల మీద నీరు ప్రవహించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మెట్ట పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె దశలో ఉన్న పత్తి పంటకు కూడా నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. అపార్టుమెంట్పై పడిన పిడుగు పెద్దచెరువు నుంచి వల్లప్పచెరువుకు వెళ్లే రోడ్డులోని ఓ అపార్టుమెంట్పై శుక్రవారం రాత్రి పిడుగు పడింది. టెర్రస్పైనున్న పిట్టగోడ కొద్దిభాగం ధ్వంసమైంది. దీని ధాటికి లిప్ట్కు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బోర్డు కాలిపోయింది. లిఫ్ట్ ఆగినా అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను 17 మండలాల్లో వాన కురిసింది. అత్యధికంగా ముప్పాళ్ల మండలంలో 72.6 మి.మీ. పడింది. నరసరావుపేటలో 45, నాదెండ్ల 4.2, చిలకలూరిపేట 16.6, రొంపిచర్ల 4.6, ఈపూరు 3.6, నూజెండ్ల 2.8, నకరికల్లు 20.6, రాజుపాలెం 21.8, సత్తెనపల్లి 54.8, పెదకూరపాడు 7.4, అమరావతి 30.4, క్రోసూరు 20.8, అచ్చంపేట 60.6, బెల్లంకొండ 12.6, మాచవరం 5.4, పిడుగురాళ్లలో 8.6 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
29న జెడ్పీ సర్వసభ్య సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో అజెండాలో పొందుపర్చిన అంశాలతోపాటు వివిధ శాఖల ప్రగతిపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు డివిజన్ సహకారశాఖ అధికారి సేనారెడ్డి ఆదేశం కొరిటెపాడు(గుంటూరు): ‘సహకారంలో జీతాల కుంభకోణం’ శీర్షికన ఈ నెల 10వ తేదీన సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై సహకార శాఖ డివిజనల్ అధికారి సేనారెడ్డి స్పందించారు. వివరణాత్మక నివేదిక సమర్పించాలని మండల ఇన్చార్జులను ఆదేశించారు. గుంటూరు డివిజన్లోని మండలాల్లో ఉన్న పీఏసీఎస్లకు కేటాయించిన మండల ఇన్చార్జులు సోమవారం సాయంత్రం 5 గంటలకు సహకార శాఖ డివిజన్ కార్యాలయానికి ఆధారాలతో వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కూడా ఆరా తీసినట్లు సమాచారం. చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలులోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు, జ్వరాల కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలులోని చెరువులోపాలెంలో శనివారం ఐదుగురికి డయేరియా లక్షణాలు కనిపించటంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు జ్వరాలబారిన పడ్డారు. ప్రభుత్వ వైద్యశాలలతోపాటు స్థానిక ఆర్ఎంపీలు, గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలల్లో కూడా వారు చికిత్స పొందుతున్నారు. చెరువులోపాలెంలో ఆహార కలుషితం కారణంగానే వాంతులు, విరేచనాలు బారిన పలువురు పడినట్లు పీహెచ్సీ అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. తాడికొండ: అమరావతిలో నిర్మించిన ఏపీ సీఆర్డీ ఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శనివారం సందర్శించారు. ప్రాజెక్టు కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ీసీఆర్డీ ఏ కమిషనర్ కన్నబాబు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్డీ ఏ అడిషనల్ కమిషనర్ ఎ. భార్గవ్ తేజ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
జీవితాంతం వైఎస్సార్సీపీతోనే ఉంటాం
ముప్పాళ్ళ: వైఎస్సార్సీపీ అధినాయకత్వ నిర్ణయమే తమ నిర్ణయమని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటామని ఎంపీటీసీ సభ్యులు మలిరెడ్డి అనూష (లంకెలకూరపాడు),గోగుల అంజిబాబు (మాదల), షేక్ బందెల హుస్సేన్బీ (తొండపి)లు చెప్పారు. అమ్ముడుపోవడం.. కొనుక్కోవడం వైఎస్సార్సీపీ నైజం కాదని స్పష్టం చేశారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీసాయిబాబా ఆలయ ఆవరణలో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డితో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి నాయకులు ఎంపీపీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతూ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎవరి ప్రలోభాలకూ లొంగబోమని, చివరివరకు వైఎస్సార్సీపీతోనే ఉంటామని చెప్పారు. పరాయి బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచి, పదవుల కోసం టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల నిర్ణయమే తమ నిర్ణయమని తేల్చి చెప్పారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి, ఆయన్ను శాలువాతో సన్మానించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, ఇందూరి నరసింహా రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకరరెడ్డి, యనమాల సింగయ్య, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యులు -
పెద్దాసుపత్రికి సుస్తీ
గుంటూరు మెడికల్: ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్లో సమస్యలు ఏకరవు పెడుతున్నాయి. ఇటీవల డయేరియా బాధితుల వార్డులో వసతులు లేక రోగులు నరకయాతన పడ్డారు. నేడు పెద్దాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. పిల్లల వార్డులో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇటీవల గుంటూరు నగరంలో డయేరియాతో సుమారు 200 మంది వరకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందారు. బాధితుల కోసం ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వసతులు కరువయ్యాయి. సైలెన్ స్టాండ్స్ సరిపడా లేక కిటికీలకు వేలాడదీశారు. పడకలపై బెడ్ షీట్స్ లేవు. మరుగుదొడ్లలో నీటి సమస్య నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. సమస్యల మధ్యే రోగులు చికిత్స పొందారు. సమస్యలు స్వాగతం నేడు వాంతులు, విరేచనాలతో అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పిల్లల వైద్య విభాగానికి వచ్చారు. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ, మరో పక్క వార్డులో వసతుల లేమి, సమస్యల మధ్యే చికిత్స పొందుతున్నారు. వార్డు వ్యాధి బాధితులతో కిక్కిరిసి పోయింది. ఏసీలు పనిచేయక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పడకలపై కనీసం బెడ్షీట్లు కూడా లేవు. మంచాలు సైతం తుప్పు పట్టిపోయాయి. రోగి పడుకుని చికిత్స పొందాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బందికి సైతం వసతులు లేక ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లల వార్డులోని బాత్రూమ్కు కనీసం డోర్ కూడా లేకపోవడం దారుణం. తనిఖీలకే అధికారులు పరిమితం ఆస్పత్రి అధికారులు ప్రతిరోజూ తనిఖీల పేరుతో పలు వార్డుల్లో తిరుగుతున్నా ప్రయోజనం లేదు. వార్డుల్లో సమస్యలు అధికారులు కనిపించటం లేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించటం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ‘మీ కోసం మేము’ అనే కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు నిర్వహిస్తున్నారు. రోగులను ఒకచోట సమావేశపరిచి సమస్యలు ఉంటే చెప్పాలని, తక్షణమే పరిష్కరిస్తామని భరోసా మాటలు చెబుతున్నారు. అయితే, అవి కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల తూతూమంత్రంగా తనిఖీలు చేసి సమస్యలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి, ప్రశాంతమైన వాతావరణంలో వైద్యసేవలు అందించేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జె.పంగులూరు: మండల పరిధి కొండమంజులూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు 365 సైకిళ్లను శనివారం ఉచితంగా అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,106 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 82,090 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అది... ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రాంతమది.. కానీ రాకపోకలకు ప్రయాణికులు కనీస సౌకర్యాలు కూడా లేక కష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. అమరావతిలో ఎక్కడా బస్ షెలర్లు లేకపోవటంతోపాటుగా ఊరి చివర ఉన్న బస్టాండ్ నిర్వహణలో నిర్లక్ష్యమే వారికి శాపంగా మారింది. ఏడాదిగా వారు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. గతంలో బస్టాండు స్థలంలో చెట్లు ఏడాదికొకసారి కొట్టించేవారు. ప్రస్తుతం అలా కొట్టకపోవటంతో అడవిలాగాకంపచెట్లు బాగా పెరిగాయి. మురుగు నీటి నిల్వతో విషసర్పాలు సమీపంలో ఉన్న ఇళ్లలోకి రావటం పరిపాటిగా మారింది. రోజుల తరబడి తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగాయి. స్థానికులు రోగాల పాలవుతున్నారు. – నక్కా వెంకట నాగరత్నం, అమరావతిఅమరావతి: అమరావతికి దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు నిత్యం వస్తుంటారు. ముందు చూపుతో సుమారు 50 ఏళ్ల క్రితం అమరావతి బస్టాండుకు సుమారు ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గుంటూరు నుంచి క్రోసూరు, అచ్చంపేట మండల కేంద్రాలు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో ఉన్న అమరావతి ఆర్టీసీ డిపో నిర్మాణానికి అనువుగా ఉంటుందని సర్కారు ఈ స్థలం ఇచ్చింది. ఇప్పటి వరకు అందులో కొద్ది స్థలంలో మాత్రమే బస్టాండ్ నిర్మించారు. మిగిలిన స్థలం నిరుపయోగంగా కంప చెట్లతో అడవిని తలపిస్తోంది. వాన పడితే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ప్రయాణికులతోపాటు పక్కన కాలనీ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో తాగుబోతులు పెరిగారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. ప్రయాణికులకు బస్సుల సమయాలను చెబుతూ, బస్టాండు నిర్వహణను ఒకరు చూస్తున్నారు. మరొకరు దుర్గావిలాస్ సెంటర్లో ఉంటూ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి బస్సులను క్రమపద్ధతిలో పెట్టించి ప్రయాణికులను పంపుతూ ఆక్యుపెన్సీ రేటు పెంచే పనులు చేస్తున్నారు. బస్టాండ్లో అధ్వానంగా వసతులు బస్టాండ్లో చీకటైతే విద్యుద్దీపాలు తక్కువగా ఉండటంతో రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఆరు ఫ్యాన్లకుగాను సగం పనిచేయడం లేదు. రాత్రివేళ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి డిపోల బస్ సర్వీసుల డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆ గది గోడలు పగుళ్లిచ్చాయి. ఇనుప మంచాలు తుప్పుపట్టి, పరుపులు చిరిగిపోయి ఉన్నాయి. ప్రయాణికులకు తాగునీరు అందించడానికి ఒక్క పంపు మాత్రమే ఉంది. మిగిలినవి పని చేయటం లేదు. వానజల్లు పడితే చాలు బస్టాండులోని ప్రయాణికులు తడిసిపోవాల్సిందే. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం లోపించింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం సుమారు 4 వేల మందికిపైగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మండల కేంద్రమైన అమరావతిలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు షెల్టర్ కూడా లేదు. అమరేశ్వర ఆలయం నుంచి ఊరి చివర బస్టాండు వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు సెంటర్లలో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. గతంలో అమరేశ్వరాలయం వద్ద ఉన్న బస్షెల్టర్ కాలక్రమంలో పోలీస్ ఔట్పోస్టుగా మారింది. మద్దూరు డౌన్ సెంటర్లోని బస్ షెల్టర్ తొలగించారు. అమరావతి పర్యాటక, శైవక్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం వేల సంఖ్యలో వచ్చే వారికి బస్టాండులో కనీస సౌకర్యాలు లేవు. అధికారులు లేక కొన్ని బస్సుల వారు సమయపాలన పాటించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస వసతులు కల్పించడానికి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. – దారాప్రసాద్, అమరావతి మండల వైఎస్సార్సీపీ కార్యదర్శిఅమరావతి సెంటర్లో బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న ప్రయాణికులుకంపచెట్లు పెరగడం వలన మరుగుగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ స్థలం అడ్డాగా మారింది. మద్యం తాగే వారికి అనువుగా ఉంది. పక్కన ఉన్న రోడ్డులో స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నడవాలంటే మందుబాబులకు భయపడాల్సిన దుస్థితి. బస్టాండ్లో తగిన వసతులు కల్పించి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. – బి.సూరిబాబు, అమరావతి మండల సీపీఎం కార్యదర్శిచిట్టడవిని తలపిస్తున్న ప్రాంగణంలోని పిచ్చి చెట్లుపనిచేయని తాగునీటి కొళాయిలుఅమరావతి బస్టాండు7బస్టాండ్ ఆవరణలో చెట్లు కొట్టించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. కంట్రోలర్ నియామకానికి ప్రతిపాదనలు పంపాం. మరుగుదొడ్లు, తాగునీటి కొళాయిలు, ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని కొద్దిరోజులలో సరి చేయిస్తాం. బస్టాండు స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మిగిలిన సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటాం. – విజయకుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్, సత్తెనపల్లి -
ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వీరరాఘవయ్యరేపల్లె: విద్యార్థి దశ నుంచే ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రేపల్లె బ్రాంచి చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య సూచించారు. ప్రథమ చికిత్స, సీపీఆర్లపై పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుంటూరు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరరాఘవయ్య మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారు వైద్యశాలకు వెళ్లేలోపు ప్రథమ చికిత్స వల్ల కొంత మేర వైద్యం అందుతుందని, దీనివల్ల రక్షణ లభిస్తుందని తెలిపారు. ఎవరైనా గుండెపోటుకు గురైతే వైద్యశాలకు వెళ్లే ముందు సీపీఆర్ అందిస్తే అతను బతికేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వివిధ సందర్భాల్లో గాయపడిన వ్యక్తులకు అందించే ప్రథమ చికిత్సలు, గుండెపోటు వచ్చిన సమయంలో అందించే సీపీఆర్ని గుంటూరు రెడ్క్రాస్ సొసైటీకి చెందిన డాక్టర్ రసూల్ బృంద సభ్యులు ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీసీ రవిచంద్రకుమార్, కోఆర్డినేటర్ బుజ్జిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో ఆర్కే నారాయణ్ జయంతిని నిర్వహించారు. ఆయన సాహితీ సేవలను విద్యార్థులకు వివరించారు. ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు బాలికా హక్కులు, సమాన అవకాశాలు, శక్తి వికాసంపై వ్యాస రచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శక్తి వికాస్ సెల్ ఇన్చార్జ్ సుభాషిణి, సీడీపీవో సుచిత్ర, సీఆర్ఏఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ హిమబిందు, టి.రాధిక, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: మండలంలోని చెరువుజమ్ములపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్– 14 బాలబాలికల హాకీ టీంను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం. గోపి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. పోటీలకు బాలురు 18, బాలికలు 18 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో జరిగే 69వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో–2 డి. ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు బి. గంగాధర్, ఎం. సాంబశివరావు, వాణీ సుశీల, ఏ.టి.రాంబాబు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రెంటచింతల: స్థానిక పీహెచ్సీ కేంద్రానికి వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.రవి వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్సీ కేంద్రాన్ని ఆయన శుక్రవారం జిల్లా మలేరియా అధికారి రత్నాకర్తో కలసి ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం జ్వరాల సీజన్ కాబట్టి ల్యాబ్ టెక్నిషియన్లు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బందికి తగు సలహాలు, సూచనలు అందిస్తూ ఉండాలన్నారు. ప్రస్తుతం పీహెచ్సీ పరిధిలో వస్తున్న జ్వరం కేసుల వివరాలను మెడికల్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు(ఓపీ) నమోదు, ఆస్పత్రిలో రోగులకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు, రక్త పరీక్షల వివరాలు, మందులు ఇచ్చే విభాగం పనితీరు, వివిధ రికార్డులు పరిశీలించారు. అనంతరం రెంటచింతల గ్రామంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఫ్రైడే డ్రైడేను పరిశీలించి స్థానిక ఆరోగ్య సిబ్బందికి విష జ్వరాలపై పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎన్.కోటేశ్వరరావు, మలేరియా సూపర్వైజర్ సీహెచ్ అంకమ్మరావు, ఎంపీహెచ్ఈఓ ఏడీ శర్మ, ఎ.ఆంజనేయులు, హెల్త్ అసిస్టెంట్ షేక్ ఖాసింసా, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో ఇళ్లు పంపిణీకి సిద్ధం
నరసరావుపేట: మున్సిపాలిటీ పరిధిలో 199 టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కలెక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోగల టిడ్కో హౌసింగ్ కాలనీ, వినుకొండరోడ్డులోని జగనన్నకాలనీలను సందర్శించారు. టిడ్కో గృహ సముదాయంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 23 నాటికి మరిన్ని ఇళ్లను జతచేసి 200కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నామని చెప్పారు. స్వాధీన పరుచుకున్న ఇళ్లలో ఖచ్చితంగా ఎవరో ఒకరు నివాసం ఉండేలా చూడాలని లబ్ధిదారులను కోరారు. నివాసం లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు కాలనీలు నెలవుగా మారే అవకాశం ఉంటుందన్నారు. కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న మరో 270 ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాలు మంజూరు కాని 300 మందికి పైగా లబ్ధిదారులకు అన్ని బ్యాంకుల ద్వారా క్యాంపు ఏర్పాటుచేసి రుణాలు మంజూరు చేసి మరీ ఇళ్లు స్వాధీనం చేస్తామన్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్న ఇళ్లకు 23 నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారుల నుంచి కాలనీలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వీధిదీపాలకు సాయంత్రంలోగా మరమ్మతులు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో టిడ్కో కాలనీ తీర్చిదిద్దామని దీనికి కృషిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ మిగిలిన వారికి కూడా టిడ్కో గృహాలను స్వాధీనం సత్వరమే చేయాలని కోరారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో సమస్యలు పరిష్కరించండి వినుకొండ రోడ్డులోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్ (జగనన్న కాలనీ)లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాలనీలో పర్యటించిన ఆమెకు కాలనీ ఏర్పాటు, అందులోని పరిస్థితులను ఎమ్మెల్యే, అధికారులు వివరించారు. రహదారులు బాగాలేవని, మురుగు కాలవల నిర్మాణం చేపట్టాలని, విద్యుత్తు లైన్లను వేయించాలని స్థానికులు కోరారు. ఆ సమస్యలు విన్న కలెక్టర్ తహసీల్దారు, పంచాయతీ అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, అధికారులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
న్యాయమైన పరిహారం అందజేస్తేనే భూములు ఇస్తాం
నరసరావుపేట రూరల్: న్యాయమైన పరిహారాన్ని అందజేస్తేనే భూ సేకరణకు సహకరిస్తామని కేసానుపల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. చీరాల ఓడరేవు–నకరికల్లు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం శుక్రవారం కేసానుపల్లి గ్రామ రైతులతో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమావేశం నిర్వహించారు. సమావేశానికి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.80 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని జేసీ తెలిపారు. జేసీ ప్రతిపాదనకు భూ నిర్వాసితులు అంగీకరించలేదు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో ప్రకటించిన విధంగా ఎకరానికి రూ.1.60 కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు. గ్రామానికి చెందిన 42 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, ఇందులో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని వివరించారు. ఆ భూములనే నమ్ముకున్న రైతులు భూసేకరణ ద్వారా జీవనాధారం కోల్పోతారని పేర్కొన్నారు. గతంలో చెప్పిన పరిహారంలో సగం ధరకే ఇప్పుడు భూములు ఇవ్వాలని అధికారులు చెప్పడాన్ని తప్పుపట్టారు. న్యాయమైన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ రైతులను అధికారులు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామినేని రామారావు, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావులు పాల్గొన్నారు. -
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమన్నారు. మొబైల్ యాప్లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టిసారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వయం సహాయక సంఘాలకు రూ.5.07 కోట్లు కేటాయింపు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో పల్నాడు జిల్లాకు రూ.5.07 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటాయించారని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పేర్కొన్నారు. శుక్రవారం కోటప్పకొండ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గ్రామనిధి అనే పోర్టల్ ప్రారంభించిందని, దీని ద్వారా జిల్లాలోని 26 మండలాలకు మండలానికి రూ.19.50 లక్షల చొప్పున మంజూరు చేశారన్నారు. గ్రామ సంఘాలలోని స్వయం సహాయక సంఘాల వారు అవసరం మేరకు దానిని గ్రామనిధి పోర్టల్లో అప్లోడు చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు అందరూ కలిసి స్వయం సహాయక సంఘాలకు గ్రామ సంఘం అసిస్టెంట్లుగా మహిళలు మాత్రమే కొనసాగాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సంఘం అసిస్టెంట్గా మహిళలు ఉంటే ఏవిధమైన సమాచారమైన చెప్పకోవటానికి అభ్యంతరాలు ఉండవని జిల్లా సమాఖ్య ప్రతినిధులు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి తెలియచేశారు. ఏపీడీ రాజా ప్రతాప్, డీపీఎంలు మల్లీశ్వరి, శ్రీనివాస్, డేవిడ్ పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు కారంచేడు విద్యార్థులు
కారంచేడు: త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారంచేడు విద్యార్థులు ఎంపికయ్యారు. ఒంగోలులో ఈ నెల 7న నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలకు కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 60 కేజీల బాలికల విభాగంలో భవ్యశ్రీ , బాలుర విభాగంలో బి. సుదీప్కుమార్ ఎంపికయ్యారు. 55 కేజీల విభాగంలో కె. దుర్గ ఎంపికై నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులను శుక్రవారం చీరాల డిప్యూటీ ఈఓ కె. గంగాధర్ అభినందించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి గ్రామానికి, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పాఠశాల పీడీ షేక్ మస్తాని, ప్రధానోపాధ్యాయురాలు ఎం. సామ్రాజ్యాన్ని అభినందించారు. -
వృద్ధురాలి మృతదేహానికి రీపోస్టుమార్టం
క్రోసూరు: నెల రోజుల కిందట మృతి చెందిన వృద్ధురాలు చిలకా ఆరోగ్యమ్మ(96) మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ వి.వి.నాగరాజు తెలిపిన వివరాల మేరకు మృతురాలు నరసరావుపేటలో నివసిస్తూ అక్కడే నెల కిందట మృతి చెందింది. అయితే ఆమెను క్రోసూరు క్రైస్తవ సమాధుల్లో పూడ్చిపెట్టటం జరిగింది. ఆమె భర్త చాలా కాలం కిందట మృతి చెందాడు. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తపరుస్తూ ఆమె కోడలు రూతమ్మ నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి ఎస్ఐ సీహెచ్ కిషోర్ రీ పోస్టుమార్టంకు ఏర్పాటు చేయగా తహసీల్దార్ పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో బ్రహ్మనాయుడు, సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
కల్తీ మద్యంపై సీబీఐచే విచారణ చేయించాలి
నరసరావుపేట: రాష్ట్రంలో వెలుగుచూసిన అక్రమ కల్తీ మద్యం, మరణాలపై వెంటనే సీబీఐతో విచారణ చేయించి దోషులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. కల్తీ మద్యం రాకెట్ ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే జరగదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నారా వారీ అక్రమ మద్యం ప్రజలకు తాగునీరు కంటే చాలా సులభంగా లభ్యమౌతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా 70 వేల బెల్టుషాపులు నడిపిస్తున్నారన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మూడు మెషీన్లతో నెలకు 45లక్షల బాటిళ్ల కల్తీ సారా తయారుచేయించి వివిధ బ్రాండ్ల లేబుళ్లు అంటించి మద్యం, బెల్టుషాపులకు సరఫరా చేశారన్నారు. సుమారుగా రూ.4,800 కోట్లు మద్యం ప్రియుల నుంచి కొల్లగొట్టారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారుచేసేందుకు ఇన్ని వేల లీటర్ల స్పిరిట్ ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఒక హాస్పిటల్లో స్పిరిట్ వాడాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకొని వాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే ఇంత భారీగా స్పిరిట్ లభ్యం కాదని, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలే ఉన్నారు కాబట్టి వారు చేయించే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని అన్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి వైఎస్సార్ సీపీ కోవర్టు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో టీడీపీ మీడియా పనిచేస్తుందన్నారు. ఇంత ఘోరమైన స్కామ్ వారు చేస్తూ ఎటువంటి స్కామ్కు ఆస్కారంలేని గత ప్రభుత్వ మద్యం విధానంపై తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నాయకులను జైళ్లపాలు చేశారన్నారు. ఎన్నికలకు ముందు మద్యం తాగేవారి కడుపుపై కొట్టారని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నందునే వారు మాట్లాడటం లేదని, సీబీఐచే విచారణ చేయించి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి -
ఓవర్ హెడ్ ట్యాంకుపై రాజకీయ నీడలు
నరసరావుపేట: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో చొరవ చూపాల్సిన కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పట్టణంలో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు, డిస్ట్రిబ్యూషన్ పైపులైను వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు. దీంతో సుమారు పది నుంచి 15వేల మంది ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన ఓవర్ హెడ్ ట్యాంకును వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రారంభించి తామే ఏర్పాటు చేశామంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం(అటల్ మిషన్ ఫర్ రెజోనేవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద నరసరావుపేట పురపాలక సంఘానికి గత ప్రభుత్వంలో రూ.5 కోట్లు కేటాయించింది. వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టగా మిగిలిన సుమారు రూ.కోటి నిధులతో శ్రీనివాసనగర్, ఇస్లాంపేట, కోటప్పకొండరోడ్డుతోపాటు రవీంద్రనగర్, ఆ మార్గంలోని పలు ఏరియాలలో నివాసం ఉండే వారికి తాగునీరు అందజేసేందుకు మార్కెట్ యార్డులో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2023లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడా ఆ రాయి కన్పించకుండా చేయటం గమనార్హం. యల్లమంద పంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని పురపాలక సంఘంలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో అనేక నివాస ప్రాంతాలకు ఈ తాగునీరు అందాల్సి వుంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. దీని నుంచి నీరు అందజేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి వుంది. గతేడాది కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్నెల్లుపాటు పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఏడాది జనవరిలో సుమారు రూ.44 లక్షల ఖర్చుతో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 10 నెలలు కావొస్తున్నా ఆ పనులు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే వెంకటరెడ్డికాలనీలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. దీని వలన సక్రమంగా నీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది నూతనంగా ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటుచేసుకున్నా నీరు సక్రమంగా అందట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి పైపులైను నిర్మాణం పూర్తిచేసి నీటిని పంపిణీ చేయాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లుగా తెలియవచ్చింది. తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. పైపులైను నిర్మాణం కోసం వినియోగించే హెచ్డీ పైపులకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అవి రాష్ట్రంలో శ్రీకాళహస్తిలోని ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. అవి రాగానే పైపులైను నిర్మాణం చేసి నూతన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు కుళాయిలు మంజూరుచేసి తాగునీరు అందజేస్తాం. –డి.రవికుమార్, మున్సిపల్ ఇంజినీరు -
రెండో సారి విచారణకు హాజరైన పీఆర్కే, పీవీఆర్
మాచర్ల బోదిలవీడు సమీపంలో ఐదు నెలల కిందట జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో విచారణకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు శుక్రవారం రెండోసారి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాచర్ల రూరల్ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రూరల్ సర్కిల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. శుక్రవారం ఉదయం10.30 నుంచి రాత్రి 7గంటల వరకు గురజాల డీఎస్పీ జగదీష్, రూరల్ సీఐ నఫీజ్ బాషాతోపాటు ఇతర అధికారులు వారిని విచారించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2గంటల వరకు భోజనం విరామమిచ్చారు. అనంతరం విచారణ కొనసాగించారు. రూరల్ పోలీసుస్టేషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్కు వెళ్లే రోడ్డు నుంచి పీఆర్కే ఇంటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆ మార్గంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను అనుమతించలేదు. అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఇరువురిని టీడీపీ అంతర్గత పోరుతో హత్య జరగగా తనపైన, తన సోదరుడుపైన అక్రమంగా కేసు నమోదు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు వెళ్లి వచ్చిన అనంతరం శుక్రవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పొంది ఉన్న తాము కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి విచారణకు హాజరైనట్లు వెల్లడించారు. ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. పోలీసుల విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్రమ కేసులు పెట్టేందుకు ఈవిధంగా చేస్తున్నారన్నారు. -
● మాజీ మంత్రి విడదల రజిని ● కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ
చిలకలూరిపేట:రచ్చబండ ద్వారా ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాసంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమ కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరుతూ వైఎస్సా ర్ సీపీ 45 రోజులపాటు గ్రామ స్థాయి వరకు ప్రజా ఉద్యమం ప్రారంభించిందని తెలిపారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణం చేపట్టారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దూరం చేసేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలా ల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహారావు, మంగు ఏడుకొండలు, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఏకాబరపు సునీత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల ఉద్యమం
మాచర్ల: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద రోగులు, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కళాశాలలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొస్తే అందులో 10 కళాశాలలు అమ్ముకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్ పిలుపు మేరకు శనివారం నుంచి నవంబర్ 24వ తేదీ వరకు దశల వారీగా వివిధ కార్యక్రమాలు చేపడతామని, కోటి సంతకాలు సేకరించనున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను పీఆర్కే పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు అందజేయటం జరుగుతుందన్నారు. వాటిని గవర్నర్కు జగన్మోహన్రెడ్డి అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, రాష్ట్ర, జిల్లా యువజన నాయకులు డి శ్రీనివాసరెడ్డి, నవులూరి చెన్నారెడ్డి, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బిసి యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పీటీసీ పెద్ద మల్లుస్వామి, ఓరుగంటి చిన్నా, దేవళ్ల సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్ మందా సంతోష్, దేవళ్ల సాంబశివరావు, పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్లపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గి రాముడు, కంభంపాటి అమర్, మద్దికర శ్రీనివాసరెడ్డి, చల్లా కాశయ్య, చల్లా మోహన్, దేవళ్ల యోగయ్య, గుంజ నాగ అంజి, ధనలక్ష్మి, తిరుమలకొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో.... సత్తెనపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాదు, మౌలాలి, రాయపాటి పురుషోత్తం, ఇందూరి నరసింహారెడ్డి, సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న సమన్వయకర్త గజ్జల సుధీర్భార్గవరెడ్డి, పార్టీ నాయకులుపార్టీ కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు నరసరావుపేట:ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే యోచనపై పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవా రం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం వాల్పోస్టర్ను నా యకులు, కార్యకర్తలతో కలసి ఆవిష్కరించారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ లో నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు చేయాల్సిన అవసరం ఉందన్నా రు. డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారు లు, రైతులు, విద్యార్థులు, యువజనుల ను భాగస్వామ్యం చేయాలన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, డ్వాక్రా విభాగ జిల్లా కార్యదర్శి హెల్డా ప్లోరెన్స్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, న్యాయవాదులు వై.సీతారామిరెడ్డి, బ్లెసీనా, జీనేపల్లి హనుమంతరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పతోళ్ల వేణుమాధవ్, జిల్లా ఎస్సీ విభాగం కార్యదర్శి కందుల ఎజ్రా, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, అచ్చి శివకోటి, జిల్లా కోశాధికారి అన్నా మోహన్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, పట్టణ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిలార్బాషా, ఎస్సీ విభాగం పట్టణ కార్యదర్శి పౌలయ్య, పచ్చవ రవీంద్రబాబు, ఖాదర్బాషా, ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షకు కలెక్టర్ హాజరు
నరసరావుపేట: ఏపీ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, రోగ నిర్ధారణ సేవలు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ ప్రగతి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వాహనాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించిన సమీక్షలో 22ఏ కింద ఉన్న భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
మా ఆత్మగౌరవాన్ని కాపాడండి...
పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు. – దీప్తి, మహిళా పోలీస్ -
కార్యాలయం దాటని పాస్పుస్తకాలు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గానికి చేందిన రైతు సుబ్బారావు ఇటీవల రైతు సేవా కేంద్రానికి ఎరువుల కోసం వెళ్లారు. ఆయనకు రీసర్వే జరిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే యారియా ఇస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. ప్రస్తుతం రైతులకు పంట రుణాలు ఎంతో అవసరం. బ్యాంక్కు వెళ్లితే పాస్పుస్తకాలు లేకపోవడంతో రుణాలు ఇవ్వలేదు. తహసీల్దార్ కార్యాలయాలకు ఈ పుస్తకాలు వచ్చి రెండు నెలలు గడిచినా గడప మాత్రం దాటలేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేస్తారని చెబుతుండటంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. 97,027 పుస్తకాలు ఇవ్వాలి... పల్నాడు జిల్లాలో మొత్తం 97,037 కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు రాజముద్రతో తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. నర్సరావుపేట రెవెన్యూ డివిజన్లోని 10 మండలాల్లో 83,201, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో 9,465, గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 4,361 పాస్పుస్తకాలు రైతులకు అందాల్సి ఉంది. అన్నింటికీ కీలకం... రుణమాఫీ, రైతు బంధు, అన్నదాతా సుఖీభవ, పంట రుణాలు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బీమా, విత్తనాలు, ఎరువుల రాయితీలు, యంత్ర పరికరాలు, పాడిపశువులు, ఉద్యాన పంటలకు ఉపయోగించే సామగ్రిపై రాయితీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం. రిజిస్టేషన్ పక్రియ ముగిసిన తర్వాత పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పథకాల కింద లబ్ధిని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో పుస్తకాలు పంపినీ చేయకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేదిలేదని తేల్చి చెప్పిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
మానసిక కల్లోలం.. అందుబాటులో ఔషధం
సత్తెనపల్లి: జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరిద్దరు మాత్రమే మానసిక వ్యాధి చికిత్స నిపుణులు ఉండే వారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలో ఇరువురు ఉంటే ప్రైవేట్గా సుమారు 10 మందికిపైగా సైకియాట్రిస్టులు ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి రోజూ 20 నుంచి 25 మంది రోగులు వస్తున్నారు. అందులో 15 మంది కొత్తవారు ఉంటున్నారు. ఇక ప్రైవేటు వైద్యుల వద్దకు సైతం సగటున రోజూ 10 నుంచి 20 మంది వరకు చికిత్స కోసం వెళ్తున్నారు. సమాజంలో తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫియా, మానియా, డిప్రెషన్ అతిగా మద్యపానం, మత్తు పదార్థాలు సేవించడం) వారు 3 శాతం, ఇతర మానసిక వ్యాధులు ఉన్నవారు 5 నుంచి 10 శాతం వరకు ఉంటారని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు గుర్తించి వెంటనే మానసిక వైద్యులను సంప్రదిస్తే రోగికి కౌన్సెలింగ్, మందుల ద్వారా నయం చేయవచ్చని వారు సూచిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలు.. ఆందోళన, భయం, గుండెదడ, అధిక చెమట, కాళ్లు, చేతులు వణకడం, అనవసర ఆలోచనలు, చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయడం, విచారం, పనిలో ఉత్సాహం లేకపోవడం, ఆకలి, నిద్ర లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పు, తనలో తానే నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, ఇతరులను అనుమానించడం, అతి ఆనందం, అతి కోపం, ముసలితనంలో వచ్చే సమస్యలు, కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్ర విసర్జన చేయడం, భయంకర కలవరింతలు, నిగ్రహశక్తి కోల్పోవడం వంటివి ప్రధాన లక్షణాలు. మానసిక వ్యాధులకు కారణాలు ... మానసిక ఒత్తిడి వల్లే అనారోగ్యం.... మానసిక ఒత్తిడి వల్ల కడుపులో గ్యాస్ (వాయువు), ఆవేశాకావేశాల వల్లే అధిక రక్తపోటు, అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం, స్వార్థం, మొండితనం వల్ల డయాబెటిస్ (మధుమేహం), అతి విచారం వల్ల ఆస్తమా, ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయని ఇటీవల వైద్యులు గుర్తించారు. శరీరంలో వచ్చే సర్వరోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్లతోపాటు అధిక శాతం జీవనశైలి సంబంధమైనవేనని తెలుస్తోంది. కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. కంటికి సరిపడా ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో కలిసి కొంత సమయాన్ని గడపాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు మందులు ఉన్నాయి. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి నిపుణుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు -
తరగతి గది నుంచి పొలం వద్దకు..
యడ్లపాడు: పట్టణాల పరిధి దాటి, పల్లె బాట పట్టిన ఆ యువ సైన్యం... పుస్తకాల్లో చదివిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో నేర్చుకుంటోంది. వారే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బాపట్ల కళాశాల బీఎస్సీ అగ్రికల్చరల్ నాలుగో సంవత్సరం విద్యార్థులు. రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్(రావే) ప్రోగ్రాంలో భాగంగా వీరు మండల కేంద్రమైన యడ్లపాడు, జగ్గాపురం, చాగంటివారిపాలెం, పమిడిపాడు, నార్నెపాడు గ్రామాలకు సెప్టెంబర్ 17న 31 మంది వచ్చారు. వీరిని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ వ్యవసాయ విస్తరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఉష, జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నగేష్, విస్తరణ అధికారి డాక్టర్ సత్యగోపాల్ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక అభ్యుదయ రైతులు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి విశ్రాంత సభ్యులు పోపూరి శివరామకృష్ణ, జాగర్లమూడి రామారావులతోపాటు మరో పది మంది శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాల్లోని జ్ఞానాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో వారు సరిచూసుకుంటున్నారు. రైతులే గురువులుగా, వారి జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుంటున్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులను స్థానిక రైతులకు వివరిస్తూ, వారిలో వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను, భూసారం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా తెలుసుకుంటున్నారు. పంట సాగుపై సందేహాలను నివృత్తి చేస్తూ, నేర్పుతూ–నేర్చుకుంటూ తమ వ్యవసాయ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. తమ మూడేళ్ల కళాశాల జీవితం.. అలాగే మూడు నెలల గ్రామ వాసం వెరసి రేపటి వ్యవసాయ రంగానికి పటిష్టమైన పునాది కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక విధానాలపై రైతుల అనాసక్తి, పెట్టుబడి భారం పెరగడం, కౌలు వ్యవస్థతో సవాళ్లు, సాగుపై యువత అనాసక్తి చూపడం, రసాయనాల వినియోగం పెరగడం, సేంద్రియ పద్ధతులపై అపోహలు, రైతులకు ఆర్థిక భరోసా, సాంకేతిక శిక్షణ వంటి అంశాలపై వారు దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ‘రావే’ విద్యార్థుల అనుభవాత్మక శిక్షణ -
నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపుమేరకు శుక్రవారం నుంచి విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెబుతామని, బోధనేతర పనులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారి జె.ఎస్.ఎన్. ప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ.. మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనాసమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయేలా ఈ కార్యక్రమాలు పెరిగాయన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అందుకే 10వ తేదీ నుంచి బోధనకే పరిమితం కానున్నామని, నాణ్యమైన విద్యను అందించాలని ఫ్యాప్టో నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపట్టనున్నారని చెప్పారు. మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ చూస్తామన్నారు. మిగతా బోధనేతర పనులను నిలిపి వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు కట్ట నరసింహారావు. ఎన్.ఐజాక్, దాసరి మరియదాసు, కృష్ణ కిషోర్, మంటి సాంబశివరావు, జాన్సైదా ఫైజుల్లా, సీహెచ్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి బోధనేతర పనులను బహిష్కరించనున్నట్టు ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించిన ఉపాధ్యాయుల పోరుబాటలో తీనుకున్న నిర్ణయం మేరకు వీటిని బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళకు వినతిపత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా ఇతర బోధనేతర పనులకు సంబంధించి యాప్లను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. యాప్ల భారంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతూ, బోధనపై దృష్టి పెట్టలేక పోతున్నారని తెలిపారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు ఉస్మాన్, చంద్రజిత్యాదవ్, కె.శ్రీనివాసరెడ్డి, టి.వెంకటేశ్వర్లు, ఈ.ఏమండీ, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. క్రోసూరు: రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం నుంచి బోధనేతర పనులు బహిష్కంచనున్నట్లు మండలంలోని ఫ్యాప్టో సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి ఎం.గణేష్కు వినతిపత్రం అందచేశారు. వినతి అందచేసిన వారిలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.ఫ్యాప్టో నిర్ణయం -
పెదకూరపాడు వద్ద రైలు ప్రమాదం
పెదకూరపాడు:పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. బోగీలు దెబ్బతిన్నాయి. బోగీల్లో ఇర్కుపోయిన ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడే చర్యలు చేపట్టారు. అత్యాధునిక పరికరాలతో బోగీలను కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటు పడినట్లే..మాక్ డ్రిల్లో భాగంగా గురువారం నిర్వహించారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణ నష్టాన్ని నివారించే విషయంపై గుంటూరు రైల్వే డివిజన్లోని ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, రైల్వే బ్రేక్ డౌన్, స్టేట్ గవర్నమెంట్, ఫైర్, స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆధ్వర్యంలో గురువారం పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠ సేన్, సీనియర్ డివిజన్ సేఫ్టీ అధికారి విజయకీర్తి, మెకానికల్ చీఫ్ ఇంజినీర్ రవికిరణ్, ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు, సీనియర్ డివిజన్ సిగ్నెల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ రత్నాకర్, సేఫ్టీ చీఫ్ అధికారి కిషోర్, సీఆర్ఎస్ఈ కమల్కాంత్ పర్యవేక్షించారు. మాక్ డ్రిల్లో భాగంగా రెండు రైల్వే కోచ్లు పట్టాలు తప్పి ప్రమాదానికి గురికాగా అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండేలా నెలకొల్పారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోగీలలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందు కు అత్యాధునిక టూల్స్ ఉపయోగించారు. బోగీల కిటికీలు, రూఫ్లు కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య డీఆర్ఎం సుథేష్ఠ సేన్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సిబ్బందిని సంసిద్ధత చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అన్నారు. మాక్ డ్రిల్ ద్వారా రియల్ టైమ్లో సిబ్బంది పనితీరు ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రాణ నష్టం నివారించే లక్ష్యంగా ఇటువంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతాయన్నారు. సిబ్బంది సమన్వయాన్ని మెరుగుపరుస్తుదన్నారు. –డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు
శావల్యాపురం: మండలంలోని వేల్పూరు గ్రామంలో సూరాబత్తుని హనుమంతరావు (58) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అంగీకారంతో పెదకాకాని శంకర కంటి వైద్యశాలకు నేత్రదానం చేసినట్లు జిల్లా జనవిజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతరావు కార్నియాను ఇద్దరు అంధులకు అమర్చి కంటిచూపు వచ్చేలా చేస్తారన్నారు. మరణాంతరం ఎవరైనా పది గంటలలోపు నేత్రాలను దానం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో శంకర వైద్య నిపుణులు, కుటుంబ సభ్యులు సూరాబత్తుని హైమావతి, కోటేశ్వరరావు, బొల్లా రామకృష్ణ, ఏడుకొండలు, రాములు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పగలు పల్సర్ బైక్పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. -
పసితనంలోనే పలుపుతాడు
బాల్య వివాహాలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడతారు. పలు అనర్థాలకు దారి తీస్తాయి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలనేది నిబంధన. ఆ వయసు నిండకుండా చేయడం నేరం. బాధ్యులపై గరిష్టంగా రెండేళ్లు జైలు, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు అమలు చేసే వీలుంది. అయితే, ఇటీవల తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేసి బరువు దించేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ప్రేమ పెళ్లిళ్లనే భయంతో మరికొందరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు 109 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా హామీ (బైండోవర్ లెటర్) తీసుకున్నారు. అయినా, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఇలా అధికారుల ఆదేశాలు ధిక్కరించి మూడు బాల్య వివాహాలు జరగడంతో వారిపై పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని ధోబీఘాట్లో ఆగస్టు 3న బాల్య వివాహం జరిగింది.దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కేర్కు ఫిర్యాదు కూడా వచ్చింది. విషయాన్ని గత నెల 23న చైల్డ్ వెల్ఫేర్ కేర్ ప్రతినిధి యర్రసాని ప్రశాంత్ కుమార్ సత్తెనపల్లి 4వ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గరికె కల్పన దృష్టికి తెచ్చారు. దీనిపై ఆమె విచారణ చేయడంతో వాస్తవమే అని తేలింది. వధూవరులతో పాటు ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు, వివాహం జరిపిన పూజారి, కల్యాణ మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్.. ఇలా మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం కింద పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. బాల్య వివాహంతో దుష్ఫలితాలు... ⇒ చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో శిశువు మరణించడం లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో పుట్టే ప్రమాదం ఉంది. ⇒ గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ ⇒ రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది ⇒ పోషకాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలు ఎదురవుతాయి ⇒ వివాహం తరువాత చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయిబాల్య వివాహాలతో అనర్థం బాల్య వివాహాలతో అనర్థాలే ఎక్కువ. గర్భం దాల్చిన బాలికలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బిడ్డను మోసే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికీ ప్రమాదమే. ఒకవేళ బిడ్డ జని్మంచినా బరువు తక్కువగా ఉండడం, అనేక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు -
రేపు రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్: దివంగత స్విమ్మర్ కానాల అంజినీ శ్రీక్రాంత్రెడ్డి స్మారకార్ధం ఈనెల 10న 8వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహిస్తామని మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ది రమణారావు తెలిపారు. బుధవారం స్థానిక అరండల్పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి మాస్టర్స్ స్విమ్మర్లు పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరిహరనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఈతకొనలనులో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను పెద్ది రమణారావుతోపాటు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జె.లక్ష్మీనారాయణరెడ్డి, ఎం.సత్యనారాయణలు ఆవిష్కరించారు. -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు
నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ, కిమో థెరపీ, ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు ... జీజీహెచ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెప్టెంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. రొమ్ము కాన్సర్పై మహిళలకు అవగాహన అవసరం ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము కాన్సర్ బాధితులే అక్టోబరు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం సర్వత్రా ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బారిన పడకుండా ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిసున్న ప్రత్యేక కథనం. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
విచారణకు పిలిచి.. వాయిదా వేశారు
మాచర్ల: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదివీడు గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సోదరులపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీఆర్కే సోదరులకు అనుకూలంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో రెండోసారి విచారణకు రావాలని పీఆర్కే సోదరులకు నోటీసులు ఇచ్చి బుధవారం విచారణకు పిలిచారు. ఉదయం 10 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు, ఈనెల 10వ తేదీన విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లి: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండడంతో పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి నుంచి పరస రబ్బాని, షేక్ సుభాని, షేక్ ఇర్ఫాన్, గుంటూరు ప్రసాద్, తులసీకృష్ణలు టాటా ఏస్ వాహనంలో 720 కిలోల రేషన్ బియ్యాన్ని లోడ్ చేసుకొని వెళుతుండగా అందిన సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ పవన్కుమార్ సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని గార్లపాడు సెంటర్లో దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పౌరసరఫరాల గోదాములో రెవెన్యూ అధికారులకు అప్పగించారు. టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసి పట్టుబడిన ఐదుగురిని బుధవారం కోర్టులో హాజరపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తెనాలిరూరల్: అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని పాలాద్రి కాల్వ సమీపంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సుమారు 60 బస్తాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కారెంపూడి: మండలంలో విచ్చల విడిగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు కారెంపూడి పోలీసులు మంగళవారం రాత్రి బ్రేక్ వేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 గోతాలలో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వాసు బుధవారం విలేకర్లకు వెల్లడించారు. ఒక్కో తెల్ల గోతాంలో సుమారు 40 కిలోల దాకా రేషన్ బియ్యం ఉన్నాయని ఎస్సై పేర్కొన్నారు. ముందుస్తుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈ సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు తెలిపామని వివరించారు. -
గ్రామాభివృద్ధికి ‘ఉపాధి’ నిధులు వినియోగించండి
బొల్లాపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. బుధవారం మండల కేంద్రం బొల్లాపల్లిని సందర్శించి, ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. బొల్లాపల్లిలోని రామాలయం వద్ద ప్రజా సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. మండల ప్రజలు పలు సమస్యలపై కలెక్టరుకు అర్జీలు అందజేశారు. తొలుత గ్రామానికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి పొలంలో నీటికుంట, ఉద్యాన పంటలో భాగంగా సాగుచేసిన కొబ్బరి తోట, గ్రామంలో ఇంకుడు గుంతలు, చెరువు, ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నేటి సంరక్షణకు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి నిధులను సద్వినియోగపరచుకోవాలని ఆదేశించారు. వెల్దుర్తి, బొల్లాపల్లి, ఈ రెండు మండలాల్లో భూగర్భ జలాలు నీటిమట్టం తక్కువగా ఉన్న నీటి సంరక్షణకు, భూగర్భ జలాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గ్రామంలోని చెరువు అభివృద్ధి ద్వారా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా లబ్ధి చేకూరుతుందని, చెరువు అభివృద్ధి పరచి నీళ్లు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో సైడు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల ప్రాధాన్యత, అగ్రహార రీ సర్వ్ కు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నరసరావుపేట ఇన్చార్జి ఆర్డీవో రమణ కాంత్ రెడ్డి, డీపీఓ నాగేశ్వరరావు నాయక్, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ రావు, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రామ్ బాలాజీ రెడ్డి డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా -
ఏఎన్యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏఎన్యూలో గత కొంతకాలంగా ఇన్చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్ప్రదేశ్లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు. -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.విద్యార్థి పాల్ గాంధీ (ఫైల్)వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో వాచిన చేయి -
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం
నర్సరావుపేట: టీడీపీలో వర్గపోరు బహిర్గతమైంది. ఇసుకలో వాటాలు కుదరక దాడులు చేసుకున్నట్లు సమాచారం. అచ్చంపేట మండలంలోని కోనూరుకు చెందిన టీడీపీ నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి పని నిమిత్తం కారులో వచ్చారు. తిరిగి వెళుతుండగా చిగురుపాడు దాటిన తరువాత కొందరు మాస్క్లు ధరించి అడ్డంగా నిలబడి ఆపారు. కిందకు దింపి కర్రలతో, ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపరచినట్లు సమాచారం. అయితే ఎవరు కొట్టారు.. ఎందుకు కొట్టారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శాఖమూరి శ్రీనివాసరావును బంధువులు అదే కారులో గుంటూకు తీసుకెళ్లి, అక్కడే అనుమానితులపై కేసు పెట్టి, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరావుకు కుడికాలుకు తీవ్రంగా గాయమై, శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కొందరు కోనూరు గ్రామస్తులు, సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కోనూరులో ఇసుక ర్యాంపులు నిర్వహణలో శాఖమూరి శ్రీనివాసరావు నిర్వాహకులను బెదిరించినట్లు సమాచారం. వాటా ఇవ్వాలని పట్టు పార్టీ అధికారంలోకి రావడం కోసం తీవ్రంగా కష్టపడ్డానని, తనకు వాటా ఇవ్వాలని, లేకపోతే ఇసుక ర్యాంపును నడపనీయనని శ్రీనివాసరావు కరాఖండిగా చెప్పాడు. అయినా ఇవ్వకపోవడంతో ర్యాంపు నిర్వహకులపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. నదికి అడ్డంగా వేసిన రోడ్లను తీయించే వరకు పిటీషన్లపై పిటీషన్లు పెట్టాడు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ఇసుక ర్యాంపును మూసి వేశారు. దానివల్ల కొద్దిరోజులు మాత్రమే ఇసుక రవాణాను ఆపగలిగిన శ్రీనివాసరావు తిరిగి ర్యాంపు మొదలుకావడంతో కార్యకలాపాలకు మరింత పదును పెట్టాడు. తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే స్థాయి కంటే ఇంకా పెద్ద పోస్టులో ఉన్న వారిని ఆశ్రయించి తిరిగి ఇసుక ర్యాంపును నిలిపి వేయించాడు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులకు, శ్రీనివాసరావుకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. టీడీపీ అగ్రనాయకులు కొందరు శ్రీనివాసరావును బుజ్జగించే ప్రయత్నం చేసి, కొంతమొత్తం ముట్టచెప్పేందుకు ప్రలోభపెట్టినా వినలేదు. తాను కోరిన విధంగా వాటా కావాలంటూ భీష్మించుకుని కూర్చువడమే దాడికి కారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి కోనూరు ఇసుక రీచ్ నుంచి రవాణా జరగకపోయినా, ముందస్తులో భాగంగానే తహసీల్దారును కలిసేందుకు వచ్చిన శ్రీనివాసరావుపై దాడి జరగడం వెనుక టీడిపీ వారే కుట్రకు పాల్పడినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
మెడి‘కిల్’ను ఉపసంహరించుకోవాలి
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య కళాశాలలను పబ్లిక్, పైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఉపసంహరించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థ కొనసాగాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. -
దుష్ప్రచారంతోనే ఓటమి
● పచ్చ మీడియాతో కావాలనే విష ప్రచారం చేశారు ● అలవికాని హామీలు ఇచ్చి మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి ● సంపద సృష్టి కేవలం కూటమి నేతలు, కార్యకర్తలకే ● మనం అభివృద్ధి చేస్తే వారు ప్రైవేటీకరణ చేస్తున్నారు ● రానున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలే పాలిస్తారు ● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా విస్త్రృత స్థాయి సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ. సుబ్బారెడ్డి ● హాజరైన జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: కూటమి నేతలు, పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారమే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమికి ప్రధాన కారణమని వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అయితే వాటిని మరుగునపెట్టి కావాలనే కూటమి నేతలు విషప్రచారం చేశారన్నారు. మరోవైపు మూడు పార్టీలు కలసి వచ్చి అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా మోసం చేస్తున్నారన్నాని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు తాను, తన పార్టీ వారికి మాత్రమే సంపద చేరుతోందన్నారు. మనం మెడికల్ కళాశాలలు, పోర్టులు, ఆసుపత్రులు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి దోచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని, ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు చేయించాలన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలను, రచ్చబండలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. రానున్న ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలే నడిపిస్తారన్నారు. కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కమిటీలు ఎంతో కీలకమని, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. నవంబర్ 20 నాటికి అన్ని కమిటీలు పూర్తి కావాలన్నారు. నకిలీ మద్యం, బెల్టుషాపులతో కూటమి నేతలు ప్రజల ప్రాణాలను తీస్తున్నారన్నారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, ఎస్ఇసీ మెంబర్లు ఈదా సాంబిరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సీనియర్ నాయకులు గజ్జెల నాగభూషణరెడ్డి, దేవేళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, యువత, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, అంగన్వాడీ విభాగ కన్వీనర్ హెల్డా ప్లోరెన్స్, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అరాచకం, దౌర్జన్యాలకు నిరసనగా ప్రజలు బయటకు రావాలి. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి. రాష్ట్రానికి జగనే దిక్సూచీ అని, కూటమి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని, జగన్ వెంట ప్రతి ఒక్కరూ నడవాలి. జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కటాన్ని విమర్శించిన చంద్రబాబు మొన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయటంలో తాను కూడా బటన్ నొక్కాడు. అయితే వారిని మోసం చేశాడు. సుమారు 15 లక్షల మంది ఆటోవాలాలు, కాబ్, లారీ డ్రైవర్లు ఉంటే 18 నిబంధనలు పెట్టి 2.96లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. –పూనూరి గౌతమ్రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోలీసు శాఖను పర్సనల్ డిపార్టుమెంట్గా తయారుచేసి వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారు. జిల్లా మొత్తం కార్యకర్తలు ఉత్సాహంగా ఉండటంపై కూటమి నాయకులు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవటం గ్యారెంటీ అని, అప్పుడు వారికి జగన్ 2.0 పాలన చూపిస్తాం. పోలీసులను చూసి భయపడే స్టేజ్ దాటిపోయిందని, ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయి. –డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త -
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్ను ఆయన చాంబర్లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.జీవ ఉత్ప్రేరకాల తయారీపై అవగాహన.. బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణకొల్లిపర: ప్రకృతి వ్యవసాయం విధానాలు, జీవ ఉత్ప్రేరకాల తయారీపై బ్రెజిల్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం కోసం 25 మంది బ్రెజిల్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అత్తోట, దావులూరిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మనాయక్, బృందం సభ్యులకు బయో ఇన్పుట్ల తయారీ, ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఏడాదిపాటు పంటలతో భూమిని కప్పి ఉంచడంతో పాటు ఏ గ్రేడ్, ఏ ఫ్లస్ గ్రేడ్, ఏ ఫ్లస్ ప్లస్ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ వంటి మోడల్స్ అనుసరించడం వలన కలిగే అనేక రకాల ప్రయోజనాలను బృంద సభ్యులకు అవగాహన కల్పించారు. దేశీ ఆవు, ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆవు పేడ, మూత్రంలో అధికంగా లభించే సూక్ష్మ జీవులు, భూమి సారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పారు. బృందం సభ్యులను ఆవు దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పేడ, మూత్రం సూక్ష్మజీవుల ప్రాధాన్యంపై వివరించారు. అనంతరం స్వయంగా బృందం సభ్యులు బీజామృతం, ద్రవ, జీవామృతం, విత్తన గుళికల తయారీపై తర్ఫీదు ఇచ్చారు. దావులూరిపాలెంలో న్యూట్రి గార్డెన్, ఫుడ్ బాస్కెట్, ఆరోగ్యం, పోషకాహార కార్యకలాపాల లబ్ధిదారులను కలసి నిర్వహణ, ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు జాకీర్ హుస్సేన్, కృష్ణారావు, వాణిశ్రీ పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ నమోదు గడువు 15 వరకు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. అలాగే పరీక్ష రుసుము చెల్లించేందుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు పొడించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ www. bse. ap. gov. in లో అందుబాటులో ఉందని స్పష్టం చేసారు. ఆన్లైన్ అనంతరం సంబంధిత ప్రింటెడ్ నామినల్ రోల్స్ను ఈనెల 18వ తేదీ లోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు నమోదులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదనీ, పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ వెబ్సైట్, డీఈఓ కార్యాలయంలోని డీఎన్ఓ పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ -
ఆదర్శనీయుడు వాల్మీకి మహర్షి
నరసరావుపేట రూరల్: మహాకావ్యం రామాయణాన్ని అందించిన మహాకవి వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ, మానవతా విలువలు ప్రతిబింబించే విధంగా మహాకావ్యం రామాయణాన్ని రచించి సమాజానికి అందించారని తెలిపారు. ఉన్నతమైన ఆదర్శ భావాలను భోదించే మధురకావ్యంగా రామాయణాన్ని రచించి యుగాలు దాటినా నేటికీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వాల్మీకి మహర్షి ప్రబోధించిన ఆశయాలను, ఆలోచనలను గుర్తుచేసుకుంటూ సన్మార్గంలో నడవటమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అని తెలిపారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధిలో అక్రమాలకు ఈకేవైసీతో చెక్
● మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్లో వివరాలు నమోదు ● ఈకేవైసీ చేయించుకోని వేతనదారులకు పని నిల్ ● జిల్లాలో ఉపాధి వేతనదారులు 6.05 లక్షలు పనుల్లో పారదర్శకత కోసమే... జిల్లాలో జాబ్ కార్డుదారులు: 3.51 లక్షలు ఉపాధి పనులకు వచ్చే కూలీలు: 6.05 లక్షలు యాక్టీవ్ జాబ్ కార్డుదారులు: 2.75 లక్షలు పనులకు వచ్చే యాక్టీవ్ కూలీలు: 4.71 లక్షలు ఈ ఏడాది పనులకు వచ్చిన కుటుంబాలు: 1.93 లక్షలు ఈ ఏడాది పనులకు వచ్చిన కూలీలు: 3.25 లక్షలు -
నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ.48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్నాఽథ్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని):ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. బీటెక్ నప్లిమెంటరీ ఫలితాలు.. వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ నప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు ఎన్నాదేవి వద్ద గల 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మంగళవారం సందర్శించా రు. 400 కేవీ సబ్స్టేషన్ అలియనేషన్లో భాగంగా ట్రాన్స్కోకు కేటాయించేందుకు ప్రతిపాదించిన 14.92 ఎకరాల స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయి తనిఖీ చేశారు. ఆయనతోపాటు సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, తహసీల్దారు కేఎస్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. గుంటూరురూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆదికవి వాల్మీకి జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం జాయింట్ రిజిస్ట్రార్ ఎం. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని):ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నోటీసులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు, దూరవిద్యలో పనిచేస్తున్న ఇద్దరు అకడమిక్ కౌన్సెలర్లకు సెప్టెంబరు 29న ఈ మెయిల్ ద్వారా వర్సిటీ అధికారులు సమాచారం అందించారు. కొద్ది నెలల క్రితం 60 ఏళ్లు పూర్తయిన వారిని తొలగిస్తూ వర్సిటీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సెప్టెంబరు 30 వరకు విధుల్లో కొనసాగారు. తాజాగా సెప్టెంబరు 29న వర్సిటీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేటగిరిలో సుమారు 11 మంది ఉండగా వారిలో ఆరుగురికి మాత్రమే నోటీసులు అందాయి. -
ప్రమాదకరంగా బీబీసీ కెనాల్ డ్రాప్
● ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారు పది మంది ● డ్రాప్ వద్ద రక్షణ చర్యలు శూన్యం ● పట్టించుకోని కెనాల్స్ అధికారులు నకరికల్లు: బెల్లంకొండ బ్రాంచి కెనాల్పై త్రిపురాపురం వద్ద ఉన్న డ్రాప్ ప్రమాదకరంగా మారింది. డ్రాప్ వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఈత కొట్టేందుకు, వాహనాలు శుభ్రం చేసుకునేందుకు వచ్చే వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. డ్రాప్కు ఇరువైపులా కట్ట బలహీనంగా ఉంటుంది. స్థానిక యువకులు ఈత కొట్టేందుకు, ట్రాక్టర్లు, ఆటోలు శుభ్రం చేసుకునేందుకు వస్తుంటారు. అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారి కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, క్లీనర్ స్నానాలు చేసేందుకు దిగుతుంటారు. డ్రాప్ సమీపంలో లోతు ఎక్కువగా ఉండడం, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, కట్ట మట్టి జారుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గాని కట్ట బలహీనంగా ఉన్నచోట జారకుండా చూడడం, ప్రమాదాలు సంభవిస్తున్న చోట ఎవరూ దిగకుండా చూడడం వంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వాల్మీకి రామాయణం మానవాళికి అనుసరణీయం
నరసరావుపేట: మహాకవి వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో రచించిన రామాయణం మానవాళికి అనుసరణీయమైన చాలా గొప్ప కావ్యమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి అందరివాడని, వాల్మీకి జయంతి ఏ ఒక్క వర్గానికి చెందినదో కాదని, అందరూ నిర్వహించుకోవాల్సిన పండుగని అన్నారు. వాల్మీకి బోయ సోదరులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్ఓ ఏకా మురళి, రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గంగాధర్, డీబీసీడబ్లు ఈఓ సంతోష్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి రామకృష్ణ, ఆధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం:కారు, ద్విచక్రవాహనాలుఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు–కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
చిలకలూరిపేట: చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం అండర్–19 బాలురు, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం కృపాదానం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావు పర్యవేక్షించారు. ఎంపికై న బాలురు జట్టు: నాగశరత్, అస్రామ్, ఎండి అబ్దుల్ సమీర్, కె.జయరామ్, యశ్వంత్, యు హేమంత్రెడ్డి, జె అంకమ్మరావు, త్రినాథ్, ఎస్ వెంకటరాజేష్, ఎల్.లాకేష్, సీహెచ్ అక్ష, కె.వంశీకృష్ణ. బాలికల జట్టు: ఇ.ప్రశాంతి, శ్రీ చందన, జి.అనిత, జి.మనీష, నేత్ర, పి.పావని, పి.హారిక, బి.శ్రీవల్లి, బి.రష్మి, కె.శ్రావ్య, జి.గౌతమి, పి.జ్యోతి చంద్రిక, పి.అమృతవర్షిణి. ఎంపికై న క్రీడాకారులను ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావులతో పాటు పీఈటీలు, ఇతర పెద్దలు అభినందించారు. -
‘సజ్జ’తో భూసారం.. అదనపు ఆదాయం
యడ్లపాడు: పొలంలో శనగ పంట వేయడానికి ముందు ఖాళీగా ఉంచే సమయాన్ని వినియోగించుకుంటూ సజ్జ పంట సాగు చేయడం రైతులకు అదనపు ఆదాయంతో పాటు భూసార వృద్ధికి దోహదపడుతుందని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పల్నాడు ఏరువాక కేంద్రం నిర్వహించిన క్షేత్ర దినోత్సవం, రైతు సదస్సు కార్యక్రమాలు మండలంలోని జాలాది గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో సజ్జసాగు చేస్తున్న రైతు మానుకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ సజ్జపంట సాగు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఎకరానికి దాదాపు 15 – 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, తద్వారా నికరంగా రూ. 25 వేల ఆదాయం పొందవచ్చని సదస్సులో రైతులకు వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఏబీవీ 04 రకం సజ్జ అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందని జాలాది రైతులు నిరూపించారని తెలిపారు. విస్తరణ విభాగం రాష్ట్ర సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ, నూతన వంగడాల సాగు ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్యం దిశగా తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు. సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వీఎస్ దుర్గాప్రసాద్, చిరుధాన్యాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీవీ చంద్రమోహన్రెడ్డి, ఏరువాక కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నగేష్, శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్, నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు, ప్రకృతిసాగు విభాగం పీడీ డాక్టర్ కె.అమలకుమారి, అభ్యుదయ రైతులు దర్లు శంకరరావు, నిమ్మల శంకరరావు, పోపూరి శివరామకృష్ణ, గంటా రమేష్, జాగర్లమూడి రామారావు, ముద్ర పున్నారావు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చేనేత వస్త్రాలు కొనిపించాలి
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే దేశంలో ప్రతి ఒక్కరితో ఒక జత చేనేత దుస్తులు కొనిపించేటట్లు ప్రభుత్వాలు ప్రచారం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి ధూళ్ళిపాళ్ల రమాదేవి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం రెండవ రోజు సభలకు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టా శివ దుర్గారావు, నందం చంద్రకళ, కామార్తి రాజులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబాలలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికుల గాను, ఇతర వృత్తులలో పని చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి కనీసం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిలో పనిచేస్తున్న మహిళలకు వచ్చే రూ. 100 ఆదాయంతో ఎలా బతకగలరని ఆమె ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో చేనేత కుటుంబాలు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాయన్నారు. చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే చేనేత 11 రకాల రిజర్వేషన్లను ఉల్లంఘించిన యజమానులపై చర్యలు తీసుకొని, రిజర్వేషన్లు అమలు జరిపించేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేనేత కార్మికులంతా మంత్రి లోకేష్ను కలసి రిజర్వేషన్లు అమలు జరిపించాలని కోరగా రిజర్వేషన్లు అమలు జరపటం ఎవరివల్లా కాదని మంత్రి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించామని ప్రచారం చేసుకో వటానికి కర్నూలు జిల్లా రాబోతున్నారని, ఆ సందర్భంగా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మికులంతా కోరాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. చేనేత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గంజి మురళి మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించి 18 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
యడ్లపాడు: అనుమానస్పదంగా ఓ యువకుడు ఆనవాళ్లు గుర్తుపట్టని విధంగా మృతి చెంది రోడ్డు పక్కన పడి ఉన్న ఘటన మండలంలో కలకలం రేగింది. మండలంలోని బోయపాలెం – సంగంగోపాలపురం గ్రామాల మధ్య మార్గంలో మంగళవారం ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసులు మొదట హత్యగా అనుమానించిన పోలీసులు ఘటనా స్థలి పరిశీలిన అనంతరం రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయపాలెం నుంచి చెంఘీజ్ఖాన్పేట వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఓ యువకుడు ముఖం ఛిద్రమై మృత్యువాత పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం దారుణంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందునే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని, తల పూర్తిగా నుజ్జునుజ్జుయి, ఆనవాళ్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. మృతుడికి సుమారు 30 – 35 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెల్లని మేనిఛాయ కలిగి ఉన్నాడు. పసుపు రంగు టీషర్టు, నీలం రంగు షార్టు ధరించి ఉన్నాడు. ముఖ్యంగా, అతని ఎడమ కాలికి నల్లదారం కట్టి ఉండటాన్ని గుర్తించారు. బహుశా ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మండలం పరిధిలోని అన్నివలస కూలీలు పనిచేసే నూలుమిల్లు, క్వారీలు, కంపెనీల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవాగారంలో భద్రపరిచినట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసినవారు యడ్లపాడు పోలీస్స్టేషన్న్లో సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగుచూడాల్సి ఉంది. -
రాష్ట్రంలో కులగణన చేపట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లక్ష్మీపురం: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఏ తరహాలో కులగణన చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాయలంలోని మల్లయ్య లింగం భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణనలో కులగణన చేయడమే కాకుండా త్వరలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులగణన జరిగితే బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సీపీఐ నాయకులు జంగాల అజయ్కుమార్, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల పరప్రసాద్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఖాజావలి ప్రసంగించారు. -
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ● పీజీఆర్ఎస్లో 149 అర్జీలు స్వీకరణ
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా అధికారులకు 149 అర్జీలు అందజేశారు. పీజీఆర్ఎస్ ఇన్చార్జి, పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ బి.గాయత్రీదేవి, డీఆర్ఓ ఎ.మురళి, జిల్లా అధికారులు భానుకీర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు. గుండ్లపల్లి గ్రామంలో రెండో సచివాలయ పరిధిలో ఏడువేలమంది జనాభా ఉండగా అందులో నాతో పాటు అనేకమంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నారు. సచివాలయంలోకి వెళ్లేదారిలో డ్రైనేజ్ కాలువ అడ్డంగా ఉంది. అది దాటేందుకు తగిన మార్గంలేదు. ఇబ్బందులు పడుతున్నాం. కల్వర్టు ఏర్పాటుచేసి ఇబ్బందులు తీర్చండి. –సీహెచ్ అల్బనాబీ, దివ్యాంగుడు, గుండ్లపల్లి, నకరికల్లు మండలం నేను కొనుగోలు చేసిన రెండుసెంట్ల భూమికి సంబంధించిన పత్రాలను నా అల్లుడు దాచిపెట్టాడు. అడిగితే నీకెటువంటి హక్కులేదని ఇంట్లో నుంచి బయటకు గెంటాడు. 77ఏళ్ల వయస్సులో ఒంటరిగా ఉంటున్నా. నా బతుకుదెరువుకోసం ఆ స్థలాన్ని అమ్ముకోవాలని అనుకుంటున్నా. ఆ కాగితాలను ఇప్పించి నాకు న్యాయం చేయండి. ఇప్పటికే రెండుసార్లు అర్జీలు అందజేశాను. పట్టించుకోలేదు. –దేవళ్ల శ్రీనివాసరావు, గుడిపూడి, సత్తెనపల్లి మండలం -
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయని, చేనేత రంగ పరిరక్షణకై సమగ్ర విధానాన్ని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గ రావు అధ్యక్షత వహించారు. ముందుగా మహాసభల ప్రాంగణం ముందు సంఘం జెండాను చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకులు అనంత పిచ్చయ్య ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది కార్మికులు ఆధారపడి పనిచేస్తున్న చేనేత రంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని తీసుకురావడంతో ఆ రంగం మరింత నిర్వీర్యమైందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు మరింత పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో చేనేత రంగ పరిరక్షణకు ప్రభుత్వాలు సమగ్ర విధానాన్ని ప్రకటించాలని, చేనేతరంగంపై జీరో జీఎస్టీని ప్రకటించాలని,లేబర్ కోడ్లు రద్దుచేసి పనిగంటలను తగ్గించాలని, ‘సర్వశిక్ష‘ ద్వారా పాఠశాల విద్యార్థు లందరూ చేనేత దుస్తులు వాడుకునేటట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేయాలని ఆయన సూచించారు. -
కొండమోడు– పేరేచర్ల రహదారి నిర్మాణం వేగవంతం చేయండి
నరసరావుపేట: జిల్లాలో కొండమోడు–పేరేచర్ల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167ఏజీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాంట్రాక్టర్ను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో జాతీయ రహదారులు 167ఏజీ, 167ఏ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. పిడుగురాళ్ల – సత్తెనపల్లి – పేరేచర్ల రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల రద్దీ ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. నకరికల్లు – వాడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణం కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. జేసీ సూరజ్ గనోరే, జాతీయ రహదారుల ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ సంజీవ రాయుడు పాల్గొన్నారు.భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండినరసరావుపేట: వినుకొండ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు, చుక్కల భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్లో కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు మాట్లాడుతూ సర్వేనెంబర్ 50/5, 63/8లోని సుమారు 68 ఎకరాల ప్రభుత్వ భూములు, చుక్కల భూములను రెవెన్యూ యంత్రాంగంతో కుమ్మకై ్క భూస్వాములు ఆక్రమించి భూ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులైన ఓ ఇద్దరు తమ కుటుంబ సభ్యులను బినామీలుగా పెట్టి పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని 68 ఎకరాల ప్రభుత్వం దళితులకు ఇచ్చిన చుక్కల భూములుగా రికార్డుల్లో ఉన్న భూములను కొనుగోలు పేరుతో రికార్డులు సృష్టి్ంచుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి కబ్జాదారుల చేతుల్లో ఉన్న ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయవలసిందిగా కలెక్టర్ను కోరామన్నారు. సీనియర్ నాయకులు రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, పీడీఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.రాంబాబు, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు వి.కోట నాయక్ పాల్గొన్నారు. సిఫార్సు బదిలీలు నిలిపివేయాలని డిమాండ్గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, తక్షణమే వాటిని నిలిపివేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడిని అన్యాయంగా వేరొక పాఠశాలకు బదిలీ చేసి, ఆ స్థానంలో కృష్ణా జిల్లా నుంచి హెచ్ఎంను తీసుకురావడం గుంటూరు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు అవమానమేనన్నారు. చట్టంలో విద్యాసంవత్సరం మధ్యలో ఎలాంటి బదిలీలు ఉండవని చెప్పిన ప్రభుత్వం గుంటూరు జిల్లాకు సంబంధం లేని హెచ్ఎంను తీసుకురావడం సరైనది కాదన్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు కేటగిరీ 1, 2 పాఠశాలల్లో విధుల్లో చేరినట్లు తెలుస్తోందని చెప్పారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాజకీయ పలుకుబడి లేని సాధారణ ఉపాధ్యాయులను ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కౌన్సెలింగ్కు విరుద్ధంగా ఉన్న ఈ తరహా బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియా
నాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటూ ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు. వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. శివ హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు ఒంగోలు వాసిగా గుర్తింపు చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన నంగనం రామకృష్ణ(44) కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరు వచ్చాడు. ఆదివారం రాత్రి 10.30 సమయంలో గుంటూరు నుంచి ఒంగోలుకు బైక్పై వెళ్తున్న క్రమంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని కుప్పగంజి వాగు సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. -
జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు గర్వకారణం
నరసరావుపేట: జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం భువనచంద్ర టౌన్హాలులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థచైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు, ఆరు పట్టణ స్థానిక సంస్థలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో డోర్ టు డోర్ కలెక్షన్ 93శాతం జరుగుతుందన్నారు. అందులో 42శాతం చెత్తసేకరణ జరిగిన చోటనే తడి, పొడి చెత్తగా వేరు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో 100 శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్, సెగ్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిందన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, మొత్తం 17 కేటగిరీలలో అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో అవార్డుకు ఎంపికై న దళిత బహుజన రిసోర్స్ సెంటర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేశామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదేబాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అభినందనీయమన్నారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేసిన కలెక్టర్ కృతికా శుక్లా -
ఎస్ఐ అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: బతుకమ్మ వేడుకల్లో తమను దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించిన పిడుగురాళ్ల రూరల్ ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన మహిళలు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ కలిసి ఫిర్యాదు చేశారు. గత 30 సంవత్సరాలుగా గ్రామంలో బతుకమ్మను ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా బతుకమ్మను పూజించి ఈనెల 2వ తేదీన దసరా పండుగ రోజున గ్రామంలో నిమజ్జన ఊరేగింపు ఏర్పాటుచేసామని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎస్ఐ అనిల్ గ్రామానికి చెరుకుని మైక్కు అనుమతి లేదని ఊరేగింపును నిలిపివేశాడని ఫిర్యాదులో తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా జరుపుకొనే వేడుకను అడ్డుకోవద్దని కోరినట్టు వివరించారు. తనకు రూ.20వేలు చెల్లించి ఊరేగింపు జరుపుకోమని ఎస్ఐ చెప్పడంతో, స్థానిక మహిళల నుంచి అప్పటికప్పుడు రూ.10వేలు వసూళ్లు చేసి రామాలయం సెంటర్లో ఎస్ఐకు అందజేసి ఇంతకంటే మేము ఇవ్వలేమని చెప్పినట్టు మహిళలు పేర్కొన్నారు. ఎస్ఐ అనుమతితో గ్రామంలో ఊరేగింపు ప్రారంభించినట్టు తెలపారు. రాత్రి 9గంటల సమయంలో జమ్ము చెట్టు సెంటర్కు చేరుకున్న ఊరేగింపును ఎస్ఐ అడ్డుకుని మిగిలిన రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో వివరించారు. రోజువారి పనులు చేసుకుని జీవించే వారమని అంతకన్నా ఇవ్వలేమని చెప్పినా ఎస్ఐ వినకుండా మహిళలను దుర్భాషలాడటంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఎస్ఐ తీరుతో మహిళలు ఆయనను చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. తనకు డబ్బులు ఇవ్వకపోయినా, చెప్పినట్టు చేయకపోయినా కేసులు తప్పవని మాపై బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపారు. మహిళల పట్ల అనాగకరికంగా వ్యవహరించిన ఎస్ఐ అనిల్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. జిల్లా అదనపు ఎస్పిని కలిసిన వారిలో పుణ్యాల అర్చనకుమారి, చలవాది లక్ష్మీ, పుణ్యాల విజయమ్మ తదితరులు ఉన్నారు. ఏఎస్పీకి ఫిర్యాదుచేసిన పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామ మహిళలు -
పులిచింతలకు 32,741 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 3 క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 32,741 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 2 క్రస్ట్గేట్లు 1.5 మీటర్లు, మరో క్రస్ట్గేటు 2 మీటర్లు ఎత్తు ఎత్తి 24,116 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,625 క్యూసెక్కులు మొత్తం 32,741 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.080 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 55.91 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం 33,211 క్యూసెక్కులు వస్తుందని వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఖతార్ దేశంలోని దోహాలో రిజిస్టర్డ్ నర్సుల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ జీఎన్ఎం నర్సింగ్ పూర్తిచేసి రెండు సంవత్సరాల అనుభవం కలిగి 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 13వ తేదీన విజయవాడ రమేష్ హాస్పటల్ రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని ఓఎంసీఏసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రోజుకు 12గంటలు, వారానికి 6 రోజులు పనిదినాలు, ఏడాదికి 20 రోజులు సెలవులు ఉంటాయన్నారు. నెలకు సుమారు రూ1.2లక్షలు వేతనం లభిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 2 సంవత్సరాల ఒప్పంద కాలానికి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు
దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో వైఎస్సార్ సీపీకి చెందిన ఫ్లెక్సీలను సోమవారం పోలీసులు అకారణంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నగర పంచాయతీ నిండా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు ఉన్నప్పటికి వాటిజోలికి వెళ్లకుండా వైఎస్సార్ సీపీకి చెందిన ఫ్లెక్సీలను దాచేపల్లి సీఐ పి.భాస్కర్ దగ్గరుండి తొలగించటం వివాదస్పమైంది. సీఐ భాస్కర్ తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పంచాయతీ చైర్పర్సన్ కొప్పుల సుబ్బమ్మ పెద్దకుమారుడు రవికుమార్ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాకర్తలు, నాయకులు నగర పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. రవికుమార్కి అభినందనలు తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఫొటోలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేయడమే ఆలస్యం అన్నట్లుగా.. తొలగించేందుకు సీఐ భాస్కర్ రంగంలోకి దిగారు. దాచేపల్లి బస్టాండ్ సెంటర్, నారాయణపురం ఆర్అండ్బీ బంగ్లా సెంటర్, ముత్యాలంపాడు రోడ్డు సెంటర్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు తొలుత నగర పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్ జి.వెంకటేశ్వర్లుతో నాయకులు మాట్లాడారు. -
గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి
చిలకలూరిపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించటంలో విఫలమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. గిరిజన పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు సంబంధించి గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని గిరిజన సంక్షేమం ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఏకలవ్య బాలికల పాఠశాలలో ఆహారం తిని 40 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ సంఘటన ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శమని విమర్శించారు. చనిపోయిన విద్యార్దినిల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తగు న్యాయం చేయాలన్నారు. మరో పక్క చిలకలూరిపేట పట్టణ శివారులోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన పాఠశాల నూతన భవనాలను కమ్మవారిపాలెం గ్రామం వద్ద 2.5 ఎకరాలు కేటాయించటం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రూ. 4కోట్లతో ప్రణాళికలు రూపొందించినప్పటికీ నిర్మాణానికి మాత్రం నోచుకోవడంలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్లు ఆధ్వానంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలని కోరారు. అఖిలభారత యువజన సమాఖ్య నాయకుడు బి.రాంబాబునాయక్, పాలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ -
పీజీఆర్ఎస్కు ఫిర్యాదుల వెల్లువ
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలతో పాటు మోసం తదితర సమస్యలపై 122 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అదనపు ఎస్పీ( అడ్మిన్) జేవి సంతోష్. అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతిలు పీజీఆర్ఎస్లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. స్థలాన్ని ఆక్రమించి గుడి కట్టారు.. తన స్ధలాన్ని ఆక్రమించి నిదానంపాటి మహాలక్ష్మీ అమ్మవారి గుడి నిర్మించారని చిలకలూరిపేటకు చెందిన ఝాన్సీరాణి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పురుషోత్తమపట్టణం చాకలికాలనీలో ఆరు సెంట్ల స్థలం 1984లో కొనుగోలు చేసినట్టు ఝాన్సీరాణి తెలిపారు. కరోనా సమయంలో తన భర్త చనిపోయాడని, రెండు నెలల క్రితం ఆ స్థలం వద్దకు వెళ్లి చూడగా బాణావత్ కోటేశ్వరరావు నాయక్ అనే వ్యక్తి గుడిని నిర్మించి బోర్డును పెట్టారని తెలిపింది. దీనిపై కోటేశ్వరనాయక్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా కులదూషణ కేసు పెడతామని బెదరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం.. బయో మెడికల్ ఇంజినీరింగ్గా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.60లక్షలు మోసానికి పాల్పడినట్టు సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన బాధితుడు బాదరబోయిన తిరుపతిరావు పిర్యాదు చేసాడు. చిత్తూరుకు చెందిన బి.రమేష్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో రెండు ఖాతాల ద్వారా రూ.6.60లక్షలను చెల్లించినట్టు తెలిపాడు. ఉద్యోగం గురించి అడిగితే కాలయాపన చేయడంతో డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినట్టు తెలిపాడు. యాక్సిస్ బ్యాంక్ చెక్కులు ఇచ్చిన రమేష్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. న్యాయం చేసి నగదు ఇప్పించాలని కోరాడు. నమ్మించి మోసం చేసాడు.. పరిచయం ఉన్న వ్యక్తి తనను నమ్మించి మోసం చేసినట్టు రొంపిచర్ల మండలం పరగటిచర్లకు చెందిన తిమ్మనపల్లి శివశంకర్ ఫిర్యాదు చేసాడు. నరసరావుపేటలోని బరంపేటకు చెందిన సిరంగి రవికాంత్తో కొంతకాలంగా పరిచయం ఉందని, తనకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని తన పేరుతో ఈఎంఐ రూపంలో బజాజ్ ఫైన్సాన్స్లో ఫోన్ తీసుకుంటానని చెప్పినట్టు తెలిపాడు. మొదట రూ.15వేలు ఫోన్ తీసుకుంటానని చెప్పి, మొబైల్ షాప్లో రూ.లక్ష విలువైన ఐఫోన్ తీసుకున్నాడని వివరించాడు. ఒక నెల ఈఎంఐ కట్టి తరువాత కట్టకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది తన ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపాడు. దీనిపై రవికాంత్ను ప్రశ్నించగా దురుసుగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అర్జీదారుల సమస్యలు ఆలకించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు -
సహకార సంఘాల్లో యూరియా గోల్మాల్
తాడికొండ: కో ఆపరేటివ్ సొసైటీల్లో యూరియా గోల్మాల్ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖాధికారుల నిఘా కొరవడటంతో సామాన్యుడికి యూరియా అందని ద్రాక్షగా మారింది. సోమవారం తాడికొండ మండలం పొన్నెకల్లు సొసైటీకి చెందిన ఎరువుల లారీ నిబంధనలకు విరుద్దంగా అడ్డరోడ్డు కూడలిలో ట్రాక్టర్కు లోడింగ్ చేస్తుండగా ‘సాక్షి’కి చిక్కారు. ఈ క్రమంలో కూలీలు ముఖం దాచుకొని కిందకి దిగి డోర్లు వేయగా... లారీ, ట్రాక్టర్లతో డ్రైవర్లు తలో దిక్కుకు వెళ్లిపోయారు. సొసైటీకి చెందిన యూరియా బస్తాలు ఎవరికి ఇస్తున్నారు? రోడ్డుపై ఎందుకు ఇలా దించుతున్నారు? అని ప్రశ్నించగా ఎవరికి వారే నీళ్లు నములుతూ ముఖం చాటేశారు. రైతులకు సక్రమంగా సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ కనీస నిబంధనలకు కూడా నీళ్లొదిలింది. అన్ని సొసైటీల్లోనూ సరుకు తప్పుదారి పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పడకేసిన పల్లె వైద్యం
జిల్లాలో పీహెచ్సీల వైద్యుల ఆందోళన ఉధృతం సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది. పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను పట్టించుకోకపోవడంతో గత నెల 26 నుంచి వైద్యు లు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. తొలుత జిల్లాలోని పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రమే అక్కడక్కడ కొనసాగాయి. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఆన్లైన్ సేవలు, రిపోర్టులు సమర్పణకు బంద్ పాటించారు. అనంతరం నిరవధిక నిరసన లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం విజయవాడలో పీహెచ్సీల వైద్యులు నిరసన చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సేవలు అంతంతే... ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు మేరకు వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు స్తంభించి పోయాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీ లకు విచ్చేసిన రోగులు వైద్యులు లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. పీహెచ్సీల్లో పనిచేస్తున్న నర్సులు సైతం డాక్టర్లు లేరని తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 39 పీహెచ్సీలు ఉండగా 110 మంది వైద్యులు సేవలందిస్తుండేవారు. ఒక్కో పీహెచ్సీలో ఇరువురు వైద్యులు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం వైద్యుల సమ్మె కారణంగా అర్బన్ పీహెచ్సీలు, మెడికల్ కళాశాల విద్యార్థులతో ఒక్కో పీహెచ్సీలో ఒక వైద్యున్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెబా ట పట్టడంతో 104 వైద్య సేవలపై ఆ ప్రభావం కనిపించింది. పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు ఆరోగ్య కేంద్రంలో, మరొకరు 104 సంచార వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. గతంలో 104 వాహనంలో పనిచేసే వైద్యులు నిరసన వ్యక్తం చేసినప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నేతలు, ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. తీరా నిరసన విరమించాక ఏమా త్రం పట్టించుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగి సేవలందిస్తున్నందుకు ప్రతి నెల అదనంగా రూ. 5 వేలు చెల్లించాలని వైద్యులు కోరుతున్నారు. అవి అందించకపోవడంతో 104 వైద్య సేవలు ఆగిపోయాయి. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది కేవలం మందుల పంపిణీ మాత్రమే చేపడుతున్నారు. -
కూటమి మోసాలపై పోరుబాట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని దాదాపు 25 వేల మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు పీఆర్సీ, మంచి ఐఆర్ ఇస్తామని, పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు పోరుబాట పట్టారు. ●సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలూ చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు డీఏలు బకాయి పెట్టింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు కూడా మంజూరు చేయడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దాని నుంచి రుణాలు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాఽథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా కనీసం రెండు డీఏల బకాయిలైనా విడుదల చేస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. జిల్లాలో 25 వేల మందికి వెన్నుపోటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో 7,415 మంది ఉపాధ్యాయులు ఉండగా.. మిగతావారు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయి వరకు చూసుకున్నా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లపైనే బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాల బకాయిలు మరో రూ.160 కోట్లు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన విడుదల కావడం లేదు. 12వ పీఆర్సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్మెంట్ లభించి, సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని, సర్కారు కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను నియమించగా, అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో కష్టాలు మొదటికొచ్చాయని వాపోతున్నారు. సర్కారు తీరుపై సంఘాల ఆగ్రహం బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఐక్యవేదికగా ఏర్పడి పోరుబాట పట్టాయి. ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా .. యుటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో ఽవిజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.2023 జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. చైర్మన్ను నియమించాక కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ మాటే ఎత్తక పోవడం దురదృష్టకరం. పాత పీఆర్సీ బకాయిలు ఇచ్చిన తరువాతే కొత్త కమిషన్ను వేస్తామని చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగితే ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మాట దాటవేస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి. కనీసం ఒక్క డీఏను కుడా ఇవ్వలేదు. పాత పీఆర్సీ బకాయిలు కూడా ఇవ్వడం లేదు. విజయవాడలో రేపు జరిగే ధర్నాలో పీఆర్సీయే ప్రధానంగా పోరాడతాం. – ఎస్ఎం సుభాని, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు -
‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ
అక్రమార్జనలో ఆరితేరిన తమ్ముళ్లు ఇప్పుడు కొట్లాటలకు సైతం వెనుకాడం లేదు. పదవుల నుంచి ఇసుక దందా, మట్టి తరలింపు, మద్యం మాఫియా, బియ్యం అక్రమరవాణా... ఇలా పలు అంశాల్లో తాము చెప్పినట్లే జరగాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మండల, గ్రామ స్థాయి పచ్చనేతల తీరు ఇలా ఉండటంతో వర్గ విభేదాలు పెరిగాయి. ఆధిపత్యం చాటేందుకు తన్నుకోవడానికై నా సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పచ్చపార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. శుక్రవారం కొల్లూరు మండల నేతలు డాక్టర్ కనగాల మధుసూదన్, మైనేని మురళి వర్గాలు రోడ్డున పడి తన్నుకున్నాయి. నక్కా సమక్షంలోనే డాక్టర్పై మురళి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ప్రతిగా డాక్టర్ వర్గీయులు వారిని కొట్టారు. ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలు కాగా, అడ్డుకోబోయిన కానిస్టేబుల్కు సైతం గాయాలు తప్పలేదు. ఇంత జరిగినా కేసులు లేవు. అంతటా అదే తంతు.. అక్రమాలకు వారే కీలకం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రోత్సహిస్తున్న వర్గీయులకు పదవులు దక్కుతున్నాయి. దీంతోపాటు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, బియ్యం దందాను నడిపిస్తున్నారు. కొల్లూరులో ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్న మైనేని మురళి వర్గం ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్న వర్గాలు కూడా బియ్యం, లిక్కర్, బెల్టు షాపుల దందా చేస్తున్నాయి. -
శింగరకొండపై హైకోర్టు జడ్జి పూజలు
అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండపైనున్న లక్ష్మి నరసింహ స్వామిని హైకోర్టు జడ్జి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగలక్ష్మి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల అఖిల ప్రియ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీత ఉన్నారు. మాదల(ముప్పాళ్ళ): ఆంధ్రప్రదేశ్ మరాఠా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పల్లకి సేవ వాహన యాత్రకు మండలంలోని మాదల గ్రామం వద్ద సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. మరాఠా సంఘం అధ్యక్షులు వెంకట సోమౌజీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయం నుంచి శ్రీశైలం శ్రీమల్లికార్జునస్వామి ఆలయం వరకు సాగనుంది. యాత్ర వాహనాలకు మాదల వద్ద సంఘ సభ్యులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముప్పాళ్ళ మీదుగా నరసరావుపేటకు యాత్ర వెళ్లింది. సంఘ సభ్యులు పులహరి పిరోజీ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయ స్వామి సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి రాతి ఆలయ నిర్మాణానికి ఆదివారం పలువురు దాతలు విరాళాలను కమిటీ సభ్యులకు అందించారు. పట్టణానికి చెందిన మెడికల్ వ్యాపారి అర్వపల్లి రామకోటి సుబ్బారావు, నాగేశ్వరి దంపతులు ముఖమండపం 12వ రాతి స్తంభం నిర్మాణానికి రూ.3,01,116 అందించారు. అలాగే వర్రా సావిత్రమ్మ రూ.51,116, అర్వపల్లి సాంబశివరావు, వెంకట విజయలక్ష్మి దంపతులు రూ.25,116 ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పులుపుల రాము, వనమా సాంబశివరావు, కోవూరు శివశ్రీనుబాబు, వనమా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం పరిశీలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డులోగల విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పరీక్షలను జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్), నోడల్ అధికారి రమణమూర్తితో కలిసి ఎస్పీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సౌత్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ వాసు పాల్గొన్నారు. బయ్యవరం(క్రోసూరు): మండల పరిధిలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆరు పళ్ల విభాగంలో విజేతలుగా ఎనిమిది జతలు నిలిచాయి. ఆదివారం నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు గెలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టపక్కల గ్రామాల రైతులు ఎడ్ల పోటీలు తిలకించేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. -
జీఎస్టీ తగ్గింపులపై విస్తృత ప్రచారం చేపట్టాలి
గుంటూరు వెస్ట్ : సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాల కేంద్రాల్లో సోమవారం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరం నుంచి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో మెరుగైన గ్రామీణ కనెక్టివిటీ, సురక్షితమైన రవాణా ఎంపికలు, విద్యా సామగ్రిపై పన్ను ఉపశమనం, స్టార్టప్లకు మద్దతు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని జేసీ ఆదేశించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక పాల్గొన్నారు. గుంటూరు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ -
కూటమి మోసాలపై పోరుబాట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని దాదాపు 25 వేల మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు పీఆర్సీ, మంచి ఐఆర్ ఇస్తామని, పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు పోరుబాట పట్టారు. సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలూ చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు డీఏలు బకాయి పెట్టింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు కూడా మంజూరు చేయడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దాని నుంచి రుణాలు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాఽథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా కనీసం రెండు డీఏల బకాయిలైనా విడుదల చేస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. జిల్లాలో 25 వేల మందికి వెన్నుపోటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో 7,415 మంది ఉపాధ్యాయులు ఉండగా.. మిగతావారు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయి వరకు చూసుకున్నా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లపైనే బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాల బకాయిలు మరో రూ.160 కోట్లు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన విడుదల కావడం లేదు. 12వ పీఆర్సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్మెంట్ లభించి, సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని, సర్కారు కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను నియమించగా, అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో కష్టాలు మొదటికొచ్చాయని వాపోతున్నారు. సర్కారు తీరుపై సంఘాల ఆగ్రహం బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఐక్యవేదికగా ఏర్పడి పోరుబాట పట్టాయి. ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా .. యుటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో ఽవిజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.2023 జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. చైర్మన్ను నియమించాక కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ మాటే ఎత్తక పోవడం దురదృష్టకరం. పాత పీఆర్సీ బకాయిలు ఇచ్చిన తరువాతే కొత్త కమిషన్ను వేస్తామని చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగితే ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మాట దాటవేస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి. కనీసం ఒక్క డీఏను కుడా ఇవ్వలేదు. పాత పీఆర్సీ బకాయిలు కూడా ఇవ్వడం లేదు. విజయవాడలో రేపు జరిగే ధర్నాలో పీఆర్సీయే ప్రధానంగా పోరాడతాం. – ఎస్ఎం సుభాని, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు -
బియ్యం కాజేసి.. చిల్లర ఆశ చూపి..
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్లే పక్కదారి పట్టిస్తున్నారు. నల్లబజారుకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. బియ్యం తీసుకెళ్లేందుకు వచ్చిన లబ్ధిదారులకు చిల్లర ఆశ చూపుతున్నారు. వీరికి టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు సహకారం అందిస్తున్నారు. ఇలా అందరూ కలసి పేదల నోటి కాడ కూడును కూడా మింగేస్తున్నారు. గతంలో ఇంటి ముంగిటకు వచ్చి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు కార్డుదారుల నోట్లో మట్టి కొడుతోంది. పార్టీ నాయకులకు దర్జాగా దోచిపెడుతోంది. నరసరావుపేట టౌన్: ఇంటి వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించింది. ఆ పార్టీకీ చెందిన ద్వితీయ శ్రేణి కార్యకర్తలను ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లుగా నియమించింది. పారదర్శకతకు విఘాతం కలిగించింది. దీంతో పేదల బియ్యం యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. పల్నాడు జిల్లాలో 6,34,114 బియ్యం కార్డులు ఉండగా 18,36,592 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ప్రతి నెలా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. బియ్యం తీసుకొచ్చిన నాలుగు రోజులకే ఖాళీ అయిపోయాయని. వచ్చే నెల రావాలని కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు తెగేసి చెబుతున్నారు. రెండు, మూడు రోజులకే అయిపోయాయా? అని ప్రశ్నిస్తున్న వారికి కొందరు దురుసుగా సమాధానం ఇస్తున్నారు. పంపిణీ ప్రారంభం నుంచి 15 రోజులపాటు సరుకులు ఇవ్వాల్సి ఉండగా రెండు, మూడు రోజుల్లోనే అయిపోయాయని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పల్నాడు జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అయితే రేషన్ మాఫియా బరి తెగించింది. పంపిణీ ప్రారంభం కాక ముందే పేదల బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నల్లబజారులో రేషన్ బియ్యం రూ.20 వరకు ధర పలుకుతోంది. దీంతో అక్రమార్కులు డీలర్లతో కుమ్మకై ్క పేదల బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అవకాశంగా మలుచుకొని కొందరు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ నామమాత్రంగా చేసి నల్లబజారుకు తరలిస్తున్నారు. నగదు తీసుకోవాలని బెదిరింపు... బియ్యానికి బదులుగా నగదు తీసుకోవాలని కార్డుదారులను డీలర్లు బెదిరిస్తున్నారు. ముందస్తుగా వేలిముద్రలు తీసుకొని ఆ తర్వాత నగదు ఇస్తామని కొంత మంది మోసం చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యమే కావాలని అడిగే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో కొంతమంది కార్డు దారులు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపటం లేదు. దీంతోపాటు ప్రతినెలా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతోందన్న భయంతో మరికొందరు బియ్యం లేకపోయినా డీలర్లు ఇచ్చే డబ్బులు తీసుకునేందుకు రేషన్ షాపుల వద్దకు వస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న డీలర్లు కేజీకి రూ.8 చొప్పున కార్డుదారులకు ఇస్తున్నారు. నిబంధనలకు నీళ్లు వదిలేసి... నిబంధనల ప్రకారం ప్రతి నెలా1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి. ఉదయం 8 –11 , సాయంత్రం 4 –8 గంటల మధ్య సరుకులు పంపిణీ చేయాలి. స్టాక్ వివరాలు పొందుపరచాలి. రేషన్ షాపుల వద్ద స్పష్టంగా కనిపించే చోట బోర్డు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కార్డుదారుల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నెంబర్, సివిల్ సప్లై అధికారి ఫోన్ నంబరు అందుబాటులో ఉంచాలి. డీలర్లకు అవేమీ పట్టడం లేదు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో ఆ వైపు అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. ఈ అక్రమాలపై అధికారులు నిర్లక్ష్యం వహించటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచే పేదల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా చర్యలు తీసుకోకపోవటం ఆరోపణలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు పరిపాలన కొనసాగించే నరసరావుపేటలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమాలపై కార్డుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదనే విమర్శలు లేకపోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి పేదలకు సక్రమంగా రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక
చీరాల రూరల్/వేటపాలెం: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (పౌరహక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం) సభ్యులుగా చీరాలకు చెందిన మేలుకొలుపు వినియోగదారుల రక్షణ సంస్థ కార్యదర్శి దాసరి ఇమ్మానుయేలు, హెచ్ఐవీ బాధితుల క్షేమం కోసం షాడో సంస్థ ద్వారా సేవలందిస్తున్న న్యాయవాది ఆల్ఫ్రెడ్ రాజా సాల్మన్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ వి. వినోద్కుమార్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్ నుంచి నియామక పత్రాలు అందుకున్నట్లు వారు తెలిపారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై దళిత, గిరిజనుల అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి, పౌర హక్కుల రక్షణపైనా చర్చిస్తుందని చెప్పారు. రావూరిపేటకు చెందిన కొమరిగిరి వెంకట ప్రసాద్ను కూడా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా ఆదివారం యానాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏందేటి వెంకట సుబ్బయ్య, జిల్లా కమిటీ అధ్యక్షులు చౌటూరి రమేష్, ప్రధాన కార్యదర్శి గందళ్ల నరేష్, కొమరిగిరి వెంకట ప్రసాద్ను అభినందించారు. -
పోరుబాట విజయవంతం చేయండి
నరసరావుపేట: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కార్యాలయంలో ఛలో విజయవాడ పోరుబాట కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించారన్నారు. బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేసి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి, బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు యాప్ల భారం నుంచి విముక్తి కల్పించాలని, సరెండర్ లీవ్, పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు మార్లు యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం చేపట్టామన్నారు. ఏపీటీఎఫ్ నాయకులు బి.ప్రజామూర్తి, నాయకులు టి.వెంకటేశ్వర్లు, డీఎన్ఎస్ మూర్తి, కె.రవి, సీహెచ్.నాగేశ్వరరావు, ఎం.రామాంజనేయులు, టి. నాగరాజు పాల్గొన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు కరపత్రం ఆవిష్కరించిన నాయకులు -
రేపు విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పిలుపునిచ్చారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ హామీల అమలుకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఋణాల మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు తదితర ఎన్నికల్లో ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. దసరాకు నాలుగు డీఏ బకాయిల్లో కనీసం ఒక్కటి సైతం ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను దగా చేసిందని ఆరోపించారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ తాత్సారం చేయడంతో ఉపాధ్యాయలోకం ఆగ్రహంతో ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం మేరకు ఈనెల 7న తలపెట్టిన ‘చలో విజయవాడ’లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమాన్ని ప్రభుత్వం మరచిపోయిందని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించకుండా మరింత భారాన్ని మోపి మానసిక ఆందోళనకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్ ఎన్క్యాష్మెంట్ తదితర బకాయిలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. సమావేశంలో సీనియర్ నాయకులు పి.ప్రసాద్, పి.దిబ్బయ్య, పి.సుందర్రావు, మేడా శ్రీనివాస రావు, రాజశేఖర్ పాల్గొన్నారు. ధర్నాను విజయవంతం చేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన మహాధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ కె.నరసింహారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. -
శివాలయంలో అన్నదానానికి విరాళం
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి గ్రామానికి చెందిన కానుగంటి రాధాకృష్ణమూర్తి, సామ్రాజ్యం దంపతుల పేరున వారి కుమారుడు హరిబాబు, నాగేశ్వరి దంపతులు ఆదివారం రూ. 1,00,116ను విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేయాలని దాతలు కోరారు. ఆలయ సిబ్బంది దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, చిత్రపటాన్ని బహూకరించారు. 8న సెపక్తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8వ తేదీన జరుగుతాయని అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్, పి.శివరామకృష్ణలు ఆదివారం తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఎంపికయిన క్రీడాకారులు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా చీరాలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 8712129398, 99851 86556 నంబర్లలో సంప్రదించాలని కోరారు. గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ తాతా సేవకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని జీఎంఏ హాల్లో నిర్వహించిన 2025–2026 కార్యవర్గం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎం.శివప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ బి.సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా చిలకా శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మరో 25మంది ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ తాతాసేవకుమార్ 2004లో ఐఎంఏ గుంటూరు శాఖలో సభ్యత్వం పొందారు. శాఖలో అంచలంచెలుగా పలు పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవి అందుకున్నారు. ఐఎంఏ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ సేవకుమార్ గతంలోరాష్ట్ర వర్కింగ్ కమిటీలో, ఐఎంఏ వివిధ స్కీంలలో పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్ సేవ కుమార్ 1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్హెచ్ఓ)ను స్థాపించారు. నాటి నుంచి ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ సేవకుమార్ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కిశోర్, ఐఎంఏ సీజీపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, డాక్టర్ డి. అమరలింగేశ్వరరావు అభినందించారు. -
రోడ్లపై ప్రయాణమే నరకప్రాయం!
‘‘ఆటో డ్రైవర్లు గత ప్రభుత్వ హయాంలో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉండేవి. గుంతల రోడ్లతో పడరాని పాట్లు పడ్డారు. అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే రూ.1,400 కోట్లు ఖర్చు చేసి గుంతల రహదారులకు మరమ్మతులు పూర్తి చేశాం...’’ ఇవీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రధాన రోడ్లు సైతం భారీ గుంతలతో అధ్వానంగా మారాయి. ప్రజలు ఈ మార్గాల్లో ప్రయాణంఅంటేనే నరకప్రాయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి: ఎన్నికల వేళ అభివృద్ధే లక్ష్యమని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం గత జనవరికే రోడ్లన్నింటినీ బాగు చేసి అద్దాల్లా మారుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. కానీ అధికారం చేపట్టి 16 నెలలవుతున్నా కనీసం మరమ్మతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. తట్ట మట్టి పోసిన దాఖలాలు కూడా లేవు. ఫలితంగా గుంతలు పడిన రహదారుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గాల్లో భారీ గుంతలు సత్తెనపల్లి–మాదిపాడు ప్రధాన రహదారి అడుగడుగునా భారీ గుంతలు పడ్డాయి. కంకర రాళ్లు తేలి ఉండడంతో రాకపోకలకు ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. గోతుల వల్ల ఒళ్లు హూనం కావడంతోపాటు వాహనాలు దెబ్బతింటున్నాయని చోదకులు వాపోతున్నారు. వర్షాలకు కంకర మొత్తం లేచి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. మళ్లీ వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచిపోతోంది. సత్తెనపల్లి నుంచి లక్కరాజు గార్లపాడు, ఫణిదం, అమరావతి, కంటేపూడి.. ఇలా ఏ రోడ్డు చూసినా గోతులమయంగా మారాయి. ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి జారిపడుతున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక రోడ్డు, ప్రధాన రహదారి నుంచి రఘురాంనగర్కు వెళ్లే ప్రగతి కళాశాల రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఉపన్యాసాలకే పరిమితం అభివృద్ధి, సంక్షేమం అని గొప్పలు చెబుతున్న కూటమి పాలకులు ఈ రహదారుల వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో రహదారులను అద్దంలా చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పాలకులు నేడు రోడ్ల మరమ్మతుల పేరిట భారీగా బిల్లులు చేసి దోచుకుంటున్నారే తప్ప పనులు చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారులను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
జాతీయ పోటీలకు రోషన్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 41 జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ఎస్కే రోషన్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటాడని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రోషన్ 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుడు అవార్డును కూడా గెలుపొందాడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారని తెలిపారు. రోషన్కి సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రసాద్ తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్తమ సేవలు డీఆర్ఎం సుథేష్ట సేన్ లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విక్షిత్ భారత్– 2047 భాగంగా సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారత ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఆదివారం అమృత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా విక్షిత్ భారత్– 2047 కార్యక్రమంలో ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం సామాజిక, ఆర్థికవృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్ర గురించి తెలిపారు. పరిశుభ్ర త, భద్రత, సమర్థ సేవలను అందించడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రాము ఖ్యత గురించి వివరించారు. ప్రయాణికులకుసంతృప్తిని అందించడంతోపాటు జాతీయ అభివృద్ధికి దోహదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయాణికులతో సంభాషించి వారి సూ చనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డీసీఎం కమలాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్రాంత అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విశ్రాంత అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని రాష్ట్ర జూనియర్ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, సహచర పెన్షనర్ సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం బాధాకరమని తెలిపారు. 70 నుంచి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లింపుతో పాటు 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ వ్యవస్థ నుంచి వచ్చిన పెన్షనర్లకు మెడికల్ రీ–యింబర్స్మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లందరికీ అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఆదాయపు పన్నును రద్దు పర్చి, గతంలో ఉన్న రైలు ప్రయాణ టికెట్ రాయితీని పునరుద్ధరించాలని విన్నవించారు. మానిటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ అధ్యాపకుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి.భాస్కరరావు, జెడ్.ఎస్. రామచంద్రరావు, జి.సుబ్బారావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు -
ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నెంబర్లలో palnadubaoltsavam@gmail. com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు. నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ వెల్లడించిన పల్నాడు జిల్లా బాలోత్సవ కమిటీ సభ్యులు -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశం
నరసరావుపేట: పట్టణంలోని ఏ1 ఫంక్షన్హాలులో 7వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్సీపీ నాయకులతో పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి హాజరవుతారన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. -
హిందీ భాషకు పెరుగుతున్న ప్రాధాన్యం
తెనాలి: స్వదేశంలోనే ఉద్యోగాలను వెతుక్కోవాల్సి వస్తున్నందున హిందీ భాష అవసరం ఏర్పడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రముఖ రచయిత రావెల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. స్థానిక హిందీ ప్రేమి మండలి మహా విద్యాలయంలో ఏటా జరిగే గాంధీ జయంతి, బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి గురు దంపతుల 23వ వార్షిక గురుపీఠ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మహా విద్యాలయం ప్రాంగణంలోని మోటూరి సత్యనారాయణ స్మారక సభా వేదికపై జరిగిన సభకు రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, రచయిత ప్రొఫెసర్ నారాయణ, కాకినాడకు చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, రచయిత్రి షేక్ కాశింబీకి గురుపీఠ పురస్కారాలు, నగదును ప్రదానం చేసి సత్కరించారు. -
విశ్రాంత అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విశ్రాంత అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని రాష్ట్ర జూనియర్ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, సహచర పెన్షనర్ సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం బాధాకరమని తెలిపారు. 70 నుంచి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లింపుతో పాటు 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ వ్యవస్థ నుంచి వచ్చిన పెన్షనర్లకు మెడికల్ రీ–యింబర్స్మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లందరికీ అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఆదాయపు పన్నును రద్దు పర్చి, గతంలో ఉన్న రైలు ప్రయాణ టికెట్ రాయితీని పునరుద్ధరించాలని విన్నవించారు. మానిటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ అధ్యాపకుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి.భాస్కరరావు, జెడ్.ఎస్. రామచంద్రరావు, జి.సుబ్బారావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు -
చలో విజయవాడకు తరలిరండి
నరసరావుపేట: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కార్యాలయంలో ఛలో విజయవాడ పోరుబాట కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించారన్నారు. బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేసి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి, బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు యాప్ల భారం నుంచి విముక్తి కల్పించాలని, సరెండర్ లీవ్, పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు మార్లు యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం చేపట్టామన్నారు. ఏపీటీఎఫ్ నాయకులు బి.ప్రజామూర్తి, నాయకులు టి.వెంకటేశ్వర్లు, డీఎన్ఎస్ మూర్తి, కె.రవి, సీహెచ్.నాగేశ్వరరావు, ఎం.రామాంజనేయులు, టి. నాగరాజు పాల్గొన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు కరపత్రం ఆవిష్కరించిన నాయకులు -
కె. రాజుపాలెం అంగన్వాడీ కేంద్రానికి అవార్డు
బల్లికురవ: జిల్లా స్థాయిలో స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రంగా మండలంలోని కె. రాజుపాలెం గ్రామ కేంద్రాన్ని ఎంపిక చేసినట్లు ఐసీడీఎస్ సంతమాగులూరు సీడీపీఓ దీవి సుధ ఆదివారం తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం బాపట్లలో అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలైన కార్యకర్త పి. నిర్మలాదేవి అవార్డు అందుకోనున్నట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిందని గుర్తుచేశారు. జిల్లాలోని 5 స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కె. రాజుపాలెం అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త పి. నిర్మలాదేవి, సహాయకురాలు భాగ్యలక్ష్మి రెండున్నర దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు అవార్డుతో గుర్తింపు లభించినట్లు సీడీపీఓ వివరించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు బాపట్ల ఎంఆర్ఎఫ్ కల్యాణ మండపంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుందని చెప్పారు.జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు అందుకోనున్న కార్యకర్త -
విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి
లక్ష్మీపురం: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు అంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మరో విగ్రహాన్ని ప్రతిష్టించింది గానీ, ఘటన జరిగి మూడు రోజులైనా దోషులను అరెస్టు చేయకుండా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు నిత్య కృత్యమయ్యాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురంలో దళితులపై దాడులు చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఘటనలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపును తెలియజేస్తుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి.లూథర్ పాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మీద నిరంతరం దాడి జరుగుతోందని విమర్శించారు. దళితులను చదువుకు, మానవీయ విలువలకు దూరంగా ఉంచిన మనువాద సిద్ధాంతాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు అందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, కేవీపీఎస్ నాయకులు యం.సుందరబాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి జాన్ బాబు, నాయకులు జి. వెంకట్రావు, ప్రసాద్ పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి -
జీఎస్టీ తగ్గింపుపై విస్తృత ప్రచారం చేపట్టాలి
గుంటూరు వెస్ట్ : సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాల కేంద్రాల్లో సోమవారం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరం నుంచి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో మెరుగైన గ్రామీణ కనెక్టివిటీ, సురక్షితమైన రవాణా ఎంపికలు, విద్యా సామగ్రిపై పన్ను ఉపశమనం, స్టార్టప్లకు మద్దతు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని జేసీ ఆదేశించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
ధర్నాను విజయవంతం చేయండి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పిలుపునిచ్చారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ హామీల అమలుకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఋణాల మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు తదితర ఎన్నికల్లో ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. దసరాకు నాలుగు డీఏ బకాయిల్లో కనీసం ఒక్కటి సైతం ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను దగా చేసిందని ఆరోపించారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ తాత్సారం చేయడంతో ఉపాధ్యాయలోకం ఆగ్రహంతో ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం మేరకు ఈనెల 7న తలపెట్టిన ‘చలో విజయవాడ’లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమాన్ని ప్రభుత్వం మరచిపోయిందని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించకుండా మరింత భారాన్ని మోపి మానసిక ఆందోళనకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్ ఎన్క్యాష్మెంట్ తదితర బకాయిలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. సమావేశంలో సీనియర్ నాయకులు పి.ప్రసాద్, పి.దిబ్బయ్య, పి.సుందర్రావు, మేడా శ్రీనివాస రావు, రాజశేఖర్ పాల్గొన్నారు. ధర్నాను విజయవంతం చేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన మహాధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ కె.నరసింహారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడంతోపాటు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, పాత పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలను కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, సెలవుల డబ్బులు, అంత్యక్రియల ఖర్చు తదితర సౌలభ్యాలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఏటా రూ. 180 కోట్లు హెల్త్ కార్డుల కోసం చెల్లిస్తున్నప్పటికీ ఏ హాస్పిటల్లోనూ వాటిని అంగీకరించడం లేదని తెలిపారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
తీరంలో ఇద్దరు గల్లంతు
– కాపాడిన రక్షణ సిబ్బంది బాపట్ల టౌన్: సూర్యలంక సముద్రతీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్లు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్రస్నానాలు చేయాలని ఆయన సూచించారు. తెనాలి అర్బన్: ఐతానగర్లోని శ్రీకృష్ణ మందిర వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ చేశారు. సాయంత్రం స్వామి వారి ఊరేగింపు జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
శివాలయంలో అన్నదానానికి విరాళం
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి గ్రామానికి చెందిన కానుగంటి రాధాకృష్ణమూర్తి, సామ్రాజ్యం దంపతుల పేరున వారి కుమారుడు హరిబాబు, నాగేశ్వరి దంపతులు ఆదివారం రూ. 1,00,116ను విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేయాలని దాతలు కోరారు. ఆలయ సిబ్బంది దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, చిత్రపటాన్ని బహూకరించారు. 8న సెపక్తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8వ తేదీన జరుగుతాయని అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్, పి.శివరామకృష్ణలు ఆదివారం తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఎంపికయిన క్రీడాకారులు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా చీరాలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 8712129398, 99851 86556 నంబర్లలో సంప్రదించాలని కోరారు. గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ తాతా సేవకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని జీఎంఏ హాల్లో నిర్వహించిన 2025–2026 కార్యవర్గం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎం.శివప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ బి.సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా చిలకా శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మరో 25మంది ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ తాతాసేవకుమార్ 2004లో ఐఎంఏ గుంటూరు శాఖలో సభ్యత్వం పొందారు. శాఖలో అంచలంచెలుగా పలు పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవి అందుకున్నారు. ఐఎంఏ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ సేవకుమార్ గతంలోరాష్ట్ర వర్కింగ్ కమిటీలో, ఐఎంఏ వివిధ స్కీంలలో పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్ సేవ కుమార్ 1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్హెచ్ఓ)ను స్థాపించారు. నాటి నుంచి ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ సేవకుమార్ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కిశోర్, ఐఎంఏ సీజీపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, డాక్టర్ డి. అమరలింగేశ్వరరావు అభినందించారు. -
మద్యానికి డబ్బులు లేవన్నందుకు దాడి
వ్యక్తికి గాయాలు సత్తెనపల్లి: వుద్యానికి డబ్బులు లేవన్నందుకు బావ తలను బావమరిది పగలగొట్టిన సంఘటన పట్టణంలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాప్ వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పెదాల నరసింహారావు మద్యం తాగేందుకు రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా.. కొద్దిసేపటికి వరుసకు బావమరిది అయ్యే చెరుకూరి మణి వచ్చి మద్యం ఇప్పించమని అడిగాడు. తన వద్ద క్వార్టర్కే నగదు ఉన్నాయని, అయినా తాగే ఉన్నావుగా.. ఇంకెందుకంటూ దూషించి, మందలించాడు. మద్యం ఇప్పించకపోగా తననే దూషిస్తావా అంటూ మణి మద్యం సీసా తీసుకొని నరసింహారావు తలపై కొట్టాడు. దీంతో నరసింహారావు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ ఎస్ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెహ్రూనగర్: బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభ ఈనెల 19న గుంటూరులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జి.శివ పూర్ణయ్య తెలిపారు. ఆదివారం గుంటూరు తాలుకా పెన్షనర్స్ హోంలో మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంప్లాయీస్ సమస్యలు, ఉద్యోగులకు రిజర్వేషన్లు, ప్రమోషన్స్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలుచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మీద చర్చించినట్లు తెలిపారు. ద్వితీయ మహాసభలో ప్రవేశపెట్టే తీర్మానాలు, సమావేశం విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలోని బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం వి. ప్రసాద్, గౌరవాధ్యక్షులు పి.వి.రమణయ్య, గుంటూరు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నెంబర్లలో palnadubaoltsavam@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు. నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ వెల్లడించిన పల్నాడు జిల్లా బాలోత్సవ కమిటీ సభ్యులు -
నేడు స్వచ్ఛ పురస్కారాల ప్రదానం
బాపట్ల: స్వచ్ఛ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని కమ్మ కల్యాణ మండపంలో జిల్లా ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను అక్టోబర్ 2న ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఒక అవార్డు వచ్చిందన్నారు. జిల్లా స్థాయిలో పలు విభాగాలలో 49 అవార్డులు వచ్చినట్లు వివరించారు. జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలిపారు. -
జాతీయ పోటీలకు రోషన్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 41 జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ఎస్కే రోషన్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటాడని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రోషన్ 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుడు అవార్డును కూడా గెలుపొందాడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారని తెలిపారు. రోషన్కి సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రసాద్ తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్తమ సేవలు డీఆర్ఎం సుథేష్ట సేన్ లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విక్షిత్ భారత్– 2047 భాగంగా సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారత ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఆదివారం అమృత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా విక్షిత్ భారత్– 2047 కార్యక్రమంలో ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం సామాజిక, ఆర్థికవృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్ర గురించి తెలిపారు. పరిశుభ్ర త, భద్రత, సమర్థ సేవలను అందించడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రాము ఖ్యత గురించి వివరించారు. ప్రయాణికులకుసంతృప్తిని అందించడంతోపాటు జాతీయ అభివృద్ధికి దోహదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయాణికులతో సంభాషించి వారి సూ చనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డీసీఎం కమలాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
హిందీ భాషకు పెరుగుతున్న ప్రాధాన్యం
తెనాలి: ఉపాధి అవకాశాలకు విదేశీ తలుపులు మూసుకుపోతున్న నేటి కాలంలో స్వదేశంలోనే ఉద్యోగాలను వెతుక్కోవాల్సి వస్తుందనీ, అప్పుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రముఖ రచయిత రావెల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. స్థానిక హిందీ ప్రేమి మండలి మహా విద్యాలయంలో ఏటా జరిగే గాంధీ జయంతి, బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి గురు దంపతుల 23వ వార్షిక గురుపీఠ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మహా విద్యాలయం ప్రాంగణంలోని మోటూరి సత్యనారాయణ స్మారక సభా వేదికపై జరిగిన సభకు రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, రచయిత ప్రొఫెసర్ నారాయణ, కాకినాడకు చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, రచయిత్రి షేక్ కాశింబీకి గురుపీఠ పురస్కారాలు, నగదును ప్రదానం చేసి సత్కరించారు. సభాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ స్వదేశంలోనే ఉద్యోగాలకు మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు. విజయవాడకు చెందిన బహు గ్రంథకర్త డాక్టర్ వెన్నా వల్లభరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగిడిన ప్రేమి మండలి పునీతమైందని తెలిపారు. సత్కారగ్ర హీతలైన ప్రొఫెసర్ నారాయణ షేక్ కాశింబీ మాట్లాడుతూ మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకోవడం మంచిదని సూచించారు. డాక్టర్ మురుకుట్ల మంజుల స్వాగతం పలుకగా, నాగళ్ల దుర్గా రఘురాం వందన సమర్పణ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఈలప్రోలు శ్రీనివాసరావు, కస్తూరి పర్య వేక్షించారు. -
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక
చీరాల రూరల్/వేటపాలెం: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (పౌరహక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం) సభ్యులుగా చీరాలకు చెందిన మేలుకొలుపు వినియోగదారుల రక్షణ సంస్థ కార్యదర్శి దాసరి ఇమ్మానుయేలు, హెచ్ఐవీ బాధితుల క్షేమం కోసం షాడో సంస్థ ద్వారా సేవలందిస్తున్న న్యాయవాది ఆల్ఫ్రెడ్ రాజా సాల్మన్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ వి. వినోద్కుమార్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్ నుంచి నియామక పత్రాలు అందుకున్నట్లు వారు తెలిపారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై దళిత, గిరిజనుల అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి, పౌర హక్కుల రక్షణపైనా చర్చిస్తుందని చెప్పారు. రావూరిపేటకు చెందిన కొమరిగిరి వెంకట ప్రసాద్ను కూడా సభ్యునిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కొమరిగిరి వెంకట ప్రసాద్ను ఆదివారం యానాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏందేటి వెంకట సుబ్బయ్య, జిల్లా కమిటీ అధ్యక్షులు చౌటూరి రమేష్, ప్రధాన కార్యదర్శి గందళ్ల నరేష్ తదితరులు అభినందించారు. -
మహనీయుల చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్
మంగళగిరి టౌన్: గంజాయి కలిగియున్న యువకులను అరెస్ట్ చేసిన ఘటన మంగళగిరి రూరల్పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఈగల్ టీమ్ తమ సిబ్బందితో మంగళగిరి రూరల్ పరిధిలోని కురగల్లు, బేతపూడి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో పలువురు యువకులు గంజాయి తీసుకుని వచ్చి మరికొంతమందికి విక్రయిస్తుండగా మెరుపుదాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అమ్ముతున్న ముగ్గురు యువకులను, వినియోగిస్తున్న మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకని వారి వద్ద నుంచి సుమారు 150 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు యువకులను రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. సాత్విక్ అనే యువకుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి యువకులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చీరాల రూరల్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాలు.. చీరాల రైల్వేస్టేషన్ సమీపంలోని ఫైరాఫీసు గేటు వద్ద శుక్రవారం రాత్రి ఒకరు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ఘటనలో వేటపాలెం– చినగంజాం స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 40 ఏళ్లు ఉంటాయని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 7న అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై పోటీలు గుంటూరు ఎడ్యుకేషన్: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను పాఠశాల, జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఈనెల 7న పాత బస్టాండ్ సెంటర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని పరీక్షా భవన్లో జిల్లాస్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 చొప్పున నగదు బహుమతులు, ప్రశంసాపత్రం అందజేస్తామని వివరించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని పాఠశాలలకు సమాచారాన్ని చేరవేసి, ప్రతి హై స్కూల్ నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు... అండర్ 19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో సాధుర్ల కావ్య హర్షిత, అండర్ 17 బాలుర భాగంలో గంటా దిశాంత్, ఈ.జి. హర్షవర్ధన్, అండర్ 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్ ఎంపికయ్యారు. ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థుల ప్రతిభ గుంటూరు రూరల్: ఐసీఏఆర్, ఏఐఈఈఏ పరీక్షల్లో తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు జాతీయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయానికి చెందిన మొత్తం 273 మంది విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ విభాగాలలోని పీజీ కార్యక్రమాలకు ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారన్నారు. ఈ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలలో పీజీ విభాగంలో ప్రవేశం పొందడానికి అర్హులని తెలిపారు. తమ విద్యార్థులు విశ్వవిద్యాలయం అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధన వల్ల సాధించిన విజయమని తెలిపారు. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాల్సిందే..!నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారదా మార్కెట్లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడు కుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్కు వచ్చే రైతులంతా అక్కడకు వెళ్లడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జర గడం లేదు. ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు మార్కెట్లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్కు నాన్ రిఫండబుల్ గుడ్విల్ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్గా మార్కెట్ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..! అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి -
నీటి సంరక్షణకు సత్వర ఏర్పాట్లు
బొల్లాపల్లి: జిల్లాలో నీటి సంరక్షణలో భాగంగా భూగర్భ జలాల పెంపునకు శ్రీకారం చుట్టామని డ్వామా పీడీ ఎం.సిద్ధ లింగమూర్తి తెలిపారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో శనివారం ఆయన బొల్లాపల్లిని సందర్శించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్, పొలంలో నీటి కుంట ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో భూగర్భ జల నీటిమట్టం 8.6 మీటర్లు లోతు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ఇంకుడు గుంతలు, పొలాల్లో నీటి కుంటలు, ఫీడర్ చానల్స్ ఏర్పాటుకు పనులను చేపడతామని చెప్పారు. జిల్లాలో వెల్దుర్తి , బొల్లాపల్లి, మాచర్ల, మాచవరం, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడుతో పాటు మరో మండలంలో భూగర్భ జలాలు లోతుగా ఉన్నట్లు తెలిపారు. ఆయా మండలాల్లో నీటి సంరక్షణ కోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈకేవైసీ ఉంటేనే ఉపాధి పనులు ఉపాధి హామీ పథకంలో జిల్లాస్థాయిలో 6.01 లక్షల లబ్ధిదారులు ఉన్నారని, వీరిలో 5.18 లక్షల మంది పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వివరించారు. వీరందరికీ ఈకేవైసీ ఉంటేనే పనులు కల్పిస్తామని, ఎన్ఎంఎంఎస్ ప్రత్యేక యాప్ ద్వారా హాజరు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈకేవైసీ పూర్తి కావచ్చిందని చెప్పారు. 2025 జూలై 15 వరకు ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాలో 524 గ్రామ సభలు పూర్తి చేశామని, నూతన పనులకు ప్రతిపాదనలు తయారుచేసి మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బొల్లాపల్లి మండలంలో 17వ విడత సామాజిక తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 7న సామాజిక తనిఖీ ప్రజా వేదిక బహిరంగ సభ ఉంటుందని డ్వామా పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి. మాధురి, ఉపాధి హామీ పథకం ఏపీవో ఎం. లక్ష్మణరావు, సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ బి. ఆవులయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
చేనేత పరిశ్రమను సర్వ నాశనం చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి: చేనేతపై జీఎస్టీ వేసి పరిశ్రమను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు విమర్శించారు. సంఘం 11వ రాష్ట్ర మహాసభలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వసతి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మహాసభల ప్రాంగణం ఆర్చీ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ మహాసభల్లో చేనేత రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తామని తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు, మహాసభ జరిగే ప్రాంగణం, ఆర్చీ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి. ప్రభాకర్, జి. సుసులోవ్, మల్లాల గురవయ్య, బిట్రా పానకాలు, జి. ఏసురత్నం, ఆవాజ్ సంఘం నాయకులు షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. -
వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గింపు
చిలకలూరిపేట: వ్యవసాయ పనిముట్లు, ఎరువుల ధరలపై జీఎస్టీ తగ్గించిన విషయాన్ని రైతులు గుర్తించాలని జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ చెప్పారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రచార కార్యక్రమాన్ని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించారు. ముందుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ విడిభాగాలపై గతంలో ఉండే 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఈ విషయాలపై రైతులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం గణపవరంలో జీఎస్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదేవి, సిబ్బంది చరణ్, సునీల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీనివాసరావు, ఆడిటర్లు టీవైవీఎల్ఎన్ మూర్తి, సామా శ్రీనివాసరావు, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురికిపూడి ప్రసాద్, రవినాయక్ పాల్గొన్నారు. -
బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్!
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. మాముళ్లు అందుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం ఒక్క రోజులోనే పొన్నూరు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వెయ్యి బస్తాలు పట్టుబడిందంటే ఈ దందా స్థాయి అర్థం చేసుకోవచ్చు. మాఫియాలోని వర్గాల సమాచారంతో ఇవి పట్టుబడ్డాయని, లేకుంటే కృష్ణపట్నం పోర్టుకు తరలిపోయేవని తెలుస్తోంది. వేమూరు నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి రూ.10కే బియ్యం కొనుగోలు చేసి చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. పాలీష్ చేసి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకెళుతున్నారు. భట్టిప్రోలు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని గురువారం పొన్నూరులో 300 బస్తాలు పట్టుకున్నారు. ● రేపల్లె నియోజకవర్గంలో డీలర్లు కిలో రూ.10 చొప్పున కొని కూటమి నాయకులకు రూ. 11 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. ఆపై రూ.16కు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజాంపట్నం మండలం కొలసానివారిపాలెంకు చెందిన కూటమి నేత కీలకంగా ఉన్నాడు. ప్రతి నెలా ఎమ్మెల్యేకు పెద్ద మొత్తం అందుతున్నట్లు తెలుస్తోంది. ● బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈనగంటి గాంధీ, వక్కలగడ్డ సుధీర్ రేషన్ ఈ వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల నుంచి తరలిస్తున్న 700 బస్తాల బియ్యం శుక్రవారం నాగులుప్పలపాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే. గుంటూరులోని శ్రీనగర్కు చెందిన జనసేన నేత అనిల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు డీలర్లతో మాట్లాడి ప్రతినెల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన నాగేశ్వరరావు మిల్లర్ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మోహన్, సుబ్బారావులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ● పొన్నూరులో పచ్చ నేతలు ముగ్గురు హవా చాటుతున్నారు. పచ్చ జెండా మోసి అలసిపోయిన ఓ మువ్వగోపాలుడు మండలాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో 70 బస్తాల రేషన్ బియ్యం నిల్వ చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన టీడీపీ సానుభూతిపరుడు రబ్బాని ప్రస్తుతం కీలకంగా మారారని సమాచారం. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కేంద్రంగా అక్రమ రవాణా సాగుతోంది. ● తాడికొండ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఫిరంగిపురం మండలంలోని టీడీపీ యువ నాయకుడికి దందా అప్పగించారు. మండలాల్లో నేతలకు మామూళ్లు ఇచ్చి నడిపిస్తున్నారు. తాడికొండలో ఇద్దరు రేషన్ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడులో కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుడు, అనుచరులు దందా నడిపిస్తున్నారు. ● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బియ్యం నేరుగా మిల్లుల వద్దకు చేరుస్తున్నారు. పాలీష్ చేసి కిలో రూ. 50 నుంచి రూ.70కి విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండతో ఓ టీవీ చానల్ రిపోర్టర్ సోదరుడు రేషన్ దుకాణాలపై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతుండటంతో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారులు లంచాలు తీసుకుని చోద్యం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన లారీలు, ఆటోలు మాత్రమే పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పొన్నూరులో అధికారులకు చిక్కిన రేషన్ బియ్యం బస్తాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న డీలర్లు అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమ రవాణా షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో కార్యకలాపాలు బియ్యం పట్టుకుంటే ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఫోన్లు పేదల నోటి దగ్గర కూడూ లాక్కుంటున్న నేతలు ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పొన్నూరులో మామిళ్ళపల్లి కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాలకులు రేషన్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. – చింతలపూడి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు మండల అధ్యక్షుడు, గుంటూరు జిల్లా.పల్నాడు జిల్లాలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళ బొలెరో వాహనాలలో నకరికల్లుకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. -
తొలగింపు.. తూతూమంత్రమే
● నరసరావుపేటలోని పలు మార్గాల్లో ఇటీవల ఆక్రమణల తొలగింపు ● ముణ్నాళ్ల ముచ్చటగా మారిన మున్సిపల్ అధికారుల చర్యలు ● మళ్లీ యథావిధిగా ఆక్రమణలతో నిండుతున్న రహదారుల మార్జిన్లు ● రద్దీతో వాహనదారులకు నిత్యం తప్పని ట్రాఫిక్ అవస్థలు నరసరావుపేట: గతేడాది నుంచి మున్సిపల్ అధికారులు చేపట్టిన ప్రధాన రోడ్ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం విఫలమైంది. సుమారు 1.60 లక్షల మంది జనాభా ఉన్న పురపాలక పట్టణంలోని నాలుగు ప్రధాన రోడ్లు ఆక్రమణలతో మళ్లీ కుంచించుకుపోతున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి చేపట్టిన ఆక్రమణల తొలగింపు అధికారులు ఆరు నెలలపాటు కొనసాగించారు. రెండు నెలలుగా మిన్నకుండిపోవటంతో వ్యాపారులు మళ్లీ రోడ్ల మార్జిన్లను ఆక్రమించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోనే సగం జనాభా నియోజకవర్గంలో సగం జనాభా పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పట్టణాన్ని మాస్టర్ప్లాన్ను పునరుద్ధరించి 14 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచింది. పట్టణానికి నాలుగువైపులా ఉన్న రావిపాడు, లింగంగుంట్ల, యల్లమంద, కేసానుపల్లి, ఇసప్పాలెం పంచాయతీల పరిధిలోని భాగాలను పట్టణ పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పటివరకు ఉన్న 34 వార్డులను 38కి పెంచారు. ఇలా విద్య, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పల్నాడురోడ్డు, గుంటూరు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, వినుకొండ వైపునకు వెళ్లే ప్రధాన రోడ్లు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, అధికారులకు కత్తిమీదసాములా పరిస్థితి మారింది. ఈ మార్గాలలో సెంట్రల్ డివైడర్లు ఉన్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. కఠిన చర్యలు తీసుకుంటాం దీనిపై మున్సిపల్ టీపీఓ కె.సాంబయ్యను వివరణ కోరగా...‘పట్టణంలో చాలావరకు ఆక్రమణలు తొలగించాం. తొలగించిన చోట మళ్లీ కొంతమంది ఆక్రమిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల తొలగింపు నిరంతరం కార్యక్రమం. ఇకపైనా కొనసాగిస్తూనే ఉంటామని’ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకు పురపాలక సంఘంలో తమకు ఇష్టమైన అధికారులను రప్పించుకున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు... పోలీసుల సహాయంతో ఆక్రమణల తొలగింపును హడావుడిగా చేపట్టారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించారు. తోపుడు బండ్లను వ్యాపారులు రోడ్లపై పెట్టకుండా నియంత్రించారు. రోడ్లు ఎత్తు పెంచుతూ ఆక్రమణదారులు పోసిన మట్టిని ప్రొక్లయినర్, ట్రాక్టర్ సహాయంతో తవ్వించారు. ఆ మట్టిని పలు పల్లపు ప్రాంతాలలో పోయించారు. ఆక్రమణలు తీసేందుకు సమయం కోరిన వారికి అవకాశం ఇచ్చారు. ఆ రెండు రోజులు అంతా బాగానే ఉందనిపించింది. తీరా ఇప్పుడు మళ్లీ ఆక్రమణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు వరకు మార్జిన్లో పండ్లు గుట్టలుగా పెట్టుకొని వినియోగదారుల కోసం ఎదురుచూసే వారు ఎక్కువయ్యారు. వినుకొండ రోడ్డు, పల్నాడు రోడ్లలో బిర్యానీ కేంద్రాల నిర్వాహకులు రోడ్లపైనే వంటకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా సంస్థలకు చెందిన జనరేటర్లు కూడా రోడ్లపైనే ఉంటున్నాయి. చాలా వ్యాపార సంస్థలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో రోడ్ల మార్జిన్లోనే వినియోగదారులు వాహనాలు ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై ఆక్రమణలు.. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని రోడ్ల పరిస్థితి ఇదీ. పాదచారులు రోడ్డుపై నడవాలన్నా, వాహనాలపై సక్రమంగా ప్రయాణించాలన్నా ఏ వాహనం వచ్చి తమను ఢీకొంటుందోననే భయంతో సంచరించాల్సి వస్తోంది. జిల్లాకు నూతనంగా కలెక్టర్, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. మార్పు ఏమన్నా వస్తుందా అని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
హైకోర్టు సీజే రాక
నేడు బొప్పూడికి చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమాలకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు రానున్నట్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆలయాలకు సంబంధించిన నక్షత్ర వనం, రాశి వనం, పంచవటి, నవగ్రహ వనంలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు, ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణమోహన్తో పాటు జస్టిస్ రవినాఽఽథ్ తిహారి, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వి. శ్రీనివాస్, జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ వై. లక్ష్మణరావు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పాల్గొననున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎండోమెంట్ కమిషనర్ కె. రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి డి.కళ్యాణ చక్రవర్తి ఇతర అధికారులు హాజరవుతారన్నారు. స్వామి వార్ల భూమి 1.20 ఎకరాల్లో నక్షత్రాలు, రాశుల వారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. తెనాలి: మారీసుపేటలోని బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానంలోని బతకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో బతకమ్మ పూజలు ముగిశాయి. గత నెల 22వ తేదీన ఆరంభమైన పూజల్లో రోజూ బతకమ్మకు వివిధ అలంకారాలు చేశారు. శనివారం అమ్మవారి ఓలలాడింపు ఘనంగా నిర్వహించారు. -
తాగునీటి ప్లాంట్పైనా ‘పచ్చ’ పైత్యం
● వైఎస్సార్సీపీ మద్దతుదారులనే నెపంలో మూసివేత ● అత్యుత్సాహంతో జోక్యం చేసుకున్న పోలీసులు మాదల(ముప్పాళ్ళ): వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వారిని భయపెడుతూ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తమ వైపు తిప్పుకొనేందుకు పచ్చపార్టీ నేతలు చర్యలు ప్రారంభించారు. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. అందులో భాగంగానే మాదల గ్రామంలో శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో 2011 నుంచి నిర్వహిస్తున్న వాటర్ప్లాంట్ను సైతం శనివారం మూసివేయించారు. కేవలం వైఎస్సార్సీపీ మద్దతుదారులనే కారణంతోనే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పోలీసుల సాయంతో తాళం వేయించి తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో గ్రామంలోని బీసీ ఏరియాలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ గోగుల అంజిబాబు కుటుంబసభ్యులు 2011 నుంచి వాటర్ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అసలు టీడీపీ ఎంపీటీసీలే లేని మండల పరిషత్ కార్యవర్గంలో ఎంపీపీ పదవిపై కన్నేసి, పార్టీ మారాలంటూ ఎంపీటీసీపై ఒత్తిడి చేశారు. పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ, వారి ప్రలోభాలకు లొంగకపోవటంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలు తెరతీశారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు కూడా టీడీపీ నాయకుల ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేమని ప్రశ్నిస్తే పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ చెబుతున్నారు. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. -
బగళాముఖి అమ్మవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలులో ప్రసిద్ధి గాంచిన బగళాముఖి అమ్మవారిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం న్యాయమూర్తికి వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో అమ్మవారి ఆలయ విశేషాలను న్యాయమూర్తికి తెలిపారు. న్యాయమూర్తి వెంట బాపట్ల రెండవ అడిషనల్ జడ్జి పి.రాజశేఖర్ పీవీపాలెం ఎంఆర్వో డి.వెంకటేశ్వరరావు, ఎస్ఐ. ఎంవీ శివకుమార్, సిబ్బంది ఉన్నారు. – జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: ఆటో డ్రైవర్లు కష్టజీవులని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శనివారం టౌన్ హాలులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 8,884 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున మొత్తం రూ.13.32 కోట్లు జమ చేశామన్నారు. డ్రైవర్లకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్టీవో సంజీవ్కుమార్, ఆర్డీవో కె.మధులత, ఎంవీఐ శివ నాగేశ్వరరావు, తహసీల్దార్ కె.వేణుగోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం వకాలత్ కార్యక్రమం నిర్వహించారు. బ్రాడీపేట నుంచి లాడ్జి సెంటర్ వరకు 200 మంది బ్యాంకు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ మన భాగస్వామ్య బాధ్యత అని నినాదాలు చేశారు. బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్కుమార్ రెడ్డి పాల్గొని విజిలెన్స్ అవగాహన వారంపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఏసీవీవో వివేక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రజలలో విజిలెన్స్పై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీజీఎం వికాస్ వినీత్, బ్యాంక్ విజిలెన్స్ ఇన్చార్జి ఆఫీసర్ హరీష్ బేతా, జనరల్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పింఛన్ పంపిణీలో అవకతవకలు.. వీఏఏ సస్పెన్షన్
క్రోసూరు: మండలంలోని దొడ్లేరు గ్రామంలోని సచివాలయం –1 విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ (వీఏఏ) ఎస్.మనోజ్కుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ శనివారం తెలిపారు. పింఛన్ నగదులో అవకతవకలకు పాల్పడినందుకు, రైతులకు యూరియా ఇస్తానని నగదు వసూలు చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు సస్పెండ్ చేసినట్లు ఏవో వివరించారు. ఇది ఇలా ఉండగా రాత్రికి రాత్రి లబ్ధిదారులకు చెల్లించాల్సిన పింఛన్ను ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో జి.శ్రీనివాసరావులు దొడ్లేరు గ్రామానికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీవో స్వయంగా తెలిపారు. వీఏఏ గ్రామంలో మొత్తం 58 మందికిగాను 20 మందికి రూ.82,000 బకాయి పడినట్లు తెలిసింది. దానిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో సర్దుబాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రాత్రికి రాత్రే ఎంపీడీవో పింఛను పంపిణీ -
మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శం
నరసరావుపేట టౌన్: మహాత్మా గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి కృషి చేయాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని ఖైదీల సంక్షేమ దినంగా సబ్జైల్లో గురువారం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, సబ్ జైలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాట్లాడారు. పొరపాటునో గ్రహపాటునో వివిధ నేరాల్లో ఉన్నవారు భవిష్యత్తులో పరివర్తన చెంది ఎటువంటి క్షణికావేశాలకు లోనుకాకుండా నేర ప్రవృత్తిని విడనాడి శాంతియుత జీవనం గడపాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడాంశాలలో విజేతలకు ఆమె బహుమతి ప్రదానం చేశారు. మొదట మహాత్మా గాంధీ చిత్రపటానికి న్యాయమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపకారగారం పర్యవేక్షకులు సురభి అంజయ్య, డిప్యూటీ జైలర్ రాములు నాయక్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బ్లేస్సినా, సిబ్బంది పాల్గొన్నారు. -
పండగ పూట పెను విషాదం
చందంపేట : మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో స్నానం ఆచరించేందుకు కృష్ణా బ్యాక్ వాటర్లో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని దేవరచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన కేతావత్ రాము(32), బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి చెందిన వాంకుడావత్ పూర్ణ గోపాలభరత్ (22), అవనిగడ్డకు చెందిన ఉమా సాయికాంత్ (11)లతోపాటు పలు కుటుంబాలు దేవరచర్లలోని తుల్జా భవాని ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సెప్టెంబర్ 30న వచ్చారు. అక్కడే బస చేసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుగుప్రయాణం సందర్భంగా గురువారం దేవరచర్ల గ్రామంలో కృష్ణా బ్యాక్ వాటర్, డిండి ప్రాజెక్టు జలాలు కలిసే చోట వాగులో స్నానం చేసేందుకు ఉమా సాయికాంత్ దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో వాగులో జారిపడి మునిగిపోయాడు. గమనించిన కేతావత్ రాము, పూర్ణ గోపాలభరత్లు కాపాడేందుకు వాగులోకి దిగారు. ఈత రాకపోవడం, వాగు లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఉత్తమ పద్యనాటకం ‘ఆదికవి నన్నయభట్టు’
తెనాలి: వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు–2025 ఘనంగా ముగిశాయి. ఇక్కడి తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరు రోజులపాటు జరిగిన పద్యనాటక, సాంఘిక నాటక, నాటిక పోటీల ముగింపు సభ గురువారం రాత్రి జరిగింది. ఈ సభలో బహుమతులను ప్రదానం చేశారు. పద్యనాటక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్– విజయనగరం సమాజం ప్రదర్శించిన ‘ఆదికవి నన్నయభట్టు’ నాటకం ఎంపికై ంది. దీనికి ఉత్తమ రచన బహుమతిని కూడా శారద ప్రసన్న స్వీకరించారు. నన్నయ భట్టుగా నటించిన కె.సూర్యనారాయణకు ఉత్తమ నటుడిగా నిలిచారు. ‘మెహినీ భస్మాసుర’కు అవార్డుల పంట ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా అక్కినేని సాంస్కృతిక సమాజం వారి ‘మోహినీ భస్మాసుర’ నాటకం ఎంపికై ంది. భస్మాసురుడిగా నటించిన డి.తిరుపతినాయుడు ఉత్తమ ప్రతినాయకుడు బహుమతిని, మోహినీగా నటించిన కేవీ పద్మావతి ఉత్తమ నటిగా, నారదుడు పాత్రధారి గవర సత్తిబాబు ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా బహుమతులను గెలుచుకున్నారు. ఇదే నాటకానికి ఉత్తమ సంగీతం బహుమతిని కంది త్రినాథరావు అందుకున్నారు. సత్తా చాటిన కళాకారులు చందాల కేశవదాసు కళాపరిషత్ – మధిర వారు ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ నాటకానికి తృతీయ ఉత్తమ బహుమతి లభించింది. దీనికి దర్శకత్వం వహించిన ఎన్.సుబ్బరాజు ఉత్తమ బహుమతిని గెలుచుకున్నారు. పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు, లలిత కళాపరిషత్ – అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ నాటకానికి ఉత్తమ రంగోద్దీపనం బహుమతిని సురభి రాయల్ స్వీకరించారు. టీజీవీ కల్చరల్ అకాడమీ – కర్నూలు వారు ప్రదర్శించిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ నాటకానికి ఉత్తమ ఆహార్యం బహుమతిని సి.శ్రీనివాసులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటి బహుమతిని ’పుత్రాదిచ్ఛేత్’ నాటకంలో నాగులాంబ పాత్రధారి ఎన్.తిరుమల కై వసం చేసుకున్నారు. ఉత్తమ హాస్యనటిగా ‘జగదేకసుందరి సామా’లో హసీనా, ఉత్తమ బాలనటుడిగా ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో బాలవెంకటేశ్వరుడు గెలుచుకున్నారు. సాంఘిక నాటక విభాగంలో ... సాంఘిక నాటక విభాగంలో ఉత్తమ ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్– వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ నటి సురభి లలిత, ఉత్తమ ప్రతినాయకురాలు (నల్లత్రాచు నీడలో)ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా జయకళానికేతన్ – విశాఖపట్నం వారి ‘సిరికేళి’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటుడిగా బహుమతులను జరుగుల రామారావు (అందరూ మంచివారే...కానీ), ఉత్తమ రచన శ్రీశైలమూర్తి (యాగం) అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్నీ బ్రతకనివ్వండి’ గెలుచుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు బహుమతులు లభించాయి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా పరమాత్ముని క్రియేషన్స్ –హైదరాబాద్ వారి ‘ఎక్కడో...ఏదో’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు ఉత్తమ రచన బహుమతి లభించింది. ఉత్తమ తృతీయ ప్రదర్శనగా హర్ష క్రియేషన్స్ – విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ నాటిక ఎంపికై ంది. కళల కాణాచి – తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవంలో అజో విభో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, నాటకరంగ విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ఆర్.శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు -
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి, పెదకూరపాడుకు చెందిన జాలయ్యను సెంట్రల్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్లుగా ఇరువురు నియామకం.. నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్ఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొమ్మారెడ్డి చలమారెడ్డి(మాచర్ల), ఈదా సాంబిరెడ్డి (పెదకూరపాడు), కొమ్మినేని వెంకటేశ్వర్లు (గురజాల) నియమితులయ్యారు. మరొక వ్యక్తికి తీవ్రగాయాలు రొంపిచర్ల: మండలంలోని మర్రిచెట్టుపాలెం, మాచవరం గ్రామాల మధ్య రహదారిపై శుక్రవారం రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన వి.గోపిరెడ్డి (21) మర్రిచెట్టుపాలెం గ్రామంవైపు నుంచి మోటారు సైకిల్పై మాచవరం గ్రామం వెళుతుండగా అదే మార్గంలో నరసరావుపేట నుంచి కుంకులకుంట వెళుతున్న హుస్సేన్కు చెందిన మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపిరెడ్డి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన హుస్సేన్ను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల: బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు డ్రోన్ నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా సముద్రతీర పర్యాటక ప్రదేశాల్లో, శివారు ప్రాంతాలలో శుక్రవారం నిఘా ఏర్పాటు చేయించారు. సూర్యలంక, రామాపురం, వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాల గురించి సమారచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు
నకరికల్లు: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పలు ప్రాంతాలలో అమ్మకాలు చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. నకరికల్లు పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని చల్లగుండ్ల పరిధిలో గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నున్న 10 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు, విశాఖపట్నం సాలిపేటకు చెందిన పెంటకోట శంకరరావు, నకరికల్లుకు చెందిన కగ్గా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల పులిచింతల నిర్వాసిత గ్రామానికి చెందిన కాపర్తి మల్లిఖార్జునరావు, బిహార్ రాష్ట్రానికి చెందిన అగయ్య వినోద్యాదవ్, నకరికల్లు మండలానికి చెందిన బాణావతు బాలానాయక్, రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంకు చెందిన సాదుపాటి శ్రీనివాసరావు, కొండమోడు గ్రామానికి చెందిన బండారు హనుమంతరావు, ఆవుల పెద్దసాంబయ్యలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. నర్రా హనుమంతరావు, పెంటికోట శంకరరావులు కలసి ఒడిశా నుంచి విశాఖపట్నం ప్రాంతాలకు గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారన్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారినుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం -
పింఛన్ నగదు మాయం
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామ వీఏవో మనోజ్కుమార్ సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వినియోగించుకున్నాడు. శుక్రవారం గ్రామానికి చెందిన కొందరు పింఛన్దారులు పంచాయతీ కార్యాలయంలో అతనిని నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే... ఈనెల 1వ తేదీన గ్రామంలోని ఒకటో వార్డులో 58 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ రైతుభరోసా కేంద్రం వీఏవో మనోజ్కుమార్కు బాధ్యతలు అప్పగించారు. వాటిలో సుమారు 20 మంది లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకున్నాడు. వేలిముద్రలు సరిగా పడలేదు, డబ్బులు గురువారం వచ్చి ఇస్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. డబ్బులు ఇస్తాడని ఎదురు చూసిన బాధితులు ఎంతకూ రాకపోవటంతో ఫోన్లు చేసి పిలిపించారు. బ్యాంకుకు వెళ్లి వస్తానని తాత్సారం చేసి పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో అక్కడ లబ్ధిదారులు పింఛన్ నగదు కోసం నిలదీశారు. పింఛన్ నగదు లేవు రెండు రోజుల్లో సర్దుతానంటూ చెబుతుండటంతో అక్కడే నిర్బంధించారు. టీడీపీ నాయకులు, గ్రామపెద్దలు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పోలీసులను తెలియచేశారు. పోలీసులు తీసుకొచ్చి ఎంపీడీవోకు అప్పగించారు. దీనిపై ఎంపీడీవో జి.శ్రీనివాస్ తెలుపుతూ 20 మందికి పింఛన్ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, ఎంత మేర ఇవ్వాలన్నది లాగిన్లో శుక్రవారం తెలుస్తుందన్నారు. వీఏవో వాడుకున్న నగదు శునివారం తీసుకొచ్చి అప్పగించే విధంగా లిఖితపూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. నగదు అప్పగించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. యూరియా ఇప్పిస్తానని నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఇది ఇలా ఉండగా ప్రస్తుతం యూరియా డిమాండ్ను అసరాగా తీసుకుని యూరియా తెప్పించి ఇస్తానని కొంత మంది రైతుల దగ్గర నగదు వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చిన రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎంత మేర వసూలు చేశారన్నది స్పష్టంగా తెలియరాలేదు. -
ఆరున స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అందించనున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఈనెల 6న ప్రదానం చేయనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదే బాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛతా అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైనట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు. అక్టోబరు 6న జిల్లా ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్స్టేషన్లు, పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. మూడు దశల్లో స్వచ్ఛ ఆంధ్ర–2025 రేటింగ్, ర్యాంకింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డు గ్రహీతల పూర్తి వివరాలను ఎస్ఎఎస్ఎ (సాసా) పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ విజయాలు స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మూడో దశలో 25 గ్రామాల్లో రీసర్వే నరసరావుపేట: జిల్లాలో శుక్రవారం నుంచి మూడో దశ రీ సర్వే ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 150 గ్రామాలలో రీసర్వే పూర్తి చేశామని, ప్రస్తుతం మరో 41 గ్రామాలలో జరుగుతుందని అన్నారు. మూడో దశలో 25 గ్రామాలలో రీసర్వే చేయబోతున్నామని తెలిపారు. రైతులందరూ రీసర్వేకి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీసు ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. రీసర్వేలో రైతుల నుంచి అందిన అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయండి నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల సిబ్బంది, కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అందించిన భూముల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి సాయం అందించగలిగే అవకాశాలను అన్వేషించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంపై నైపుణ్యాభివృద్ధి శాఖ దృష్టి సారించాలన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరికీ 100శాతం ప్లేస్మెంట్ దక్కేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, ఎల్డీఎం రాంప్రసాద్, డీఆర్డీఎ అసిస్టెంట్ పీడీ ఆర్.ప్రతాప్, జిల్లా పరిశ్రమల అధికారి నవీన్, ఏపీఐఐసీ జెడ్ఎం డాక్టర్ ఎల్ఎం నరసింహారావు, జిల్లా అదనపు నైపుణ్య అభివృద్ధి అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
మేదరమెట్ల: బైక్ను కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొరిశపాడు మండల పరిధిలోని వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటసుబ్బారావు(55), భార్య లక్ష్మి(50)తో మోటారు బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. వెంకటాపురం క్రాస్ వద్దకు రాగానే బైక్ను అలవలపాడు రోడ్డులోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా ఇదే సమయంలో నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు బైక్ను ఢీ కొంది. దీంతో బైక్పై ఉన్న భార్యాభర్త రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు దుర్మరణం జరుగుమల్లి(సింగరాయకొండ): దసరా పండగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మండల కేంద్రమైన జరుగుమల్లిలో పాల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కట్టా ప్రవీణ్(21), చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(20) ఇద్దరూ కలిసి చింతలపాలెం నుంచి టంగుటూరుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంచిన టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.మహేంద్ర తెలిపారు. -
జయ మంగళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రాకతో కృష్ణమ్మ పులకించింది. దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదిదంపతులకు హంస వాహన సేవ జరిగింది. కృష్ణానది వరద నేపథ్యంలో శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఏటా నిర్వహించే నదీ విహారాన్ని రద్దు చేశారు. హంస వాహన సేవను మాత్రమే నిర్వహించగా, సేవను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది తీరానికి చేరుకున్నారు. హంస వాహనంపై అధిష్టించిన ఆదిదంతులకు ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. హంస వాహనంపైకి ఆలయ ఈవో, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ దంపతులతో పాటు వేద పండితులు, ఆలయ అర్చకులను మాత్రమే అనుమతించారు. హంస వాహనంపై కొలువు తీరి పూజలందుకుంటున్న ఆదిదంపతులను ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్, దుర్గగుడి ఫ్లైవోవర్, భవానీ ఘాట్ల నుంచి భక్తులు దర్శించుకున్నారు. సాయం సంధ్య వేళ దుర్గాఘాట్లో కృష్ణమ్మకు నవ హారతులను ఇవ్వగా, అదే సమయంలో హంస వాహన సేవ జరిగింది. ఒకే సమయంలో రెండు సేవలను వీక్షించే మహాభాగ్యం భక్తులకు కలిగింది. క్యూలైన్ల ద్వారానే.. భవానీలు, భక్తుల రాకతో మరో రెండు రోజులపాటు ఉత్స వ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొ న్నారు. శని, ఆదివారాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు క్యూలైన్ల ద్వారానే కొండపైకి చేరుకోవాలని సూచించా రు. అంతే కాకుండా వీఐపీ దర్శనాలు ఉండవని పేర్కొన్నారు. కనులపండువగానగరోత్సవ సేవ హంసవాహన సేవ కోసం ఆది దంపతులు దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మల్లేశ్వరస్వామి వారి ఆ లయం సమీపంలోని యాగశాల నుంచి ప్రారంభమవగా.. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, దుర్గాఘాట్కు బయలుదేరింది. ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో హంస వాహనంపైకి కేవలం 25 మందిని మాత్రమే అనుమతించారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
●దానికి బదులు అమరావతి ప్రైవేటీకరణ చేయొచ్చు కదా? ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పిడుగురాళ్లరూరల్: రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్లతో జేబులు నింపుకొంటూ, పేదల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొని వచ్చిన వైద్యకళాశాల, హాస్పటళ్లను ప్రైవేటుకు అప్పగించడం ఏంటని.. ఇదేనా మీ విజనరీ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. శ్యామల మాట్లాడుతూ... 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి బడ్జెట్టులోనే గురజాల నియోజకవర్గానికి నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు, రోగులకు ఉపయోగపడే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను ప్రైవేటు పరం చేస్తుందని.. దానికి బదులుగా అమరావతిని ప్రైవేటీకరణ చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత పెద్ద ప్రజెంటేషన్ చేసి కాలేజీల నిర్మాణం చేపట్టలేదని చెబుతున్నారని, అయితే ఒక్కసారి గురజాల వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మెడికల్ కాలేజీ భవనాలను కళ్లతో చూస్తూ కూడా నోటితో అబద్దాలు చెబుతున్నారని శ్యామల దుయ్యబట్టారు. 17 కాలేజీలలో ఏడు కాలేజీలను జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తి చేశారని, మిగతా 10 కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం రాజధాని ఎలా పూర్తి చేస్తారని ఆమె ప్రశ్నించారు. సర్పంచ్లు చల్లా శివారెడ్డి, షేక్ బడేషా, వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ఇల్లూరి వెంకట రామిరెడ్డి, జిల్లా యూత్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ చల్లా రంగారెడ్డి, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ షేక్ మాబు, గురజాల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సాంబశివరావు, వలంటీర్ విభాగం అధ్యక్షులు అంచూరి తరుణ్రెడ్డి, కత్తి సాగర్బాబు, బండి ప్రసాద్రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
నరసరావుపేట టౌన్: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీహెచ్సీ వైద్యుల సంఘం అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ కోటా తగ్గించింటంతో వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ జీఓ నెం. 99 ద్వారా పీజీ ప్రవేశాల్లో 20 శాతం ఉన్న కోటాను 15 శాతానికి తగ్గించటమే కాకుండా కేవలం ఏడు బ్రాంచ్లకే పరిమితం చేయటం అన్యాయమన్నారు. సంఘ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మొదట దీక్ష శిబిరం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు హనుమకుమార్, రమ్య, జగన్నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ల పంపిణీ
సత్తెనపల్లి: జిల్లాలో సచివాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. వలంటీర్ విధులు తమకు వద్దని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిరసన తెలియ జేస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,72,735 పెన్షన్లకు గాను బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు 2,51,240 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. 92.12 శాతం పంపిణీ పూర్తయింది. ఇంకా 21,495 మందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా సత్తెనపల్లి పట్టణంలో 94.89 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేయగా అత్యల్పంగా దుర్గిలో 89 శాతం మందికి పంపిణీ జరిగింది. ఇది ఇలా ఉంటే రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీలో జరిగిన లోటుపాట్లపై లబ్ధిదారులు అంతా ఒకే చోటకు చేరి గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడటంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్డీఓ రాజగోపాల్, మండల అధికారులు అనుపాలెం గ్రామానికి చేరుకొని పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. నకరికల్లు: ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మండలంలోని గుండ్లపల్లి సమీపంలోని ఎన్నెస్పీ మెయిన్ కెనాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన విషయం పాఠకులకు విధితమే. చిలకలూరిపేటకు చెందిన షేక్ అర్షద్(17), చీరాల మండలం ఆంధ్ర కేసరినగర్కు చెందిన దరబడి మార్క్ రూఫస్(17)ల మృతదేహాలను మండలంలోని శివాపురంతండా సమీపంలో సాగర్ కెనాల్లో గుర్తించారు. అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత యడ్లపాడు: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి క్వారీ కుంటలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన దాసరిపాలెంకు చెందిన బాలుడు షేక్ మాబు(15) మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గతనెల 30వ తేదీన మండలం పరిధిలోని చౌడవరం గ్రామ శివారులోని క్వారీకుంటలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన మాబు మృతదేహాన్ని యడ్లపాడు పోలీసులు అదేరోజు రాత్రి 10.45 వెలికి తీసిన విషయం తెలిసిందే. వెంటనే మృతదేహాన్ని చిలకలూరిపేట అర్బన్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. బుధవారం మాబు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాస్పిటల్ వద్దకు రావడంతో రోదనలు మిన్నంటాయి. తల్లి మరియంబి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో దాసరిపాలెంలోని అంత్యక్రియలు నిర్వహించారు. -
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు. -
జిల్లాలో భూగర్భజలాలు సంరక్షించాలి
నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెంపు వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, భూగర్భజల శాఖ, డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట కుంటల తవ్వకం, చెక్ డ్యామ్లు, నీటికుంటల నిర్మాణం, చెరువుల పూడికతీత, చెరువుల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపటం వంటి సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా నీటి సంరక్షణ సాధ్యమన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ , డ్వామా పీడీ లింగమూర్తి, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు వసతులు కల్పించండి ఔత్సాహిక క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలసి సత్తెనపల్లిరోడ్డులోని అన్నా క్యాంటీన్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా స్టేడియానన్ని ఆమె పరిశీలించారు. వాకింగ్, రన్నింగ్ ట్రాక్లతోపాటు వివిద నిర్మాణాలు చేపట్టాలని శాప్ అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్లో భోజనాన్ని పరిశీలించారు. ప్రకాష్నగర్లోని 12వ వార్డు షాలెంనగర్లో మురుగునీటి కాలువను పరిశీలించారు. పూడికతీతకు ఆదేశాలిచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును ఆదేశించారు. బాపనయ్య 11వ వార్డు సచివాలయాన్ని పరిశీలించారు. నూతన జీఎస్టీ రెండు శ్లాబుల విధానంతో అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీఓ కె.మధులత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం -
సాగర్బాబు ఘటనపై విచారణ జరిపి న్యాయం చేస్తాం
నరసరావుపేట రూరల్: విద్యుత్ షాక్కు గురై వికలాంగుడిగా మారిన సాగర్బాబు ఘటనలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్కుమార్ హామీ ఇచ్చారు. జొన్నలగడ్డలోని విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద సాగర్బాబు కుటుంబం గత రెండురోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎస్ఈ సందర్శించి, సాగర్బాబు భార్య కెజియాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు ఎస్ఈని కలిసి చర్చించారు. సాగర్బాబు కుటుంబం గత 17 రోజులుగా రిలే నిరాహారదీక్షలు, రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ పెద్దలు రాతపూర్వకంగా ఇచ్చారని ఎస్ఈ తెలపగా.. రెండున్నర సంవత్సరాల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు నకిలీ లెటరు తీసుకువచ్చి చూపడం సరికాదని, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సాగర్బాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. దీంతో సాగర్బాబు కుటుంబసభ్యులు రిలే నిరాహార దీక్షలను విరమించారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వర్లు, నల్లపాటి రామారావు, జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కారుతో హల్చల్
పిడుగురాళ్ల: మద్యం మత్తులో బొలెరో వాహనాన్ని నడుపుతూ వాహనాలు, పాదచారులపైకి దూసుకుపోయిన ఘటన పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. సైదా వలి అనే యువకుడు పూటుగా మద్యం తాగి బొలెరో వాహనం నడుపుతూ దాచేపల్లి వస్తున్నాడు.. ఈక్రమంలో పిడుగురాళ్ల అయ్యప్పనగర్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాల తో పాటు పాదచారులపైకి దూసుకుపోయాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన యువకుడు హైవేపై కొద్ది నిమిషాల పాటు హల్చల్ చేశాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం నిలిపి పక్కన మాట్లాడుతున్న వ్యక్తిని బొలెరోతో ఢీకొనడమే కాకుండా ఆ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లాడు. వేగంగా వాహనం దూసుకుని పోవడంతో రోడ్డుపై నిప్పు రవ్వలు చెలరేగాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిలో నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తికి కాలు పూర్తిగా దెబ్బతింది. అతన్ని వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు తెలిసింది. మిగిలిన వారిని పిడుగురాళ్ల పట్టణంలో ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించారు. ఈక్రమంలో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పలువురు యువకుల సాయంతో బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సైదావలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వారిని 108 ద్వారా పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వాహనం నడిపిన సైదావలిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ నాగరాజు తెలిపారు. -
దివ్యం.. దుర్గమ్మ దర్శనం
● వైభవంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు ● వేదపఠనంతో మారుమోగిన ఇంద్రకీలాద్రి ● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు ● నేడు మహిషాసురమర్దినిగా అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసురమర్దినీదేవిగా దర్శనమిస్తారు. ముగింపు దశకు ఉత్సవాలు గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లుకు నెమలి వాహనంతో నగరోత్సవం నిర్వహించారు. నెమలి కనులతో తీర్చిదిద్దన పల్లకీపై ఆదిదంపతులు ఇంద్రగిరి వీధుల్లో విహరించారు. సాయంత్రం వర్షం పడటంతో నగరోత్సవ సేవ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల కోలాహలం నడుమ ఊరేగింపు కనుల పండువగా సాగింది. -
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు. ఆకట్టుకున్న ఇతివృత్తాలు అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం దుర్గగుడికి రూ.40.12 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. 2.29 లక్షల లడ్డూలను విక్రయించామని వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. 450 మంది వేద పండితులు పాల్గొన్నారు.వెల్దుర్తి: వజ్రాలపాడు సమీపంలోని చెరువులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు.లింగారావుపాలెం శివాలయంలో వనదుర్గాదేవి అలంకారంలో పార్వతీదేవి సత్తెనపల్లిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీదుర్గాదేవిగా...దుర్గాదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు వినుకొండలోని శంకర సత్సంగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న కన్యలు దేవతాస్వరూపిణి దుర్గమ్మజిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా అమరావతిలోని బాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో మంగళవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని దుర్గతులను రూపుమాపే దుర్గాదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గాదేవిని దర్శించి పూజలు నిర్వహించారు. వినుకొండలోని శంకర సత్సంగంలో కన్యలు పూజలు నిర్వహించారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోని శివాలయంలో వనదుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. – అమరావతి/వినుకొండ/సత్తెనపల్లి/యడ్లపాడుI -
పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ‘‘ఈ నెల ఇస్తాం..వచ్చే నెల ఇస్తాం’’ అంటూ 16 నెలలుగా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం అక్టోబర్ నెలలో కూడా సరఫరాకు మంగళం పాడింది. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండడంతో కందిపప్పు ఇస
నరసరావుపేట టౌన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే కందిపప్పు, పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు పంపిణీకి నోచుకోవటం లేదు. అన్ని సరుకులు అందజేస్తే పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చౌక దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67కు కార్డుదారులకు అందిస్తున్నారు అదే బహిరంగ మార్కెట్లో రూ.100 నుంచి రూ.105 వరకు పలుకుతొంది. ఏడాదికి పైగా చౌక దుకాణాల్లో కందిపప్పు అందకపోవటంతో పేదలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నూతన రేషన్న్ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగష్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రెండు రకాల యాప్లు ఏర్పాటు చేయటంతో సర్వర్ నెమ్మదించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సరుకుల పంపిణీలో జాప్యం చోటుచేసుకొని కార్డుదారులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కందిపప్పుకు మంగళం అక్టోబర్ నెలకు సంబంధించి బుధవారం నుంచి ప్రజా పంపిణీ ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం, పంచదార మాత్రమే చౌకదుకాణాలకు దిగుమతి అయ్యాయి. పండుగల సీజన్న్ లోనైనా ప్రభుత్వం పేదల కడుపు నిండేలా చర్యలు తీసుకుంటుందనే ఆశతో కార్డుదారులు రేషనన్ దుకాణాలకు వెళ్లారు. కానీ ప్రభుత్వం కందిపప్పు అందించకపోవడం వారికి తీవ్ర నిరాశ కలిగించింది. పండుగ కోసం అదనంగా ఖర్చులు చేయాల్సి వచ్చే ఈ సమయంలో మార్కెట్లో కిలో రూ.100కు పైగా వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయడం పేదల జేబులకు మరింత భారమైపోయింది. కందిపప్పు నిలిచిపోవడంతో పేద కుటుంబాలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పండుగ సీజన్లోనూ ఉపశమనం ఇవ్వలేకపోవడం ప్రభుత్వం వైఫల్యాన్ని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 6,34,114 రైస్ కార్డులు ఉండగా అందులో 18,36,592 మంది సభ్యులు ఉన్నారు. వారికి నెలనెలా కేజీ చొప్పున కార్డుదారులకు సబ్సిడీపై అందించాలి. వీటితోపాటు జిల్లాకు నూతనంగా అర్హత పొందిన సుమారు 13 వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుదారులతోపాటు నూతనంగా మంజూరైన వారికి కందిపప్పు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రేషన్ దుకాణాల్లో కందిపప్పు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ప్రజాపంపిణీపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు.