breaking news
Palnadu
-
అప్పుల బాధతో యువకుడు బలవన్మరణం
సత్తెనపల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పాతబస్టాండ్ సమీపంలోని శ్రీకృష్ణా లాడ్జిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ (31) గత కొన్ని సంవత్సరాలుగా వెండి వస్తువులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత అప్పులయ్యాయి. తీరే మార్గం కనిపించక మనస్తాపం చెందిన అబ్దుల్ అజీజ్ ఈ నెల 9న సాయంత్రం సత్తెనపల్లిలోని శ్రీకృష్ణా లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. శనివారం రాత్రి నుంచి తలుపు తీయకపోవడంతో ఆదివారం ఉదయం అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ జె.రాజశేఖర్, సిబ్బంది వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్కు దుప్పటితో అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. -
ఓబన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం
నరసరావుపేట రూరల్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ తెలిపారు. ఓబన్న జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఓబన్న చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ సంతోష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఓబన్న చేసిన త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, వెల్పేర్ ఆర్ఐ ఎల్.గోపీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. రొంపిచర్ల: ‘ఫోన్ పే చేస్తాం.. పెట్రోల్ కొట్టండి’ అంటూ బంక్లోని ఆపరేటర్ వెంకట కృష్ణపై దుండగులు దౌర్జన్యం చేసిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని ఓ బంక్లో చోటుచేసుకుంది. అతడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు... శనివారం రాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్లోకి వచ్చారు. వారిలో ఒకడు వచ్చి ఆపరేటర్తో రూ.5 వేలు ఫోన్ పే చేస్తామని చెప్పాడు. రూ. 2 వేలకు పెట్రోల్ కొట్టి, రూ.3 వేలు నగదు ఇవ్వాలని అడిగాడు. ఫేక్ మెసేజ్ చూపాడు. పెట్రోల్ పోయించుకున్నాక, రూ.3 వేలు నగదు అడిగాడు. తనకు మెసేజ్ రాలేదని, స్కానర్తో డబ్బు పంపాలని ఆపరేటర్ చెప్పారు. ఇంతలో కారులోని మరో ఇద్దరు వచ్చి ఆపరేటర్ మెడలో ఉన్న డబ్బు సంచి లాక్కున్నారు. ఆపరేటర్ సంచి పట్టుకొని వదలకుండా వారితో పెనుగులాడాడు. కారులో వెంకట కృష్ణను బలవంతంగా ఎక్కించి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో వేరేవారు అటుగా రావడంతో దుండగులు అతడిని కారులో నుంచి బయటకు నెట్టి పరారయ్యారు. ఈ పెనుగులాటలో వెంకటకృష్ణ ఫోన్ కారులో పడిపోయింది. అతడి తలకు గాయాలు అయ్యాయి. నరసరావుపేట వైద్యశాలలో అతడు చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో నకరికల్లులో కూడా ఓ బంక్లో ఇదే ముఠా రూ.5 వేలను కాజేసినట్లు సమాచారం. -
ఆకట్టుకున్న ఆవుల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. విజేతల వివరాలు.. ఒంగోలు జాతి పళ్లు కలిపిన ఆవుల విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు మొదటి స్థానం, బాపట్ల జిల్లా ఇస్రంపేటకు చెందిన తువ్వాటి బాలకృష్ణ, తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవు విజేతగా, కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య, పల్నాడు జిల్లా లింగారావుపాలెంకు చెందిన కనపర్తి సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. నాలుగు పళ్ల విభాగంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, గుంటూరులోని స్వర్ణభారతినగర్కు చెందిన నల్లమేకల సతీష్, అరండల్పేటకు చెందిన పసుపులేటి కృష్ణ ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవు, టచ్ పళ్లు(పళ్ళు కలిపిన ఆవులు) విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా చామవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠ సతీష్ ఆవు విజేతగా, పుంగనూరు జాతిలో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన అడపా లక్ష్మీనారాయణ, కపిల జాతిలో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వల్లూరి శ్రీనివాస్కు చెందిన ఆవులు విజేతలుగా నిలిచాయి. -
26 నుంచి గిత్తల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2న నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకని ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన పోటీలను నిర్వహించనున్నారు. సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆదివారం క్రీడామైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 26న టచ్ పళ్ల, 27న రెండు పళ్ల, 28న నాలుగు పళ్ల, 29న ఆరు పళ్ల, 30న న్యూ కేటగిరీ, 31న సబ్ జూనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జూనియర్స్, ఫిబ్రవరి 3న సీనియర్స్ విభాగంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 8 విభాగాలలో 9 బహుమతుల చొప్పున రైతు సోదరులకు రూ. 28 లక్షల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్రెడ్డి, గాదె కస్పాల్రెడ్డి, బొడపాటి రామకృష్ణ, ఏరువ జోజిరెడ్డి, ఓరుగంటి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, మొండెద్దు చిన్న శౌర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్రెడ్డి, ఏరువ ఫాతిమా మర్రెడ్డి, బోయపాటి జోజిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కమీషన్ ఇస్తేనే రుణం
పిడుగురాళ్లరూరల్: ఒక వైపు అక్కచెల్లెమ్మల ఆర్థికాభివద్ధికి ఆసరాగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు మరో వైపు అక్కచెల్లెమ్మలను కమీషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఒక వైపు డ్వాక్రా రుణం మంజూరైందని ఆనందపడేలోపే.. మరో వైపు కమీషన్ ఇస్తేనే రుణం చేతికొస్తుందంటూ వేధిస్తున్నారు. గురజాల నియోజవర్గంలో డ్వాక్రా అధికారులు, కూటమి నాయకుల అవినీతికి అడ్డు చెప్పలేక డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో మొత్తం 4,267 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల నిర్వహణ కోసం ప్రతి గ్రామానికీ ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున యానిమేటర్లు ఉన్నారు. ఒక్కొక్క యానిమేటర్ పరిధిలో సుమారు 20 నుంచి 40 గ్రూపులు ఉన్నాయి. యానిమేటర్లు, టీడీపీ గ్రామ నాయకులు కలిసి డ్వాక్రా సంఘాల వద్ద వాటలు తీసుకుంటున్నారు. కొంతమంది నాయకులు గ్రామంలో మేము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరి కొంతమంది నాయకులు బ్యాంకుల్లో కూర్చొని ఎవరరికి రుణం వస్తుందనే సమాచారం తెలుసుకుని వారికి మంజూరు చేయాలా వద్దా అంటూ మేనేజర్ను ఆదేశిస్తున్నారు. సకాలంలో అప్పు తీర్చినా కష్టమే.. టీడీపీ నాయకులకు కమీషన్ ఇవ్వకుంటే పొదుపు సక్రమంగా కడుతున్న, బకాయిలు లేకుండా బ్యాంక్కి ప్రతి నెలా అప్పులు చెల్లించినా రుణం మంజూరు కష్టంగా ఉంది. దీంతో కొత్త రుణం తీసుకుని చిరు వ్యాపారాలు పెట్టుకుందామనుకునే వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిజాయితీగా అప్పులు తీర్చినా ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే తొలగిస్తాం.. కమీషన్ల వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని గ్రూపు నుంచి తొలగిస్తామని యానిమేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికి సీసీ, ఏపీఎం తెర వెనుక వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి డ్వాక్రా అధికారులు, రాజకీయ నాయకుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని మహిళలకు కోరుతున్నారు. సీసీల చేతివాటం సీసీలు కొంతమంది గ్రూపుల పేర్లు చెప్పి మండల సమైక్యలో ఉండే డబ్బులను కాజేస్తున్నారు. ఆ గ్రూపులో కూడా తెలియకుండానే డబ్బులను డ్రా చేస్తున్నారు. తీరా తెలుసుకుంటే మేము డబ్బులు కడతాం మీకు ఏమీ ఇబ్బంది లేదు అంటూ ఆ గ్రూపు సభ్యులకు చెబుతున్నారు. మాకు తెలియకుండా మా గ్రూపు నుంచి ఎలా డబ్బులు తీస్తున్నారఅని గ్రూప్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా సంఘాల నుంచి తప్పుకుంటున్న మహిళలు అధికారులు, టీడీపీ నాయకుల అవినీతి కారణంగా కొంతమంది మహిళలు గ్రూపుల నుంచి వైదొలగుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సంఘాలలో కొనసాగుతూ, సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నా లోన్లు రానివ్వకుండా కూటమి నాయకులు అడ్డుపడుతుండడంతో కోనంకి గ్రామంలోనే ఇప్పటికి 8 గ్రూపులు రద్దు చేసుకోగా అదే బాటలో పయనించేందుకు మరికొన్ని గ్రూపులు సిద్ధంగా ఉన్నాయి. రుణం మంజూరు కోసం ఫైలు బ్యాంకుకి వెళ్లాలంటే టీడీపీ నాయకుల అనుమతి తప్పనిసరి. ఒక గ్రామంలో ఒక గ్రూపునకు మూడు నెలలు, ఒక గ్రూపుకు ఏడు నెలలు అవుతున్న ఫైలు పెట్టక ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కారణం ఆ గ్రూపులకు ఆ ఊరి నాయకుడు అనుమతి ఇవ్వలేదు. ఈ గ్రూపులో సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీలు. అయినా కూడా ఆ గ్రామ నాయకుడు ఆ ఫైలు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లుంది నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపుల పరిస్థితి. డ్వాక్రా మహిళలకు ఎలాంటి నిబంధనలు లేకుండా రుణాలిస్తుంటే.. ఆ రుణం సంఘాల సభ్యులకు చేరాలంటే మాత్రం యానిమేటర్ నుంచి కూటమి రాజకీయ నాయకుల వరకు చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ గ్రామంలో నాలుగు సంఘాల సభ్యులకు రుణాలు మంజూరయ్యాయి. రుణాలు బ్యాంకుల నుంచి సభ్యుల ఖాతాల్లో జమ చేయాలంటే యానిమేటర్ తీర్మానం రాసి సీసీ, ఏపీఎం సంతకాల ద్వారా అప్రూవల్ చేయించాలి. రుణం మొత్తం రూ.పది లక్షల అయితే గ్రూపు సభ్యుల నుంచి యానిమేటర్లు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరికి ముందుగా లంచమిస్తేగానీ బ్యాంకులో తీర్మానం ప్రవేశం పెట్టడం లేదు. చేసేదేమీలేక పలు సంఘాల సభ్యులు ముందుగానే నగదు ఇస్తున్నారు. -
ముగిసిన చెస్ టోర్నమెంట్
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన అండర్–15 చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో నూతి ధార్మిక ప్రథమ బహుమతి కై వశం చేసుకోగా సాయిభాస్కర అలేఖ్య, మన్నే సహస్రచౌదరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో కొల్లా భావన్ ప్రథమ, ఎ.హరిసూర్యనారాయణ ద్వితీయ, బి.ప్రజిత్ తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, డైరెక్టర్ నాగోతు సబిత, ఎండీ వి.వి.నరసయ్య, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా రవీంద్రరాజు, టోర్నమెంట్ నిర్వాహకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం గ్రామం ఎన్నెస్పీ కెనాల్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కోళ్లతోపాటు రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు ఆదివారం తెలిపారు. గ్రామాల్లో నిఘా ఉంచామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్టరీత్యా నేరమన్నారు. శావల్యాపురం: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కారుమంచి గ్రామంలో శ్రీతారకరామ కళాపరిషత్ ఆధ్వర్యంలో ద్వితీయ నాటకోత్సవాలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు నిర్వాహక కమిటీ ప్రతినిధి కూచి రామాంజినేయులు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కర్రి కనకనారాయణ కళా ప్రాంగణంలో ‘పండగొచ్చింది.. పల్లెకు రండి’ పేరుతో నాటకాలు, ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. -
కనుల పండువగా నగర సంకీర్తన
తెనాలిటౌన్: ఆధ్యాత్మిక భావనతోనే మానవ జన్మ చరితార్థమవుతుందని, ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలమని సంగీత విద్వాంసురాలు నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి అన్నారు. ధనుర్మాసం సందర్భంగా తెనాలిలో ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. మహిళలు వీధులలో భజనలు, నృత్యం చేస్తూ భక్తిని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దిశగా కృషి చేశారు. ధనుర్మాసం అనగా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం వంటిదని, ఈ రోజుల్లో దేవతలు అత్యంత ప్రీతి చెందుతారని చెప్పారు. పూజా, గానం, యజ్ఞం, ఇత్యాది విషయాలు సంపూర్ణంగా స్వీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో చిన్నమయి సంగీత శిక్షకులు ఆంజనేయశాస్త్రి, నృత్య గురువు నిర్మల రమేష్, ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, గాయని వఝుల సునీత, తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు: గంధ మహోత్సవ వేడుకలు బాపట్ల జిల్లా కొల్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో వెలసిన హజరత్ ఖాజ్వా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి పేరిట ముస్లింలు భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం జరిపారు. తొలుత స్థానిక జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ప్రత్యేకంగా అలంకరించిన జెండాను కొల్లూరు వీధుల్లో ఊరేగింపుగా తర లించారు. గంధ మహోత్సవ వేడుకలలో హిందువులు పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం కూడారై మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్స్వామి మంగళ శాసనాలతో 108 గంగాళాలతో కూడారై ప్రసాదం (పాయసం) పాత్రలను గోద రంగనాథులకు సమర్పించామని, అనంతరం పాసుర విన్నపాన్ని గావించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి గోదా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం సందర్భంగా కూడారై మహోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారని తెలిపారు. తెనాలిటౌన్: శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలోని వీఎస్సార్ కళాశాల రోడ్డులో జరుగుతున్న 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 27వ రోజు ఆదివారం వేలాది మంది భక్తులు పాల్గొని 581 ఇత్తడి గంగాళాలతో స్వామివారికి పాయస నివేదన చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నిష్టగా భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అనంతరం పాయస నివేదన చేశారు. సత్తెనపల్లి:ధనుర్మాసా న్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి రామాలయం, వేంక టేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం కూడారై ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలకు ప్రత్యేక అలంకరణ చేశారు. -
సంక్రాంతికి ఊరెళుతున్నారా..!
సత్తెనపల్లి: సంక్రాంతి సంబరాల సమయం ఆసన్నమైంది. ఇక సోమవారం నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలు సంక్రాంతి పండు గ బిజీలో ఉన్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు విధిగా తమ సొంతూళ్లకు చేరుకుంటారు. ఇందుకోసం రెండు నెలల ముందు నుంచే రైళ్లల్లో, బస్సుల్లో రిజర్వేషన్ చేయించుకుంటారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో చాలామంది సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లారు. ఇక ప్రైవేట్ సంస్థల్లో, కార్యాలయాల్లో పనిచేసే వారికి ఆదివారం సెలవు కావడంతో చాలా మంది స్వగ్రామా లకు పయనమయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నారు. అయితే ఊర్లకు వెళ్లేవారు తమ ఇంటి విషయంలో, ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే సంక్రాంతి సంతోషమయం కాగలదని, లేకుంటే ఆభరణాలు, నగదు వంటివి దొంగల పాలవుతాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు ఇలా... ● రైళ్లల్లో ప్రయాణించేవారు తమ లగేజీ బ్యాగులకు చైన్వేసి తాళం వేసుకోవాలి. ● రైల్వేస్టేషన్, బస్టాండుల్లో మంచినీళ్లకు, వాష్ రూములకు వెళ్లే సమయంలో తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో లగేజీ అప్పగించకూడదు. ● తోటి ప్రయాణికులు ఏవైనా తినుబండారాలు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి. ● బస్సులన్నీ రద్దీగా ఉంటాయి. బస్సు ఎక్కేటప్పుడు ముఖ్యంగా మహిళల మెడలో ఉండే బంగారు ఆభరణాలను దొంగలు దొంగిలిస్తారు. అందువల్ల మెడలోని నగలు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ● ప్రయాణ సమయంలో బంగారు ఆభరణాలు తక్కువగా ధరించడం మంచిది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు ఉన్నందున ఎక్కువ మొత్తంలో డబ్బులు వెంట తీసుకెళ్లకూడదు. ● షాపింగ్ చేసేటప్పుడు తమ బ్యాగులు, పర్సులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పిక్ పాకెటర్స్ ఉంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు హ్యాండ్లాక్ తప్పని సరిగా వేసుకోవాలి. సంక్రాంతికి చాలా మంది సొంత ఊళ్లకు వెళతారు. అలా వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్లన వారి ఇళ్ల పై ప్రత్యేక నిఘా ఉంచుతాం. ఎల్హెచ్ఎంఎస్ పెడతాం. సంక్రాంతికి అన్ని ప్రాంతాల్లో గస్తీ పెంచుతాం. విలువైన వస్తువులు గృహాల్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. అనుమానితుల సమాచారం అందించాలి. ప్రజల అప్రమత్తతోనే దొంగతనాల నివారణ సాధ్యం. – నరహరి నాగమల్లేశ్వరరావు, సీఐ, సత్తెనపల్లి ఇంటి వద్ద ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి... ఊరికి వెళ్లే సమయంలో ఇంటిలోని అన్ని తలుపులకు తాళాలు వేసుకోవాలి. ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారానికి వేసే తాళం నాసిరకం కాకుండా చూసుకోవాలి. తాళం వేసినట్లు కనిపించకుండా కర్టన్ వేసి ఉంచాలి. ఇరుగు, పొరుగు వారికి తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. రోజుకు ఒకటి, రెండుమార్లు తమ ఇంటి గురించి ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉండాలి. నమ్మకమైన వ్యక్తులను రాత్రి వేళల్లో ఇంటిలో పడుకునే ఏర్పాటుచేసుకోవడం సురక్షితం. బంగారు ఆభరణాలను లాకర్లో భద్రపరుచుకోవడం శ్రేయస్కరం. ప్రస్తుతం మార్కెట్లో వైఫైతో కూడిన సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటు న్నాయి. అందరి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నందున ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఫోన్కు అనుసంధానం చేసుకుంటే ఎప్పటిక ప్పుడు ఇంటిని పరిశీలించుకుంటూ ఉండవచ్చు. ఎక్కువ రోజులు ఇంటికిరాని వారైతే సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలి. -
సత్తాచాటిన పల్నాడు ఎడ్లు
యర్రగొండపాలెం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఎడ్లు సత్తా చాటాయి. మొదటి రోజు రెండు పళ్ల విభాగం ఎడ్లకు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 22 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన ఎడ్లు 3,442.4 అడుగుల బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు యర్రం రాజశేఖర్, యశ్వంత్లు రూ.50 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్ను అందుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని చుండూరుకు చెందిన ఎడ్లు 3,418.9 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు అత్తోటి శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.40 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్ అందుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కొండేపాడు గ్రామాలకు చెందిన ఎడ్లు 3,246.8 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు పొన్నెబోయిన విష్ణుభరత్ యాదవ్, చాంగంటి శ్రీనివాస చౌదరి రూ.30 వేల నగదు బహుమతిని అందుకున్నారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం రోళ్లపాడు, గుంటూరు జిల్లా లింగాయపాలెంకు చెందిన ఎడ్లు 3006.4 అడుగులు లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పేరెడ్డి మురళీ మోహన్రెడ్డి, యల్లం సాంబశివరావు రూ.25 వేలు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3004.4 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని మైలా త్రివేణి నాయుడు రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన ఎడ్లు 3 వేల అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు బెల్లం రుతిక్ చౌదరి, యువాన్ చౌదరి రూ.15 వేలు, కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీపాడు ఎడ్లు 2845 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. వాటి యజమాని బోగిరెడ్డి వీరాతేజా రెడ్డి రూ.10 వేలు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అయోధ్యనగర్, పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామాలకు చెందిన ఎడ్లు 2764.2 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు రూ.8 వేలు, పల్నాడు జిల్లా దాచేపల్లి, సత్తెనపల్లి గ్రామాలకు చెందిన ఎడ్లు 2700 అడుగులు, తెలంగాణ రాష్ట్రం ఉప్పుగుంతల మండలం వేలటూరు గ్రామానికి చెందిన ఎడ్లు 2700 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. రెండు ప్రాంతాలకు చెందిన యజమానులు యామర్తి శేలేంద్ర యాదవ్, నక్కా బలరాంక్రిష్ణ, శివరామకృష్ణలకు రూ.6 వేల నగదు బహుమతి అందచేశారు. ఈ బహుమతులతోపాటు ఎమ్మెల్యే ఎడ్ల యజమానులకు శాలువాలు కప్పి షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ జబీవుల్లా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, నాయకులు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల వీర కోటిరెడ్డి, జానకి రఘు, ఆవుల రమణారెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026పట్టించుకోని పోలీసులు మాచర్ల: స్థానిక నిత్యసహాయమాత (ఆర్సీఎం) చర్చిలో ఫాదర్ బాలస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. జర్మనీకి చెందిన క్రైస్తవులు పాల్గొన్నారు.నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయానికి నరసరావుపేటకు చెందిన కొవూరు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు ఆదివారం రూ.1.00,116లు విరాళంగా అందజేశారు.నాకు ఆరోగ్యం బాగాలేదని నా భర్త మందా సాల్మన్ పలకరించటానికి వచ్చాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామం విడిచి వేరే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి వచ్చి పలకరించి శనివారం ఉదయం ఊరి విడిచి వెళ్లిపోతుండగా టీడీపీ మనుషులు వెనుకగా వచ్చి దాడి చేశారు. మా ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. – మందా కుమారి, సాల్మన్ భార్యI -
అమానుషం: ‘మా ప్రభుత్వంలో.. మా గ్రామంలోకి వస్తావా!
పల్నాడు: గురజాలలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతల బెదిరింపులతో ఊరు విడిచి వెళ్లిపోయాడు సాల్మాన్. అయితే తాజాగా కుటుంబ సభ్యుల్ని చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు సాల్మాన్. దీన్ని అదునుగా చేసుకుని ‘నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మా గ్రామంలోకి వస్తావా’ అంటూ సాల్మన్పై దాడికి పాల్పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. -
మళ్లీ ప్రారంభోత్సవాలా!
పిడుగురాళ్ల: మేము ప్రారంభోత్సవాలు చేసిన వాటికి రంగులు వేసి మరలా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభోత్సవాలు చేయటం ఏమిటని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు. సెల్ఫీ వీడియోలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ...20 ఏళ్ల కిందట వరకు పిడుగురాళ్ల ఒక గ్రామం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని పట్టణం చేశారని తెలిపారు. 2006, 2007 నుంచి 2019 వరకు కనీసం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని, జానపాడు రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, బైపాస్ రోడ్డు పూర్తి చేశామని, సొంత ఇళ్లు లేని వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి సొంత భవనం ఉండాలనే లక్ష్యంతో రూ.20, 25 కోట్ల విలువ చేసే స్థలాన్ని సేకరించి, కోటి రూపాయలతో భవన నిర్మాణం కూడా పూర్తి చేశామని, ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, యరపతినేని శ్రీనివాసరావు కొత్తగా భవనం కట్టలేదని, ఉన్న దానికి రంగులు వేసి మున్సిపల్ మంత్రితో ప్రారంభోత్సవం చేయించేందుకు సిగ్గు ఉండాలన్నారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పట్టణాలకు సుమారు రూ.150, 200 కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొని వచ్చామని తెలిపారు. పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలు అందజేశామన్నారు. గురజాలలో పనులు ప్రారంభమయ్యాయని, దాచేపల్లిలో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. మరలా వాటికి శంకుస్థాపన చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. మేము తెచ్చినవి కాకుండా కొత్తగా ఏమైనా తెచ్చారా అంటే అది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మేము శంకుస్థాపన చేసినవి, మేము ప్రారంభోత్సవం చేసిన వాటికి రంగులు వేసి ప్రారంభోత్సవాలు చేయటం గొప్పకాదని ఆయన పేర్కొన్నారు. -
ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్రోడ్లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారిని ఆండళక్కుం మెయ్యన్గా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు చిత్రకవి శ్యాము ఆచార్యులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆండళక్కుం మెయ్యన్ అంటే ‘ఆండాళ్ (గోదాదేవి)కి మెయ్యన్’ అని అర్ధమన్నారు. నిజమైన (ప్రియమైన) వాడని అర్థమని, ఇది విష్ణువును సూచిస్తుందన్నారు. ఇది తమిళనాడులోని తిరువాదనూర్లో ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం అని, ఈ ఆలయంలోని ప్రధాన దైవమే ఆండళక్కుం మెయ్యన్ అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా శ్రీవారి సేవకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: అమరేశ్వరాలయంలోని దేవుడి సొమ్ముపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ అమరావతి మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ ఇటీవల పత్రికల్లో వస్తున్న అవినీతి వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాలకమండలి సభ్యులే అవినీతి జరిగిందని ఆరోపించినా కనీసం విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తుందన్నారు. అవినీతిపై దేవదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే విశ్వహిందూ పరిషత్ లీగల్సెల్ తరఫున న్యాయపోరాటం చేస్తామని వీహెచ్పీ మండల లీగల్సెల్ అధ్యక్షులు బి.సుబ్బారావు అన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామికి, శనివారం పండ్లతో ప్రత్యేక అలంకరణ, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలకు నిజరూపదర్శన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గుంటూరురూరల్: రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్(అఖిలభారత డ్వాక్రా బజార్) మేళాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా మారటానికి అవసరమైన నైపుణ్యాలపై యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ఈటీఐ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో అందించే వివిధ రకాల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. -
హరికి దాసులై .. సంస్కృతికి సారథులై
సత్తెనపల్లి: ధనుర్మాసం అంటేనే తెలుగువారి పండుగలకు ఆహ్వానం పలికే మాసం. దీనికి ప్రతీకగా పట్టణాల్లో, పల్లెల్లో హరిదాసుల సందడి ఉంటుంది. గలగల గజ్జెల చప్పుడు, అలరించే హరినామ సంకీర్తనలతో గ్రామాలకు సంక్రాంతి శోభ తెచ్చింది. శిరస్సుపై అక్షయపాత్ర ధరించి ఒక చేత్తో వీణ, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ సంచరించే హరిదాసులు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. వారి గానం వినిపిస్తే చాలు ప్రతి ఇంటి ముందు అతివలు బియ్యం, పండ్లు, పూలతో వేచి ఉంటారు. హరిదాసు వస్తే శిరస్సుపై ధరించిన అక్షయపాత్రలో ఆ బియ్యం పోసి సాక్షాత్తు ఆ నారాయణుడే తమ ఇంటికి వచ్చినట్లు భావించి చేతులు జోడించి నమస్క రిస్తారు. ఇదంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి ప్రతి గ్రామంలో 33 రోజులపాటు కొనసాగుతోంది. సంస్కృతీ సంప్రదాయాలను ఇనుముడింపజేసే వారి వెనుక పడే కష్టం పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కేవలం 33 రోజులు ఇలా హరిదాసులుగా తిరిగే వీరు మిగిలిన 11 నెలలపాటు సామాన్యుల్లా కాయకష్టం చేసి కడుపు నింపుకుంటారు. మోయలేని భారమైనా తరతరాల నుంచి వస్తున్న సంప్రదా యాలను కొనసాగించాలనే పట్టుదలే వీరిని హరిదాసులుగా కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు. జిల్లాలో వంద మందికి పైగా హరిదాసులు పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి మండలం కట్టావారిపాలెం, ముప్పాళ్ళ, రాజుపాలెం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారే హరిదాసులుగా కొనసాగుతున్నారు. అక్షయపాత్రదే ప్రథమ స్థానం.. కలశం లేదా అక్షయపాత్రగా పిలిచే ఆ పాత్రకు ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ పాత్రలో భిక్ష వేయడం ద్వారా నారాయణుడికి నైవేద్యం సమర్పించినట్లు భక్తులు భావిస్తారు. అదీ ధనుర్మాసంలో హరికి కొత్తగా పండిన ధాన్యాలు సమర్పించడం ద్వారా పాడిపంటలు అభివృద్ధి చెందాలని భక్తులు కోరుకుంటారు. నేను వారసత్వంగా మా తాతల కాలం నుంచి 20 ఏళ్లుగా హరిదాసుగా తిరుగుతున్నా. శ్రీమద్మారామణ గోవిందా హరి అనే హరినామమే మాకు ప్రాణం. విష్ణుమూర్తి స్వరూ పమైన హరికి దాసులుగా కొనసాగడం వల్లే మేము హరిదాసులుగా పేరు పొందాం. హరికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసం, మాఘమాసంలో హరినామ సంకీర్తనలను ప్రసరింప చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మా సంకీర్తన ప్రారంభ మవుతుంది. ఇలా 33 రోజులు హరికి దాసులుగానే జీవిస్తాం. గ్రామాల్లో కొంత మార్పు వచ్చినా ఆదరణ బాగుంది. – పెరుమాళ్లపల్లి రామాంజనేయులు, కట్టావారిపాలెం, పల్నాడు జిల్లా -
పల్నాడు
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026అక్రమ కేసులకు భయపడేది లేదుతెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ కె.మస్తాన్బాబు తెలిపారు.చిలకలూరిపేట: చంద్రబాబు ప్రభుత్వ పాలన మొత్తం ప్రతిపక్షంపై అక్రమ కేసులు, రాజకీయ కక్షలు, పోలీసుల వేధింపులతో నిండిపోయిందని మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుడు, యడ్లపాడు గ్రామానికి చెందిన బీసీ నాయకుడు రాచమంటి చింతారావుపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో యడ్లపాడు పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. సాధారణ సంఘటనకు నాన్బెయిలబుల్ సెక్షన్లు పెట్టి శనివారం చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు నాన్బెయిలబుల్ సెక్షన్లు వర్తించవని న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఆయన పట్టణంలోని మాజీ మంత్రి నివాసానికి చేరుకొని న్యాయసహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి రజిని మాట్లాడుతూ రాచమంటి చింతారావుపై అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి నాన్బెయిలబుల్ సెక్షన్లు చేర్చడం రాజకీయ దుర్మార్గానికి పరాకాష్ట అని అభివర్ణించారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, అన్యాయానికి ఎదురు దెబ్బ తప్పదని పేర్కొన్నారు. చింతారావు మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ మంత్రి విడదల రజినితో పాటు, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ లీగల్ సెల్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు పలువురు నాయకులు పాల్గొన్నారు. పెద్ద పండక్కీ I -
పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
నరసరావుపేట రూరల్: జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పెండింగ్ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకానిలోని జేఎన్టీయూ నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలను శనివారం పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులతో కలిసి ఆయన సందర్శించారు. కళాశాలలో నిలిచిపోయిన నిర్మాణాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. అధ్యాపకులు, భోధనేతర సిబ్బందితో విడివిడిగా సమావేశమయ్యారు. సౌకర్యాలపై ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. త్వరలో 80 మంది బోధనా సిబ్బంది, 88 మంది బోధనేతర సిబ్బందిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చంద్రబాబు స్వలాభం కోసమే అంజుమన్ భూముల కబ్జా
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): చంద్రబాబునాయుడు తన స్వాలాభం కోసం ముస్లిం మైనార్టీలకు చెందిన అంజుమన్ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా మండిపడ్డారు. శనివారం గుంటూరు బస్టాండ్ వద్ద గల పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 71.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వక్ఫ్బోర్డు భూములను కాపాడతామని చెప్పి.. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే ఆ భూములు ఎంతటి బడా బాబుల వద్ద ఉన్నప్పటికి వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మైనార్టీ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం : వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్కి భూదాహం పెరిగిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మైనార్టీ భూములను కాజేసే కుట్రకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమన్నారు. నారా లోకేష్ ప్రొద్బలంతోనే భూములను కాజేసీ ఇండస్ట్రీలకు అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ముస్లీం మైనార్టీలంతా ఏకమై అంజుమన్ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఉద్యమించి కలెక్టర్కు విన్నవించేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మైనార్టీల ద్రోహి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ : తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నూరి ఫాతిమా ముస్లిం, మైనార్టీల ద్రోహి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా పేర్కొన్నారు. ముస్లిం ఎమ్మెల్యే అయి ఉండి అంజుమన్ భూముల కాపాడే అంశంపై ఎంతో హేళనగా సమాధానం చెప్పడం చూస్తుంటే నసీర్ అహ్మద్ చేతకానితనం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అంజుమన్ భూముల్లో ఎమ్మెల్యే నసీర్కు స్వలాభం ఉంది కాబట్టే దానిని లాగేసుకుంటున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల 23న కలెక్టరేట్ రోడ్డులోని అంజుమన్ ఈద్గా వద్ద నుంచి మధ్యాహ్నం 2.30గంటల తరువాత కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అంతే కాకుండా భూములను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. వక్ఫ్ భూములను కాపాడతామన్న చంద్రబాబు ఇప్పుడు వాటిని కై ంకర్యం చేయాలని చూస్తున్నారు వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా -
మహారాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్టు
చీరాల: మహారాష్ట్ర రాష్ట్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ను కత్తితో బెదిరించి నగదు తీసుకుని ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న ఐదుగురు సభ్యుల దోపిడీ ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు రైలులో అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శనివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రం హింగోలి నగరం పరిధిలోని మహారాష్ట్ర మధ్యవర్తి సహకారి కో–ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ వద్ద రూ.8 లక్షలు దోపిడీ చేసి రైలులో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుండగా మహారాష్ట్ర పోలీస్శాఖ అభ్యర్థన మేరకు బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాపట్ల రైల్వేస్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీ చేయగా రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,72,700 నగదు, ఒక కత్తి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ముఠా సభ్యులను, నగదును మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్పగించనున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లాలోని బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్ల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో పదుల సంఖ్యలో పోలీసులు మోహరించారు. బాపట్లలో తప్పించుకుంటే చీరాల్లో పట్టుకునేందుకు ముందస్తుగా చీరాలలో డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఎట్టకేలకు పోలీసులకు బాపట్ల రైల్వేస్టేషన్లో ముఠా సభ్యులు చిక్కారు. పండగ సెలవుల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉన్న రైలులో నుంచి కేవలం మూడు నిమిషాల్లో నిందితులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నందుకు బాపట్ల జిల్లా పోలీసులను డీజీపీ హరీష్కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. -
మట్టి నమూనా విశ్లేషణలో సాంకేతికత కీలకం
కేసీ స్కూల్స్ తపాలా పోస్టల్ కవర్ ఆవిష్కరణ కొరిటెపాడు: గుంటూరు నగరంలోని భూసార పరీక్షా కేంద్ర ప్రయోగశాలను శనివారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ మనజీర్ జిలానీసమూన్ సందర్శించారు. ప్రయోగశాలలో మట్టి నమూనాల విశ్లేషణను పరిశీలించారు. మట్టి నమూనాల స్వీకరణ నుంచి విశ్లేషణలో స్థూల, సూష్మ పోషకాలలో 12 రకాల వివిధ అంశాలకు సంబందించి విశ్లేషణ, పరికరాల పనిచేసే విధానం, చివరగా పరీక్షా ఫలితాలను సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్లో నమోదు చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రక్రియను పూర్తిగా విపులంగా పరిశీలించారు. భూసార ఆరోగ్య పత్రం (సాయిల్ హెల్త్ కార్డు)ను పరిశీలించి, మట్టి పరీక్షా డేటా ఆధారంగా రైతులకు పంటల వారీగా ఎరువుల సిఫార్సులు ఏ విధంగా అందిస్తున్నారనేది వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసార పరీక్ష కేంద్రంల ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు గుంటూరు, ఎన్టిఆర్ జిల్లా ప్రయోగశాలల కొత్త భవనాల నిర్మాణానికి, తొమ్మిది కొత్త జిల్లాల్లోని భవనాల మరమ్మతులకు భూ ఆరోగ్య భూసార పథకం కింద మంజూరైన రూ.3.18 కోట్ల నిధులను సత్వరమే వినియోగించాలని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మేడికొండూరు: మేడికొండూరులో పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మేడికొండూరు మండలం విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకంపై గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈకేవైసీ పూర్తి అయ్యాకే పాసు పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 35,690 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, మేడికొండూరు తహసీల్దార్ గాలం రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు. మాదల (ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ శనివారం తెలిపారు. అందిన సమాచారం మేరకు... పొలాల్లో పేకాట అడుతున్నారనే విషయం తెలియడంతో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్ఐ వెళ్లి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేవారు. వారి నుంచి రూ. మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని కొండవీటి కమిటీ స్కూల్స్ (కేసీ స్కూల్స్) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక తపాలా పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ విద్యాభివర్థనీ సంఘంను 1925 డిసెంబరు 25న 1925న స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. ఈ సంస్థ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 11వ తేదీన ఆదివారం శత వసంతాల పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తపాలా కవర్ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు కేసీ స్కూల్స్ కరస్పాండెంట్ గాదె సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, మాదిరెడ్డి హనుమారెడ్డి, కాశింరెడ్డి పాల్గొన్నారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. క్రోసూరు: మండలంలోని హసనాబాద్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన విద్యార్థి షేక్ ముజావర్ ఖలీల్ (11) అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అతడి ముగ్గురు స్నేహితులే అసలు నిందితులని తేలినట్లు ఎస్ఐ పి.రవిబాబు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... స్నేహితులు ముగ్గురు రేగుపండ్లు కోసం వెళ్లేటప్పుడు ముందుగానే కర్ర, చాకు వెంట తీసుకెళ్లారని తెలిపారు. ఆ సమయంలో పాత విషయాలు, తిట్టుకున్నవి, అనుకున్న మాటలు లేవనెత్తి ముగ్గురు కలిసి హత్య చేసినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. వీరు గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరిచాక విజయవాడ జువైనల్ షెల్టర్ హోంకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అవసరమైతేనే యూరియా కొనాలి
నకరికల్లు: యూరియాను అవసరం మేరకే కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు రైతులకు సూచించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలోని యూరియా, ఇతర ఎరువుల నిల్వలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఈ పంట నమోదును చేయించాలన్నారు. 40 టన్నుల యూరియా పంపిణీకి పలు సూచనలు చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ పురోగతిపై సమీక్షించారు. ఎంఏఓ కె.దేవదాసు, పీఏసీఎస్ అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకట్రావు, కార్యదర్శి కె.ప్రసాద్, డైరెక్టర్ పి.వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై.ప్రభాకర్, పి.పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోపాటు క్రీడాస్ఫూర్తి అలవరుచుకోవాలి చోడవరం సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైజాగ్ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ బలగ గీతాలక్ష్మి అన్నారు. శనివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో వికాస్నగర్లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. వీటిలో త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, రిలే రేస్ పోటీలు జరుగుతాయని, వీటితో పాటు భాష్యం క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జోనల్ జట్లు పాల్గొంటాయన్నారు. తొలుత భాష్యం ఒలంపస్, భాష్యం జెండాలను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ ట్రోఫీలను అందజేశారు. వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయండి
నరసరావుపేట: జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డులలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కోరారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు పార్టీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన సుధాకర్బాబు మాట్లాడుతూ వచ్చే నెల 18వ తేదీలోగా ప్రతి రెండు గ్రామాలకు ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వలన స్థానికంగా నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ● పార్టీ పల్నాడు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు పూనూరు గౌతమ్రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కందుల రవీంద్రారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, చిలకలూరిపేట సమన్వయకర్త విడదల రజిని, పెదకూరపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా డాక్టర్ల విభాగ అధ్యక్షులు డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు పాల్గొన్నారు. జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు టీజేఆర్ సుధాకర్బాబు -
గంజాయి కేసుల్లో 11 మంది అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం అంకమ్మనగర్ ఇరిగేషన్ విభాగం కార్యాలయం వెనుక ఖాళీస్థలంలో నగరంపాలెం పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. అదే రోజు రాత్రి లాల్పురం డొంకరోడ్డులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని ఖాళీ స్థలంలోనూ తనిఖీలు కొనసాగాయన్నారు. ఈ క్రమంలో వారి వద్ద గంజాయి గుర్తించారన్నారు. దీంతో మొదటి కేసులో కొరిటెపాడు నాయుడుపేట మూడో వీధిలో ఉంటున్న మేడూరి హేమసాయిచంద్ అలియాస్ చందు, గౌతమీనగర్ మూడో వీధికి చెందిన ముత్తుకూరి సాయిరామ్, తన్నీరు నాగసాయి, హనుమయ్యనగర్ రెండు, మూడు వీధుల్లో ఉంటున్న మేళం ఏసుమూర్తి, షేక్.జానీబాషా, జొన్నలగడ్డ యువరాజుని రెండో కేసులో శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డులో ఉంటున్న పాలేటి సాల్మన్రాజు, నగరంపాలెం ఒకటో వీధికి చెందిన గుంజి హేమంత్రాజు, శ్రీనివాసరావుపేట 12వ వీధికి చెందిన సుంకర వంశీకృష్ణ, పట్టాభిపురం రెండో వీధిలో ఉంటున్న పాముల రఘురామ్, అడపాబజార్కు చెందిన షేక్ నాగుల్మీరాలను అరెస్ట్ చేశామన్నారు. ఆయా కేసుల్లో 4.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులు చేధించిన నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు పి.రాంబాబు, రామచంద్రరెడ్డి, హెచ్సీ ఎం.దాసు, కానిస్టేబుళ్లు ఎస్కే.జాన్సైదా, శ్రీనివాసరావు, సిహెచ్.ఉదయచంద్, పి.గంగరాజు, ఎస్కె.షకీల్అహ్మద్, టాస్క్ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. మీడియా సమావేశంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పాల్గొన్నారు. పట్టుబడిన వారి వయస్సు 30 ఏళ్లలోపే.. వీరిలో ఏడుగురు పాత నేరస్తులు 4.4 కిలోల గంజాయి స్వాధీనం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి -
ప్రారంభమైన నాటకోత్సవాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : కొత్త ప్రయోగాలకు వేదికగా గుంటూరు కళాపరిషత్ 28 ఏళ్లుగా సాగుతుందని కళాపరిషత్ అధ్యక్షుడు పీవీ మలికార్జునరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో మూడు రోజులపాటు జరగనున్న గుంటూరు కళాపరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలను శుక్రవారం అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన పీవీ.మల్లికార్జునరావు మాట్లాడుతూ కళాపరిషత్ సమయపాలనతో ముందుకెళ్తుందని అన్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, కార్యదర్శి అమ్మిశెట్టి శివలు మాట్లాడారు. సభను కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణారావు, పరిషత్ ఉపాధ్యక్షులు ధనియాల గాంధీ, కార్యదర్శి అమ్మిశెట్టి శివ, కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ, ఉపాధ్యక్షులు నాయుడు గోపి, కార్యదర్శి గుమ్మడి నాగేశ్వరరావు పర్యవేక్షించారు. మాయాజాలం నాటిక శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం(బొరివంక) ఆధ్వర్యంలో ప్రదర్శించగా, ఈ నాటికకు సలీం మూలకథ సమర్పించగా, కేకేఎల్ స్వామి దర్శకత్వం వహించారు. విజయవాడ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మమ్మల్నీ బతకనీయ్యండి నాటికను ప్రదర్శించగా, సుఖమంచి కోటేశ్వరరావు రచించి దర్శకత్వం వహించారు. -
ఏఎన్యూలో ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం
ఏఎన్యూ(పెదకాకాని): ఇండోనేషియాకు చెందిన నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఏజెన్సీ(బీఆర్ఐఎన్) లోని రీసెర్చ్ సెంటర్ ఫర్ బయోమాస్–బయోప్రొడక్ట్స్కు చెందిన ప్రొఫెసర్ విద్యా ఫాత్రియాసారి, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, అమరావతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.రంగభాసియం శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్ మెంట్) విధానాలు, బయోవ్యర్థ పదార్థాల సమర్థ వినియోగం, వాటి ద్వారా విలువైన ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బయోవ్యర్థాలను సుస్థిరంగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక విలువను ఎలా సృష్టించవచ్చో ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం అతిథి బృందం ఎంఎస్సీ ఫారెస్ట్రీ విభాగం సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. మల్లికార్జున సమన్వయంతో నిర్వహించారు. -
రబీ సీజన్కు సరిపడా యూరియా
జేడీఏ పద్మావతి కొరిటెపాడు(గుంటూరు): రబీ సీజన్లో గుంటూరు జిల్లాలో అన్ని పంటలకు 55,840 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం.ద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి జిల్లాకు 39,422 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే 44,127 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి మరో 8,727 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. రాబోయే 21 రోజులకుగాను 11,075 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12,905 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్కెటింగ్ గోదాములు, రిటైల్, హోల్సేల్ కంపెనీ గోదాముల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రబీ సీజన్లో ఇప్పటికే 31,056 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించినట్లు పేర్కొన్నారు. ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి ఈ–క్రాప్ నమోదు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం.పద్మావతి ఆదేశించారు. స్థానిక కృషి భవన్లో ఏర్పాటు చేసిన గుంటూరు సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల గ్రామ వ్యవసాయ అధికారుల(వీఏఓ)కు శుక్రవారం శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిత్యం రైతులతో సంబంధాలు ఏర్పరచుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రావు రబీ పంటలైన మొక్కజొన్న, శనగ, జొన్న పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, రైతులు అధిక దిగుబడులు సాధించేలా చూడాలని కోరారు. అధిక ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతం కోల్పోవడంతో పాటు, చీడపీడలు ఏర్పడతాయన్నారు. గుంటూరు ఏడీఏ ఎన్.మోహన్రావు మాట్లాడుతూ రైతులు సాగు చేసిన ప్రతి పంటను విధిగా ఈ–పంటలో నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ఆదేశాల మేరకు యూరియా బస్తా రూ.266.50లకు మాత్రమే విక్రయించేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏవో బి.కిషోర్, ఫిరంగిపురం ఏఓ జె.వాసంతి, పెదకాకాని ఏఓ రమణ కుమార్, మేడికొండూరు ఏఓ లక్ష్మి, పత్తిపాడు ఏఓ సుగుణ బేగం, వట్టిచెరుకూరు ఏఓ సునీత, ఏడు మండలాల ఎంఈఓలు, వీఏఓలు, వీహెచ్ఓలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నర్సుల సంఘం కేలండర్ ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా క్యాలెండర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెల్లంపల్లి పద్మ, జిల్లా కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.ఆషాలత, పుల్లగూర సునీత, జి.అరుణ, ఎ.భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్ : గంజాయి అమ్ముతూ పట్టుబడిన మహిళకు న్యాయస్థనం మూడు సంవత్సరాలు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. శుక్రవారం తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నులకపేటకు చెందిన చావల జ్యోతి గత ఏడాది మే 26వ తేదీన గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందగా అప్పటి ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మహిళను అదుపులోకి తీసుకుని మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చార్జిషీటు దాఖలు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం మహిళకు వెయ్యి రూపాయలు జరిమానా, మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. -
శతాబ్ది వేడుకలకు ముస్తాబు
చేబ్రోలు: ఇక్కడ విద్యాబుద్ధులను నేర్చుకొన్న ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మరికొందరు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ విద్యాభివర్థని సంఘం, కేసీ స్కూల్స్ ప్రత్యేకత. ఈ నెల 11వ తేదీన శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న కొండవీటి కమిటీ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. అవతరణ ఇలా... శ్రీ విద్యాభివర్థని సంఘాన్ని మొదట తొమ్మిది మంది గ్రామపెద్దలతో గాదె హనుమారెడ్డి ప్రదానోపాధ్యాయులుగా 1925 డిసెంబర్17వ తేదీన ఏర్పాటు చేశారు. అలెగ్జాండ్రియా హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్గా 1925 డిసెంబర్ 25వ తేదీన ప్రాథమిక పాఠశాల స్థాపించారు. 1930లో మల్లాది గౌరీనాథశాస్త్రి హెచ్ఎంగా వ్యవహరించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రి బెజవాడ గోపాలరెడ్డి పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకం నేటికీ ఉంది. 1941లో 26 మంది సభ్యులతో ఈ సంఘం రిజిస్టర్బాడీగా ఏర్పాటైంది. 1954 సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాలగా మార్చారు. సమరయోధుడు కొత్తరెడ్డిపాలెంకు చెందిన గాదె చిన్నప్పరెడ్డి ౖసైసెరా చిన్నప్పరెడ్డిగా పేరుగాంచారు. వీరి వంశస్థులు ఇప్పటికీ కరస్పాండెంట్లుగా కొనసాగుతున్నారు. తర్వాత రెండు పాఠశాలలను నిర్వహించటం ప్రారంభించారు. జాతీయస్థాయిలో గుర్తింపు చల్లా రామకృష్ణారెడ్డి కరస్పాండెంట్గా ఉన్న కాలంలో సుమారు 14 ఎకరాలను ఆటస్థలానికి సమకూర్చారు. 1960– 78 మధ్య ఆయన హెచ్ఎంగా ఉన్న కాలంలో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చింది. 1975లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు ఎంపిక అయ్యారు. తరగతి గదులను మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు పలువురు వాలీబాల్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డిజిటల్ రూం, అందులో అమర్చబడిన డిజిటల్ పరికరాలను ముఖ్య అతిథులు ప్రారంభించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రభుత్వ పరీక్షల కార్యాలయం రిటైర్డు డైరక్టర్ ఆర్ సురేందర్రెడ్డిలు సావనీర్ ఆవిష్కరించున్నారు. -
హత్యాయత్నం కేసులో జైలు శిక్ష
చీరాల రూరల్: హత్యాయత్నం కేసులో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో శుక్రవారం న్యాయమూర్తి ముద్దాయికి శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఈపురుపాలెం ఎస్సై చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ అనేవ్యక్తిని అదే గ్రామానికి చెందిన షేక్ వధూద్ అనేవ్యక్తి 17 జనవరి 2020న ఎన్నికల విషయమై మాట్లాడుతూ పాత గొడవలు మనసులో పెట్టుకుని తలవెనుక భాగంలో కూల్డ్రింగ్ సీసాతో కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితుడు మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. సుధ కేసును క్షుణ్ణంగా విచారించారు. నిందితునిపై ఉన్న నేరారోపణలను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్ కుమార్ రాజాలు సాక్షుల ద్వారా నిరూపించారు. దీంతో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడాదిపాటు సాధారణ శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా విధించారు. సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి నిందితునికి శిక్ష పడేటట్లు చేసిన కోర్టు కానిస్టేబుల్ కుమార్ రాజాను ఎస్పీ జి. ఉమా మహేశ్వర్ అభినందంచినట్లు ఎస్సై తెలిపారు. -
మాదక ద్రవ్యాల నివారణపై న్యాయ విజ్ఞాన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జాతీయ యువజన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులకు శుక్రవారం గుంటూరులో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వికసిత భారత్ వైపు అడుగులు వేయించే దిశగా అవగాహనా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత సమాజంలో 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు స్కూల్, కాలేజీల్లో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ప్రజలకు, విద్యార్థులకు మరింతగా అవగాహన కలిగించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ మన సమాజంలో మాదక ద్రవ్యాలు చాప కింద నీరులా ప్రమాదకరంగా మారుతున్నాయని, మాదక ద్రవ్యాల నివారణకు ఇలాంటి అవగాహనా సదస్సులు మరింతగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు, ఎల్ఏడీసీ చీఫ్ సురేష్ బాబు, డెప్యూటీ ఎస్బీఏ ఝాన్సీలు యువతలో మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కలిగించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ప్రారంభించిన ర్యాలీ మెడికల్ కాలేజీ రోడ్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి జిల్లా కోర్టు వరకు కొనసాగింది. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు వడ్డేశ్వరం బాలిక ఎంపిక
తాడేపల్లి రూరల్ ః జాతీయస్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బాలిక ఎంపికయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత డిసెంబర్నెలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలలో గుంటూరు జిల్లా బాలికల జట్టు ప్రథమ స్ధానం సాధించిందని, ఈ జట్టులో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిహెచ్. నవీన జాతీయ జట్టుకు ఎంపికయ్యిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీమ్ కెప్టెన్గా నవీన ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. -
జిల్లా కోర్టు ఆవరణలో యువజనోత్సవాలు
గుంటూరు లీగల్: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వీరికి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత ఆశయాలను వివరించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రచించిన సంక్రాంతి పాట సీడీని విడుదల చేశారు. ఈ సభకు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్య నారాయణ అధ్యక్షత వహించారు. -
సేవలు..ఢమాల్..!
సత్తెనపల్లి: ప్రజల ముంగిటకే పరిపాలన చేరువ చేయాలనే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమవుతోంది. సచివాలయాల్లో ప్రజలకు అవసరమైన సుమారు 400 రకాలకు పైగా సేవలు గతంలో అందేవి. సుమారు 10 విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. వేలాదిమందికి ఈ వ్యవస్థ ఆవిర్భావంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. నాడు కళకళలాడిన గ్రామ, వార్డు సచివాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు చంద్రబాబు పాలనలో నిర్వీర్యం అయ్యాయి. సచివాలయ ఉద్యోగులను బాబు సర్కార్ చులకన భావనతో చూడటమే కాక వారిపై అధిక పని ఒత్తిడి పెడుతోంది. గ్రామాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళుతున్న ప్రజలకు న్యాయం జరగడం లేదు. ప్రజలు సచివాలయాలకు ఏ సమయంలో వెళ్లినా ఉద్యోగులు ఫీల్డ్కు వెళ్లారనే సమాధానం వస్తోంది. సచివాలయాల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సర్వేలు, డిప్యుటేషన్లు, అనుబంధ శాఖల పనుల్లో నిమగ్నం అవుతు న్నారు. ఉన్న వారిలో కొంత మంది మాత్రమే చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 416 గ్రామసచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 122 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ,వార్డు సచివాలయాల్లో 4,518 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు హాజరైన దాఖలాలు కనిపించడం లేదు. -
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
నరసరావుపేట: కోడి పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు హెచ్చరించారు. సంక్రాంతి పర్వదినం సందర్బంగా కోడి పందేలు నివారణపై శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందేలు జరిగే అవకాశాలు ఉన్న ప్రదేశాలను గుర్తించాలన్నారు. శనివారం అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు. గత ఏడాది నమోదైన కేసులు, చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నారు. మండల స్థాయి కమిటీలను వెంటనే రెవెన్యూ, పోలీస్, పశు సంవర్థక శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో ఏర్పాటు చేయాలన్నారు. అన్నీ గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. పందేలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. చట్టప్రకారం చర్యలు చేపట్టి, బైండోవర్ చేయాలని పేర్కొన్నారు. పోలీస్స్టేషన్ల పరిధిలో బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో గణతంత్ర వేడుకలు జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలకు సకాలంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాసు పుస్తకాల పంపిణీ 11వ తేదీలోపు పూర్తి చేయాలి జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు 11వ తేదీలోపు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రెవెన్యూ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
దేవాలయాల్లో చోరీ
నరసరావుపేటటౌన్: రెండు దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి హూండీలలో నగదు అపహరించుకు వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో వెలుగు చూసింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురంలో బ్రహ్మంగారి గుడి, రాములవారి దేవస్థానం పక్కపక్కనే ఉంటాయి. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు రాములవారి గుడి గేటు తాళాలు పగలగొట్టి హుండీ అపహరించాడు. అందులోని నగదు తీసుకొని హుండీని గుడి వెనుక ప్రాంతంలో పడవేశాడు. అదే విధంగా బ్రహ్మంగారి గుడిలోని హుండీ పగలగొట్టి అందులో నగదు తీసుకున్నాడు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త హనుమాన్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్టీం ఘటనా స్థలానికి చేరుకొని హుండీపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. రెండు హుండీల్లో నగదు అపహరణ -
ఉరకండి..ఉరకండి
రద్దీగా రైళ్లు నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట రైల్వేస్టేషన్లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు రాకపోకలతో పాటు ప్రయాణికుల సంఖ్య పెరిగినా అందుకు తగ్గట్టు సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ప్లాట్ఫారమ్ కూడా లేని పరిస్థితి. దీంతో పాటు కోచ్ ఇండికేషన్ బోర్డులు లేక రైలు ఎక్కాలంటే ట్రాక్ పక్కనే ఇరుకుగా ఉన్న దారిలో ప్రయాణికులు ఉరుకులు, పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. నరసరావుపేట నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగింది. గుంటూరు–గుంతకల్లు మద్య డబ్లింగ్ పనులు పూర్తికావడం, సరైన సమయంలో రాకపోకలు సాగిస్తుండటంతో రైలులో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు– తిరుపతి మధ్య ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ రైలుతో నరసరావుపేట రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా మారింది. నరసరావుపేట మీదుగా ప్రతి రోజు 11 ఎక్స్ప్రెస్ రైళ్లుతో పాటు వారంలో కొన్ని రోజులపాటు నడిచే రైళ్లు ప్రయాణిస్తున్నాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం స్టేషన్లో అనేక పనులు జరుగుతున్నాయి. రెండవ నెంబరు ప్లాట్ఫారమ్ నిర్మాణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ప్రయాణికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే కోచ్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. – సయ్యద్ బాజాన్, స్టేషన్మాస్టర్, నరసరావుపేట నరసరావుపేట మీదుగా నడిచే రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంటుంది. తెనాలి– మార్కాపురం డేమో రైలు ప్రతి రోజు నడుపుతున్నారు. స్థానికంగా రాకపోకలు సాగించే వారికి ఇదే చాల ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు గుంటూరు–ఔరంగాబాద్, గుంటూరు–డోన్, విజయవాడ–హుబ్లీ, గుంటూరు–తిరుపతి, గుంటూరు–కాచిగూడ, మచిలీపట్నం–యశ్వంత్పూర్(కొండవీడు ఎక్స్ప్రెస్), హోరా–వాస్కోడిగామా(అమరావతి ఎక్స్ప్రెస్), భవనేశ్వర్–బెంగళూరు, నర్సాపూర్–ధర్మవరం ఎక్స్ప్రెస్లు ఈ మార్గంలో నిత్యం రాకపోలు సాగిస్తున్నాయి. వీటితో పాటు వారంలో ఒక రోజు ప్రయాణించే మరో ఐదు రైళ్లు ఉన్నాయి. నరసరావుపేట నుంచి బెంగళూరు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు నరసరావుపేట కేంద్రంగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. -
కలెక్టరేట్లో అరకు కాఫీ స్టాల్
నరసరావుపేట:ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీ అరోమా ను జిల్లా ప్రజలకు పరిచయం చేస్తూ పల్నాడు జిల్లా కలెక్టరేట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభమైంది. శుక్రవారం కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కలెక్టరేట్ ప్రాంగణం ఎదుట ఏర్పాటుచేసిన అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద స్టేట్ బ్యాంకు ఇండియా బ్యాంకు (ఎస్బీఐ) రుణ సహాయం ద్వారా స్టాల్ను దక్కించుకున్న లబ్ధిదారురాలు గోనుగుంట్ల భార్గవిని కలెక్టర్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుకోవాలని ఎంపీ లావు అన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి, టీడీపీ, జనసేన నాయకులు ఎన్.రాము, సయ్యద్ జిలాని ఉన్నారు. -
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లోగల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీవారిని రాయిగరుడుడుగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు మాట్లాడుతూ రాయిగరుడు విశిష్టతను వివరించారు. రేపు ఉపకార వేతనాలు పంపిణీ గుంటూరు ఎడ్యుకేషన్: కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.61 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య తెలిపారు. శుక్రవారం గుంటూరులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయ, సహకారాలను అందించే ఆశయంతో 2003లో సొసైటీని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 11న కేఎల్పీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ, పీజీ చదువుతున్న 440 మంది విద్యార్థులకు రూ.61 లక్షలు చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా రానున్నారని చెప్పారు. సొసైటీకి రూ.కోటి విరాళాన్ని అందజేసిన కెనడాకు చెందిన ముఖ్యదాత డాక్టర్ పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, బొప్పన ద్వారకాప్రసాద్, వడ్లమూడి గోవర్ధనరావు, నామినేని కోటేశ్వరరావు, రామారావు పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం అభివృద్ధికి రూ. 14 కోట్లు మంజూరు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు నగరంలోని ప్రఖ్యాత బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం గతంలో రూ.170 కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద మల్టీ–స్పోట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు దశల వారీగా నిధులను సేకరిస్తామని తెలిపారు. ఈ నిధులతో విశాలమైన స్టేడియం అభివృద్ధి చెంది ఔత్సాహిక క్రీడాకారులు అందుబాటులోకి వస్తారన్నారు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,519 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 267, పశ్చిమ కాలువకు 60, నిజాంపట్నం కాలువకు 31, కొమ్మూరు కాలువకు 1,360 క్యూసెక్కులు విడుదల చేశారు. -
పల్నాడు
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026అమ్మవారికి సారె సమర్పణ నరసరావుపేట ఈస్ట్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాతూరులోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లకు భక్తులు సారె సమర్పించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1300, గరిష్ట ధర రూ.2900, మోడల్ ధర రూ.2000 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 557.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 49,902 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. I -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్స్కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘సరస్’లో ఆకలి కేకలు
గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పలువురు ఆవేదన గుంటూరు: నగరంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సరస్ అఖిల భారత డ్వాక్రాబజార్లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్నామని స్టాల్స్లోని సిబ్బంది, ప్రాంగణంలో పనులు చేస్తున్న వారు వాపోతున్నారు. సిబ్బందికి సరిపడా భోజనాలను వండాలని కోరుతున్నారు. ప్రాంగణంలో సుమారు 300కు పైగా స్టాల్స్, వాటిలో ప్రతి షాప్కు కనీసం ఒకరిద్దరు, అదేవిధంగా పర్యవేక్షణకుగానూ మరో 300 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ప్రాంగణం పరిశుభ్రత నిర్వహణకు మరో 300 మంది ఉన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిలో కూడా 400 మందిని అధికారులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పూటకు కనీసం 700 నుంచి వెయ్యి మందికి భోజన వనతి కల్పించాల్సి ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వసతులు ఎలా ఉన్నా, మధ్యాహ్నం సమయంలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో వసతులు కల్పించటంలో యంత్రాంగం విఫలమైందని సిబ్బంది చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో యంత్రాంగం ఒకటి రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తుండటం, టోకెన్లను సక్రమంగా పంపకపోవటం, ఒకొక్కసారి భోజనం అయిపోయి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కూర ఉంటే భోజనం లేక, భోజనం ఉంటే కూర సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దాదాపు మరో పది రోజులపాటు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంలో భోజనాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవటంతో మున్ముందు ఇబ్బందేనని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఇలా ఉంటే ఎలా అని సిబ్బంది పెదవివిరుస్తున్నారు. -
స్కౌట్ శిక్షణతో సేవాభావం పెంపు
తాడికొండ: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, పీఎంసీ పాఠశాలల్లో మహిళ ఉపాధ్యాయులకు గైడ్ కెప్టెన్, ఏడు రోజుల బేసిక్, అడ్వాన్స్ కోర్స్ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు జిల్లా సెక్రటరీ ఎం.ఏడుకొండలు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణకు హాజరైన వందమంది మహిళ ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో స్కౌట్ ద్వారా సేవా భావాన్ని దేశభక్తిని క్రమశిక్షణ పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో తగ్గుతున్న నైతిక విలువలను పెంపొందించడానికి స్కౌట్ ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 20 నుంచి పీఎం శ్రీ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ బాల బాలికలకు ఐదు రోజుల ద్వితీయ సోపానం శిక్షణ కార్యక్రమం డివిజన్లవారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేసి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో 66మంది బేసిక్ 34 మంది అడ్వాన్స్ కోర్సుకు హాజరయ్యారని కోర్సు లీడర్ ఎస్ఓటీ ఉమాదేవి తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కామాక్షి, రిసోర్స్ పర్సన్స్ మహాదేవమ్మ, శకుంతల, గిరిజాకుమారి, వర కమలాదేవి, ఎస్ఓసీ శ్రీనివాసరావు, స్కౌట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రకృతి క్షేత్రాలను సందర్శించిన ఢిల్లీ బృందం
బెల్లంకొండ: మండలంలోని పలు గ్రామాలలో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, కార్యక్రమాలను న్యూఢిల్లీకి చెందిన వేవర్లి స్ట్రీట్ ఫౌండేషన్ బృందం గురువారం సందర్శించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్, సంస్థ ప్రతినిధులు జర్నైల్సింగ్, రోహిణి చతుర్వేదిలు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారితో కలిసి వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను, క్షేత్రాలను పరిశీలన చేశారు. మొదట మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలోని బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్ను సందర్శించి, జిల్లా వ్యాప్తంగా రైతులకు బయో ఇన్పుట్స్ సరఫరా చేస్తున్న రైతులు నరసింహారావు, సావిత్రిలను అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అమలవుతున్న ఏనీ టైమ్ మనీ మోడల్, న్యూట్రి గార్డెన్, సూర్య మండలం మోడల్, కమ్యూనిటీ న్యూట్రి గార్డెన్లను పరిశీలించారు. బెల్లంకొండ రైతు సేవా కేంద్రంను సందర్శించిన బృందం, రైతులతో పాటు సిబ్బందితో ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఆరోగ్యం–పోషణ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది మురళి, తారా, వి.వాణిశ్రీ, ముఖేష్, స్థానిక సిబ్బంది అనంతలక్ష్మి, సైదయ్య, అంజలి రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నిబంధనలకు లోబడి విక్రయాలు జరపాలి సత్తెనపల్లి: ఎరువుల డీలర్ల ద్వారా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎరువుల విక్రయాలు జరపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎమ్.జగ్గారావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు మండలాలకు సంబంధించిన ఎరువుల డీలర్లకు ఎరువుల నియంత్రణ చట్టంపై గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి సత్తెనపల్లి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రవిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ఎరువుల కంపెనీలకు సంబంధించిన ఫారం ‘0’లను ఎరువుల లైసెనన్స్లో పొందుపరచుకోవాలన్నారు. రైతులకు ఎరువుల అమ్మకాలు జరిపినప్పుడు తప్పనిసరిగా రైతులకు బిల్లును ఇవ్వా లన్నారు. యూరియా లభ్యత వివరాలు కూడా డిస్ప్లే బోర్డు నందు పొందుపరచా లని, గరిష్ట చిల్లఽర ధరకు మించి ఎరువులు అమ్మకాలు జరపరాదన్నారు. ఎరువుల అమ్మకాలు జరిపిన వెంటనే ఈ–పాస్ మిషన్లో కూడా అమ్మకాలు పూర్తి చేయాల న్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సత్తెనపల్లి, ముప్పాల్ల, పెదకూరపాడు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు బి సుబ్బారెడ్డి, ఎస్ శ్రీధర్రెడ్డి, కృష్ణయ్య, సంహిత సాయిల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, మూడు మండలాల ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. -
రూ.60.87 కోట్లకు వాహన డీలరు ఐపీ
302 మందికి నోటీసులు.. బాధితుల గగ్గోలు నరసరావుపేట టౌన్ : ప్రముఖ ద్విచక్ర వాహన డీలరు ఐపీ నోటీసులు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రూ.60.87 కోట్లకు దివాళా తీసినట్లు కోర్టు నుంచి ఆయన నోటీసులు పంపడంతో వాటిని అందుకున్న బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వివరాలివీ.. యర్రంశెట్టి బాబ్జి, యర్రంశెట్టి రాము సోదరులు. రావిపాడు రోడ్డులో వీరు ద్విచక్ర వాహన షోరూం నిర్వహించారు. కొన్నేళ్లుగా నమ్మకంగా వ్యాపారం చేస్తూ అప్పులు చేశారు. వడ్డీలు చెల్లించటం నిలిపివేయడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట కుటుంబంతో సహా వీరిరువురూ అజ్ఞాతంలోకి వెళ్లారు. వ్యాపారంలో నష్టాలు చూపి ఐపీ దాఖలు చేశారు. నాలుగు రోజులుగా ఒకొక్కరికి ఐపీ నోటీసులు అందుతున్నాయి. దీంతో.. బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 302 మంది వద్ద అప్పుగా రూ.60,87,00,000 తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. అవసరానికి ఉపయోగపడతాయని వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఐపీ దాఖలుతో ఇక రావని తెలిసి వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగురు అరెస్టు మాచవరం: మండలంలోని సింగరాయపాలెం తండా శివారులోని సింగరుట్ల కొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. నిందితులకు సంబంధించిన నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆలయ పూజారి అడుసుమల్లి శరత్బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దుర్గి: దుర్గికి చెందిన వ్యక్తి అడిగొప్పల బస్టాండ్ సెంటర్లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గికి చెందిన గొర్రెబోయిన నాసరయ్య (50) మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడిగొప్పల బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తూ వాహనం అదుపుతప్పి కిందపడటంతో బైకు పై వెనుక కూర్చున్న నాసరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహానికి మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు. గుంటూరు మెడికల్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ నాయక్ గురువారం గుంటూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యునికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కళాశాల సిబ్బందిని పరిచయం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడి ఆసుపత్రిలో ఏఏ సౌకర్యాలు వున్నాయి, ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం అని అడిగి తెలుసుకున్నారు. జీజీహేచ్లో ట్రాన్స్ ప్లాంట్ థియేటర్, స్టాఫ్ని నియమించాలని జీజీహేచ్ సూపరింటెండెంట్ కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీ , పీహెచ్సీలు, స్కూల్స్, హాస్టల్ సందర్శించి అవసరమైన సౌకర్యాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కమిషన్ సభ్యులు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ మీకు ఏమైనా సమస్యలు వుంటే చెప్పవచ్చని, లేదా లిఖిత పూర్వకంగా తెలియజేసిన కమిషన్ పరిష్కరిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎస్టీ కమిషన్ – సమస్యలు, రోస్టర్ పాయింట్ సమస్యలు, స్కూల్స్, కాలేజీలలో ఏమైనా సమస్యలు వుంటే ఎస్టీ కమిషన్ కు అందించాలన్నారు. షెడ్యుల్ జాతులకు ఏమైనా న్యాయం జరుగకపోతే ఇరు పార్టీలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కోర్టులలో సత్వర న్యాయం జరగడం లేదని, కమిషన్ను ఆశ్రయిస్తున్నారన్నారు. సమాజం కోసం కమిషన్ పని చేస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. మెడికల్ కళాశాల ఎస్టీ విద్యార్దులకు లైజనింగ్ ఆఫీసర్, అసోసియేషన్ లు వుంటే గ్రీవెన్స్ను వాళ్ళే నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. అనంతరం విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకుల నుంచి వినతులను స్వీకరించారు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీధర్, కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఖాతా ఇస్తే కటకటాలే!
కొద్దిపాటి కమీషన్ కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఎందరో విలవిలసాక్షి, నరసరావుపేట: సత్తెనపల్లికి చెందిన నరేష్ అనే యువకుడు ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గతంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నప్పుడు ఉన్న బ్యాంక్ కరెంట్ అకౌంట్ను అదే పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి అడగడంతో వివరాలు ఇచ్చాడు. నిజామాబాద్కు చెందిన ఓ బిల్డర్ తన వద్ద సైబర్ నేరగాళ్లు రూ.4.65 లక్షలు కాజేశారని ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నరేష్ను గతేడాది నవంబర్ 3వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఇప్పటివరకు బెయిల్ రాలేదు. విషయం ఏంటని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే నరేష్ బ్యాంక్ ఖాతాలో రూ.లక్షలు జమ కావడం, ఆపై చైన్నెకి చెందిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాన్ని వేరే ఖాతాలకు మళ్లించడమేనని తెలిసింది. నరేష్కు కమీషన్ ముట్టజెప్పారని పోలీసులు చెబుతున్నారు. కమీషన్కు ఆశపడి బ్యాంక్ ఖాతా ఇచ్చిన నరేష్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. ఇలా చాలామంది తెలిసీతెలియక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జైలు పాలవుతున్నారు. తొలి అరెస్టు వారిదే... సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ మాఫియా.. చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ వంటి దేశాలలో మకాం వేసి మన ప్రజల డబ్బులను దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట టార్గెట్ చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. బెట్టింగ్ ఊబిలోకి దింపి సర్వం కోల్పోయేలా చేస్తున్నారు. ఈ డబ్బులను బాధితుల నుంచి తీసుకోవడానికి నేరగాళ్లకు కొన్ని బ్యాంక్ ఖాతాలు అవసరమవుతున్నాయి. దీంతో పేదరికంలో ఉన్న, ఈజీ మనీ కోసం ఆశపడే వారిని టార్గెట్ చేసుకొని వారి బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. సైబర్ బాధితుల నుంచి నగదు వాటిలో జమ చేయించుకొని వేరే ఖాతాలకు ఉపసంహరించుకోవడం లేదా బిట్కాయిన్స్ రూపంలోకి మార్చుకుంటన్నారు. ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తొలుత బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వారి వివరాలు లభిస్తున్నాయి. దీంతో వారినే తొలుత అరెస్టు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కుల్లో... ఈజీ మనీకి ఆశపడి బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చినవారు న్యాయపరమైన చిక్కులతో ఇబ్బందులకు గురవుతున్నారు. సైబర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో వీరినే మొదటి నిందితులుగా చేరుస్తున్నారు. దీంతో పలువురు జైలు పాలయ్యారు. మరోవైపు భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరుగుతుండటం, విదేశీ ఖాతాలతో లావాదేవీలు నడుపుతుండటంతో ఖాతాదారులకు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి. దీంతో అప్పటివరకు వస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులవుతున్నారు. ఇతరుల ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ ఖాతాలను అప్పగించి ఇబ్బందులకు గురికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి జైలుపాలు కావొద్దని హెచ్చరిస్తున్నారు. కమీషన్ ఆశ చూపి సైబర్ నేరగాళ్లు పెద్ద ఉచ్చులోకి సామాన్యులనూ లాగుతున్నారు. తెలిసీ తెలియక చాలామంది కమీషన్ వస్తుందన్న ఆశతో వారికి బ్యాంకు ఖాతాలను అప్పగిస్తున్నారు. పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఖాతాదారుడిని అరెస్టు చేస్తున్నారు. -
సంక్షేమం మరిచిన చంద్రబాబు ప్రభుత్వం
సత్తెనపల్లి: రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ధనుర్మాసం సందర్భంగా సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో కోటి దీపోత్సవానికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డితో కలిసి గురువారం వెల్లంపల్లి హాజరయ్యారు. అనంతరం ఆర్యవైశ్య నాయకుడు తల్లం సతీష్ గృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ వ్యాపారం సాగే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల కోట్ల వరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు అందేవని చెప్పారు. ఆ నగదుతో కొనుగోళ్లు పెరిగి వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. కనీసం అభివృద్ధి కూడా మచ్చుకై నా కనిపించడం లేదని తెలిపారు. అమరావతి రాజధాని అని చెబుతున్నారే తప్ప, రాజధాని కావాలన్న రైతులు ఈ రోజు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియా, వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నామని గుర్తుచేశారు. అడ్డగోలుగా దాడులు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయన్నారు. విజయవాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ప్రసాద్ను నడిరోడ్డు మీద చంపేస్తే అతీగతీ లేదన్నారు. పొదిలిలో ఆర్యవైశ్య సోదరుడు అవినాష్ను, ఆయన తండ్రి కోటేశ్వరరావులను ఎస్ఐ కొడితే కంటితుడుపు చర్యగా వీఆర్కు పంపారన్నారు. దర్శిలో రేషన్ డీలర్ సత్యనారాయణను కిడ్నాప్ చేస్తే, ఆయన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆలయంలోకి వెళ్లి తలదాచుకుంటే తప్పుడు కేసులు పెట్టారన్నారు. పిడుగురాళ్లలో జ్యోతి అనే మహిళను అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచారని, మహిళ కానిస్టేబుల్ లేకుండా ఆ సమయం వరకు ఇలా కూర్చోబెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొత్తుల్లా పనిచేసేందుకా సంఘాలు పెట్టుకున్నది? అని ఆయన మండిపడ్డారు. తాను కూడా ఒక ఆర్యవైశ్యుడిగా, వైఎస్సార్సీపీ నాయకుడిగా గళం విప్పుతానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు. దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పుడేమో పొట్టి శ్రీరాములు మీద ప్రేమ ఉంది, అమరావతిలో 58 అడుగుల విగ్రహం పెడతామని ఆర్యవైశ్యుల వద్ద చందాలు వసూలు చేయడంపై వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి రూ.2 కోట్లు, దాని డీపీఆర్కు రూ.11 కోట్లు ఇచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుల కోసమే పనిచేశారా? తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని అన్నారు. రాజధానిలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెడుతున్నాం, డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను ఒత్తిడి చేయడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట నాయకులు రేపాల శ్రీనివాసరావు, చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాద్, కూకుట శ్రీను, తల్లం సతీష్, ఆర్యవైశ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
● ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహణ ● అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
యడ్లపాడు: చారిత్రక వారసత్వానికి నెలవైన కొండవీడు కోటపై ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ‘కొండవీడు ఫెస్ట్–2026’ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది. గురువారం వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కొండవీడుకోటను సందర్శించి, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన జరిపారు. ఉత్సవాలకు వచ్చే వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుపై చర్చించారు. రవాణా సౌకర్యాలు, వేదికల ఏర్పాటు, పర్యాటకుల భద్రత వంటి అంశాలపై అధికారులు చర్చించారు. గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు అధికారులు వివరించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తుది పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్శనలో ఆర్డీవో మధులత, డీఎంహెచ్వో డాక్టర్ రవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్, ఆర్టీసీ ఆర్ఎం అజిత కుమారి, టూరిజం మేనేజర్ గంగిరెడ్డి నాయుడమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణమ్మ, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో హేమలతాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే
పిడుగురాళ్ల: అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచేలా చేస్తామని వైఎస్సార్ సీపీ గురజాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన కోటి సంతకాల మహోద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచామన్నారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు రాబోయే విద్యా సంవత్సరానికి వైద్య విద్య సీట్లు ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధమవ్వటం తమ పోరాటాలకు నిదర్శనమన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019లో సుమారు రూ. 66 కోట్లు మెడికల్ కాలేజీకి మంజూరు చేయించామన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి మరో రూ. 200కోట్లు మంజూరు చేయించటం, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 200కోట్లు కేటాయించటంతో సుమారు రూ.500 కోట్లతో పిడుగురాళ్ల సమీపాన వైఎస్సార్ మెడికల్ కాలేజీ, హాస్పటల్ నిర్మాణం ప్రారంభమయిందన్నారు. 2024 జూన్ కల్లా రూ.217 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కళాశాల పనులు 60 శాతం, హాస్పటల్ పనులు 90శాతం పూర్తి చేశామన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మిగతా పనులు పూర్తిచేయలేకపోయిందన్నారు. అయితే తాము చేపట్టిన సెల్ఫీ చాలెంజ్ ఉద్యమానికి భారీ ప్రజామద్దతు లభించడంతో స్థానిక ఎమ్మెల్యే స్పందించి మెడికల్ కళాశాలకు, హాస్పటల్కు వెళ్లి పరిశీలించి, త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారన్నారు. పిడుగురాళ్లలోని వైఎస్సార్ మెడికల్ కాలేజీ, వైద్యశాలను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
ప్రత్యేక ముఠాలు ఏర్పాటు
సైబర్ నేరగాళ్లు నగదు జమ చేయించుకోవడం కోసం అవసరమయ్యే బ్యాంక్ ఖాతాలను సేకరించడానికి ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు తమకు తెలిసిన పేదలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. బ్యాంక్లో జమ అయ్యే నగదులో 10 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపి వారి నుంచి బ్యాంక్ పాస్బుక్, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు తీసుకుంటున్నారు. ఎంత నగదు జమైంది, ఎక్కడికి ఈ నగదు బదిలీ చేస్తున్నారో సైతం ఖాతాదారులకు తెలియదు. కొందరికై తే కమీషన్ సైతం ఎగ్గొట్టిన సంఘటనలున్నాయి. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఒక్కో ఖాతాకు రూ.10 వేల వంతున ఖాతాలు సేకరించే ముఠాకు అందజేస్తున్నారు. నేపాల్కి చెందిన వ్యక్తులకు దళారులు ఈ ఖాతాల వివరాలను ఇస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లికి చెందిన ఓ దళారి, ఇద్దరు నేపాలీ సైబర్ నేరగాళ్లపై ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిసింది. -
వైభవంగా ఉరుసు మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక జీటీరోడ్డులో శ్రీహాజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం బాబా సమాధి ప్రత్యేకంగా అలకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రాత్రికి గ్యార్మీ షరీఫ్ (ఖురాన్ పఠనం) చేపట్టారు. కార్యక్రమాలను ధర్మకర్త రావి రామ్మోహరావు పర్యవేక్షించారు. నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ కళావేదికపై నిర్వహిస్తోన్న శ్రీత్యాగరాజస్వామి 179వ ఆరాధన సంగీత మహోత్సవాలు గురువారం ముగిశాయి. శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, తొలుత శ్రీ త్యాగరాజస్వామికి శ్రీకాంత్ బృందంచే నాదస్వరం, ఉంఛవత్తి, పంచామృతాభిషే కార్చన, విశేష అలంకరణతో ప్రారంభించారు. శ్రీత్యాగరాజ స్వామిని పల్లకీలో కళాకారులు, సంగీతజ్ఞులు, ఔత్సాహికులు శ్రీత్యాగరాజ పంచరత్న కీర్తనల గానంతో తిరు వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక, స్థానికేతర కళాకారులతో పంచరత్న సేవ విశేష హారతి, అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం చే ప్రహ్లాద భక్తి విజయం నృత్య రూపకం ప్రదర్శించారు. దేవదాయశాఖ గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయప్రసాద్, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి హాజరై, త్యాగరాజ స్వామి విశిష్టతను వివరించారు. చిన్నారులను ప్రశంసించారు. సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్, ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కోశాధికారి రవీంద్రనాధ్, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు పాల్గొనగా, అతిధులను, కళాకారులను సత్కరించారు. శిశువుల అక్రమ విక్రయాల్లో 30కి చేరిన అరెస్ట్లు లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుల అక్రమ విక్రయాల కేసుల్లో ఇప్పటి వరకూ 30 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిశువుల కిడ్నాప్ అమ్మకం కేసులకు సంబంధించి పోక్సో యాక్ట్ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్, గుజరాత్, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో టీములు ఈ రాకెట్మూలాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఫెర్టిలిటి సెంటర్స్ ప్రమేయం ఎంతవరకు ఉంది.. నిజంగా పిల్లల కిడ్నాప్ చేశారా లేదంటే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను ఈ రకమైన అమ్మకానికి పెడుతున్నారా అనే అంశాలను విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పెదకాకాని: నో ప్లాస్టిక్ జోన్గా ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం అన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా (నో ప్లాస్టిక్ జోన్)గా మార్చే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షి సంరక్షణ కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగాన్ని నిషేధించి, పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు డీఎఫ్ఓకు సూచనలు జారీ చేశారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించే వారికి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకురావద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కె శ్రీనివాసరావు, పర్యాటకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. -
కేఎల్యూలో ఐకాన్ ప్యాక్–2026 ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ శుద్ధ, అనువర్తిత రసాయన శాస్త్ర సదస్సు (ఐకాన్ ప్యాన్ 2026) గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జి.రంగారావు, ప్రముఖ పదార్థ శాస్త్రవేత్త డాక్టర్ శ్వేత అగర్వాల్లు విచ్చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రమైన శక్తి సాంకేతికతలు, క్వాటలిసిస్, శక్తి నిల్వ వ్యవస్థలు, పర్యావరణ పునరుద్ధణలో పదార్ధ రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనువర్తనాలకు సంబంధించిన ఆధునిక కార్యాచరణ పదార్థాలలో జరిగిన తాజా ఆవిష్కరణలను వివరించారు. సదస్సు కన్వీనర్ నిరంజన్ పాత్ర ఐకాన్ ప్యాక్ 2026 యొక్క దృష్టి, లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలిసి అభిప్రాయాలను పంచుకుని, ఆధునిక పరిశోధనలను ప్రదర్శించి, సహకారాన్ని పెంపొందించుకునే అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సదస్సులో కీ నోట్ ప్రసంగాలు, ఆహ్వానిత ఉపన్యాసాలు, మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు.వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, ఎన్.వెంకట్రామ్, కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ కేఆర్ఎస్ ప్రసాద్, డీన్ ఎంహెచ్ఎస్ ఎం.కిషోర్బాబు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మట్టి కుస్తీ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి
చిలకలూరిపేట: రాష్ట్ర స్థాయి మట్టి కుస్తీపోటీలు ఈనెల 25, 26 తేదీల్లో చిలకలూరిపేటలోని ఆర్వీఎస్ సీవీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ వీరాంజనేయ మల్లయుద్ద వ్యాయామశాల అధ్యక్షుడు పేరుబోయిన వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు తెలిపారు. పట్టణంలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇండియన్ స్లైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. బరువును బట్టి సీనియర్ పురుషుల కేటగిరిలో 55, 60, 65, 70, 75, 80, 85 కేజీల విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. సీనియర్ ఉమెన్ విబాగంలో 48, 52, 56, 62 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. జూనియర్ బాయ్స్లో 52, 57, 61, 65, 74, 86 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. జూనియర్ మహిళల్లో 46, 50, 54, 58, 62, 65 కేజీల విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. సీనియర్ పహిల్వాన్లకు వయసు 19 నుంచి 20 సంవత్సరాలు ఉండాలని, అదే జూనియర్లకు 16 నుంచి 19 సంవత్సరాల వయసు ఉండాలని తెలిపారు. పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆధార్కార్డుతో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు ఈ నెల 24లోపు వ్యాయమశాల కార్యదర్శి పేరుబోయిన మావో శ్రీనివాసరావుకు అందజేయాలన్నారు. సెల్ నంబర్ 9391077411 కు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 7396225080 నంబర్ను సంప్రదించాలన్నారు. సమావేశంలో వ్యాయామశాల కార్యదర్శి బత్తుల సుబ్బారావు, కోశాధికారి సాపా వీరరాఘవులు, మజ్ను పహిల్వాన్ పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి బోల్తా..
ఒకరు మృతి , ఇద్దరికి తీవ్ర గాయాలు రొంపిచర్ల: వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన డక్కమడుగుల రాజేష్(24) తన స్నేహితులతో కలిసి హైవే రోడ్డు మీదుగా మండలంలో అన్నవరప్పాడు గ్రామం నుండి స్వగ్రామానికి వస్తున్నారు. వేగంగా వస్తున్న బైక్ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గ్రామానికి వెళ్లే రోడ్డు వద్దకు రాగానే ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపు తప్పి బైక్ బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న రాజేష్ క్రింద పడిపోవడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపున ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. తాడికొండ: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికిగాను 12.5758 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉండవల్లిలో 10.5018 ఎకరాలు, పెనుమాకలో 0.6500 ఎకరాలు, మందడం–1లో 0.7000 ఎకరాలు, రాయపూడి–1లో 0.4710 ఎకరాలు, రాయపూడి–2 – 0.2530 ఎకరాల సేకరించనున్నారు. సంబంధిత రైతులు, భూ యజమానులు అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమైతే తమ గ్రామంలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
జాతీయ మట్టి కుస్తీ పోటీల్లో గురుకుల విద్యార్థికి రజత పతకం
యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 9వ తరగతి చదివే విద్యార్థి రెంటాల మల్లికార్జున జాతీయస్థాయి మట్టి కుస్తీ పోటీల్లో తన ప్రతిభను నిరూపించాడు. ఈ ఏడాది జనవరి 3, 4,5 తేదీల్లో వైజాగ్లో నిర్వహించిన జాతీయ స్థాయి బీచ్ గ్రాప్లింగ్(మట్టి కుస్తీ) పోటీల్లో మల్లికార్జున అండర్–17 విభాగంలో పాల్గొన్నాడు. అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో థాయ్లాండ్లో జరగబోయే అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. విద్యార్థి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ప్రిన్సిపాల్ దాసరి ప్రభాకర్ విద్యార్థి మల్లికార్జున, అతనికి ప్రత్యేక శిక్షణ అందించిన పీఈటీలు డి వీరయ్య, పి సియోనులను కొనియాడారు. మల్లికార్జున థాయ్లాండ్లో జరిగే పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించి దేశానికి, పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
22 నుంచి విజ్ఞాన్లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఏపీ స్పేస్టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ను ‘లివరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ -
పీపీపీతో పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి, పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేటలో సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు సీపీఐ చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు అమరావతి, పోలవరం రెండు కళ్లు అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండి పడ్డారు. అమరావతి కోసం భూములను సేకరించిన ప్రభుత్వం తిరిగి 16వేల ఎకరాలను రైతులను నుంచి సమీకరించనుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద పీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమంతోనే దేశంలోనే అనేక సంస్కరణలు అమలు అయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ పాలన లో నినాదాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు, జిల్లా ఇన్చార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు అత్యాచారం చేసి నిర్లజ్జగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు, హుస్సేన్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు బందెల నాజర్జీ, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, సహాయ కార్యదర్శి షేక్ సుభాని, నాయకులు దాసరి వరహాలు, రమణారావు, బందెల శ్రీనివాసరావు, యుగంధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆపస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్జేడీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి.పద్మ, ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎ.బాలచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో గురువారం జరగాల్సిన స్థాయీ సంఘ సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు గుంటూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘం (ఏబీఆర్ఎస్ఎం) ఆంధ్రప్రదేశ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఐదు వేల అధ్యాపకుల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి.ఎస్.వి.ఎస్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. అనంతరం ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నందువల్ల అధ్యాపక పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుందని, వీలైనంత తొందరలో భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ రామచంద్రన్, డాక్టర్ వాణి, డాక్టర్ గంగరాజు, డాక్టర్ బాల మురళి, తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: గుంటూరులోని నల్లపాడు రోడ్డు రెడ్డికళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఇది ఒక వేదికని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందన్నారు. ఈ అఖిల భారత డ్వాక్రాబజార్ సరస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు గురువారం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు జరుగుతాయన్నారు. గుంటూరులో ఈ మేళా 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయబడిందన్నారు.300 షాపులు ఉంటాయని, వాటిలో 65 షాపులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు చేస్తారన్నారు. -
వీవీఐటీ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక సిమెన్స్ ఈడీఏ సెంటర్
పెదకాకాని: విద్యాలయాలలో అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణల రూపకల్పనతోపాటు పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి సిమెన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సిమెన్స్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమిషన్ సెంటర్ (సిమెన్స్ ఈడీఏ సెంటర్) ఏర్పాటుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఎంపికై నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీయూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం సిమెన్స్ అకడమిక్ పార్టనర్ గ్రాంట్కు సమర్పించిన విద్యార్థుల ప్రాజెక్ట్ సమూనాలు, అధ్యాపకుల పరిశోధనల ఆధారంగా ఈ కేంద్రం ఎంపిక కాబడిందని బుధవారం ప్రొ ఛాన్సలర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు మూడు సంవత్సలకు కోటిన్నర విలువచేసే ఐసీ డిజైన్ అండ్ వెరిఫికేషన్, ఎంబడెడ్ సిస్టమ్స్, పీసీబీ డిజైన్స్ అనుబంధ ఈడీఏ సాధనాలను సిమెన్స్ సంస్థ అందించినట్లు వివరించారు. అనంతరం ఈిసీఈ విభాగాధిపతి, ఈడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వై. భానుమూర్తి, సైట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎస్.కె ఇనావుల్హక్ లను వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి. అకడమిక్ డీన్ డాక్టర్ కె. గిరిబాబు అభినందించారు. -
కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లాలో శీతల గిడ్డంగుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సురేంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం చుట్టుగుంటలోని మార్కెటింగ్శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సమస్యలతో కూడిన వినతిప్రతం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ రాఘవయ్య, కోశాధికారి ఆర్.రమణ, సభ్యుడు జుగిరాజ్ భండారి తదితరులు ఉన్నారు. జిల్లా కోల్డ్స్టోరేజీల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు -
వైఎస్సార్ సీపీలో పలువురి నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురు నాయకులను పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వినుకొండకు చెందిన జుజ్జూరి ఐరామమూర్తి, లీగల్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చిలకలూరిపేటకు చెందిన దాసరి చిట్టిబాబు నియమితులయ్యారు. అలాగే నరసరావుపేటకు చెందిన యాదల శ్రీనివాసరెడ్డిని పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగాను, యన్నం రజనీరెడ్డిని మహిళా విభాగం జిల్లా సెక్రటరీగా నియమించారు. అలాగే ఐటీ వింగ్ జిల్లా ఉపాధ్యక్షులుగా రవిశంకరరెడ్డి(సత్తెనపల్లి), బుర్రి రాజశేఖరరెడ్డి (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి (నరసరావుపేట), రజాక్ (చిలకలూరిపేట), ఆళ్ల నాసరరెడ్డి (వినుకొండ), గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి (పెదకూరపాడు), మద్దు బ్రహ్మయ్య (మాచర్ల)లను నియమించారు. -
ఉపాధికి సమాధి
సత్తెనపల్లి: నిరుపేదలకు జీవనోపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్–రోజ్గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం (వీబీ–జీ రామ్జీ) అమలులోకి తెచ్చారు. ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా సమాధి చేస్తోంది. చేసిన పనులకు కూలి డబ్బులు చెల్లించకుండా వేధిస్తోంది. మరోవైపు టీడీపీ మద్దతు దారులను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించి వారికి ఉపాధి నిధులను దోచి పెడుతోంది. ఏటా ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని కల్పించి సొంతూరు లోనే ఉపాధి పొందేలా చర్యలు తీసుకో వాలి. చంద్ర బాబు ప్రభుత్వం గత ఐదు నెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో పట్టణాల్లో కాంక్రీట్ పనులు, భవన నిర్మాణ పనులు వెతుక్కుంటూ వలస బాటపడుతున్నారు. జిల్లాలో రూ. 11.51 కోట్లు వేతన బకాయిలు ... ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వేతనాలు ఐదు నెలల నుంచి అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2025 జూలై 21 నుంచి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు నిలిచిపోయాయి. జిల్లాలో రూ.11.51 కోట్లు బకాయిలు నిలిచిపోయాయి. కూలీల డబ్బు .. ఫీల్డ్ అసిస్టెంట్ల జేబుల్లోకి... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలంతా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎంతో కాలంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. ఈ క్రమంలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతివారం మాస్టర్ల నమోదులో ఇష్టానుసారంగా నమోదు చేయిస్తూ సొమ్ము స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కూలీల వేతన వెతలు జిల్లాలో వేతన బకాయిలు రూ.11.51 కోట్లు ఐదు నెలలుగా అందని కూలి డబ్బులు పట్టించుకోని పాలకులు, అధికారులు వలసబాటలో ఉపాధి హామీ కూలీలు -
ఉపాధి పనులే ఆధారం
మాలాంటి పేదలకు ఉపాధి హామీ పనులే ఆధారంగా నిలుస్తున్నాయి. కూలి డబ్బులు సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. బయట అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేక తినడానికి కూడా కష్టంగా ఉంది. – టి.కోటిమహాలక్ష్మీ, ఉపాధి హమీ కూలీ, రాజుపాలెం ఉపాధి హామీ పనులకు సంబంధించి కొంత కాలంగా వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేస్తున్నా కూలి డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియక కష్టాలు పడుతున్నాం. తక్షణమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. –ఆర్.రమేష్నాయక్, ఉపాధి హమీ కూలీ, కొత్తబోధనం -
సాగు నీరు లేక ఎండిపోతున్న పైర్లు
● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు ● ఎమ్మెల్యే సిఫార్స్ చేసినా నీరివ్వని అధికారులు రొంపిచర్ల: మండలంలోని అన్నవరం, తుంగపాడు గ్రామాల్లో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పైరుకు నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి అన్నవరం మేజర్ నుంచి నీళ్లు మళ్లించే కార్యక్రమంలో భాగంగా పది రోజులుగా సరఫరాను ఆపారు. గ్రామంలో సాగు చేస్తున్న 1,200 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పైర్లకు నీరు లేక పొలాలు బీటలు వారాయి. పది రోజులుగా అన్నవరం మేజర్కే నీళ్లు రావటం లేదు. కంకి దశలో ఉన్న పైరు తాలుగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న వరిపైరు కంకిదశలో ఉండగా, మొక్కజొన్న పైరు 40 నుంచి 50 రోజుల పైరు అయ్యింది. వరికి చివరి ఒకటి, రెండు తడులు అవసరం ఉంది. మొక్కజొన్నకు రెండు నెలల వ్యవధిలో మూడు తడులు ఇవ్వాల్సి ఉంది. మొక్కజొన్న పైరుకు డిసెంబర్ ఆఖరిలో నీరు అందించాలి. కానీ రాకపోవటంతో నేలలో తేమశాతం లేక బీటలు వారింది. రైతులు ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సకాలంలో నీరు అందించకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి విషయమై ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు రైతులు తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. వెంటనే అరవిందబాబు అక్కడి నుండే ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడారు. అయినా ప్రయోజనం మాత్రం లేదు. ఈ విషయమై రైతుల్లో కూడా చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో రైతులు సహనం కోల్పోయి రోడ్డెక్కి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ఎన్ఎస్పీ అధికారులు స్పందించి సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
అక్షరాలకు పునఃప్రాణప్రతిష్ట చేసిన దోణప్ప
పుస్తక మహోత్సవంలో డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి వన్టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు అక్షరాలకు పునఃప్రాణప్రతిష్ట చేసిన ఘనత సాహితీవేత్త తూమాటి దోణప్పకే దక్కుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త ఆచార్య తూమాటి దోణప్ప శతజయంతి సభను బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సభలో దోణప్ప గురించి రాసిన ‘గురు శిరోమణి’ పుస్తక పునర్ముద్రణను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కృపాచారి మాట్లాడుతూ.. దోణప్ప శిష్యవాత్సల్యంతో ఎందరో అధ్యాపకులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆయన తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను గుర్తుచేస్తూ ఆ అంశా ల్లోని ప్రత్యేకతలను వివరించారు. సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ.. దోణప్ప కఠినమైన భాషాశాస్త్ర పాఠాలను కూడా సరళంగా, హృద్యంగా విద్యార్థులకు అర్థమయ్యేలా, స్ఫూర్తికలిగించేలా బోధించారన్నారు. తెలుగు సాహిత్యంపై, భాషాశాస్త్రం ఆయనకున్నపట్టు ఆదర్శప్రాయమైనదని వివరించారు. సాహితీవేత్త ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, ఆచార్య డాక్టర్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. దోణప్ప సాహితీ శైలిని వివరించారు. విజయవాడ పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు స్వాగతం పలికిన ఈ సభలో దోణప్ప కుమారుడు తూమాటి సుధాకర్, కుమార్తె సుజాత సభలో పాల్గొన్నారు. ‘చుక్క పొడుపు’ నవల ఆవిష్కరణ సాహిత్యంలో శక్తివంతమైన రచనలు సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో కీలకభూమికను పోషిస్తాయని ప్రముఖ కవి ఖాదర్మొహిద్దీన్ అన్నారు. పుస్తక మహోత్సవ వేదికపై రచయిత్రి నల్లూరి రుక్మిణి రాసిన ‘చుక్క పొడుపు’ నవలను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజమనే చట్రంలో కుటుంబం, వ్యక్తి బంధితులై ఉంటారన్నారు. వీటిని రాజ్యం నియంత్రిస్తుందని వివరించారు. ఈ నియంత్రణను లెక్క చేయక, సామాజిక చట్రాల పరిధులను అధిగమించేవారి చరిత్రల చిత్రణకు సమాజాన్ని మార్చగల శక్తి ఉంటుందన్నారు. అటువంటి చిత్రణ ‘చుక్క పొడుపు’ నవలలో కనిపిస్తోందన్నారు. సాహితీవేత్త గుంటూరు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. తన అన్ని రచనల్లోనూ సజీవమైన భావాలను పలికించడంలో నల్లూరి రుక్మిణిది అందెవేసిన చెయ్యి అన్నారు. రచయిత అరసవెల్లి కృష్ణ నిర్వహించిన ఈ సభలో రచయిత్రి నల్లూరి రుక్మిణి పాల్గొన్నారు. కవిగా, కథా రచయితగా, నాటక రచయితగా స్మైల్ తెలుగు పాఠకులపై తనదైన ముద్ర వేశారని వక్తలు కొనియాడారు. పుస్తక మహోత్సవం ప్రాంగణంలో స్మైల్ రచనలపై పరిశోధనాగ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది. -
నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు..
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న రౌడీషీటర్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉన్న గణపతి రాజేష్, అతని స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉమర్బుడేసాహెబ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఢీ కొనడడంతో వివాదం జరిగింది. దీనిపై కక్ష పెంచుకున్న గణపతిరాజేష్ అతని స్నేహితులతో కలిసి గతేడాది డిసెంబర్ 21న బుడేసాహెబ్ ఇంటికి వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బుడేసాహెబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇందిరాకాలనీకి చెందిన గణపతి రాజేష్ అలియాస్ శ్రీను, గణపతి ఆనంద్, బత్తుల హరీష్తో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కాగా రౌడీషీటర్ గణపతి రాజేష్ 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
మహిళా దొంగ అరెస్ట్
చీరాల రూరల్: నవజీవన్ ఎక్స్ప్రెస్లో బంగారు నల్లపూసల దండ దొంగిలించిన మహిళను రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి రూ. 2,16,000 విలువైన బంగారు దండను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జీఆర్పీ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితురాలి వివరాలను జీఆర్పీ సీఐ ఎస్కే మౌలా షరీఫ్ వెల్లడించారు. 60 ఏళ్ల వయస్సు కలిగిన చీరాలకు చెందిన గోలి స్వరాజ్యం అనే మహిళ 27 డిసెంబర్ 2025న నవజీవన్ ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగులోని జిప్ తెరచి 36 గ్రాములు బరువు కలిగిన బంగారు నల్లపూసల దండను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. అయితే బాధితురాలు 6 జనవరి 2026న చీరాల జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి. మురళీధర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరీఫ్, చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరిఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్య కేసును ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అనేక సీసీ కెమెరాలను నిరంతరాయంగా పరిశీలించి ఒకే రోజులో అంటే బుధవారం దొంగను గుర్తించారు. నిందితురాలు చీరాల రామ్నగర్కు చెందిన చిన్నపోతుల రోజాను అరెస్టు చేశారు. ఆమెవద్దనున్న 2,16,000 విలువైన బంగారు నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఒకే రోజులో కేసును ఛేదించిన సీఐ మౌలా షరీఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్యతో పాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
మళ్లీ రుబాబు
పల్నాడుగురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026‘ముస్తాబు’... విద్యార్థులకు అందుబాటులో అద్దం, దువ్వెన,, పౌడర్ ఉంచాలని ఆదేశాలు బోధనేతర పనులపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు పరిశుభ్రత సంగతి సరే... పాఠాలు చెప్పేదెప్పుడని ఆగ్రహం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 3900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 39.8368 టీఎంసీలు. -
కార్తికేయుడి హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి హుండీల్లో భక్తులు సమ ర్పించిన కానుకల ద్వారా రూ.1,07,20,970 ఆదాయం వచ్చిందని ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వి.సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బుధవారం ఉదయం హుండీ కానుకలు లెక్కించగా 84 రోజులకు రూ.1,07,20,970 ఆదాయం వచ్చింది. 1.830 కిలోల వెండి, 44.81 గ్రాములు బంగారం, 98 ఆమెరికా డాలర్లు, సౌదీ అరే బియా, కెనడా, సింగపూర్, బూటాన్, మంగో లియా, నేపాల్ దేశాల కరెన్సీ లభించింది. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, సేవా సమితి సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
నరసరావుపేట: గుంటూరులోని ఏసీ కాలేజీలో ఈ నెల 10, 11 తేదీలలో నిర్వహించే యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కోరారు. మంగళవారం సాయంత్రం కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు పతాకావిష్కరణ, అనంతరం ప్రారంభ సభ, మధ్యాహ్నం పెద్ద ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. టెట్ రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ నియమించాలని, ఆర్థిక బకాయలు చెల్లించాలని, బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఇతర ప్రధాన డిమాండ్లతో మహా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రతినిధులతో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుందని అన్నారు. మరుసటి రోజు 11వ తేదీ ప్రతినిధుల సభ కొనసాగుతుందని, రాష్ట్రశాఖ నూతన కౌన్సిల్ ఎన్నికతో మహాసభలు ముగుస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు భాగేశ్వరిదేవి, జిల్లా కార్యదర్శులు ఉషా శౌరి రాణి, రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్ సుందరరావు, సౌహార్ద్ర ప్రతినిధి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ప్రాంతీయ శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు. -
తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర
తెనాలి టౌన్: మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో పట్టణ వహాబ్చౌక్లో ఫ్లెక్సీల తొలగింపులో హైడ్రామా నెలకొంది. తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి నిలబెట్టటమే కాకుండా మరో ఫ్లెక్సీని తీయకుండా అడ్డుకుని, అధికారులపై మండిపడ్డారు. నల్లబ్యాడ్జిలతో ఫ్లెక్సీ ఎదుట కూర్చొని నిరసన తెలియజేశారు. కూటమి ధర్మం వీడి మంత్రి మనోహర్ తమ పార్టీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో టీడీపీని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసేదిలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి వహాబ్చౌక్లోని డివైడర్కు రెండు వైపులా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపునకు మున్సిపల్ టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ సిటీప్లానర్ వాణి, తన సిబ్బందితో ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. వహాబ్ చౌక్లో డివైడర్కు పడమరవైపున్న ఫ్లెక్సీని పొక్లెయిన్తో తొలగించారు. డివైడర్కు మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ ఫ్లోర్లీడర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం ఎదుటగల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో ఉండగా, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్నారు. నల్లరిబ్బన్లు ధరించి ఫ్లెక్సీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులకు అధికారుల మధ్య తోపులాట జనం రద్దీగా ఉండే సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో వచ్చి ఫ్లెక్సీల తొలగింపుకు పూనుకోవటం ఏమిటని ప్రశించారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అధికార పార్టీ నేత ఆలపాటి రాజా ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడం ఏంటని మండిపడ్డారు. తెనాలిలో టీడీపీని చంపేయడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. డివైడర్ కు ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరోవైపు తొలగించిన ఫ్లెక్సీని కొందరు యువకులు తిరిగి ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని నిరోధించటానికి పోలీసులు పూనుకోవటంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి ఏర్పాటుచేశారు. రెండోవైపు తొలగించటానికి సాధ్యంకాక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్పై ఆరోపణలను గుప్పించారు. తెనాలిలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా మంత్రి మనోహర్ వ్యవహరిస్తున్నారని మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. కూటమి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తెనాలిలో పరిపాలన సాగుతుందని అన్నారు. ఎన్నికలవేళ జనసేన, టీడీపీ నాయకులను రెండు కళ్లుగా చూస్తానని చెప్పి గెలిచిన తర్వాత టీడీపీ నేతల ముఖం చూడడానికి కూడా మంత్రి మనోహర్ ఇష్టపడడం లేదని వారు దుయ్యబట్టారు. టీడీపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క టీడీపీ కౌన్సిలర్ కూడా ఉండకూడదని మంత్రి నిర్దేశించుకున్నాడని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కౌన్సిలర్ త్రిమూర్తి ఆరోపించారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. -
పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి మండిపడ్డారు. అత్యధికంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారికి గ్రామ సర్పంచ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించిందన్నారు. అలాంటి వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి కనీసం జీతాలు కూడా ఇవ్వడంలేదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు మంజూరు చేయకపోవడం దారుణమని తెలిపారు. సర్పంచ్లకు జీతాలు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో గవర్నర్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సత్తెనపల్లి క్లబ్పై పోలీసుల దాడి సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని రిక్రియేషన్ క్లబ్పై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,05,370లు నగదు, 37 సెల్ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దాడిలో పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్సై పి.పవన్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుద్ఘాతానికి కౌలు రైతు మృతి రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామంలో మంగళవారం విద్యుద్ఘాతానికి గురై కౌలు రైతు నాగళ్ల సాంబశివరావు(62) మృతి చెందాడు. ఆయన సుమారు 3.5 ఎకరాలు మాగాణి భూమి కౌలుకు తీసుకుని ఇటీవల వరి పంట సాగుచేశాడు. వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి బోరు స్విచ్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో అక్కడకక్కడే మృతిచెందాడు. పూర్తి ఆరోగ్యంతో తమ కళ్లె ఎదుటే తిరుగుతున్న ఆయన విద్యుద్ఘాతానికి గురై అకాల మరణం చెందటంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య అనుసూయమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ మేరకు కేసు పరిశీలిస్తున్నారు. -
తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని
సత్తెనపల్లి: తరగతి గదిలో ఇంటర్ విద్యార్థిని స్పృహ కోల్పోయిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల మండలం అనుపు గ్రామానికి చెందిన నూన్సావత్ లలితా భాయ్, నానునాయక్ దంపతుల కుమార్తె పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తూ పట్టణంలోని వెంకటపతి కాలనీలో గల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం కళాశాలలో సాయంత్రం 4:00 గంటల సమయంలో స్పృహ కోల్పోగా కళాశాల సిబ్బంది సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోబీపీ, ఎనీమియా కారణంగా ఆమె స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిసేపటికి ఆమె కోలుకోవటంతో అటు కళాశాల, ఇటు హాస్టల్ సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. -
తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి
తీవ్రగాయాలు అచ్చంపేట: తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడిచేసిన ఘటన మంగళవారం అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే...అచ్చంపేటలోని చామర్రు రోడ్డులో నివాసముంటున్న కుమారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షేక్ బాషా, చిన్న కుమారుడు షేక్ సైదావలి. ఆమె భర్త 15 సంవత్సరాల కిందట మృతి చెందాడు. పెద్ద కుమారుడు బాషా మద్యానికి బానిస కావడంతో భార్య, పిల్లలు వదలి వెళ్లారు. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటున్నాడు. చిన్న కుమారుడు సైదావలి ఇంటి ముందే వెల్డింగ్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాషా మద్యం తాగి తల్లితో ఘర్షణ పడుతున్నాడు. తమ్ముడు సైదావలి మందలించే ప్రయత్నం చేశాడు. ఆగ్రహించిన బాషా మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు నిద్రిస్తున్న సైదావలిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని తల, ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్లో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవకాయలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు డీఎస్ఓ నరసింహారెడ్డి నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ భవానీ ఐలాండ్లో నిర్వహిస్తున్న అవకాయ అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్య ఉత్సవాలలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్క్షాప్లో భాగంగా కరాటే, టైక్వాండో, జూడో వుషు, కుంగ్ఫూ ప్రదర్శనలను 9, 10 తేదీలలో నిర్వహిస్తారని వివరించారు. ఆయా విభాగాలలో అనుభవం ఉన్న అకాడమీలు, క్లబ్లు, కోచ్లు వర్క్షాప్ నిర్వహణ, శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 7వ తేదీలోపు తమ వివరాలతో సతైనపల్లిరోడ్డు స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో సంప్రదించాలని కోరారు. జ్వర లక్షణాలతో విద్యార్థిని మృతి ముప్పాళ్ల:మండలంలోని గోళ్లపాడు కేజీబీవీ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జ్వర లక్షణాలతో బాధపడుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పిడుగురాళ్లకు చెందిన ఓ బాలిక కేజీబీవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. క్రిస్మస్ పండుగ సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లి 2వ తేదీన పాఠశాలకు వచ్చింది. తీవ్ర జ్వరం రావటంతో పిడుగురాళ్లలోని తల్లిదండ్రులకు కబురు పంపగా ఇంటికి తీసుకెళ్లారు. మరలా ఈనెల 4వ తేదీన పాఠశాలకు రాగా సాయంత్రానికి జ్వరం రావటంతో తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు. పిడుగురాళ్లలోని ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ తగ్గక పోవటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5వ తేదీ రాత్రి మృతి చెందింది. -
మరొకరికి వెలుగునిచ్చిన భూలక్ష్మి
మాచర్ల రూరల్: తన మరణానంతరం కూడా మరొకరికి వెలుగు ప్రసాదించిన తెడ్ల భూలక్ష్మి త్యాగనిరతిని ప్రజలు కొనియాడుతున్నారు. వివరాలలోకి వెళితే.. దుర్గిలో నివసించే తెడ్ల భూలక్ష్మి (65) గుండెపోటుతో సోమవారం మృతిచెందింది. మరణానికి ముందే ఈమె కుమారుడు తెడ్ల మురళి మాస్టర్ సూచన మేరకు మరణించిన తరువాత నేత్ర దానం చేస్తే చూపులేని వారికి కంటి చూపు అందించే అవకాశం కల్పించిన వారమౌతారని చెప్పిన ఆయన కుమారుడి సలహా మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్, నల్గొండ చారిటీ ట్రస్టు వారికి అంగీకార పత్రాన్ని అందించారు. ఆమె మరణ వార్తను ట్రస్టు సభ్యులకు తెలుపగా మంగళవారం వారు వచ్చి వైద్యుల ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించారు. -
బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలి..
గురజాల: బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల క్రికెట్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆయన మాట్లాడుతూ నిత్యం దూపదీపాలు, పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపే పురోహితులు ఈ విధంగా ఒకే వేదికపై క్రికెట్ ఆడటం ఎంతో మంచి పరిణామమన్నారు. ఆటల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన బ్రాహ్మణ, అర్చక పురోహిత సంఘాన్ని ఆయన అభినందించారు. ముందుగా శ్రీ పాతపాటే శ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా క్రీడామైదానానికి చేరుకున్నారు. వందేమాతర గేయాన్ని ఆలపించి పోటీలను ప్రారంభించారు. మహావీర్ కింగ్స్ రెండు మ్యాచ్లు, వీరభద్ర లెవన్స్ రెండు మ్యాచ్లు, కార్తికేయ టీము ఒక మ్యాచ్ గెలిచినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవులపల్లి చంద్రశేఖర్శర్మ, రాష్ట్ర పూర్వపు కోశాధికారి మంతిరాజు సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివన్నారాయణ, న్యాయవాదులు కేవీ నాగార్జున, ఆచంట శ్రీనివాసరావు, దివాకరుని రాధాకృష్ణమూర్తి, బ్రాహ్మణ సేవా సంఘం సహాయ కార్యదర్శి ఆచంట కృష్ణకుమార్, తంగెడ లక్ష్మీ నారాయణ ప్రసాద్, కోశాధికారి నారాయణభట్ల సుబ్రమణ్యం, అర్చకులు సీహెచ్ సంజీవకుమార్, కె చంద్రశేఖరశర్మ, ఈవి బాలుశర్మ, లక్ష్మణకుమార్ శర్మ, సుధాకర్ షిష్టి, కె మల్లికార్జునశాస్త్రి తదితరులున్నారు. రెండు రాష్ట్రాల క్రికెట్ పోటీలు ప్రారంభం -
రాష్ట్రంలో పల్నాడు ముందుండాలి
సత్తెనపల్లి: విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రంలో పల్నాడు జిల్లా ముందుండాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, టీడబ్ల్యూఆర్ఎస్, ఏపీఎంఎస్, తదితర ప్రభుత్వ యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు–1,2, సీఆర్పీలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 598, 596 మార్కులతో పల్నాడు జిల్లా ప్రభుత్వ పాఠశాలలు ముందున్నాయని, ఈ ఏడాది కూడా దానికి తగ్గకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా కలసి కష్టపడి పనిచేసి పదో తరగతి ఫలితాల్లో గర్వపడే విధంగా కృషి చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలుపరచాలన్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు జరుగుతున్న 75 రోజుల జీఎఫ్ఎల్ఎన్ను పకడ్బందీగా అమలు పరచాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరూ భుజించే విధంగా కృషి చేయాలన్నారు. కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారికి వడ్డించే భోజనం విషయంలో, రోజువారి అమలవుతున్న మెనూ విషయంలో, నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. సమావేశంలో సత్తెనపల్లి ఉప విద్యాశాఖ అధికారి ఏసుబాబు, సమగ్ర శిక్ష ఏఎంఓ పూర్ణచంద్రరావు, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది పద్మారావు, పాలేటి శ్రీనివాసరావు, నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు–1,2, వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఏఈలు, పాల్గొన్నారు. -
సాయుధ బలగాల సంక్షేమ నిధికి విరాళం
నరసరావుపేట: సాయుధ బలగాల సంక్షేమ నిధికి దాతలు ఇచ్చిన చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలకు అందజేశారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ(ఎన్ఈసీ) చెందిన ఎన్సీసీ క్యాడెట్లు రూ.30వేలు, వాసవీ క్లబ్ సభ్యులు రూ.25వేలు విరాళంగా ఇచ్చారు. దేశ రక్షణలో భాగస్వాములయ్యే సైనికుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన క్యాడెట్లు, వాసవి క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. నరసరావుపేట రూరల్: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ చట్టప్రకారం ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్ అప్టేట్ చేసుకోవాలని తెలిపారు. ఐఎఫ్ఎమ్ఎస్ స్టాక్ గోడౌన్ స్టాక్ సరిపోవాలని పేర్కొన్నారు. ఎరువుల గోడౌన్ల వద్ద స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, వి.హనుమంతరావు, జిల్లా ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి మంగళవారం తులసితో అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి,లక్ష్మణుడు,ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి కనుల పండువగా పూజలు, గోత్ర నామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు రూరల్: అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు మంగళవారం పరిశీలించారు. స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ అఖిల భారత డ్వాక్రా బజారును ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించి పలు స్టాళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంగళవారం నుంచి 18వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. సరస్లో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. -
ప్రపంచ నాటక వినీలాకాశంలో గుంటూరు
యడ్లపాడు: మనిషి మదిలోని ఘర్షణ..సమాజంలోని సంక్లిష్టతను..మట్టిలో పుట్టిన మమకారాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించే అద్భుత ప్రక్రియ ‘నాటకం’. అందులో భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక భారత్రంగ్ మహోత్సవం ప్రపంచ నాటక రంగంలోనే ఒక మైలురాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ) ప్రతి ఏటా నిర్వహించే ‘భారత్రంగ్’ కేవలం ప్రదర్శనల సమాహారం మాత్రమే కాదు, విశ్వవ్యాప్త సంస్కృతుల మహోన్నత సంగమం. అటువంటి నాటక కళా వైభవం, ఖండాంతరాలను దాటి మన గుంటూరు నగర ముంగిట కొలువుదీరబోతోంది. వందల మైళ్ల దూరం నుంచి, శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన కళా రూపాలు ఇప్పుడు మన ముందుకు రానున్నాయి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ చిత్తరంజన్త్రిపాఠి, యడ్లపాడు వేదిక(తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుల కృషి ఫలితంగా గుంటూరు నగరానికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను ప్రకటించారు. సంయుక్త సంకల్పం ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ), యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) సంస్థల సంయుక్త సారథ్యంలో ఐదు రోజులు గుంటూరు నగరం ఒక భావాల ప్రపంచంలా మారుతుంది. ఇందుకోసం గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఒక ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. అభినవ భాష, మూగబోని భావోద్వేగం ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంట నుంచి సాయంత్రం వరకు మన తెలుగు కళాకారుల జానపద, సాంస్కృతిక ప్రదర్శనలతో విజ్ఞాన మందిర ప్రాంగణం పులకించనుంది. సాయంత్రం 7గంట ల వేళ, విదేశీ భాషల స్వరాలు వినిపిస్తున్నా, రంగస్థలంపై పలికే అభినయం ప్రేక్షకుడిని ఆ కథలో లీనం చేస్తుంది. భాష అర్థం కాకపోయినా, నటుడి కళ్లలోని భావం ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. నాటక ప్రియులకు, వర్థమాన కళాకారులకు... ఇది కేవలం నాటక ప్రియులకే కాదు మరుగున పడుతున్న నాటక రంగానికి పునరుజ్జీవం పోసే ఒక కళా సంజీవని...ఇది రేపటి తరం కళాకారుల ప్రతిభను తట్టిలేపే ఒక గొప్ప కళా ప్రబోధిని. ప్రపంచస్థాయిసాంకేతికతను, నటనలోని వైవిధ్యతను గుర్తించి, కళా హృదయంతో ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునేందుకుఇదో సువర్ణావకాశం. -
పల్నాడు
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026చేబ్రోలు: నారాకోడూరులోని గాయత్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్మించిన డీ–అడిక్షన్ సెంటర్ను హరియాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.సత్తెనపల్లి: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా .. తగి నంత మంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్ను తోందా ..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు రెండ్రోజుల కిందట అన్ని జిల్లాలు, మండలాల విద్యాశాఖ అధి కారులతో వెబ్క్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదు లోపు ఉన్న ఫౌండేషన్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30 లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదే శాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఏయే స్కూళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది? వాటిని సమీపంలోని ఏ స్కూల్లో విలీనం చేస్తే బాగుంటుంది? అనే వివరాలను సేకరించి తమకు అందజేయాలని సూచించడం ఉపాధ్యాయ వర్గాలలో గుబులు రేపుతోంది. 3,4,5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూత పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం 3,4,5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. పరిష్కారం వెతక్కుండా .. రద్దు చేయడమేంటి? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నా యని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడానికి ప్రధాన కారణంగా ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి, మేధావులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, సంఘాల నేతలతో చర్చించి ఆ దిశగా అడుగులు వేయకుండా ‘విలీనం’ పేరుతో రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 361 బడులు సింగిల్ టీచర్కే పరిమితం... జిల్లా వ్యాప్తంగా 361 పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమ య్యాయి. ఆ పాఠశాలలో బోధన చేసే ఉపాధ్యాయుడు ఏదైనా సమస్యల కారణంగా విధులకు రాకపోతే పాఠశాల మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే సమస్యలు తలెత్తనున్నాయి. డీఎస్సీ ఉపాధ్యాయులతో కొన్ని సింగిల్ టీచర్ పాఠశాలల్లో బోధనా సమస్యలు తీరుతాయని భావించినప్పటికీ ఖాళీల భర్తీలో ఆ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. లోకేశ్ మాటలపై సన్నగిల్లిన నమ్మకం ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదే పదే చెబుతున్నా .. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన మాటలపై నమ్మకం సన్నగిల్లుతోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ‘విలీనం’ పేరుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు తాళం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఉపాధ్యాయులు అంటున్నారు. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు పాఠశాలలను తక్కువ విద్యార్థుల సాకుతో మూసివేతకు రహస్యంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 32 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఐదుగురి కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో కసరత్తు నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదికలు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు ... పాఠశాల స్థాయి పాఠశాలలు విద్యార్థులు ప్రాథమిక 1,215 52,791 ప్రాథమికోన్నత 54 4,580 ఉన్నత 298 86,991 -
తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతోకాలం సాగవు
వెంకటాచలం(పొదలకూరు): అధికారమనే అహంకారంతో తండ్రీకొడుకులు బరితెగించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ అరాచకాలు సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నేతలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసిందని ధ్వజమెత్తారు. నెల్లూరు కేంద్ర కారాగారం రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మంగళవా రం రోజా, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల రోజా మీడియాతో మాట్లాడు తూ టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగితే పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న పిన్నెల్లిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని విమర్శించారు. జైల్లో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్య లకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మన్నలు పొందిన కుటుంబం: అంబటి మురళీకృష్ణ మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన కుటుంబం పిన్నెల్లి కుటుంబమని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీచేసి గెలుపొందేవార న్నా రు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండడంతో ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చేవరన్నారు. మాచర్లలో ఎలాగైనా పట్టుసాధించాలని పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించినట్టు ఆరోపించారు. కోర్టు పిన్నెల్లి సోదరులకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించినా 27 రోజులుగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. -
భక్తిశ్రద్ధలతో ముగ్గురు రాజుల తిరునాళ్ల
పెదకూరపాడు: ముగ్గురు రాజులు మాదిరి ప్రతి కథోలికులు ఏసుక్రీస్తును అనుసరించి తమ జీవితాలను అర్పించాలని గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య అన్నారు. మండలంలోని పాటిబండ్ల గ్రామంలో ముగ్గురు రాజుల మహోత్సవం మంగళవారం క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దేవాలయం ఆవరణలో సమష్టి దివ్య పూజాబలిని పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో గురువులను దైవ సేవకు ఇచ్చిన పాటిబండ్ల గ్రామం పుణ్యభూమి అని కొనియాడారు. శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత కలిగి క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని తెలిపారు. ప్రతి కథోలికులు దైవచింతనతో మెలగాలన్నారు. పూర్ణకుంభంతో భక్తులకు ఆశీస్సులు అందించారు. వేలాది మంది భక్తులు దివ్య పూజా బలిలో పాల్గొన్నారు. ఊరంతా సందడి ముగ్గురు రాజుల మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది కథోలికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందమందికి పైగా విదేశీ భక్తులు ప్రత్యేక దివ్య పూజ బలిలో పాల్గొని మహోత్సవంలో సందడి చేశారు. కోలాటం, భజన, సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. భక్తులు కొవ్వొత్తులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దైవ సేవ చేస్తున్న 100 మంది మత గురువులు, మఠ కన్యలు, మహోత్సవంలో పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కనుల పండవగా తేరు ఊరేగింపు ముగ్గురు రాజుల మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భారీ బాణసంచా ఆకట్టుకుంది. అనంతరం తేరును బ్యాండ్ వాయిద్యాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ముగ్గురు రాజులకు కొవ్వొత్తులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈదా సాంబిరెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వట్టి శ్లీవారెడ్డి, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, మఠ కన్యలు, పాల్గొన్నారు. సీఐ పత్తిపాటి సురేష్, ఎస్సై గిరిబాబుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య -
కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దాం
నరసరావుపేట: జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లపై తొలి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కోటప్పకొండలో జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభలు తరలింపునకు ఎటువంటి అంతరాయం కలుగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పడిన వ్యర్థాలను తొలగించే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లో ఉండే భక్తులకు వాటర్ ప్యాకెట్లు అందజేయాలని కోరారు. కొండ కింద నుంచి పైవరకు భక్తుల తరలింపునకు ఘాట్ రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అదనపు వాహన డ్రైవర్లు, మెకానిక్లు, భారీగా ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు. 108 వాహనాలు, క్యూలైన్ల వద్ద, మెట్లమార్గంలో, కొండపైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయశాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుచుకొని, అధికారులందరితో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రమాద రహిత జిల్లాగా పల్నాడు పల్నాడును రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయటం కోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కలెక్టరేట్లో రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత రహదారులు భవనాల శాఖ అధికారి గీతారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల డేటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాతీయ భద్రత రహదారి ఉత్సవాలపై రూపొందించిన పోస్టర్, కరపత్రాలను కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్టీసీ ఆర్.ఎం టి.అజితకుమారి, ఆర్టీవో సంజీవకుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, ఎన్జీఓ సేఫ్టీ కన్వీనర్ దుర్గాపద్మజ, డీఎస్పీలు, ఎకై ్సజ్శాఖ అధికారి, అధికారులు పాల్గొన్నారు.తొలి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ -
● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుంచి రానున్న క్రైస్తవ సోదరులు
పాటిబండ్లకు ఆధ్యాత్మిక శోభ పెదకూరపాడు: పాటిబండ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ విరజల్లుతుంది. ముగ్గురు రాజుల దేవాలయం తిరునాళ్లకు సిద్ధమైంది. తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాలలో ఉన్న మత గురువులు, మతకన్యలు, క్రైస్తవ సోదరులతో రానున్నారు. ఆదర్శవంతమైన సంఘంగా, విశ్వాసానికి ప్రత్యేకంగా పాటిబండ్లలో నిర్మించిన ముగ్గురు రాజుల దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. హాలెండ్లోని మిల్ హిల్ సభకు చెందిన మత గురువు ఫాదర్ గ్లైస్మాన్ 1921లో ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇక్కడ ముగ్గురు రాజుల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఆలయంలో శిల్ప కళలు చూపర్లను కట్టిపడేస్తాయి. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 5,6,7 తేదీలతో ముగుస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక దివ్య పూజ నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించే మహోత్సవంలో గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య ప్రత్యేక దివ్య పూజ నిర్వహించనున్నారు. మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయరాజు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెదకూరపాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. -
అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
నరసరావుపేట: అధికారుల సమక్షంలో రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకే రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో రెండోవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ను పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కార ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి ఉండగా ఆయా డివిజన్ల వారీగా అర్జీలు స్వీకరించేందుకు టెంట్లు వేసి ఏర్పాటు చేశారు. వాటిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ప్రారంభం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ, పార్టిషన్, ప్రైవేటు వివాదాలు మినహా మిగతా సమస్యలు అన్నింటిని వెంటనే పరిష్కరిస్తారన్నారు. సర్వేకు సంబంధించిన వాటికి ఒక వారం సమయం పడుతుందన్నారు. కోర్టుకు సంబంధించినవి అయితే ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశామన్నారు. స్వయంగా తహసీల్దార్లనే ఇక్కడకు పిలిపించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. టోకెన్ల ప్రకారం అర్జీల పరిష్కారం చేస్తామన్నారు. రెవె న్యూ క్లినిక్కు వచ్చేవారందరూ తమ వద్దనున్న డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. దీనిని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పింఛన్లు కావాలంటూ తన వద్దకు వచ్చిన దివ్యాంగుల సమస్య తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ, మూడు డివిజన్ల ఆర్డీఓలు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
పిడుగురాళ్ల: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ మాట్లాడుతూ పిడుగురాళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల 400 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పట్టణ సీఐ ఎస్ వెంకట్రావు, ఎస్ఐ డి.శివనాగరాజుల బృందం చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వెన్ను తిరుమలరావు, సాదుపాటి రాజేష్, నున్సావత్ శివకుమార్, సాదుపాటి గోపి, కొండమోడుకు చెందిన షేక్ బాబావలి, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన తాడిమళ్ల దివ్యబాల, డేగల శిరిష వీరికి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారు కళ్లం టౌన్షిప్ పరిధిలో 60 అడుగుల రోడ్డు చివర పడమర వైపు కొంత మంది గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు వినియోగిస్తున్న స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు దాచేపల్లి పట్టణానికి చెందిన సాకేటి తిరుపతినారం నాయుడు, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన మామిడిశెట్టి మణికంఠలు పరారీలో ఉన్నారు. వీరు విశాఖపట్నం, ఒడిస్సాలో ప్రాంతాల నుంచి కిలో గంజాయిని కిలో రూ. 5000 వేలకు కొనుగోలు చేసి దానిని అరెస్టు అయిన ఏడుగురికి కిలో రూ.10 వేల చొప్పున అమ్మేవారు. ఈ ఏడుగురు పది గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్ కవర్లలో పెట్టి పది గ్రాముల గంజాయి ప్యాకెట్ రూ.300లకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే వీరిపై గంజాయి కేసులు వంటి పలు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, యువత భవిష్యత్కు, సమాజానికి తీవ్ర ప్రమాదమని డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు. నిషేధిత మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా కలిగి ఉండటం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తక్షణమే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం గంజాయిని పట్టుకున్న సీఐ, ఎస్ఐను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐలు బి.శివనాగరాజు, ఎం.మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
క్రోసూరు: మండలంలోని హసనాబాద్ గ్రామంలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి షేక్ ముజావర్ ఖలీల్(11) దగ్గరలోని కొండప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటంతో గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, సీఐ సురేష్, ఎస్ఐ పి.రవిబాబు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాలు...హసనాబాద్కు చెందిన ముజావర్ బూరిసైదా గ్రామంలో విద్యుత్ పనులకు వెళ్తుంటాడు. ఆయన భార్య చాలా సంవత్సరాల కిందట మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షేక్ ముజావర్ ఖలీల్(11) ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావటంతో మృతుడు(ఖలీల్) తన స్నేహితులు మరో ముగ్గురితో కలసి రేగుపండ్ల కోసుకునేందుకు కొండ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కొంత సమయం ఉన్న తరువాత ఖలీల్ తాను తర్వాత వస్తా మీరు వెళ్లండని చెప్పడంతో స్నేహితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఖలీల్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఘర్షణ జరిగి కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో చిన్నపాటి కత్తి దొరికింది. మృతదేహంపై రక్తపు మరకలున్నాయి. సమీపంలోని చిన్న నీటి కుంటలో మృతదేహం పడవేసి ఉంది. డ్కాగ్ స్క్వాడ్ను రప్పించి పరిశీలించారు. కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విద్యార్థి మృతికి గల కారణాలు, హత్య జరిగి ఉంటే ఎవరు చేశారో దర్యాప్తు జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
కార్గో సర్వీసుల ద్వారా...
తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న నకిలీ మందులు రెగ్యులర్ పురుగుమందులు వచ్చే పార్శిల్ సర్వీసుల్లో కాకుండా వివిధ రకాల ట్రాన్స్పోర్టు కంపెనీ ద్వారా పల్నాడు జిల్లాలోకి చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా పురుగుమందులు రవాణా అవుతున్నాయి. వీటిని పట్టుకుంటున్న విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు శాంపిల్స్ తీసి ల్యాబ్లకు పంపుతున్నారు. మరోవైపు కొంతమంది తెలంగాణకు చెందిన డిస్టిబ్యూటర్లు జీఎస్టీ పన్నులు కట్టకుండా అక్రమంగా రాష్ట్రంలోకి తరలించి తమ సేల్స్ను పెంచుకొని లాభపడుతున్నారు. వీటి వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడటంతోపాటు రైతులకు బిల్లులు అందక నష్టపరిహారానికి అనర్హులవుతారు. అధిక లాభాలకు ఆశపడ్డ కొందరు వ్యాపారులు ఈ నకిలీ, బిల్లులులేని మందులను రైతులకు అంటగడుతున్నారు. -
పవర్ లిఫ్టింగ్, బెంచ్ప్రెస్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక
సత్తెనపల్లి: హరియాణాలో ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ పోటీల రాష్ట్ర జట్టును పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పవర్ హౌస్ ఫిట్నెస్ నందు సోమవారం ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికై న జట్టు జాతీయ స్థాయిలో జరిగే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ అండ్ ఉమెన్ ఏక్విప్పెడ్ అండ్ అన్ ఏక్విప్పెడ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పల్నాడు జిల్లా సెక్రెటరీ పసుపులేటి సురేష్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగం నుంచి 53 కేజీల్లో కత్తి కార్తీక్(గురజాల), 74 కేజీల్లో షేక్ మొహిద్దిన్ (సత్తెనపల్లి), జూనియర్ విభాగం నుంచి 83 కేజీల్లో పసుపులేటి వంశీ కృష్ణా (సత్తెనపల్లి), 120 కేజీల్లో లింగిశెట్టి శివ నాగేశ్వరరావు(సత్తెనపల్లి) ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి బాధ్యులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ జిమ్ము రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్య, తదితరులు ఉన్నారు. -
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయి ఇండియన్ ఖేలో ఫుట్బాల్ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివ సాయి ఫుట్బాల్ క్లబ్కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికై నట్లు కోచ్ పాలపర్తి సురేష్ సోమవారం తెలిపారు. గత నెల 21 నుంచి 23 వరకు బెంగళూరులో జరిగిన జోనల్ పోటీల్లో నల్లగొండ రమ్య, తిరునవల్లి నాగసాయి మహేశ్వరిలు ప్రతిభ చూపారన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు ముంబయిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్య వహిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను పలువురు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. -
రైతును ముంచుతున్న నకిలీలు
సాక్షి, నరసరావుపేట: గురజాల మండలానికి చెందిన రైతులు రెండు నెలల క్రితం స్థానిక వ్యాపారి వద్ద పురుగు మందులు కొనుగోలు చేశారు. అవి వాడిన పంటలలో ఏ మాత్రం చీడపీడల నివారణ జరగకపోవడంతో వ్యాపారిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారుల ఇళ్లలో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ పురుగుమందులను పోలీసులు గుర్తించారు. విచారణలో తనకు తెలంగాణకు చెందిన ఓ డీలర్ ద్వారా ఎటువంటి బిల్లులు లేని పురుగు మందులు సరఫరా చేస్తారని, వీటి అమ్మకం ద్వారా అధిక లాభాలా వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసిన రైతులు ఆర్థికంగా, దిగుబడి పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వస్తున్న పురుగు మందుల్లో ఏవి నకిలీవో, ఏవి అసలైనవో గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు డీలర్లు, వ్యాపారులు రైతులను నకిలీలతో నిలువునా మోసం చేస్తున్నారు. బిల్లులు లేకపోవడంతో రైతులు సదరు మందుల కంపెనీపై న్యాయపరమైన పోరాటానికి సైతం వీలులేకుండా పోతోంది. మార్కెట్లో నకిలీ పురుగు మందులు విపరీతంగా అమ్ముతున్నారు. ముఖ్యంగా వరి, పత్తి రైతులు అధికంగా వినియోగించే దోమ, గులాబి రంగు పురుగు నివారణ మందులకు నకిలీలు సృష్టించి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లో బయో ఉత్పత్తులు తయారు చేసే కొన్ని కంపెనీలు వీటి మాటున నకిలీ పురుగు మందులు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నట్టు సమాచారం. ప్రముఖ కంపెనీల మాదిరిగా డబ్బాలు, లేబుళ్లు తయారు చేస్తుండటంతో రైతులు తేడా కనుక్కోలేక పోతున్నారు. మరోవైపు చాలా రోజులుగా తాము కొంటున్న దుకాణాలలోనే నకిలీలు లభిస్తుండటంతో వ్యాపారులపై ఉన్న నమ్మకంతో రైతులకు అనుమానం సైతం కలగడం లేదు. ఈ నకిలీ ముఠాల టార్గెట్ మారుమూల పట్టణాలు కావడంతో వీరి పని మరింత సులువవుతోంది. ప్రముఖ కంపెనీల పురుగుమందులు కొనుగోలు చేసేటప్పుడు మందు డబ్బాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను యాప్ ద్వారా స్కాన్ చేస్తే అది అసలైనదా లేదా నకిలీదా అని గుర్తించే అవకాశం ఉంటుంది. రైతులు ఆయా కంపెనీ యాప్ లేదా గూగుల్ లెన్స్ వంటి వాటి ద్వారా చెక్చేసుకోవచ్చు. అయితే గ్రామీణ రైతులందరికి ఈ పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. నకిలీ డబ్బాలపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది, అయితే దాన్ని స్కాన్ చేస్తే కంపెనీ వివరాలు కనిపించవు.జిల్లాలో ఇటీవల కాలంలో గురజాల, పిడుగురాళ్ల, నరసరావుపేటలలో పురుగు మందులను ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నాం. వాటి శాంపిల్స్ సేకరించి నకిలీవి కాదని నిర్ధారించుకున్న తరువాత సంబంధిత బిల్లులను చూసి వ్యాపారులకు అప్పగించాం. నరసరావుపేటలో పట్టుబడిన వాటిని ఎవరూ ఇప్పటివరకు క్లైమ్ చేసుకోలేదు. శాంపిల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇవన్నీ ఎక్కవ వరకు రైతులు బుక్ చేసుకున్నవి, చిన్న చిన్న వ్యాపారులు బుక్ చేసుకున్న మందులే ఉంటున్నాయి. నకిలీ మందులు గుర్తించలేదు. దుకాణాలు, కార్గో సర్వీసులపై నిరంతరం నిఘా ఉంచాం. నకిలీ మందులు సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయవచ్చు. – జగ్గారావు, పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
రొంపిచర్లలో విజిలెన్స్ దాడులు
50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత నరసరావుపేట టౌన్: అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామం నుంచి రామిరెడ్డిపాలెం వైపు అక్రమంగా మినీ లారీలో బియ్యం రవాణా చేస్తున్నారన్నా సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 50 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావుకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మంగళగిరిటౌన్: త్వరలో జరగనున్న సౌత్జోన్ ఆలిండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్కు సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని స్టోర్స్ ఐజీపీ ఏవీ మోహనరావు తెలిపారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏపీ పోలీస్ స్టేట్ టి–20 సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఈ సెలక్షన్లు జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు మంగళగిరి స్టేడియం, మూలపాడు స్టేడియంలలో జరగనున్నట్లు పేర్కొన్నారు. -
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామికి విశేష అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్రోడ్లో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి గంధంతో అలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు నూజెండ్ల: నూజెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వేకువజాము నుంచి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించి విశేష పూజలు చేశారు. గ్రామంలోని నలుదిక్కులు ఏర్పాటు చేసిన పాదులకు మేళతాళాల నడుమ వైభవంగా 108 బిందెలతో గ్రామస్తులు జలాభిషేకం చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నరసరావుపేట టౌన్: నరసరావుపేట కోర్టు ఆవరణలో పల్నాడు జిల్లా ఏఆర్ ఏఎస్పీ సత్తిరాజు ఆధ్వర్యంలో సోమవారం సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆవరణలో భద్రతాపరమైన అంశాలను పరిశీలించి న్యాయస్థానం ఏవోకు పలు సూచనలు చేశారు . ప్రహరీ గోడపైన ఇనుప కంచె నిర్మించాలని సూచించారు. కోర్టు ఆవరణలోకి వచ్చే కక్షిదారులను తనిఖీ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే సమయంలో సాయుధ భద్రతనుఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. జనరేటర్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఆవరణలో రాత్రి సమయంలో విద్యుత్ కాంతి ఉండేలా లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. సత్తెనపల్లిలో 100 అడుగుల జాతీయజెండా ఆవిష్కరణ సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో రూ.18.40 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను రాష్ట్ర విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చల్లం చర్ల లక్ష్మీతులసీ, కమిషనర్ నంబూరి ఆనంద్కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026స్వామివారికి విశేషార్చన పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత శ్రీ వరదరాజస్వామి సోమవారం ప్రాతః కాలంలో విశేషార్చనలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెనాలి: తెనాలి మార్కెట్యార్డుకు సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3500, మోడల్ ధర రూ.2300 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 560.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 81 ఫిర్యాదులు అందాయి. గుప్త నిధుల పేరిట రూ.50లక్షలు మోసం తమ పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, పూజలు చేసి వెలికి తీయాలంటే రూ.50లక్షలు ఖర్చవుతుందని తెలంగాణ రాష్ట్రం తొర్రూరు మండల కేంద్రానికి చెందిన అల్లం ప్రసాదు, అల్లం హుస్సేన్లు చెప్పిన మాటలు విని మోసపోయినట్టు అమరావతి మండలం ధరణికోటకు చెందిన తాళ్లూరి శంకర్ ఫిర్యాదు చేసాడు. వినుకొండకు చెందిన కిషోర్బాబు ద్వారా ప్రసాద్, హుస్సేన్లు పరిచయమై తమకు చెందిన భూమిలో నిధి ఉందని చెప్పినట్టు పేర్కొన్నారు. నిధిని బయటకు తీయాలంటే రూ.50లక్షలు ఖర్చవుతుందని చెప్పారని, నిధి దొరుకుతుందనే ఆశలో పొలాన్ని, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.47లక్షలను 2024 జులైలో అందజేసినట్టు తెలిపాడు. తొమ్మిది రోజుల తరువాత పూజలు చేసి తవ్వగా నకిలీ రాగి ముద్దలు, గాజు ముక్కలు, నాణేలు బయటకు తీసారన్నారు. దీనిపై ప్రశ్నించగా తమపై దాడికి యత్నించారు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. నాకు తెలియకుండా నా పేరిట రుణం భోజన్ హోటల్లో కూలి పనిచేసుకునే తనకు తెలియకుండా మా యజమాని రూ.2లక్షల ముద్రాలోన్ తీసుకున్నాడని చిలకలూరిపేట సుగాలితండాకు చెందిన జల్ల ఝాన్సీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విజయబ్యాంక్ పక్కనే ఉండే వేద సురచి హోటల్లో ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నానని, తన ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకుని ఎస్బీఐలో రూ.2లక్షలు రుణం తీసుకున్నట్టు తెలిపింది. బ్యాంక్లో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన నాకు లోన్ విషయం బ్యాంక్ సిబ్బంది తెలిపినట్టు ఫిర్యాదులో పేర్కొంది. మోసం చేసి లోన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని.. వినుకొండ మున్సిపాలిటిలో టీఎల్ఎఫ్ కార్మికుడిగా పనిచేస్తున్న శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన వేల్పుల బాబురావును వినుకొండకు చెందిన ఎస్కే నాగూర్వలి ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తానని మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. రాజకీయ నాయకులు తనకు తెలుసని మాయమాటలు చెప్పి తన వద్ద రూ.2లక్షలు తీసుకున్నాడని తెలిపాడు. ఉద్యోగ విషయం అడుగుతుంటే సమాధానం చెప్పకుండా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. భార్య, ఆమె బంధువులతో ప్రాణహాని.. భార్య, వారి బంధువులు ఇంటిని ఆక్రమించారని, ప్రాణభయంతో బయట బతుకుతున్నామని వినుకొండ 16వ వార్డుకు చెందిన కోటేశ్వరరావు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఏడు నెలల క్రితం నడిగడ్డకు చెందిన గుంతనాల గోపిలక్ష్మీతో వివాహం అయినట్టు తెలిపాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరింపులకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నెలలో భార్య తరఫున వారు వంద మంది ఇంటిపై దాడి చేసారని తెలిపాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇంటిని ఆక్రమించారని తమకు రక్షణ కల్పించాలని కోరారు. కులం పేరుతో దూషించి, అక్రమ కేసు.. కులం పేరుతో దూషించడంతో పాటు అక్రమ కేసులు పెట్టి తనను వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు, నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన జొన్నలగడ్డ చందు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే మూడు అక్రమ కేసులు తనపై బనాయించినట్టు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం బైక్పై ఇంటికి వెళుతున్న తనను నిలిపివేసి గ్రామానికి చెందిన మండవ హనుమంతురావు దుర్భాషలాడాడని తెలిపాడు. కులం పేరుతో దూషించాడని.. దీనిపై నాదెండ్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. -
సెమీ ఫైనల్స్కు కేఎల్యూ జట్టు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్–2026 పోటీలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సౌత్జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ.. ఎనిమిది జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయని తెలిపారు. సెమీ ఫైనల్స్ క్రీడలు రాత్రి కూడా జరగనున్నాయని.. సోమవారం సాయంత్రం 5వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కేఎల్యూ జట్టు చైన్నెకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్స్లో తలపడనుందని తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ జట్టుపై కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ విజయం సాధించిందని పేర్కొన్నారు. వీటితో పాటు మరో ఆరు జట్లు సెమీ ఫైనల్స్లో తలపడుతున్నాయని.. సెమీ ఫైనల్స్ ముగిసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు వివరించారు. -
‘ఉపాధి’ చట్టాన్ని యథాతఽథంగా అమలు చేయాలి
అమరావతి: 2005 నుంచి కొనసాగుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం–2025 వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ చట్టానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలకమైన నాలుగు అంశాలను రద్దుచేసి కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం 2025 డిసెంబర్లో నూతన చట్టాన్ని తెచ్చి పాత చట్టంలో ఉన్నటువంటి ఉపాధికి గ్యారెంటీ అంశాన్ని రద్దు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి కుదించి రాష్ట్రాలు 40 శాతం భరించాలని సవరణ చేయటం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల పాలై అధోగతిలో ఉంటే 40శాతం నిధులు భరించే స్థితి లేక ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తాయన్నారు. పాత చట్టంలో 100 రోజులు ప్రతి కుటుంబం తమకు అవకాశం ఉన్న సందర్భంలో పనికి హాజరుకావచ్చని, కొత్త చట్టంలో ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే వర్తింపచేయటం కూలీల కడుపుకొట్టటమేనన్నారు. కొత్త చట్టం వల్ల లక్షలాది గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు పని లేక వలసలు పోవాల్సి వస్తుందన్నారు. అనంతరం స్థానిక గ్రామ సచివాలయం వద్ద జరుగుతున్ గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, ఎస్కే రఫీ సయ్యద్ బహుదిన్ వలి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు నండూరి వెంకటేశ్వరరాజు, మండల కన్వీనర్ పి.సత్యనారాయణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. -
అమెరికాలో వాలీబాల్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యాన జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. స్ధానిక వివిధ పార్టీల నాయకులు క్రీడాకారుడు ఈశ్వర్ను సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురుమాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026● వాటి మేళవింపుతోనే లోక కల్యాణం ● ఉత్తరాఖండ్ ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి ● మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో అనుగ్రహ భాషణం గుంటూరు ఎడ్యుకేషన్: భాష, సంస్కృతుల మేళవింపుతో లోక కల్యాణానికి కృషి చేయాలని ఉత్తరాఖండ్లోని జగద్గురు ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సభలో ఆయన దివ్య అతిథిగా పాల్గొన్నారు. జగద్గురు ఆది శంకరాచార్య ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా పర్యటించారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం, భాష ఎక్కడైతే మనుగడ సాగిస్తాయో అక్కడ జీవన విధానం వెల్లివిరుస్తుందన్నారు. వసుదైక కుటుంబ భావనతో ప్రజలు కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అప్పుడే లోక కల్యాణం సాధ్యపడుతుందన్నారు. దేశంలో ఎక్కడ పుట్టినా అంతా ఏకమనే భావన రావాలని చెప్పారు. కేరళలోని కాలడిగిలో జన్మించిన జగద్గురు ఆది శంకరాచార్య దేశం మొత్తం ఒక్కటనే భావన తెచ్చేందుకు నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను స్థాపించారని అన్నారు. ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించి, ముందుకు వెళ్లేవారికి దైవం అండగా ఉంటుందని చెప్పారు. భాషను రక్షించుకోవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. దేశం ఆధ్యాత్మికంగా విశ్వగురువుగా నిలిచిందని, గోవులను రక్షించుకోవడం మన జీవన విధానంలోనే ఉందన్నారు. తల్లిని దైవంగా భావించుకునే గొప్ప సంస్కృతి, ఋషుల ద్వారా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం, గొప్ప పుణ్యనదులు దేశానికి తరగని సంపద అని అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మారిషస్లో తెలుగు ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారని చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో బోధన కోసం పోరాటం చేస్తుండగా, మారిషస్లో కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన ఉందని చెప్పారు. మాతృభాష పరిరక్షణపై ప్రజలతోపాటు ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరమ్ బీర్ గోకుల్కు భారత మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.చీరాల రూరల్: చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్ జరగడంతో సందడి వాతావారణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్ర స్నానానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్ చూడటానికి ఆసక్తి చూపారు. తమ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్ బ్యానరుపై మాస్టర్ కనిష్క సమర్పిస్తున్న ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్, మౌనిక శర్మ జంటగా నటిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర పాత్రల్లో సుహాసినీ మణిరత్నం, వినోద్కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. కొరియోగ్రఫీ సంతోష్, బాలకృష్ణ, ఫైట్స్ రాజు సమకూరుస్తున్నట్లు ఆయన వివరించారు. పి.నాగరాజు నిర్మాత అని తెలిపారు. 7శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను జరుపుకొన్నంత ఆనందంగా ఉగాదిని జరుపుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహించడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగులో విద్యాబోధన చేయించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, తెనాలికి చెందిన శిల్పి రామలింగేశ్వరరావు, మెట్రో ఇండియా చైర్మన్ సీఎల్ రాజమ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 3,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 40.3045 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయ అన్న ప్రసాద వితరణకు ఒంగోలుకు చెందిన ప్రసాద్, లక్ష్మి, శివకృష్ణలు ఆదివారం రూ.లక్ష విరాళమిచ్చారు.విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 560.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 18,678 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ చించిన గుర్తుతెలియని వ్యక్తులు
నరసరావుపేటరూరల్: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటన మండలంలోని ఇస్సపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు పది రోజుల క్రితం గ్రామంలోని దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద స్థానిక వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను ఫ్లెక్సీపై ముద్రించారు. అయితే ఈ ఫ్లెక్సీని శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేసారు. దీనిపై స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసరావుపేట రూరల్: ఆటోను లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కేసానుపల్లి సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన గూడూరు మరియల(50), కంభంపాటి దేవసహాయంతోపాటు పమిడిపాడుకు చెందిన మరో ముగ్గురు నెల్లూరు జిల్లా కావలిలో పాత రైస్మిల్లో సామాగ్రిని తొలగించే పనిని ఒప్పుకున్నారు. వీరు శనివారం రాత్రి నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కేసానుపల్లి సమీపంలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆటోను గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరియల గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన న్యాయవాది, ఆర్యవైశ్య నాయకుడు దివ్వెల శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలను గుర్తించిన విశ్వజనని ఫౌండేషన్ స్వర్ణ నంది అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సినీనటులుపూర్ణిమ, బాలాజీ, అంతర్ముఖం సినిమా హీరోయిన్ సృజన, ప్రముఖుల చేతులమీదుగా దివ్వెల శ్రీనివాసరావుకు అవార్డు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దివ్వెలను పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. ఆదినుంచి భగవంతుడు తన పవిత్రగంథం ద్వారా తన కుమారుడు భూమిపై లోక రక్షకుడిగా జన్మిస్తాడని తెలిపారన్నారు. పరలోక రాజ్యం యూదులకే కాదని ప్రతి ఒక్కరికి ఉందని.. అందుచేతనే దీనిని ముగ్గురు రాజుల పండుగగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు భూమిపై ప్రతి ఒక్కరిని రక్షించేందుకు జన్మించాడన్నారు. సత్యం తెలియజేసేందుకు గాను మానవుడిగా క్రీస్తు జన్మించి దానిని ప్రతి ఒక్కరికీ తెలియజేసినట్లు చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. సహాయ విచారణ గురువులు సాగర్, మఠకన్యా సీ్త్రలు, సోడాలిటీ సభ్యులు, ప్యారిష్ కౌన్సిల్, గుడిపెద్దలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు. నగరంపాలెం: ఈనెల ఐదో తేదిన గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నిర్వహించనున్న పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) అనివార్య కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాయలం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని అన్నారు. -
మనుధర్మాన్ని మహిళలపై రుద్దుతున్న బీజేపీ
సత్తెనపల్లి: సనాతన ధర్మం పేరుతో బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని మహిళలపై రుద్దుతూ మహిళలపై దాడి చేస్తుందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని విమర్శించారు. పట్టణంలోని పార్క్రోడ్లో గల బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం ఐద్వా పట్టణ కార్యదర్శి గద్దె ఉమశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సావిత్రి బాయిపూలే జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ ఆ రోజుల్లో బాల్యంలోనే వివాహాలు జరగడం వల్ల భర్త చనిపోతే భార్య కూడా భర్తతోపాటు సితిమంటల్లో చనిపోవటం అంటే సతీసహగమనం దురాచారం ఉండేదన్నారు. మహిళలను చదువుకోకూడదని, భర్త చనిపోతే భార్యలు వితంతువుగానే ఉండాలనే వంటి దురాచారాలను కందుకూరి వీరేశ లింగం పంతులు, రాజా రామ్మోహన్రాయ్, సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్త లు ఆ దురాచారాలను రూపుమాపడంతో నేటి సమాజంలో మహిళలు అని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడి సమానత్వం వైపు పయనిస్తున్నారన్నారు. కాని నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని మహిళలపై రుద్దుతూ రూపుమాపబడిన ఆ దురాచారాలన్నిటిని మళ్లీ అమలు చేయాలని చూస్తున్నారన్నారు. అలా చేస్తే మహిళలకు పుణ్యం వస్తుందని నమ్మపలుకుతున్నారన్నారు. సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ఆ దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వసతిగృహ విద్యార్థినులు, తదితరులు ఉన్నారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రజిని -
జాతీయ స్థాయిలో మెరిసిన శ్రీవల్లి
యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎన్వీలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్ రీజియన్ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్వీలకే పరిమితం కాదు. సీబీఎస్ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యాన హిమాచల్ ప్రదేశ్లో జరిగే అండర్ –19 జాతీయ పోటీలకు జేఎన్వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ జేఎన్వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల. కబడ్డీ నేషనల్ (జేఎన్వీ) బెస్ట్ రైడర్గా ఎంపిక మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని ప్రతిభ త్వరలో జాతీయస్థాయి పోటీలకు హాజరు ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్’గా గుర్తింపు పొందింది. కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు. -
దేశీయ కూరగాయల సాగులో భేష్
రేపల్లె: పట్టణంలో కాళేపల్లి హరిణి నేతృత్వంలో పది మంది మహిళలు ‘సా – సేవ్ – షేర్’ నినాదంతో గార్డెన్ బ్లూమ్స్ పేరుతో టెర్రస్ గార్డెన్ల ఏర్పాటుకు ఊతమిస్తున్నారు. 2003 నుంచి తోటి మహిళలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ జనవరి నాటికి బ్లూమ్స్ సభ్యుల సంఖ్య వంద దాటింది. దేశీయ విత్తనాలు మాత్రమే అందరూ వినియోగిస్తున్నారు. తొలుత సాగు చేసిన వారు తోటి మహిళలకు వాటిని అందిస్తున్నారు. టెర్రస్, బాల్కనీ, చిన్న ప్రాంగణాలలో టమాటా, బంగాళదుంప, బీరకాయ, నేతిబీర, చిక్కుడు, వంకాయ, బెండకాయ, మిరప, కొత్తిమీర, పాలకూర, పొట్లకాయ, సొరకాయ వంటి కూరగాయలు పండిస్తున్నారు. పోషకాలే ప్రధానం మార్కెట్లో కొత్త విత్తనాలతో పండే పంటలలో కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటున్నాయి. ఫైబర్, ప్రోటీన్ పాళ్లు తగ్గిపోతున్నాయి. దేశీయ విత్తనాల సాగుతో ఇవన్నీ సమపాళ్లలో అందుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. పెరటిలో నాటి ప్రకృతి సిద్ధమైన, గోఆధారిత ఎరువులతో పెంచుతున్నారు. దీంతో కూరగాయల్లో పౌష్టిక విలువలు మెరుగ్గా ఉంటున్నాయి. రైతులు సంరక్షించిన విత్తనాలను వినియోగంలోకి తీసుకురావటం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని మహిళలు భావిస్తున్నారు. వర్క్షాప్లు, ఆన్లైన్ సమావేశాల ద్వారా కొత్త వారికి సాయం చేస్తున్నారు. -
నేడు మంగళగిరికి మారిషస్ అధ్యక్షుడు
మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆ లయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం అమృత వర్షిణి అలంకారంలో పూజలందుకున్నారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యాంక్ కెనాల్కు 106 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 306, పశ్చిమ కాలువకు 126, నిజాంపట్నం కాలువకు 168, కొమ్మూరు కాలువకు 1,271 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలిపారు. -
మట్టి తవ్వకాలపై తనిఖీలు
● త్రిపురాపురం మైనింగ్ క్వారీ వద్ద అధికారుల కొలతలు ● సాక్షి కథనానికి స్పందన నకరికల్లు: మండలంలోని త్రిపురాపురం మైనింగ్ క్వారీని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఆదివారం తనిఖీ చేశారు. ఎర్రమట్టి కొల్లగొట్టి రూ.కోట్లు దండుకుంటున్న పచ్చబ్యాచ్ అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి మూడు శాఖల అధికారులు స్పందించారు. మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతిరావు, ఆర్ఐ టి.సిద్దయ్య, నకరికల్లు ఎస్ఐ కె.సతీష్లు కలిసి త్రిపురాపురం కొండలో మట్టితవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. మైనింగ్ సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని కొలతలు తీసి హద్దులు నిర్ణయించారు. షాడో ఎమ్మెల్యేల ఒత్తిడి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టితవ్వకాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కానీ మట్టి క్వారీలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో హద్దులు దాటి తవ్వకాలు జరిగినప్పటికీ షాడో ఎమ్మెల్యేల ఒత్తిడిలతో సదరు వాస్తవాన్ని బయటపెట్టేందుకు వెనుకాడినట్లు సమాచారం. చివరికి అక్రమ తవ్వకాలు జరగలేదని వారు నిర్ధారించారని స్థానికులు, విస్తుపోతున్నారు. -
సీఎం వస్తే మొక్కల ఖర్చే రూ.లక్షలు!
నెహ్రూ నగర్: గుంటూరు నగరానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే చాలు.. నగరపాలక సంస్థ రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు తీసుకురావడం పరిపాటిగా మారింది. గత సంవత్సరం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గుంటూరు వచ్చిన సీఎంకు గుంటూరులో పచ్చదనం కనిపించేలా రోడ్లమీద, డివైడర్ల మీద ప్రత్యేకంగా రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు పెట్టారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తెచ్చిన కొద్ది రోజులకే ఎండిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. దీనికి సంబంధించిన బిల్లు సుమారు రూ. 30 లక్షలు ప్రాసెస్ చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం గుంటూరు నగర పరిధిలో ఉన్న శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దీంతో మళ్లీ పలు రోడ్లు మెరిసిపోతున్నాయి. రోడ్డుకు రెండు పక్కల మొక్కలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అరండల్పేటలోని పాత కమిషనర్ బంగ్లాలో లారీల్లో మొక్కలు దింపడంపై ప్రజలు విస్తుపోతున్నారు. మొక్కలు తీసుకురావడంపై ఉన్న శ్రద్ధ వాటిని పరిరక్షించడంపై కూడా చూపాలని నగరవాసులు కోరుతున్నారు. -
వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి
తాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వడ్డమానులో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. గేదెలు కాసుకునేందుకు వెళ్లగా కర్రతో విచక్షణా రహితంగా దాడిచేసిన గుర్తు తెలియని వ్యక్తి పరారీ కాగా రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన మేళం కోటేశ్వరమ్మ గేదెలు కాసుకునేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి కరత్రో విచక్షణరహితంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. దీంతో దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం లాక్కెళ్లాడు. గేదెలు కాసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలికి తలకు 30 కుట్లు పడ్డాయని, ఘటన అనంతరం ఆమె మానసిక స్థితి సైతం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పిల్లలు సైతం భాగస్వాములే
రసాయన ఎరువుల వినియోగం లేకుండా దేశీయ విత్తనాలతో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరలు, పండ్లు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. సాగుతో పొలంలో ధాన్యం, ఇతర పంటలు పండించే రైతుల కష్టం తెలుస్తోంది. నాతోపాటు మా పిల్లలను సైతం గార్డెన్లో మొక్కల పెంపకంలో భాగస్వాములను చేస్తున్నా. మా పిల్లలకు పని విలువ తెలపటంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతులను వివరిస్తున్నాను. రోజూ కూరగాయల కోసం పరుగులు పెట్టాల్సిన పని తప్పింది. మంచి ఆరోగ్యంతోపాటు డబ్బు, సమయం ఆదా అవుతోంది. – దివ్యజ్యోతి, రేపల్లె -
2వ రోజుకు చేరిన పురుషుల బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 పోటీలు ఆదివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. సౌత్జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ రెండవ రోజు పోటీలలో రెండు, మూడు రౌండ్లు పూర్తయ్యాయని, రెండవ రౌండ్లో మొత్తం 64 జట్లు పోటీ పడ్డాయని, వాటిలో 30 జట్లు గెలుపొందాయని పేర్కొన్నారు. రెండవ రౌండ్లో గెలుపొందిన 30 జట్లు ఆదివారం మధ్యాహ్నం మూడవ రౌండ్లో తలపడ్డాయని, 3వ రౌండ్లో ఆంధ్రాకు చెందిన జెఎన్టీయూ కాకినాడ జట్టు కర్ణాటకకు చెందిన గార్డెన్ సిటీ యూనివర్సిటీపై విజయం సాధించిందని వివరించారు. సోమవారం సెమీ ఫైనల్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగుతాయని హరికిషోర్ పేర్కొన్నారు. -
రోగాలూ ఎంతో ఫాస్ట్
● నాణ్యతలేని ఫాస్ట్ఫుడ్తో అనారోగ్యం ● చిన్న వయస్సులోనే గ్యాస్ట్రబుల్ సమస్యలు ● జంక్ ఫుడ్తో పెరుగుతున్న వ్యాధులు ● కనీసం పట్టించుకోని అధికారులు జిల్లాలో వెయ్యికిపైగా షాపులు... వ్యాధులకు కారణాలు నేడు ఎంతో మంది బయటి ఆహారం ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు సైతం ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
మరింత విస్తరించేందుకు కృషి
దేశీయ విత్తనాల ఉత్పత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా పది మందితో గ్రూపు ప్రారంభించా. నిత్యం సాగు చేసే కూరగాయల యాజమాన్యంతోపాటు సేంద్రియ ఎరువుల తయారీపై అందరం చర్చించుకుంటాం. ఇలా సాగు చేసే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భవిష్యత్లో మరింత మందిని భాగస్వాములను చేస్తా. విద్యార్థులలో చైతన్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. దేశీయ విత్తన మొక్కలను 200 మందికి అందించా. – కాళేపల్లి హరిణి, గార్డెన్ బ్లూమ్స్ వ్యవస్థాపకురాలు -
ఏపీ ఎన్జీజీఓ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం( ఏపీఎన్జీజీఓ) గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మలేరియా సబ్ యూనియ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఘంటసాల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరులోని ఏపీఎన్జీజీఓ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో సహా మొత్తం 17 పోస్టులకు గాను కేవలం 17 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి, ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు తెలిపారు. ఎన్నికలకు సహాయ అధికారిగా ఆనందనాథ్, పరిశీలకులుగా వి. సుబ్బారెడ్డిలు వ్యవహరించారు. మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ఘంటసాల రికార్డు సృష్టించారు. ఘంటసాల శ్రీనివాసరావు, ఆరాధ్య శ్యామసుందర్ల నాయకత్వంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం భారీ సంఖ్యలో ఉద్యోగులతో ర్యాలీ జరిగింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే ఎన్నికై న అభ్యర్థులతో ఎన్నికల అధికారి కె.జగదీశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డి.వి.రమణల నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా జరిపించిన ఎన్నికల అధికారులు కె.జగదీశ్వరరావు, ఆనందనాథ్, వి.సుబ్బారెడ్డిలను సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. సంఘం నేతలు సూరి, సిహెచ్ కళ్యాణ్ కుమార్, రమేష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సేవా నాయక్, పాపారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గం వివరాలు... జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా సిహెచ్ రాంబాబు, ఉపాధ్యక్షులుగా డి.డి నాయక్, కె.వి.వి కిషోర్, జి.సి.హెచ్ కోటేశ్వరరావు, డి.దుర్గారావు, సి.హెచ్ అనిల్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా వి.శ్రీవాణి, జిల్లా కార్యదర్శిగా ఎ.శ్యామసుందర్ శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కే.ఎన్.సుకుమార్, సంయుక్త కార్యదర్శిలుగా సయ్యద్ జానీబాషా, కె.విజయ బాబు, డి. శ్రీనివాస్, కె.నరసింహారావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయలక్ష్మి, కోశాధికారిగా ఎల్.శ్రీధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక -
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు విశేష స్పందన
తెనాలిటౌన్: ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషస్పందన లభించిందని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా చెప్పారు. ఈనెల 11న నిర్వహించనున్న ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మా–ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం 203 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఆయా షార్ట్ ఫిలింస్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పోటీలకు ఎంట్రీలు పంపిన ఔత్సాహికులు అందరికీ జనవరి 11న తెనాలిలో జరిగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో– కన్వీనర్, సినీదర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలటరీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆ రోడ్డు.. రెండు జిల్లాలది..!
బల్లికురవ: సిమెంట్ రోడ్డు రెండు జిల్లాలకు హద్దుగా మారింది. ఈ రోడ్డు ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా.. దక్షిణం వైపు బాపట్ల జిల్లాలోకి చేరడంతో అయోమయం నెలకొంది. బల్లికురవ నుంచి నక్క బొక్కలపాడు– కొణిదన– రాజుపాలెం మీదుగా ఎన్హెచ్ 16ను కలిపే లింకు రోడ్డు ఉంది. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం రోడ్డు ఉత్తర భాగంలో.. మార్టూరు మండలంలో ఉన్న రాజుపాలెం దక్షిణ భాగంలోకి చేరింది. కె.రాజుపాలెంలో 920 మంది ఓటర్లు, రాజుపాలెంలో 2,400 మంది ఓటర్లున్నారు. మొన్నటి వరకు రెండు మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అంటే మార్టూరు మండలంలోని రాజుపాలెం పర్చూరు నియోజకవర్గంలో.. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం అద్దంకి నియోజకవర్గంలో చేరి ఉన్నాయి. ఇటీవల జిల్లాల పెంపు సర్దుబాటులో భాగంగా బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం ప్రకాశం జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ అద్దంకిలో చేరింది. మార్టూరు మండలంలోని రాజుపాలెం బాపట్ల జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ చీరాల్లోకి వెళ్లింది. అయితే కె.రాజుపాలెం వాసులకు పొలాలన్నీ మార్టూరు మండల పరిధిలోకి చేరడంతో.. రెవెన్యూ పనులకు చీరాల వెళ్లక తప్పదని రైతులు చెబుతున్నారు. అధికారులు తికమక పడుతున్నారు. కాగా కె.రాజుపాలెంలో టీ దుకాణాలు కూడా లేకపోవడంతో రోడ్డు దాటి పక్క జిల్లా అయిన బాపట్లకు వెళ్లాల్సి రావడం కొసమెరుపు. -
ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి
దుర్గి: మండల పరిధిలోని అడిగొప్పల గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడికాలువలో పడటంతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం, పెదగార్లపాడు గ్రామానికి చెందిన పురంశెట్టి నాగరాజు(30) తన అత్తగారి గ్రామమైన దుర్గి మండల పరిధిలోని మించాలపాడు గ్రామంలో నివసిస్తూ స్థానిక డాల్ మిల్లులో పనిచేస్తుంటాడు. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గి నుంచి తన స్వగ్రామమైన పెద గార్లపాడు వెళ్తున్న క్రమంలో అడిగొప్పల గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవటంతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా నాగరాజు ఆచూకీ కోసం బంధుమిత్రులు గాలిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం వాగులో మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. మృతుని భార్య హరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి బాబు, పాప ఉన్నారు. -
ముదిరాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్లో ముదిరాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సంపత్నగర్లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్ పదవుల్లో ముదిరాజ్లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం పాల్గొన్నారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పీఏ కిరణ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ ప్యానెల్కు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గెలుపొందిన ప్యానెల్ 2029 వరకు పని చేస్తుందని తెలిపారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా కోటంరాజు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎండీ గౌస్, వి.సర్వేశ్వర రెడ్డి, ఎస్.హీనాప్రియ, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకట రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భాస్కర రావు (డిప్యూటీ తహసీల్దార్), స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఎస్కే దరియా వలి, జాయింట్ సెక్రటరీలుగా డి.దివ్య దుర్గాదేవి (డిప్యూటీ తహసీల్దార్), కె.రాజీవ్ కుమార్, జె.రవికుమార్, ట్రెజరర్గా కె.గోపి ఎన్నికయ్యారు. -
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్’గా గుర్తింపు పొందింది.యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎనీ్వలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్ రీజియన్ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్వీలకే పరిమితం కాదు. సీబీఎస్ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యాన హిమాచల్ ప్రదేశ్లో జరిగే అండర్ –19 జాతీయ పోటీలకు జేఎన్వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ జేఎన్వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల.అవకాశాలు వదలొద్దు: శ్రీవల్లి కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు. -
10న ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభ
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ, పీఎంపీల డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి నాదెండ్ల: గుంటూరులో ఈ నెల 10న నిర్వహించే ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ, పీఎంపీల నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి శనివారం చెప్పారు. ఈ సందర్భంగా తూబాడులో ఆయన మాట్లాడుతూ మూడు ఫెడరేషన్లతో సంయుక్తంగా ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ జరుగుతుందన్నారు. ఏటుకూరు రోడ్డులోని ఆదిత్య హాస్పటల్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రాథమిక వైద్యానికి గుర్తింపు కోసం నలభై ఏళ్లు పైబడి చేస్తున్న పోరాటం సాఫల్యం అయ్యేరోజు ఆసన్నమైందన్నారు. మహాసభకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జేఏసీ గౌరవ అధ్యక్షుడు డీటీ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని మూడు వేల మందికి పైగా ఆర్ఎంపీ, పీఎంపీలు హాజరవుతారన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తెనాలి రూరల్: కొత్త సంవత్సరం వేడుకలకు డబ్బులివ్వాలని బాలికపై బాలుడు ఒత్తిడి తీసుకురావడంతో ఎలుకల మందు తిని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయమైంది. బాలుడి ఖర్చులకు అప్పుడప్పుడు విద్యార్థిని డబ్బులు ఇస్తుండేది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన తనకు రూ. రెండున్నర వేలు కావాలంటూ బాలుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. తన వద్ద లేవని, రూ. వెయ్యి ఇవ్వగలనని బాలిక చెప్పింది. తాను చదువు మానేస్తానని, టీసీ తీసుకుని వెళ్లిపోతానంటూ బాలుడు ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక ఎలుకల మందు తిని ఈ విషయాన్ని ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. -
వాజ్పేయి విగ్రహ ఏర్పాటు పనుల అడ్డగింత
నరసరావుపేట: దేశ మాజీ ప్రధాని, దివంగత అటల్బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటును మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. వినుకొండరోడ్డులోని జూపల్లి హోటల్కు ఎదురుగా సెంట్రల్ డివైడర్పై బీజేపీ నాయకులు విగ్రహ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు నియంత్రించారు. దిమ్మె నిర్మాణానికి డిసెంబరు 31న జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో బీజేపీ నాయకులు భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరై కొబ్బరికాయ కొట్టారు. ఆ ప్రదేశంలో శనివారం నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే టౌన్ప్లానింగ్ అధికారి కె.సాంబయ్య తన సిబ్బంది, పొక్లెయిన్తో వచ్చి దిమ్మె నిర్మాణ పనులను కూలదోశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవనే కారణంతో పొక్లెయిన్తో దిమ్మె నిర్మించేందుకు ఏర్పాటుచేసిన ఐరన్, చెక్కల నిర్మాణాలను తొలగించారు. దీనిపై బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కృపారావు స్పందిస్తూ పదిరోజుల క్రితమే విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్కు లేఖ అందజేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు ఇవ్వలేమని అధికారులు చెప్పారన్నారు. తాము రావిపాడురోడ్డు, డీమార్టు ఎదురు ప్రదేశాల్లో విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలాలు చూసినా ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వినుకొండరోడ్డు జూపల్లి సెంటర్ ఎన్నుకున్నామన్నారు. విగ్రహ ఏర్పాట్లను కూలదోయటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి, ఇతర రాష్ట్ర, జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటుచేసేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగానే ఇక్కడ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. ఆదివారం గుంటూరులో వాయ్పేయి విగ్రహం ఏర్పాటుకు కేంద్రమంత్రి హాజరవుతున్నారన్నారు. ఏదిఏమైనా తొలగించిన స్థలంలోనే మళ్లీ విగ్రహ స్థాపన ఏర్పాట్లు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై టీపీఓ సాంబయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను కలెక్టర్ సమావేశంలో ఉన్నానంటూ ఫోన్ ఆపేశారు. అనుమతులు లేవంటూ నిర్మాణంలో ఉన్న విగ్రహ దిమ్మెను కూల్చేసిన మున్సిపల్ అధికారులు ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు భూమిపూజలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే, బీజేపీ నేతలు -
న్యూ ఇయర్ ‘కిక్కు’
రూ.11.93 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నరసరావుపేట టౌన్: చంద్రబాబు సర్కార్ మందు బాబులకు న్యూఇయర్ ‘కిక్’ ఎక్కించింది. నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో పగలు, రాత్రి తేడా లేకుండా సర్కార్ జనాన్ని మత్తులో ముంచింది. దీంతో గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా న్యూఇయర్ వేడుకల సందర్భంగా జిల్లా ఆబ్కారీ శాఖ ఆదాయం పెరిగింది. సాధారణ రోజుల్లో జిల్లాలోని 48 బార్లు, 129 వైన్షాపుల్లో రోజుకు రూ. 3 కోట్ల చొప్పున వ్యాపారం జరుగుతుంది. అయితే న్యూఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30వ తేదీ ఒక్క రోజునే సుమారు రూ.7.89 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్అధికారులు అంచనావేస్తున్నారు. ఇదే విధంగా డిసెంబర్ 31న రూ.4.04 కోట్లు, జనవరి 1వ తేదీన రూ.84.04 లక్షల మద్యం అమ్మకాలు డిపో నుంచి జరిగాయి. ప్రైవేటు దుకాణాలు కావడంతో వారం రోజుల ముందు నుంచే మద్యం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి స్టాక్ పెట్టారు. ఈ లెక్కలు కేవలంనరసరావుపేట డిపో పరిధిలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, ఈపూరు, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల సర్కిల్ పరిధిలోని అమ్మకాలు మాత్రమే. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, క్రోసురు, అచ్చంపేట మద్యం దుకాణాలకు గుంటూరు డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. అక్కడ సైతం న్యూఇయర్కు భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. -
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు
నరసరావుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్కోర్టులు, స్టాల్స్, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫిరంగిపురం, నాదెండ్ల, వంకాయలపాడుల నుంచి కొండవీడు కోటకు వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గత ఉత్సవాలలో పర్యాటకులను ఆకర్షించిన హెలిరైడ్, బోటింగ్ వంటి వాటికి అదనంగా కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్ను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణ్ణప్రియ, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీవో మధులత, దీపీఓ నాగేశ్వర్నాయక్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసంను పురస్కరించుకొని సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారిని ‘జగత్ రక్షకుడు’గా అలంకరించి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారికి విశేష పౌర్ణమి పూజ, గరుడ పూజ చేసి శ్రీవారిని ‘ఉత్తర దిశగా’ ఊరేగించారు. గరుడ ప్రసాదంను ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు భక్తులకు అందించారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం ఆడారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నకరికల్లు: శివముక్కోటిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్శింగపాడు లోని శ్రీ మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తు లకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించారు.అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమే త అమరేశ్వరునికి శనివారం ఆరుద్రోత్సవం నిర్వహించా రు. శనివారం వేకువజామున మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలు త పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో సుమారు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకించారు. తొలుత అర్చకు లు, వేద పండితులు వెంకటాద్రినాయుని మండపంలో మహాన్యాసం నిర్వహించి అనంతరం 11 అమృతాలతో ఏకదశ రుద్రాభిషేకం వండిన నాలుగు క్వింటాళ్ల అన్నంతో అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఏడాదీ అన్నప్రసాద వితరణ సాయంత్రం మూడు గంటల వరకు జరిగేది ఈ ఏడాది రెండు గంటలలోపు అన్న ప్రసాద వితరణ ముగించటంతో పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు. -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
చిలకలూరిపేటటౌన్: భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు చిలకలూరిపేట రూరల్ సీఐ కార్యాలయంలో మీడియా ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు వివరాలు వెల్లడించారు.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్రాజు తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రి పాలైన పుష్ప చికిత్స పొందుతూ డిసెంబర్ 30వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి మంచాల సారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రెస్మీట్లో రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్, లేఖా ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని ఉప్పలపాడు సమీపంలో వై.జంక్షన్న్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన ఒంటిపులి కిరణ్(25), వల్లెపు కోటేశ్వరరావు(35)లు ద్విచక్రవాహనంపై వినుకొండ వైపు వస్తుండగా వై.జంక్షన్ వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు. గుంటూరు లీగల్: నగరంలో గత ఏడాది డిసెంబరు 31న ఈస్ట్, వెస్ట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో 15 మంది మద్యం తాగినట్లు నిర్ధారించారు. వీరిలో పదిమందికి జరిమానా విధించి, మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో కారు డ్రైవర్లు నలుగురు, బైక్ నడుపుతున్న ఒకరు ఉన్నారు. వీరు అధికంగా మద్యం తాగినట్లు ఉండటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరో అదనవు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ విచారణ తర్వాత ఐదుగురికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. విద్యుత్ విజిలెన్స్ ఎస్ఈ మూర్తి కొరిటెపాడు(గుంటూరు): సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచాలని విద్యుత్ విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి సూచించారు. స్థానిక సంగడిగుంట విద్యుత్ భవన్లో విజిలెన్స్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమన్నారు. గత ఏడాది 9,064 కేసులు నమోదు చేసి రూ.21.45 కోట్లు అపరాధ రుసుము విధించామని చెప్పారు. విద్యుత్ చౌర్యం అరికట్టడానికి గుంటూరు జిల్లా ఈఈ కరీమ్–94408 12263, పల్నాడు జిల్లా ఈఈ సుందరబాబు – 94910 66757, బాపట్ల జిల్లా ఈఈ భాస్కరరావు – 77804 56319లను సంప్రదించాలని సూచించారు. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 104 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ అన్నారు. శనివారం వైద్యరంగ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పీహెచ్సీ సెంటర్ల వద్ద డిమాండ్స్తో కూడిన పోస్టర్లు అంటించి యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ అరకొర వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు గ్రాడ్యూటీ, ఎర్న్ లీవ్ల డబ్బులు నేటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు ఏడుకొండలు, సాయిరాం, బాలకృష్ణ, హరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
నరసరావుపేట టౌన్: బాల్య వివాహాలు అరికట్టటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి అన్నారు. బాల్య వివాహ నిషేధిత చట్టంపై శనివారం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా వారి భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహం ఒక సామాజిక నేరమన్నారు. దీన్ని అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. చిన్న వయసులో గర్భం దాల్చడం వలన తల్లి, బిడ్డల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందన్నారు. పెళ్లి కారణంగా బాలికలు చదువుకు దూరం అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంతోష్ కుమార్, రెండవ పట్టణ ఏఎస్ఐ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, చంద్రబాబు నాయుడు కాలనీలోని అంగన్వాడి వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి -
పచ్చ బ్యాచ్
పల్నాడుఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026● ఎర్రమట్టి.. కొల్లగొట్టి ..! రూ. కోట్లు దండుకుంటున్న తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2500, మోడల్ ధర రూ.1700 వరకు పలికింది.మాచర్ల: పాత ఊరులోని లక్ష్మీచెన్నకేశవ స్వామి నిత్య కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామి కల్యాణం జరిపించారు.నకరికల్లు మండలం త్రిపురాపురం కొండ నుంచి మట్టి తరలిస్తున్న టిప్పర్లు7 -
అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం!
అమరావతి: రాజధానికి దగ్గరగా ఉండటంతో అమరావతి పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. భూములకు విపరీతంగా డిమాండ్ పెరిగిన నేపధ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వరస్వామివారి ఆలయ భూములు, సర్వీస్ ఈనాం భూములపై బడాబాబులు కన్నేశారు. ఈ భూములు నాలుగవ వంతు ధరకే అమ్మకాలు సాగిస్తుండటంతో నేడు దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడింది. అన్యాక్రాంతమవుతున్న దెందుకూరు భూములు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామివారికి చెందిన ఖమ్మం జిల్లా దెందుకూరులో ఉన్న 410.34 ఎకరాలు భూమిని నేటికీ నామమాత్రపు కౌలుపైన సాగులో ఉన్నాయి. దెందుకూరు భూములకు ఈనాటికీ బహిరంగవేలం నిర్వహించలేని దుస్థితిలో దేవదాయశాఖ ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాదల, దమ్మాలపాడు, దొండపాడు, దావులూరు, అమరావతి గ్రామాలలో 267.28 ఎకరాలు, పూర్వం దాతలు ఆలయానికి విరాళంగా అందించడం జరిగింది. ఈభూములకు కూడా రైతుల భూములకు వచ్చినంత కౌలు రాకపోయినా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్నా ఆగని లావాదేవీలు.. దేవాలయ సర్వీస్ ఈనాం భూములు అటు తహసీల్దార్ కార్యాలయంలో, ఇటు రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ అమ్మకాలు ఆగటం లేదు. ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో అమరేశ్వరస్వామి పేరుమీద ఈ భూములు నమోదు కావటంతో కొంతమంది 30 నుంచి 50 సంవత్సరాలకు లీజుకు తీసుకుని తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. మరికొంత మంది అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. ఈ విషయంలో దేవదాయశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. దేవునిభూముల విషయంలో అధికారులు సమర్ధవంతంగా చర్యలు తీసుకోవటం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కొనసాగుతున్న లావాదేవీలు... రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సర్వీస్ దారులకు ఈనాంగా ఇచ్చిన 192.96ఎకరాల భూమి రోడ్డపక్కనే ఉండటంతో ఈ భూములపై బడాబాబుల చూపు పడింది. ఇందులో సంగీత కళాకారులకు ఈనాంగా ఇచ్చిన 89 సర్వే నంబరులోని 10.70 ఎకరాలు దేవాలయం స్వాధీనం చేసుకోగా.. మిగిలిన సర్వే నెంబర్లు 201,124, 202, 86–2, 171, 63,62 132, 190, 77, 175, 184, 32, 83, 144లలో ఉన్న 192.36 ఎకరాల భూమిని సర్వీస్ ఈనాంలుగా, మాన్యాలుగా ఇవ్వటం జరిగింది. సర్వీస్ ఈనాంలు పొందిన సర్వీస్ దారులు కొంతమంది సేవ చేయకపోయినా.. దేవుని భూముల్లో ప్రస్తుతం కొన్నింటికి పట్టాలు పుట్టించి అమ్మకాలు జరిపినట్లు సమాచారం. అలాగే మరికొన్నింటికి రెవెన్యూశాఖ ద్వారా పాసు పుస్తకాలు సంపాదించి బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు. అలాగే 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించటంతో కొంతమంది ఈనాందారులు తమ అనుభవంలో గల భూములను తాకట్టు పెట్టటం, లీజు ఒప్పందాలతో రూ.లక్షలు సొమ్ము చేసుకున్నారు. మళ్లీ ప్రస్తుతం అవే భూములకు అగ్రిమెంట్లు రాయటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎకరా భూమి రూ.కోట్లు పలుకుతుండగా సర్వీస్, ఈనాం భూములు రూ.లక్షల్లో ధర ఉండటంతో బడాబాబుల కన్ను వీటిపై పడింది. సర్వీస్, ఈనాం భూముల అనుభవదారులవద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలతో కొంతమంది రిజిస్టర్ చేయటం, లీజ్కు రాయటం జరుగుతున్నాయి. ఆర్ఎస్ఆర్ రిజిస్టర్ అమరేశ్వరస్వామి పేరు మీద ఉన్న నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ లావాదేవీలు జరుపుతున్నారు. ఇటీవల ఒక సర్వే నెంబరులోని భూమిని రికార్డుల్లో వేరే వారి పేరు మార్చటానికి రూ.లక్షలు చేతులు మారాయని సమాచారం. ఇప్పటికై న దేవదాయశాఖ అధికారులు అన్యాక్రాంతమవుతున్న దేవుని భూములను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. అమరేశ్వరస్వామి దేవస్థానంఅమరావతిలోని సర్వీస్, ఈనాం భూములన్నీ అమరేశ్వరునివే, రెవెన్యూ ఆర్ఎస్ఆర్ రికార్డులలో అమరేశ్వరస్వామికి చెందిన భూములుగానే ఉంటాయి. వీటిపై జరిగే అనధికార లావాదేవీలకు దేవాలయానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూముల సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో ఉంచాం. త్వరలో సర్వీసు దారులకు నోటీసులు ఇచ్చి, వారి భూములను సర్వే చేయిస్తాం – రేఖ, అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి రాజధాని సమీపంలోని భూములకు అధిక డిమాండ్ సర్వీసు, ఈనాం భూములపై బడాబాబుల కన్ను 30 నుంచి 50 ఏళ్లకు లీజ్లకు ఇస్తున్న కొంతమంది సర్వీసుదారులు వందలాది ఎకరాల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ కాపీలు ఉంటేనే రూ.లక్షల్లో చెల్లింపులు కొన్ని భూములకు రికార్డుల్లో పేరు మార్పుకోసం చేతులు మారుతున్న రూ.లక్షలు దేవదాయ అధికారుల నిర్లక్ష్యం.. సర్వీసు దారులకు వరం స్వామివారికి వెండికర్ర, సంగీతమాన్యం, మద్దెల, ప్రమిదలు, కాగడా, శంఖు, భజంత్రీలకు ఆనాడు రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు స్వామివారికి సేవ చేసినందుకు అనుభవించటానికి మాత్రమే సుమారు 192 ఎకరాల భూమిని అమరావతి పరిసర ప్రాంతాలలో ఇవ్వటం జరిగింది. కానీ ప్రస్తుతం కొందరు స్వామివారికి నామమాత్రంగా సేవలు నిర్వహిస్తుండగా.. మరికొందరు అసలు సేవల జోలికి పోవడం లేదు. వీరి భూములను దేవదాయశాఖ అధికారులు ఎందుకు అధీనంలోకి తీసుకోవటం లేదో అమరేశ్వరునికే తెలియాలి మరీ. -
సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు షాడో ఎమ్మెల్యేల అక్రమార్జనకు కొండలు కరిగిపోతున్నాయి. ఎర్రమట్టిని కొల్లగొట్టి రూ. కోట్లు జేబులో వేసుకుంటున్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల ఇళ్లకు చేరుతోంది. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మై
త్రిపురాపురం కొండ వద్ద మైనింగ్కు అనుమతి ఉంది. అనుమతి ఉన్న చోటే తవ్వకాలు చేపట్టాలి. వేరేచోట మైనింగ్ జరుగుతున్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ మైనింగ్ను ఉపేక్షించం. – నాగయ్య, మైనింగ్ శాఖ ఏడీ, పల్నాడు జిల్లా సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం త్రిపురాపురం కొండలో విలువైన ఎర్రని గ్రావెల్ ఉంది. ఈ మట్టి గట్టిగా ఉంటుందని ఎక్కువగా ఇళ్ల నిర్మాణాల బేస్ మట్టం కోసం వినియోగిస్తారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వెంచర్లలో పైపొరగా వేసి ప్లాట్లను అందంగా తయారు చేస్తారు. దీంతో పాటు గార్డెన్లకు వినియోగిస్తారు. ఈ మట్టి మాఫియాకు వరంగా మారింది. త్రిపురాపురం కొండ పరిసరాల్లో గతంలో ఉన్న మైనింగ్ అనుమతులు అడ్డుపెట్టుకొని హద్దూ అదుపు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పొక్లయినర్లు వినియోగించి రూ.కోట్ల విలువైన ఎర్రమట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరు చెప్పి ఒకటి రెండు టిప్పర్లు అటు పంపి, పెద్ద సంఖ్యలో అమ్మకాలకు మట్టి తరలిపోతుంది. ట్రాక్టర్ మట్టి రూ.1,200లకు, ట్రిప్పర్ రూ.8 నుంచి రూ.9వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగుతోంది. ఇద్దరు షాడో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో... త్రిపురాపురం వద్ద గల అన్సర్వే భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు భారీగా చేపడుతున్నారు. అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. రోజుకు 100కు పైగా టిప్పర్లలో తరలిపోతుంది. అనుమతులు ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపడుతున్నా, యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లోని మట్టిని అమ్ముకుంటున్నా అడిగేవారే కరువయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో సత్తెనపల్లి, నకరికల్లుకు చెందిన ఇద్దరు షాడో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు మిన్నకుండిపోయారు. నకరికల్లు మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర యువనేత మైనింగ్ మాఫియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక అఽధికారులను బెదిరించి అక్రమ గ్రావెల్కు పాల్పడుతున్నాడు. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్నామని ప్రారంభించి ఏకంగా సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ టిప్పర్లతో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. త్రిపురాపురం కొండ ప్రాంతంలోని అన్సర్వే ల్యాండ్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. అన్ సర్వే ల్యాండ్లో 15 ఎకరాలకు అనుమతులు ఉన్నాయి. అందులోనే మైనింగ్ జరుగుతోంది. – కె.పుల్లారావు, తహసీల్దార్, నకరికల్లు నిత్యం వందలాది టన్నుల మట్టి అక్రమంగా తరలిపోతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు మిన్నుకుండిపోతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో, కాసుల వర్షంతో అధికారులు అక్రమ మైనింగ్కు వత్తాసు పలుకుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రదేశంలో మట్టి తవ్వకాలకు కేవలం ఆరు హెక్టార్లలోనే అనుమతి ఉంది. అయితే దీన్ని అసరాగా చేసుకున్న అక్రమార్కులు ఆరు హెక్టర్ల పక్కనే ఉన్న భూమిలో మట్టితవ్వకాలు జరుపుతున్నారు. మీడియాలో వార్తలు రాగానే అబ్బే మైనింగ్ సక్రమమేనంటూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చి మభ్యపెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
పొగాకుపై పన్నులు పెంచటం నష్టదాయకం
చిలకలూరిపేట: పొగాకు, పొగాకు సంబంధ ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ మురళి ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణం ఎన్ఆర్టీ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై పొగాకు రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించటం జరిగిందన్నారు. దీని వలన పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ రేటుకు అదనంగా జాతీయ భద్రతా సెస్సు, హెల్త్ సెస్సు, ఎకై ్సజ్ డ్యూటీ పెరుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవం వేరేగా ఉందని విమర్శించారు. ఒక వైపు మార్కెట్లో ఎలాంటి లైసెన్సులు లేకుండా చౌకబారు విదేశీ సిగరెట్లు విచ్చలవిడిగా లభిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విధించే అదనపు పన్నుల వలన దేశీయంగా పొగాకు ఉత్పత్తుల రేట్లు మరింతగా పెరిగి, విదేశీ స్మగ్లింగ్ సిగరెట్ల బెడద మార్కెట్ను ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని వల్ల దేశీయంగా పొగాకు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్సులు లేకుండా దేశంలోకి వస్తున్న విదేశీ సిగరెట్లను నియంత్రించలేని ప్రభుత్వం పొగాకుపై విచ్చలవిడిగా పన్నులు విఽధించటం ద్వారా పొగాకు రైతుల వెన్ను విరిచేందుకు సిద్ధమౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అతిగా విఽధించే పన్నులు వినియోగాన్ని తగ్గించలేవని, బదులుగా అక్రమ వ్యాపారం పెరిగి ప్రభుత్వానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు పొగాకుకు ప్రత్యామ్నాయం లేక, ఏ పంట పండించాలో తెలియక పొగాకు రైతులు దారుణంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పొగాకు పన్ను విధానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులపై వివక్షను చూపుతోందని ఆరోపించారు. ఈ విధమైన తీవ్ర అసమానత, నిబంధనలు పాటిస్తూ చట్టబద్దంగా సాగుచేసే రైతులను శిక్షించే విధంగా ప్రభుత్వ విధానం మారిందని, యావత్ పొగాకు రైతులు ఆందోళనకు దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఆర్ శ్రీకాంత్, వి వరప్రసాద్, జి వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, భాస్కర్ చౌదరి పాల్గొన్నారు. -
రైల్వేలైన్లపై ఆర్ఓబీ, ఆర్యూబీలను పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలో రైల్వేలైన్ల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మంజూరైన 20 ఆర్ఓబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్న భూమిలో ఎర్రుపా లెం–అమరావతి–నంబూరు రైల్వేలైన్పై ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మిస్తామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో రైతులకు పరిహారం అందించే ప్రక్రి య పూర్తిచేయాలని రెవెన్యూ అధికారుల ను ఆదేశించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పలుచోట్ల పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓలు మురళీకృష్ణ, రమణాకాంతరెడ్డి పాల్గొన్నారు. టెన్త్లో నూరు శాతం ఫలితాలు సాధించాలి డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సమష్టిగా కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. శంకరభారతిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై సబ్జెక్ట్ ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టి సారించి వారిలో సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. పది ఫలితాలలో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. యూడైస్ నమోదు పూర్తి చేయాలన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూపొందించిన జీఎఫ్ఎల్ఎన్ను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఈఓలు పాల్గొన్నారు. -
రంగుల మహోత్సవంపై సమీక్ష
పెనుగంచిప్రోలు: భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే అమ్మవారి రంగుల మహోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ సత్రంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పని చేసి తిరుపతమ్మ రంగుల మహోత్సవం, ఫిబ్రవరిలో కల్యాణ మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఆలయంలో పారిశుద్ధ్యం, ప్రసాదాలపై భక్తుల నుంచి అసంతృప్తులు వచ్చాయని, ఆలయ అధికారులు వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారులు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్
వినుకొండ: జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 16 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వినుకొండ పోలీసులు పట్టణంలోని వెల్లటూరు రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బొల్లాపల్లి వైపు నుంచి వస్తున్న వడితే సర్తార్నాయక్ అనే యువకుడిపై అనుమానం కలిగింది. బైకుపై వచ్చిన అతడిని ఆపి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆటో డ్రైవర్ నుంచి దొంగగా.. నిందితుడు గతంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యానికి, ఇతర చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఆటో కిస్తీలు కట్టలేకపోయాడు. ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లిపోయారు. పాత బైక్ తాళాలను సేకరించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వినుకొండ బస్టాండ్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మంగళగిరి, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఇతను దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బైక్లను వెల్లటూరు గ్రామ సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో దాచి ఉంచాడు. 10 వాహనాల వివరాలు లభ్యం కాగా, మిగిలిన వాటి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న వినుకొండ సీఐ బి.ప్రభాకర్, ఎస్సై ఎ.బాలకృష్ణ, కానిస్టేబుళ్లు చాన్ బాషా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావులను డీఎస్పీ అభినందించారు. నగదు రివార్డులను అందజేశారు. -
క్రికెట్ చాంపియన్గా ‘ఎంబీయూ’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26లో భాగంగా జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్షిప్లో తిరుపతికి చెందిన మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) జట్టు విజేతగా నిలిచింది. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్ హాజరయ్యారు. ఆయన టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ను అధికారికంగా ప్రారంభించారు. ఫైనల్లో విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీతో తలపడిన మోహన్బాబు యూనివర్సిటీ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి, చాంపియన్గా నిలిచింది. విజేతకు ఫిబ్రవరి 7వ తేదీన ముగింపు వేడుకల్లో ప్రశంసా పత్రాలు, మెడల్స్తోపాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న బ్యాట్స్మెన్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన మోహన్బాబు యూనివర్సిటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. జట్టులో హర్ష 3 ఫోర్లు, 1 సిక్సర్తో 26 పరుగులు, పృథ్వీ యాదవ్ 2 ఫోర్లు, 1 సిక్సర్తో 20 పరుగులు, ఎ.గౌతమ్ 14 పరుగులు, కెప్టెన్ దినేష్ 12 పరుగులు చేశారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ బౌలర్లలో డీకే, భవానీ ప్రసాద్ చెరో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. లక్ష్యం ఛేదించలేక.. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాట్స్మెన్లలో సోహాన్ చౌదరి 5 ఫోర్లు, 1 సిక్సర్తో 39 పరుగులు, సాల్మన్ వెస్లీ 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి పోరాడారు. మోహన్బాబు యూనివర్సిటీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, హర్ష, వివేక్ రెడ్డి తలో వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
రాజకీయ కక్షతోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు
మాచర్ల రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేక ఆధారాలు లేకుండా ప్రతీకార భావంతో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమేనని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పిన్నెల్లి సోదరుల అక్రమ నిర్భందాన్ని నిరసిస్తూ శుక్రవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి కుటుంబం 30సంవత్సరాలకు పైగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన చరిత్ర వారిదన్నారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రజాభిమానాన్ని చూరగొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోలేక గ్రూపు తగాదాలో జరిగిన హత్య కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేయటం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అక్రమ, అన్యాయాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నేతలను అణచివేయాలనే దుర్మార్గపు ఆలోచన మంచిదికాదన్నారు. పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయస్థానంపై మాకు ఎంతో నమ్మకముందని, న్యాయపోరాటం చేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా మా పిన్నెల్లి సోదరులు వస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి జయప్రకాశరెడ్డి, ఎంపీటీసీ తేళ్లూరి శ్రీనివాసరెడ్డి, నాయకులు గోగిరెడ్డి హనిమిరెడ్డి, పాదం లక్ష్మయ్య, దశబంధపు కొండలు, గాలి బాలిరెడ్డి, జయభారత్రెడ్డి, ఆరికట్ల పున్నారెడ్డి తదితరులున్నారు. నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ -
కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు
అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం ఘాట్లో అదే గ్రామానికి చెందిన బాలుడు కృష్ణానదిలో గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ... వైకుంఠపురం ఎస్సీ కాలనీకి చెందిన నండూరు శివ (14) స్థానిక స్నానఘాట్ సమీపంలో దుస్తులు ఉతుకుతున్నాడు. ఇంతలో వెంట వచ్చిన పెంపుడు కుక్కపిల్ల నీటిలో మునిగిపోతుండటంతో రక్షించటానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతడూ గల్లంతయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. శివకు మాటలు రావు. కొడుకు ఇలా నదిలో గల్లంతైన విషయం తెలుసుకుని శివ తల్లితండ్రులు చాణక్యరావు, ఝాన్సీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిలకలూరిపేట: అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్) కోర్సు శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి కె. డేవిడ్ తెలిపారు. నర్సింగ్ కోర్సుతో పాటు 4 నెలల ఉచిత కంప్యూటర్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లిషు కూడా నేర్పుతామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి పాస్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్లతో అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న అసిస్ట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వివరాలకు ఫోన్ నంబర్లు 91826 34233, 89788 20317 లలో సంప్రదించాలన్నారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్స్ హాస్టల్స్లో ఖాళీగా ఉన్న టైప్–3, టైప్–4 బోధనేతర సిబ్బందిని పొరుగు సేవలు (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జిల్లాలోని అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం తెలిపారు. జిల్లా పరిధిలోని కేజీబీవీలలో టైప్–3లో 62, టైప్–4లో 38 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఓకేషనల్ ఇన్స్ట్రక్టర్, అటెండర్, అకౌంటెంట్, కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, స్వీపర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. నియామకంలో రోస్టర్ పాయింట్స్ వర్తిస్తాయన్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 11వ తేదీలోగా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలోని సమగ్ర శిక్ష విభాగంలో సమర్పించాలని తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహారాష్ట్రలోని సోలాపూర్లో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు జిల్లా నుంచి వీవీ అఖిల్రెడ్డి, కె.లక్ష్మీసాయిప్రవల్లిక ఎంపికయ్యారని గుంటూరు షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి అనిల్ తెలిపారు. గతనెల 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. అఖిల్రెడ్డి ప్రవల్లిక -
పల్నాడు
ఆలయానికి రూ.5లక్షల విరాళం వినుకొండ: కొండపై నూతనంగా నిర్మిస్తున్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వినుకొండకు చెందిన చలవాది రాధాకృష్ణ దంపతులు రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. Iగోదా అమ్మవారి నగరోత్సవం రేపల్లె: రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో శుక్రవారం గోదా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 561.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 23,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
తాడికొండ: రాజధానిలో వెంకటపాలెం నుంచి విజయవాడ వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పరిశీలించారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించిన ఆయన విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గిందన్నారు. గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించి ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలిచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయినందున వాహన రాకపోకలు కొనసాగుతున్నాయని ఇకపై కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మద్యం మత్తులో నడిరోడ్డుపై బైక్కు నిప్పు కారెంపూడి: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బైక్ను నడిరోడ్డుపై తగలబెట్టిన ఘటన కారెంపూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకుడు చిన పీర్లసావిడి వద్ద బైక్ను ఆపి దానికి నిప్పు పెట్టాడు. సాయంత్రం పాఠశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున నడిరోడ్డుపై మంటలు చెలరేగడంతో వాహనాదారులు ఇబ్బందులుపడ్డారు. రేపు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ గుంటూరు మెడికల్: బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం సెంటర్లో ఈనెల 4వ తేదీన ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విచ్చేసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కూటమి నేతలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!
యడ్లపాడు: నాదెండ్ల మండలం చవిటిపాలేనికి చెందిన తలపాల కిరణ్బాబు(23)ది సామాన్య మధ్యతరగతి జీవితం. ఏడాదిన్నర క్రితమే లావణ్యతో వివాహమైంది. పెద్దగా చదువుకోకపోయినా, రెక్కల కష్టంతో భార్యను సుఖంగా చూసుకోవాలనుకున్నాడు. ‘కొత్త ఏడాదిలో మంచి పని చూసుకుంటాను, మనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకుందాం’ అని భార్యకు మాటిచ్చాడు. కానీ, విధి మరోలా తలచింది. స్నేహితులతో కలిసి వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదం కిరణ్ను అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా మృత్యువు కబళించింది. ఇప్పుడు లావణ్య పరిస్థితి అగమ్యగోచరం. పెళ్లయిన ఏడాదిన్నరకే పసుపు కుంకుమలు దూరమై, ఒంటరిదైన ఆమెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతోంది. అత్తమామల ఆసరా తప్ప ఆమెకు మరో భరోసా లేదు. దిక్కులేని వారైన చిన్నారి పాపలు.. మరో విషాదం యడ్లపాడులో చోటు చేసుకుంది. షేక్ ఖాజావలి(30) తాపీ పనులు చేసుకుంటూ తన భార్య నాగూర్బి, ఇద్దరు కుమార్తెలను (8, 6 ఏళ్లు) ప్రాణప్రదంగా చూసుకునేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఒక్క ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు. కొత్త ఏడాది రోజు కూడా కష్టపడి పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బైక్ రూపంలో మృత్యువు పలకరించింది. పనులు ముగించుకుని యడ్లపాడులోని స్వీట్ షాపులో పిల్లలకు స్వీట్లను తీసుకుని ఆనందంగా వస్తున్న క్రమంలో ఎదురుగా బైక్ ఢీకొన్ని తలకు తగిలిన బలమైన దెబ్బ ఖాజావలిని బలితీసుకుంది. తండ్రి వస్తే ఏదో ఒకటి తెస్తాడని ఎదురుచూసిన ఆ పసి ప్రాణాలకు, తండ్రి లేడన్న చేదు నిజం ఇంకా అర్థం కావడం లేదు. భర్తను కోల్పోయిన నాగూర్బి, రేపటి రోజున ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎలా పెంచాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు నిండుకున్న మధ్య తరగతి మనిషి కలలపై జరిగిన దాడి.. ఈ ప్రమాదాలు. రెక్కాడితే గాని డొక్కాడని’ జీవితాల్లో ఒక మనిషి దూరం కావడం అంటే ఆ కుటుంబం పునాదులే కదిలిపోవడమే. పండుగ రోజున విషాదం నిండటం ఆ కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసింది.లోకమంతా కొత్త ఆశలతో..సంబరాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటే.. ఆ రెండు ఇళ్లల్లో మాత్రం విధి వంచన చేసింది. క్యాలెండర్ మీద మారిన తేదీ ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సింది పోయి, తీరని చీకటిని మిగిల్చింది. గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. కట్టుకున్న వారు కన్నీరుమున్నీరవుతుంటే, అండగా నిలవాల్సిన చేతులు అచేతనంగా పడి ఉండటం చూసి స్థానికుల కళ్లు చెమర్చుతున్నాయి. రెండు కుటుంబాల్లో ఆరిన ఆశల దీపాలు -
జీవాలపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం
చిలకలూరిపేటటౌన్: జీవాలపైకి టాటా ఏస్ వాహనం దూసుకు వెళ్లడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. పలు గొర్రెలు తీవ్రగాయాలైన పాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ...కట్టుబడివారిపాలెం పరిధిలోని మోపూరివారిపాలెం గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలు తమ గొర్రెల మందను తోలుకుని వెళ్తున్న క్రమంలో కోటప్పకొండ సమీపంలోని ఈటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మేతకు ముగించుకుని మంద తిరిగి ఇంటికి తరలి పోతున్న క్రమంలో డోర్నాల నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న టాటా ఏస్ మినిలారీ ఒక్కసారిగా మందపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు, ఒక పొట్టేలు మృత్యువాత పడగా, మరో 21 గొర్రెలు గాయాల పాలయ్యాయి. వాహనం నిలుపుదల చేయకుండా పరారయ్యే క్రమంలో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో మద్దిరాల గ్రామస్తులు అప్రమత్తమై నిలపుదల చేశారు. దీంతో బాధితుడు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. -
సివిల్ డ్రెస్లో వచ్చి ల్యాప్టాప్ తీసుకెళతారా?
ప్రత్తిపాడు: జీపు కూడా లేకుండా సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు ల్యాప్టాప్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందని దళితవాడ ప్రజలు పెదనందిపాడు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ తెల్లవారుజామున పోలీస్ స్టేషను ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. పెదనందిపాడు ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్థానిక కాలనీవాసులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అనుమతుల్లేకుండా పెద్ద పెద్ద శబ్దాలతో అక్కడ డీజేలు ఏర్పాటు చేయడంతో వాటిని నిలుపుదల చేయించేందుకు పోలీసులు అక్కడకు వెళ్లారు. సివిల్ డ్రెస్లో అక్కడకు వచ్చిన ఎస్ఐ సత్యనారాయణ దురుసుగా వ్యవహరించి, లాప్టాప్ తీసుకువెళ్లిపోవడమే కాకుండా మాపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ స్థానిక దళితవాడవాసులు గురువారం తెల్లవారు జామున పోలీస్ స్టేషను ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి నేరం లేని వారిపై చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చేయిచేసుకోలేదని అక్కడున్న సిబ్బంది స్థానికులతో వాదించడంతో ‘కొట్టలేదని గుండెలపై చెయ్యి వేసుకుని ఎస్ఐను చెప్పమను’ అంటూ మహిళలు, ప్రజలు మండిపడ్డారు. అనంతరం ఎస్ఐ కాలనీవాసులతో మాట్లాడి, పొరబాటు జరిగిందని సర్దిచెప్పడంతో కాలనీవాసులు శాంతించారు. -
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నగరంపాలెం: నూతన సంవత్సరంలో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పలువురు పోలీస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఐజీకి మొక్కలు, పూలబొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. అదేవిధంగా గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను పలువురు జిల్లా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికార సిబ్బంది మర్యాద పూర్వకంగా కల్సి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ను జిల్లా ఎస్పీ కట్ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), కె.సుప్రజ (క్రైం), ఏ.హనుమంతు (ఏఆర్), డీపీఓ ఏఓ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. -
హోరాహోరీగా పోలురాధ ఎడ్ల పందేలు
చీరాల టౌన్: మండలంలోని ఈపూరుపాలెం పంచాయతీలోని బోయినవారిపాలెం గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల పందేలు హోరాహోరీగా జరిగాయి. బోయినవారిపాలెంలో నిర్వహించిన ఈ ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించి, మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా గత 23 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి పోలు రాధ ఎడ్ల పోటీలు నిర్వహించడం గ్రామానికే గర్వకారణం అన్నారు. గ్రామీణ వాతావరణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్ల బలప్రదర్శన తిలకించడానికి, పోటీల్లో పాల్గొనేందుకు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి పశుపోషకులు తరలివచ్చారు. పోటీల్లో 19 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో తమ సత్తా చాటేందుకు ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. రాష్ట్రస్థాయి పోటీలను తిలకించేందుకు చీరాల నియోజకవర్గంతోపాటు వివిధ మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రేక్షకులు ఈలలు, కేరింతలతో బోయినవారిపాలెం హోరెత్తిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీలను ఫ్లడ్లైట్ల వెలుగులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు అధిక సంఖ్యలో పశుపోషకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రేక్షకులతో హోరెత్తిన బోయినవారిపాలెం -
కేఎల్యూలో సౌత్జోన్ పురుషుల బాడ్మింటన్ టోర్నమెంట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీలో ఈనెల 3వ తేదీ నుంచి 5వరకు సౌత్జోన్ ఆలిండియా అంతర యూనివర్సిటీల పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు కేఎల్యూ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం టోర్నమెంట్ పోస్టర్ను ప్రో.వైస్ చాన్స్లర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్ డాక్టర్ హరికిషోర్, ఐక్యు ఏసీ డీన్ డాక్టర్ రామకృష్ణలతో కలసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 128 విశ్వవిద్యాలయాల నుండి సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాప్ డైరెక్టర్ అనిమిని రవినాయుడు, గౌరవ అతిథిగా పున్నయ్య చౌదరిలు హాజరు కానున్నారని తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.విజ్ఞాన్లో న్యూ ఇయర్ జోష్చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారా, విజ్ఞాన్ ఫార్మసీ, విజ్ఞాన్ జూనియర్ కాలేజీల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోటి ఆశలు, కొత్త సంకల్పాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య కేక్ను కట్ చేసి విద్యార్థులతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో 2026 సంవత్సరానికి గాను సంకల్ప ప్రతిజ్ఞ చేయించి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. విద్యార్థుల్లో దయ, కృతజ్ఞత, మానవత్వం, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకే భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వేడుకల్లో వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, లారా, ఫార్మసీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఫణీంద్రకుమార్, శ్రీనివాసబాబు, మోహన్ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగం కేసులో మరొకరు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మంగళగిరి మండలం కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నిధుల దుర్వినియోగం కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు సీసీఎస్ డీఏస్పీ బి.వి.మధుసూదనరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాయల రమేష్బాబు, కొంత మంది ఉద్యోగులతో ఏకమై మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. సొసైటీ డిపాజిటర్ల నుంచి డిపాజిట్లు సేకరించారని చెప్పారు. డిపాజిటర్లకు నకిలీ బాండ్లను జారీ చేసి తామే నేరుగా వడ్డీ చెల్లిస్తూ, డబ్బును బ్యాంక్లో జమ చేయలేదన్నారు. ఆ విధంగా 72 మంది డిపాజిటర్ల నుంచి రూ.8,50,93,947లు స్వాహా చేశారని పేర్కొన్నారు. కురగల్లు పీఏసీఎస్లో 112 నకిలీ డిపాజిట్ బాండ్లను జారీ చేసి రైతులను మోసగించినట్లు పీఏసీఎస్ చైర్మన్ శీలం గోపయ్య మంగళగిరి రూరల్ పీఎస్లో అప్పట్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టామని అన్నారు. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కురగల్లు సీఈవో రాయల రమేష్బాబుతోపాటు యరబ్రాలెం పీఏసీఎస్ సీఈవో తాడిబోయిన శ్రీకాంత్ పాత్ర ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. ఈ మేరకు అతని కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. బుధవారం అతనిని మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. తీగలాగితే డొంక కదిలింది.. యరబ్రాలెంకు చెందిన తాడిబోయిన శ్రీకాంత్ 2012 జులైలో కురగల్లు పీఏసీఎస్లో తాత్కాలిక గుమస్తాగా నెలకు రూ.3 వేల జీతంపై చేరాడని డీఎస్పీ అన్నారు. సీఈవో రాయల రమేష్బాబుతో పాటు మరి కొందరితో కుమ్మకై దొంగ లెక్కలు రాశారని చెప్పారు. డిపాజిట్దారులు డబ్బు జమ చేసినప్పుడు వారికిచ్చే బాండ్లపై అతను, సీఈవో సంతకాలు చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ శ్రీకాంత్ ఎప్పుడూ బాండ్లపై సంతకాలు చేయలేదని చెప్పారు. డిపాజిట్దారులు డిపాజిట్ చేసేందుకు వచ్చినప్పుడు వారి నుంచి డబ్బులు తీసుకునేవాడని అన్నారు. ఆ డబ్బులను సీఈఓకు అప్పగించి ఆ వివరాలు క్యాష్ బుక్లో నమోదు చేయకుండా సాధారణ డైరీలో నమోదు చేశాడని చెప్పారు. ఇది మోసం అని తెలిసి కూడా సొసైటీని అడ్డుపెట్టుకుని ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు ఒక పథకం ప్రకారం కుమ్మక్కయ్యారని అన్నారు. తద్వారా రైతులకు నకిలీ బాండ్లు అందజేసి, వసూలు చేసిన సొమ్మును దారి మళ్ళించారని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో కురగల్లు సీఈవో రాయల రమేష్ బాబును అరెస్టు చేసిన విషయం విదితమే. -
ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గళ్లా మాధవి అనుచరులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ సిబ్బంది గురువారం తొలగించడంపై వివాదం రాజుకుంది. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఫ్లెక్సీల తొలగింపుతో ఇది తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ అభిమానులు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వేడుకలు ముగియకుండానే నగరపాలక సంస్థ సిబ్బంది గురువారం తొలిగించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమణల నిర్మూలన దళం సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది ‘మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ బెదిరించినట్లు మహిళా నాయకురాలు లాం నవమి ఆరోపించారు. ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తూ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను పట్టించుకోని కమిషనర్ పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఆది నుంచి కమిషనర్ పులి శ్రీనివాసులు బేఖాతరు చేస్తూ వస్తున్నారు. కమిషనర్ తీరుపై ఎమ్మెల్యే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం విదితమే. పెమ్మసానికి ఎమ్మెల్యే ఫిర్యాదు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి గురువారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని పెమ్మసాని దృషికి తీసుకెళ్లినట్లు సమాచారం. నగరపాలక సంస్థ కమిషనర్ తన మాటను బేఖతారు చేస్తున్నారని, కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. పెమ్మసాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిమ్స్లో కనీస సౌకర్యాలు కరువు
●ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, సహాయకులు ● పట్టించుకోని అధికారులు, కాంట్రాక్టర్లు మంగళగిరి టౌన్ : వైద్యసేవలు అంటేనే గుర్తుకు వచ్చేది ఎయిమ్స్ వైద్యశాల. మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో వైద్యసేవల కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో అనారోగ్య బాధితులు, సహాయకులు వస్తుంటారు. అయితే వారికి అందించే కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రోగులు, సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ఓ పక్క గంటల తరబడి ఓపీ దగ్గర నిలబడడమే కాకుండా, వైద్యులు రాసిన పరీక్షల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. రోగులు, రోగి సహాయకులు టాయిలెట్స్ వినియోగించుకోవాలంటే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఎయిమ్స్లో టాయిలెట్స్ సౌకర్యాలు మూతబడడంతో మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ వైపు అధికారులు సైతం కన్నెత్తి చూడడం లేదు. ఎయిమ్స్ వైద్యశాలలో ప్రతి ఫ్లోర్లో టాయిలెట్స్ ఉన్నాయి. ఏ ఫ్లోర్లో చూసినా యూరినల్స్ కమోడ్స్ పని చేయకపోవడంతో కొందరు లెట్రిన్ కమోడ్స్ను వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అవి కూడా అరకొరగా ఉండడంతో పదుల సంఖ్యలో రోగులు, సహాయకులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. యూరినల్స్ తరువాత ఉపయోగించే వాష్ బేసిన్లు, ట్యాప్లు పనిచేయడం లేదు. అయితే కొందరు రోగులు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని సమస్యను తెలుపగా, కొన్నిరోజుల క్రితం కాంట్రాక్ట్ కాలం పూర్తి అయ్యిందని, ప్లంబర్లు లేక అలాగే వదిలివేశారని తెలిపినట్లు సమాచారం. కాంట్రాక్ట్ కోసం టెండర్లు పిలిచారని కొత్తగా కాంట్రాక్టర్ వచ్చేవరకు ఈ పరిస్థితి తప్పదని చెప్పడం రోగులను విస్మయానికి గురిచేసింది. యూరినల్స్ పనిచేయకపోవడం, రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని రోగులు విమర్శిస్తున్నారు. త్వరితగతిన కనీస సౌకర్యాలు కల్పించాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు. -
పల్నాడుపై గంజాయి పడగ
పల్నాడు జిల్లాపై గంజాయి పడగలెత్తింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గంజాయి ముఠాలకు విద్యార్థులు, యువత లక్ష్యంగా మారుతున్నారు. ఎప్పటికప్పుడు సరఫరాను అడ్డుకుని, నిందితులను కఠినంగా శిక్షించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ వైఖరితో పోలీసులు కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.టాస్క్ఫోర్స్: యువత, విద్యార్థులు సరదాగా గంజాయి తాగటంతో మొదలవుతున్న ఈ వ్యసనం వారిని అన్నివిధాలా కుంగదీస్తోంది. పలు కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. గంజాయి రవాణా మాత్రం జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా యువకులను ముఠాలు మత్తులో దించుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో రోజురోజుకూ కేజీల చొప్పున లభ్యమవుతోంది. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల్లో మారుమూల కాలనీలు, గ్రామాలే లక్ష్యంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ మండలాల్లో పోలీసులు వారం రోజుల నుంచి ప్రతి గ్రామం, ప్రతి వీధి జల్లెడ పట్టారు. వారికి గంజాయి తాగేవారితోపాటు అమ్మకాలు జరిపేవారు కూడా దొరికినట్లు సమాచారం. వారి నుంచి భారీ మొత్తంలోనే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అరకు నుంచి గురజాలకు...పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాలకు చెందిన కొంత మంది స్పోర్ట్స్ బైకులపై అరకు నుంచి రోడ్డు మార్గంలో కాలేజీ విద్యార్థుల్లా ఐడీ కార్డులతో గంజాయి తీసుకొస్తున్నారు. కొంతకాలం క్రితం వీరు రాజమండ్రి పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. మళ్లీ వచ్చి ఇవే పనులు చేస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణ పోలీసులకు కూడా వీరు చిక్కినట్లు సమాచారం.శివారు కాలనీల్లో విక్రయాలుపిడుగురాళ్ల పట్టణ శివారులోని కొన్ని కాలనీలలో ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో తెలుస్తోంది. వారిని పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ఇద్దరు మహిళల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారికి సరఫరా చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం పట్టణంలో ఓ కాలనీలో ముగ్గురిని పట్టుకోగా, వారికి సరఫరా చేసే వ్యక్తి దాచేపల్లి పట్టణంలో ఉన్నాడని విచారణలో తేలింది. అతడి నుంచి కొన్ని కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో గంజాయి తాగే, విక్రయించే వారి బైక్లు కూడా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.పెరుగుతున్న వివాదాలుపిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండల కేంద్రాల్లో గంజాయి తాగి యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. బ్యాచ్లుగా విడిపోయి గొడవలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వారిని అదుపు చేయటంలో కూడా పోలీసులు విఫలం అవుతున్నారు. తరచూ గొడవలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది.గోప్యత వెనుక కారణాలేంటి?పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వివరాలు మాత్రం వెల్లడించటం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణ పోలీస్స్టేషన్లకు వెళ్లారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇది జరిగిన పది రోజుల వ్యవధిలోనే కేజీల గంజాయి నియోజకవర్గంలో పట్టుబడటం, నిందితులను అదుపులోకి తీసుకున్నా వివరాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.ఎంతటి వారైనా కఠిన చర్యలుగంజాయి కేసులలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. – బి.జగదీష్, గురజాల డీఎస్పీ -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. భక్తుల ఉదయం రద్దీ సాదారణంగా ఉండగా, 11 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, ఛండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయం వెలుపుల ఉన్న వేద ఆశీర్వచనాన్ని గురువారం నుంచి ఆల యం లోపల మండపంలోకి మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉద యం 11 గంటల తర్వాత ఒక సారిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. సర్వ దర్శనానికి రెండు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు రూ.100 టికెట్ క్యూలైన్లోకి ఉచితంగా మళ్లించి రద్దీని నియంత్రించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పురప్రముఖులు, వీఐపీలు మహానివేదన అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేయడంతో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ నేపథ్యంలో ఏఈఓలతో పాటు సూపరింటెండెంట్లకు, ఇతర సిబ్బందికి ఆలయంలో ప్రత్యేక విధులు కేటాయించారు. మరోవైపు ఆలయానికి చేరుకునే క్యూలైన్లతో పాటు గాలిగోపురం, వీఐపీ మార్గం, సింహద్వారాల వద్దకు భక్తులు చేరుకుని తమను అలయంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. -
రేపు మల్లేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శనివారం ఆరుద్రోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఆరుద్రోత్స వం విశిష్టతను దేవస్థాన స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు వివరిస్తూ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన ఈశ్వరునికి అరుద్రోత్సవం, తెల్లవారుజామున ఉత్తరద్వార దర్శనం జరుగుతుందన్నారు. దీనినే ఆరుద్రోత్సవం లేదా శివముక్కోటి అని కూడా అంటారని తెలిపారు. తెల్లవారుజామున స్వామి వారికి విఘ్నేశ్వరపూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పంచామృత అన్నాభిషేకం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించిన నంది వాహనంపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్ల గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు.జెడ్పీలో నూతన సంవత్సర వేడుకలు గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, సురేష్కుమార్ దంపతులు నూతన సంవత్సర కేక్ కట్ చేసి, అధికారులతో పాటు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పలువురు ఎంపీడీవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.4న తెనాలిలో హిందూ సమ్మేళనంతెనాలి: గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట, షరాఫ్బజార్ బస్తీలకు సంబంధించి ఈనెల 4న జరగనున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్, హిందూ చైతన్యవేదిక నాయకులు కోరారు. కార్యక్రమ ఆహ్వానపత్రికను గురువారం ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి హిందూ సమ్మేళనం జరుగనుందని రాష్ట్ర ఆర్ఎస్ఎస్ మీడియా ప్రముఖ్ అవ్వారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ పొట్టిమూర్తి తెలియజేశారు. హిందూ చైతన్యవేదిక రాష్ట్ర సంయోజక్ పిన్నం వెంగళరావు ప్రధాన వక్తగా, తెనాలికి చెందిన పెండేల వెంకట్రావు, డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని తెలిపారు. హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ శ్రీరాం రాజేష్బాబు, తాతా శ్రీనివాసరావు పర్యవేక్షించే ఈ సమ్మేళనంలో హిందువులందరూ కుటుంబాలతో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ సంయోజక్ కోట రాజేష్, సహ సంయోజక్ విజయ్, తెనాలి పట్టణ ఐక్యవేదిక నుంచి వెచ్చా శ్యామ్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.నృసింహ ఆలయంలో భక్తుల కోలాహలంమంగళగిరి టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి దిగువ, ఎగువ సన్నిధి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నా రు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ సునీల్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు
నరసరావుపేట: కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లాను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియచేశారు. కలెక్టరేట్లో డీఆర్ఓ ఏకా మురళి, ఉద్యోగులు కలెక్టర్ను కలసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు. పలువురు జిల్లా అధికారులు తమ ఉద్యోగులతో కలెక్టర్ను కలిసి బొకేలు, నోటు పుస్తకాలు, మొక్కలు, విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల మెటీరియల్ పుస్తకాలు అందజేశారు. ఈవిధంగా సమకూరిన సుమారు 1300 నోటు పుస్తకాలు, 275 పాఠ్యపుస్తకాలను స్థానిక లైబ్రరీకి, వసతిగృహాల విద్యార్థులకు అందజేస్తామని కలెక్టర్ తెలియచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిజేసేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేట: రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావులు వేర్వేరుగా గురువారం ఆవిష్కరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజయకుమార్, ఇతర మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్లు కలెక్టర్, ఎస్పీలను వారి వారి కార్యాలయాల్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేశారు. ఈ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరింప చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి ప్రజల్లో భద్రతపై అవగాహన కలిగించాలని కోరారు. -
కొత్త ఆశలతో
సత్తెనపల్లి: పాత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త ఆశలతో నవ వసంతంలోకి ప్రజలు అడుగుపెట్టారు. అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుకు సాగారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొంగొత్త అనుభూతి. స్మార్ట్ఫోన్, సోషల్మీడియా రంగప్రవేశంతో అందరూ పోటీ పడి మరీ న్యూ ఇయర్ అభినందనలతో పోస్టింగులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్లో సందేశాలు పంపడంలో అధిక శాతం మంది నిమగ్నమయ్యారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మార్కెట్లో బేకరీలు, పూలు, పండ్లు, రంగుల దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. మహిళలు, యువతులు తమ ఇళ్ల వద్ద అందంగా రంగవల్లులు వేశారు. ఘుమఘుమలాడే బిర్యానీ పాయింట్లు పెద్దసంఖ్యలో వెలిశాయి. మార్కెట్లో వివిధ రకాల పూల బొకేలను విక్రయిస్తున్నారు. బేకరీలో అనేక ఆకారాలు, రంగులు, సైజుల్లో కేక్లను విక్రయించారు. తమ అభిమాన రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు బొకేలతో పాటు పూలు, పండ్లు కొనుగోలు చేస్తూ బిజీ అయ్యారు. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి ప్రజలు సందడి చేశారు. పలు ఆలయాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. ప్రధానమైన చర్చిలన్నీ విద్యుత్ కాంతలతో మిరిమిట్లు గొలుపుతున్నాయి. ఆలయాల్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సంబరాలపై పోలీసులు ఇప్పటికే నిషేధ ఆజ్ఞలు విధించారు. ఎవరైనా అడ్డగోలుగా హంగామా చేస్తే కేసులు తప్పదంటూ హెచ్చరికలు చేస్తూ బుధవారం అర్ధరాత్రి బందోబస్తు నిర్వహించారు. -
ఆటో బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
కారెంపూడి: ముఠా కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని పెదకొదమగుండ్ల గ్రామ శివారు బ్రహ్మనాయుడు కాలనీ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ముఠా కూలీలు పచ్చి మిరపకాయల బస్తాలు కాటా వేసి తరలించేందుకు ట్రాలీ ఆటోలో బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలోని పొలానికి వెళ్లారు. పని ముగించుకుని ఆటోలో పొలం బాట నుంచి రోడ్డు ఎక్కిన తర్వాత ఆటోను రివర్స్ చేస్తున్న క్రమంలో వెనుకున్న లోతైన గోతిలో పడిపోయిందని చెబుతున్నారు. ప్రమాదంలో ట్రాలీ ఆటోపై కూర్చున్న వారు కిందపడిపోగా... వారిపై ఆటో బోల్తాపడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మొగిలి సైదులు (44), షేక్ సమీర్ (20)గా గుర్తించారు. అదే గ్రామంలోని పొట్టి శ్రీరాములు కాలనీకి చెందిన బత్తుల త్రినాథ్కు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. కారెంపూడి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వాసు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఆన్లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీలు
● తొలుత అప్పులు చేసి పందేలు ● తర్వాత ఇళ్లలో దొంగతనాలు ● అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఆన్లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీల బాట పట్టిన అంతర్ రాష్ట్ర దొంగను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన మర్రి శివగోపి ఇంట్లో ఇటీవల రూ.2.35 లక్షల విలువైన బంగారం చోరీ అయినట్లు కేసు నమోదైంది. తెనాలి డీఎస్పీ జనార్దన్ పర్యవేక్షణలో తెనాలి రూరల్ పీఎస్ సీఐ షేక్ నాయబ్రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్లు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ ఫుటేజీలో బైక్పై వెళ్తూ ముఖానికి మాస్క్ ధరించిన యువకుడ్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామ వాసి పెనుగొండ మల్లికార్జునరెడ్డి అలియాస్ మల్లిగా గుర్తించారని ఎస్పీ చెప్పారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో తెనాలి రూరల్ పీఎస్ పరిధిలో రెండు, మేడికొండూరు పీఎస్ పరిధిలో ఒకటి, తెలంగాణలోని హుజూర్నగర్, చింతకాని, అనంతగిరి పోలీస్స్టేషన్లల్లో మూడు చోరీ కేసులు అతడిపై ఉన్నాయని తెలిపారు. 2024లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన నిందితుడు అప్పులు చేశాడని, తర్వాత చోరీలు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చోరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి డీఎస్పీ, తెనాలి రూరల్ పీఎస్ సీఐ, కొల్లిపర పీఎస్ ఎస్ఐతోపాటు ఏఎస్ఐ పోతురాజు, హెచ్సీ టి.రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.కూర్మారావు, ఎన్.పోతురాజులను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.


