Palnadu
-
పరీక్ష రోజున కేంద్రం మార్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్కు బదులుగా మరో సెంటర్ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్ సెంటర్ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్లో హాల్ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం. ఏఎన్యూలో మరో మాయాజాలం -
ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతా
మా స్వస్థలం వినుకొండ మండలం ఏనుగుపాలెం. అమ్మానాన్న పుష్పలత, శ్రీనివాసరావు. వినుకొండ మండలంలోని మండల పరిషత్ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పని చేస్తున్నారు. సీనియర్ ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్ కై వసం చేసుకున్నాను. మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్కు సన్నద్ధం అవుతున్నాను. అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకు కై వసం చేసుకుని, ముంబై ఐఐటీలో సీఎస్ఈలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను. తదుపరి స్టార్టప్ ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. – తుంగా దుర్గా సుప్రభాత్, ఓపెన్ కేటగిరీ 11వ ర్యాంకు -
కలెక్టర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా...
టీడీపీ నేత కోడెల శివరాం ఇచ్చిన ఫిర్యాదుపై చర్చ సాక్షి, నరసరావుపేట : పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్పై టీడీపీ నేత కోడెల శివరాం ఏకంగా ఎనిమిది పేజీల లేఖను సోమవారం జిల్లా కలెక్టర్కు అందించినట్టు తెలియవచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేలు చేసిన అక్రమ మైనింగ్, కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆధారాలతో కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. దీంతో దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో అక్రమ మైనింగ్ను మంగళవారం నిలిపివేశారు. శివరాం ఇచ్చిన ఫిర్యాదుతో కంగుతిన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనాయణ, షాడో ఎమ్మెల్యేగా పేరొందిన దరువూరి నాగేశ్వరరావులు మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి శివరాం ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించినట్టు సమాచారం. దాచేపల్లి : ౖరెల్వే ట్రాక్ విస్తరణలో భాగంగా భూ సేకరణకు రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు చేపట్టే డబ్లింగ్ పనులకు సంబంధించి దాచేపల్లి మండల పరిధిలో 9.32 ఎకరాల పట్టాభూమి అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కేసానుపల్లి, పెదగార్లపాడు గ్రామాల పరిధిలో అవసరమైన భూమి సేకరణ కోసం గురజాల ఆర్డీవో మురళీకృష్ణ అధ్యక్షతన కేసానుపల్లి గ్రామ సచివాలయంలో రైతులతో గ్రామ సభ నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్కార్డులు, సంబంధిత రైతు బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని ఆర్డీవో మురళీకృష్ణ చెప్పారు. తహసీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో గిరి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి: జగద్గురువులు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు సత్తెనపల్లిలో వేదగాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. సంఘ బాధ్యులు అత్తలూరు అనిల్కుమార్ శర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబొమ్మల సెంటర్ విఘ్నేశ్వరుడి ఆలయంలో ముందుగా పూజా కార్య క్రమాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. వేదగాయత్రీ పురోహిత సంఘం బాధ్యులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీధర్, కొనంకి మారుతీ, అంపిరాయని రాజశేఖర్ శర్మ, గుండవరపు అమర్నాథ్, మణికంఠ, రవి, గోవర్ధన్, ధ్రువ కుమార్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సతీసమేతంగా అర్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. -
కష్టంపై గెలిచి.. తోడై నిలిచి...
● పంక్చర్ దుకాణం పనుల్లో వివాహిత ● సమస్యల పరిష్కారంలో దంపతుల ప్రయాణం ● విమర్శలు ఎదురైనా వెనుదిరగని షంషున్ సంప్రదాయాలను పక్కన పెట్టిన ఆమె.. తన జీవిత భాగస్వామికి తోడై నిలిచారు. అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఒడ్డెక్కించేందుకు ఏకంగా పంక్చర్ దుకాణంలో పనులు నేర్చుకున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ చాలావరకు అప్పులు తీర్చారు. ఆమే షంషున్. ద్విచక్ర వాహనాల నుంచి భారీ లారీల వరకు చిటికెలో పంక్చర్ వేసి.. చకచకా టైరు బిగిస్తూ జీవితమనే వాహనం సక్రమంగా సాగేలా కష్టపడుతున్నారు.యడ్లపాడు: ముసుగు దాటని ముచ్చట్లు, ఇంటి గడప దాటని అడుగులు.. సగటు ముస్లిం గృహిణి గురించి సమాజం రాసుకున్న నిర్వచనమిది. కానీ యడ్లపాడు మండలం బోయపాలెం దగ్గర జాతీయ రహదారిపై వెళ్తుంటే భారీ టిప్పర్ల టైర్లను అవలీలగా విప్పుతూ, ఇనుప రాడ్లతో తిరిగే ఓ మహిళ సగర్వంగా కనిపిస్తుంది. బురఖా ముసుగును పక్కన పెట్టి, టైర్ల మధ్య తన జీవిత చక్రం ఆగిపోకుండా పోరాడుతున్న ఆ వనిత పేరు ‘షంషున్’. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నా పేరు షేక్ షంషున్. మస్తాన్వలి, రంజాన్బీ దంపతులకు మేం ముగ్గురం ఆడపిల్లలం. మాది ఫిరంగిపురం స్వస్థలం. ఐదో తరగతి వరకు చదువుకున్న. పన్నెండేళ్ల కిందట యడ్లపాడు మండలం బోయపాలెంకు చెందిన దరియాతో వివాహం చేశారు. భర్త చిన్నప్పటి నుంచే పంక్చర్ల పని నేర్చుకుని, బోయపాలెం పెట్రోల్ బంక్ వద్ద దుకాణం పెట్టారు. తొలుత అప్పు చేసి లారీ కొన్నాం. విధి వెక్కిరించింది. భారీ నష్టాలు వచ్చి రూ.పది లక్షల అప్పు మిగిలింది. ఇచ్చిన వారు అడుగుతుంటే , మా గురించి ఆలోచించే వారే లేకుండాపోయారు. నీళ్లు తాగి కడుపు నింపుకొన్నాం. ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. ఆ కన్నీళ్లే నా జీవితాన్ని మార్చేశాయి.’’ ‘‘నేను పని మొదలుపెట్టిన కొత్తలో చాలామంది వింతగా చూశారు. ‘ఆడపిల్లవి ఇదేం పని?’ అని నన్ను, నా భర్తను ఎద్దేవా చేశారు. నేను పట్టించుకోలేదు. సొంతంగా కష్టపడుతున్నామనే తృప్తి మాకుంది. కష్టంలోనూ పైసా వృథా కాకుండా పొదుపు చేస్తూ అప్పులు తీరుస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా బాకీలు తీరిపోయాయి. నిఖా సమయంలో ‘భార్యాభర్తలు సమానం’ అని చెబుతారు. ఆ మాటను నేను చేతల్లో చూపిస్తున్నాను. మా పిల్లలు మా తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటున్నారు. భర్తకు సహచరిగా, బిడ్డలకు ఆసరాగా నిలబడటంలో ఉన్న సంతృప్తి కంటే పెద్ద విజయం ఇంకేముంటుంది? ఒక మహిళ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.’’ నీతి లేని పోలీసుల రీతి -
రెచ్చిపోతే గుణపాఠం తప్పదు
నరసరావుపేట రూరల్: వన్ టైం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అండదండలతో రెచ్చిపోయి దాడులకు పాల్పడే వారు భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన కలిశారు. వైఎస్సార్సీపీ పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు హన్నుపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. నిందితులపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారని, దీనిని 307గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... లింగంగుంట్ల రాజుపాలెంలో హన్నుపై టీడీపీ గూండాలు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే అండతోనే... హన్నుపై దాడి వెనుక ఎమ్మెల్యే ప్రొద్బలం ఉందన్నారు. ఘటనా స్థలంలో నిందితులు వినియోగించిన బులెట్ మీదనే ఎమ్మెల్యే తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. విశ్వామిత్ర టీ స్టాల్ యజమాని పొట్లూరి వెంకి ఈ దాడికి ముఖ్య సూత్రధారిగా వ్యవహరించాడని ఆరోపించారు. వరుస దాడులు వెంకి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హన్నును పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చి శివకోటి, ఖాజావలి మాస్టారు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు బూదాల కల్యాణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి -
నాటు బాంబులు స్వాధీనం
బెల్లంకొండ: మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మంగళవారం నాటుబాంబులు కలకలం సృష్టించాయి. గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో గ్రామానికి చెందిన సంక్రాంతి కోటయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద ఐదు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ పి.గోపి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... కోటయ్య ఇంటి వద్ద నాటు బాంబులు గుర్తించిన గ్రామ వీఆర్వో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇంటివద్ద మరుగుదొడ్డిలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వరిపొట్టులో ఉన్న ఐదు నాటు బాంబులను లభ్యమయ్యాయి. వెంటనే సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు, క్రోసూరు సీఐ ప్రత్తిపాటి సురేష్లు బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సభ్యులతో గ్రామానికి చేరుకున్నారు. బాంబులను స్వాధీనం చేసుకుని, ఊరి చివరకు వెళ్లి వాటిని పరిశీలించారు. బాంబులను సీజ్ చేసి సంబంధిత నైపుణ్యుల నిర్ధారణ కోసం పంపారు. ఘటనపై విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. -
గుంటూరులో ఉద్రిక్తత.. పేదల ఇళ్లు కూల్చివేత
సాక్షి, గుంటూరు: మోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు.. పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే నీచంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కిందపడి చావండంటూ సలహా ఇచ్చారని బాధితులు మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. మోతిలాల్ నగర్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేత నూరి ఫాతిమా బాధితులను పరామర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇల్లు తొలగించాలని నూరి ఫాతిమా కోరారు. -
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిపై దాడి
నరసరావుపేట: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పట్టణ అధ్యక్షుడు హన్నూపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి రాడ్లు, కర్రలతో దాడిచేశారు. దాడిలో హన్ను తల, చేతులకు తీవ్రగాయమైంది. వారి నుంచి తప్పించుకొని గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు వచ్చి హన్నూకు తగిలిన గాయాలను సెల్ఫోన్ లైటు సహాయంతో పరిశీలించారు. తాను వ్యక్తిగత పనిపై లింగంగుంట్ల గ్రామం వెళ్లి వస్తుండగా జై టీడీపీ, బాస్ అని రాసి ఉన్న నంబర్ ప్లేటు కలిగి ఉన్న బుల్లెట్ బండిపై వచ్చిన వ్యక్తులు తనపై రాడ్లు, కర్రలతో దాడిచేశారని బాధితుడు హన్ను విలేకర్లకు తెలిపారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు. సుమారు ఆరుగురు టీడీపీ గూండాలు దాడిచేశారని, తలకు, చేతులకు గాయాలయ్యాయన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. పోస్టులు పెట్టే వారిపై దాడిచేసి గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, ఆయన కుమారుడు ఒక పథకం ప్రకరం జాబితా తయారుచేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. 24వ వార్డుకు చెందిన బాధితుడిని వెంబడించి దాడిచేశారన్నారు. వచ్చే తమ ప్రభుత్వంలో తాము జాబితా తయారుచేస్తామన్నారు. ఎవరు దాడిచేసింది, ఎవరు ప్రేరేపించారనేది తమ వద్ద సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తమపై అనేక పోస్టులు పెట్టినా తాము దాడులు చేయలేదని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తికి చెందిన బుల్లెట్ బండిపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడతో కూడిన వీడియోను డాక్టర్ గోపిరెడ్డి విలేకర్లకు చూపించారు. తమ కార్యకర్తలపై దాడిచేయాలనే ముందస్తు ప్లాన్తో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, ఇటువంటి చర్యలు పునరావృతం గాకుండా జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వరవకట్ట పెద్దబుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కోళ్ల వ్యాన్
కారెంపూడి: కోళ్ల వ్యాన్ బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మండలంలోని పేటసన్నెగండ్ల బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అడిగొప్పల అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన వ్యాన్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన చెవుల దాసు (25), మేకల శివాజీ (30) అక్కడికక్కడే మృతి చెందారు. సాంబశివరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వీరు ముగ్గురు అడిగొప్పల సమీపంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేటసన్నెగండ్ల శివారులో ఉన్న సాగర్ కాల్వ బ్రిడ్జి సమీపంలో ఉన్న రోడ్డు డౌన్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్లు రవాణా చేసే బొలోరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా అతి వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వాహనం టైర్ల కింద పడి నలిగిపోయారు. ఇద్దరూ తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసులు పరిశీలించి విచారిస్తున్నారు. పోలీసులు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బంధువులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాన్ మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని కోళ్లఫారం యజమానిదిగా తెలుస్తోంది. -
ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గణపవరంలో సంచలనం రేపింది. గ్రామంలోని సినిమాహాల్ రోడ్డులో యర్రం శ్రీధర్రెడ్డి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన దంపతులు స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్దాస్ మాలిక్ ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రసాద్దాస్మాలిక్ నాలుగేళ్లు వేరే కంపెనీలో పనిచేసి, మూడేళ్లుగా స్పిన్నింగ్మిల్లు క్వార్టర్స్లో ఒంటరిగా ఉంటున్నాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఆదివారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు ఇరువురూ పనులకు వెళ్లటంతో ఒంటరిగా ఉన్న చిన్నారికి ప్రసాద్ దాస్ మాలిక్ మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. విషయం చుట్టుప్రక్కల కార్మికులకు తెలియటంతో వారు ప్రసాద్ దాస్ మాలిక్ను నిలదీశారు. నిందితుడికి దేహశుద్ధి చేసి ఒంటిపై వాతలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై రేఖాప్రియాంక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా క్లూస్టీం బృందం స్పిన్నింగ్ మిల్లు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ నిరంజన్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడు ప్రసాద్దాస్మాలిక్పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గణపవరంలో సంచలనం రేపింది. గ్రామంలోని సినిమాహాల్ రోడ్డులో యర్రం శ్రీధర్రెడ్డి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన దంపతులు స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్దాస్ మాలిక్ ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రసాద్దాస్మాలిక్ నాలుగేళ్లు వేరే కంపెనీలో పనిచేసి, మూడేళ్లుగా స్పిన్నింగ్మిల్లు క్వార్టర్స్లో ఒంటరిగా ఉంటున్నాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఆదివారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు ఇరువురూ పనులకు వెళ్లటంతో ఒంటరిగా ఉన్న చిన్నారికి ప్రసాద్ దాస్ మాలిక్ మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. విషయం చుట్టుప్రక్కల కార్మికులకు తెలియటంతో వారు ప్రసాద్ దాస్ మాలిక్ను నిలదీశారు. నిందితుడికి దేహశుద్ధి చేసి ఒంటిపై వాతలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై రేఖాప్రియాంక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా క్లూస్టీం బృందం స్పిన్నింగ్ మిల్లు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ నిరంజన్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడు ప్రసాద్దాస్మాలిక్పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
మా కుటుంబానికి ప్రాణ హాని
నరసరావుపేట రూరల్: బెయిల్పై విడుదలైన నిందితులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వినుకొండలో దారుణహత్యకు గురైన షేక్ రషీద్ సోదరుడు ఖాదర్బాషా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును ఖాదర్బాషా కలిసి ఫిర్యాదు చేశారు. 2024 జూలై 17వ తేదీన రషీద్ను వినుకొండలోని మెయిన్రోడ్డులో దారుణంగా నరికి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నిందితుడు మినహా మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ–2 పఠాన్ సిద్దిక్, ఏ 5 అంబులెన్స్ రఫీ, ఏ 8 కొమ్మా వెంకటసాయి, ఏ 12 పఠాన్సైదా నుంచి నా కుటుంబానికి ప్రాణహని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీరి బెయిల్ రద్దు చేయమని హెకోర్టులో క్రిమినల్ పిటీషన్ దాఖలు చేయగా, గత నెల 17వ తేదీన బెయిల్ను రద్దు చేసినట్టు వివరించారు. ఈ కేసులో ఏ 2, ఏ 5, ఏ 8, ఏ 12 నిందితులను వారం రోజుల్లోపు కోర్టులో లొంగిపోవాలని తీర్పునిచ్చినట్టు తెలిపారు. నేటి వరకు నిందితులు కోర్టులో హాజరుకాలేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా కోరాడు. -
బైక్ను ఢీకొన్న కోళ్ల వ్యాన్
కారెంపూడి: కోళ్ల వ్యాన్ బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మండలంలోని పేటసన్నెగండ్ల బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అడిగొప్పల అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన వ్యాన్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన చెవుల దాసు (25), మేకల శివాజీ (30) అక్కడికక్కడే మృతి చెందారు. సాంబశివరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వీరు ముగ్గురు అడిగొప్పల సమీపంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేటసన్నెగండ్ల శివారులో ఉన్న సాగర్ కాల్వ బ్రిడ్జి సమీపంలో ఉన్న రోడ్డు డౌన్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్లు రవాణా చేసే బొలోరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా అతి వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వాహనం టైర్ల కింద పడి నలిగిపోయారు. ఇద్దరూ తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసులు పరిశీలించి విచారిస్తున్నారు. పోలీసులు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బంధువులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాన్ మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని కోళ్లఫారం యజమానిదిగా తెలుస్తోంది. -
నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. మాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాడని వాపోయింది. దీనికిగాను నా 150 గజాల స్థలానికి రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న తమకు న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. ఇక మరణమే తనకు దిక్కు అని సుధారాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది. -
నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాడని వాపోయింది. రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. -
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రమైన గంగా పార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం సోమవారంతో ముగిసింది. దేవాలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ పండిత బృందం హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశాయి. అనంతరం దేవాలయాల శిఖరాలకు విద్యా పీఠం పీఠాధిపతి పజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొని తిలకించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు, దాతలు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, మంతెన అనుపమ, పావులూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు (వాసు), నిర్వాహకులు ఉప్పల పద్మజ, అరుణ, తమ్మన సాంబశివరావు, నన్నపనేని పద్మ, పావులూరి వరలక్ష్మి, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట టౌన్: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో జరిగింది. సుభానినగర్కు చెందిన వెంకట నారాయణ (40) సోమవారం వేకువజామున కాలనీకి సమీపాన ఉన్న ఓగేరు పాత అయ్యప్ప గుడి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వరి పొట్టు లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ కు తీవ్ర గాయాలు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం–2027 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు అర్హులైన క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ ఎస్.భరణి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అర్హులైన క్రీడాకారులు తమ నామినేషన్, సిఫారసులను httpr://awardr.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమ దరఖాస్తులను మే 15వ తేదీ సాయంత్రం 5గంటల లోపు rportrinap@ bmai.com, dranrtpanadudirtrict@fmai.com పంపాలని తెలిపారు. వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్ఎస్డీసీ సమన్వయంతో ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని ఏపీ సీఆర్డీయే స్కిల్ హబ్ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ పూర్తిచేసి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్మేళాలో పాల్గొనవచ్చని, ఫ్రెషర్స్ – ఉద్యోగ అనుభవం ఉన్నవారికి సైతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు htt pr://naipunyam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ తదితర గుర్తింపు పత్రాలు, బయోడేటాతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం రాజధాని గ్రామాలలోని సీఆర్డీయే ఫెసిలిటేటర్ను సంప్రదించవచ్చని, లేకుంటే శ్రీకర్ 9963425999 నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.13,700, మోడల్ ధర రూ.10,500 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2280 టీఎంసీలు.రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ జ్ఞానసుందరం చీరాల: అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.జ్ఞానసుందరం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాదాల నివారణపై జరిగిన వర్క్షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను వర్క్షాపులో వివరించారు. గృహాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లలో అగ్ని నిరోధకాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, గ్యాస్ కారణంగా సంభవించే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోందన్నారు. తమ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా అందుబాటులో ఉన్న అగ్ని నిరోధకాలతో మంటలు అదుపు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ కేఎన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, చీరాల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ, ఐటీసీ జీఎం శ్యామ్సుందర్, ఈహెచ్ఎస్ సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రెడ్డి, జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మట్టిలో మౌనం.. శతాబ్దాల ధ్యానం.. నాగలి స్పర్శతో భక్తులకు దర్శనం అలంకారం వీడి..ఆత్మరూపం చూపి తరాల సేవ..తరగని భక్తి... అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలిఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా7 -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. బాపట్ల: న్యూఢిల్లీలో ఈనెల 21న జరిగే 18వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్నకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికై న అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్కు చోటు దక్కడం విశేషం. కలెక్టర్ ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించింది. నరసరావుపేట రూరల్: మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మండలానికో ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీవోలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్లు వరకు, సబ్సిడీతో రూ.5కోట్లు వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 526.30 అడుగులకు చేరింది. ఇది 161.0148 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మా కుటుంబానికి ప్రాణ హాని
నరసరావుపేట రూరల్: బెయిల్పై విడుదలైన నిందితులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వినుకొండలో దారుణహత్యకు గురైన షేక్ రషీద్ సోదరుడు ఖాదర్బాషా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును ఖాదర్బాషా కలిసి ఫిర్యాదు చేశారు. 2024 జులై 17వ తేదీన రషీద్ను వినుకొండలోని మెయిన్రోడ్డులో దారుణంగా నరికి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నిందితుడు మినహా మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ–2 పఠాన్ సిద్దిక్, ఏ 5 అంబులెన్స్ రఫీ, ఏ 8 కొమ్మా వెంకటసాయి, ఏ 12 పఠాన్సైదా నుంచి నా కుటుంబానికి ప్రాణహని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీరి బెయిల్ రద్దు చేయమని హెకోర్టులో క్రిమినల్ పిటీషన్ దాఖలు చేయగా, గత నెల 17వ తేదీన బెయిల్ను రద్దు చేసినట్టు వివరించారు. ఈ కేసులో ఏ 2, ఏ 5, ఏ 8, ఏ 12 నిందితులను వారం రోజుల్లోపు కోర్టులో లొంగిపోవాలని తీర్పునిచ్చినట్టు తెలిపారు. నేటి వరకు నిందితులు కోర్టులో హాజరుకాలేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా కోరాడు. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట రూరల్: తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బానిస అని వ్యాఖ్యనించడం జరిగిందన్నారు. మా పార్టీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీకి దాసి లాగా షర్మిల పనిచేస్తున్నారని విమర్శించినట్టు వివరించారు. దీనిని దురుద్దేశంతో టీడీపీ నాయకులు, టీడీపీ ట్రెండ్స్, స్వాతిరెడ్డి తదితరులు తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై తాను చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని, టీడీపీ నాయకులు మాత్రం దానిని వక్రీకరించి సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిపై దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు పోలీసులకు అందజేశామని తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు. దాసి అనే దానికి అర్థాన్ని టీడీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రంలోని వీడియోను ప్రదర్శించి దాసి అంటే సేవకురాలు అని అర్థం అని తెలిపారు. ‘మాకు అధికారం ఉంది మేమే నరుకుతాం’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, సొంత మామను వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు చంద్రబాబు తీసుకెళ్లాడని గుర్తుచేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట టౌన్: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో జరిగింది. సుభానినగర్కు చెందిన వెంకట నారాయణ (40) సోమవారం వేకువజామున కాలనీకి సమీపాన ఉన్న ఓగేరు పాత అయ్యప్ప గుడి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వరి పొట్టు లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ కు తీవ్ర గాయాలు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు -
ఇద్దరు పిల్లలకు విషం తాగించి తండ్రి ఆత్మహత్యాయత్నం
బొల్లాపల్లి: భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో కలకలం రేపింది. గంగుపల్లి తండాకు చెందిన బాణావత్ చిన్నినాయక్కు అతని భార్య బుజ్జిబాయికి కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో, ఆమె సుమారు 20 రోజులుగా తన చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్ (6)తో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య బుజ్జి బాయిని కాపురానికి తీసుకువచ్చే ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన చిన్ని నాయక్, శనివారం ఉదయం తన చిన్నకుమారుడిని తనతోపాటు ఇంటికి తీసుకొచ్చాడు. సాయంత్రం సమయంలో కూల్డ్రింక్ బాటిల్లో గడ్డి మందు కలిపి, తన పెద్ద కుమారుడు శివ నాయక్ (7) మరియు చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్లకు తాగించి, తాను కూడా తాగాడు. ముగ్గురూ కలిసి సుమారు పావు లీటర్ విషం తాగినట్లు తెలిసింది. అనంతరం వారు అస్వస్థతకు గురవ్వడాన్ని గమనించిన గ్రామస్తులు, పిల్లలను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు ముగ్గురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తండ్రి చిన్ని నాయక్, పెద్ద కుమారుడు శివ నాయక్ను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి, చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్ను మెరుగైన చికిత్స కోసం గుంటూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఘాతుకం నిలకడగా ముగ్గురి ఆర్యోగం -
లివర్ను ఇలా కాపాడుకోవాలి..
ఆల్కాహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది కాబట్టి మద్యం జోలికి వెళ్లవద్దు. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినవద్దు. ఉప్పు, చక్కెర , రెడ్మీట్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. పచ్చని ఆకు కూరలు తినటం వల్ల లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. ఆలీవ్ ఆయిల్స్, వాల్నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు, వెల్లులి పాయలు, పసుపు లివర్కు మేలు చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కాలేయం వద్ద పేరుకుపోయే కొవ్వును నియంత్రణ చేస్తుంది. రోజూ నీటిని ఎక్కువగా తాగటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్. -
లివర్ క్యాన్సర్కు దారితీస్తాయి...
లివర్ క్యాన్సర్లు రావటానికి హెపటైటిస్– బీ, హెపటైటిస్–సీ వ్యాధులే కారణం. కామెర్ల వ్యాధి(జాండీస్) సోకిన వారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో హెపటైటిస్ వైరస్ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ హెపటైటిస్కు దారి తీసి కొన్నేళ్ల తరువాత లివర్ దెబ్బతినటానికి కారణమవుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ వస్తుంది. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు -
జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్కు అటానమస్ హోదా
నరసరావుపేటరూరల్: జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్కు అటానమస్ హోదా కల్పించనున్నట్టు జేఎన్టీయూకె వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కె ప్రసాద్ తెలిపారు. కాకానిలోని జేఎన్టీయూఎన్ కళాశాల ప్రాంగణంలో వార్షికోత్సవ, క్రీడోత్సవాలు శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ సీఎస్ఆర్కె ప్రసాద్, ఎఫెక్ట్రానిక్స్ సంస్థ సీఈవో దాసరి రామకృష్ణ, యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ పి.సుబ్బారావు, సీనియర్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్లు అతిథులుగా పాల్గొన్నారు. సీఎస్ఆర్కె ప్రసాద్ మాట్లాడుతూ జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. బాలుర, బాలికల వసతి గృహాలు సిద్ధమవుతున్నాయని వివరించారు. పల్నాడు ప్రాంతంలోని ఈ క్యాంపస్ విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉందని తెలిపారు. ఇందులో భాగంగా కాకాని క్యాంపస్ పూర్తిస్థాయి యూనివర్సిటీగా మారబోతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక గణితం, భౌతిక శాస్త్రాలపై పట్టు సాధిస్తే ప్రస్తుత సమాజంలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యా, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్బాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7 గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది. సూర్యోపాసన సేవ లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
గరికపాటికి లీగల్ నోటీసు
తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్, వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టణ అయితానగర్లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్, శ్రీనివాస్ మాట్లాడారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఈతకు వెళ్లి యువకుడు మృతి పట్నంబజారు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పాత గుంటూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సీతానగర్కు చెందిన పొదుకూరి లోకేష్ (19) అదే ప్రాంతంలోని కాళికామాత తల్లి ఆలయంలో సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మణిపురం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న నీళ్లకుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్తో కలిసి మరో ఇద్దరు ఈతకు దిగారు. నీటి కుంట లోతు అంచనా వేయలేని లోకేష్ లోపలకు దిగిన క్రమంలో ఈత కొట్టలేక అందులో కూరుకుపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం సిబ్బంది కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పాత గుంటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన రంగంశెట్టి జగదీష్ రూ.కోటీ యాభై లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అంగీకారపత్రాన్ని ఆలయ ఈవో కె.సునీల్కుమార్, ధర్మకర్త రంగప్రసాద్కి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అనివేటి మండపం, ప్రాకారం, పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా రూ.ఆరు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఈవో తెలిపారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుని మండలాభిషేక మహోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో మహోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు విఘ్న విమోచక హనుమంతునికి 108 కలశాలతో అభిషేక మహోత్సవం, విశేష అర్చనలు, అనంతరం తీర్థ ప్రసాదగోష్ఠి, సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ, హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుమంజన సేవ, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామానుజ సూత్తందాది, సాయంత్రం తిరువీధి ఉత్సవం, జగదాచార్యులు, భగవద్రామానుజులు అనుగ్రహించిన గద్యత్రయ పారాయణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పైకార్యక్రమాలలో పాల్గొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. వేటపాలెం: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలేనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు ట్రిపుల్ జంప్ఽ కాంపిటిషన్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు బ్యాంకాక్ దేశంలో థాయిలాండ్ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలు జరిగాయి. 49 ప్లస్ వయస్సులో ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమాను స్నేహితులు అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,55,030 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.3,86,53, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,26,665, స్వామి వారికి డొనేషన్లు రూపంలో రూ.1,73,217, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 28,800, దర్శనం ద్వారా రూ.33,900 కలిపి మొత్తం రూ.7,55,030 ఆదాయం వచ్చిందన్నారు. -
డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
గుంటూరు రూరల్: 2018 జూలై నెలనుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు. రాష్ట్ర కోశాధికారి శివరామకృష్ణ సంఘం ఆర్థిక లావాదేవీల వివరాలను వివరించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెట్ చెల్లింపులకు చర్యలు తీసుకున్నందున ఆయా విషయాలపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్సీ నియామకానికి చర్యలు తీసుకోవాలని, అదనపు పెన్షన్ పుపరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లు తమ మెడికల్ బిల్లులను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల ద్వారా గానీ ట్రెజరీ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లకు మెరుగైన ఆర్థిక రక్షణ కోసం రూ.5 లక్షల వరకూ కవరేజ్ కలిగిన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెన్షన్ స్లిప్లలో బకాయిల వివరాలు స్పష్టంగా చూపించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, బకాయిల భాగాలను వివరంగా చేర్చాలని కోరారు. గతంలో అందుబాటులో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ సౌకర్యాన్ని గత రెండేళ్ళుగా నిలిపివేశారని దాని వల్ల బిల్లుల స్థితిని తెలుసుకోలేకపోతున్నామని వెంటనే ఈ సౌకర్యాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీడీవో బి శ్రీనివాసరావు పెన్షనర్ల సమస్యలపై స్పదించి ప్రభుత్వానికి విషయాలను తెలియజేసి సంఘానికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఆర్డీఈఆర్ఈ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ -
అంకమ్మకు జలబిందెలతో అభిషేకం
రాజుపాలెం: మండల కేంద్రంలోని రాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ వారి ఆలయ జీర్ణోద్ధరణ, వాయు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం అధిక సంఖ్యలో మహిళా భక్తులు జలబిందెలతో తరలివచ్చి అభిషేకం నిర్వహించారు. ముందుగా వెయ్యిన్నొక్క మంది మహిళలు జలబిందెలు తలపై పెట్టుకుని బ్యాండ్మేళాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి జలబిందెలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు అరవపల్లి ఫణికేశవ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. -
23న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా సీనియర్ (పురుషులు, మహిళలు) అథ్లెటిక్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారు ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ పాల్గొనటానికి అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 23వ తేదీ 9 గంటలకు బీఆర్ స్టేడియంలో తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రిపోర్ట్ చేయాలని కోరారు. అంతర్జాతీయ హంగులతో సూర్యలంక తీరం అభివృద్ధి బాపట్ల: సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. సూర్యలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన ఆయన, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్డ్స్ను సందర్శించారు. గదుల లభ్యత, సేవల నాణ్యత, రెస్టారెంట్ ఆహార ప్రమాణాలపై ఆరా తీశారు. బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకుల రక్షణ కోసం లైఫ్ గార్డులు, హెచ్చరిక బోర్డులు, నిఘా వ్య వస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీవీఎం చైతన్య, మేనేజర్లు సతీష్, నాగభూషణం, వర్క్ ఇన్్స్పెక్టర్ శ్రీధర్, కాంట్రాక్టర్ సతీష్, డివిజన్ కార్యాలయ సిబ్బంది, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
కొరత కృత్రిమం.. అంతా అక్రమం
ఒక వైపు వంట గదిలో నిప్పు రాజేయడానికి మార్గం లేక నిరుపేదల కడుపులు కాలిపోతున్నాయి. మరో వైపు గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒక్క సిలిండర్ ప్లీజ్... అంటూ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న ప్రజల కాళ్లు అరిగిపోతున్నాయి. సిలిండర్లు మాత్రం దొడ్డిదారిన తరలిపోతున్నాయి. ప్రజల నిరసనలకు తలొగ్గి దాడులంటూ బయలుదేరిన అధికారులు అక్రమ నిల్వలను గుర్తించినా మామూళ్ల దెబ్బకు మౌనంగా ఉంటున్నారు. ఒక వైపు కట్టెలు ధరలు కూడా మండుతుంటే హోటళ్లు, చిన్న వ్యాపారాలు ఇక తమ వల్ల కాదంటూ మూసివేత బాట పడుతున్నాయి. రోజూ చిన్నాచితక వ్యాపారాలపై ఆధారపడి జీవించే కూలీల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. నరసరావుపేట టౌన్: జిల్లాలో గ్యాస్ కొరత పేరుతో నెలకొన్న పరిస్థితులు సాధారణ సరఫరాకు అంతరాయం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. మరో వైపు అదే గ్యాస్ అధిక ధరల్లో బ్లాక్లో సులభంగా లభించటం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో పెరుగుతోంది. యుద్ధ పరిస్థితులను బూచిగా చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టించాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం ఉందన్న ప్రచారంతో బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న కొంత మంది గ్యాస్ ఏజెన్సీ వారు దళారులతో కలిసి బ్లాక్ మార్కెట్కు తెరతీశారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భారీ ధరలతో హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. కొందరు వ్యాపారాలను నెట్టుకొస్తుండుగా, మరి కొందరు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివాహాల సీజన్ కావటంతో క్యాటరింగ్ రంగానికి గ్యాస్ సిలిండర్లు అత్యవసరం. దీంతో అధిక ధరలైనా చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. వారి డిమాండ్ను ఆసరా చేసుకున్న అక్రమార్కులు భారీగా సిలిండర్లను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఏడున్నర వేలకుపైగా దుకాణాలు మూసివేత గ్యాస్ కొరతతో జిల్లాలో వేల వ్యాపార సంస్థలు ఇప్పటికే మూతబడ్డాయి. సరిపడా గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెలు, డీజిల్, ఎలక్ట్రిక్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. అయితే వినియోగం పెరగటంతో కట్టెల రేటు పెరిగింది. దీంతో వ్యాపారాల్లో నష్టాలు చవిచూసి నిర్వాహకులు దుకాణం తెరిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలో మొత్తం 10,300 హోటళ్లు ఉండగా అందులో 2,600 వరకు మూతపడ్డాయి. అదే విధంగా 25,500 టీస్టాళ్లు ఉండగా అందులో 5,000 వరకు మూసేశారు. భోజన హోటళ్లు, ప్రైవేటు వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో పూర్తిగా కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తూ మెనూను కుదించారు. ఏజెన్సీలపై చర్యలేవి? ఇటీవల నరసరావుపేట పట్టణంలో భారీగా కమర్షియల్ సిలిండర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిఫిన్ బండి యజమాని అక్రమంగా శ్రీనివాసనగర్లోని తన ఇంటిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లను నిల్వ ఉంచాడనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 18 సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సిలిండర్లు ఏ ఏజెన్సీ నుంచి వచ్చాయి? అక్రమ రవాణాలో ఉన్న కీలక వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై అధికారులు లోతైన విచారణ జరపకపోవటం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం రెండు సిలిండర్ల కంటే మించి ఉండకూడదు అని చెప్పుకొస్తున్నారు. అలాంటిది పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడినప్పటికీ నామమాత్రపు కేసు పెట్టి అధికారులు చేతులు దులుపుకోవటం విమర్శలకు తావిస్తోంది. సత్తెనపల్లి రోడ్డులో క్యాటరింగ్ నిర్వాహకుడి కార్కానాపై పౌరసరఫరాల శాఖ అధికారులు 20 రోజుల క్రితం దాడులు నిర్వహించారు. దాడుల్లో 25 కమర్షియల్ సిలిండర్లను గుర్తించారు. సిలిండర్లు అన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మొదట అధికారులు నానా హడావుడి చేశారు. చివరకు నిర్వాహకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకొని కేసును నీరుగార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని టీస్టాళ్ల వద్దకు తనిఖీలకు వెళ్లిన అధికారులు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వారి వద్ద నుంచి బెదిరించి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఉచితంగా వైద్యసేవలు...
గుంటూరు జీజీహెచ్లో లివర్ జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. లివర్ జబ్బులను ముందస్తుగానే గుర్తించి చికిత్స అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేకంగా లివర్ను దెబ్బతిసే వైరస్లకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. హెపటైటిస్–బీ వైరస్ నియంత్రణ కోసం ప్రతినెలా రూ.2000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. హెపటైటిస్–సీ జబ్బులకు రూ. 20,000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. –డాక్టర్ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీవిభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
టీడీపీకి ఊడిగం చేస్తున్న షర్మిల
పిడుగురాళ్ల: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల ప్రవర్తనను చూసి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ తానా అంటే షర్మిల తందానా అంటుందని అన్నారు. మహిళా బిల్లుకు మద్దతిస్తామని, డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలలో 50 శాతం పెరుగుతాయని స్పష్టమైన హామీ ఇచ్చిన మేరకు ఆ బిల్లులకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేస్తారని షర్మిల విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. డీలిమిటేషన్పైన మీకు అవగాహన ఉందా లేదా అని షర్మిలను ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ని, రేవంత్రెడ్డిని బండ బూతులు తిట్టిందని, మళ్లీ రేవంత్రెడ్డి కాళ్లు పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పార్టీలోకి వెళ్లి ఇప్పు డు చంద్రబాబునాయుడు కు ఊడిగం చేస్తుందని ఎద్దేవా చేశారు. షర్మిలకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదని, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుందన్నారు. బయట ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే బదులు ఆ పార్టీలో చేరితే సరిపోతుందని హితవు పలికారు. మీరు ఏ భాషను ఉపయోగించి తమ నేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంటున్నారో అదే భాషలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం మానేసి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి పని చేయాలని హితవు పలికారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
కాలేయం వ్యాధులపై అప్రమత్తం
గుంటూరు మెడికల్: గుంటూరు సంగడిగుంటకు చెందిన సాకేత్ ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో సకాలంలో ఆహారం తీసుకోకుండా హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తోటి సహచరులతో కలిసి మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి మద్యం సేవించటం వల్ల కాలేయానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని నిర్ధారించారు. మద్యానికి స్వస్తిపలికి వైద్యుల సలహాలతో మందులు వాడని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఇలా ఎంతో మంది లివర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు. అతి పెద్ద గ్రంథి కాలేయం కాలేయం (లివర్) మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. లివర్ పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అనేక మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు లివర్ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది లివర్ జబ్బులతో ప్రతి ఏడాది చనిపోతున్నారు. 2030 నాటికి లివర్ జబ్బులు 35 శాతం పెరుగుతాయి. లివర్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. లివర్ బాధితులు... గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ వైద్యవిభాగంలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 130 మంది లివర్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నవారు. ప్రతి ఏడాది 4000 మందికి పైగా వివిధ రకాల సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యవిభాగంలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువ శాతం మంది లివర్ సంబంధిత సమస్యలున్న వారేనని వైద్యులు తెలిపారు. లివర్ చేసే పనులు... మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయటం, జీర్ణక్రియకు దోహదపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరం జబ్బు బారిన పడకుండా రక్షణ కల్పించటం, రక్త శుద్ధి చేయటం, శరీరంలోని విషాలను హరించటం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించటం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చటం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు త్వరగా మానటానికి కావాల్సిన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయటం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. కాలేయ సమస్యలకు ముఖ్యకారణాలు మత్తు పదార్థాలు సేవించటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఇన్ఫెక్షన్స్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడటం వల్ల హెపటైటిస్ బీ, సీ వ్యాధులు సోకుతాయి. కలుషిత రక్తమార్పిడి, కలుషిత నీరు తాగటం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులొస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి కాలేయంపై పేరుకుపోతుంది. నూనె వస్తువులు ఎక్కువగా తినటం, పిజ్జాలు, బర్గర్స్లు, ఫాస్ట్ఫుడ్ వల్ల లివర్ వ్యాధులు వస్తాయి. శరీరానికి హానిచేసే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మన రోగ నిరోధక శక్తి మనవైపే ప్రతికూలంగా పనిచేయటానికి అవకాశం ఉన్నప్పుడు , వంశపారంపర్యంగా కాలేయ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కళ్లు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కామెర్ల సమస్యలు ఉన్నట్లు భావించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం చేయని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. -
అప్రమత్తత నీళ్లు
అగ్నిపై చల్లు.. జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న సమయమిది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. వారికి అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు, నివారణపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. సత్తెనపల్లి: వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉన్నా కొన్ని సమయాల్లో ప్రాణనష్టంతోపాటు, ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైగా ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుండటం కలవరపరిచే అంశం. అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. లీడింగ్ ఫైర్మెన్లు, ఫైర్ మెన్లు, డ్రైవర్ కం ఆపరేటర్లు, సిబ్బంది కొరతతో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 6 అగ్నిమాపక కేంద్రాలకుగాను 5 చోట్ల అగ్నిమాపక అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్ లీడింగ్ ఫైర్ మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డ్రైవర్ కం ఆపరేటర్ 18 మందికిగాను కేవలం 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఫైర్మెన్ 54 మంది ఉండాలి. కేవలం 28 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఒకేసారి రెండు మూడు చోట్ల ప్రమాదాలు జరిగితే నష్ట నివారణ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా 30 మంది హోంగార్డులతోనే విధులు నిర్వహిస్తున్నారు. పిడుగురాళ్లకు కొత్త వాహనం... ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 6 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ కేంద్రాలన్నీ సింగిల్ యూనిట్ కావడంతో ఒక్కో కేంద్రానికి ఒక్కో అగ్నిమాపక వాహనం మాత్రమే ఉంటుంది. వినుకొండ, మాచర్ల అగ్నిమాపక కేంద్రాలకు కేటాయించిన అగ్నిమాపక వాహనాలు 15 ఏళ్లు పైబడ్డాయి. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులతో కొత్త అగ్నిమాపక వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత విడుదల చేశారు. వాటిలో జిల్లాకు మంజూరైన కొత్త అగ్నిమాపక వాహనాన్ని పిడుగురాళ్లకు కేటాయించారు. కొనసాగుతున్న వారోత్సవాలు... వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా తరహాలోనే ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 1994 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదానికి గుర్తుగా ఏటా జాతీయ అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని 6 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా స్కూళ్లు, కళాశాలలు, వైద్యశాలలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ సిలిండర్ గోదాములు, కర్మాగారాల్లో అగ్నిమాపక అధికారులు అవగాహన పెంచడానికి విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. ఏడేళ్లలో అగ్ని ప్రమాదాల వివరాలు... ఏడాది ఫోన్ ఆస్తి నష్టం మృతుల కాపాడిన కాల్స్ (రూ.) సంఖ్య వారి సంఖ్య 2019–20 536 6,89,55,561 14 04 2020–21 459 14,22,97,460 06 – 2021–22 498 10,52,53,400 04 – 2022–23 464 4,27,30,020 10 04 2023–24 533 56,21,78,000 12 02 2024–25 530 6,62,18,000 13 27 2025–26 3,048 98,76,32,450 85 65 మొత్తం 6,088 197,62,64,891 144 102 అగ్ని ప్రమాదాలను అదుపు చేయడంతోపాటు ప్రమాదాలపై ముందస్తు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నాం. వేసవిలో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడాన్ని నియంత్రించాలి. ఇంట్లో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –ఎస్ శ్రీధర్, జిల్లా విపత్తుల స్పందన అధికారి, పల్నాడు -
మోడల్ పాఠశాలలో కొండ చిలువ ప్రత్యక్షం
నూజండ్ల: స్థానిక మోడల్ పాఠశాలలో భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. విద్యార్థులు ఆందోళన చెందారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బాత్రూమ్లోనికి వెళ్లేందుకు తలుపు తీయగా లోపల పెద్ద కొండ చిలువ కనిపించింది. భయాందోళనలకు గురైన విద్యార్థులు ప్రిన్సిపాల్కు తెలుపగా ఆమె స్థానిక పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. కొండ చిలువ పెద్దదిగా ఉండటంతో పంచాయతీ సిబ్బంది చేసేది లేక అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు వచ్చి కొండచిలువను పట్టుకుని, దగ్గరలో ఉన్న అడవిలో వదిలేశారు. -
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావునరసరావుపేట ఈస్ట్: చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ, పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఏ విడుదలపై హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు విమర్శించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం స్టేషన్రోడ్డులోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేఎస్కే షరీఫా అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కనీసం పీఆర్సీ కమిషన్ నియమించకుండా కూటమి ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని, వెంటనే పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుపై ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మాట్లాడకపోవటం సీపీఎస్ ఉద్యోగులను దగా చేయటమే అవుతుందన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు యాప్ల భారాన్ని తగ్గించి బోధనకు పరిమితం చేయాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టరేట్లో 43 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్లు వి.వి.రవికుమార్, సువర్ణ, జిల్లా సబ్కమిటీ సభ్యులు కృష్ణారావు, ఇబ్రహీమ్, ప్రజామూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులను ముంచిన సర్కార్
పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం అటకెక్కిన బాబు హామీలు నరసరావుపేట, రొంపిచర్ల: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను చంద్రబాబు సర్కారు నట్టేట ముంచుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేపై రొంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద రైతు ధర్నా నిర్వహించారు. రాస్తారోకో చేసి రోడ్డును దిగ్బంధనం చేశారు. దీనిలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, వందల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే మొక్కజొన్న పంటకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారన్నారు. వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు మళ్లాలని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత రైతులు మొక్కజొన్న పండించారన్నారు. పల్నాడు జిల్లాతోపాటు యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చిందన్నారు. మొక్కజొన్న పండించడానికి, రైతుకు ఎకరానికి పెట్టుబడి రూ.50 వేలు అవుతుందని చెప్పారు. కౌలుకు మరొక రూ.20 వేలు కలిపి మొత్తం రూ.70 వేలు ఖర్చు అవుతోందన్నారు. దళారులు క్వింటాకు రూ.1700 చొప్పున కొనుగోలు చేస్తే రూ.68 వేలు మాత్రమే వస్తుందన్నారు. అంటే ఎకరానికి రైతు ఇంకా రూ.2 వేలు నష్టపోతున్నాడని పేర్కొన్నారు. ఏడాది అంతా కష్టపడి, ఎండనక వాననక రైతు పొలంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికే రూ.లక్షల కోట్లు అప్పుచేసి రాజధాని నీళ్లలో పోస్తోందని పేర్కొన్నారు. వాటిలో కనీసం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రవ్యాప్తంగా రైతు పంట కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించకపోవటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేరుగానీ... రాజధానిలో ఒక్కో కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.3 వేల కోట్లు, రూ.4 వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇంత దారుణంగా రైతు నష్టపోతుండగా, వారిని ఆదుకునే వారే కరువయ్యారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఇక్కడి ఎమ్మెల్యేలు వారి సొంత లాభాలు, దందాల కోసం వ్యవహరిస్తున్నారేగానీ ఎక్కడా పరిపాలన సాగట్లేదన్నారు. పల్నాడు జిల్లా రైతులందరూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని, కలెక్టర్ వెంటనే స్పందించి ప్రతి మార్కెట్ యార్డులో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. మద్దతు ధర రూ.2400 ప్రకారం కొనుగోలు చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబును అడుగుతారో, కేంద్రాన్ని అడుగుతారో అది వారిష్టమన్నారు. ప్రకటించిన రేటుకు కొంటామంటేనే రైతులు మొక్కజొన్న సాగు చేశారని, ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్లే దళారులు తక్కువ రేటుకు కొంటున్నారన్నారు. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలు తెరిచి రేటు ఫిక్స్ చేస్తే, దళారులు కూడా రేటు పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బాత్రూమ్లో 10 గంటలు కూర్చునే బదులు కలెక్టర్, వ్యవసాయాధికారి దగ్గరో 10 గంటలు ధర్నా చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు పంట ధరల స్థిర నిధి కింద రూ.3 వేల కోట్లు కేటాయించారన్నారు. తుపాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేసి ప్రతి రైతులకు అండగా నిలిచిందన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. అధిక పెట్టుబడులతో రైతన్న ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నేడు పంట కొనుగోలు చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతన్నకు న్యాయం జరిగేలా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంటను మద్దతు ధరలు కొనాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు, విద్యార్థి, ఎస్సీ సెల్ విభాగాల జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, కొమ్ము చంద్రశేఖర్, రొంపిచర్ల, నకరికల్లు, నరసరావుపేట మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, భవనం రాఘవరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గెల్లి బ్రహ్మారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, మండల యువజన విభాగ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేష్, నాయకులు పచ్చవ రవీంద్రబాబు, ముండ్రు హరినారాయణ, గాడిపర్తి సీతయ్య, షేక్ కరిముల్లా, చపారపు సంజీవరెడ్డి, గుండా వెంకటేష్, పల్లకి అంజనారెడ్డి, బొల్లు బుజ్జి, పొనుగోటి నాసరరావు, మానుకొండ వాసుదేవరెడ్డి, కోడూరి వెంకటేశ్వరరెడ్డి, కంచేటి రామారావు, పల్లపు అంజయ్య తదితర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ పల్నాడు చాలా వెనుకబడిన ప్రాంతమని, జొన్న, పెసరు ఎక్కువగా పండిస్తారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా నాగార్జునసాగర్ నిర్మించిన తర్వాత ఈ ప్రాంత రైతులు కష్టపడి వరి, పత్తి, మిరప, అపరాలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా సాగర్ ఆధునికీకరణకు రూ. వేల కోట్లు ఖర్చుచేసి చివరి భూములకు సైతం నీరు అందేలా కాలువలను తీర్చిదిద్దారన్నారు. అద్దంకి–నార్కెట్పల్లి హైవే ఆధునికీకరించటం వలన రైతులు పండించిన పంట ఈ రోజు ఎక్కడికై నా తీసుకెళ్లే అవకాశం దక్కిందన్నారు. నరసరావుపేట మార్కెట్ యార్డును విభజించి రొంపిచర్ల మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి, రైతు భరోసా, ప్రత్యేక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయం పండగ చేశారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ వ్యవసాయం దండగ చేస్తారని చెప్పామని, అయితే అరచేతిలో వైకుంఠం చూపించి మహిళలకు నెలకు రూ.1500, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలిచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. ఇప్పుడు చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద సాయం అందక పలువురు రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మొక్కజొన్న వేసినా గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గిట్టుబాటు ధర కల్పించేవారని పేర్కొన్నారు. టీడీపీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ప్రయోజనం లేదని అన్నారు. వారు ఏసీ గదులలో కూర్చొని దందాలు చేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. మండుటెండలోనూ రైతుల కోసం బాధ్యతగా వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. చంద్రబాబు కళ్లు తెరిపించి వ్యవసాయాన్ని పండగ చేస్తామని ప్రకటించారు. -
వైద్యుడి నియామకంలో కునికిపాట్లు
ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడి నియామకం జరగక ఐదు నెలలైనా పట్టించుకున్న నాథుడు లేడు. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే వారే కరువయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కనీసం కు.ని. ఆపరేషన్లు కూడా చేయించలేని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను ఐదు నెలల క్రితం సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ నియంత్రణ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేకపోవటం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు ఆశ్రయించడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. రోజూ ఎనిమిది నుంచి పది వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. సగటున నెలకు సుమారు 200కుపైగా నిర్వహించేవారు. గతేడాది నవంబర్ నెలలో ఓ మహిళకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ టి. నారాయణస్వామి సర్జికల్ బ్లేడును తొడ భాగంలో వదిలేశారు. రోగి బంధువులు ఆందోళన చేయటంతో విచారణ జరిపిన అధికారులు... డాక్టర్, స్టాఫ్ నర్స్ శౌరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. వారిద్దరిని గతేడాది డిసెంబర్ 5వ తేదీన అధికారులు సస్పెండ్ చేశారు. ఆ స్థానంలో మరో డాక్టర్ను ఇప్పటివరకు నియమించలేదు. సంఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పీపీ యూనిట్ విభాగంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు రోగులు వచ్చి వెనుతిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. వైద్యం లేదు.. ప్రోత్సాహకం రాదు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషనుకు రూ.1,500, పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సకు రూ.2,000కుపైగా అందించటం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. దీంతోపాటు ప్రయాణ భత్యం, ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, చికిత్స అందిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆశ వర్కర్లకు కూడా ప్రోత్సాహకం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవటంతో ఈ ప్రయోజనాలన్నీ దక్కటం లేదు. ఒకవైపు ఉచిత వైద్యం కోల్పోతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. ఆరోగ్యానికి ముప్పు.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఎక్కువగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. ఆలస్యం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. కుటుంబ నియంత్రణ లేకపోవటం వల్ల అనుకోని గర్భధారణలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్యంపై ప్రభావం చూపి సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కుటుంబ నియంత్రణను ప్రవేశ పెట్టింది. ప్రైవేటు వైద్యశాలలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా చేయటంతో పాటు ప్రోత్సాహకం అందించే కుటుంబ నియంత్రణ ఆపరేషనుకు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సేవలు నిలిచిపోవటం ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను వ్యాపారంగా మలుచుకొని లాభం పొందుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ అంశం ఆర్థిక భారంగా మారింది. కొందరు పేదలు మాత్రం సత్తెనపల్లి, చిలకలూరిపేట, గుంటూరు వంటి ప్రాంతాలకు వ్యయప్రయాసలుకోర్చి వెళ్లి ప్రభుత్వ వైద్యశాలలో కు.ని. ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
యడ్లపాడు: రేషన్ డీలర్ ఆఽధీనంలో అక్రమంగా సరుకుల నిల్వలు అధికంగా ఉన్నాయంటూ మండలంలోని జాలాది గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రసాద్ గురువారం రాత్రి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల రాకతో ఫిర్యాదు దారులు సైతం కలిసి తామే ఫిర్యాదు చేశామని చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉన్నట్లు తేలడంతో యడ్లపాడు డీటీ అనురాధకు సరుకుల వివరాలను చూడాలంటూ ఆదేశించి వెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం డీఎస్వోను వివరాలు అడగ్గా గ్రామంలోని 16వ రేషన్షాపులో ప్రజా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత బియ్యం, జొన్నలు అధిక నిల్వలు ఉన్నందున వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిల్వల వివరాలు మండల అధికారుల నుంచి తీసుకోవాలని చెప్పగా, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ వాటి పూర్తి వివరాలు తమ వద్దకు రాలేదని శనివారం తెలియజేస్తామంటూ సమాధానమిచ్చారు. అధికారుల తనిఖీల్లో సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 95.50 కేజీ పంచాదార, జొన్నలు కూడా నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. భారీగా నిల్వలు గుర్తింపు, డీలర్పై 6ఏ కేసు నమోదు -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో రూ.కోట్ల వైద్య పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రికంటే దీటుగా అందిస్తున్నామని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అన్నారు. ఆసుపత్రిలో మీకోసం మేము కార్యక్రమంలో భాగంగా 73వ వారం రోగులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇటీవల కాలంలో రూ. వంద కోట్లతో జింకానా ఎంసీహెచ్ భవనం ప్రారంభించామన్నారు. ప్రభుత్వం రూ.30 కోట్ల వైద్య పరికరాలు అందించిందన్నారు. క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సంతానం లేనివారికి ఐవీఎఫ్ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోత, కుట్లు లేని ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో ఉన్న రోగులను పరామర్శించేందుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ఒకరు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, రోగుల సహాయకులు దీన్ని గుర్తించి తమకు సహకరించాలన్నారు. ఆహారం తిని ఎక్కడబడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఆర్ఎంఓ శ్రీనివాసరాజు, పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ -
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ (ఎస్పీ – సంపర్క్) నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. -
డ్వాక్రా గ్రూపులన్నింటికీ స్త్రీ నిధి రుణాలివ్వాలి
నరసరావుపేట: సీ్త్రనిధి రుణాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన వార్షిక రుణ, జీవనోపాధి ప్రణాళిక జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొన్ని సంఘాల్లో కనీస సభ్యుల సంఖ్య లేకపోవడం వల్ల రుణ ప్రణాళిక అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని సంఘాలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది సీ్త్రనిధి యాక్షన్ ప్లాన్ కింద రూ.257.44 కోట్లు, ఉన్నతి యాక్షన్ ప్లాన్ కింద రూ.42.15 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు సహకరించిన బ్యాంకు ప్రతినిధులను సత్కరించారు. కేవలం రుణాలు అందించడమే కాకుండా, ఏ తరహా రుణాలు పొందితే సభ్యులకు గరిష్ట ఆదాయం లభిస్తుందో క్షేత్రస్థాయిలో వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు రుణాల వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అభివృద్ధి క్లస్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల లింకేజీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక కృషిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెర్ప్ డైరెక్టర్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
బాధితులకు 150 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 150 మొబైల్ఫోన్లను బాధితులకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్లో ఫిర్యాదుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు రూ.8.44 కోట్ల విలువైన 4,224 మొబైల్ ఫోన్లను ఎటువంటి రుసుం లేకుండా బాధితులకు అప్పగించామని తెలిపారు. మొబైల్ ఫోన్లల్లో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు మొబైల్ఫోన్లల్లో ఎక్కువ నిర్వహిస్తున్నారని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని చెప్పారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస జిల్లా ఎస్పీ అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యాలయం మీడియా ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రహుల్లాలు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పనులపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరంతరం మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మేకా అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరసరావుపేట: స్వీయ జనగణనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తన వివరాలను ఆన్లైన్ ద్వారా శుక్రవారం నమోదు చేసుకున్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30 తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ: వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంపై పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సుమారు రూ.54 కోట్లు అంచనా వేశారని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తాయని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సివిల్ పనుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ మురళి, ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ, మున్సిపల్, రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 527 అడుగులకు చేరింది. ఇది 162.3490 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,431, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,231 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,231 క్యూసెక్కులు చేరుతోంది. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐ కె.కె.తిరుపతిరావును చెరుకుపల్లి స్టేషన్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న జి.కిరణ్బాబును నిజాంపట్నం స్టేషన్కు, జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న బి.బాబురావును మార్టూరు అర్బన్ స్టేషన్, చెరుకుపల్లి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.అనిల్ కుమార్ను వీఆర్ బదిలీ చేశారు. -
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ మద్దతు
మొక్కజొన్న రైతులకుచంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంపై నేడు రొంపిచర్ల మార్కెట్ యార్డ్లో ‘రైతు ధర్నా’సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వంలో దగా పడ్డ రైతుల పక్షాన నిలిచి పోరాడేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. విత్తనాలు, ఎరువులు, పండించిన పంటలకు గిట్టుబాట ధర వంటి సమస్యలతో ప్రస్తుతం అన్నదాతలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. వీటిపై పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచింది. ఇప్పుడు పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేకపోతున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలపై ‘రైతు ధర్నా’ పేరిట నేడు రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు ఇతర పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో తరలిరానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో సాధారణ సాగు 27,065 ఎకరాలు కాగా... 1,34,348 ఎకరాల్లో మొక్కొజొన్న సాగైంది. కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 వరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.800 – రూ.700 వరకు నష్టపోతున్నారు. -
చర్యలు తీసుకోండి
వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా నరసరావుపేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత, నిల్వలు, నూతన రీచ్ల ఏర్పాటుపై సమీక్ష చేశారు. ఇప్పటికే అనుమతులు పొందిన సెమీ–మెకనైజ్డ్ ఇసుక రీచులు, సాధారణ రీచ్ల ద్వారా పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలో భవిష్యత్తు ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా అచ్చంపేట, అమరావతి మండలాల్లో కొత్త రీచ్ల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికలు పంపాలని ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా మైనింగ్ అధికారి నాగయ్య పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేసి పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక అభివృద్ధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్–శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ స్థితి, వినియోగంపై సమీక్షించారు. పర్యాటక ప్రదేశాలను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, మెప్మా పీడీ గోపాలకృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ డీవీఎం చైతన్య, డీఇ కుమార్, పర్యాటక అభివృద్ధి మండలి మెంబర్ జాస్తి వీరాంజనేయులు, అమరావతి తహసీల్దార్ డానియల్, ఎంపీడీఓ శివపార్వతి, కోటప్పకొండ ఈఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ ల్యాండ్ మ్యాటర్ సూపరింటెండెంట్ సంజీవకుమారి, ఆర్కియాలజీ సిబ్బంది పాల్గొన్నారు. నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత జిలాల్లో నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’లో గ్రామాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై గురువారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అమలు జరుగుతున్న ’జలధార’ కార్యక్రమం రీతిలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు గ్రామాలలో నీటి వనరులలో మిగులు, లోటు నీటి నిల్వలపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనల గురించి ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా ఉండేలా నీటి పరిరక్షణ కోసం ‘నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, అమలులో అధికారులు సమర్థంగా పని చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ -
కౌలు చెల్లించడం కూడా కష్టమే
మద్దతు ధర రూ.2,400గా ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశా. పంట చేతికి వచ్చేసరికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆశించా. అయితే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు అడుగుతున్నారు. ఈ ధరలతో అమ్మితే పెట్టుబడి రాకపోగా... కౌలు డబ్బులు కూడా చెల్లించడం కష్టం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – గానుగపంట సుబ్బారెడ్డి, బుచ్చిబాపనపాలెం, రొంపిచర్ల మండలం -
మండలానికో కొనుగోలు కేంద్రం పెట్టాలి
మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2,400గా ప్రకటించడంతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 1.34 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు మొదలు ఎరువులు, పురుగుమందుల కొరతతో రైతులకు పెట్టుబడి భారీగా పెరిగింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు రైతులను దగా చేస్తున్నారు. దీనికి నిరసనగా నేడు ఉదయం 9 గంటలకు రైతు ధర్నాకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, రైతు సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి. – డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే -
రైతులను గాలికి వదిలేసిన సర్కారు
చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా దళారులకు కొమ్ముకాస్తూ రైతులను నిలువునా మోసం చేస్తోంది. – అన్నం పున్నారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు -
మద్దతు ధర, తూకంలో మోసం
ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఇంటికి చేరిన పంటను అమ్ముకోవాలంటే తక్కువ ధరకే వ్యాపారులు అడుగుతున్నారు. రూ.1,700 రేటుకు అమ్ముకున్నా బస్తాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తూకంలో సైతం మోసాలు తప్పడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే మాలాంటి రైతులు అప్పులపాలు కావాల్సిందే. – శ్యాగంరెడ్డి పెద్ద వెంకటరెడ్డి, బెహారావారిపాలెం, రొంపిచర్ల మండలం -
గుడిసెలోకి దూసుకెళ్లిన కారు
తప్పిన పెను ప్రమాదం చిలకలూరిపేట టౌన్: పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకెళ్లింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు చిలకలూరిపేట–నరసరావుపేట రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ పొలిరెడ్డిపాలెం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయి అక్కడే ఉన్న గుడిసెను బలంగా ఢీకొట్టింది. కారు వేగానికి గుడిసె పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి చీకట్లో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ చెన్నకేశవులు తెలిపారు. -
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి
మాజీ మంత్రి విడదల రజినిచిలకలూరిపేట: ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభం కాబోతోందని, అత్యంత కీలకమైన ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమగ్ర పారదర్శక ఓటరు జాబితాల రూపకల్పన కోసం అంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తీసివేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్కు అందరూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించాలన్నారు. ప్రతి బూత్కు క్రీయాశీలంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున, ఓటర్లను గుర్తించటం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలన్నారు. బీఎల్వోల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారని ఈ విషయంలో సాంకేతిక అవగాహన పెంచుకోవాలన్నారు. -
ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ఖైదీలకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ. సలోమి అన్నారు. 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్బాబు ఆదేశాల మేరకు గురువారం సబ్జైలును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని జైలు అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశాన్ని ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. ఖైదీలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాల గురించి వివరించారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేని నిరుపేదలు మండల న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సబ్జైలర్ సురభి అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అంబడిపూడి, కోగంటివారిపాలెం, కొండూరు గ్రామాల వీఆర్వో షేక్ ఇబ్రహం రోజు మాదిరిగానే కార్యాలయానికి వచ్చి స్టాఫ్ రూములో కూర్చున్నారు. అతని నుంచి పురుగుమందు వాసన రావడాన్ని గమనించిన తోటి వీఆర్వోలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మెరుగైన వైద్యం నిమిత్తం హుటాహుటిన సత్తెనపల్లికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మందు తాగి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఎవరి ఒత్తిడి వల్లనైనా మందు తాగాడే, ఇంటి వద్దే తాగి వచ్చాడా, ఆఫీసుకు వచ్చి తాగాడే అనే విషయాలు తెలియాల్సి ఉంది. అసలు విషయాన్ని మాత్రం తహసీల్దారు సిబ్బంది బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచారు. మందు తాగిన వీఆర్వో ఇబ్రహం స్వగ్రామం క్రోసూరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమకాలువకు 2,405, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 4,205 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 4,205 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
19న రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న విజయవాడలోని అమరావతి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని, బాల, బాలికలకు నాణ్యమైన నైపుణ్యమైన విద్య బోధించడానికి శక్తివంచన లేకుండా వారు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనారోగ్యానికి గురైతే ప్రత్యేక రెస్ట్ రూములు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల సేకరణకు ఇప్పటికే ప్రయత్నం చేశామని తెలిపారు. సమస్యలన్నింటిని రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో పాటు, విద్యాశాఖ మంత్రికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు రాజశేఖర్, ఎం.కళాధర్ మాట్లాడుతూ విజయవాడ కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు విజయవంతంలో గుంటూరు మహిళా ఉపాధ్యాయులు ఎక్కువ మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ. షకీలా బేగం తదితరులు పాల్గొన్నారుయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
మెక్కేస్తున్నారు!
‘మొక్కజొన్న’లోనూ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో దోచుకుంటున్న దళారులు ఆరుగాలం శ్రమించే రైతులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాల జాడ లేక దళారులు దోచుకుంటున్నారు. తక్కువ ధరలకు విక్రయించలేక కొందరు కల్లాల్లోనే ఆరబెట్టి ప్రభుత్వం ఏదో ఒక రోజు కొనుగోలు చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. రబీలో సాధారణ సాగు : 27,065 ఎకరాలు రైతుకు కలుగుతున్న నష్టం : రూ. 900 రబీలో సాగైన పంట : 1,32,510 ఎకరాలు ప్రస్తుతం మార్కెట్లో క్వింటా: రూ. 1,500 సాగు చేసిన రైతుల : 60,777 మంది మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కరువు నేటికీ జాడ లేని కొనుగోలు కేంద్రాలు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం క్వింటాపై రూ. 800 –రూ. 900 వరకు నష్టపోతున్న రైతులు -
ఇంటర్లో జిల్లాకు 14వ స్థానం
● సీనియర్ ఇంటర్లో 77 శాతం, జూనియర్లో 73 శాతం ఉత్తీర్ణత ● ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో పరిస్థితి మెరుగు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సీనియర్ ఇంటర్లో 12, జూనియర్ ఇంటర్లో 13వ స్థానాలలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది సీనియర్ ఇంటర్లో 14, జూనియర్ ఇంటర్లో 13వ స్థానంలో నిలిచింది. సీనియర్ ఇంటర్మీడియట్లో 14,381 మంది విద్యార్థులకుగాను 11,114 మంది, జూనియర్ ఇంటర్లో 15,945 మందికిగాను 11,162 మంది ఉత్తీర్ణులయ్యారు. వివిధ విద్యాసంస్థల్లో ఇలా... ● ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఇంటర్లో కేజీబీవీ విద్యాలయాల్లో 87.29 శాతం, ఏపీఆర్జేసీ 93.33, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60, ఎయిడెడ్ కళాశాలలు 34, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 90.28, హైస్కూల్స్ 63.75, ఏపీ మోడల్ స్కూల్స్ 82 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ● జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 54.48, ఏపీఆర్జేసీ 76.56, ఎయిడెడ్ 16, సోషల్ వెల్ఫేర్ 74.46, హై స్కూల్స్ 41, కేజీబీవీ 82, ఏపీ మోడల్ స్కూల్స్ 79.34 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ● కాగా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో గురజాల ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఎన్. లీలా వినయ్ 983, బైపీసీలో పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎం.సుస్మిత జాస్మిన్ 973 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నీలావతిదేవి తెలిపారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ హ్యూమన్ వాల్యూస్ జూన్ 5వ తేదీన, పర్యావరణం పరీక్షను జూన్ 6వ తేదీన నిర్వహిస్తారని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు జూనియర్ ఇంటర్కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సీనియర్ ఇంటర్కు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
ఘనవ్యర్థాల నిర్వహణలో లక్ష్యాలు సాధించాలి
సత్తెనపల్లి: గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణ లక్ష్యాల నిర్దేశం, లక్ష్యసాధన కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి ఎస్వీ నాగేశ్వర్ నాయక్ అన్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ సుప్రీం ఎల్టీసీలో మూడు రోజులపాటు రెసిడెన్షియల్ విలేజ్ ఇమ్మర్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సందర్భంగా బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ క్లస్టర్లలో టీమ్స్ వారీగా ప్రతిరోజు ఉదయం హరిత రాయబార్ల తో కలిసి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి సేకరిస్తున్న విధానం పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేయడం, తడి చెత్త నుండి వర్మి కంపోస్టును తయారు చేయడం, తదితర అంశాల్లోని మెలకువలను గ్రహించారు. ప్రతి గ్రామపంచాయతీ తమ పరిధిలో శుభ్రత, వ్యర్ధాల నిర్వహణ, ప్రజల భాగ స్వామ్యం వంటి అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయుటకు మార్గదర్శకాలు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సుధారాణి, ప్రకాశం జిల్లా ఆర్పీలు కె.చంద్రమోహన్, అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎఫ్టీసీ పి.మధు, మహేష్, పంచాయతీ కార్యదర్శులు కుంభా వెంకటేశ్వర్లు, చిలుకూరి కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనర్ చెంబేటి బొల్లయ్య, జిల్లాలోని 23 గ్రామాల పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి నాగేశ్వర్నాయక్ -
తెనాలిలో ఎన్క్వాస్ బృందం పర్యటన
తెనాలిఅర్బన్: నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం తెనాలి నందులపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం తనిఖీ చేసింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సభ్యులు ఆరా తీశారు. వైద్యశాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్క్వాస్ సభ్యులు డాక్టర్ అనోజ్, డాక్టర్ రవీషా, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంవో శ్యామ్, జిల్లా కన్సల్టెంట్లు వాసు, మాధవి, డాక్టర్ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆసియా, ఎంపీహెచ్ఈవో ఉమాకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: నిజాంపట్నం కోస్టల్ గార్డ్ కమాండెంట్గా సాంకేత్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతర జ్ఞాపికను ప్రదానం చేశారు. కోస్తా తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. -
వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం జిల్లా కార్యవర్గం నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీ విభాగ కార్యవర్గాన్ని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులుగా నల్లగొండ్ల వెంకయ్య (పెదకూరపాడు), రమావత్ బాలకోటినాయక్ (వినుకొండ), మొగిలి వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నున్సావత్ రంగనాయక్ (మాచర్ల), వడితే కోట్యానాయక్ (చిలకలూరిపేట), కుంభా వెంకటకోటయ్య (నరసరావుపేట), చేవూరి వెంకటమధు (సత్తెనపల్లి), కొజ్జా కోటేశ్వరరావు (పెదకూరపాడు), కార్యదర్శులుగా వడితే మంత్రూనాయక్ (మాచర్ల), వంకడావత్ శ్రీనివాసనాయక్ (చిలకలూరిపేట), అంగడి ధర్మారావు (వినుకొండ), హంసావత్ నరసింహనాయక్ (నరసరావుపేట), రమావత్ తులసీనాయక్ (సత్తెనపల్లి), దాసరి లక్ష్మయ్య (గురజాల), రమావత్ రామూనాయక్ (పెదకూరపాడు)లను నియమించారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ఉల్లిగడ్డల వరగయ్య, జరపాల సుధాకర్నాయక్ (మాచర్ల), బాణావత్ అంజిబాబు, మల్లా కొండలు (చిలకలూరిపేట), భూక్యా రమేష్నాయక్, కండ్రకుంట ప్రభాకరరావు (వినుకొండ), తుపాకుల పూర్ణచంద్రరావు, మేడా పోతురాజు (నరసరావుపేట), కొజ్జా శ్రీను, పాలపల వెంకట నరసింహారావు (పెదకూరపాడు), భూక్య శివానాయక్, బాణావత్ గోవిందనాయక్ (గురజాల), మేడా శ్రీనివాసరావు, పోట్లూరి శివయ్య (సత్తెనపల్లి) నియమితులయ్యారు. -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్ట్లు
తాడేపల్లిరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన చేయడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చీప్ ట్రిక్లు ఉపయోగిస్తున్నారన్నారు. మారని పోలీసుల తీరు పోలీసులను గౌరవ న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఇలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూడి శ్రీహరిన బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లారని, స్థానిక పోలీసులు మాకు ఏమీ తెలియదని మీడియా సాక్షిగా చెబుతున్నారని, అలా చెబుతూనే పూడి శ్రీహరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. లాయర్లు ప్రశ్నించడంతో చివరకు అక్కడ కూర్చుని నోటీసులు వ్రాసి అందజేశారని తెలిపారు. అరెస్ట్ విషయం తెలియనప్పుడు ఎందుకు సోదా చేస్తున్నారని ప్రశ్నించగా మొదట వచ్చిన ఎస్ఐకి బదులుగా మరో ఎస్ఐ వచ్చి సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శనరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుకోటి మధు, జిల్లా బీసీ సెల్ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్కుమార్కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు. గుంటూరులో నిరాహార దీక్షకు నిర్ణయం ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. -
22న శాప్ ఆటల పోటీలు
నరసరావుపేట ఈస్ట్: యువ క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 22వ తేదీన సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఫుట్బాల్, బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అండర్ 15, యూత్ అండర్ 21 బాలబాలికల విభాగాలలో ఫుట్బాల్, యూత్ అండర్ 15, అండర్ 19 బాలబాలికల విభాగంలో బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వివరాలను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డ్ ఇతర వివరాలతో ఈనెల 21వ తేదీ రాత్రి 12 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. టీపీబీఓ రసూల్ సస్పెన్షన్ నెహ్రూనగర్: నగరంలో అక్రమ, అనధికార నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర ్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా అక్రమ కట్టడం జరుగుతున్నట్లు గుర్తించి తగిన వివరాలతో 9849908391 నంబర్కు ఫిర్యా దు చేస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏటుకూరురోడ్లోని కమ్మ శేషయ్య గ్రౌండ్ ప్రాంతంలో బేస్మెంట్, లింటెల్ స్థాయిల వర కు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీపీబీఓ (ఇన్చార్జి) ఎస్కె రసూల్ను సస్పెండ్, పర్యవేక్షణ అధికారులైన ఏసీపీ జకీరా, టీపీఓ శ్రీనివాసరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. -
నిర్లక్ష్యపు ముద్ర!
రెండేళ్ల నిద్ర.. సాక్షి, నరసరావుపేట: సమస్యలు తలెత్తకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ కుడి కాలువ చివరి భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందిస్తామని 2024 సంవత్సరం ఏప్రిల్ 6న క్రోసూరు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లు అవుతున్నా నేటికీ ఆ దిశగా అడుగులు లేవు. దీంతో వ్యవసాయాధారిత నియోజకవర్గమైన పెదకూరపాడులో రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరావతిలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పెదకూరపాడులో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చి నిలుపుకోలేదు. పెదకూరపాడుకు ఐటీ పార్క్ ఏదీ? ఉమ్మడి రాష్ట్రంలో తాను హైటెక్ సిటీ తెచ్చానని, 2024లో అధికారంలోకి రాగానే పెదకూరపాడుకు సైతం ఐటీ పార్క్ తెస్తానని క్రోసూరు సభలో హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలు పెదకూరపాడులో ఏర్పాటు చేస్తాయని, ఈ నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదన్నారు. రెండేళ్లలో ఐటీ పార్క్ కాదు కదా.. వాకింగ్ చేయడానికి పచ్చిగడ్డితో నియోజకవర్గంలో ఓ పార్క్ను కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదు. ముస్లింలకు దుల్హాన్ పథకం అమలు చేస్తామని, రంజాన్ తోఫా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తావ్ బాబూ.. అంటూ ముస్లిం సోదరులు నిలదీస్తున్నారు. పంచారామంలో ప్రథమమైన అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి ఆధ్యాత్మికంగా మరింత గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ ఆనవాళ్లు లేవు. కనీసం ఆలయ భూముల సమస్యలు సైతం తీర్చలేదు. అమరావతిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. బౌద్ధులు, జైనులు తిరిగిన పుణ్యభూమి అమరావతి అని, ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ అన్నారు. అభివృద్ది చేయకపోగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 14వ తేదీన రూ.15 కోట్లతో ప్రారంభించిన ధ్యాన బుద్ధ వనాన్ని సైతం నిర్వహణ లేకుండా చేశారు. కాలచక్ర మ్యూజియం, బుద్ధ సర్క్యూట్ వంటివి అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.కృష్ణానది పరీవాహక ప్రాంతమైన పెదకూరపాడులో ఇసుకాసురుల ఆట కట్టించి అక్రమ దందాను ఆపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిత్యం వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ను మించిన ఇసుకాసురుడు లేడని, ఆయన్ని ఏం చేశావ్ బాబూ అంటూ పెదకూరపాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మట్టి దోపిడీ సొమ్ము వాటాల పంపిణీలో తేడాలొచ్చి సొంత పార్టీ నేతలపైనే పెదకూరపాడులో నియోజకవర్గంలో ముసుగు దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి రహితంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా... గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా కంపెనీలలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ ఏర్పాటుకాకపోగా యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఓటేసి గెలిపించిన ప్రజలనే కాదు సొంత పార్టీ నేత, సీనియర్ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ను సైతం సీఎం చంద్రబాబు మోసం చేశారన్న వాదనలు ఆయన వర్గం నుంచి వినిపిస్తున్నాయి. మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన శ్రీధర్ను కాదని డబ్బుల సంచితో వచ్చిన బాష్యం ప్రవీణ్కు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న శ్రీధర్ వర్గాన్ని శాంతించేందుకు క్రోసూరు సభ సాక్షిగా అధికారం రాగానే కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఎమ్యెల్సీ ఇవ్వకపోగా... అప్పటివరకు ఉన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సైతం అవమానకరంగా తప్పించి భాష్యం ప్రవీణ్ అనుచరుడికి అప్పగించారని శ్రీధర్ వర్గం మండిపడుతోంది. ఓ ముఖ్య నేత అండతో శ్రీధర్, ఆయన వర్గాన్ని అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు తెలిపారు. చంద్రబాబు స్పందించి శ్రీధర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది. -
పల్నాడు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. హామీలివ్వడం... వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం బాబు నైజం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సైతం క్రోసూరు, అమరావతి మండల కేంద్రాలలో రెండేళ్ల క్రితం జరిగిన సభల్లో పెదకూరపాడు నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. బాబు సర్కార్ ఏర్పడి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు చీదరించుకుంటున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. 7 -
17న రైతు ధర్నాకు సన్నాహాలు
నరసరావుపేట: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రతి మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన నరసరావుపేటలో రైతు ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి ప్రకటించారు. గుంటూరు రోడ్డు పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12.35 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట పండించారన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో 53,739 హెక్టార్లలో సాగు చేశారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల భవిష్యత్తును దళారుల చేతిలో పెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ మొక్కజొన్న క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1700 కు మాత్రమే కొనుగోలు చేస్తూ క్వింటాకు రూ.800 దిగమింగుతున్నట్లు చెప్పారు. పంట సాగు సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. రైతులకు పార్టీ ముద్ర వేసి కేవలం తెలుగుదేశం పార్టీ చెందిన వారికే సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ వారు, మిగతా రైతులకు ఎరువులు ఇవ్వలేదని ఆరోపించారు. వీరందరూ కట్ట ఎరువుకు రూ.300 నుంచి రూ.500 వరకు అధిక ధరకు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేశారన్నారు. దీనివల్ల సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావలసిన ఎరువులు, విత్తనాలను అడిగిన వెంటనే సరఫరా చేసిందని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంటలు కొనుగోలు చేసిందని, రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. శనగలు, మినుములు తదితర పంటలకు ధర విషయంలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దీనివల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని, రూ.3 వేల కోట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు ఉండేదని చెప్పారు. నెలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తోందని, వాటిలో ఆరోగ్యశ్రీకి రూ.3 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి మరో రూ.3 వేలు కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తీసుకున్న అప్పుల మొత్తం అంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న వర్షానికే జలమయమయ్యే రాజధాని అమరావతిలో డబ్బంతా వృథాగా ధారబోస్తున్నారన్నారు. తక్షణమే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలుకు మండలానికో కేంద్రం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు అవుతారని, రైతులు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయమే దండగ, రైతు వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతాన్ని చంద్రబాబు చెబుతున్నారని ఆరోపించారు. రైతు వ్యవస్థ లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని అన్నారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం రాణించిన దాఖలాలు లేవని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుకు ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. పంటను తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ దోచుకుంటోందని, రైతు పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందున ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్నెం పున్నారెడ్డి మాట్లాడుతూ రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన రైతుల్ని గాలికి వదిలేసి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికి పరిమితం అవుతున్నారని చెప్పారు. రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండించినా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. దళారులకు కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని విమర్శించారు. రొంపిచర్ల మండల అధ్యక్షుడు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, రొంపిచర్ల మండల నాయకులు గెల్లి చినకోటిరెడ్డి, పోతులూరి సుబ్బారెడ్డి, బీరం భాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
మంట చింతల..!
పల్నాడు జిల్లా రెంటచింతలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.6 కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గ్రామంలో ఆది, సోమ, మంగళవారం మూడు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43.1, 43.8, 44.6 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామస్తులు అల్లాడిపోయారు. భానుడు ఒక్కసారిగా భగభగ మంటూ మండుతుండటంతో గ్రామం నిప్పుల కొలిమిగా మారింది. దీనికితోడు వడ గాడ్పులు వీస్తుండటంతో గ్రామస్తులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో గ్రామంలోని మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారితో పాటు వ్రీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – రెంటచింతల -
ఆమంచి విజయభాస్కర్ శాస్త్రికి డాక్టరేట్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు. -
ఘనంగా అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్ల జయంతి
గుంటూరు లీగల్: మహనీయులు బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్స్ జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రేవతి, ట్రెజరర్ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్ లింగం, లేడీ రిప్రజెంటివ్ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా అండర్–13 ఓపెన్, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక నలందానగర్లోని మకూన్స్ కిడ్స్ ప్లే స్కూల్లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్ గోగినేని, మారెడ్డి తేజభరత్రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షలు సీహెచ్ రవీంద్రరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ లైజర్ ఆఫీసర్ ఉబా ప్రసాద్, జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్ రోడ్డులోని మహావీర్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్న్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు. -
సమానత్వం కోసం పోరాడిన అంబేడ్కర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లోని జాషువా సమావేశ మందిరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక జాతి అభివృద్ధికి కొలమానం ఆ జాతి సీ్త్ర సాధించిన ప్రగతి అని దాదాపు వందేళ్ల క్రితమే దళిత మహిళలతో అంబేడ్కర్ సంఘం ఏర్పాటు చేశారన్నారు. సామాజిక న్యాయం, మహిళా సమానత్వం కోసం అధికరణలను రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో రెండు పీహెచ్డీలు, మూడు మాస్టర్స్తోపాటు అనేక హనరరీ సర్టిఫికెట్లు పొందారన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ప్రతి విద్యార్థికి ‘పిల్లల కోసం రాజ్యాంగం’ అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశామన్నారు. చట్ట సభల పని తీరు గురించి తెలియజేసేందుకు విద్యార్థులతో అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. రూ.12 కోట్ల మేరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించామన్నారు. జిల్లాలో స్టడీ సర్కిల్ కోసం ప్రతిపాదన పంపుతామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నియోజకవర్గంలో 2 వేల ఎస్సీ గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నామని చెప్పారు. ప్రతి మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించేలా ఆదేశాలిస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అంబేడ్కర్ కారణంగా అభివృద్ధి చెందిన దేశాలకు సైతం వందల ఏళ్ల తర్వాత కానీ దక్కని అందరికీ ఓటు హక్కు భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే దక్కిందన్నారు. అంటరానితనం రూపుమాపైందన్నారు. తనకు అన్యాయం చేసిన వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకుండా వ్యవస్థను మార్చేందుకు కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. తన పోరాటంలో ప్రజలను ఏకీకృతం చేశారే కానీ విభజించలేదని పేర్కొన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అన్నారు. జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బండారుపల్లిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు. -
బైక్ను ఢీకొన్న కారు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్ డెంటల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దానశీలత కలిగిన రాడికల్ హ్యూమనిస్ట్ సుబ్బారావు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మసీ అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ జి.శోభరాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వైబ్సైటలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా, లేదా రిజిష్ట్రరు పోస్టు ద్వారా, లేదా ఆర్డీఎంహెచ్ఎస్గుంటూరు – జీమెయిల్.కామ్ మెయిల్ ద్వారా సమర్పించాలన్నారు. -
కాలువల మరమ్మతులు పూర్తి చేయండి
నరసరావుపేట: మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో వేసవిపై సమీక్షించారు. నీరు విడుదల కాగానే రైతులు పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జలధార– జలహారతి పథకం ద్వారా జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం ఆరు మీటర్లకు తీసుకురావాలని కోరారు. పది రోజుల్లోగా భూగర్భ జలం మట్టం పెంపుదలే లక్ష్యంగా కాలువల పూడిక తీత, చెరువుల అనుసంధానం, నీటి పథకాల మరమ్మతులు వంటి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు నిధులను జలధార–జలహారతి కార్యక్రమం కోసం వినియోగించాలన్నారు. సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన పరిశుభ్రత జలాలను ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలన్నీ బలోపేతం చేయాలని చెప్పారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఉన్న చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక
యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు ప్రాంతంలో అద్భుత కళాసౌరభాలు విరబూశాయి. లింగారావుపాలెం గ్రామంలోని పోసాని సుబ్బారావు కళావేదికపై మూడు రోజుల పాటు జరిగిన కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. తొమ్మిది విభిన్న నాటికలు ప్రదర్శితమైన ఈ వేదికపై కథా బలం, నటీనటుల అభినయం, సాంకేతిక హంగులు పోటీపడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రమణారావు, ఏ నర్సిరెడ్డి, గోపరాజు విజయ్ అత్యంత పారదర్శకతతో విజేతలను ఎంపిక చేసి తమ అనుభవాన్ని చాటుకున్నారు. ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక. ప్రదర్శనల విభాగంలో హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారు ప్రదర్శించిన ‘శ్రీమాత్రే నమః’ నాటిక తన అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ద్వితీయ బహుమతిని గెలుచుకోగా, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటిక జ్యూరీ ప్రత్యేక ప్రదర్శనగా గుర్తింపు పొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అభినయ విభాగంలో.. కళాకారుల అభినయంలో... ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక అవార్డుల పంట పండించింది. ఈ నాటికలో ముత్యాలరావు పాత్రలో ఒదిగిపోయిన ఈఎస్ పవన్ కుమార్ ఉత్తమ నటుడిగా, రమణమ్మ పాత్రలో భావోద్వేగాలను పండించిన ఆర్.రాజేశ్వరి ఉత్తమ నటిగా నిలిచారు. ఇదే నాటికకు దర్శకత్వం వహించిన సుఖమంచి కోటేశ్వరరావు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘శ్రీమాత్రే నమః’ నాటికకు పదునైన మాటలు అందించిన ఉదయ భాగవతుల ఉత్తమ రచయితగా అవార్డు అందుకున్నారు. ‘తరమెల్లి పోతున్నదో’ నాటికలో రంగనాథం పాత్ర పోషించిన ఎన్.శ్రీధర్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికవగా, మాతృత్వం నాటిక సంతోష్ పాత్రధారి.. పొగర్తి నాగేశ్వరరావు, మంచిమనసులు నాటిక సూర్య పాత్రధారి.. నడింపల్లి వెంకటేశ్వర్లు తమ నటనకు గానూ ప్రత్యేక ప్రశంసా బహుమతులు అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనలు, నటులకు పరిషత్ నిర్వాహకులు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులు కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మ వరప్రసాద్, పర్యవేక్షకులు జరుగుల రామారావు వీటిని అందజేశారు. -
చిత్రకారుడు వల్లెం కృష్ణకు అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు
వినుకొండ: మండలంలోని గోకనకొండ గ్రామానికి చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. డాక్టర్ కేపీ బాబు నేతృత్వంలోని క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కృష్ణ గీసిన చిత్రానికి అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు. అవార్డు పొందిన కృష్ణను పలువురు అభినందించారు. స్కూటీ డిక్కీ నుంచి రూ.3 లక్షల మాయం దుర్గి: దుర్గిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఓ స్కూటీలో ఉంచిన రూ.మూడు లక్షల నగదు చోరీకి గురైంది. దుర్గికి చెందిన వ్యాపారి మేకల బ్రహ్మం బ్యాంకు లావాదేవీల నిమిత్తం బ్యాంకులోకి వెళ్లారు. బ్యాంకులో పనిముగించుకొని బయటకు వచ్చేలోపే తన స్కూటీలో ఉంచిన రూ. 3లక్షలు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుంటూరు ఖాకీల రేంజ్ వేరు
కట్టుతప్పుతున్న రేంజ్ పోలీసులు ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకూంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తు.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. గోడ దూకి మరీ వెళ్లి.. తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు. ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది. -
అర్జీలు సకాలంలో పరిష్కరించండి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జేసీ సంజనా సింహతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 128 అర్జీలు అధికారులకు అందాయి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో 20 అర్జీలు రాగా ఇందులో గురజాల డివిజన్కు సంబంధించినవి 6, సత్తెనపల్లి డివిజన్–6, నరసరావుపేట డివిజన్–8 అర్జీలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలని తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నారా శ్రీనివాస్రెడ్డి, నాసరయ్య, నాగేశ్వరరావులు కలెక్టర్ను కోరారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేసారని తెలిపారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2400గా ఉండగా, వ్యాపారస్తులు రూ.1600 నుంచి 1800లకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీని వలన రైతులు ఎకరానికి రూ.20వేలు నష్టపోతున్నారని వివరించారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యేశ్వరరావు
సత్తెనపల్లి: ఫుట్బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో సోమవారం పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికకు రాష్ట్ర పరిశీలకులుగా హాజరైన కె.క్రాంతికుమార్ పర్యవేక్షణలో ఎమ్మార్ ఎల్ నరసింహారావు, ఎలక్షన్ ఆఫీసర్గా స్టేట్ ఈసీ మెంబర్ బి చక్రవర్తి, ఏలూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీఎస్ఎస్ పవన్కుమార్, శ్రీకాకుళం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ నీలాద్రి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఎన్.సుబ్బారావులు హాజరై పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా షేక్ షమ్మీ, వైస్ ప్రెసిడెంట్ వి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా పి కోటేశ్వరరావు, ట్రెజరర్గా ఎం.దీక్షిత, మెంబర్లుగా బి స్పందన, ఏ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ హెచ్ఎం సీహెచ్ వెంకటాద్రిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం జిల్లాలో ఫుట్బాల్ అభివృద్ధి కోసం క్రీడాకారులను జాతీయ, రాష్ట్ర క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. నూతన కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ వై.రమణారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామరెడ్డి, అచ్చిరెడ్డి, సుభానీ, గోవర్ధన, రన్హుస్సేన్, లక్ష్మి, శ్రీనివాస్రెడ్డి, గౌస్య, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు అన్యాయం
నరసరావుపేట: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డెమెక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం జూన్న్లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు డిసెంబర్ నుంచే ముందస్తు అడ్మిషన్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు స్కూల్ ముగిసిన తర్వాత టీచర్లను ఇంటింటికీ పంపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రచారం చేయిస్తున్నారని, వారికి టార్గెట్లు విధించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ముందస్తు అడ్మిషన్లు నిలిపివేయాలని, టీచర్లపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతభత్యాలు చెల్లించాలనే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు -
మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నరసరావుపేట రూరల్: మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో విచారణ వేగంగా పూర్తిచేసి వారికి న్యాయం చేయాలని అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలతోపాటు ఆక్రమణలు, బెదిరింపులు వంటి అంశాలకు సంబంధించిన మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. భూమి విక్రయించగా వచ్చిన రూ.1.80 లక్షలు మేనల్లుడు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చాను. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందటానికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగినా స్పందించడం లేదు. డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయండి. –మేకపోతుల అంకమ్మ, జమ్మలమడక, మాచర్ల మండలం గురజాల మండలం జంగమహేశ్వరపురానికి చెందిన వర్రా చంద్రశేఖరరెడ్డి ప్రేమించానని చెప్పి గర్భిణిని చేశాడు. ఆ తరువాత ఫోన్కు స్పందించడం లేదు. నాకు న్యాయం చేయండి. –ఓ యువతి నా తండ్రికి ఇష్టం లేకపోయిన 2014లో షేక్ ఆషిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను. అప్పటినుంచి అనునిత్యం నన్ను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు గురిచేస్తున్నాడు. ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నీ మీద మోజు తీరిపోయింది వెళ్లిపోమంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విడాకులు ఇవ్వాలని గత నెల 30వ తేదీన భర్త, అత్త ఇద్దరు నాపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉంటే వైష్ణవిని చంపినట్టే చంపుతామని బెదిరిస్తున్నారు. భర్త, అత్తలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. –షేక్ అప్సర, ఇస్లాంపేట, నరసరావుపేట యూకే పంపిస్తామని చెప్పి తన వద్ద రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారు. క్రోసూరు మండలానికి చెందిన గంపల హరీష్ మధ్యవర్తిగా ఉన్నాడు. యూకే పంపించక పోవడంతో డబ్బులు అడిగితే గతేడాది రూ.12లక్షలు ఇచ్చాడు. నెల తరువాత మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దీనిపై దుర్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. నగదు ఇప్పించి న్యాయం చేయండి. –మానుపాటి రవికుమార్, ముటుకూరు, దుర్గి మండలం మంగళగిరికి చెందిన పులి వెంకటలక్ష్మీప్రసాద్ తన వ్యాపార అవసరాల కోసం 2024 సెప్టెంబర్లో రూ.10లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. గత సంవత్సరం నుంచి డబ్బు చెల్లించమని అడిగితే అతని పెద్ద కుమారుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు కోసం ఇంటికి వస్తే కోర్టులు చుట్టూ తిప్పుతానని బెదిరిస్తున్నాడు. ఈ టెన్షన్తో ఆరోగ్యం కూడా దెబ్బతింది. –ఇంజేటి సదాశివరెడ్డి, నరసరావుపేట -
కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫైర్ క్రాకర్స్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్, శ్రీలక్ష్మీ దుర్గా మెస్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్ఐ, ప్రత్తిపాడు సీఎస్ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
వసూళ్లకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి
ఆరోగ్యశ్రీ పథకంలో అదనపు వసూళ్లుకు పాల్పడుతున్న జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో టెస్ట్ల పేరుతో అదనపు చార్జీలను ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. అదనపు చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏ దారి కానరాక..!
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు. రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్ -
రవికుమార్కు జాతీయ గోల్డెన్ అవార్డు ప్రదానం
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన వర్ధమాన పౌరాణిక రంగస్థల కళాకారుడు బెజగం రవికుమార్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ విభిన్న, వైవిధ్యమైన పౌరాణిక పాత్రలను, ఏకపాత్రాభినయ నాటిక రూపంలో ప్రదర్శనలు చేసినందుకుగాను కళాజ్యోతి, స్టార్ గోల్డెన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఒంగోలు సమీపంలోని కారవాది గ్రామంలో వివేకానంద విద్యానిలయ ప్రాంగణంలో ఎల్సీఈఎస్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా సంస్థ వారిచే వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన కళాకారులు, సమాజసేవకులు, లఘు చిత్ర నిర్మాతలకు సోమవారం పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రవికుమార్కు ఎల్సీఈఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సేవా సంస్థ ఒంగోలు వారి కళాజ్యోతి, లిటిల్ చాంప్స్ వారి జాతీయగోల్డెన్ అవార్డు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ పౌరాణిక పాత్రధారణలో రెండు రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు. రెండు పురస్కారాలు అందుకున్న బెజగం రవికుమార్ను పట్టణంలోని వివిధ కళా సంస్థలు, మిత్రులు సోమవారం అభినందించారు. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. ‘అమ్మచెక్కిన బొమ్మ’ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. ‘అందరూ మంచివారే కానీ..!’ కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘ఇది అతని సంతకం’ సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
పేదలకు రోబోటిక్ వైద్య సేవలు అందాలి
గుంటూరు మెడికల్: రోబోటిక్ల ప్రవేశంతో ఆధునిక వైద్యరంగం ఓ పెద్ద మలుపు తీసుకుందని ఏపీ ఏరో స్పేస్ డిఫెనన్స్ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్రెడ్డి అన్నారు. కచ్చితత్వంతో కూడిన రోబోటిక్ వైద్య సేవలు పేదలకు సైతం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తక్కువ ఖర్చుతో రోబోటిక్లను రూపొందించినప్పుడు అది సాధ్యపడుతుందని ఆ మేరకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సతీష్రెడ్డి తన ఆప్తమిత్రుడైన సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇంటికి భోజనాది కార్యక్రమాలకు హాజరయ్యారు. సతీష్రెడ్డిని బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ నరేంద్రరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తనను కలిసిన మిత్రులతో సతీష్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమైన వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికను సద్వినియోగపరచుకోవడంలో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరిందన్నారు. గుంటూరు లాంటి చిన్న నగరంలో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ’మాకో’ రోబో సేవలు అందుబాటులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకుకు దీటుగా ఇక్కడి వారికి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడలోని రెండు హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. భోజనం అనంతరం డాక్టర్ సతీష్రెడ్డిని బూసిరెడ్డి దంపతులు సత్కరించారు. ఏపీ ఏరో స్పేస్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి -
వాహనదారులపై మరో బాదుడు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెను భారాన్ని మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులను గణనీయంగా పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా పాత వాహనాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడిన వాహనాల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ప్రైవేట్ కార్ల ఫిట్నెస్ ఫీజు కేవలం రూ.600 ఉంది. గత సంవత్సరం నవంబర్లో తీసుకున్న సవరణలతో ఇది రూ.5 వేలకు పెరిగింది. ద్విచక్ర వాహనాలకు రూ.200 కాగా రూ.1,000 కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు రూ. 400 ఉండగా రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ వాహనాల విషయంలో పెంపు మరింత ఎక్కువగా ఉంది. గూడ్స్ వాహనాలు, బస్సుల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ ఫీజు గతంలో రూ.1,000 ఉంది. ఇప్పుడు రూ.12,500 కు పెరిగింది. మిడిల్ కేటగిరీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రూ.800 నుంచి రూ.10 వేల వరకు పెంపు అమల్లోకి వచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంగా రెన్యూవల్ చేస్తే అదనంగా జరిమానా కూడా విధించనున్నారు. ఉదాహరణకు, లైట్ మోటార్ వాహనాలకు రోజుకు రూ. 50 వరకు, భారీ వాహనాలకు రోజుకు రూ. 100 వరకు లేట్ ఫీజు విధిస్తున్నారు. పాత వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగిన ఈ ఫీజులు సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు భారమే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.7 వేలు, కార్లు (లైట్ మోటార్ వెహికల్స్)కు రూ.15 వేలు, మధ్యస్థ వాహనాలకు రూ. 20 వేలు, భారీ వాహనాలకు రూ.25 వేలు ఫిట్నెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకుపైగా ఉన్నాయి. ఇప్పటికే బాడుగ లేకపోవడంతోపాటు డీజిల్, పెట్రోల్, వాహన విడి భాగాల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు
సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ (కేజీబీవీ) విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని 24 కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి కేటాయించిన 1,920 సీట్ల కోసం అధికంగా పోటీ పడుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థినుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి ఆరో తరగతికి 11,00 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 920 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువును మరో వారం పెంచడంతో మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవీ సీట్ల వివరాలు... జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలోని నరసరావుపేట, నకరికల్లు, నాదెండ్ల, మాచవరం, క్రోసూరు, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, దుర్గి, గురజాల, నూజెండ్ల, రెంటచింతల, వెల్దుర్తి, సత్తెనపల్లి, ముప్పాళ్ళ, చిలకలూరిపేట, కారంపూడి, పిడుగురాళ్ల, రాజుపాలెం, రొంపిచర్ల, వినుకొండ, ఈపూరు, మాచర్లలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 24 కేజీబీవీలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు భర్తీ కానున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశానికి అర్హులైన బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేజీబీవీలో నాణ్యమైన విద్యతోపాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఈ నెల 10వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసినప్పటికీ, 20వ తేదీ వరకు గడువు పెంచారు. – రేవతి, జీసీడీఓ, పల్నాడు జిల్లా -
నిత్యం ప్రసవ వేదనే
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సర్కార్ ఆసుపత్రిలో వసతులు కరువయ్యాయి. అంతులేని నిర్లక్ష్యంతో గర్భిణులు, బాలింతలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతుల లేమి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెలలు నిండి పండంటి బిడ్డ కోసం ఆస్పత్రి గడప తొక్కితే.. ఊపిరి ఆడక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. నడినెత్తిన సూరీడు నిప్పులు కక్కుతుంటే.. ప్రభుత్వ ఆసుపత్రి చెమటలు పట్టిస్తోంది. రోగులే ఫ్యాను తెచ్చుకోక తప్పడం లేదు. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ ఆసుపత్రి గడప తొక్కినప్పటి నుంచి గర్భిణులు సమస్యలతో విలవిలలాడుతున్నారు. కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లలేని పేదలు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే కనీస సౌకర్యాలు లేక తల్లీబిడ్డలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తీవ్ర ఉక్కపోతతో గర్భిణులు, బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యశాలలో ఉండాలంటే ఇంటి నుంచి ఫ్యాను తెచ్చుకోవాలి. లేకుంటే అద్దె ఫ్యానులు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బంది సూచనలు ఇవ్వటం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఇది పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల దుర్భర పరిస్థితి. మౌలిక వసతులు, మెరుగైన వైద్యసేవలు అందక గర్భిణులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుఖప్రసవం జరగాలంటే వారికి పరిశుఽభ్ర వాతావరణం, ఇతర మౌలిక సౌకర్యాలుండాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి చూస్తే కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్న వైనం కళ్లకు కనిపిస్తోంది. ముఖ్యంగా గైనిక్ విభాగంలో ఫ్యాన్లు తిరగక పోవటంతో బాలింతలు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై చెట్ల కింద సేద తీరుతున్నారు. గర్భిణులకు శస్త్రచికిత్స అనంతరం ఏసీ సౌకర్యం ఉన్న హెచ్డీ యూనిట్కు తరలిస్తారు. అక్కడ కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయటం లేదు. రిపేరు చేయించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడంలేదు. గర్భిణులు ప్రసవాలకు చేరే సమయంలోనే సిబ్బంది రోగులకు ఇంటి నుంచి ఫ్యానను తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. వైద్యశాల సమీపంలో అద్దెకు ఇచ్చే దుకాణాల్లో టేబుల్ ఫ్యాన్లులు తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మరో దారి లేక ఆర్థిక భారమైనప్పటికీ బాలింతలు టేబుల్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకొని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎన్నో నెలలుగా సమస్య ఉన్నప్పటికీ వాటి గురించి వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో బాలింతలకు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు ఫ్యానన్లను అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసికందుకు ఫ్యాను లేకపోవటంతో ఊపిరాడక ఏడుస్తుంటే ఓదార్చలేక బాలింతలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో రోజుకు రూ.150 వరకు చెల్లించి అద్దె ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. మంత్రి రాక ప్రారంభం వాయిదా సమస్యల దృష్ట్యా గైనిక్ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన నూతన భవనానికి మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం పురుషుల జనరల్ వార్డును పై అంతస్తుకు మార్చి ఆ స్థానంలో ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గత నెలలో ప్రారంభించాలని భావించారు. అయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ అపాయింట్మెంట్ లభించక పోవటంతో ఇది కాస్తా వాయిదా పడింది. దీంతో గర్భిణులు ఇంకా పాత భవనంలోనే కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇకనైనా తగిన వసతులు కల్పించాలని గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు కోరుతున్నారు. పాత ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగానికి సేవల కోసం అక్కడకు వెళ్లిన గర్భిణులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గైనిక్ విభాగానికి ప్రతిరోజు 150 నుంచి 200 మంది జిల్లా నలుమూల నుంచి గర్భిణులు సేవల కోసం వస్తుంటారు. వీరిలో ఇన్ పేషంట్లుగా 80 మంది వరకు ఉంటారు. ప్రతిరోజు 10 వరకు కాన్పులు అవుతుంటాయి. గైనిక్ విభాగంలో ఉక్కపోతకు తోడు శిథిలావస్థకు చేరిన భవనంతో భయాందోళనలు చెందుతూ రోగులు గడపాల్సి వస్తోంది. శ్లాబ్ పైఅంతస్తు పెచ్చులూడి తరుచూ అచ్చులు పడుతున్నాయి. చిరిగిన పరుపులతో నిద్రకు ఆటంకం కలుగుతుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా రక్తపరీక్షల కోసం పైఅంతస్తుకు వెళ్లాల్సి రావటంతో గర్భిణులు మెట్లు ఎక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బాలింతలకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. -
సత్తెనపల్లి క్లబ్పై పోలీసుల దాడి
● 47 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్లబ్పై జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృందం ఆదివారం దాడులు నిర్వహించింది. డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ సీఐ కె.హైమారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు షేక్ అమీనుద్దీన్, పీ పవన్కుమార్, ప్రవీణ్, రాజశేఖర్లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రత్యేక బృంద సభ్యులు కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. మొత్తం 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.70 లక్షలు నగదు, రూ.1.58 లక్షల కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 27 బైకులు, 5 ఫోర్ వీల్ వాహనాలు, 47 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి క్లబ్పై దాడులు పట్టణంలో కలకలం సృష్టించాయి. సత్తెనపల్లి క్లబ్ను పునఃప్రారంభిస్తూ ఉదయం కొబ్బరికాయ కొట్టడం .. సాయంత్రానికి పోలీసులు ఇలా దాడులు నిర్వహించడంపై పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 528.20 అడుగులకు చేరింది. ఇది 164.6544 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,667, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,767 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,767 క్యూసెక్కులు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువకు రెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం.. -
రంగా కాలనీలో వ్యక్తి హత్య
సత్తెనపల్లి: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీ భీమవరం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన మల్లవరపు బ్రహ్మయ్య (46) చిత్తు కాగితాలు ఏరుకుంటూ రంగాకాలనీలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మయ్యకు స్థానికుడైన చెన్నంశెట్టి శ్రీనుతోపాటు చెల్లెలు వరుసైన క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పద్మతో పరిచయాలు ఉన్నాయి. వారిరువురు కూడా క్రోసూరు ఏరియాలో చిత్త్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పద్మతో చెన్నంశెట్టి శ్రీను సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం తాగిన బ్రహ్మయ్య, శ్రీను ఈ విషయంలో గొడవ పడ్డారు. శ్రీను తలపై బ్రహ్మయ్య కర్రతో దాడి చేయగా గాయమైంది. తన సహజీవనానికి అడ్డు తగలడాన్ని మనసులో పెట్టుకున్న చెన్నంశెట్టి శ్రీను, పద్మలు కలిసి బ్రహ్మయ్యపై దాడి చేశారు. గుండెలపై తీవ్రంగా కొట్టి భీమవరం రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీను, పద్మ సహజీవనం చేస్తుండడంతో బ్రహ్మయ్య గతంలో కూడా పలుమార్లు మందలించాడు. దానిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మయ్యపై దాడి చేసి హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలోనే నల్లబోతు బ్రహ్మయ్యను వారిద్దరు హతమార్చినట్లు వెల్లడించారు. నిందితులు చెన్నంశెట్టి శ్రీను, పద్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా..వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ..అధికారం ఉందనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శంకరరావు మాట్లాడుతూ మా పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఓ వ్యక్తి మా గ్రామానికి నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తే నీ కెందుకు..నన్ను ఎందుకు కదిలిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో..నా జోలికి వస్తే నువ్వు చేసే అరాచాకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు బయటకు తీస్తానని అన్నారు. వంద గ్రామాలు..వంద రోజులు అని కార్యక్రమం పెట్టి రోజుకు ఒక అరగంట తిరిగి తానేదో పనిచేసున్నట్లు హై కమాండ్కి చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఈ రెండేళ్లలో ఏ సంక్షేమ కార్యక్రమం కానీ..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావా..ప్రజల సమస్యలను పరిష్కరించావా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించడంతోపాటు టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి వారి సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో..తెలియకపోతే నీ మనిషిని పెట్టుకుని తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోకి నన్ను రానివ్వవా..రానివ్వపోవడానికి నువ్వు ఎవరివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..అధికారం ఉందని..కళ్లు నెత్తికెక్కితే ప్రజలే నీ అధికారాన్ని దించుతారు..నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వాలో..ఎవర్ని రానివ్వకూడదో ప్రజలే తేలుస్తారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.682.58కోట్లతో అభివృద్ధి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.1483.24 కోట్లతో సంక్షేమం, రూ.682.58 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.148కోట్లతో అమరావతి, బెల్లంకొండ డబుల్ రోడ్, రూ.60 కోట్లతో మాదిపాడు వద్ద కృష్ణా నదిపైన బ్రిడ్జి, రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్, రూ.4 కోట్లతో పెదమద్దూరు బ్రిడ్జి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఒక్క రైతుకై నా ప్లాటు ఇచ్చారా? రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని 9 వేల ఎకరాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పిన మీరు...ఏ ఒక్క రైతుకై నా ప్లాట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 వేల ఎకరాలు పోతే మిగిలిన 43 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మీరేమో వ్యాపారాలు చేసుకోవాలి, రైతుల్ని మాత్రం ముంచేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని..రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకమన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతూ మావిగన్ రాజధాని చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. చంద్రబాబునాయుడు కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంతో కలిపి సీఆర్డీఏ ఉంటుందని చెప్పారు. రూ.20 వేల కోట్లతో పూర్తయే రాజధాని కావాలా..రూ. 2లక్షల కోట్లతో పూర్తయ్యే రాజధాని కావాలో ప్రజలే గ్రహించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కొండవీటి కోటేశ్వరరావు, భవిరిశెట్టి హనుమంతరావు, నర్సిరెడ్డి, అప్పిరెడ్డి, సాయిరెడ్డి, నాయుడు రాంబాబు, షేక్ సుభాని పాల్గొన్నారు. -
నాటక రంగానికి యువత అవసరం
యడ్లపాడు: నాటక రంగానికి యువతరం ఊపిరి కావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య చెప్పారు. కొండవీడు కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజు ప్రదర్శనలను లింగారావుపాలెం మాజీ సర్పంచ్ షేక్ కరిమూన్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వ్యాపారవేత్త దెందుకూరి రవిరాజా నటరాజ పూజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు నంబూరు వీరాంజనేయులు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాటక రంగం పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా యువతలోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని కళారంగంవైపు మళ్లించి తీసుకురావల్సిన బాధ్యత ముందు కుటుంబం నుంచి ప్రారంభం కావాలన్నారు. మరో అతిధి అనంతలక్ష్మి నూలుమిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు నాటకాల్లో పురుషులే సీ్త్రపాత్రల్ని పోషించేవారని, నేడు సీ్త్రలే సీ్త్రపాత్రలు చేయడంతో పాటు ఒక్కో నాటికలో ఎక్కువ మంది సీ్త్రలు ఉండటం శుభపరిణామమన్నారు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రామచంద్రప్రసాద్, పఠాన్ యూసఫ్, గరికపాటి సుబ్బారావు, మలినేని సుబ్బారావు, ఆలోకం సుబ్బారావు, ముద్దన రాఘవయ్య చౌదరి ప్రసంగించార. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కట్టా శ్రీహరిరావు, ఆలోకం సాంబశివరావు, మండెపూడి శ్రీనివాసరావు, నంబూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య -
ఇంద్రకీలాద్రిలో భక్తుల కిటకిట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో శనివారం, ఆదివారం వరస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300 టికెట్పై కూడా ఈ దర్శనం లభించింది. -
భానుడు.. భగ భగ
రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారిగుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులుకొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల -
సందేశాత్మకం.. అద్భుత కళారూపం
యడ్లపాడు: లింగారావుపాలెం వేదికగా సాగుతున్న కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి కళా సంబరాలు రెండోరోజు శనివారం మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఆయా నాటికల్లోని సంఘటనలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం చూస్తున్న వాస్తవ ఘటనలకు దర్పణం పట్టాయి. ‘శ్రీమాత్రే నమః’ ఆకాశమంత ఆశ.. అమెరికా వెళ్లాలన్న ఆశయం.. కెరీర్ పరుగులో అందరికంటే ముందుండాలన్న తపన.. ఇదీ నేటితరం ప్రతినిధి అయిన ఒక ఆధునిక యువతి జీవన చిత్రానికి కళారూపమే సీ్త్ర మాత్రే నమః నాటిక. అయితే జీవితం ఎప్పుడూ మనం గీసుకున్న గీతల్లోనే సాగదు. అనూహ్యంగా ఎదురైన ఒక ప్రమాదం ఆమె ఆశల విమానాన్ని నేలకూల్చడమే కాదు, ఆమె జీవన ప్రయాణాన్నే ఓ మలుపు తిప్పిందని సునిశితమైన సంఘర్షణలతో అద్భుతంగా ఆవిష్కరించింది నాటిక. స్వర్ణసూర్య డ్రామా లవర్స్(హైదరాబాద్)వారు సమర్పించగా మూలకథను పూర్ణిమా పెమ్మరాజు అందించగా, ఉదయ భాగవతుల రచన, దర్శకత్వం వహించారు. ‘మమ్మల్ని బతకనివ్వండి’ కుండపోత వర్షంలో భార్య ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే, సాయం కోసం గొంతు చించుకుని విలపిస్తున్న ఆర్తనాదాలు వినిపించింది కనిపించింది కేవలం వ్యాపారమే. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిన ఈ కాలంలో, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని ధారపోసినా ఆ వృద్ధుడికి మిగిలింది మరణమే. వరద భీభత్సంలో మూర్ఛవ్యాధికి చిక్కి తన కళ్ల ముందే ఇల్లాలు కన్నుమూస్తుంటే, నిస్సహాయుడై ఆ ముసలాయన రోదించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ఈ రూపకం, పల్లెటూరి యాసతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. ‘తరమెళ్లిపోతున్నదో..’ మరణం తర్వాత కూడా మనిషి జ్ఞాపకం బతకాలంటే, అతడు బ్రతికున్నప్పుడు పంచిన ప్రేమలో నిజాయితీ ఉండాలి. తోడునీడగా ఉండాల్సిన రక్తసంబంధాల మధ్య ఆస్తులు, అంతస్తులు చిచ్చుపెడితే, కోట్లు ఉన్నా ఆ మనిషి ఒంటరివాడేనని కథనమే తరమెళ్లిపోతున్నదో నాటిక. శేషయ్య, దశరథ రామయ్య అనే ఇద్దరు మిత్రుల నేపథ్యంతో మొదలయ్యే ఈ కథ, విద్య యొక్క విలువను, త్యాగంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే, ఆధునిక సమాజంలోని కృత్రిమ బంధాలపై చావుదెబ్బ కొట్టింది. తండ్రి చదివించకపోయినా, తన కొడుకు రాఘవరావును గొప్ప ఆఫీసర్గా చూడాలనుకున్న ఒక పేద తండ్రి ఆశయం వెనుక, మరో కొడుకు రంగనాథం చేసిన నిశ్శబ్ద త్యాగం ఈ నాటికలో ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్(గుంటూరు) వారు ప్రదర్శించిన ఈ నాటిక నవసమాజానికి మేలుకొలుపుగా నిలిచింది. -
ఇకపై కోర్టుకో కానిస్టేబుల్ నియమాకం
నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్ (డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యరపతినేని
గురజాల: తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీసీ యువకులు హత్యకు గురైతే.. వారి కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాకుమాను భావనాబుషీ, భువనగిరి శ్రీనివాసరావులను ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అతి కిరాతంగా చంపి కాలువలో పడవేసిన సంఘటన తెలిసిందే. వారి కుటుంబాలను శనివారం మాజీ ఎమ్మెల్యే కాసు పరామర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు చంపి కాలువలో పడవేస్తే స్టేషన్లో కనీసం పట్టించుకోలేదన్నారు. వారి మృతదేహాలను వెతకడానికి కూడా పోలీసులు ఏ మాత్రం సహాయం చేయలేదని మృతుల బంధువులే కాలువ కట్టవెంట వెళ్లి మృతదేహాలను 10 రోజులు తరువాత కనుగొన్నారన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావుకు కనీసం మానవత్వం కూడా లేదని దుయ్యబట్టారు. ఘటన జరిగి ఇప్పటికి సుమారుగా రెండు నెలలు కావస్తున్నా నేటికీ యరపతినేని వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని చెప్పామని.. ఆయన స్పందించి మన ప్రభుత్వం రాగానే సీబీసీఐడీ వేసి విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారన్నారు. వైఎస్సార్ సీపీ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పిల్లల అభివృద్ధి కొరకు పొలాన్ని వారికి కేటాయించి వారికి తోడుగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
చంద్రబాబుకు మైకం వదిలించిన ‘మావిగన్’
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైకం వదిలి అమరావతిలోనే మావిగన్ ప్రాంతాలు ఉన్నాయని చెబుతున్నాడని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్ బీలో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ ప్రకటించారన్నారు. దీంతో టీడీపీ నాయకులు అందరూ రాజధాని పరిధిలోనే ఆ మూడు ప్రాంతాలు ఉన్నాయంటూ ఇప్పుడు కవర్ చేస్తున్నారన్నారు. వారి చెప్పిందే నిజమైతే గతంలో వెనుకబడిన ప్రాంతాలలో పర్యటించి వారిని రెచ్చగొడుతూ మీసాలు మెలివేసి తొడలు కొట్టిన అమరావతి యాత్రికులలో ఆ మూడు ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఎందుకు లేరో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన గన్షాట్తో తత్వం బోధపడి దారికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన వికేంద్రీకరణ మంత్రానికి వారి అహంకారం ఆవిరైపోయినందుకు సంతోషంగా ఉందని, అందరి వాడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొందరి వారిగా ఉన్న వారినందరినీ ఒకే ఒక్క దెబ్బతో దారికి తీసుకొచ్చాడన్నారు. మహిళలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియెల్ -
యువకుడు ఆత్మహత్య
నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నరసరావుపేట రూరల్: దారిదోపిడీ కేసులో నిందితుడిని రొంపిచర్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు కేసు వివరాలు తెలియజేశారు. గత నెల 16వ తేదీన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన మహిళ స్కూటీపై నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి ఆమెను అటకాయించి రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లి బంగారు వస్తువులు దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మంగళగిరికి చెందిన రాచగిరి రాఘవయ్యను సుబ్బయ్యపాలెం వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు, ఏఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు. -
పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి
సత్తెనపల్లి: రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన నియోజకవర్గ రైతు సంఘ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు కె.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కజొన్న, కందులు, వరి, తదితర పంటల పండించే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. హరిచంద్రపురం నుంచి నకరికల్లు వరకు కృష్ణా జలాలను తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంకా ఆ పథకం కార్యరూపం దాల్చలేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా మరమ్మతులు చేసి వాడుక లోకి తెస్తే వ్యవసాయ రంగంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు విక్రయించడంలో రైతులకు దళారుల ప్రమేయం అధికంగా ఉంటుందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న వినుకొండలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జరిగి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరింత ఉత్సాహంగా జిల్లా మహాసభలు నిర్వహించుకునేందుకు సత్తెనపల్లి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రైతాంగం మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలలో రైతు సంఘం సత్తెనపల్లి నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి పూలే
కలెక్టరేట్లో నివాళులర్పించిన జేసీ, ఎమ్మెల్యే, నాయకులునరసరావుపేట: సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, సమాజం కోసం కష్టపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబుతో కలసి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పూలే జీవిత చరిత్ర, పోరాటాలు, లక్ష్యాలు అందరూ తెలుసుకోవాలన్నారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అసమానతలు రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు చదువు లేకపోవడం వలన గుర్తింపు పొందడం లేదని గుర్తించి తన జీవిత భాగస్వామిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించారన్నారు. డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ మహాత్ముల జీవిత చరిత్రలు, బయోగ్రఫీలు అందరూ చదివి స్ఫూర్తి పొందాలన్నారు. తొలుత పల్నాడు బస్టాండు వద్ద ఉన్న ఫులే విగ్రహానికి జేసీ, శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, బాదుగున్నల శ్రీను, డాక్టర్ రాంప్రసాదు, టీడీపీ నాయకుడు వల్లెపు నాగేశ్వరరావు, వాసిరెడ్డి రవి, అధికారులు పాల్గొన్నారు. -
వాస్తవికత కలిగిన రాజధాని మావిగన్
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన రాజధాని ‘మావిగన్’కు ప్రజలు మద్దతు తెలియచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. మావిగన్ వాస్తవికతకు దగ్గరగా ఉన్న రాజధాని అని, అమరావతి గ్రాఫిక్స్ రాజధాని అనేది తెలుసుకోవాలన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఎప్పుడైతే మావిగన్ రాజధాని గురించి మాట్లాడారో అప్పటినుంచి ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ప్రతిపాదించిన మూడూ పెద్ద నగరాలని, మచిలీపట్నంలో ఉన్న పోర్టును కూడా అభివృద్ధి చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రపంచంలో పోర్టు ఉన్న ప్రతి రాజధాని నగరం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. మంచి తీర ప్రాంతం కూడా ఉన్నందున ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలో నయా రాయపూర్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం రాజధాని కట్టారని, ఇప్పటికీ అక్కడ ప్రజలు ఎవరూ నివసించడం లేదని చెప్పారు. ఆఫీసులు మాత్రమే నడుస్తున్నాయని, ఉద్యోగస్తులు ఉదయం 15 కిలోమీటర్ల దూరంలోని రాయపూర్ నుంచి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు. అమరావతి కూడా అదేవిధంగా తయారవుతుందన్నారు. అభివృద్ధికి అవకాశం సమీపంలో ఉన్న అభివృద్ధి ప్రాంతాల్లో నివసించేందుకు ఇష్టపడతారన్నారు. రాష్ట్రంలో పోర్టు ఉన్న విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమని తెలిపారు. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు బాగా జరుగుతున్నందునే శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మావిగన్ కూడా అదే తరహా అవకాశం కలిగిన ప్రాంతం అన్నారు. కాబట్టి అభివృద్ధి చెందటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రజలందరూ మావిగన్పై ఆలోచన చేయాలని సూచించారు. ప్రముఖ విశ్లేషణకర్త, న్యాయవాది మాడభూషి శ్రీధర్ చట్టాలు తెలిసిన వ్యక్తి అని, ఆయన మావిగన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారన్నారు. మావిగన్ బాగుంది కాబట్టే ఆయన సపోర్ట్ చేశారన్నారు. అమరావతి రాజధాని ఎన్నేళ్లలోపు పూర్తి చేస్తారు? ఎన్ని రూ.లక్షల కోట్లు అవసరం అవుతాయో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని తరాలు పడుతుందో చెప్పటానికే కష్టంగా ఉందన్నారు. చిన్నపాటి వర్షం కురిస్తేనే మునిగిపోయే ప్రాంతంలో రూ.లక్షల కోట్లు తీసుకెళ్లి ధారబోసే పని చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రైతుల సంతోషం ముఖ్యం మొక్కజొన్న పంట పండించిన రైతు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నాడని, దాళ్వా కంటే ఎక్కువగా ఈ ఏడాది మొక్కజొన్న పండించారన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, ప్రైవేట్ వ్యక్తులు కేవలం రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే ఇస్తున్నారన్నారు. రైతు ఎకరాకు రూ.28 వేలు నష్టపోతున్నాడని చెప్పారు. డబ్బులన్నీ తీసుకువెళ్లి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పోస్తున్నారని విమర్శించారు. అందువల్లే రైతులు పండించిన పంటను కొనలేకపోతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్కు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనాలని గతంలో విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయటానికి, రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు చేతులు రాని ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లుతో రాజధాని నగరాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారని అన్నారు. కేవలం ప్రజల్ని గ్రాఫిక్ మాయాజాలంలో ఉంచుతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని చెప్పారు. ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఒక చదరపు గజానికి రూ.12,500 ఖర్చు పెడుతున్నారని, అదే ఢిల్లీలో రూ.4 వేలతో బ్రహ్మాండంగా కడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో సామాన్యుడు నివాసం ఉండే పరిస్థితి లేదన్నారు. అటువంటి ప్రాంతం రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ను కూటమి నాయకులు విపరీతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారని, కేవలం మావిగన్ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికే అచ్చెన్నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ తీవ్ర పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కూడా మావిగన్పై 45 నిమిషాలు చర్చించారని, మావిగన్ కచ్చితంగా మంచి రాజధాని ప్రాంతం అవుతుందని తెలిపారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. -
ఛాన్స్ చూసి ఏసీయ్..!
గుంటూరు మెడికల్: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల మాటే మరిచారు ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది. మండుతున్న ఎండలు వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్షాప్ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్షాప్ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి. -
ఏటీఎంలలో రూ. 87 లక్షల నగదు చోరీ
పిడుగురాళ్ల: ఏటీఎంలలో నగదు ఉంచాల్సిన ఉద్యోగి ఆ నగదును దొంగిలించి పరారైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పిడుగురాళ్లపట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల పట్టణంలోనే ఎస్బీఐ బ్రాంచ్కు చెందిన నాలుగు ఏటీఎంలలో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో శుక్రవారం రూ. 48 లక్షలు ఉదయం సమయంలో తోటి సిబ్బందితో సీఎంఎస్ గుంటూరు బ్రాంచ్కు చెందిన కస్టోడియన్ మామిడి నరేష్ అనే ఉద్యోగి ఏటీఎంలో నగదును పేర్చారు. అతనితోపాటు ఉద్యోగులు కూడా ఉండటంతో తెలివిగా ఏటీఎంలలో నగదును ఏర్పాటు చేసినా లాక్ వేయలేదు. తోటి ఉద్యోగులతోపాటు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే వేరే పని ఉందని చెప్పి గుంటూరుకు వెళ్లకుండా మార్గమధ్యలోనే దిగాడు. తోటి ఉద్యోగులు గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత మామిడి నరేష్ ఏటీఎంలకు వచ్చి మొత్తం రూ. 87 లక్షలకుపైగా నగదును ఏటీఎంలో నుంచి తీసుకొని పరారయ్యాడు. ముందుగా ఏటీఎంలలో ఏర్పాటుచేసిన రూ. 48 లక్షలు, అంతకుముందు ఏటీఎంలో ఉన్న మిగిలిన నగదుతో కలిపి మొత్తం రూ. 87 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. నరేష్ పథకం ప్రకారం తిరిగి వచ్చి ఏటీఎంలలో ఉన్న నగదు మొత్తాన్ని చోరీ చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో పలువురు బ్యాంకు కస్టమర్లు ఆయా బ్యాంకు మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా విషయం తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీరామ్ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో సంచలన ఘటన బయటపడింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఏఎస్ఐ అకృత్యాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి తర్వాత బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఆ వీడియోలను చూపిస్తూ యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారం తీసుకుని వీడియోలు తీయిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు. 25న స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్ విడుదల చేశారు. నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్, ర్యాష్/ ట్రిపుల్ రైడింగ్లు, లైసెన్సు, బీమా, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్కుమార్ (తూర్పు ట్రాఫిక్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), ఆరోగ్యరాజు (అరండల్పేట పీఎస్), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ దీప, హాస్టల్ ప్రిన్సిపల్ ప్రసన్న, కంప్యూటర్ ఆపరేటర్ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగస్థలిపై మానవీయ సంతకాలు
యడ్లపాడు: జగతిని జాగృతం చేసేవి కళారూపాలేనని ఏపీ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. రసవత్తరమైన నటనకు, భావోద్వేగాలకు వేదికగా నిలిచే లింగారావుపాలెంలో కొండవీటి కళా పరిషత్ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్న్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయగా, పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే గొప్ప శక్తి సింగిల్ టేక్లో ప్రదర్శించే ఒక్క నాటకానికి మాత్రమే ఉందన్నారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ నాటక రంగాన్ని నడిపిస్తున్నవి పరిషత్తులు, దాతలు మాత్రమే అన్నారు. ముత్తవరపు అరుణకుమారి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభవానికి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నేత చలసాని శ్రీనివాస్, విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకష్ణ, పఠాన్ సుభాని, ఆలోకం అమరలింగస్వామి, కిలారు వెంకటరావు, నంబూరు నరసింహారావు, కృష్ణారావు, శొంఠినేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. వ్యాపారమైన మాతృత్వంపై కన్నీటికి విలువెంత..? సమాజంలోని అతి కిరాతకమైన వైద్య మాఫియా ముఖాన్ని బట్టబయలు చేసింది. అమ్మ ప్రేమను కూడా అంగడి సరుకుగా మారుస్తున్న డాక్టర్ సరోజినీ దేవి అరాచకాలను, సామాన్య సీ్త్రల పోరాట పటిమను ఈ నాటిక అద్భుతంగా చిత్రించింది. నర్సు నందిని అందించిన సహకారంతో, బాధితులు సీతాలు, మాధవి తమ కన్నీటిని ఆయుధాలుగా మలిచి వ్యవస్థలోని అన్యాయంపై సమరశంఖం పూరించారు. డి.కామేశ్వరి కథను దృశ్యరూపంలోకి మలిచిన విధానం, బీవీకే క్రియేషన్స్ వారి నటన.. వైద్య రంగంలో మంటగలుస్తున్న నైతిక విలువలను ప్రశ్నించడమే కాకుండా, సీ్త్ర శక్తి తలచుకుంటే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని నిరూపించింది. మాయాలోకంలో మనీషిని వెతికిన మంచి మనసులు.. స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో నిస్వార్థ సేవ యొక్క ప్రాధాన్యాన్ని హృదయాలకు హత్తుకునేలా చాటిచెప్పింది. తోటి మనిషి కష్టాన్ని తనదిగా భావించేవాడే అసలైన దైవమని, రక్త సంబంధాల కంటే ఆపన్న హస్తం అందించే మానవ సంబంధాలే మిన్న అని చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వ ప్రతిభతో సాక్షాత్కరించారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఉన్నత ఆశయమే సమాజానికి ప్రాణవాయువు అని చాటుతూ, ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు)బృందం ప్రదర్శించిన ఈ రూపకం మనుషుల మధ్య అంతరించిపోతున్న మమకారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అందం వర్సెస్ అమ్మతనం.. ఇక శ్రీరమణా కళానిలయం సమర్పించిన మాతృత్వం నాటిక ఆడతనం అంటే కేవలం బాహ్యా సౌందర్యం కాదని, అది అమ్మతనంలోనే పరిపూర్ణత చెందుతుందని లోతైన విశ్లేషణ చేసింది. వృత్తి, అందం అనే వ్యామోహంలో పడి సంతానాన్ని భారంగా భావించిన లావణ్య అనే యువతి పాత్ర ద్వారా నేటి తరం ధోరణిని సునిశితంగా విమర్శించారు. అహంకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఆమె ప్రయాణం, పక్షవాతంతో ఉన్న అత్తగారి మాతృత్వ హృదయాన్ని చూసి కళ్లు తెరుచుకోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సుఖమంచి కోటేశ్వరరావు రచనకు, పొగర్తి నాగేశ్వరరావు ప్రాణం పోయగా, మారుతున్న కాలంలో మసకబారుతున్న కుటుంబ విలువలను సరిదిద్దే కనువిప్పుగా ఈ నాటిక నిలిచింది. -
పల్నాడు
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.0200 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 8,314 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.11,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
వణికితే భయం.. చికిత్సతో నయం
గుంటూరు మెడికల్ పార్కిన్సన్స్ వ్యాధి గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే వచ్చేది. నేడు 40 ఏళ్లలోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి జీవితం చాలా దుర్భరంగా తయారవుతోంది. ముఖ్యంగా కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు. శరీరం వణికిపోవటం లేదా కాలు లేదా చేయి వణికిపోతూ ఉంటాయి. వణుకుడు రోగంగా ప్రాచుర్యంలో ఉన్న పార్కిన్సన్స్ డీసీజ్ను మొదటిసారిగా 1817లో డాక్టర్స్ జేమ్స్ పార్కిన్సన్ గుర్తించారు. ఈ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఏప్రియల్ 11న వరల్డ్ పార్కిన్సన్స్ డీసీజ్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి గురించి తెలుసుకుని తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కారణాలు ఇవీ... పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించటం వల్ల వస్తుంది. వృద్ధుల్లో డోపమిన్ లోపం వల్ల, యువకుల్లో జన్యుపరమైన కారణాలతో, కొన్ని రకాల పర్యావరణ పరిస్థితుల వల్ల, కొన్ని రకాల మందుల తీసుకోవటం వల్ల, పిల్లల్లో ఇతర జబ్బుల వల్ల వ్యాధి బారిన పడుతుంటారు. మెదడు అనారోగ్యంతో బాధపడే వారిలో, తలకు తీవ్ర గాయాలైన వారిలో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో వ్యాధి రావొచ్చు. లక్షణాలు ఇలా... శరీరంలోని ఏదో ఒక భాగం అంటే చేతులు లేదా కాళ్లు లేదా దవడపై భాగంలో వణుకుడు వస్తోంది. నడవలేరు, కదలలేరు, మంచంపై పడుకున్నా వణుకుడు ఉంటుంది. నడకకు ప్రయత్నించినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. కండరాలు పట్టివేయటం, బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. వస్తువులు కూడా పట్టుకోలేరు. వాసన చూడలేరు. మాట కూడా వణుకుతూ వస్తుంది. నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని ప్రత్యేక సందర్భల్లో డిప్రెషన్, ఆహారం నమలటం, మింగటం కష్టంగా మారుతుంది. అలసట, మలబద్ధకం, చర్మ సమస్యలు, లైంగిక సమస్యలు, భయం, భ్రమలు, భ్రాంతులు, చొంగ కార్చుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
డీబీఎస్ ఆపరేషన్లు కూడా...
వ్యాధి బాధితులకు నేడు డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డీబీఎస్) అనే అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. డీబీఎస్ ఆపరేషన్లు పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు వరం వంటివి. గతంలో ఆపరేషన్లు లేకపోవటంతో జీవితాంతం ఎక్కువ మొత్తంలో మందులు మింగాల్సి వచ్చేది. ఈ ఆపరేషన్లు చేయటం ద్వారా బాధితుడు సాధ్యమైనంత మేరకు మందులు తగ్గించి వేయవచ్చు. తన పనులు తాను కొంత మేరకు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, సీనియర్ న్యూరో సర్జన్, గుంటూరు -
ప్రకృతి సాగుతో ఆరోగ్యకర జీవనం
నరసరావుపేట: అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం న్యూట్రి, కమ్యూనిటీ, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్, బయో–రిసోర్స్ సెంటర్లపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు బడులు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, మహిళల ఇళ్ల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. బయో–రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ల ఏర్పాటు, పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యం అవుతాయని తెలిపారు. న్యూట్రి, కిచెన్, కమ్యూనిటీ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతోపాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహద పడుతుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కలెక్టర్ మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీపీఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, పన్నుల విభాగ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో పల్నాడు జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో వివిధ విభాగాలు అందించాల్సిన సహకారం, ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లాలో రైల్వే సంస్థ చేపట్టిన ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, రైల్వే శాఖ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
ఇంటర్వ్యూలకు 169మంది హాజరు
మేడికొండూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడికొండూరు సీఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలేటి మనోహర్ (26) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం తన విధులు ముగించుకొని స్కూటీపై సత్తెనపల్లి వెళుతుండగా మార్గంమధ్యలో మేడికొండూరు సమీపాన ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద పిడుగురాళ్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్త నడుపుతూ మనోహర్ పయనిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ప్రమాదంలో మనోహర్ బస్సు కింద పడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదంపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. -
రక్తమోడుతున్న రహదారులు
పల్నాడు జిల్లాలో నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. క్షణకాలంలో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు. బాధిత కుటుంబాల్లోని వారు రోడ్డున పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబాన్ని పోషిస్తున్నవారు మరణిస్తే మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు మొదలై జీవితాలు తలకిందులవుతున్నాయి. సాక్షి, నరసరావుపేట : ఇంటి నుంచి అర కిలోమీటరులోపు రోడ్డుపై ఉన్న టిఫిన్ సెంటర్కు వెళ్లి అల్పాహారం తీసుకురావడమేగా... అనుకొని హెల్మెట్ ధరించకుండా శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన 16 ఏళ్ల బాలుడు రవీంద్ర ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అనుకోని ప్రమాదంలో మినీ ట్రక్కు ఢీకొని గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో కనమర్లపూడి వద్ద సంఘటనా స్థలంలోనే మరణించాడు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ద్విచక్రవాహనం నడపకూడదు. కనీసం హెల్మెట్ కూడా ధరించకపోవడంతో చేతికందిన కొడుకును తల్లిదండ్రులు కోల్పోవాల్సి వచ్చింది. విధులకు వెళుతున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజులుగా జిల్లాలో ప్రతి రోజు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ వంటి కారణాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. గత వారం రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. పాతిక మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే పల్నాడు జిల్లాలో ఏకంగా 147 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 85 మంది మృతి చెందారు. మరో 149 మంది గాయాలపాలయ్యారు. ముఖ్యంగా గత వారం రోజులుగా నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. వినుకొండ నియోజకవర్గంలో ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. 2024తో పోల్చితే గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకుల్లో మార్పులు రావడం లేదు. కొన్నేళ్లుగా జరిగిన మొత్తం ప్రమాదాల్లో మూడోవంతు ద్విచక్ర వాహనదారులవే ఉన్నాయి. గత బుధవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వెంకట్ నాయక్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో దాచేపల్లి వద్ద లారీని ఢీకొని తలకు తీవ్రగాయాలై మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేది. గాయాలతో బయటపడే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పది మంది హెల్మెట్ ధరించకపోవడంతో జరిగినవే. ఇది ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్ట పోలీసు, రవాణా శాఖ అధికారులు గుర్తించారు. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయినా ప్రమాదాలను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. వినుకొండ పట్టణ శివారులో అతివేగంతో వచ్చి లారీని ఢీకొట్టిన వాహనం (ఫైల్) జిల్లాలో గత రెండు సంవత్సరాలలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు సుమారు 34 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రదేశాలలో పోలీస్, రవాణా, నేషనల్ హైవేస్ మరియు ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులు విశ్లేషించారు. ఆయా బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గల కారణలను విశ్లేషిస్తున్నారు. జంక్షన్ల వద్ద వాహనదారులు వేగాన్ని నియంత్రించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. నార్క్ట్పల్లి – అద్దంకి హైవేలో రొంపిచర్ల, పొందుగుల, గురజాల రోడ్ జంక్షన్, గుంటూరు – పిడుగురాళ్ల రహదారిలో కంటిపూడి, పిడుగురాళ్ల మండలం కామేపల్లి, ముప్పాళ్ళ, గుంటూరు – శ్రీశైలం రోడ్లో అందుగలపాడు, రావిపాడు గ్రామాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వినుకొండ పరిసరాలలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయంలో వాహనదారులు మద్యం మత్తులో ఉండటం కూడా ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. -
చిలకలూరిపేటలో న్యాయవాది హత్య
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల బాబు ఈశ్వర అకీర, ఆరేళ్ల పాప నవనీత ఉన్నారు. ప్రసాద్ తల్లి తిరుపతమ్మ ఒంగోలు న్యాయస్థానంలో అటెండెంట్గా పనిచేస్తున్న క్రమంలో ముందుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేసిన ఆయన నాలుగేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం హైకోర్టుకు వెళ్లాలంటూ ఇంటి నుంచి స్కూటీపై ఆయన బయలుదేరారు. రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకొని శుక్రవారం తెల్లవారుజామున కోటప్పకొండ రోడ్డులో చిలకలూరిపేట వైపు స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత యడవల్లి గ్రామ సమీపంలో రోడ్డు మార్జిన్ పక్కన సుమారు ఐదు అడుగుల పల్లపు ప్రదేశంలో న్యాయవాది మృతదేహంపై స్కూటీ పడి ఉంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్కుమార్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎన్నో అనుమానాలు... ముందుగా అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, మృతుడి తలపై గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహంపై ఎవరో స్కూటీని పడవేసినట్లుగా ఉండడం, మృతదేహం పూర్తిగా వాహనం కింద పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు స్కూటీ పడిపోయిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు మార్జిన్లో బండరాయి రక్తంలో తడిసిపోయి ఉండటం న్యాయవాదిని ఎవరైనా బండరాయితో మోది చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టారు. హైకోర్టుకు వెళతానన్న న్యాయవాది యడవల్లి రూట్లోకి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కోటప్పకొండ వద్ద నుంచి సీసీ పుటేజీల పరిశీలన చేపట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధితో వివాదం భూ వివాదాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో న్యాయవాదికి వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. తన బంధువుల పక్షం నిలబడిన విషయమై ఆయనతో విభేదాలు తలెత్తినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉంటాడని, స్నేహభావంతో మెలిగే ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మరి కొందరి వాదన. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పల్నాడులో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు.అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
మ్యూజియాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్
అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
నరసరావుపేట: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు సమాజానికి తలవంపులు అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పేర్కొన్నారు. పార్టీ నాయకుల భార్యలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా, నియోజకవర్గ అనుబంధ, పట్టణ, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిసి స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాధాకృష్ణ ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా బూతు కిట్టుగా మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పల్లకి మోయాలనుకుంటే మోసుకోవటం అతని ఇష్టమని, అంతేగానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదన్నారు. రాష్ట్రంలో కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాస్తున్నాయని, అది వారిష్టంగా రాసుకోవచ్చునని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడటం సమంజసం కాదని, బూతు వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సైకిల్ మీద కిరోసిన్ విక్రయించి బతికిన రాధాకృష్ట, ఒక చిరుద్యోగిగా పత్రికలో చేరి ఈ రోజు ఆ పత్రిక యజమానిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. అతని వెనుక చంద్రబాబు నాయుడు, చంద్రబాబు వెనుక అతను ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అయితే మహిళలను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదన్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారం చేశాడని, షాపింగ్ కోసం బయటకు వస్తే బహిరంగంగా రోడ్డు మీద దాడి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడు ఓ అమ్మాయిని బలాత్కారం చేశాడని, ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, లీగల్ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రోళ్ల మాధవి, సిద్ధారపు గాంధీ, కొమ్ము చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయీ, జిల్లా సంయుక్త కార్యదర్శి యన్నం రాధాకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి కుక్కల పౌలయ్య, నాయకులు పాల్గొన్నారు. -
టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సోషల్మీడియా ద్వారా ఆ మహిళతో ఉన్న పరిచయంతో ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు భయంతో పోలీసులను తప్పుదోవ పట్టించారని, సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు పరిచయస్తుడే అని తేలినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కేసు వివరాలను వెల్లడించిన వివరాల ప్రకారం... మాచర్ల పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని (32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మంచినీటి కోసం వచ్చినట్లు చెప్పి ఇంటిలోకి ప్రవేశించాడని పేర్కొన్నట్లు తెలిపారు. కత్తితో బెదిరించి లైంగికదాడి చేయబోతే తనకు హెచ్ఐవీ ఉందని చెప్పడంతో నిందితుడు ఆగ్రహంతో దాడి చేసి పారిపోయాడని పేర్కొన్నట్లు చెప్పారు. ఎదురింటివారి సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చేర్చారన్నారు. బాఽధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అదనపు ఎస్పీ జేవీ సంతోష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామన్నారు. విచారణలో పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్ (27)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ వివరించారు. సోషల్ మీడియాలో పరిచయం... అత్యాచారం తరువాత బాధితురాలు చెబుతున్న వివరాల ద్వారా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వారి పాత్ర లేదని తెలుసుకున్నామని ఎస్పీ తెలిపారు. బాధిత మహిళ సెల్ఫోన్, సోషల్మీడియా ఖాతాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టగా నిందితుడిని గుర్తించామన్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన నామాల శ్రీనివాస్(27) సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన మరింత సాన్నిహిత్యం పెరిగిందని, తరువాత బాధితురాలు మాచర్లలోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించిందని ఎస్పీ పేర్కొన్నా. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమైపె లైంగిక దాడి చేశాడన్నారు. నిందితుడు విచక్షణ మరిచి ప్రవర్తించడంతో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లు చేతులూ కట్టేసి పారిపోయాడన్నారు. పరిచయస్తుడే కావడంతో బాధితురాలు భయపడి పూర్తి వివరాలను వెల్లడించకుండా పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నారు. నిందితుడిని మాచర్ల రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేసి స్థానిక అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టడంలో 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని పోలీసులు గురజాల సబ్ జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి బాధితురాలు, నిందితుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామన్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టుపై వైద్యుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సృష్టమైన ఆధారాలు లేకపోయినా, బాధితురాలు తప్పుదోవ పట్టించినా కేసులో పురోగతి సాధించిన అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆయన బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
తెలంగాణ నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు
నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో బకాయిల రోగం
● రూ. లక్షల్లో పేరుకుపోయినా చెల్లించని వ్యాపారులు ● వసూలుకు కనీసం చర్యలు చేపట్టని ఆసుపత్రి అధికారులు ● హెచ్డీఎస్కు నిధుల కొరత ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం కనీసం నోటీసూ లేదు.. హెచ్డీఎస్ ఆదాయానికి గండి గుంటూరు జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. -
చావులో ఒక్కటయ్యారు..
యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి... జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా గురువారం సాయంత్రం కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ తమ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని, ఇప్పటికే మూడేళ్లు కాలం గడిచిందన్నారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించటంతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ, కమ్యూటీషన్, ఆర్జిత సెలవులు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పచెప్పరాదని కోరారు. అనంతరం ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ బి.సంపత్బాబు మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక కార్యదర్శి ఆర్.గోవిందరాజులు మాట్లాడుతూ, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డిమాండ్ చేశారు. 72, 73, 74 జీఓలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎం.మోహనరావు, బి.శ్రీనివాసరావు, టి.చంద్రయ్య, కె.వీరాంజనేయులు, షేక్మొహిద్దీన్ బాషా, బి.స్వర్ణరాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలి
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకనంలో విద్యాశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించి జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతిపత్రం సమర్పించారు. ట్యాబ్ ఆధారిత కొత్త విధానం ఉపాధ్యాయులపై పెనుభారాన్ని మోపటంతోపాటు లోపభూయిష్టంగా మూల్యాంకన ప్రక్రియను దెబ్బతీస్తున్నదని తెలిపారు. ట్యాబ్లు సరిగా పనిచేయక పోవటం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవటంతో సమాధాన పత్రాల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్నదని తెలిపారు. రోజుకు 80 పేపర్లకు పైగా మూల్యాంకనం చేయాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా అలసి పోతున్నారనీ, ఇది మూల్యాంకన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఉదయం 9గంటలకు హాజరై రాత్రి 10 గంటల వరకు మూల్యాంకన పనులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. నిరంతరం ట్యాబ్ చూస్తుండటంతో కంటి నొప్పి, మసక చూపు వంటి కంటి సమస్యలతో పాటు మెడ, నడుంనొప్పి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానంగా మహిళా ఉపాధ్యాయినిలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే వాస్తవ పరిస్థితులను గుర్తించి పాత మూల్యాంకన విధానాన్నే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్.వి.రామిరెడ్డి (ఎస్టీయూ), బి.సంపత్బాబు (ఏపీటిఎఫ్), ఆర్.గోవిందరాజులు (హెచ్ఎంఏ), ఎం.మోహనరావు (యూటీఎఫ్), షేక్.షరీఫ్ (ఏపీటీఎఫ్ 257) కె.వీరాంజనేయులు (ఎస్సీ, ఎస్టీ, యూఎస్), టి.చంద్రయ్య (ఎస్ఏఏపీ), షేక్.మొహిద్దీన్బాష (ఆర్యూటీఏ) పాల్గొన్నారు. -
మూగజీవాలపై పిడుగుపాటు
పెదకూరపాడు: పెదకూరపాడు మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని గారపాడు గ్రామంలో గ్రామానికి చెందిన మొక్కల కృష్ణ ప్రసాద్, నల్గొండ మల్లికార్జునలకు చెందిన 14 మేకలు పిడుగుపాటు గురై మృత్యువాత పడ్డాయి. లగడపాడు గ్రామంలో పల్లం యేసుబాబుకు చెందిన పాడి గేదె ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుకు గేదెను కట్టేసి ఇంట్లో కి వెళ్ళగా ఒకసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడటంతో పాడి గెదె అక్కడికక్కడే మృతి చెందింది. పెదకూరపాడు లోని రైల్వే స్టేషన్ సమీపంలో తాటి చెట్లపై పిడుగులు పడటంతో మంటలు చెలరేగి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ లైన్లు దిగబడటంతో ఐదు గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. -
కొండవీటి గడ్డపై కళా సౌరభం
యడ్లపాడు: కొండవీటి గడ్డపై మళ్లీ కళాకారుల సందడి మొదలుకానుంది. చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే కొండవీడు కోట నీడన, లింగారావుపాలెం వేదికగా నాటక వైభవం మళ్లీ పురుడుపోసుకోనుంది. మొన్ననే సుందరయ్య కళానిలయంలో జరిగిన ప్రదర్శనల మధుర స్మృతులు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, అప్పుడే కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సంబరం, అటు చారిత్రక వారసత్వాన్ని, ఇటు ఆధునిక కళా చైతన్యాన్ని మేళవించి తెలుగు నాటక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పాతికేళ్ల ప్రస్థానం... పాతికేళ్లకుపైగా నాటక కళే శ్వాసగా సాగుతున్న ఈ పరిషత్ ప్రయాణం అభినందనీయం. గ్రామీణ వాతావరణంలో జాతీయ స్థాయి నాటికలను ప్రదర్శిస్తూ, కళామతల్లి సేవలో తరిస్తున్న ఈ సంస్థ వెనుక నిర్వాహకుల అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ పరిషత్ను కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు బ్రహ్మవరప్రసాద్, జరుగుల రామారావులు నిబద్ధతతో సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తు తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ వేదికను తీర్చిదిద్దారు. కళలకు మారుపేరు.. చారిత్రక కొండవీటి కోట వైభవాన్ని స్మరించుకుంటూనే, నేటి సమాజానికి కళల ద్వారా చైతన్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగనున్నాయి. గ్రామ ప్రజలను, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసిన ఈ నాటక సంబరాలు, రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఒక కళా ప్రపంచంగా మార్చనున్నాయి. కళల కోలాహలంతో కొండవీటి గడ్డ మరోసారి తన ఘనకీర్తిని చాటుకునేందుకు ముస్తాబైంది. ● 12వ తేదీ ఆదివారం.. ముగింపు రోజున రాత్రి 8 గంటలకు నంబూరు నరసింహరావు జ్యోతిప్రజ్వలన చేయనున్నారు. లింగారావుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ షేక్ కరీమూన్ మాబుసుభాని నటరాజ పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 8.30 గంటలకు హైదరాబాద్ గోవాడ క్రియేషనన్స్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటిక, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇది అతని సంతకం నాటిక ప్రదర్శితం కానున్నాయి. అనంతరం మానవత సాగరి బృందం వారి అందరూ మంచివారే కానీ నాటిక ప్రదర్శితం కానుంది. ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. తొలిరోజు 10వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆకెళ్ల సత్యనారాయణ కళాప్రాంగణంలో కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటికతో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత 10.30 గంటలకు ఉషోదయ కళానికేతన్ వారి మంచి మనుషులు, రాత్రి 11 గంటలకు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికలు ప్రదర్శితం కానున్నాయి. రెండో రోజున శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి సీ్త్రమాత్రే నమః నాటికతో ప్రదర్శనలు పునఃప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి 11 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో సభా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
స్వర్ణగ్రామ ఆరోగ్యదర్శినితో మెరుగైన వైద్యసేవలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమరావతి: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించటానికి ప్రభుత్వం స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రత్యేక వైద్యసేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. గురువారం స్థానిక త్రిశక్తిపీఠం ఆడిటోరియంలో ప్రతి నెలా మొదటి గురువారం నిర్వహించే ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణగ్రామ ఆరోగ్యదర్శిని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంమే కాకుండా సామాజిక భాగస్వా మ్యంతో ఆరోగ్య నిర్వహణను మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, తక్కువ ఆదాయ వర్గాల వారికి, వైద్య సేవలు మరింత చేరువ చేయాలన్నారు. అలాగే పౌష్టికాహారం పంపిణీ, రక్తహీనత తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలను అంగన్ వాడీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రకాల టీకాలను అందించటంపై సమీక్ష నిర్వహించి సంబందిత అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీడీవో రాజగోపాల్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీవో పార్వతితదితర అధికారులతో పాటుగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గ్రామపంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. క్రోసూరు: విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల బాలికలకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నీట్, జేఈఈ, ఈప్సెట్ రెసిడిన్షియల్ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా తెలిపారు. గురువారం క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న నీట్, జేఈఈ, ఈప్ సెట్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బాలికలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలన్నారు. కోచింగ్ నిర్వహణ, బోధనా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఏఎంఓ కె.సుజనా, ఏఏఏఓ ఎస్.నాగేంద్రకుమార్, ప్రిన్సిపాల్ మేరీసూజన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్సై మోర్ల వెంకటేష్ బాబు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గంలో నియామకాలు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురు నాయకులను జిల్లా కార్యవర్గంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి)ని నియమించారు. అలాగే జిల్లా విద్యార్థి విభాగంలో ఉపాధ్యక్షుడిగా భోగిరెడ్డి అంకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ షహీద్, ముడేల విష్ణువర్ధనరెడ్డి (గురజాల), బి.సాయి శ్రీనివాసరెడ్డి (సత్తెనపల్లి), జిల్లా కార్యదర్శులుగా చింతారెడ్డి రాఘవరెడ్డి, నీలం ఆంజనేయులు (గురజాల), కె.సుధాకరరెడ్డి (సత్తెనపల్లి) నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసులు, షేక్ మొహిద్దీన్, షేక్ నాగరాజునాయక్, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా జి.సుసేంధ్ర. జిల్లా కార్యదర్సిగా కె.వెంకటపుల్లారెడ్డి, జిల్లా గ్రీవెన్సెల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా టి.శ్రీనివాసరావు, టి.సైదారావు, గ్రీవెన్స్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మార్క్కాసిమాల, కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, లీగల్సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎ.నాగరాజు, పి.హరిమణికంఠ నియమితులయ్యారు. జిల్లా ఇంటలెక్చ్యువల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చింతారెడ్డి నాగిరెడ్డి (గురజాల), జిల్లా వాణిజ్య విభాగ సెక్రటరీగా వేలమూరి సైదారెడ్డి (గురజాల), జిల్లా పబ్లిసిటీ వింగ్ కార్యదర్సిగా తాయ వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా వైఎస్సార్టీయూసీ సెక్రటరీగా షేక్ నాగూల్మీరా (గురజాల) నియమితులయ్యారు. మాచర్ల నియోజకవర్గ బాధ్యులుగా.. అలాగే మాచర్ల నియోజకవర్గ గ్రీవెన్సెల్ అధ్యక్షుడిగా శీలం మల్లారెడ్డి, నియోజకవర్గ పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడిగా చల్లా మట్టారెడ్డి నియమితులయ్యారు. పిడుగురాళ్ల మండల కార్యవర్గం.. గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం రైతు విభాగం అధ్యక్షుడిగా తెలగనేని సాంబశివరావు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా అంచూరి వంశీరెడ్డి, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా దేవిశెట్టి వీరాంజనేయులు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షులుగా తాళ్లపోగు సాల్మన్ నియమితులయ్యారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
తాడికొండ: తాడికొండ దుర్గా వైన్స్లో జరిగిన యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడికొండ సీఐ కె వాసు వెల్లడించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 05వ తేదీన తాడికొండ దుర్గా వైన్స్లో నూతక్కి మరియదాసు, నూతక్కి నరేష్ల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో మృతుడు మరియదాసు, నరేష్ తల పగలగొట్టాడు. బయటకు వెళ్లిన నరేష్ తన సోదరుల వరసయ్యే కటారి జాషువా అలియాస్ కిరణ్, గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావులను వెంట తెచ్చుకొని రోడ్డుపై నిలబడి వైన్స్లోకి పంపించాడు. అక్కడ వివాదం ముదరడంతో మరియదాసును బ్రిక్స్ రాయితో తల పగలగొట్టి విచక్షణా రహితంగా కొట్టడంతో మరియదాసు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విచారణలో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బుధవారం ఉదయం నిందితులను తాడికొండ అడ్డరోడ్డు వద్ద సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వాసు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నూతక్కి సాంబశివరావు తాడికొండలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జూనియర్ డివిజన్ న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
చేతివృత్తిదారుల సమస్యలపై రాష్ట్రస్థాయి వర్క్షాప్
మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు మంగళగిరిలో ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రస్ధాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ చేతి వృత్తిదారుల నైపుణ్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాల విస్తరణ, ఉపాధి భద్రత వంటి కీలక అంశాలపై పలువురు నిపుణులతోపాటు వృత్తిదారులు చర్చించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఏపీ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రత ప్రమాణాలు పాటించని బస్సులను నిలిపివేస్తాం
మంగళగిరి టౌన్: భద్రత ప్రమాణాలను పాటించని బస్సులను నిలిపి వేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి మండలం కాజ టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాహనాల రికార్డులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారం వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి -
ఆగ్రహ జ్వాల
వైఎస్సార్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన ● మహిళలకు వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, మానవహారం ● పల్నాడురోడ్డులో ధర్నా చేసిన డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పల్నాడు రోడ్డులో పాత ఆంధ్రజ్యోతి కార్యాలయ కాంప్లెక్స్ ముందు రోడ్డుపై బైఠాయించిన డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ గజ్జల తదితరులునరసరావుపేట మల్లమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడిన నాయకులు, కార్యకర్తలు -
ఎం ఫార్మసీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు
● సెల్ఫ్ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన ● విద్యార్థికి రూ. ఆరు వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు ● పత్తా లేని పరిశీలకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎక్కడైనా పరీక్షలు అంటే పకడ్బందీగా, అవకతవకలకు తావు లేకుండా నిర్వహించాలని చూస్తుంటారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. పరీక్ష ఏదైనా డబ్బులు వసూలు చేయడం, చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్చార్జుల పాలన సాగుతుండటం, ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుండటంతో వర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకీ మసకబారుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం ఫార్మసీ రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు, మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు కేంద్రాలుగా సెల్ఫ్ సెంటర్ కేటాయించడం.. పరిశీలకులు పత్తా లేకపోవడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. అడ్డగోలుగా... ఫార్మసీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న పలువురు ఎం ఫార్మసీ కోర్సును కళాశాలలకు రాకుండా కేవలం పరీక్షకు మాత్రమే హాజరు అయ్యారు. దాదాపు అన్ని ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు తరగతులు హాజరుకాకపోవడం.. సబ్జెక్టుపై అవగాహన లేకపోవడంతో ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ డబ్బులు తీసుకుని విద్యార్థులకు చూచిరాతకు అవకాశం ఇచ్చారు. దొడ్డి దారిన ఉద్యోగం పొంది.. దోచు కోవటమే ధ్యేయంగా వ్యవహరించే అక్రమార్కుల అండతో వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. లా, బీఈడీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇతర సెంటర్లను వేస్తున్నప్పటికీ ఎంఫార్మసీకి మాత్రం సెల్ఫ్ సెంటర్లు కేటాయించారు. దీంతో పల్నాడులోని కొన్ని సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఈ పరీక్షలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని సెంటర్లలో పేపర్కి రూ.15 వందల రూ. 2 వేల వరకూ , కొన్ని సెంటర్లలో రూ.ఆరు వేల నుంచి రూ. పది వేల వరకూ వసూలు చేశారు. కొన్ని కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్షలకు రూ.రెండున్నర వేల నుంచి రూ.మూడు వేల వరకు తీసుకున్నారు. ఒక్కొక్క పరిశీలకుడికి విద్యార్థి నుంచి రూ.500 చొప్పున కాపీయింగ్ ఫీజు అంటూ దండుకున్నారు. పల్నాడులోని కేంద్రాల్లో సెల్ఫోన్లలో చాట్ జీపీటీ ద్వారా అన్ని పరీక్షలు చూసి రాయటానికి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. గుంటూరు సమీపంలోని ఒక సెంటర్లో రూ.10 వేలు ప్యాకేజీగా తీసుకుంటున్నారు. నరసరావుపేటలో ఒక కళాశాల లెక్చరర్ దళారీగా వ్యవహరిస్తూ ఒక్కొక్క కళాశాల నుంచి రూ.25 వేలు నిర్వహణ ఫీజు పేరుతో కొందరు అధికారుల పేరిట వసూలు చేశారు. పల్నాడులోని ఒక సెంటర్లో పరీక్ష రాసుకోవడానికి అదనపు సమయం ఇవ్వడానికి రూ.500 వసూలు చేశారు. నరసరావుపేట, ఫిరంగిపురం సమీపంలో ఒక సెంటర్లో, తెనాలిలోని ఒక సెంటర్లో, పల్నాడులో ఉన్న ఒక కళాశాలలో భారీగా కాపీయింగ్ జరుగుతున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెగ్యులర్గా ఉద్యోగం చేయకుండా, కేవలం పేపర్ల మీద మాత్రమే లెక్చరర్గా వ్యవహరించే వారిని పరిశీలకులుగా నియమించడంతో కాపీయింగ్ చేయడం సులువుగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వారే పరిశీలకులుగా వ్యవహరించటంతో యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారికి ముడుపులు ముట్టచెబుతున్నారు. నగరంలోని ఒక కేంద్రంలో ఉదయం ఫార్మసీ పరిశీలకులుగా వ్యవహరించిన వ్యక్తే మధ్యాహ్నం నుంచి సైకాలజీ ఎగ్జామినర్గా బీఈడీ పేపర్లను మూల్యాంకనం చేయడం గమనార్హం. మరో వ్యక్తి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ఒకవైపు బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినర్గా హాజరవుతూ.. అదే సమయంలో ఏఎన్యూలో ఫార్మసీ పరీక్షల విధులు నిర్వహించారు. తనిఖీ బృందాలలో వర్సిటీ వారితోపాటు పల్నాడులోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరిని నియమించారు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తనిఖీల తీరు మారింది. -
రైతుల దృష్టికి తేకుండానే భూ సేకరణ తగదు
రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య తెనాలిటౌన్: ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూముల్లో మార్కింగ్ చేయటం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. రైతులను సంప్రదించి, వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్రింగ్ రోడ్లకు సంబంధించిన తెనాలి మండలంలోని బాధిత రైతాంగ సమావేశాన్ని బుధవారం సాయంత్రం రూరల్ మండల గ్రామం గుడివాడలో నిర్వహించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. వి.కృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని 10 మండలాల్లో 40 గ్రామాల పరిధిలో ఔటర్ రింగురోడ్డు బాధిత రైతులున్నట్టు చెప్పారు. ఏళ్లుగా సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్రోడ్డుకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 250 మీటర్ల వెడల్పును ప్రతిపాదించటంలోని ఆంతర్యమేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గతేడాది డిసెంబరులో భూసేకరణకు కేవలం 25 రోజులే గడువునిచ్చారని గుర్తుచేస్తూ, సామాజిక అధ్యయనానికి ఈ వ్యవధి సరిపోదన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అప్రమత్తంగా ఉంది, ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యువత పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు ముందుకొస్తే వారి పక్షాన రైతుసంఘం పోరాడుతుందని హామీనిచ్చారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్ మాట్లాడుతూ ఔటర్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నే రమేష్బాబు, నన్నపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉన్న భూమంతా లాక్కుంటున్నారు గుడివాడకు చెందిన బాధిత రైతు మహిళ పోతురాజు వసుంధర మాట్లాడుతూ తనకు గ్రామంలో గల రెండున్నర ఎకరాల భూమినీ మార్కింగ్ చేశారని సభాముఖంగా చెప్పారు. ఉన్న భూమి మొత్తం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. 30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ ఉద్యోగోన్నతి పరీక్ష నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీసు పెరేడ్గ్రౌండ్, జిల్లా పోలీసు సమావేశ మందిరంలో 30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఫ్రీ ప్రమోషనల్ పరీక్ష నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏఎస్సైలు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వివిధ అంశాలపై వారితో మాట్లాడి ప్రతిభను అంచనా వేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్బాబు, ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, గుంటూరు ఏఎస్పీ రమణమూర్తి, గుంటూరు ఏఆర్ డీఎస్పీ సంకూరయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో ఎల్నిలో దూరం
నరసరావుపేట రూరల్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్నినో ప్రభావాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సమర్ధంగా ఎదుర్కోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. రైతు సాధికార సంస్ధ ఆద్వర్యంలో ఐసీఆర్పీలు, ఎఫ్ఎంలు, డీఎంఎంటీలకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఏర్పడే పరిస్థితులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై విస్త్రృత అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులందరినీ ఎస్టూఎస్ రైతులుగా మార్చే దిశగా కృషిచేయాలని సూచించారు. జిల్లాలోని 28 మండలాల్లో రైతు సేవవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విత్తన గుళికల పద్ధతిని అనుసరించడం ద్వారా విత్తనాలు చెడిపోకుండా, వర్షం పడగానే మొలకెత్తేలా చేయవచ్చని తెలిపారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండే విధంగా పంటల నిర్వహణ చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. రాష్ట్ర ఎన్ఎఫ్ఏ మల్లేశ్వరి, సైదయ్య, అప్పలరాజు, సౌజన్య, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. – జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు -
కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
విజయపురిసౌత్: చిన్న కూతురు అనారోగ్యంతో మృతి చెందిదన్న బాధతో పెద్ద కూతురితో కలిసి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన ఆరె అమరేశ్వరి(23), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, రెండు నెలల క్రితం చిన్న కుమార్తె యశ్విక (ఒకటిన్నర సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందగా అప్పటినుంచి తల్లి అమరేశ్వరి మనస్తాపంతో కుంగిపోయింది. ఇది గమనించిన భర్త అమరేశ్వరి వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. బుధవారం వెంకటశివ పని నిమిత్తం దుర్గి వెళ్లాడు. చిన్న కుమార్తె చనిపోయిందన్న బాధతో ఉన్న అమరేశ్వరి పెద్ద కుమార్తె లతికశ్రీ(3)తో కలిసి తాళ్లపల్లి సమీపంలోని సాగర్ కుడి కాలువలో వద్దకు వెళ్లింది. అనంతరం తన చున్నీతో లతికశ్రీ ముడి వేసుకొని నీటి ప్రవాహంలోకి దూకింది. సమాచారం అందుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో కాలువలో గాలించారు. అనంతరం తల్లీకూతుర్ల మృతదేహాలు వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు. -
పత్తి బేళ్ల లారీ దగ్ధం
నాదెండ్ల: జాతీయ రహదారిపై పత్తి బేళ్ల లారీ దగ్ధమైన సంఘటన బుధవారం గణపవరం వద్ద చోటుచేసుకుంది. చిలకలూరిపేట ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ గౌస్ తెలిపిన వివరాల మేరకు యడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని సప్తగిరి గోడౌన్లలో మధ్యాహ్నం ఒంటి గంట సమీపంలో 16 టన్నుల రెండో రకం పత్తి బేళ్లను కూలీలు కంటెయినర్ లారీలో లోడ్ చేశారు. లారీ తిమ్మాపురం నుంచి హరియాణాలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. లోడింగ్ అనంతరం వే బ్రిడ్జి కాటా వేసుకుని ఇన్వాయిస్లు తీసుకుని లారీ బయలుదేరింది. గణపవరం వద్దకు చేరుకునే సరికి క్యాబిన్లో పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి లారీని పక్కకు నిలిపివేసి కంటెయినర్ డోర్ తెరిచాడు. దట్టమైన పొగ అలముకోవటంతో అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లారీని జాతీయ రహదారికి దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి జేబీలతో బేళ్లు బయటకు లాగారు. అప్పటికే 60 శాతం పైగా అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంపై మోహిత్ కాటన్ మిల్స్ యజమాని అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో దగ్ధమైన బేళ్ల విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. రూ.10 లక్షల ఆస్తి నష్టం -
లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. దాచేపల్లి లోని దావత్ రెస్టారెంట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సబావత్ వెంకట్ నాయక్ (41) మృతి చెందారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మాచర్ల మండలం అచ్చమ్మకుంటకు చెందిన వెంకట నాయక్ 2004లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2012లో సివిల్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకట్ నాయక్కు భార్య స్వరూప బాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం మీరు దాచేపల్లిలో నివాసం ఉంటున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తన వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనం(బుల్లెట్ ) పై వెంకట్ నాయక్ వెళ్లి తిరిగి దాచేపల్లి వస్తున్నాడు. ఈ క్రమంలో దాచేపల్లిలోని దావత్ రెస్టారెంట్ వద్ద ఓ లారీ ఆకస్మికంగా యూటర్న్ తీసుకుంటుంది. దీంతో హైవే పై వస్తున్న వెంకట్ నాయక్ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో వెంకట్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న శివ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంకట నాయక్ని హుటాహుటిన దాచేపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పాపారావు పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతదేహాన్ని నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందులు జాను, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు మునగా శ్రీనివాసరావు, కొమ్ము బుజ్జి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.


