breaking news
Palnadu
-
మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శం
నరసరావుపేట టౌన్: మహాత్మా గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి కృషి చేయాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని ఖైదీల సంక్షేమ దినంగా సబ్జైల్లో గురువారం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, సబ్ జైలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాట్లాడారు. పొరపాటునో గ్రహపాటునో వివిధ నేరాల్లో ఉన్నవారు భవిష్యత్తులో పరివర్తన చెంది ఎటువంటి క్షణికావేశాలకు లోనుకాకుండా నేర ప్రవృత్తిని విడనాడి శాంతియుత జీవనం గడపాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడాంశాలలో విజేతలకు ఆమె బహుమతి ప్రదానం చేశారు. మొదట మహాత్మా గాంధీ చిత్రపటానికి న్యాయమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపకారగారం పర్యవేక్షకులు సురభి అంజయ్య, డిప్యూటీ జైలర్ రాములు నాయక్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బ్లేస్సినా, సిబ్బంది పాల్గొన్నారు. -
పండగ పూట పెను విషాదం
చందంపేట : మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో స్నానం ఆచరించేందుకు కృష్ణా బ్యాక్ వాటర్లో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని దేవరచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన కేతావత్ రాము(32), బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి చెందిన వాంకుడావత్ పూర్ణ గోపాలభరత్ (22), అవనిగడ్డకు చెందిన ఉమా సాయికాంత్ (11)లతోపాటు పలు కుటుంబాలు దేవరచర్లలోని తుల్జా భవాని ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సెప్టెంబర్ 30న వచ్చారు. అక్కడే బస చేసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుగుప్రయాణం సందర్భంగా గురువారం దేవరచర్ల గ్రామంలో కృష్ణా బ్యాక్ వాటర్, డిండి ప్రాజెక్టు జలాలు కలిసే చోట వాగులో స్నానం చేసేందుకు ఉమా సాయికాంత్ దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో వాగులో జారిపడి మునిగిపోయాడు. గమనించిన కేతావత్ రాము, పూర్ణ గోపాలభరత్లు కాపాడేందుకు వాగులోకి దిగారు. ఈత రాకపోవడం, వాగు లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఉత్తమ పద్యనాటకం ‘ఆదికవి నన్నయభట్టు’
తెనాలి: వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు–2025 ఘనంగా ముగిశాయి. ఇక్కడి తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరు రోజులపాటు జరిగిన పద్యనాటక, సాంఘిక నాటక, నాటిక పోటీల ముగింపు సభ గురువారం రాత్రి జరిగింది. ఈ సభలో బహుమతులను ప్రదానం చేశారు. పద్యనాటక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్– విజయనగరం సమాజం ప్రదర్శించిన ‘ఆదికవి నన్నయభట్టు’ నాటకం ఎంపికై ంది. దీనికి ఉత్తమ రచన బహుమతిని కూడా శారద ప్రసన్న స్వీకరించారు. నన్నయ భట్టుగా నటించిన కె.సూర్యనారాయణకు ఉత్తమ నటుడిగా నిలిచారు. ‘మెహినీ భస్మాసుర’కు అవార్డుల పంట ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా అక్కినేని సాంస్కృతిక సమాజం వారి ‘మోహినీ భస్మాసుర’ నాటకం ఎంపికై ంది. భస్మాసురుడిగా నటించిన డి.తిరుపతినాయుడు ఉత్తమ ప్రతినాయకుడు బహుమతిని, మోహినీగా నటించిన కేవీ పద్మావతి ఉత్తమ నటిగా, నారదుడు పాత్రధారి గవర సత్తిబాబు ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా బహుమతులను గెలుచుకున్నారు. ఇదే నాటకానికి ఉత్తమ సంగీతం బహుమతిని కంది త్రినాథరావు అందుకున్నారు. సత్తా చాటిన కళాకారులు చందాల కేశవదాసు కళాపరిషత్ – మధిర వారు ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ నాటకానికి తృతీయ ఉత్తమ బహుమతి లభించింది. దీనికి దర్శకత్వం వహించిన ఎన్.సుబ్బరాజు ఉత్తమ బహుమతిని గెలుచుకున్నారు. పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు, లలిత కళాపరిషత్ – అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ నాటకానికి ఉత్తమ రంగోద్దీపనం బహుమతిని సురభి రాయల్ స్వీకరించారు. టీజీవీ కల్చరల్ అకాడమీ – కర్నూలు వారు ప్రదర్శించిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ నాటకానికి ఉత్తమ ఆహార్యం బహుమతిని సి.శ్రీనివాసులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటి బహుమతిని ’పుత్రాదిచ్ఛేత్’ నాటకంలో నాగులాంబ పాత్రధారి ఎన్.తిరుమల కై వసం చేసుకున్నారు. ఉత్తమ హాస్యనటిగా ‘జగదేకసుందరి సామా’లో హసీనా, ఉత్తమ బాలనటుడిగా ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో బాలవెంకటేశ్వరుడు గెలుచుకున్నారు. సాంఘిక నాటక విభాగంలో ... సాంఘిక నాటక విభాగంలో ఉత్తమ ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్– వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ నటి సురభి లలిత, ఉత్తమ ప్రతినాయకురాలు (నల్లత్రాచు నీడలో)ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా జయకళానికేతన్ – విశాఖపట్నం వారి ‘సిరికేళి’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటుడిగా బహుమతులను జరుగుల రామారావు (అందరూ మంచివారే...కానీ), ఉత్తమ రచన శ్రీశైలమూర్తి (యాగం) అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్నీ బ్రతకనివ్వండి’ గెలుచుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు బహుమతులు లభించాయి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా పరమాత్ముని క్రియేషన్స్ –హైదరాబాద్ వారి ‘ఎక్కడో...ఏదో’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు ఉత్తమ రచన బహుమతి లభించింది. ఉత్తమ తృతీయ ప్రదర్శనగా హర్ష క్రియేషన్స్ – విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ నాటిక ఎంపికై ంది. కళల కాణాచి – తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవంలో అజో విభో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, నాటకరంగ విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ఆర్.శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు -
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి, పెదకూరపాడుకు చెందిన జాలయ్యను సెంట్రల్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్లుగా ఇరువురు నియామకం.. నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్ఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొమ్మారెడ్డి చలమారెడ్డి(మాచర్ల), ఈదా సాంబిరెడ్డి (పెదకూరపాడు), కొమ్మినేని వెంకటేశ్వర్లు (గురజాల) నియమితులయ్యారు. మరొక వ్యక్తికి తీవ్రగాయాలు రొంపిచర్ల: మండలంలోని మర్రిచెట్టుపాలెం, మాచవరం గ్రామాల మధ్య రహదారిపై శుక్రవారం రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన వి.గోపిరెడ్డి (21) మర్రిచెట్టుపాలెం గ్రామంవైపు నుంచి మోటారు సైకిల్పై మాచవరం గ్రామం వెళుతుండగా అదే మార్గంలో నరసరావుపేట నుంచి కుంకులకుంట వెళుతున్న హుస్సేన్కు చెందిన మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపిరెడ్డి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన హుస్సేన్ను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల: బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు డ్రోన్ నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా సముద్రతీర పర్యాటక ప్రదేశాల్లో, శివారు ప్రాంతాలలో శుక్రవారం నిఘా ఏర్పాటు చేయించారు. సూర్యలంక, రామాపురం, వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాల గురించి సమారచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు
నకరికల్లు: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పలు ప్రాంతాలలో అమ్మకాలు చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. నకరికల్లు పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని చల్లగుండ్ల పరిధిలో గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నున్న 10 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు, విశాఖపట్నం సాలిపేటకు చెందిన పెంటకోట శంకరరావు, నకరికల్లుకు చెందిన కగ్గా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల పులిచింతల నిర్వాసిత గ్రామానికి చెందిన కాపర్తి మల్లిఖార్జునరావు, బిహార్ రాష్ట్రానికి చెందిన అగయ్య వినోద్యాదవ్, నకరికల్లు మండలానికి చెందిన బాణావతు బాలానాయక్, రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంకు చెందిన సాదుపాటి శ్రీనివాసరావు, కొండమోడు గ్రామానికి చెందిన బండారు హనుమంతరావు, ఆవుల పెద్దసాంబయ్యలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. నర్రా హనుమంతరావు, పెంటికోట శంకరరావులు కలసి ఒడిశా నుంచి విశాఖపట్నం ప్రాంతాలకు గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారన్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారినుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం -
పింఛన్ నగదు మాయం
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామ వీఏవో మనోజ్కుమార్ సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వినియోగించుకున్నాడు. శుక్రవారం గ్రామానికి చెందిన కొందరు పింఛన్దారులు పంచాయతీ కార్యాలయంలో అతనిని నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే... ఈనెల 1వ తేదీన గ్రామంలోని ఒకటో వార్డులో 58 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ రైతుభరోసా కేంద్రం వీఏవో మనోజ్కుమార్కు బాధ్యతలు అప్పగించారు. వాటిలో సుమారు 20 మంది లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకున్నాడు. వేలిముద్రలు సరిగా పడలేదు, డబ్బులు గురువారం వచ్చి ఇస్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. డబ్బులు ఇస్తాడని ఎదురు చూసిన బాధితులు ఎంతకూ రాకపోవటంతో ఫోన్లు చేసి పిలిపించారు. బ్యాంకుకు వెళ్లి వస్తానని తాత్సారం చేసి పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో అక్కడ లబ్ధిదారులు పింఛన్ నగదు కోసం నిలదీశారు. పింఛన్ నగదు లేవు రెండు రోజుల్లో సర్దుతానంటూ చెబుతుండటంతో అక్కడే నిర్బంధించారు. టీడీపీ నాయకులు, గ్రామపెద్దలు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పోలీసులను తెలియచేశారు. పోలీసులు తీసుకొచ్చి ఎంపీడీవోకు అప్పగించారు. దీనిపై ఎంపీడీవో జి.శ్రీనివాస్ తెలుపుతూ 20 మందికి పింఛన్ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, ఎంత మేర ఇవ్వాలన్నది లాగిన్లో శుక్రవారం తెలుస్తుందన్నారు. వీఏవో వాడుకున్న నగదు శునివారం తీసుకొచ్చి అప్పగించే విధంగా లిఖితపూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. నగదు అప్పగించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. యూరియా ఇప్పిస్తానని నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఇది ఇలా ఉండగా ప్రస్తుతం యూరియా డిమాండ్ను అసరాగా తీసుకుని యూరియా తెప్పించి ఇస్తానని కొంత మంది రైతుల దగ్గర నగదు వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చిన రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎంత మేర వసూలు చేశారన్నది స్పష్టంగా తెలియరాలేదు. -
ఆరున స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అందించనున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఈనెల 6న ప్రదానం చేయనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదే బాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛతా అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైనట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు. అక్టోబరు 6న జిల్లా ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్స్టేషన్లు, పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. మూడు దశల్లో స్వచ్ఛ ఆంధ్ర–2025 రేటింగ్, ర్యాంకింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డు గ్రహీతల పూర్తి వివరాలను ఎస్ఎఎస్ఎ (సాసా) పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ విజయాలు స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మూడో దశలో 25 గ్రామాల్లో రీసర్వే నరసరావుపేట: జిల్లాలో శుక్రవారం నుంచి మూడో దశ రీ సర్వే ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 150 గ్రామాలలో రీసర్వే పూర్తి చేశామని, ప్రస్తుతం మరో 41 గ్రామాలలో జరుగుతుందని అన్నారు. మూడో దశలో 25 గ్రామాలలో రీసర్వే చేయబోతున్నామని తెలిపారు. రైతులందరూ రీసర్వేకి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీసు ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. రీసర్వేలో రైతుల నుంచి అందిన అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయండి నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల సిబ్బంది, కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అందించిన భూముల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి సాయం అందించగలిగే అవకాశాలను అన్వేషించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంపై నైపుణ్యాభివృద్ధి శాఖ దృష్టి సారించాలన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరికీ 100శాతం ప్లేస్మెంట్ దక్కేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, ఎల్డీఎం రాంప్రసాద్, డీఆర్డీఎ అసిస్టెంట్ పీడీ ఆర్.ప్రతాప్, జిల్లా పరిశ్రమల అధికారి నవీన్, ఏపీఐఐసీ జెడ్ఎం డాక్టర్ ఎల్ఎం నరసింహారావు, జిల్లా అదనపు నైపుణ్య అభివృద్ధి అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
మేదరమెట్ల: బైక్ను కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొరిశపాడు మండల పరిధిలోని వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటసుబ్బారావు(55), భార్య లక్ష్మి(50)తో మోటారు బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. వెంకటాపురం క్రాస్ వద్దకు రాగానే బైక్ను అలవలపాడు రోడ్డులోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా ఇదే సమయంలో నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు బైక్ను ఢీ కొంది. దీంతో బైక్పై ఉన్న భార్యాభర్త రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు దుర్మరణం జరుగుమల్లి(సింగరాయకొండ): దసరా పండగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మండల కేంద్రమైన జరుగుమల్లిలో పాల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కట్టా ప్రవీణ్(21), చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(20) ఇద్దరూ కలిసి చింతలపాలెం నుంచి టంగుటూరుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంచిన టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.మహేంద్ర తెలిపారు. -
జయ మంగళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రాకతో కృష్ణమ్మ పులకించింది. దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదిదంపతులకు హంస వాహన సేవ జరిగింది. కృష్ణానది వరద నేపథ్యంలో శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఏటా నిర్వహించే నదీ విహారాన్ని రద్దు చేశారు. హంస వాహన సేవను మాత్రమే నిర్వహించగా, సేవను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది తీరానికి చేరుకున్నారు. హంస వాహనంపై అధిష్టించిన ఆదిదంతులకు ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. హంస వాహనంపైకి ఆలయ ఈవో, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ దంపతులతో పాటు వేద పండితులు, ఆలయ అర్చకులను మాత్రమే అనుమతించారు. హంస వాహనంపై కొలువు తీరి పూజలందుకుంటున్న ఆదిదంపతులను ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్, దుర్గగుడి ఫ్లైవోవర్, భవానీ ఘాట్ల నుంచి భక్తులు దర్శించుకున్నారు. సాయం సంధ్య వేళ దుర్గాఘాట్లో కృష్ణమ్మకు నవ హారతులను ఇవ్వగా, అదే సమయంలో హంస వాహన సేవ జరిగింది. ఒకే సమయంలో రెండు సేవలను వీక్షించే మహాభాగ్యం భక్తులకు కలిగింది. క్యూలైన్ల ద్వారానే.. భవానీలు, భక్తుల రాకతో మరో రెండు రోజులపాటు ఉత్స వ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొ న్నారు. శని, ఆదివారాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు క్యూలైన్ల ద్వారానే కొండపైకి చేరుకోవాలని సూచించా రు. అంతే కాకుండా వీఐపీ దర్శనాలు ఉండవని పేర్కొన్నారు. కనులపండువగానగరోత్సవ సేవ హంసవాహన సేవ కోసం ఆది దంపతులు దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మల్లేశ్వరస్వామి వారి ఆ లయం సమీపంలోని యాగశాల నుంచి ప్రారంభమవగా.. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, దుర్గాఘాట్కు బయలుదేరింది. ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో హంస వాహనంపైకి కేవలం 25 మందిని మాత్రమే అనుమతించారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
●దానికి బదులు అమరావతి ప్రైవేటీకరణ చేయొచ్చు కదా? ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పిడుగురాళ్లరూరల్: రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్లతో జేబులు నింపుకొంటూ, పేదల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొని వచ్చిన వైద్యకళాశాల, హాస్పటళ్లను ప్రైవేటుకు అప్పగించడం ఏంటని.. ఇదేనా మీ విజనరీ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. శ్యామల మాట్లాడుతూ... 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి బడ్జెట్టులోనే గురజాల నియోజకవర్గానికి నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు, రోగులకు ఉపయోగపడే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను ప్రైవేటు పరం చేస్తుందని.. దానికి బదులుగా అమరావతిని ప్రైవేటీకరణ చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత పెద్ద ప్రజెంటేషన్ చేసి కాలేజీల నిర్మాణం చేపట్టలేదని చెబుతున్నారని, అయితే ఒక్కసారి గురజాల వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మెడికల్ కాలేజీ భవనాలను కళ్లతో చూస్తూ కూడా నోటితో అబద్దాలు చెబుతున్నారని శ్యామల దుయ్యబట్టారు. 17 కాలేజీలలో ఏడు కాలేజీలను జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తి చేశారని, మిగతా 10 కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం రాజధాని ఎలా పూర్తి చేస్తారని ఆమె ప్రశ్నించారు. సర్పంచ్లు చల్లా శివారెడ్డి, షేక్ బడేషా, వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ఇల్లూరి వెంకట రామిరెడ్డి, జిల్లా యూత్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ చల్లా రంగారెడ్డి, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ షేక్ మాబు, గురజాల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సాంబశివరావు, వలంటీర్ విభాగం అధ్యక్షులు అంచూరి తరుణ్రెడ్డి, కత్తి సాగర్బాబు, బండి ప్రసాద్రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
నరసరావుపేట టౌన్: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీహెచ్సీ వైద్యుల సంఘం అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ కోటా తగ్గించింటంతో వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ జీఓ నెం. 99 ద్వారా పీజీ ప్రవేశాల్లో 20 శాతం ఉన్న కోటాను 15 శాతానికి తగ్గించటమే కాకుండా కేవలం ఏడు బ్రాంచ్లకే పరిమితం చేయటం అన్యాయమన్నారు. సంఘ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మొదట దీక్ష శిబిరం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు హనుమకుమార్, రమ్య, జగన్నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ల పంపిణీ
సత్తెనపల్లి: జిల్లాలో సచివాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. వలంటీర్ విధులు తమకు వద్దని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిరసన తెలియ జేస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,72,735 పెన్షన్లకు గాను బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు 2,51,240 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. 92.12 శాతం పంపిణీ పూర్తయింది. ఇంకా 21,495 మందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా సత్తెనపల్లి పట్టణంలో 94.89 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేయగా అత్యల్పంగా దుర్గిలో 89 శాతం మందికి పంపిణీ జరిగింది. ఇది ఇలా ఉంటే రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీలో జరిగిన లోటుపాట్లపై లబ్ధిదారులు అంతా ఒకే చోటకు చేరి గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడటంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్డీఓ రాజగోపాల్, మండల అధికారులు అనుపాలెం గ్రామానికి చేరుకొని పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. నకరికల్లు: ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మండలంలోని గుండ్లపల్లి సమీపంలోని ఎన్నెస్పీ మెయిన్ కెనాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన విషయం పాఠకులకు విధితమే. చిలకలూరిపేటకు చెందిన షేక్ అర్షద్(17), చీరాల మండలం ఆంధ్ర కేసరినగర్కు చెందిన దరబడి మార్క్ రూఫస్(17)ల మృతదేహాలను మండలంలోని శివాపురంతండా సమీపంలో సాగర్ కెనాల్లో గుర్తించారు. అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత యడ్లపాడు: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి క్వారీ కుంటలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన దాసరిపాలెంకు చెందిన బాలుడు షేక్ మాబు(15) మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గతనెల 30వ తేదీన మండలం పరిధిలోని చౌడవరం గ్రామ శివారులోని క్వారీకుంటలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన మాబు మృతదేహాన్ని యడ్లపాడు పోలీసులు అదేరోజు రాత్రి 10.45 వెలికి తీసిన విషయం తెలిసిందే. వెంటనే మృతదేహాన్ని చిలకలూరిపేట అర్బన్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. బుధవారం మాబు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాస్పిటల్ వద్దకు రావడంతో రోదనలు మిన్నంటాయి. తల్లి మరియంబి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో దాసరిపాలెంలోని అంత్యక్రియలు నిర్వహించారు. -
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు. -
జిల్లాలో భూగర్భజలాలు సంరక్షించాలి
నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెంపు వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, భూగర్భజల శాఖ, డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట కుంటల తవ్వకం, చెక్ డ్యామ్లు, నీటికుంటల నిర్మాణం, చెరువుల పూడికతీత, చెరువుల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపటం వంటి సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా నీటి సంరక్షణ సాధ్యమన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ , డ్వామా పీడీ లింగమూర్తి, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు వసతులు కల్పించండి ఔత్సాహిక క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలసి సత్తెనపల్లిరోడ్డులోని అన్నా క్యాంటీన్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా స్టేడియానన్ని ఆమె పరిశీలించారు. వాకింగ్, రన్నింగ్ ట్రాక్లతోపాటు వివిద నిర్మాణాలు చేపట్టాలని శాప్ అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్లో భోజనాన్ని పరిశీలించారు. ప్రకాష్నగర్లోని 12వ వార్డు షాలెంనగర్లో మురుగునీటి కాలువను పరిశీలించారు. పూడికతీతకు ఆదేశాలిచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును ఆదేశించారు. బాపనయ్య 11వ వార్డు సచివాలయాన్ని పరిశీలించారు. నూతన జీఎస్టీ రెండు శ్లాబుల విధానంతో అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీఓ కె.మధులత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం -
సాగర్బాబు ఘటనపై విచారణ జరిపి న్యాయం చేస్తాం
నరసరావుపేట రూరల్: విద్యుత్ షాక్కు గురై వికలాంగుడిగా మారిన సాగర్బాబు ఘటనలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్కుమార్ హామీ ఇచ్చారు. జొన్నలగడ్డలోని విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద సాగర్బాబు కుటుంబం గత రెండురోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎస్ఈ సందర్శించి, సాగర్బాబు భార్య కెజియాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు ఎస్ఈని కలిసి చర్చించారు. సాగర్బాబు కుటుంబం గత 17 రోజులుగా రిలే నిరాహారదీక్షలు, రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ పెద్దలు రాతపూర్వకంగా ఇచ్చారని ఎస్ఈ తెలపగా.. రెండున్నర సంవత్సరాల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు నకిలీ లెటరు తీసుకువచ్చి చూపడం సరికాదని, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సాగర్బాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. దీంతో సాగర్బాబు కుటుంబసభ్యులు రిలే నిరాహార దీక్షలను విరమించారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వర్లు, నల్లపాటి రామారావు, జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కారుతో హల్చల్
పిడుగురాళ్ల: మద్యం మత్తులో బొలెరో వాహనాన్ని నడుపుతూ వాహనాలు, పాదచారులపైకి దూసుకుపోయిన ఘటన పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. సైదా వలి అనే యువకుడు పూటుగా మద్యం తాగి బొలెరో వాహనం నడుపుతూ దాచేపల్లి వస్తున్నాడు.. ఈక్రమంలో పిడుగురాళ్ల అయ్యప్పనగర్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాల తో పాటు పాదచారులపైకి దూసుకుపోయాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన యువకుడు హైవేపై కొద్ది నిమిషాల పాటు హల్చల్ చేశాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం నిలిపి పక్కన మాట్లాడుతున్న వ్యక్తిని బొలెరోతో ఢీకొనడమే కాకుండా ఆ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లాడు. వేగంగా వాహనం దూసుకుని పోవడంతో రోడ్డుపై నిప్పు రవ్వలు చెలరేగాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిలో నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తికి కాలు పూర్తిగా దెబ్బతింది. అతన్ని వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు తెలిసింది. మిగిలిన వారిని పిడుగురాళ్ల పట్టణంలో ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించారు. ఈక్రమంలో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పలువురు యువకుల సాయంతో బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సైదావలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వారిని 108 ద్వారా పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వాహనం నడిపిన సైదావలిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ నాగరాజు తెలిపారు. -
దివ్యం.. దుర్గమ్మ దర్శనం
● వైభవంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు ● వేదపఠనంతో మారుమోగిన ఇంద్రకీలాద్రి ● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు ● నేడు మహిషాసురమర్దినిగా అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసురమర్దినీదేవిగా దర్శనమిస్తారు. ముగింపు దశకు ఉత్సవాలు గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లుకు నెమలి వాహనంతో నగరోత్సవం నిర్వహించారు. నెమలి కనులతో తీర్చిదిద్దన పల్లకీపై ఆదిదంపతులు ఇంద్రగిరి వీధుల్లో విహరించారు. సాయంత్రం వర్షం పడటంతో నగరోత్సవ సేవ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల కోలాహలం నడుమ ఊరేగింపు కనుల పండువగా సాగింది. -
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు. ఆకట్టుకున్న ఇతివృత్తాలు అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు. -
ఎన్జీజీఓ ఎన్నికలు వెంటనే పూర్తిచేయండి
నరసరావుపేట: ఏపీ ఎన్జీజీఓ పల్నాడు జిల్లా శాఖ ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అడహాక్ కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో అడహాక్ కమిటీ చైర్మన్ రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని తాలూకా యూనిట్ల ఎన్నికల ప్రక్రియ గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యదర్శి ఎస్.శ్యాంసుందర శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని తాలూకా యూనిట్ల సభ్యత్వాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, అడహాక్ కమిటీ సభ్యులు, తాలూకా యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరులో వైద్యుల షటిల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం విజయవంతంగా జరిగాయి. గుంటూరు అమరావతి రోడ్డులో జరిగిన షటిల్ టోర్నమెంట్లో వంద మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతగా శ్రీసూపర్కింగ్స్ నిలిచారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.కళ్యాణ్ చక్రవర్తి కెప్టెన్గా ఆడిన షటిల్ టోర్నమెంట్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ బి.వి.నారాయణరెడ్డి, స్పైన్ సర్జన్ డాక్టర్ డి.శ్రీకాంత్రెడ్డి, డాక్టర్ రాజశేఖర్లు టీమ్గా ఆడి కప్పు గెలుచుకున్నారు. ఫైనల్లో సందీప్ స్టైకర్స్ టీమ్ను 3.1 తేడాతో ఓడించి శ్రీసూపర్ కింగ్స్ విజేతగా నిలిచారు. శ్రీ సూపర్ కింగ్స్ టీమ్ వైద్యులకు పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృష్టి చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న డాక్టర్ ధాత్రికుమారి జాషువా సాహిత్య పురస్కారానికి అర్హురాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విశ్వ నరుడు జాషువా సేవా సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో విశ్వకవి గుర్రం జాషువా 130 వ జయంతి ముగింపు సభ లో భాగంగా మంగళవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో డాక్టర్ ధాత్రికుమారికి జాషువా సాహితీ పురస్కారం అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాషువా సాహిత్యం అజరామరం అన్నారు. కుల దురహంకారం పై, మహిళా అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జాతీయ కవి అని కొనియాడారు. సభకు సంస్థ అధ్యక్షుడు ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో టి. మహతి బాలాజీ, ఆర్. నరసింహారావు, ఎ. కిరణ్, ప్రభుదాసు కే రామారావు, ఐ. నరసింహారావు, కే. విల్సన్ రావు తదితరులు పాల్గొన్నారు. దాచేపల్లి: మండలంలోని రామాపురం మత్స్యకారుల కాలనీ రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. మంగళవారం కూడా కృష్ణానది వరద ఉధృతి తగ్గలేదు. దీంతో కొంత సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరికొన్నింటిని ఇళ్లపై భద్రపరిచారు. వరద ఉధృతి తగ్గకపోవటంతో పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. వరదకు పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. మండలంలోని పొందుగల వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా పొలాలు నీట మునిగాయి. -
పల్నాడు
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం దుర్గగుడికి రూ.40.12 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. 2.29 లక్షల లడ్డూలను విక్రయించామని వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. 450 మంది వేద పండితులు పాల్గొన్నారు.వెల్దుర్తి: వజ్రాలపాడు సమీపంలోని చెరువులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు.లింగారావుపాలెం శివాలయంలో వనదుర్గాదేవి అలంకారంలో పార్వతీదేవి సత్తెనపల్లిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీదుర్గాదేవిగా...దుర్గాదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు వినుకొండలోని శంకర సత్సంగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న కన్యలు దేవతాస్వరూపిణి దుర్గమ్మజిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా అమరావతిలోని బాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో మంగళవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని దుర్గతులను రూపుమాపే దుర్గాదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గాదేవిని దర్శించి పూజలు నిర్వహించారు. వినుకొండలోని శంకర సత్సంగంలో కన్యలు పూజలు నిర్వహించారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోని శివాలయంలో వనదుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. – అమరావతి/వినుకొండ/సత్తెనపల్లి/యడ్లపాడుI -
పేదలకు సబ్సిడీపై కందిపప్పు అందించే పద్ధతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ‘‘ఈ నెల ఇస్తాం..వచ్చే నెల ఇస్తాం’’ అంటూ 16 నెలలుగా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం అక్టోబర్ నెలలో కూడా సరఫరాకు మంగళం పాడింది. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండడంతో కందిపప్పు ఇస
నరసరావుపేట టౌన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే కందిపప్పు, పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు పంపిణీకి నోచుకోవటం లేదు. అన్ని సరుకులు అందజేస్తే పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చౌక దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67కు కార్డుదారులకు అందిస్తున్నారు అదే బహిరంగ మార్కెట్లో రూ.100 నుంచి రూ.105 వరకు పలుకుతొంది. ఏడాదికి పైగా చౌక దుకాణాల్లో కందిపప్పు అందకపోవటంతో పేదలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నూతన రేషన్న్ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగష్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రెండు రకాల యాప్లు ఏర్పాటు చేయటంతో సర్వర్ నెమ్మదించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సరుకుల పంపిణీలో జాప్యం చోటుచేసుకొని కార్డుదారులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కందిపప్పుకు మంగళం అక్టోబర్ నెలకు సంబంధించి బుధవారం నుంచి ప్రజా పంపిణీ ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం, పంచదార మాత్రమే చౌకదుకాణాలకు దిగుమతి అయ్యాయి. పండుగల సీజన్న్ లోనైనా ప్రభుత్వం పేదల కడుపు నిండేలా చర్యలు తీసుకుంటుందనే ఆశతో కార్డుదారులు రేషనన్ దుకాణాలకు వెళ్లారు. కానీ ప్రభుత్వం కందిపప్పు అందించకపోవడం వారికి తీవ్ర నిరాశ కలిగించింది. పండుగ కోసం అదనంగా ఖర్చులు చేయాల్సి వచ్చే ఈ సమయంలో మార్కెట్లో కిలో రూ.100కు పైగా వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయడం పేదల జేబులకు మరింత భారమైపోయింది. కందిపప్పు నిలిచిపోవడంతో పేద కుటుంబాలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పండుగ సీజన్లోనూ ఉపశమనం ఇవ్వలేకపోవడం ప్రభుత్వం వైఫల్యాన్ని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 6,34,114 రైస్ కార్డులు ఉండగా అందులో 18,36,592 మంది సభ్యులు ఉన్నారు. వారికి నెలనెలా కేజీ చొప్పున కార్డుదారులకు సబ్సిడీపై అందించాలి. వీటితోపాటు జిల్లాకు నూతనంగా అర్హత పొందిన సుమారు 13 వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుదారులతోపాటు నూతనంగా మంజూరైన వారికి కందిపప్పు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రేషన్ దుకాణాల్లో కందిపప్పు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ప్రజాపంపిణీపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. -
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెంకటేశ్వర్లు, గుత్తా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ధర్నా సన్నాహక సమావేశాన్ని మంగళవారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, ఏపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు, ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎండీ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, జి.వెళాంగిణీ రాజు, జిల్లా నాయకులు దిబ్బయ్య, ఎం.కోటిరెడ్డి, షేక్ బాజి బాలాజీ, ప్రసాద్, విజయానంద్ పాల్గొన్నారు. -
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
యడ్లపాడు: మండలంలోని జగ్గాపురం గ్రామంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు షేక్ బాజీవలి, మీరాబీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు కావడంతో కుమారుడు, కోడలు ఉద్యోగం నిమిత్తం దుబాయ్లోనూ, కుమార్తె, అల్లుడు వట్టి చెరుకూరు మండలం కుర్నూతల అడ్డరోడ్డు వద్ద చిల్లర కూల్డ్రింక్ షాపును ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బాజీవలి దంపతులు తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు జగ్గాపురంలోని ఇంటికి తిరిగి రాగా, రేకుల షెడ్డు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా, కప్ బోర్డులో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దుండగులు కప్బోర్డులో దుస్తుల మధ్యలో దాచి ఉంచిన వెండి, బంగారం ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు బాజీవలి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యడ్లపాడు ఎస్సై టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 130 గ్రాముల బంగారం, 20గ్రామలు వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు చోరీకి గురైనట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
●జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ●ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్ నరసరావుపేట రూరల్: ఆర్థిక మోసాలపై పలు ఫిర్యాదులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందాయి. జిల్లా అదనపు(అడ్మిన్) ఎస్పీ జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు, మెసం తదితర సమస్యలకు సంభందించిన 95 ఫిర్యాదులు అందాయి. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమలో ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీపతి, మహిళాపోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణలు పాల్గొన్నారు. జాబ్ ఇప్పిస్తామని మోసం.. జాబ్ ఇప్పిస్తానంటే నమ్మి రూ.4.60లక్షలు మోసపోయినట్టు కనిగిరి మండల ముసలపల్లి గ్రామానికి చెందిన ఆల గోపాల్ ఫిర్యాదు చేసాడు. గుంటూరులో బీటెక్ చదివే సమయంలో మాచర్ల మండలం రాయవరంకు చెందిన యోగేంద్రతో పరిచయం ఉందని, హైద్రాబాద్లో కోచింగ్ తీసుకుంటూ క్యాటరింగ్ పనికి వెళ్తున్న తనకు యోగేంద్ర ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.20లక్షలు తీసుకున్నాడని పేర్కొన్నాడు. ఉద్యోగం ఇప్పించే వ్యక్తి పాపకు అనారోగ్యం అనిచెప్పి మరో రూ.1.40లక్షలు తీసుకున్నాడని వివరించాడు. జాబ్ ఇప్పించకుండా మోసం చేసిన యోగేంద్రపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. డబ్బులు చెల్లించకుండా యానిమేటర్ మోసం.. రాజుపాలెం మండలం అంచులవారిపాలెంకు చెందిన కనకదుర్గ మహిళా పొదుపు సంఘం మే నెల కిస్తి బ్యాంక్కు చెల్లించకుండా యానిమేటర్ పోకల నాగలక్ష్మీ రూ.61వేలు మోసం చేసినట్టు సంఘం మహిళలు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసారు. గ్రూప్ సభ్యులం రూ.20లక్షలు లోన్ తీసుకుని ప్రతి నెల చెల్లిస్తున్నామని తెలిపారు. మే నేల నగదు గ్రూప్ సభ్యులు యానిమేటర్కు ఇవ్వగా ఆమె బ్యాంక్లో జమచేయలేదన్నారు. దీని మీద బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో యానిమేటర్ను ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో ఆమెతో పాటు, ఆమె భర్త దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్కీ స్కీం పేరుతో మోసం .. చరిష్మా లక్కీస్కీం పేరుతో నిర్వాహకులు 400మందిని మోసం చేసినట్టు బాధితులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసారు. చరిష్మా సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఏలూరు స్రవంతి, నాగేశ్వరరావు, నరేంద్రలు లక్కీ స్కీం ప్రారంభించడంతో 400మంది సభ్యలుగా చేరారని, ప్రతి నెల ఒక్కోక్కరు రూ.2వేలు చొప్పున 36 నెలల్లో రూ.72వేలు చెల్లించినట్టు తెలిపారు. 34వ డ్రా నుంచి విజేతలకు నగదు ఇవ్వకుండా, స్కీం సభ్యులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. బ్రాంచ్ ఖాళీచేసినట్టు, ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయడంతో మోసం పోయామని గ్రహించి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. -
ఫిర్యాదులపై జీరో శ్రద్ధ
● తమ ప్రాంతం కాదంటూ దాటవేస్తున్న వైనం ● పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు ● కేసు నమోదు ఆలస్యంతో అందని న్యాయం ● ప్రతిపక్షాలపై మాత్రం యథేచ్ఛగా నమోదు.. వేధింపులు ● మండిపడుతున్న ప్రజలు నరసరావుపేట టౌన్ : ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన జీరో ఎఫ్ఐఆర్ విధానం రాష్ట్రంలో పూర్తిగా అమలుకు నోచుకోకుండా కాగితాలకే పరిమితం అవుతుంది. నేరం ఎక్కడ జరిగినా సమీపంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేయాలి. అయితే ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ మెట్లు ఎక్కితే మాపరిధి కాదు.. అనే పదం పోలీసుల నుంచి బాధితులకు వినిపిస్తుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ చివరకు నిరాశతో ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ఫలితంగా న్యాయం పొందాల్సిన వారు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. నేరస్తులు మాత్రం స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు. ఏదైనా నేరం ఎక్కడ జరిగిందనేది పక్కన పెడితే సమీపంలో ఏ పోలీస్ స్టేషన్లో నైనా బాధితులు వెళ్లి ఫిర్యాదు చేయగానే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నా పోలీసులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్కు ఎదురైన చేదు అనుభవం..నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన డాక్టర్ బాడిస శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 18వ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలం వెళుతూ నరసరావుపేటలో బస్సు మారాడు. స్వగ్రామంలో బస్సు దిగి బ్యాగ్ చూసుకోగా అందులో ఉండాల్సిన 320 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వెంటనే వెళ్లి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసేందుకు తిరస్కరించారు. దీంతో నరసరావుపేట వచ్చి జరిగిన విష యం చెబితే .. సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇలా నాలుగు నెలలపాటు ఎవరూ కేసు తీసుకోకపోవడంతో బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించా డు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి నరసరావుపేటకు బదిలీ చేశారు. ఈ లోగా దొంగలు మాత్రం చోరీ చేసిన సొత్తుతో జల్సా చేశారు. ‘యానిమేషన్’ లోనూ అదే తీరుఅదేవిధంగా విజయవాడ కేంద్రంగా యానిమేషన్ కేంద్రం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నరసరావుపేటలో ఏజెంట్ల ద్వారా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టించుకున్నారు. మోసపోయిన బాధితులు మొట్టమొదటి సారి నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా విజయవాడ వెళ్లాలని సూచించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలసి విన్నవించుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఇలా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ పై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై ఒంటి కాలిపై...రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటి కాలిపై దూకుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే సోషల్మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు ఫిర్యాదు చేయగానే పోలీసులకు జీరో ఎఫ్ఐఆర్ గుర్తుకొస్తోంది. సంఘటనలకు పరిధితో సంబంధం లేకుండా స్థానికంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకే సంఘటనపై అనేక పోలీసు స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేసి ఇప్పటికే అక్రమంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలను జైలు పాలు చేశారు. కేవలం ప్రతిపక్షంపై కక్షసాధింపు కోసం మాత్రమే చట్టాలను అక్రమంగా ఉపయోగిస్తున్నారు. నష్టపోయిన బాధితులు స్థానిక పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా వారి సమస్యలకు పరిష్కారం దక్కడం లేదు. జీరో ఎఫ్ఐఆర్ ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన చట్టపరమైన సాధనం. కాని ప్రస్తుతం అది జీరో న్యాయం.. జీరో నమ్మకం అన్న పరిస్థితి తెచ్చిందని పలువురు బాధితులు వాపోతున్నారు. కొందరు పోలీసుల అంతులేని నిర్లక్ష్యం జీరో ఎఫ్ఐఆర్ను వెక్కిరిస్తోంది. బాధితులకు సత్వర న్యాయం అందాలనే లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. మా పరిధి కాదంటూ పక్కకు తప్పుకునే ఉదాసీనతకు జీరో ఎఫ్ఐఆర్ పేపరు పులిగా మాత్రమే మిగిలిపోతోంది. వేగవంతంగా బాధితులకు దక్కాల్సిన న్యాయం నెలల తరబడి నిరీక్షణలకే పరిమితమవుతోంది. ఇలా జీరో ఎఫ్ఐఆర్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, అమలు చేయాల్సిన పోలీసు అధికారులు పట్టించుకోక బాధితులను జీరోలను చేస్తోంది. నరసరావుపేటకు చెందిన ఓ మహిళా న్యాయవాది తన కుమార్తెతో కలిసి స్కూటీపై వెళుతుండగా మల్లమ్మ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానిక వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని, టూటౌన్ పరిధి అని సలహా ఇచ్చారు. వెంటనే టూటౌన్కు పీఎస్కు సమచారమివ్వగా... వారు స్పందిచలేదు. దీంతో సదరు న్యాయవాది ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఇదేనా జీరో ఎఫ్ఐఆర్ అంటే అని నిలదీశారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ముంపు పొలాలు పరిశీలన కొల్లిపర: మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన అధికారి బి.రవీంద్రబాబు సోమవారం పరిశీలించారు. ఎస్పీని కలసిన పీఎస్ఐలు నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని స్టేషన్లలో శిక్షణ పొందుతున్న పీఎస్ఐలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఘనంగా చండీ హోమం నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ శ్రీవెంక టేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం చండీహోమం నిర్వహించారు.పిడుగురాళ్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద కుంకుమ పూజ నిర్వహిస్తున్న మహిళలు సత్రశాల దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులు పెదమక్కెనలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో సరస్వతీదేవిగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో బాలచాముండేశ్వరీదేవి జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి భక్త జనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయినిగా సరస్వతీదేవిగా భక్తులకు అమ్మవారు సోమవారం దర్శనమిచ్చారు. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో బాలచాముండేశ్వరి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవి ఖడ్గమాల, లలితా సహస్ర నామార్చన, శ్రీచక్రార్చన తదితర పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని పలు ఆలయాలలో కూడా సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులను కటాక్షించారు. – అమరావతి/ పిడుగురాళ్ల/రెంటచింతల/ సత్తెనపల్లి7 -
జలదిగ్బంధంలో తండాలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 5,92,610 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 5,69,340 క్యూసెక్కులు 16 గేట్లను 5 మీటర్ల మేర పైకెత్తి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని వదలడంతో కృష్ణానదికి వరద ఎక్కువైంది. కంచుబోడు, జడపల్లి తండాలు జల దిగ్భందంలో ఉన్నాయి. తాడువాయిలో పత్తి పంటలలో నీటినిల్వ యథాతథంగా ఉంది. చేపలు పట్టే వారు కూడా తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని, తాము చెప్పే వరకు నదిలో పడవలు, బల్లకట్టు వంటి సాధనాలను నడపరాదని అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, తహసీల్దారు ఎస్.చంద్రశేఖర్లు హెచ్చరికలు జారీ చేశారు. దాచేపల్లి: మండలంలోని రామాపురం మత్స్యకారుల కాలనీని వరద నీరు వీడలేదు. సోమవారం కూడా కాలనీతోపాటుగా చుట్టు పక్కల వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. కృష్ణానదిలో వరద నీరు పెరగటంతో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద ఉద్ధృతి ఇంకా తగ్గకపోవటంతో అక్కడే ఉన్నారు. పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పంటపొలాలు నీట మునిగాయి. పత్తి పంట మునగటంతో పూత, పిందెలు రాలిపోయాయి. మిరప మొక్కలు ఉరకెత్తాయి. తహసీల్దార్ కె. శ్రీనివాసయాదవ్ పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. -
పల్లెల్లో వైద్యంపై సమ్మెట
సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యుల సమస్యలు నయం కాని దీర్ఘకాలిక వ్యాధుల్లా మారాయి. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతోపాటు ఓపీ సేవలకు స్వస్తి పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల విషయంలో ప్రభుత్వ వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా వైద్యులు సోమవారం సమ్మెలోకి దిగారు. మరోవైపు సీజనల్ వ్యాధులు పట్టిపీడిస్తున్న తరుణంలో వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. జిల్లాలో 39 పీహెచ్సీలు, 26 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. పీహెచ్సీల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్లు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్ క్లినిక్లకు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినిక్లు 15 శాతానికి, నాన్ క్లినిక్లు 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినిక్ల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్లుగా ఏపీపీహెచ్సీడీఏ చెబుతోంది. సీహెచ్సీలో పని చేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్న్గా ప్రమోషన్ ఇస్తుంటే... 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నా పదోన్నతులు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు రావడం లేదని వారు వాపోయారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఉన్న క్యాడర్లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి పల్లె జనం విష జ్వరంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడ్డారు. జేబులో డబ్బులు ఉంటే ఆర్ఎంపీ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో జ్వరం కేసులు పెరిగాయి. ఇలాంటి తరుణంలో వైద్యుల సమ్మె పేద రోగులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 39 ఒక కేంద్రంలో కనీస వైద్యులు : 02 మొత్తం పని చేస్తున్న వైద్యులు : 110 లభించే మందుల రకాలు : 174 నిత్యం ఓపీ రోగులు: సగటున 40–50 మంది జిల్లాలో పీహెచ్సీల వివరాలు అత్యవసర సేవలకు ఇబ్బంది లేదు జిల్లాలోని పీహెచ్సీలో వైద్యులు ఓపీ సేవలు మాత్రమే నిలిపివేశారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓపీ సేవలకు పీహెచ్సీలో మిగిలిన సిబ్బంది ఉంటారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో చర్చలు జరుపుతోంది. పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్లలేదు. రెండు రోజుల్లో అతా తెలుస్తుంది. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పల్నాడు -
ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదని..
పల్నాడు జిల్లా: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి బతకాలనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించకపోవటంతో వేర్వేరు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోడె గోపి(20), గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన ప్రియాంక (20) గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.కానీ కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు. దీనిని వారి పెద్దలు అంగీకరించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి.. శనివారం సాయంత్రం పేరేచర్ల సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక కూడా ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యువతి తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో.. గోపి కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని కూడా దమ్మాలపాడుకు తీసుకువచ్చారు. ఇద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు. -
చతికిల పడిన మార్కెట్ కమిటీలు
● గుంటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఆగస్టు నాటికి 29.58 శాతంతో రూ.34.02 కోట్లు సాధించారు. ● తెనాలి మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 35.06 శాతంతో రూ.2.68 కోట్లు వసూలు చేసింది. ● పొన్నూరు మార్కెట్ కమిటీ రూ.8.38 కోట్లు కాగా, 32.66 శాతంతో రూ.2.74 కోట్లు. ● దుగ్గిరాల మార్కెట్ కమిటీ రూ.3.75 కోట్లకు 34.67 శాతంతో రూ.1.30 కోట్లు. ● తాడికొండ మార్కెట్ కమిటీ రూ.2.17 కోట్లకు కేవలం 3.27 శాతంతో రూ.7 లక్షలు. ● మంగళగిరి మార్కెట్ కమిటీ రూ.3.03 కోట్లకు 24.72 శాతంతో రూ.75 లక్షలు. ● ఫిరంగిపురం మార్కెట్ కమిటీ రూ.1.88 కోట్లకు 15.73 శాతంతో రూ.30 లక్షలు. ● ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ రూ.4.45 కోట్లకు 28.41 శాతంతో రూ.1.26 కోట్లు వసూలు చేశాయి. ఫీజు వసూళ్లలో మందగమనం జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీల్లో రాబడి అంతంత మాత్రం ఈ ఏడాది లక్ష్యం రూ.146.31 కోట్లు.. ఆగస్టు చివరి నాటికి వసూలైంది రూ.43.12 కోట్లు -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ప్రభుత్వ భూమిపై కూటమి నేతల కన్ను అమరావతి: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి శనివారం సుమారు ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేశారు. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుంది. ఆదివాంర సాయంత్రం ఆరు గంటలకు స్థానిక అమరేశ్వర ఘాట్లో సుమారు 11 అడుగుల మేర నీటిమట్టం పెరిగినట్లు సమాచారం. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిలోని అమరేశ్వర ఘాట్, ధ్యానబుధ్ద ఘాట్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణానదికి అటు వైపున ఉన్న లంక గ్రామాల ప్రజలను, పశువులు, జీవాలను అవసరమైతే అమరావతి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి– విజయవాడ రోడ్డులోని పెద మద్దూరు గ్రామం వద్ద వాగు చప్టాపై సుమారు మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి 6,09,916 క్యూసెక్కులు విడుదల చేయడంతో గిరిజన తండాలైన జడపల్లి, కంచుబోడు తండాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు తండాల మధ్యలో ఉన్న కొండకోయ వాగుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తండాల ప్రజలు జల దిగ్భందంలో చిక్కుకున్నారు. తండాల నుంచి ఎవ్వరూ ప్రయాణించవద్దంటూ రెవెన్యూ, పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో కృష్ణానదీ పరివాహక గ్రామాలలో వేసిన పత్తి పంటలు నీట మునిగాయి. కృష్ణానదికి వరద పోటెత్తడంతో నిత్యం నదిపై నుంచి అవతలి ఒడ్డుకు, ఇవతలి ఒడ్డుకు తిరిగే ప్రయాణ సాధనాలు నిలచిపోయాయి. తహసీల్దార్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ నదీ తీర ప్రాంతంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని చెప్పారు. నదిలోకి ఎవ్వరూ వెళ్లకుండా 24 గంటలు కనిపెట్టుకునే విధంగా షిఫ్ట్ సిస్టంలో వీఆర్వో, వీఆర్యేలను కాపాల ఉంచామని తెలిపారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గే వరకు నదిపై పడవలు వేస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, నదిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు. ఎగువ నుంచి ఆరు లక్షల క్యూసెక్కులు విడుదల గంటగంటకు పెరుగుతున్న వరద అప్రమత్తమైన అధికారులు ఘాట్ల వద్ద పోలీసుల భద్రత ఆందోళనలో లంక గ్రామాల ప్రజలు ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో 20 ఎకరాల భూమిని చదును చేసిన వైనం -
ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త!
సత్తెనపల్లి: జిల్లాలో దసరా పర్వదినం సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు పది రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపధ్యంలో సెలవులకు ఇంట్లో అందరూ విహార యాత్రలు, బంధువుల ఇళ్లు, స్వస్థలాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించడానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో కొందరు ఇంటి భద్రత విషయమై ఆలోచన చేయరు. సాధారణ రోజులతో పోలిస్తే దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏడాదిలో జరిగే దొంగతనాల్లో 30 శాతం ఈ సమయాల్లోనే చోటు చేసుకుంటున్నాయని ప్రాథమిక అంచనా. దసరా సెలవుల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పోలీసుల సూచనలు ఇవే.. -
ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో : వృద్ధుడు మృతి
ఒకరికి తీవ్ర, నలుగురికి స్వల్పగాయాలు ఫిరంగిపురం: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలైన ఘటన శనివారం అర్థరాత్రి ఫిరంగిపురం శివారులో గుంటూరు – కర్నూలు రాష్ట్ర రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేరికపూడి గ్రామానికి చెందిన ఆరుగురు భక్తులు ఆమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారి దేవాలయంలో భజన కార్యక్రమానికి వెళ్లి.. ఆటోలో తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో ఫిరంగిపురం శివారులోని ఓ హోటల్ ముందు ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో దానిలో ప్రయాణిస్తున్న ఆర్.రామకృష్ణనాయక్(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కె.నాగేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా డి.ధనలక్ష్మి, జి.అంజమ్మ, జి.లక్ష్మి, కె.వెంకట సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నరసరావుపేట గవర్నమెంటు వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్
నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు నరసరావుపేట: కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్డు ఇంజినీర్స్, సర్వేయర్స్, అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏపీ (క్లెసా–ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో క్లెసా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు చాప్టర్ నూతన కమిటీ ఆవిష్కరణకు గౌరవ చైర్మన్ వేల్పుల రాము, చైర్మన్ ముని శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కొమ్మసాని కమలాకరరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్.ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రేజేటి సతీష్కుమార్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ చైర్మన్గా కె.కమలాకరరెడ్డి, చైర్మన్గా ఎం.మురళీకృష్ణ, ప్రెసిడెంట్గా ఎస్.లక్ష్మీకాంత్, కోశాధికారిగా డి.రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా మీసా శ్రీనివాసరావు, బి.నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ కృపానందం, సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల రామాంజనేయులు, తోట సాంబశివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.వెంకటనారాయణరావు, ఈసీ సభ్యులుగా పి.నిర్మల్కుమార్, డీవీ కృష్ణారావు, పి.శ్యాంప్రసాద్, వి.శ్రీనివాసరావు, నుసి నాగఫణింద్రారెడ్డి, పి.కోటిరెడ్డి, అమర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు సిరివేరి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సంఘం సంక్షేమం, టెక్నికల్ సెమినార్లు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల ఇంజినీర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంజినీర్స్ వృత్తిలో ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించారు. -
రంగస్థలంపై మరో ‘చింతామణి’
ఆకట్టుకున్న ‘వీణా అవార్డ్స్’ ప్రదర్శనలు తెనాలి: సుదీర్ఘరాగం.. హోరెత్తే సంగీతం.. అర్థం కాని పద్యం... తెలుగువారికే సొంతమైన పద్యనాటకంపై సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఒకప్పుడు పామరులను సైతం ఉర్రూతలూగించిన పద్యనాటకం, రానురాను ఆదరణ కోల్పోతుండటానికి ఇదే కారణం. భాష, భావం అర్థంకాని పద్యగానంపై మక్కువ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకులను కూర్చోబెట్టింది. కల్పిత కథో, చారిత్రక ఆధారాలున్నాయో తెలీదుగాని, బిల్వమంగళుడు, చింతామణి పేర్లతో ప్రధాన పాత్రల చుట్టూ శారదా ప్రసన్న అల్లిన నాటకాన్ని చందాల కేశవదాసు కళారిషత్, మధిర వారు ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పాత్రల మధ్య సంభాషణలు సందర్భోచితంగా వచ్చే పద్యాలు స్పష్టంగా వినిపిస్తూ, హృద్యమైన గానాలాపనతో నాటకం నడిచింది. చాలాకాలానికి ప్రేక్షకులు చక్కటి పద్యనాటకాన్ని ఆస్వాదించారు. ప్రధాన పాత్రల్లో చిలువేరు శాంతయ్య, బి.విజయరాణి నటించారు. ఇతర పాత్రల్లో సరిత, జి.శివకుమారి, ఎన్.సాంబశివారెడ్డి, నిభానుపూడి సుబ్బరాజు నటించారు. సంగీతం సీహెచ్ నాగేశ్వరరావు. ●తదుపరి మిర్యాలగూడ సాంస్కృతిక సమాఖ్య, మిర్యాలగూడవారి ‘బ్రహ్మరథం’ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. బ్రహ్మహత్యాపాతకానికి భయపడి ఇంద్రుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇంద్రపీఠం ఎక్కిన నహుషుడుకు పదవీ వ్యామోహంతో చేసిన అరాచకాలకు శాపానికి గురై, పశ్చాత్తాపానికి లోనైన ఇతివృత్తమిది. సూలూరి శివసుబ్రహ్మణ్యం రచనకు తడికమళ్ల రామచంద్రరావు దర్శకత్వం వహించారు. తదుపరి కళాంజలి, హైదరాబాద్ వారి ‘యాగం’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చివరగా హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఆచళ్ల ఉమామహేష్ మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా, కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
నేడు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచే ఐసీసీలో ఎన్నికల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇరువర్గాల ప్యానెళ్లు బరిలోకి దిగాయి. నువ్వా–నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి. ● గతంలో అధ్యక్షునిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. దాదాపు 34 ఏళ్ల పాటు ఆయన చాంబర్ ఆధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. చాలాసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్న రికార్డులను చెరిపేశారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోటీ చిచ్చు రేపింది. దీంతో గతేడాది అధ్యక్ష పదవికి టీడీపీ నేతలు ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. చివరకు కూటమి నేతలంతా ఒక్కటై, ఏల్చూరి వెంకటేశ్వర్లకు మద్దతుగా శిబిరాలు నిర్వహించి, అధ్యక్ష బరిలో ఉన్న టీడీపీ నేత బాలకృష్ణను ఓడించారు. ● ఆది నుంచి చాంబర్లో చురుగ్గా ఉంటున్న రంగా బాలకృష్ణను విస్మరించి, ఏల్చూరి వెంకటేశ్వర్లు వైపు కూటమి నాయకులు మొగ్గుచూపడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ● ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనూ ఆ ఇద్దరి మధ్యనే మళ్లీ పోటీ నెలకొనడం రసకందాయంగా మారింది. ఈసారైనా గెలుపొందాలని బాలకృష్ణ ప్యానెల్ తీవ్రంగా పావులు కదుపుతోంది. అలాగే రెండోసారి కూడా అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని ఏల్చూరి వెంకటేశ్వర్లు ప్యానెల్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ ఆ ఇద్దరే అధ్యక్ష పదవికి పోటీ గుంటూరు నగరంలోని జిన్నాటవర్ కూడలిలో ఉన్న ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు జరుగుతాయి. సుమారు 3,200 మంది వ్యాపారులకు సభ్యత్వం ఉన్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటిస్తారు. -
ఆదర్శంగా నిలిచిన కుటుంబం
కారంచేడు: తాను చనిపోయిన తరువాత మరొకరికి చూపునివ్వాలని గ్రామానికి చెందిన యార్లగడ్డ బుల్లెయ్య నిర్ణయించుకున్నారు. ఆయన ఆగస్టు 29వ తేదీన మృతి చెందాడు. అప్పుడు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా ఆయన భార్య యార్లగడ్డ నాగేంద్రం (80) ఆదివారం ఉదయం మృతి చెందగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నిలిచి నేత్రాలను దానం చేయగా.. పెదకాకానిలోని శంకర నేత్రాలయం వారు ఆదివారం నేత్రాలను సేకరించారు. కాగా తమ తల్లి కోరిక ప్రకారం కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె అనంతలక్ష్మి కూడా నేత్రాలను దానం చేయడానికి అంగీకరించడం విశేషం. -
సెపక్ తక్రాలో జోత్స్న ప్రతిభ
చెరుకుపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు తుమ్మ వెంకట జోత్స్న ఎంపికై నట్లు ఎంఈఓ పులి లాజర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 27, 28 తేదీలలో డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఏపీ సీనియర్ సెపక్ తకరా చాంపియన్షిప్లో ప్రతిభ కనబరచి అక్టోబర్లో గోవాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. మండలంలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తుమ్మ శ్రీనివాసరెడ్డి కుమార్తె. క్రీడాకారిణి జోత్స్నను ఉపాధ్యాయులు మాదావత్ సాంబయ్య నాయక్, ఈమని సాంబశివరావు, రమేష్, కిరణ్ అభినందించారు. దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచాలి బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: దసరా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. వర్షాలకు చెరువులు, గుంతలు నిండిపోయి, నదులు, వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెలవుల్లో సరదాగా కాలక్షేపం కోసం పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, వాగులు, నదీ తీరాలు, సముద్రతీరాలకు వెళ్లి ఈతకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సూర్యలంక, వాడరేవు, రామాపురం వంటి సముద్రతీరాలకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. యాత్రికులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలన్నారు. ఎరుపు రంగు జెండాలను దాటి లోతు ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదన్నారు. ఉద్యోగులకు డీఏ ప్రకటించాలి బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డీఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు రూ.25 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు మాచర్ల రూరల్: దుర్గి మండలంలో వేర్వేరు చోట్ల ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న ఇరువురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. దుర్గి మండలంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని ద్విచక్ర వాహనంపై రాయపాటి ఆనంద్ (15) తిరిగి దుర్గి వస్తుండగా ట్రాక్టర్ను దాటేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగం ఢీ కొనటంతో రోడ్డు పై పడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. గాయపడిన ఆనంద్ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. దుర్గి మిర్చియార్డు వద్ద.. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని దుర్గి మిర్చియార్డు వద్ద చోటుచేసుకుంది. ఆత్మకూరు గ్రామంలోని నర్సరీలో పనిచేస్తున్న కొమరగిరి ఆదినారాయణ (45) మరొక వ్యక్తి ద్విచక్ర వాహనం పై మాచర్లకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న కొమరగిరి ఆదినారాయణ తలకు తీవ్రంగా గాయమై సంఘటన స్ధలంలోనే మృతిచెందాడు. వెనుక కూర్చున్న బోసురాజు కొండకు తీవ్ర గాయాలు కాగా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆదినారాయణ మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామానికి చెందినవాడు. ఈ మేరకు ఎస్ఐ సుధీర్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టు కొమ్మలు నరుకుతూ విద్యుత్ షాక్తో మృతి కారెంపూడి: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కారెంపూడిలో ఆదివారం జరిగింది. ఓ ఇంట్లో చెట్టు కొమ్మలు తొలగించే కూలి పనికి వెళ్లి చెరుకూరి వెంకట కోటయ్య (33) చెట్టు కొమ్మలు తొలగిస్తున్న క్రమంలో ఒక కొమ్మ 11 కేవి విద్యుత్తు లైన్పై పడడంతో తీగ తెగి మీదపడి మృత్యవాత పడ్డాడు. వెంకట కోటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో ఇందిరానగర్ కాలనీలో విషాధం అలుముకుంది. -
విజయ సిద్ధిని కాంక్షిస్తూ చండీదేవికి పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీచండీదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దసరా ఉత్సవాలలో ఎంతో విశేషమైన చండీదేవి అలంకారం కావడంతో అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆదివారం నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రూ. 300, రూ.100 టికెట్ క్యూలైన్లోకి సైతం భక్తులను ఉచితంగా అనుమతించారు. దీంతో ఐదు క్యూలైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్రనవార్చన, ప్రత్యేక చండీయాగానికి ఉభయదాతల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే రద్దీ.. తెల్లవారుజాము దర్శనం ప్రారంభమైన కొద్దిసేపటికే ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు భక్తులు బారులు తీరి ఉండగా, తెల్లవారుజామున ఆరు గంటలకే వినాయకుడి గుడి వరకు క్యూలైన్లు రద్దీ పెరిగిపోయింది. ఉదయం 8 గంటలకు సీతమ్మ వారి పాదాలు, 9 గంటలకు వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. గంట గంటకూ భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో అటు పోలీస్ కమిషనర్, కలెక్టర్, దుర్గగుడి ఈవోలు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ వారికి త్వరత్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైన ఆలయానికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో ఘాట్రోడ్డు మీదగా కొండపైకి భక్తులెవరినీ దర్శనానికి అనుమతించలేదు. అయితే సేవా బృంద సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారుల సిఫార్సులతో కొండపైకి చేరుకుంటున్న భక్తులు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలిగోపురం వద్ద గుంపులు గుంపులుగా చేరి దర్శనానికి పంపాలనడంతో భక్తులు, పోలీసుల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. కానుకగా రూ. 10లక్షల బంగారు ఆభరణాలు.. మహారాష్ట్రకు కోల్హాపూర్ ఎంపీ శ్రీకాంత్ షిండే రూ. 3.5లక్షల విలువైన బంగారు హారం, హైదరాబాద్కు చెందిన సీఎం రాజేష్, ప్రకృతి దంపతులు రూ. 6.5లక్షల విలువైన బంగారపు పట్టీలను ఈవో శీనానాయక్కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గొల్లపూడికి చెందిన శ్రీమంజూష అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని అందించారు. దుర్గమ్మ సేవలో సీఎస్ విజయానంద్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చండీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయానంద్కు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025భక్తిశ్రద్ధలతో శ్రీ దేవి శరన్నవరాత్య్రుత్సవాలు రెంటచింతలలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన బతకమ్మ వేడుకల్లో పాల్గొన్న భక్తులులంకెలకూరపాడులో శ్రీ మహాచండి అలంకారంలో అమ్మవారు నరసరావుపేటలో ధనలక్ష్మి అలంకారంలో శారదాంబ అమ్మవారుమంగళగౌరీదేవి అలంకారంలో బాలచాముండేశ్వరీదేవి జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో ఆదివారం బాల చాముండేశ్వరి అమ్మవారిని మంగళగౌరీదేవిగా అలంకరించారు. అమ్మవారికి సహస్ర కుంకుమా ర్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. –అమరావతి/రెంటచింతల/ముప్పాళ్ల/నరసరావుపేట ఈస్ట్7అద్దంకి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం 35 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అద్దంకి మునిసిపల్ కార్యాలయంలో పంపిణీ చేశారు. బాపట్లటౌన్:బాపట్లలోని సినియా థియేటర్లో ఘంటసాల బయోపిక్ ప్రివ్యూ అక్టోబర్లో ప్రదర్శించనున్నట్లు దర్శక, నిర్మాత రామారావు తెలిపా రు. ప్రివ్యూ కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు.నాదెండ్ల: సాతులూరు రెడ్డి పేరంటాలమ్మ తల్లి ఆలయానికి యల్లమంద గ్రామానికి చెందిన యర్రమాసు ఆంజనేయులు, సత్యవతి దంపతులు వెండి కిరీటాలు సమర్పించారు. -
నిరంతర అభ్యాసంతో విజయాలు సొంతం
చేబ్రోలు: చెస్ ఆటలో మనం గడిపే ప్రతి క్షణం విలువైనదేనని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘62వ నేషనల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు’ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపితో విజ్ఞాన్ వర్సిటీ వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ ముందుగా ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ చెస్ క్రీడాకారులందరికీ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఒక గొప్ప వేదికన్నారు. నిరంతర అభ్యాసం, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. ఏడవ రౌండ్ ఫలితాలు.. జాతీయ చెస్ చాంపియన్షిప్లో ఏడో రౌండ్ ముగిసే సరికి, తొలి ఆరు బోర్డులలో నిర్ణయాత్మక ఫలితాలు రాకపోవడంతో ఆధిక్యంలో మార్పు లేకుండా నిలిచింది. ఇప్పటివరకు 6 పాయింట్లు సాధించిన పీఎస్పీబీకి చెందిన గ్రాండ్మాస్టర్స్ శశికిరణ్, అభిజిత్ గుప్తా, రైల్వేస్ ఐఎం అరోన్యక్ ఘోష్, ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిలు లీడ్ను కొనసాగించారు. వీరితో పాటు విజయాలు సాధించిన పీఎస్పీబీకి చెందిన జీఎం దీప్ సేంగుప్తా, రైల్వేస్ ఐఎం ఆయుష్ శర్మ, తమిళనాడుకు చెందిన ఐఎం హర్ష సురేష్ కూడా 6 పాయింట్ల క్లబ్లో చేరారు. -
ప్రత్యేక పీజీఆర్ఎస్లో నాలుగు అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో నాలుగు అర్జీలు స్వీకరించారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలు వారి సమస్యలకోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అధికారులు కూడా ఎప్పటి అర్జీలను అప్పుడే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏకా మురళి, వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
నరసరావుపేట: గత ప్రభుత్వంలో నిర్మాణాలను ప్రారంభించిన, పూర్తి చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే విడనాడాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కోరారు. ఈ మేరకు శనివారం లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు రోళ్ల మాధవి నేతృత్వంలో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రోళ్ల మాధవి మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలు, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశామన్నారు. ప్రైవేటీకరణ వలన పేద, మధ్యతరగతి వారికి వైద్యం, వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించిన ఘనత కేవలం నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం వినుకొండ నియోజకవర్గ లీగల్సెల్ అధ్యక్షులు, న్యాయవాది ఎం.ఎన్.ప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఎక్కడా లేని విధంగా ప్రైవేటుపరం చేయటాన్ని సామాజిక శాస్త్రవేత్తలుగా పిలవబడే న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. సంక్షేమ రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించారని, ఆ స్ఫూర్తికి విరుద్ధగా విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రైవేటీకరణపై అంత మోజు ఎందుకు? జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, న్యాయవాది చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజాఉద్యమం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రైవేటుపై అంత మోజు ఉంటే ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటుపరం చేయాలని సూచించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లికి చెందిన న్యాయవాదులు దాసరి చిట్టిబాబు, అంకాళ్ల వెంకటేశ్వర్లు, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు, నరేంద్ర, జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి న్యాయవాదులు పాల్గొన్నారు. -
కరుణించవమ్మా...
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ దేవస్థానాలలో శనివారం ప్రత్యేక అలంకరణలో అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కరుణించవమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో అమ్మవారిని లలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో ఆరవరోజు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీఖడ్గమాల, లలిత సహస్రనామార్చన, శ్రీచక్రార్చన తదితర పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసుర మర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా బోయపాలెం పార్వతీదేవి ఆలయంలో కాత్యాయని అలంకరణలో అమ్మవారు కొలువు దీరారు. ఆలయ ధర్మకర్తలు, దాతలు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. మహిళలు సామూహిక పూజల్లో పాల్గొన్నారు. – అమరావతి/ యడ్లపాడుకాత్యాయని అలంకరణలో బోయపాలెం పార్వతీదేవి కారెంపూడిలో ధనలక్ష్మీదేవిగా కొలువుదీరిన వాసవి అమ్మవారుఅమరావతిలో లలితాత్రిపుర సుందరి అలంకారంలో బాల చాముండేశ్వరీ దేవి -
కృష్ణానదిలో పెరిగిన వరద
దాచేపల్లి: కృష్ణానదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం మత్యకారుల కాలనీకి కూతవేటు దూరంలో నదిలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మత్స్యకారుల కాలనీకి కేవలం 10 అడుగుల దూరంలో వరద ప్రవహిస్తుండటం వలన వారు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల పెంచితే కాలనీలోకి వరద వచ్చే అవకాశం ఉంది. దాదాపు 50కిపైగా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. సామగ్రిని సర్దుకుని ఇళ్లు ఖాళీ చేసేందుకు ఇప్పటికే వారు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రానికి ముంపు ప్రాంతాల వారిని తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నాన్నారు. నదికి సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఇప్పటికే వరద నీరు ప్రవహిస్తోంది. రైతులకు నష్టం వాటిల్లింది. -
కార్యకర్తలకు డిజిటల్ బుక్తో న్యాయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకి భవిష్యత్లో న్యాయం చేసేందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ను ప్రవేశపెట్టారని పార్టీ జిల్లా నేతలు పేర్కొన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన యాప్ ఆవిష్కరణలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. వేధింపుల నుంచి కార్యకర్తలకు అభయం మాజీ మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. రోజుల తరబడి జైళ్లపాలు చేస్తున్నారన్నారు. వీటిని సాక్ష్యాలతో డిజిటల్ బుక్లో నమోదు చేసుకునే అవకాశం పార్టీ అధ్యక్షులు కల్పించారన్నారు. డిజిటల్ బుక్ కార్యకర్తలకి ఓ పెద్ద అభయంగా అభివర్ణించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ బుక్ యాప్ ఆవిష్కరించటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పేరిట అరాచకం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ రెడ్బుక్ పేరుతో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం ఏపీలో కూటమి నాయకులు వల్ల వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులు, కక్షతో వేధించటమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇది ఏమాత్రం మంచి సంస్కృతి కాదని పేర్కొన్నారు. డిజిటల్ బుక్తో కార్యకర్తలు, సానుభూతిపరులకు ఒక భరోసా కలుగుతుందన్నారు. కార్యకర్తల కష్టాలకు గుర్తింపు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బుక్ అంటే కార్యకర్తలు పడే కష్టాలకు ఒక గుర్తింపు కోసం మెమోరీ కార్డులాంటిదని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఇది రెడ్ బుక్ లాంటిది కాదని, డిజిటల్ లైబ్రరీలా పనిచేస్తుందన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా ఇబ్బందులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు జగనన్న ఇచ్చే నమ్మకం, రక్షణగా అభివర్ణించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం స్వామి, విద్యార్థి, యువత విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా కార్యదర్శి సుజాతాపాల్, అంగన్వాడీ విభాగ జిల్లా కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రొంపిచర్ల మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ఈ యాప్లోని క్యూఆర్ కోడ్ను స్మార్టు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పేరు, వివరాలు నమోదు చేయాలన్నారు., జరిగిన అన్యాయానికి సంబంధించి ఫొటోలతో అప్లోడ్ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి జరిగిన అన్యాయం, గొడవలు, కొట్లాటలు, వేధింపులు మొత్తం వివరాలు నమోదు చేయాలని కోరారు. స్మార్టుఫోన్ లేని వారి కోసం ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారన్నారు. ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి ఆపరేటర్కు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి వివరాలు నమోదు చేయించాలని సూచించారు. -
సాగర్ కాల్వలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కారెంపూడి: సాగర్ కుడి కాల్వలో సరదాగా ఈత కొడదామని యత్నించిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మునిగి మృతి చెందిన ఘటన స్థానిక వినుకొండ రోడ్డు బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ సత్తార్, ఖాదర్ వలి, నాగుల్ మీరాలు పదవ తరగతి చదువుతున్నారు. దసరా సెలవలు కావడంతో సయ్యద్ సత్తార్ ఇద్దరు మిత్రులతో కలసి కారెంపూడిలో ఉంటున్న పెద్దమ్మ జహీరా ఇంటికి వచ్చారు. బట్టలు ఉతికేందుకు వెళ్తున్న పెద్దమ్మ జహీరాతో పాటు వారు కూడా సాగర్ కాల్వ వద్దకు వచ్చారు. ఈత కొడదామని సరదా పడి ముగ్గురు కాల్వలో దిగారు. ప్రవాహ వేగానికి ముగ్గురు మునిగి కొట్టుకుపోతుండగా జహీరా పెద్ద పెట్టున ఏడుస్తూ కేకలు వేయడంతో ఆ సమీపంలో ఉన్న స్థానికులు గమనించి ఇద్దర్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సయ్యద్ సత్తార్ను ఒడ్డుకు చేర్చేసరికే సత్తార్ (15) ప్రాణాలు విడిచాడు, ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు బంధువులు తల్లడిల్లిపోతున్నారు. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ రహీమ్ వ్యవసాయదారుడు, ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు సత్తార్ కారెంపూడిలో ఉన్న తన అక్క దగ్గరకు సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా తనువు చాలించడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. గురజాలలో పోస్టుమార్టం అనంతరం సయ్యద్ సత్తార్ మృతదేహాన్ని ఎస్ఐ వాసు బంధువులకు అప్పగించారు. వారిలో ఒకరు మృతి, ఇద్దరిని కాపాడిన స్థానికులు -
తగ్గిన ధరల ప్రకారం మందులు విక్రయించాలి
నరసరావుపేట: ఇటీవల తగ్గించిన జీఎస్టీ ఫలితాలు సామాన్య వినియోగదారులకు అందేవిధంగా తగ్గిన రేట్ల ప్రకారం మందుల అమ్మకాలు జరపాలని, అలా తగ్గించకుండా విక్రయిస్తే చట్టబద్ధంగా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ డి.సునీత హెచ్చరించారు. ఎవరైనా వినియోగదారులు తెలిసీ తెలియక ఏదైనా అడిగితే ఓపిగ్గా సమాధానం చెప్పివారికి తగ్గిన రేట్ల గురించి వివరంగా చెప్పాలని అన్నారు. శనివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలంలో ఔషధ తనిఖీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి మందుల వర్తకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల మెడికల్ వ్యాపారులను ఉద్దేశించి అధికారులు మాట్లాడారు. వాల్పోస్టర్లు ఆవిష్కరించి ప్రతి మెడికల్ షాప్లో వినియోగదారునికి స్పష్టంగా కనపడే విధంగా అతికించాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, ఆ విధంగా మెడికల్ షాప్ యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ వేణుమాధవరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు, కోశాధికారి ఎ.కోటేశ్వరరావు, జిల్లాలోని అన్ని పట్టణాల మందుల షాపుల యజమానులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సత్తెనపల్లి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరుతో పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించేందుకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళుతుండగా సత్తెనపల్లిలో పోలీసులు అడ్డుకుని, విద్యార్థులతో వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమన్నారు. దీనిలో భాగంగా తమపై నమోదు చేసిన అక్రమ కేసులో విచారణ నిమిత్తం శనివారం సత్తెనపల్లి టౌన్ పీఎస్కు హాజరయ్యామన్నారు. పార్టీ గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు కళ్ళం హరికృష్ణారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నవీన్, గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సీహెచ్ వినోద్, యువజన విభాగం గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సుభాని, శశిధర్, విద్యార్థి విభాగం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పి.సందీప్, విద్యార్ధి విభాగం నాయకుడు రవీంధ్ర ఉన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య -
విచారణకు హాజరైన పీఆర్కే సోదరులు
మాచర్ల : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామానికి సంబంధించిన బోదిలవీడు సమీపంలో కొంతకాలం క్రితం జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో విచారణ జరిపేందుకు మాచర్ల రూరల్ పోలీసులు శనివారం హాజరు కావాలని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రూరల్ పోలీసు స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. టీడీపీ నేతల హత్య కేసులో అంతర్గత ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ రెండు హత్యలు జరిగినా వీరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. శనివారం ఉదయం10.30 గంటల నుంచి రాత్రి వరకు పోలీసులు విచారిస్తున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్, రూరల్ సీఐ ఎన్.షఫితోపాటు ఇతర అధికారులు సుదీర్ఘంగా లాయర్ల సమక్షంలో విచారించారు. పీఆర్కే, పీవీఆర్, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, రామలక్ష్మణరెడ్డి, న్యాయవాదులు బి.నాగిరెడ్డి, సీహెచ్ నాగిరెడ్డి, గుంజా ప్రసాద్, రామ్నాయక్తో కలిసి వారు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తరువాత విచారణ ప్రారంభించి అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఆ సమయంలో మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ ముందు అర్బన్ సీఐ ప్రభాకర్, కారంపూడి సీఐ శ్రీనివాసరావులతోపాటు పలువురు పోలీసు అధికారులు వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు ఒకేచోట చేరకుండా వెళ్లిపోవాలని చెప్పారు. పూర్తిగా బస్టాండ్కు వెళ్లే రోడ్డు నుంచి పీఆర్కే ఇంటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు జంట హత్య కేసు విషయంలో తనకు, తన సోదరుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా కేసు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పది గంటల విచారణ అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, పోలీసులకు విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో తాను, తన సోదరుడు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ పోలీసుల విచారణకు సంబంధించి సహకరించామన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. రానున్న రోజుల్లో కూడా పోలీసులు విచారణకు పిలిస్తే తాము సహకరిస్తామన్నారు. కేసుతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసు కావడంతో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పలేదు. -
ఆట్యా–పాట్యా ఓవరాల్ చాంపియన్ పల్నాడు
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రఽథమ స్థానంలో నిలిచిన పల్నాడు బాలికల జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రఽథమ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా బాలుర జట్టు నకరికల్లు: ఆట్యా–పాట్యా రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు ఓవరాల్ చాంపియన్షిప్గా నిలిచాయి. నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఽఆధ్వర్యాన రెండురోజుల పాటు నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్షిప్–2025 పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. వర్షంలోనూ ఉత్కంఠభరితంగా మ్యాచ్లు సాగాయి. ఎస్ఐ కె.సతీష్ చేతుల మీదుగా విజేతలకు పతకాలు, మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విజేతల వివరాలు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 540 మంది క్రీడాకారులు తలపడ్డ ఆట్యా–పాట్యా పోటీలో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో కర్నూలు, తృతీయస్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో నెల్లూరు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో వెస్ట్ గోదావరి, తృతీయస్థానంలో నెల్లూరు, నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా జట్లు నిలిచాయి. అసోసియేషన్, గ్రామస్తులు, క్రీడాభిమానుల సహకారంతో పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణిని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 డి.బ్రహ్మేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాలాది శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు చింతా పుల్లయ్య, నిడికొండ జానకిరామయ్య, చినబాబు, పెదబాబు, ప్రధానోపాధ్యాయులు కె.రంగాదేవి, కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సిరివర్షిణీ..శిరసా నమామి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం పైగా శ్రీమహాలక్ష్మీదేవి అలంకారం కావడంతో తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటలకే సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్లు క్యూలైన్లలో దేవస్థాన ఘాట్రోడ్డులోని టోల్గేట్ వరకు చేరింది. మారిన వీఐపీ టైం స్లాట్ మేరకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మిగిలిన సమయంలో అంతరాలయ గేట్లకు ఆలయ అధికారులు తాళాలు వేశా రు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో వచ్చిన వీఐపీలకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వీఐపీలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు హాజరయ్యారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు. రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్లో సైతం గంటన్నరకు పైగా సమ యం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు దుర్గమ్మకు కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్, స్థానాచార్యులు ఫణీంద్రస్వామిలతో పాటు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పట్టువస్త్రాలతో దుర్గగుడికి విచ్చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. 90 వేల మంది దర్శనం.. మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను శుక్రవా రం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 90 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 5వ రోజు దేవస్థానానికి రూ.28.21లక్షల ఆదాయం సమకూరిందని చెప్పా రు. లడ్డూల ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.86 లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ ప్యాక్ విక్రయం ద్వారా రూ. 23.58లక్షలు, ఆర్జిత సేవా, తలనీలాల టికెట్ల విక్రయంద్వారా రూ.1.75 లక్షలకుపైగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. అన్న ప్రసాదాన్ని 23,656 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. ఉత్సాహం.. ఆనందం..సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో ఆది దంపతులైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారులు విన్యాసాలతో నగరోత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భక్తులు ఆదిదంపతుల నగరోత్సవంలో పాల్గొని తరించారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆరో రోజున దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరు వైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చిరు మందహాసంతో వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేతపట్టుకుని దర్శనమిస్తారు. నేటి అలంకారం -
ప్రకృతి వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి బెల్లంకొండ: ప్రకృతి వ్యవసాయ విధానంతో రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. శుక్రవారం మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అజయ్ ఇంటెలికాప్ మహారాష్ట్ర ఎన్జీవో బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న క్షేత్రాలకు డీపీఎం అమలకుమారి వారిని తీసుకువెళ్లి వివరించారు. రైతులు పండిస్తున్న పలు పంటల సాగు వివరాలు, కషాయాల వినియోగం, బీజామృతం వంటి ప్రకృతి పద్ధతులను వివరించారు. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లో ఘన, ద్రవ జీవామృతాల తయారీని పరిశీలించారు. నాగిరెడ్డిపాలెం గ్రామంలో మహిళా రైతు మహాలక్ష్మి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న వరి పొలాన్ని పరిశీలించి, సాధారణ సాగు పొలంలో కంటే ఎక్కువ పిలకలు రావడాన్ని గమనించారు. మహిళా సంఘాలతో సమావేశమై రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు సేవ కేంద్రాల్లో పీఎండిఎస్ కిట్లు, పీజీఎస్ సర్టిఫికేషన్, మహిళా సంఘాల పాత్ర, ప్రాముఖ్యతను తెలియజేశారు. చండ్రాజుపాలెంలో మహిళా రైతు రొయ్యల మంగమ్మ పొలంలో ఏటీఎం మోడల్ లను సందర్శించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మీ సేవలో గవర్నర్లు..
మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్లు సాదరంగా స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. వేద ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలు, చిత్రపటాన్ని గవర్నర్కు అందజేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులను ఈవో శీనానాయక్ స్వాగతం పలుకగా.. అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వీరారెడ్డి నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన వి.వీరారెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా (కేంద్ర కార్యాలయం) నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాల్య వివాహంలో 14 మందిపై కేసు నమోదు సత్తెనపల్లి: బాల్యవివాహంలో 14 మందిపై సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 3న పట్టణంలోని దోభీఘాట్లో బలుసుపాటి గోపి తన సొంత సోదరి కుమార్తె అయిన ఆరేటి అనుఖ్యలకు బాల్య వివాహం జరిగిందని నరసరావుపేట చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థకు ఫిర్యాదు వచ్చినట్లు ఈ నెల 23న చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థ ప్రతినిధి యర్రసాని ప్రశాంత్కుమార్ పట్టణంలోని 4వ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గరికె కల్పనకు తెలియజేశారు. దీనిపై గరికె కల్పన విచారణ జరిపి వాస్తవం అని తేలడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం చేసుకున్న ఇరువురితోపాటు ఇరువురు తల్లిదండ్రులు, బంధువులు, వివాహం జరిపిన పూజారి, కల్యాణ మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్ ఇలా మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం క్రింద పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. పీహెచ్సీలో వ్యక్తి మృతిపై విచారణ అచ్చంపేట: స్థానిక పీహెచ్సీలో ఈనెల 21న సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు శుక్రవారం అడిషనల్ డీఎంహెచ్ ఒ పద్మావతి విచారణ చేపట్టారు. మృతుడు షేక్ నాగుల్మీరా బంధువులను పిలిపించి విచారించారు. నాగుల్మీరా సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల మృతి చెందాడా, మరే కారణాల వల్ల మృతి చెందాడా అనే విషయాలపై ఆరా తీశారు. తుది నివేదికను తన ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అచ్చంపేటకు చెందిన సామాజిక కార్యకర్త షేక్ కమల్సైదా ఆధ్వర్యంలో మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, పరిహారాన్ని అందించాలని కోరుతూ అడిషనల్ డీఎంహెచ్ఓ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. పీహెచ్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, 108 అత్యవసరం వాహనం ఒక్క అచ్చంపేటకు మాత్రమే పరిమితమవుతుందని, 108 సేవలను మండలం మొత్తానికి విస్తరింపజేయాలని కోరారు. -
జిల్లా జీఎస్టీ అధికారి జాన్ స్టీవెన్సన్
జీఎస్టీ రెండు స్లాబులతో ప్రజలకు మేలు నరసరావుపేట: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సంస్కరణలలో గతంలో ఉన్న స్లాబులన్నింటినీ మార్చి ప్రస్తుతం 5, 12 శాతం స్లాబులను అమల్లోకి తీసుకొచ్చాయని ఉమ్మడి గుంటూరు జిల్లా వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్–2 జాన్ స్టీవెన్సన్ పేర్కొన్నారు. శుక్రవారం వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలియచేశారు. గతంలో ఉన్న ఐదుశాతం, 12, 18శాతం పన్నులు ఉన్న వస్తువులు జీరో స్థాయికి తీసుకొచ్చారన్నారు. 12, 18శాతంలో ఉన్న వస్తువులను చాలావరకు ఐదు శాతానికి తీసుకురావటం జరిగిందన్నారు. దీని వలన ప్రజలకు చాలా డబ్బు ఆదా అవుతుందని, మన రాష్ట్ర పరిస్థితి గమనిస్తే ఏడాదికి రూ.8వేల కోట్లు ప్రజలకు ఆదా అవుతుందన్నారు. దీనిని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 19వరకు అంటే దసరా నుంచి దీపావళి వరకు ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. నిత్యావసరాలు, రాగి, స్టీలు, ఇత్తడి పాత్రలు, విద్యార్ధులు వాడే నోట్బుక్లు, పెన్నులు, కార్లు, కళ్లద్దాలు, మోటార్బైక్లు తదితర వస్తువులు రేట్లు తగ్గాయన్నారు. ప్రజలకు మిగిలే రూ.8వేల కోట్లతో మళ్లీ వారు కొనుగోలు చేయటం వలన ప్రభుత్వానికి ఇంకా పన్నులు లభించే అవకాశం ఉందన్నారు. దీని అమలు కోసం స్థానిక కార్యాలయంలో ఒక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశామన్నారు. షాపులు, పెద్దమాల్స్లో బోర్డులు ఏర్పాటుచేయాలని సూ చించామన్నారు. బోర్డులు ఏర్పాటుచేయని వా రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యా పారస్తులకు తమ సహకారం ఉంటుందన్నా రు. వ్యాపారులు కూడా తమకు సహకరించా లని కోరారు. నరసరావుపేట అసిస్టెంట్ కమిషనర్లు రంగయ్య, రామారావు పాల్గొన్నారు. -
బాలకృష్ణను చీదరించుకుంటున్న ప్రజలు
సత్తెనపల్లి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలో అవమానపరిచే విధంగా మాట్లాడిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి డిమాండ్ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. డాక్టర్ సుధీర్భార్గవ్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, బాలకృష్ణ మాత్రం వైఎస్ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సైకో అంటూ పదేపదే అంటున్న బాలకృష్ణ సైకో ఇజం గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. తన ఇంట్లో జరిగిన కాల్పుల కేసు నుంచి బయటపడేందుకు బాలకృష్ణ తనకు మెంటల్ ఉందని సర్టిఫికెట్ తెచ్చుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చులకనగా మాట్లాడటం బాలకృష్ణకు తగదన్నారు. బాలకృష్ణ పిచ్చివాగుడును చూసి ప్రజలే చీదరించుకుంటున్నారన్నారు. మరోసారి ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తూల నాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుదీర్ భార్గవ్ రెడ్డి -
ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు
పిడుగురాళ్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళలు గణపవరం కోదండరామాలయంలో రూ.2 లక్షల నోట్లతో అలంకారం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని శృంగేరీ శ్రీశారదాంబ దేవాలయంలో అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మి అలంకారం గావించారు. రూ. 21.5 లక్షలు విలువైన కరెన్సీ నోట్లతో విశేష అలంకారం చేశారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్లోని శ్రీవాసి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రూ.10 లక్షల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో పార్వతి అమ్మవారిని కరెన్సీ నోట్లతో మహాలక్ష్మిగా అలంకరించారు. –చిలకలూరిపేట/వినుకొండ/బొల్లాపల్లి/పిడుగురాళ్ల కరెన్సీ నోట్ల అలంకారంలో శృంగేరీ శ్రీ శారదాంబ వినుకొండలో రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ -
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు
● దసరా నుంచి దీపావళి వరకు ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ ప్రచారం ● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలో జీఎస్టీ అమలు, అవగాహనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ రంగాలలో పన్నులు తగ్గుతాయని అన్నారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. దీని వలన కలిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా దసరా నుంచి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. జేసీ నోడల్ అధికారిగా, వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్టుమెంట్గా వ్యవహ రిస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేసి జీఎస్టీ సంస్కరణల వలన ఏఏ వస్తువులపై ధరలు తగ్గనున్నాయో వివరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగే మేలును క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎస్టీ వేడుకల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్, వాణిజ్యపన్నులశాఖ అధికారులు రంగయ్య, రామారావు, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలకు భారీ జలకళ
విజయపురిసౌత్: మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికి భారీగా వర్షం నీరు వచ్చి చేరటంతో శుక్రవారం జలకళతో కళకళలాడుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మాచర్ల పట్టణంలోని చంద్రవంకవాగు, భైరవునిపాడు, తాళ్లపల్లి చెరువులు, ఎత్తిపోతల చుట్టూ ఉన్న అన్నీ చెరువులకు నీరు అధికంగా రావటంతో ఆ నీరంతా ఎత్తిపోతలకు తరలివస్తోంది. ఎత్తిపోతల జలపాతం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న సుందరమైన నీటి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండ పర్యాటకులు ఎత్తిపోతల అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా జగన్కు క్షమాపణ చెప్పాలి
● బాలకృష్ణ వ్యాఖ్యలను తక్షణమే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి ● విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట: అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, అతను చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్టుల నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ను సైకోగాడని, చిరంజీవిని ఎవడు..నాన్సెన్స్ అంటూ గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాలకృష్ణ మాటలు రాష్ట్ర ప్రజలు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని అన్నారు. అతని మాటలు, నిల్చున్న తీరు, బాడీ లాంగ్యేజ్ గమనిస్తే నిజంగా అసెంబ్లీకి మద్యం తాగి వచ్చాడేమో అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తక్షణమే స్పందించి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ విషయాన్ని ఖండించకపోవటం దారుణమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తుపాకీ పేలిన ఘటనలో మేము కూడా రాజకీయాలు చేస్తే బాలకృష్ణ కుటుంబం ఎక్కడ ఉంటుందని అన్నారని, కనీసం ఈ విషయం కూడా అతనికి గుర్తులేకపోవటం బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వచ్చిన వారందరినీ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారని, ఇండస్ట్రీ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావాలని, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో కూడా షూటింగ్లు నిర్వహించాలని, అవసరమైతే విశాఖపట్నంలో ఫిలిం సిటీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పారన్నారు. దీనిపై సినీ హీరోలు చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్లు స్పందించి సంతోషం వ్యక్తం చేశారన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తప్పుడు మాటలు మాట్లాడారని, ఈయన మనిషి బీజేపీలో ఉన్నా మనస్సు మాత్రం ఎప్పుడూ టీడీపీలోనే ఉంటుందన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డితోపాటు చిరంజీవిని కూడా అవమానకరంగా మాట్లాడారని, దీనిపై జనసేన కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ పలుమార్లు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తన చొరవ వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ ధరల పెంపునకు జగన్మోహన్రెడ్డి అంగీకరించారని చిరంజీవి చెప్పిన విషయం మరవరాదన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాసనసభ్యులు ఎవరికై నా మెంటల్ సర్టిఫికెట్ ఉందా అంటే, అది కేవలం బాలకృష్ణకేనన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నందమూరి కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడుతూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త అతని ఓటమి కోసం పనిచేస్తారని అన్నారు. రొంపిచర్ల మండలం కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల వేణుమాధవ్, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు కోటపాటి మణీంద్రరెడ్డి, ప్రభుదాస్ నాయుడు, నియోజకవర్గ సోషల్మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి పాల్గొన్నారు. -
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని చదుర్విద పురషార్థాలు సిద్ధిస్తాయని, రోగాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్వర్క్ పిడుగురాళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో కుంకుమ పూజలు వినుకొండలో వాసవి మాత అలంకారంలో వాసవి కన్యకాపరమేశ్వరి కారంపూడిలో కాత్యాయని అలంకారంలో అంకాలమ్మ తల్లి నరసరావుపేట రెడ్డినగర్లో కాత్యాయని దేవి అలంకారంలో బతుకమ్మ -
ప్రభుత్వానికి ప్రజల బాధలు పట్టవా ?
గుంటూరుమెడికల్: నగర ప్రజలు పది రోజులుగా డయేరియాతో అల్లాడిపోతున్నా కూటమి ప్రభుత్వానికి వారి బాధలు పట్టవని వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. డయేరియా బారిన పడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం ఆమె పరామర్శించారు. వార్డులో వసతులు లేకపోవడాన్ని గమనించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పది రోజులుగా డయేరియా తగ్గుముఖం పట్టలేదంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, ఇది కూటమి ప్రభుత్వం విఫలమేనని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో డయేరియా వస్తే కేవలం మూడు రోజుల్లోనే కట్టడి చేశామని గుర్తు చేశారు. యంత్రాంగం అంతా గుంటూరుపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడామని తెలిపారు. చికిత్స పొందుతున్న వార్డుల్లో వసతులు సైతం అరకొరగా ఉన్నాయని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా రూ. 1400 కోట్ల బడ్జెట్ ఉందని, అధికారులు తలుచుకుంటే తాగునీరు అందించవచ్చని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతోందని, అందుకు నిదర్శనం పదిరోజులైనా డయేరియా గుంటూరు నగరంలో అదుపులో లేకపోవడమేనని పేర్కొన్నారు. కలరా కేసులు చాలా అరుదుగా వింటామని, గుంటూరులో 11కు పైగా కేసులు నమోదైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డయేరియా, కలరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, పెద్ద విషయంలా కనిపించడం లేదని విమర్శించారు. తురకపాలెంలో 40 మందికిపైగా చనిపోయారని, దానికి ఇప్పటి వరకు కారణాలు ప్రభుత్వం తెలియజేయలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటైజేషన్పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వారికి అమ్మేసి, సొమ్ము చేసుకోవడంలో బిజీగా కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై చర్చకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు పాల్గొన్నారు. -
డాక్టర్ జున్ను మాస్టర్కు నేషనల్ టీచర్స్ ఎక్స్లెన్స్ అవార్డు
యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ జున్నుసాహెబ్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్ టీచర్స్ ఎక్స్లెన్స్ అవార్డు–2025ను ప్రదానం చేశారు. ఒకే నెలలో మూడు అవార్డులు విద్యారంగానికి జున్ను సాహెబ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్ మదర్థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా క్రీడా పోటీలు
నకరికల్లు: రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు పల్నాడు జిల్లా నకరికల్లు వేదికై ంది. 12వ రాష్ట్రస్థాయి ఆట్యా– పాట్యా చాంపియన్షిప్ క్రీడా పోటీలు నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 540 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ క్రీడాపోటీలు ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. క్రీడాజ్యోతిని వెలిగించారు. క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. తొలిమ్యాచ్ను పల్నాడు–విజయనగరం జిల్లాల మధ్య నిర్వహించారు. రెండురోజులపాటు నిర్వహిస్తున్న పోటీలు తొలిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి ఫ్లడ్లైట్ల వెలుగుల్లో కూడా సాగాయి. ఎమ్మెల్యే కన్నా మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రాయితీలు లభిస్తాయన్నారు. క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్రీడాకారులందరూ సానుకూల దృక్పథంతో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఆట్యా–పాట్యా అసోసియేషన్ సీఈఓ ఆర్.డి.ప్రసాద్, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఆర్.శ్రీచరణ్, సామ్రాజ్యం, వి.రోహిత్ జోయెల్, ఫ్లోర్బాల్ ఏపీ అసోసియషన్ కార్యదర్శి జోసఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాలాది శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు ఝాన్సీరాణి, చింతా పుల్లయ్య, చినబాబు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, మణి, మద్దం వెంకటేశ్వర్లు, నాయకులు నాగోతు శౌరయ్య, పీఎంసి చైర్మన్ కాసా మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, యంత్రాంగం
పల్నాడు జిల్లాను సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోంది. ఏ ఇంటిలో చూసినా ఒకరిద్దరు బాధితులు కనిపిస్తున్నారు. బాధితులు ఆస్పత్రుల బాట పట్టడంతో ఒక్కసారిగా ఓపీలు పెరిగాయి. గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యం, కలుషిత తాగునీరు సరఫరా కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు. సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకరిద్దరు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలో డెంగీ, అతిసార కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతూ ప్రజల్ని భయపెడుతున్నాయి. జ్వర బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రోజు ఓపీలు సాధారణంగా 450 ఉంటాయి. వాతావరణ మార్పుల ద్వారా వస్తున్న జ్వరాల వల్ల ఓపీల సంఖ్య సుమారు 100 నుంచి 150 దాకా పెరిగాయి. వచ్చిన ఓపీలలో 40 శాతం టైఫాయిడ్, డెంగీ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం 370 ఓపీలు నమోదయ్యాయి, ఇందులో సుమారు 170 దాకా జ్వర పీడితులే ఉన్నారు. ఇలా ప్రతి ఆసుపత్రిలో ఓ వైపు సీజనల్ వ్యాధులతో నిండిపోయి ప్రమాద ఘంటికలు మోగుతుంటే ప్రభుత్వం మాత్రం మిన్నుకుండిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి, గతంలో ఇంటింటికి వైద్య, సచివాలయ సిబ్బంది వెళ్లి సర్వేలే చేసేవారు. వారికి అవసరమైన మందులు ఇంటి వద్దే అందజేసి, అవసరమైన వారికి నరసరావుపేట ఏరియా వైద్యశాలకు రెఫర్ చేసేవారు. ప్రస్తుతం అవేవి జరగడం లేదు. -
బాలకృష్ణ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: సినీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పూర్వాపరాలను మరిచిపోయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొ న్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాడు సినీ నటులు అందరూ కలిసి తెలుగు ఇండస్ట్రీ సమస్యపై వైఎస్ జగన్ ఇంటికి వస్తే వారందరినీ సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసి గౌరవించారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని బాలకృష్ణ మభ్యపెట్టి చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చూస్తే అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి గురజాల:మెడికల్ కళాశాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నీ అబద్ధాలు, తప్పుడు లెక్కలు చెప్పాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. గురజాలలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాల విషయంలో వైఎస్సా ర్ సీపీ నాయకులు, కార్యకర్తలు సెల్ఫీ చాలెంజ్లతోపాటు పలు పోరాటాలు చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ హయాంలో 28 శాతం పనులు మాత్రమే జరిగాయని పచ్చి అబద్ధమాడాడన్నారు. యరపతినేని లెక్కల్లో వీక్ అని ఆరోపించారు. లెక్కలు నేర్చుకొమ్మని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు లెక్కలు వేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2020–21లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు భూమికొనుగోలుకు రూ.15 కోట్లు, 2021–22లో రూ.37 కోట్లు, 2022–23లో రూ.87కోట్లు, 2023–24లో రూ.55కోట్లు, 2024–25లో రూ.46కోట్లు, 2025 ఏప్రియల్ వరకు రూ.10 కోట్లు అంటే సుమారుగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం జూన్ నెల నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మేము నోటిమాటలతో లెక్కలు చెప్పడం లేదని చెప్తున్నామన్నారు. 60శాతం పనులు వైఎస్సార్ సీపీ హ యాంలో పూర్తి చేశామన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేద న్నారు. యెనుముల మురళీధర్రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), కె.బుజ్జి, అన్నారావు ఉన్నారు. -
ప్రజలకు స్మార్ట్ టెన్షన్
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అస్తవ్యస్త ముద్రణతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. పురుషులను మహిళలను చేసి.. వారికి కార్డులు ఇస్తున్నారు. దీంతో పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కార్డు ఎక్కడ ఉందో తెలియక లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. సెప్టెంబర్ నెల రేషన్ అందజేత పూర్తయినా.. ఇంకా జిల్లాలో 1,43,253 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందలేదు. జిల్లాకు 6,30,347 స్మార్ట్ కార్డులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మొత్తం 6,30,347 స్మార్ట్ రేషన్ కార్డులు రాగా గురువారం నాటికి 4,89,094 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. 77.59 శాతం మాత్రమే పూర్తి చేశారు. వాస్తవానికి గత నెల 25 నుంచే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 1,43,253 మంది స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ– కేవైసీ, ఇతర సాంకేతిక సమస్యల కారణంతో కోత విధించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేసింది. చాలా వరకు స్మార్ట్ రేషన్ కార్డుల్లో అక్షరదోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేర్లు తప్పులతడకగా ఉన్నాయి. వయసులో తేడాలు, షాప్ నంబర్లు, చిరునామా, ఆడ, మగ, సచివాలయం పేర్లు సైతం తారుమారయ్యాయి. ఇక మంజూరైన కార్డులను గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కార్డులు పంపిణీ చేసేలా ఆయా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు. తొలుత సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవడంతో .. ఆ ప్రభావం మొత్తం పంపిణీపై కనిపిస్తుందని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు. బిజీగా సచివాలయ సిబ్బంది స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయాల్లోనే తీసుకోవాలని అధికారులు ముందుగా ప్రకటించడంతో కార్డుదారులు సచివాలయాలకు పరుగులు పెట్టారు. అయితే సచివాలయం సిబ్బంది వివిధ పనుల పేరుతో బిజీబిజీగా ఉంటున్నారు. మరికొన్ని గ్రామ సచివాలయాల్లో వీఆర్వో, రేషన్ డీలర్ వద్ద కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులు.. సచివాలయంలో కార్డులన్నీ ఒకచోట పడేసి లబ్ధిదారులను వెతుక్కోవాలని చెబుతున్నారు. ఒకరు కార్డు మరొకరు తీసుకెళ్లిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇంటికి వెళ్లి చూసుకున్న తర్వాత ఆ కార్డు తమది కాదని మళ్లీ సచివాలయాలకు తీసుకొస్తున్నారు. -
లిఫ్ట్ లో ఇరుక్కున్న ప్రయాణికులు
దాచేపల్లి: నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న లిఫ్ట్లో ప్రయాణికులు గురువారం ఇరుక్కుపోయారు. నడికుడి రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు నడికుడి రైల్వేస్టేషన్కి చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో ప్రయాణికులు ఇరుక్కుపోయి తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు గమనించి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఈ రైలులోనే వెళ్లాల్సి ఉంది. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వీరిని బయటకు తీసేంతవరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుని స్టేషన్లోనే ఆపేశారు. సుమారు పది నిమిషాలపాటు రైలు ఆగింది. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి వెళ్లారు. ఇటీవల కాలంలో నడికుడిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. -
పల్లెల్లో పడకేసిన
పారిశుద్ధ్య పనులు దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల ప్రాంతాల్లో గతేడాది అతిసారం ప్రబలి ప్రాణాలు వదిలారు. వందలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. నగరపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది శివారు కాలనీల్లో మురుగు సమస్యను పట్టించుకోకపోవడంతో తాగునీరు కలుషితమై అతిసారం ప్రబలింది. ప్రస్తుతం వర్షాలు అధికంగా నమోదై కాలనీల్లో మురుగు నిల్వ ఉంటోంది. రోడ్లు, ఇళ్ల మధ్య మురుగు కదలడం లేదు. దీంతో దోమల వృద్ధి పెరిగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. గతేడాది చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్న అధికార యంత్రాంగంలో చలనం లేదని ప్రజలు వాపోతున్నారు. పక్కనే ఉన్న గుంటూరులో డయేరి యా కేసులు రోజురోజుకు పెరిగి ప్రమా దకరంగా మారుతున్న తరుణంలో జిల్లాలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముంది. ఆ పరిస్థితి రాకముందే ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలలో తూతూమంత్రంగా ఫాగింగ్ యంత్రాలతో దోమల మందు పిచికారీ చేయిస్తున్నారు. మరికొన్ని పంచాయతీలలో ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురై మూలనపడ్డా యి. ఫాగింగ్ యంత్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ప్రజలకు తాగునీరు కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. తమకు తాగునీరు సరఫరా చేయడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని దాచేపల్లి నగర పంచాయతీ వాసులు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
అన్నపూర్ణాదేవిగా బాలచాముండేశ్వరిదేవి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా గురువారం బాలచాముండేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ ఉత్సవాలలో నాల్గవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తుల పూజలందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవిఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ అన్నపూర్ణాదేవి అలంకాల విశిష్టతను వివరిస్తూ లోక పోషకురాలైన అన్నసూర్ణాదేవి రూపంలో బాలాచాముండికాదేవిని దర్శిస్తే కాశీని దర్శించినంత పుణ్యం లభిస్తుందన్నారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, కోదండ రామస్వామి దేవస్థానాలలో అమ్మవార్లకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాలలో పూజలు నిర్వహించారు.అలరించిన గాత్ర కచేరి నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం గాత్ర కచేరి నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత నృత్య పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంయుక్తంగా నిర్వహించగా, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వీజే.వినయకుమార్ అధ్యక్షత వహించారు. టీటీడీ ఆస్థాన గాయకుడు ఎం.రవిచంద్ర పలు గీతాలను అలపించారు. కీబోర్డుపై ఎస్.మురళీ, తబలాపై జీఎం. బాబురావు, రిథమ్స్పై ఎం.రెడ్డప్ప, శృతి వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్న్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు.భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్తాడేపల్లి రూరల్: తాడేపల్లి కనకదుర్గ వారధిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు – విజయవాడ మార్గంలో భారీగా వాహనాలు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో కనకదుర్గ వారధివైపు వాహనాలు భారీగా చేరుకున్నాయి. వారధి నుంచి కుంచనపల్లి బకింగ్హామ్ కెనాల్ వరకు జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్లో సైతం ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. -
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వామ్యం కావాలి
నరసరావుపేటరూరల్:ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనా లు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలతోపాటు అంతర పంటలు వేసి, చుట్టూ జొన్న–సజ్జ పంటలు నాటితే పంటకు రక్షణతోపా టు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా ఆవు మూత్రం–పేడ ఆధారంగా తయారైన సహజ కషాయాలను వాడితే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజు మాట్లాడు తూ గ్రామ సమైఖ్య సంఘం పరిధిలో ప్రకృతి వ్యవసా య వనరుల కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.లక్ష నగదు అందజేస్తుందని తెలిపారు. ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరుకు ఏమైంది ?
గుంటూరుమెడికల్: డయేరియా భూతం గుంటూ రు నగరాన్ని పట్టి పీడిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా నగరంలో వాంతులు, విరేచనాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో అధికా ర యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కలరా భయంతో వణుకు ఓ పక్క డయేరియాతో వణికిపోతున్న నగర ప్రజానీకానికి మరోపక్క కలరా భయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు గణాంకాల ప్రకారం గుంటూరుకి చెందిన ముగ్గురు కలరాతో జీజీహెచ్లో చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యారు. పూర్తిస్థాయిలో నివేదికలు బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను కూడా అధికారులు దాస్తున్నారు. డయేరియా, కలరా బాధితుల గణాంకాలు వివరించేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే కారణాలతో సాధ్యమైనంత మేరకు గణాంకాలను దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు చెబితే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయనే భయంతో అన్ని శాఖల వారు మౌనంగా ఉంటున్నారు. వ్యాధి కట్టడిలో కీలకం సాధారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేయాలి. వ్యక్తిగతంతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఈ వ్యాధుల కట్టడిలో కీలకం. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురుగు కాలువల్లో తాగునీటి పైప్లైన్లు ఇంకా మునిగే ఉన్నాయి. గతంలో జరిగిన ప్రాణ నష్టం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. విధుల నిర్వహణలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు. ఏ మాత్రం తగ్గని డయేరియా ఈనెల 15న గుంటూరు జీజీహెచ్లో మొట్టమొదటిసారిగా డయేరియా బాధితులు అడ్మిట్ అయ్యా రు. నాటి నుంచి ప్రతిరోజూ చికిత్స కోసం వస్తూనే ఉన్నారు. ఇటీవల కలరా కలకలం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు డయేరియా, మరోవైపు కలరాతో ఈ నగరానికి ఏమైందంటూ మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ఇప్పటి వరకు 165 మందికి పైగా డయేరియా తో చికిత్స పొందారు. వీరిలో ఆరోగ్యం కుదుటపడిన సుమారు 80 మందిని డిశ్చార్జి చేశారు. వాంతు లు, విరేచనాలు ఎక్కువగా అవడంతో కిడ్నీల సమ స్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న ముగ్గురిని ఐసీయూలో అడ్మిషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తొలుత డయేరియా బాధితుల కోసం ఇన్పేషెంట్ విభాగంలోని జనరల్ సర్జరీ విభాగం 333 నంబరును కేటాయించారు. -
అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచహారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడితో పాటు కుమ్మరిపాలెం వైపు క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి. సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ బుధవారం తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతోపాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. వీఐపీ క్యూలైన్లో అనుమతి.. సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడియా పాయింట్ల వద్ద పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో అమ్మవారి దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. దీంతో బుధవారం చిన్న గాలిగోపురం పరిసరాల్లో, సీఎం గేటు వద్ద రద్దీ కొంత అదుపులోకి వచ్చింది. అన్నదాన భవనంలో తనిఖీలు.. అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్కలెక్టర్ ఎస్.ఇలక్కియ వేరు వేరుగా తనిఖీలు నిర్వహించారు. మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ.31.08 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ల విక్రయం ద్వారా రూ.11.89 లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, ఇతర సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది భక్తులు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని పేర్కొన్నారు. చూసిన కనులదే భాగ్యం శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కనుల పండువగా సాగింది. యాగశాల వద్ద పల్లకీపై ఉత్సవ మూర్తులు అధిరోహించారు. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం ప్రారంభమైంది. సప్తవర్ణాలు కలిగిన పుష్పాలతో అలంకరించిన పల్లకీపై ఆదిదంపతులు ముగ్దమనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. మహామండపం, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసిన పీఆర్కే
మాచర్ల: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) మర్యాదపూర్వకంగా కలిశారు. మాచర్ల నియోజకవర్గంలో కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులు, ప్రజలు భయంతో గ్రామాలు వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వివరించారు.గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరిఅమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవిఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటుగా గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలలో పూజలలో పాల్గొన్నారు.జిల్లా మత్స్యశాఖ అధికారిగా వెంకట్రావునరసరావుపేటరూరల్: జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఐ.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేసిన సంజీవరావుపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఈనెల 11వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వెంకట్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.శింగరకొండ ఆలయ పాలక మండలి నియామకంఅద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాల మండలిని నియమించారు. అధ్యక్షుడుగా చుండూరి మురళీ సుధాకరరావుతో పాటు సభ్యులుగా ఆకుల కోటేశ్వరరావు, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీ ప్రసాద్, మందా సునీత, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, హరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్బాబు, కొనంకి సుబ్బారావు నియమితులయ్యారు. -
సాగర్ కాలువకు గండి
కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. 50 ఎకరాలు మునక కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతోపాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్ఎస్పీ జేఈ రాజేష్ను వివరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్ఫ్లో అయిందని, బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశా మని తెలిపారు. ప్రవాహం తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు. -
రాష్ట్రపతితో విందుకు జాతీయ స్థాయి అవార్డు గ్రహీత
సత్తెనపల్లి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి విందు చేసే అరుదైన అవకాశం సత్తెనపల్లికి చెందిన జాతీయ స్థాయి అవార్డు గ్రహీత కర్నాటి మురళికి దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మంది జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలతో కలసి ద్రౌపదీ ముర్ముతో విందు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళి చేనేత రంగంలో చూపిన ప్రతిభ ఆయనను జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇక్కత్ డిజైన్ కళను భవిష్యత్ తరాలకు అందించాలని నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత డిజైన్లపై కర్నాటి మురళి కృషి చేస్తున్నారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇక్కత్ డిజైన్లపై శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో గత జూలైలో దేశవ్యాప్తంగా 19 మందికి జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా .. ఆంధ్రప్రదేశ్ నుంచి సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళి జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకోవాల్సి ఉంది. ఆమె ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా మురళి అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంపికై న 19 మంది జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలతో కలిసి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఆరగించారు. కర్నాటి మురళికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విందు చేసే అరుదైన అవకాశం లభించింది. అనంతరం కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మురళి మాట్లాడుతూ తన తండ్రి సాంబయ్య ద్వారా నేర్చుకున్న చేనేత కళా నైపుణ్యం ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడమే కాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి విందు చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. మురళిని స్ఫూర్తి విద్యాసంస్థల బాధ్యుడు అబ్బూరి సత్యనారాయణతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. -
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు దుర్గమ్మ శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కత అనే మహర్షికి దేవీ ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుంచే తండ్రి నుంచి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికి కాత్యాయనుడు అనే పేరు. ఇతను దేవీ భక్తుడు అవ్వడంతో దేవీనే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేశాడు. దేవీ ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లిని కాత్యాయనీదేవిగా కొలుస్తారు. కాత్యాయనీదేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగం, శోకం, భయం నశిస్తాయి. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇంట వర్దిల్లుతాయి. -
సాంకేతికత వినియోగంతో లాభసాటి వ్యవసాయం
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి బెల్లంకొండ: రైతులు సాగులో ప్రకృతి వ్యవసాయ విధానం, సాంకేతికతను వినియోగించడం ద్వారా లాభసాటిగా మార్చుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతున్న వరి పంటలను పరిశీలించారు. రైతులు కూలీల కొరతతో మందులు కషాయాల పిచికారీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా డ్రోన్ పరికరాలను అందుబాటులో తీసుకువచ్చిందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సహజ ద్రావణాలను విస్తృతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. సబ్సిడీ ద్వారా అందించే డ్రోన్ల వినియోగాన్ని రైతులకు వివరించారు. ఘన, ద్రవ జీవామృతం, దశపరిని కషాయం, నీమాస్త్రం వంటి కషాయాలను కూడా డ్రోన్ల సహాయంతో పిచికారీ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్ఎఫ్ఏ సైదయ్య, ఎంటీ అనంతలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అగ్రగామిగా నిలిస్తే రూ.కోటి నజరానా
సత్తెనపల్లి: తొమ్మిది అంశాల్లో పురోగతి సాధించిన గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.కోటి బహుమతి ఇవ్వనుంది. ప్రస్తుతం జిల్లాలో చాలా పంచాయతీల్లో కనీస సౌకర్యాల కొరత వేధిస్తోంది. తాగునీటితోపాటు మురుగు కాలువలు, రహదారులు, ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దీన్ని అధిగమించడానికి గ్రామ పంచాయతీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సూచికలో పొందుపరిచింది. డిసెంబర్లో పురోగతి సూచిక ప్రగతిని గుర్తించి ఎంపికై న గ్రామ పంచాయతీలను ప్రకటిస్తారు. ప్రగతిపథంలో నడిచేలా... జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందు కోసం గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. తొమ్మిది అంశాలు ఇవి... ●గ్రామపంచాయతీలో పేదరికం లేని జీవనోపాధిని పెంపొందించడం ●ప్రజారోగ్యం, గ్రామ శ్రేయస్సును మెరుగుపరిచే కార్యక్రమాలు ●ప్రజలకు స్వచ్ఛమైన నీరు పుష్కలంగా అందుబాటులోకి తేవడం ●పిల్లల సంరక్షణ, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడం ●గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడం ●మౌలిక సదుపాయాల కల్పన ●సామాజిక న్యాయాన్ని సురక్షిత వాతావరణంలో నెలకొల్పడం ●శాంతియుతమైన, న్యాయమైన, బలమైన సంస్థలతో సుపరిపాలన ●పంచాయతీ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం వరం -
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా..
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతోపాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శిఽథిలావస్థలో ఏడు ట్యాంకులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). ఈ 42 వాటర్ ట్యాంకుల్లో ఏడు ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పైకప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్తంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజర్వాయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా 80 కేసులు.. గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది డయేరియా బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80మంది చికిత్స పొందుతున్నారు. ఈకోలి బ్యాక్టీరి యా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిశార్చి అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించారు.గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నాయి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేయాలి. – నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాని ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. -
జాబ్ మేళాకు 138 మంది హాజరు
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు 138 మంది హాజరైనట్లు జిల్లా అధికారి తమ్మాజీరావు తెలిపారు. జాబ్ మేళాలో మొత్తం 10 కంపెనీల ప్రతినిధులు హాజరై ఎంపికలు నిర్వహించారని తెలిపారు. 51 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ బీపీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్రనాయక్, స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ పి.శ్రీకాంత్, వీరాంజనేయులు, రామకృష్ణారెడ్డి, మస్తాన్, జూనియర్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఎం వెంకట నర్సయ్య, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఎయిమ్స్లో కలరా రోగులను పరామర్శించిన సీపీఎం నాయకులుమంగళగిరి: మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కలరా రోగులను సీపీఎం నాయకులు పరామర్శించారు. అనంతరం నేతాజీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వలన నీటి కాలుష్యంతో డమేరియా, కలరా బారినపడి అనేకమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం నాయకులు బి.వెంకటేశ్వర్లు, ఎస్ఎస్ చెంగయ్య, ఎస్.గణేష్, షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు. -
అతివృష్టితో అపర నష్టం!
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె ‘చెరువు’ అయింది! ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆసియా అక్వాటిక్ పోటీలకు పరిశీలకునిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 11వ ఆసియా అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు భారతదేశం తరపున టెక్నికల్ ఆఫీషియల్గా ఎంపికయ్యారు. పోటీలు ఈనెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్టు సురేష్ బుధవారం తెలిపారు. ఆసియాలోని దాదాపు 30 దేశాలకు చెందిన స్విమ్మర్లు స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, సింక్రాన్డ్స్ తదితర విభాగాలలో పోటీ పడనున్నారు. భారతదేశం నుంచి సురేష్ గతంలో ఆఫ్రో– ఆసియన్ గేమ్స్, వరల్డ్ మిలటరీ గేమ్స్, ఆసియా ఏజ్ గ్రూప్ చాంపియన్షిప్, నేషనల్ చాంపియన్షిప్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్గా వ్యవహరించారు. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, కళాశాల పాలకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వైస్ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి తదితరులు స్విమ్మింగ్ కోచ్ సురేష్ను అభినందించారు. -
హామీలు వెంటనే అమలుచేయాలి
డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ నాయకులు నరసరావుపేట: కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు కోరారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ ఏకా మురళికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా నాయకులు కె.మల్లికార్జున్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ పాదయాత్ర సందర్భంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 107–108 జీవో రద్దు చేస్తామని చెప్పి ఏడాదిన్నర గడుస్తున్నా రద్దుచేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం దారుణమని అన్నారు. వెంటనే ఆ నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇచ్చేందుకు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మా నం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని తక్షణమే ఫ్రీజోన్గా ప్రకటించి స్థానికంగా, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు 70శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. వలంటరీ వ్యవస్థను కొనసాగించాలని, వారిలో విద్యార్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీపతి, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
లో లెవల్ చప్టా..హై లెవల్ సమస్యలు
●కొద్దిపాటి వర్షానికే చప్టాపై వరద ప్రవాహం ●వరద ఉధృతి సాఫీగా వెళ్లకుండాఅడ్డుకుంటున్న గుర్రపు డెక్క ●వాహనాల రాకపోకలకు అంతరాయం ●తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు సత్తెనపల్లి: దశాబ్దాల కిందట సత్తెనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రహదారులపై నిర్మించిన లో లెవల్ చప్టాలతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఆయా గ్రామాల పరిధిలో ఉన్న వాగులు, వంకలు, పొంగినప్పుడల్లా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రవాహం తగ్గేవరకు అక్కడ చిక్కుకుపోవాల్సిందే. ఇదీ మండల పరిధిలోని పలు గ్రామాల పరిస్థితి. డివిజన్ కేంద్రమైన సత్తెనపల్లి నుంచి అమరావతికి నిత్యం ఆర్టీసీ బస్సులతోపాటు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కొద్దిపాటి వర్షం కురిసినా నందిగామ వద్దగల లో లెవల్ చప్టా పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వాగులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి ఉండడంతో వరద ఉధృతి సాఫీగా ప్రవహించే అవకాశం లేక చప్టాపైకి చేరి సమీపంలోని గృహలలోకి నీరు చేరుతోంది. దీంతో నందిగామ గ్రామ వాసులతోపాటు సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిత్యం లో లెవల్ చప్టాపై నుంచి వర్షం నీరు ప్రవహిస్తుండడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రొక్లెయిన్తో అడ్డుగా ఉన్న గుర్రపు డెక్క తొలగించటంతో కొద్దిసేపటి తరువాత రాకపోకలు పున:ప్రారంభమయ్యాయి. నందిగామ వద్ద ఉన్న లో లెవల్ చప్టాపై నుంచి వరద పొంగితే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా గ్రామాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. నందిగామ మెయిన్ రోడ్డులో వెంకటేశ్వరస్వామి గుడి ఎదురు వాగులో గుర్రపు డెక్క పెరిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గుర్రపు డెక్క పూర్తిగా తొలగించటంతోపాటు సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని నందిగామలో గల లో లెవల్ చప్టా స్థానంలో నూతనంగా బ్రిడ్జి నిర్మించి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
రసవత్తరంగా విజ్ఞాన్ జాతీయ చెస్ చాంపియన్షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో మంగళవారం రెండో రౌండ్ ముగిసేసరికి 68 మంది క్రీడాకారులు తలో రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఎక్కువమంది అగ్ర క్రీడాకారులు మూడో రౌండ్కి సులభంగా అడుగుపెట్టారు. మాజీ జాతీయ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ సూర్యశేఖర్ గంగూలీ (పీఎస్పీబీ) టాప్ బోర్డులపై తొలి విజయాన్ని నమోదు చేశారు. గియూకో పియానో ఆరంభంలో, 19వ మూవ్లో యషద్ బంబేశ్వర్ (ఛత్తీస్గఢ్) చేసిన తప్పిదాన్ని గంగూలీ సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా బిషప్, నైట్ త్యాగాలు చేసి పూర్తిగా ఆధిపత్యం సాధించిన గంగూలీ, 30వ మూవ్లో ప్రత్యర్థిని రాజీనామా చేయించారు. ● ●టాప్ సీడ్ జీఎం ఇనియన్.పి (తమిళనాడు), అధిరాజ్ మిత్రా(ఝార్ఖండ్)పై గెలుపొందాడు. వెటరన్ జీఎం కృష్ణన్ శశికిరణ్, హృషికేశ్ బానిక్ (పశ్చిమ బెంగాల్)పై గెలుపొందాడు. కొత్తగా గ్రాండ్మాస్టర్ బిరుదు పొందిన ఎస్.రోహిత్ కృష్ణ (తమిళనాడు), దేవర్ష భోర్కటేరియా (గుజరాత్)పై గెలుపొందాడు. జీఎం.ఎం.ఆర్.లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్), అయుష్ రవికుమార్ (తమిళనాడు)పై ఆసక్తికర పోరులో గెలిచారు. కర్ణాటక ఐఎం వియాని ఆంటోనియో డి కున్హాను ఆంధ్ర యువకుడు అందమాల హేమల్ వర్షన్ డ్రాలో కట్టేశారు. మూడో రౌండ్లో టాప్ బోర్డులపై మరింత రసవత్తర పోటీలు జరగనున్నాయి. -
అక్రమాలకు తావు లేకుండా రేషన్ సరకులు అందజేయాలి
పౌరసరఫరాల శాఖ గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ నరసరావుపేట: పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్లలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని, అక్రమాలకు తావులేకుండా సకాలంలో రేషన్ సరుకులు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ మార్కెట్ యార్డులో రైతుబజారు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేస్తూ పౌరసరఫరాల గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు గోడౌన్కు పంపించిన వివిధ రకాల ప్యాకెట్లను పరిశీలించారు. పీడీఎస్ బియ్యంతోపాటు ఏఏ సరుకులు ఇస్తున్నారు, అంగన్వాడీ పిల్లలు, గర్భిణులకు ఇచ్చే సరుకుల ప్యాకెట్లు, మధ్యాహ్న భోజనానికి స్కూళ్లు, హాస్టళ్లకు ఇస్తున్న బియ్యం వివరాలు స్టాక్ పాయింట్ ఇన్చార్జి జయప్రకాష్ను అడిగి వాటిని పరిశీలించారు. బియ్యం సంచులు బరువు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, మార్కెటింగ్ ఏడీ కేవీఎన్ ఉపేంద్రకుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంత్రావు, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. నాదెండ్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాబోర్డు ఆఫ్ స్టడీస్ (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్) సభ్యునిగా సాతులూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఎన్యూ డిప్యూటీ రిజిస్ట్రార్ కె రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన న్యాయశాస్త్రంలో డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేషన్ విభాగంలో సిలబస్, ఇతర అంశాల నిర్ణయాలకుగాను తొమ్మిది మంది సభ్యులతో వైస్ఛాన్సలర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈయన ఏఎన్యూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు తరచూ అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ విభాగాల్లో న్యాయసలహాదారులుగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఏఎన్యూ న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. -
బాలత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ బాలత్రిపురసుందరిదేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో రెండో రోజు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వారాహిదేవి అలంకారం చేసి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించి పూజలలో పాల్గొన్నారు. తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం సమీపంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు పరిశీలించారు. ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు వారి వెంట ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు సూచనలు ఇచ్చారు. -
యూరియా కోసం బారులు
రుద్రవరంలో గుట్టుచప్పుడు కాకుండా... సత్తెనపల్లి: సత్తెనపల్లి మండల పరిధిలోని గుడిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కొమెరపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని కట్టావారిపాలెంకు, ధూళిపాళ్ల గ్రామంలోని ఏబీఎఫ్ఎస్సీఎస్కు, సత్తెనపల్లి వ్యవసాయం మార్కెట్ యార్డ్లోని జీడీసీఎంఎస్కు ఒక్కొక్క దానికి 19.8 మెట్రిక్ టన్నులు చొప్పున 79.2 మెట్రిక్ టన్నుల యూరియా రావడంతో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున ఎనిమిది వందల మంది రైతులకు స్లిప్పులు పంపిణీ చేసి ఆ మేరకు యూరియా పంపిణీ చేశారు. ఈ క్రమంలో స్లిప్పులు అందుకునేందుకు రైతులు పడిగాపులు పడ్డారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో పంపిణీ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
గ్రామాల్లో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు
●దాడులకు భయపడేది లేదు ●అధికారంలోకి రాగానే బదులు తీర్చుకుంటాం ●మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల: కొంత మంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షన్ పెంచాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న చల్లా అంజిరెడ్డిని మహేష్రెడ్డి, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్కుమార్లు మంగళవారం పరామర్శించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని, అలజడి సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. ఏడాదిన్నరలో అంజిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డిలపై దాడులు చేశారని తెలిపారు. నారు తీసుకొని వచ్చేందుకు వెళ్తే దారి కాచి అంజిరెడ్డిపై దాడి చేశారని తెలిపారు. గ్రామంలో కొంతమంది అలగా జనం చేస్తున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ప్రభుత్వం మారగానే ఎవరికి సంబంధం ఉందో తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను నాలుగు, ఐదుసార్లు ఆసుపత్రి చుట్టూ తిప్పుదామని అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే 40సార్లు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నేడు 20 ఎకరాలు బీడులుగా పెడితే రేపు 200, 300 ఎకరాలు బీడు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, గ్రామాల్లో మళ్లీ ఫ్యాక్షన్ తెవాలని చూస్తే అది మీ కర్మ అని అన్నారు. పోలీసు ఇప్పటికై నా శాంతియుతంగా ఉండేలా చూడాలని, కొట్టిన వారే గ్రామాల్లో గొడ్డళ్లు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని జూలకల్లు గ్రామంలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని కాసు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్కుమార్, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎన్డీఎల్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ మట్టారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మిత్రుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
చిలకలూరిపేట: స్నేహితుడిని తలపై రాడ్తో కొట్టి, గొంతును తాడుతో బిగించి క్రూరంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తాడిబోయిన గోపి(32) గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవాడు. అతను దక్షిణామూర్తి సేలిస్టియాన్ క్రియేషన్స్ బ్యానర్పై షార్ట్ఫిలింలు, మిషన్ మంగళాద్రి పేరుమీద వెబ్సిరీస్లు తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 25వ తేదీన గుర్తుతెలియని మృతదేహం యడ్లపాడు సర్వీస్ రోడ్డు కాల్వలో కాలిపోతున్న స్థితిలో కనిపించింది. పోలీసుల విచారణలో అది తాడిబోయిన గోపిదిగా గుర్తించారు. చనిపోయిన గోపికి గుంటూరుకు చెందిన ఆఫ్రిన్ అనే ఆమె ద్వారా వాళ్ల తమ్ముడు, గుంటూరులోని సుద్దపల్లిడొంకలో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ పరిచయమయ్యారు. కొంతకాలానికి గోపి, ఇమ్రాన్ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గోపిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్రాన్కు స్నేహితులైన గుంటూరు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ రియాజ్, నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ ఖాజామొహిద్దీన్లను కలుపుకొని పథకం ప్రకారం గుంటూరులోని ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఇమ్రాన్ అద్దె గదికి గోపిని జూన్ 24న ఫోన్ చేసి రప్పించారు. ముగ్గురు కలసి ఇనుపరాడ్డుతో గోపి తలపై కొట్టి ఆపై తాడుతో మెడకు ఉరివేసి హత్యచేశారు. మృతుడు గోపికి చెందిన కారు డిక్కీలో శవాన్ని చిలకలూరిపేటకు తీసుకువచ్చి ఇక్కడ పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి గుంటూరు రోడ్డులో తిమ్మాపురం దాటిన తర్వాత యడ్లపాడు సమీపంలో సర్వీస్ రోడ్డు పక్కన సిమెంట్ కాల్వలో గోపీ మృతదేహాన్ని వేసి పెట్రోలు పోసి తగలబెట్టి పరారయ్యారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గోపికి చెందిన కారు, కీ పాడ్ ఫోన్, సెల్ఫోన్, ఏటీఎం కార్డులు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వేదమాతా నమోనమః
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదుచేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అనుమతించారు. ఇక అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజున ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలో అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పిండి పర్థారాలు, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు. రోజు కు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతా యని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్లో పది కౌంటర్లు ఉండగా, అక్కడ మరో రెండు కౌంటర్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్తోపాటు రథం సెంటర్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం -
క్రీడలకు సాంకేతికత జోడింపుతో ఉత్తమ ఫలితాలు
పెదకాకాని(ఏఎన్యు): రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడల విధానంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆధునిక సాంకేతికతను క్రీడల రంగానికి జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పలు అథ్లెటిక్ అసోసియేషన్లు, మల్టీ నేషనల్ కంపెనీలు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తొలుత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ పతాకాన్ని శాప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. -
రజత కవచాలంకృతగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి
అమరావతి: ప్రఖ్యాత శైవక్షేత్రమైన అమరావతిలో వేం చేసియున్న శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీయిజశుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 9 రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ వేడుకలలో మొదటిరోజు రజతకవచాలంకృత అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ ఆధ్వర్యంలో చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ అమ్మవారి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో తొలిరోజు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం వాసవీ మహిళా మండలి సభ్యులు లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. మెయిన్ బజార్లోని సీతాసమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలోని శ్రీదేవీశరన్నవరాత్రమహోత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక బాలత్రిపురసుందరిదేవి అలంకారం చేశారు. గ్రామంలోని భక్తులు పెద్దసంఖ్యలో మూడుదేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.. దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా తొలిరోజు ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, రుత్విక్కరణతో కలశస్థాపన నిర్వహించారు. జ్వాలాముఖి, బాలాచాముండేశ్వరి అమ్మవార్ల అలయాలలో త్రికాలర్చనలు నిర్వహించారు. భక్తులచే నిర్వహించబడే చండీహోమాలను ఉభయదాతలతో నిర్వ హించారు. -
మాతృ మరణాలను అరికట్టాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరుమెడికల్: గుంటూరులోని కార్యాల యంలో సోమవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన సబ్ డిస్టిక్ లెవెల్ మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది. చేబ్రోలు, నిడమర్రు, మందపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జులై, ఆగస్టుల్లో జరిగిన మూడు మాతృ మరణాలపై సభ్యులు సమీక్షించారు. మరణానికి గల కారణాలను అధ్యయనం చేశారు. అందులో ఒకటి నివారించగలిగినది గాను, రెండు నివారించలేనివిగాను నిర్ధారించారు. సమావేశానికి హాజరైన ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. గర్భం దాల్చినప్పటి నుంచి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలని చెప్పారు. తొలుత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు , ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ పాల్గొన్నారు. లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటుపడి గంజాయి విక్రయిస్తూ, ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఎనిమిది మంది అంతర్రాష్ట్ర దొంగలను అరండల్పేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బ్రాడీపేటలో కొంత మంది గుంపుగా చేరి గంజాయి విక్రయిస్తున్నట్లు అరండల్పేట సీఐ ఆరోగ్యరాజుకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆయన ఎస్ఐ కృష్ణబాజీ, సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించగా కొంత మంది పరారయ్యారు. మిగిలిన వారిలో శ్రీనగర్కు చెందిన ఇంజాపల్లి మేరిబాబు, వెంగళరావునగర్కు చెందిన యద్దనపూడి దీనభాస్కర్, శారదా కాలనీకి చెందిన బడుగు ప్రభుకుమార్, ఒక మైనర్ బాలుడు, గోరంట్లకు చెందిన పణిదరపు అమరజ్యోతి, వెంగళరావు నగర్కు చెందిన ఏలూరి ఎలిజిబెత్రాజు, శివనాగ రాజు కాలనీకి చెందిన తూతిక అలియాస్ పాతూరి సైని, అలియాస్ హనీ, ఒడిశా రాష్ట్రంలోని పారిమ గ్రామానికి చెందిన పారిమ జోయామాజిలను అదుపులో తీసుకుని, కేసు నమోదు చేశారు. వీరి వద్ద గల 3.5 కేజీల గంజాయితో పాటు చోరీ చేసిన ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వీరితోపాటు ఏసుబాబు, హర్ష సరిఫుద్దీన్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, అమరజ్యోతి, ఈశ్వర్, మురళి, వీరాస్వామిలు పరారీలో ఉన్నారు. -
ఉత్కంఠభరితంగా జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్లో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు సోమవారం రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. 14 మంది గ్రాండ్మాస్టర్లు, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు సహా మొత్తం 394 మంది పోటీ బరిలో నిలిచారు. తొలి రౌండ్లో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు సునాయాస విజయాలతో రెండో రౌండ్కి చేరుకున్నారు. ● రెండో సీడ్ సూర్యశేఖర్ గంగూలి మొదటి రోజు సుదీర్ఘమైన గేమ్నుఆడి, చివరికి విజయం సాధించా రు. ● రైల్వే జట్టుకు చెందిన గ్రాండ్మాస్టర్ దీపన్ చక్రవర్తి, ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రా ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ● పీఎస్పీబీకి చెందిన ఐఎం నిషా మొహోటా, తెలంగాణ ఆటగాడు మోక్షిత్ పసుపులేటి చేతిలో ఓటమి పాలయ్యారు. ● ఆంధ్రప్రదేశ్ అభిమాన ఆటగాడు, 2017 జాతీయ చాంపియన్ లలిత్ బాబు, ఛత్తీస్గఢ్కు చెందిన గగన్ సహూను చాకచక్యంగా ఓడించారు. -
నయనానందకరం.. నగరోత్సవం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ.300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57మంది, కుంకుమార్చనకు 18మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. మహా మండపం ఆరో అంతస్తులో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్ల పరిశీలన..ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో చర్చించారు. అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. ఆలయ ఈవో శీనానాయక్తో కలిసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆహార పదార్థాల నాణ్యత, ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యా లతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. -
తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి
నరసరావుపేటరూరల్: తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని నవ దంపతులు సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ను కోరారు. చిలకలూరిపేటకు చెందిన వి.ఆది వెంకట చెన్నకేశవరాజు, షేక్ కమర్ ఇ అజమ్లు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో ఇద్దరి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. నాలుగు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. నీకు నచ్చిన విధంగా అందరి సమక్షంలో చెన్నకేశవరాజుతో వివాహం చేస్తామని కమర్ ఇ అజమ్ తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లారు. ఆ తరువాత చెన్నకేశవరాజుతో మాట్లాడవద్దని అంక్షలు విధించి ఇద్దరిని కలవకుండా చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన చెన్నకేశవరాజు, కమర్ ఇ అజమ్లు సోమవారం ఉదయం చిలకలూరిపేటలోని బాలాజి దేవాలయంలో మరోమారు వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్దల అంగీకారం లేకపోవడంతో తమకు వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పెళ్లి బట్టలతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పీజీఆర్ఎస్లో ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. నవదంపతుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఏర్పాటుచేసి వారి నుంచి ఎలాంటి సమస్యల లేకుండా చూడమని డీఎస్పీ హనుమంతరావును అడిషనల్ ఎస్పీ ఆదేశించారు. -
కూటమి ద్రోహం.. పేదలకు శాపం
కూటమి ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి, ప్రజలకు మేలు చేయకపోగా ద్రోహం తలపెట్టింది. సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది గమనించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను, ఆస్పత్రి మంజూరు చేశారు. రూ.217 కోట్లు ఖర్చు చేసి భవనాలు నిర్మించారు. మిగిలిన పనులు పూర్తిచేస్తే పల్నాడు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం పనులు పూర్తిచేయకపోగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైంది. దీంతో పల్నాడు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారనుంది. సాక్షి, నరసరావుపేట: పల్నాడు ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకపోవడంతో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక ఎంతో మంది అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు. జిల్లాలో కీలకమైన కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేలో దాచేపల్లి, పిడుగురాళ్ల వద్ద ప్రమాదం జరిగినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల చుట్టుపక్కల కొత్తగా వచ్చిన హైవేలలో జరగరాని ప్రమాదం జరిగితే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లేలోగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరోవైపు మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలలోని గ్రామీణులకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పల్నాడు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యంతోపాటు ఈ ప్రాంతానికి మణిహారంగా ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పిడుగురాళ్ల శివారులోని బ్రహ్మణపల్లిలో మెడికల్ కళాశాలను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా పనులు ఆగకుండా యుద్ధ ప్రాతిపాదికన సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షతో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులు పక్కనపెట్టారు. పనులు చేయకుండా మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పన్నంగా ధారాదత్తం చేసే కుట్రలకు తెరదీశారు. ఇందులో భాగంగా సుమారు 90 శాతం పూర్తయిన 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేసే అవకాశమున్నా కావాలనే పనులు చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు. పరికరాలు సమకూరిస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం పిడుగురాళ్ల సమీపంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన మెడికల్ కళాశాల సుమారు 50 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో భూమి కొనుగోలుకు అయిన ఖర్చు రూ.14.5 కోట్లు, భవన నిర్మాణాలకు సుమారు రూ.320 కోట్లు కాగా మొత్తం రూ.334.5 కోట్లు ఖర్చు పెడితే భవనాల నిర్మాణాలు పూర్తవుతాయి. ఇందులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏకంగా రూ.217.07 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇది పూర్తి వ్యయంలో 66 శాతం పూర్తిచేసినట్టు. ఇక మిగిలింది 34 శాతం పనులు మాత్రమే. భవన నిర్మాణాలలో మెడికల్ కళాశాల, 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు గా విభజించారు. ఇందులో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం, మెడికల్ కళాశాల పనులు 60 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నార పాలనలో 10 శాతం పనులు పూర్తి చేసి ఉంటే అద్భుతమైన 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేది. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి ఉంటే ఈపాటికే పల్నాడు జిల్లా వాసులకు ఎంతో కీలకమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ఎన్నో ప్రాణాలు నిలిచేవి. మెడికల్ కళాశాల నిబంధనల ప్రకారం వైద్య విద్య ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందు ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కావాలి. పిడుగురాళ్ల 100 పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమై ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏంబీబీఎస్ మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తయ్యి తరగతులు ప్రారంభించే అవకాశముటుంది. అయితే పేదలకు వైద్య విద్య అందుబాటులోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని కూటమి ప్రభుత్వం పిడుగురాళ్ల మెడికల్ కళాశాలతోపాటు రాష్ట్రంలోని మరో 16 కాలేజీలను ప్రైవేట్పరం చేసేలా అడుగులు వేస్తోంది. 2020–21 14.50 2021–22 37.30 2022–23 86.77 2023–24 55.30 2024 జూన్ వరకు 23.20 మొత్తం 217.07పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పల్నాడు ప్రాంతానికే మణిహారం లాంటిది. గత ప్రభుత్వంలో మేము చిత్తశుద్ధితో పనిచేసి ఆసుపత్రి పనులు 90 శాతం, కళాశాల పనులు సుమారు 60శాతం పూర్తిచేశాం. కూటమి ప్రభుత్వం మిగిలిన 10 శాతం ఆసుపత్రి పనులు పూర్తిచేసి అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చేది. మెడికల్ కళాశాల ప్రైవేట్పరం చేయడమంటే ఈ ప్రాంతానికి చేస్తున్న ద్రోహానికి నిదర్శనం. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా పోరాటం చేస్తాం, నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. –కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
పాఠశాలల్లో స్కౌట్స్, గైడ్స్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వ భావాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో గుంటూరు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వార్షిక సమావేశాన్ని జిల్లా కార్యదర్శి ఎం. ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు గుంటూరు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజిస్ట్రేషన్, బిగినర్స్ కోర్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 955 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 50 వేలు చొప్పున విడుదల చేసిన నిధులతో విద్యార్థులకు యూనిఫామ్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉన్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన స్కౌట్స్, గైడ్స్ ఆశయాలకు అనుగుణంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 111 పాఠశాల నుంచి 136 యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. ఎస్ఓసీ పి.శ్రీనివాసరావు, చేబ్రోలు ఎంఈవో రాయ సుబ్బారావు, పెదకాకాని ఎంఈఓ బీవీ రమణయ్య, డీటీసీ టి. నరేష్ పాల్గొన్నారు.రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు -
పోక్సో కేసు నిందితుడికి పదేళ్ల జైలు
నాదెండ్ల: పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. ఎస్సై జి పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరం రాజీవ్గాంధీ కాలనీకి చెందిన మైనర్ బాలిక 2025 మే 28న గ్రామానికి చెందిన మందలపు శివప్రసాద్ తనపై అత్యాచారయత్నం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సి విజయభాస్కర్ విచారణ నిర్వహించారు. నేరం రుజువు కావటంతో నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. జిల్లాకు 1860 టన్నుల యూరియా నాదెండ్ల: జిల్లాకు మూడో విడతగా 1860 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్ను సోమవారం ఆయన సందర్శించారు. ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్, డీలర్లకు నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని స్థానిక వ్యవసాయాధికారులను ఆదేశించారు. పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ఆయనతోపాటు ఏవో శ్రీలత, సిబ్బంది జీపీ శ్రీనివాసరావు ఉన్నారు. కృషి, పట్టుదలతోనే ప్రభుత్వ ఉద్యోగాల సాధన గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు కృషి, పట్టుదలతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను సాధించాలని కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి చెందిన అధ్యాపకుడు ఎస్. నవీన్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ పీజీ కళాశాలలో సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధతపై వెనిగండ్లలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంబీఏ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకుడు కోటేశ్వరరావు ప్రభుత్వ పోటీ పరీక్షలైన సివిల్స్, ఎస్సెస్సీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ, బీపీసీఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలను గురించి వివరించారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ శాఖల్లో విస్కృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృషీ, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఎంబీఏ విద్యార్థులు కమ్యూనికేషన్, పరిపాలనా నైపుణ్యాలతో ప్రైవేటు రంగంలోనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం రాణించగలరని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనితాదేవి, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి యు. రవి కుమార్, వాణిజ్య విభాగాధిపతి ఎస్. శ్రీనివాసరావు, అధ్యాపకుడు నాంచారయ్య, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సంతోష్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 114 అర్జీలు అందాయి గృహ రుణం పేరుతో రూ.50 లక్షల మోసం నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఎంజే అసోసియేట్స్ పేరుతో అమీర్, మస్తాన్, బాషాలు కార్యాలయం నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన ఇనకొల్లు వాసు, జొన్నలగడ్డకు చెందిన సిలివేరి వేమలయ్యతోపాటు వారి నలుగురు స్నేహితులు ఎంజే అసోసియేషట్స్ నిర్వాహకులు చెప్పిన మాయమాటలు నమ్మి రూ.50 లక్షలు చెల్లించారు. గృహ రుణం కోసం వారు పలుమార్లు కోరినా వారి నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆడపిల్లలు పుట్టారని వేధిస్తున్నారు పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన షేక్ హవాబికి 12 ఏళ్ల కిందట జానపాడుకు చెందిన బిల్లా సైదాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని హవాబిని బిల్లా సైదా వేధిస్తున్నాడు. దీనికి అత్తమామలు కూడా బిల్లాకు సహకరిస్తున్నారు. పిడుగురాళ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలని హవాబి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. రూ.7 కోట్లు అప్పుగా తీసుకొని పరారయ్యారు యర్రంశెట్టి హీరో పేరుతో సంస్థను నడుపుతూ నమ్మకంగా తమ వద్ద రూ.7 కోట్లు అప్పుగా తీసుకొని సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి రాము, బాబ్జిలు పరారయ్యారని నరసరావుపేట సాయినగర్కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. జూలై 31వ తేదీన అప్పులు చెల్లిస్తామని చెప్పి 30వ తేదీ కుటుంబంతో సహా వెళ్లిపోయారని తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ, వాసుదేవరావు, ఆంజనేయులు, నాగారాణి తదితరులు అడిషనల్ ఎస్పీని కోరారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) సంతోష్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ -
నిజమైన రైతుకు యూరియా అందించండి
నరసరావుపేట: జిల్లాలో రైతులకు యూరియాను అందించటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, బ్లాక్ మార్కెట్ను అరికట్టి నిజమైన రైతుకు అధికారుల ద్వారా అందజేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు హాజరై కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ యూరియా దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరిపడినంత ఉందని, అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయు డు చెబుతున్న దానిలో వాస్తవంలేదని అన్నారు. ఒక్కొక్క సొసైటీకి మూడు నాలుగు లారీలు యూరియా తీసుకెళ్లి టీడీపీకి చెందిన రైతులు, వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారే తప్ప, రైతులందరికీ ఇవ్వట్లేదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన రైతులందరికి పాస్ పుస్తకాల ఆధారంగా ఎకరానికి ఇంత అని నిర్ణయించి ఎన్ని ఎకరాలు ఉంటే అంత యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. బుచ్చిపాపన్నపాలెం సొసైటీ పరిధిలో టీడీపీకి చెందిన రైతులు, వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని స్పష్టం చేశారు. కొత్తపల్లి, రెడ్డిపాలెం, సంతగుడిపాడు గ్రామాల్లో కూడా యూరియా సంబంధిత రైతులకు ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముతున్నారన్నారు. ఒక గ్రామానికి చెందిన యూరియా లోడ్ దించితే ఆ గ్రామ రైతులకు ఇవ్వకుండా వేరే గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తున్నారన్నారు. ఇలా కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చినా సంతోషమని, అక్కడ కాదంటే గ్రామంలో పంచాయతీ ఆఫీసులోనైనా దించి ఒక ప్రభుత్వ అధికారిని నియమించి, ఆ గ్రామానికి సంబంధించి విలేజి అసిస్టెంట్, వీఆర్ఓ, విలేజ్ సెక్రటరీ ద్వారా యూరియాను సరఫరా చేస్తే, నిజమైన రైతులు అందుతుందన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ సమీక్ష చేసి అధికారులను పిలిపించుకొని మాట్లాడి అందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పాస్బుక్ చూపిస్తే మారు మాట్లాడకుండా ఎరువులు అందించారని, రైతులు రోడ్డు ఎక్కకుండా పరిపాలన చేశారని గుర్తు చేశారు. రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో డిపెప్ స్కూలులో అనధికారికంగా వంటగది, బాత్రూమ్, వంట గది, వాటర్ ట్యాంకు, చెట్టు కూల్చివేసిన ప్రైవేటు వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్కు పేర్లతో సహా వివరిస్తూ అర్జీ అందజేశామని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, నాయకులు మూరె రవీంద్రారెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, పొనుగోటి వెంకట్రావు, యాంపాటి వెంకటప్పరెడ్డి, పడాల హనుమిరెడ్డి, రంగారెడ్డి, చీమల శ్రీనివాసరెడ్డి, గజ్జల ముసలారెడ్డి, జయమ్మ, రైతు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జాతీయ రహదారుల పనులు సత్వరమే పూర్తిచేయండి
నరసరావుపేట: జిల్లాలో నేషనల్ హైవేస్ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణాలకు కావాల్సిన పనులన్ని అధికారులు సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించా రు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ హైవేస్పై సమీక్షకు అధ్యక్షత వహించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారి వినుకొండ నుంచి గుంటూరు వర కు 85.30 కిలోమీటర్ల పొడవున రెండు లేన్ల రహదారిని నాలుగు వరుసల రహదారి విస్తరణకు 544డి ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. ఈ అలైన్మెంట్ పల్నాడు జిల్లాలో 53.91 కి.మీ, బాపట్ల జిల్లాలో 13.8 కి.మీ, గుంటూరు జిల్లా 18.19 కి.మీ ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ కోసం మొత్తం 344.31 హెక్టార్ల భూమి అవసరం కాగా ప్రస్తు తం భూమి సేకరణ ప్రక్రియ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కొనసాగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు తాత్కాలిక అంచనా వ్యయం రూ.2605 కోట్లు ఖర్చు అవుతుందని డీఇపీ పార్వతీశం పేర్కొ న్నారు. పనులన్నీ త్వరితగతిన పూర్తిచే యా లని కలెక్టర్ సూచించారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, నరసరావుపేట, సత్తెనపల్లి ఆర్డీవోలు కె.మధులత, రమాకాంతరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. కారెంపూడి: మార్టూరు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రెండు గ్రానైట్ లోడు లారీలను కారెంపూడి ఎస్ఐ వాసు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పన్ను కట్టకుండా గ్రానైట్ తరలిపోతుందని పోలీసులు వాహనాలను ఆపారు. అనంతరం సేల్స్టాక్స్, మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. హైవేస్ నిర్మాణాలపై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ -
పులిచింతలకు 3,37,264 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు ద్వారా 3,37,264 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు 4 మీటర్లు ఎత్తు ఎత్తి 3,37,264 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.78 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటిసామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.593 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. రెండు విద్యుత్ యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన నిలిపివేసినట్లు వెల్లడించారు. టీఆర్సీ లెవల్ 62.43 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం 3,09,545 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. సాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
డాక్టర్ సునీల్కు ‘ప్రైడ్ ఆఫ్ ఏపీ’ అవార్డు
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెంట్యాల సునీల్కుమార్కు ‘ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ నేత్ర వైద్యుల సంఘం అవార్డు వరించింది. సోషల్ మీడియాలో ‘టిప్ ఆఫ్ ది డే’ ద్వారా నేత్ర వైద్య మెలకువలను ప్రజలకు వివరిస్తున్నందుకుగానూ గుంటూరులో ఆదివారం జరిగిన రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సులో ఈ అవార్డును సునీల్కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ.. తనను ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డాక్టర్ సునీల్కుమార్ను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. రైల్వే డివిజన్ పీఆర్ఓ డి.వినయ్కాంత్ లక్ష్మీపురం: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా గుంటూరు రైల్వే డివిజన్ అద్భుతమైన పురోగతి సాధిస్తుందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ డి.వినయ్కాంత్ తెలిపారు. ఆదివారం గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఏడాది సాధించిన విజయాలు, అభివృద్ధి వివరాలు వెల్లడించారు. 3.809 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగా రూ.712 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గతేడాది కంటే 6.1 శాతం ఎక్కువ అని తెలిపారు. నడికుడి–శ్రీకాళహస్తి లైను 309 కిలోమీటర్లు కాగా ఇప్పటి వరకు 90 కి.మీ పూర్తయిందన్నారు. ఎర్రుబాలెం–నంబూరు (56.53 కి.మీ) లైను ఏపీ రాజధాని అమరావతిని కలుపుతుందని, భూసేకరణ పురోగతిలో ఉందన్నారు. నల్లపాడు–నంద్యాల 12 కి.మీ పూర్తయిందని తెలిపారు. నవంబర్ 2025 నాటికి గురజాల–నంద్యాల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, డిసెంబర్ 2026 నాటికి దిగువమెట్ట–గురజాల (40 కి.మీ) పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నల్లపాడు–పిడుగురాళ్ల 30 కి.మీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో 16 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేశారు. కొల్లూరు : కృష్ణా నదీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి, నది అంచుల వద్ద పొదల్లో తేలింది. ఆదివారం ఉదయం మండలంలోని ఈపూరులంకలో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు నది ఒడ్డు వెంబడి 60 సంవత్సరాల వరకు ఉన్న ఓ పురుషుడి మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లారు. రెండు రోజుల కిందట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలోకి దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహం అయి ఉండవచ్చన్న అనుమానంతో కొల్లూరు పోలీసులు తాడేపల్లి, విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మృతదేహం విజయవాడ వద్ద నదిలో దూకిన వ్యక్తిది కాదని అతని బంధువులు నిర్ధారించారు. నది ఒడ్డున పొదల్లో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లభించలేదు. బట్టతలతో, లేత గోధుమ రంగు చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి, చేతికి ఎర్రని దారంతో ఆంజనేయ స్వామి లాకెట్ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం శవాగారంలో భద్రపరచనున్నట్లు ఎస్ఐ జానకీ అమర్వర్ధన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు. -
క్యాన్సర్కూ ఉంది ఆన్సర్
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ వ్యాధికి గురైంది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్. కొన్ని వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కాని రోజ్ భయపడకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులకు రోజూ పువ్వులు అందించేది. వారికి కవితలు వినిపించి రోగుల్లో మనో ఉల్లాసాన్ని కలిగించేది. ఇలా ఆరునెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తూ వారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతూ సెప్టెంబరు 22న మరణించింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రోజ్ డేను నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: క్యాన్సర్ .. ఈ వ్యాధి పేరు చెబితేనే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతుంది. వస్తే చనిపోవటమే అనే అపోహల్లో ప్రజలు ఉన్నారు. పూర్వ రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాధితుల్లో భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 22న రోజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్ కారణాలు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగిరెట్, బీడీ, చుట్ట , పాన్పరాగ్, ఖైనీ, గుట్కా.. ఇలా ఏ రూపంలో పొగాకును తీసుకున్నా వస్తుంది. మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు గుంటూరు జీజీహెచ్లో 2020 జులైలో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు నాట్కో క్యాన్సర్ సెంటర్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ను ఏర్పాటు చేశారు. 100 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు క్యాన్సర్కు నేడు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్థెరపీ ద్వారా త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించే బీఆర్సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ ఎం.జి.నాగకిశోర్, సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు సంవత్సరం రోగుల సంఖ్య ఆపరేషన్లు 2020 2067 – 2021 5,865 114 2022 13,107 395 2023 14,647 753 2024 ఆగస్టు వరకు 9,376 542 -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని విరాట్ నగర్ సమీపంలో గల విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని చెరువు కట్ట బజారుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చల్లా రాజేష్(22) టిఫిన్ తీసుకొని వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. రోడ్డు తడిగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావటంతో రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడు రాజేష్ తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. -
రేవేంద్రపాడులో ‘వెయిట్ లిఫ్టింగ్’ ఎంపికలు
దుగ్గిరాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని అని హెచ్.ఎం బి.వి.కృష్ణారావు చెప్పారు. మండలంలోని రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూలులో ఆదివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 17 నుంచి 19 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు చురుగ్గా ఉండటానికి ఆటలు ఆడాలని, దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగ శిరీష, రాంబాబు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: తమలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని జిల్లా ఎస్పీకి కళాకారులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, శ్లోక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంట స్వామి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల గ్రౌండ్ 99 అడుగుల మట్టి మహాగణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థలతో కలసి శ్లోకా ఫౌండేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిత్యం శాసీ్త్రయ నృత్యాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఉత్సవాల అనంతరం కళాకారులకు సొమ్మును ఇవ్వకుండా కమిటీ ప్రెసిడెంట్ నరేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మీరెడ్డిలు అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లి పోయారని ఆరోపించారు. కళాకారులు, చిన్నారులు, మహిళలు, మేకప్ మేన్కు రూ 1,75,000 ఇవ్వాలని తెలిపారు. వెంటనే నగదు ఇప్పించాలని స్వామి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది మ్యామో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వారు సీ టీ స్కాన్, కొలనోస్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 సంవత్సరాల్లోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. హెపటైటీస్ బీని కూడా వ్యాక్సిన్ వేయించుకుని రాకుండా నిరోధించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, మెడికల్ అంకాలజిస్ట్ -
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలి
నరసరావుపేట: ఇరవై ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పేదలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక వినుకొండరోడ్డులోని సీతా మహాలక్ష్మి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన యూనియన్ పల్నాడు జిల్లా రెండో మహాసభకు యూనియన్ నాయకులు చంద్రకళ, ఎం.రత్నకుమారి, వి.రాజేశ్వరి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సీఐటీయూ జెండాను యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ ఆవిష్కరించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఏచూరి సీతారాం, సీతామహాలక్ష్మి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ గౌరవ వేతనంతో విశేష సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సామాజిక కార్యకర్తలే ఆశా వర్కర్లన్నారు. సంఘాలు బలోపేతం చేసుకుని పోరాటాలు సాగించి హక్కులు సాధించుకోవాలన్నారు. షుగర్, బీపి, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వంటి అనేక రకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. పనిచేయని ఫోన్లు, సిమ్లు వంటి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలకు రాతపూర్వకంగా జీఓలు ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో ప్రకారం ఆశావర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ లేకుండా ఆశాలు ఇంటింటికి తిరిగి చేసిన సర్వేలతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రజారోగ్యం కోసం జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని అన్నారు. అదనపు విధులు, ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించరాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల హక్కుల సాధన, సంక్షేమం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు సత్ఫలితాలిచ్చాయన్నారు. ఆశా వర్కర్లు చేపట్టే పోరాటాలకు యూనియన్ అండగా ఉంటుందని, పోరాడి హక్కులు సాదించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక .. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా కె.చంద్రకళ, గౌరవ అధ్యక్షురాలుగా డి.శివకుమారి, ప్రధాన కార్యదర్శి ఎం.రతకుమారి, కోశాధికారి ధనలక్ష్మి, మరికొందరిని సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా మహాసభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి -
25న విజయవాడలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాఽధితుల రక్షణపై ధర్నా
లక్ష్మీపురం: ‘దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరగదని కుల వివక్ష వ్యతిరేక సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులు, బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అట్రాసిటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళితులపై అణచివేత కొనసాగుతున్న పరిస్థితుల్లో బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయడం, లేదా ఎఫ్ఐఆర్లు బలహీనంగా నమోదు చేయడం వల్ల న్యాయం జరగడం లేదని అన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడే మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలను ప్రభుత్వం అడ్డుకోవడం మానుకోవాలన్నారు. న్యాయవాది శిఖా సురేష్ మాట్లాడుతూ కేసులను తేలికగా తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడమే సమాజంలో మార్పు తీసుకొస్తుంన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు మాట్లాడుతూ దళితులు గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు వర్గ సంఘాలు కూడా తోడై ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 25న విజయవాడలో జరగబోయే ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని కదిలించేలా పోరాటం చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుకొస్తున్నాయి..!
నరసరావుపేట: స్థానిక శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో 1981–84 బీఏ డిగ్రీ చదివిన ఆనాటి విద్యార్థుల సమ్మేళనం కళాశాలలోని ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. అప్పటి 78 మంది విద్యార్థుల్లో 45 మంది సమ్మేళనానికి హాజరై, నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. తాము చేసిన అల్లరి, చిలిపి పనులను నెమరు వేసుకున్నారు. తమ విజ్ఞప్తి మేరకు హాజరైన అప్పటి అధ్యాపకులు, మాజీ ప్రిన్సిపాల్ ఎంఆర్కే మూర్తి, హరిహరనాధశాస్త్రి, శివధర్మశాస్త్రి, రాజాశంకరరావు, గ్రంథాలయాధికారి, కేవీకే రామారావులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం తమ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, తమ కుటుంబాలు, పిల్లలను గురించి ఒకరినొకరు పంచుకున్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పటి విద్యార్థి నేటి గ్రానైట్ వ్యాపారి అయిన దేచవరం గ్రామానికి చెందిన బి.శివన్నారాయణ కళాశాల క్లాస్రూమ్ల ఆధునికీకరణకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. పూర్వ విద్యార్థి ఎస్.సత్యనారాయణరెడ్డి మరో రూ.లక్ష ప్రకటించారు. చనిపోయిన 22 మంది తోటి విద్యార్థులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అందరూ కలిసి భోజనాలు చేసిన అనంతరం మరోసారి కలుసుకుందామనే అంగీకారంతో బరువైన హృదయాలతో కళాశాల వీడారు. ఈ సమ్మేళనానికి అప్పటి విద్యార్థులైన జమ్ముల రాధాకృష్ణ, ఎస్.శ్రీనివాసులురెడ్డి, బొగ్గరం మూర్తి, ఇనగంటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకోగా తాళ్ల రాజశేఖరరెడ్డి, చల్లా శ్రీనివాసరావు, గుర్రం కొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 41 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
అన్నీ ఉచితమే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 45 కోట్లతో ప్రభుత్వ సహకారంతో గుంటూరు జీజీహెచ్లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటైంది. ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. రూ. కోట్లు ఖరీదు చేసే అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్, ట్రాకీథెరపీ, సీటీ స్టిమ్యులేటర్, పెట్స్కాన్ వైద్య పరికరాలు ప్రభుత్వం అందజేసింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి సైతం ప్యాలేటీవ్ కేర్ చికిత్సలు అందిస్తున్నాం. మందులు కూడా ఉచితంగా అందించి రోగుల్లో మనోధైర్యం కల్పిస్తున్నాం. మరో వంద పడకలతో క్యాన్సర్ సెంటర్ను నిర్మాణం చేస్తున్నాం. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
మద్యం మత్తులో వర్షం నీటిలో పడి వ్యక్తి మృతి
లక్ష్మీపురం: మద్యం మత్తులో వర్షపు నీటిలో పడి వంట మాస్టర్ మృతి చెందిన ఘటనపై అరండల్పేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్ 1వ లైన్ ప్రాంతానికి చెందిన చింతాబత్తిన కుమార్ బాబు (35) అరండల్పేట 10వ లైన్లోని మెస్లో వంట మాస్టర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. భార్య దుర్గాదేవి బొంగరాల బీడు యూపీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తోంది. కుమార్ బాబు శనివారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి డొంక రోడ్డు మూడు వంతెనల సెంటర్ వద్ద వర్షపు నీటిలో పడి మృతి చెందాడు. స్థానికులు భార్య దుర్గాదేవికి సమాచారం తెలియజేయడంతో హుటాహుటిన చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవి ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. -
సత్తెనపల్లిలో భారీ వర్షం
సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై సైతం నీరు భారీగా నిలిచింది. ప్రజలు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో కాలువలు పొంగిపొర్లాయి. మురుగునీటితోపాటు వాననీరు చేరడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. ఈదురు గాలులకు గుంటూరు రోడ్లోని గుంటూరు బ్రాంచ్ కెనాల్ కాలువ సమీపంలో భారీ వృక్షం నేలకూలింది. దాదాపు ముప్పావు గంటకుపైగానే ట్రాఫిక్ నిలిచిపోయింది. వృక్షాన్ని తొలగించి అధికారులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నందిగామలో లో లెవెల్ చప్టాపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గురప్రుడెక్క ఎక్కువగా పెరగడంతో ఈ సమస్య తలెత్తింది. కొందరు ద్విచక్ర వాహనాలతో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని నాగన్నకుంట ఏరియా, సుందరయ్య కాలనీ, మాస్ట్రీన్పేట, దోబీఘాట్ తదితర ప్రాంతాల్లో స్థానికులు ఇబ్బంది పడ్డారు. -
స్థానిక చిలకలూరిపేట రోడ్డులో 1,503 గృహాలతో నిర్మించిన టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిడ్కో) సముదాయం, దాని పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో పేద వర్గాలు భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాత్రి అయితే కనీసం విద్యుత్తు దీపాలు
నరసరావుపేట: టిడ్కో గృహాల నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించగా... వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక పూర్తి చేసింది. సుమారు 700 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్డు నుంచి టిడ్కో గృహ సముదాయం వరకు మధ్యలో హైలెవల్ బ్రిడ్జి సహా సీసీరోడ్డు నిర్మాణం, నీళ్ల ట్యాంకు, డ్రైన్లు, విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు, సబ్స్టేషన్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం వాటిలో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంకు పుణ్యమా అంటూ నివాసితులకు తాగునీరు లభిస్తోంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధిలైట్లు వర్షాలు, హైఓల్టేజ్ కారణంగా దెబ్బతిన్నాయి. మళ్లీ ఏర్పాటు చేసేవారే లేకుండాపోయారు. చిమ్మచీకటిలోనే ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పిచ్చి కంప చెట్లు భారీగా పెరగడంతో పెద్ద పాములు రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పట్టణంలో పనులు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటల తర్వాత టిడ్కో గృహాలకు మహిళలు రావాలంటే భయపడాల్సి వస్తోంది. వీధి దీపాలు లేక పోవటంతో మెయిన్ రోడ్డులో కొంతమంది యువకులు గంజాయి తాగుతూ, మరికొందరు మద్యం మత్తులో సంచరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. జగనన్న కాలనీపైనా అదే నిర్లక్ష్యం ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది. కనీస వసతులు కల్పించేందుకు ఏడాదిన్నరగా రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వం టిడ్కో సముదాయం పక్కన ఈ కాలనీ ఏర్పాటు చేసి పురపాలక పరిధిలోని సుమారు 600 మందికి పట్టాలు అందజేసింది. వాటిలో కొంతమంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ రోడ్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మించలేదు. వీధి దీపాలు, తాగునీటి ఊసే లేదు. తాగునీటి కోసం తామంతా బయటకు వచ్చి మినరల్ వాటర్ తెచ్చుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షం పడితే రెండు మూడు అడుగుల లోతు నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు. త్వరలో వీధిదీపాల ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, డీఈ రఫీక్లను వివరణ కోరగా.. టిడ్కో గృహాల మధ్య పెరిగిన పిచ్చిచెట్లు తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులు ప్రారంభించామన్నారు. మొత్తం 80 వీధి దీపాలు ఉండగా.. వాటిలో 40కుపైగా పనిచేయడం లేదన్నారు. వాటిలో 20 నూతన లైట్లు బిగించామన్నారు. మరికొన్ని లైట్ల కోసం రూ.5 లక్షలతో టెండర్లు పిలిచామని, మిగతావి త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జగనన్న కాలనీని హౌసింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, పుర పాలక సంఘానికి అప్పగించలేదని తెలిపారు. టిడ్కో సముదాయం వద్ద డ్రైనేజీలో పిచ్చి మొక్కలు -
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం
ప్రజా ప్రయోజనాలతో వార్తలు ప్రచురించినప్పుడు అధికార పార్టీకి మద్దతుగా లేకపోతే సంబంధిత విలేకరులపై కేసులు పెట్టడం అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజా ప్రయోజనాలతో ఎలాంటి వార్తలనైనా ప్రచురించే హక్కు పత్రికలకు ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను అణచివేయడం దారుణమైన విషయం. విలేకరులపై కేసులు పెట్టడం, వారి కుటుంబాలను వేధించడం ఏ ప్రభుత్వానికై నా సరైన పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికీ కట్టబెట్టలేదు. స్వాతంత్య్ర పోరాటానికి ముందు నుంచి గళమెత్తిన పత్రికలు.. ఎన్నో అన్యాయాలను ఎదిరించి రాశాయి. అధికారాలను మార్చాయి. విలేకరులపై తప్పుడు కేసులు పెట్టే సంస్కృతిని ఎవరైనా ఖండించాల్సిందే. – మెరుగుపాల రాజారత్నం, సీనియర్ జర్నలిస్ట్ -
భద్రతకేదీ భరోసా?
వినుకొండలో నడిరోడ్డుపై వ్యక్తిని నరికి చంపగా చిందిన నెత్తుటి మరక పల్నాడునేకాదు రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఇది మరవక ముందే నరసరావుపేట నడిబొడ్డున కోర్టు ప్రాంగణం సాక్షిగా తండ్రి, కుమారుడిని పట్టపగలు కిడ్నాప్ చేసి హతమార్చిన ఉదంతం శాంతిభద్రతలపై వందల ప్రశ్నలు మిగిల్చింది. ఓ హెడ్ కానిస్టేబుల్ పాస్పోర్టు కోసం లంచం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వైరలైన వీడియోలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాన్ని చాటిచెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా పల్నాడులో కీలకమైన డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా శాంతిభద్రతలపరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతం. గత సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు నరసరావుపేట నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రౌడీ మూకలు దాడులకు తెగబడ్డాయి. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక మోసాలతో నిత్యం ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. మరోవైపు వినుకొండ, నరసరావుపేటలో నడిరోడ్లపై హత్యలు, కిడ్నాపులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. నరసరావుపేటలో ఆర్థిక మోసాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. సాయి సాధన చిట్ఫండ్స్ పేరిట పుల్లారావు చేసిన మోసానికి రూ.వందల కోట్లు నష్టపోయిన బాధితుల వేదనలకు పోలీసుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. దీంతోపాటు యానిమేషన్ పేరిట కిరణ్ అనే వ్యక్తి స్కామ్ చేసి నరసరావుపేటలో వందల మందిని ముంచినా న్యాయం మాత్రం అందనంత దూరంలోనే నిలిచింది. ఇటీవల రెండు ప్రముఖ ద్విచక్ర వాహన డీలర్లు రూ.కోట్లలో అప్పులు చేసి ఉడాయించడంతో బాధితులు రోడ్డునపడ్డారు. అదేవిధంగా పేకాట, బెట్టింగ్, రేషన్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. నరసరావుపేట పోలీసు సబ్ డివిజన్లో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఇలాంటి ఘటనలు వెక్కిరిస్తున్నాయి. ఇన్చార్జి డీఎస్పీయే దిక్కు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూనే ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జీరో ఎఫ్ఐఆర్పై ఒక మహిళా న్యాయవాది సోషల్ మీడియా వేదికగా నరసరావుపేట పోలీసు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో అన్నింటినీ పర్యవేక్షించే వారు లేకపోవడమే కారణమన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన కె.నాగేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలలుగా ఆయన రెండు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలోనే పెద్దదైన నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 13 పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఉన్నాయి. శాంతిభద్రతల అదుపులో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వరన్యాయం అందడంలో జాప్యం చోటుచేసుకుంటోందని బాధితులు వాపోతున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు సంతప్తికరమైన సేవలు అందాలన్నా పోలీసు వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్ సేవలు ఎంతో కీలకం. ముందస్తు సమాచారం తెలుసుకొని జరగబోయే అవాంఛనీయ సంఘటనల నివారణలో ఎస్బీ ముఖ్యభూమిక పోషిస్తుంది. పల్నాడు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ సేవలు సక్రమంగా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు కీలకమైన ఎస్బీ డీఎస్పీ పోస్టు మంజూరు కాలేదు. అప్పటి నుంచి సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలోనే స్పెషల్ బ్రాంచ్ నడుస్తోంది. జిల్లాలో నేరాలపై సరైన సమాచారం లేక శాంతిభద్రతల పరిరరక్షణలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు పెచ్చుమీరాయి. పట్టపగలు వినుకొండ పట్టణంలో ఒంటరి మహిళలను హత్యచేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. పార్క్ చేసిన ద్విచక్రవాహనాలు క్షణాల్లో మాయం అవుతున్నాయి. ఎక్కడికక్కడ జూద శిబిరాలు వెలిశాయి. నిఘా వైఫల్యం కారణంగానే ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పాస్పోర్టు విచారణలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అమరావతిలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు పాస్పోర్టు జారీలో రూ.2 వేలు లంచం తీసుకొని కింద నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇచ్చినట్లు చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. -
‘ఆ మరణానికి కల్తీ లిక్కరే కారణమని మా అనుమానం’
పల్నాడు జిల్లా: అచ్చంపేటలో ఓ వ్యక్తి మృతి చెందడం వెనుక కల్తీ మద్యం కారణం అయ్యి ఉండొచ్చని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ అచ్చంపేట మరణం దురదృష్టకరం. బెల్ట్ షాపులో లిక్కర్ తాగిన తర్వాత వాందులు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం. ఆ మరణానికి కల్తీ మద్యం సేవించడం కారణం కావొచ్చనేది మా అనమానం. వైద్య సిబ్బందిపై నెట్టేసి, మసిపూసి మారేడు కాయ చేయడం మంచిది కాదు. హాస్పిటల్స్ ఉండాల్సిన డాక్టర్లు లేకపోతే చర్యలు తీసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరణానికి అసలు కారణం దాచే ప్రయత్నం మంచిది కాదు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాగా, పల్నాడు జిల్లాలోని అచ్చంపేట ముస్లిం కాలనీకి చెందిన షేక్ మాదిపాడు నాగులును అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతన్ని అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ సరైన వైద్యం అందక నాగులు మృతిచెందాడని ఒకవైపు ఆందోళణ వ్యక్తమవుతున్న సమయంలోనే లిక్కర్ తాగిన తర్వాతే నాగులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడని స్థానికలు చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలుగా ఉప్పుతోళ్ల వేణుమాధవ్ (నరసరావుపేట), షేక్ మాబూహుస్సేన్ (సత్తెనపల్లి) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా సత్తెనపల్లికి చెందిన షేక్జాని (గుంటూరు జాని), స్టేట్ సోషల్ మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శిగా తంగిరాల శ్రీనివాసరెడ్డి (మాచర్ల), స్టేట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కందుల ఎజ్రా (నరసరావుపేట), స్టేట్ వలంటీర్ వింగ్ సంయుక్త కార్యదర్శిగా పండ్ల మంగయ్య (మాచర్ల) నియమితులయ్యారు. తాడికొండ: బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ సీహెచ్.వాసు శనివారం తెలిపారు. తాడికొండకు చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గత పది నెలలుగా తాడికొండ గ్రామానికి చెందిన షేక్ అస్లామ్ యువతి కళాశాలకు వెళుతున్న సమయంలో వెంటబడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతి విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలిపింది. ఆమె తాతయ్య నిందితుడిని హెచ్చరించాడు. రెచ్చిపోయిన యువకుడు ఫోన్ చేసి తన ప్రేమను అంగీకరించకపోతే యువతితో పాటు ఆయన్ను చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాను గంజాయి రహితంగా చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి క్రయ, విక్రయాలు, సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో 3.5 కిలోల గంజాయి సీజ్ చేసి, 22 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, ఆస్తుల జప్తునకు కూడా చర్యలు చేపడతామని వివరించారు. పోలీస్స్టేషన్ స్థాయిలోని ప్రత్యేక పోలీస్ బృందాలు, ఈగల్ బృందాల సమన్వయంతో గంజాయి నిర్మూలిస్తామ డ్రోన్ కెమెరాల సాయంతోనూ గుర్తిస్తామని తెలిపారు. జిల్లాలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: బీఆర్ స్టేడియంలో శనివారం అండర్– 14, అండర్– 17, అండర్– 19 జిమ్నాస్టిక్స్ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి, అండర్ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్ ఆఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగాయి. -
హెల్త్ ఆన్ వీల్స్ రైలులో రెండవ విడత వైద్య పరీక్షలు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని రెండవ విడత హెల్త్ ఆన్ వీల్స్లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పీఆర్వో డి.వినయ్కాంత్ తెలిపారు. శనివారం గుంటూరు–దొనకొండ రైల్వే స్టేషన్ల మార్గంలో ఉద్యోగులకు రెండవ విడత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్కాంత్ మాట్లాడుతూ ఈనెల 13న కార్యక్రమాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి రోజు గుంటూరు– రేపల్లె మార్గంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొబైల్ మెడికల్ యూనిట్లో గుంటూరు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాసు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.సింధు, లలిత, ఒమేగా హాస్పిటల్స్తో పాటు శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు కలిసి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. రైల్వే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. డీఎంఓ గుంటూరు డాక్టర్ ప్రియాంక, డీఎంఓ దొనకొండ డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
చేనేతను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ రంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యమ కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. సత్తెనపల్లిలోని పణిదం చేనేత సొసైటీ కాలనీలో శనివారం జరిగిన సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ... అక్టోబర్ 6, 7వ తేదీలలో సత్తెనపల్లిలో సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో పోరాట కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం సుస్సులోవ్, పి ప్రభాకర్, బిట్ర పానకాలు, వలపర్ల చిన్న దిబ్బయ్య, మల్లాల గురవయ్య, మోపర్తి బాబు రాజు, గరికపూడి ఏసురత్నం పాల్గొన్నారు. -
కూటమి ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకుంటాం
●ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుంటాం ●సోషల్ యాక్టివిస్టుల ప్రకటన నరసరావుపేట: ౖవెఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పిడుగురాళ్లలోని మెడికల్ కళాశాలను గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపీచంద్, ఇంగ్లిష్ మీడియం పరిరక్షణ వేదిక కన్వీనర్ డి.ఏడుకొండలు శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు ఫొటోలు, వివరాలను మీడియాకు వారు శనివారం విడుదల చేశారు. నాలుగు చోట్ల ఉన్న పోలీస్ చెక్పోస్టులను చాకచక్యంగా దాటి, హైవే పక్కన ఉన్న మెడికల్ కాలేజీ ముందుకు వెళ్లి సెల్ఫీ దిగామన్నారు. పేద ప్రజలు, పేద వైద్యవిద్యార్థుల మీద వాత్సల్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకంగా తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మే దుశ్చర్యను కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియచేశామన్నారు. పలువురు నిరసనకారులను అక్కడి పోలీసులు కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకొని చెదరగొట్టటమే కాక, వెంటబడి పట్టుకుని వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారన్నారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఖండించారు. మెడికల్ కళాశాల ఆవరణలోకి వెళ్లి జగన్ చేయించిన అద్భుత నిర్మాణాన్ని వివరిస్తున్న వైఎస్సార్సీపీ యువనేత నాగార్జున యాదవ్పైన, అమరావతిలో శాసనమండలి సభ్యుల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సాక్షి మీడియా ఇన్పుట్ ఎడిటర్పై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల నిరసనను కూటమి ప్రభుత్వం ఎంతోకాలం అణచలేదని తెలిపారు. వీటికి భయపడకుండా, మరిన్ని పోరాటాలలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు. -
పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట
‘‘రండి బాబు రండి.... అనువైన చోటు.. తిండి, మద్యం బాధ్యత మాదే! కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు... అది కష్టం అనుకుంటే ఫోన్ పే, గూగుల్ పే అయినా ఓకే. ఇన్నాళ్లు మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు. ఈ ఆనందం కోసం ఇప్పుడు మన రాష్ట్రం దాటవలసిన పనిలేదు. పక్క రాష్ట్రం వారు కూడా మన శిబిరం వద్దకే వస్తున్నారు. రండి.. మీ భద్రతకు మాదే పూచీ. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టడానికి చేతి కింద ఎంతోమంది జాకీలు సిద్ధం. మీరు డబ్బులు గెలుచుకోవాలేగానీ ‘క్వీన్ ’ కూడా రెడీ. పైన కింగ్ ‘మనోడే’. ఇంకెందుకు ఆలోచిస్తారు... జోకర్ పడకపోయినా కూడా షో చెప్పవచ్చు. ట్రిపులెట్లా మీ జీవితం వెలిగిపోవచ్చు....’’ అంటూ రాష్ట్రంలో పేకాడే వాళ్లను అధికార కూటమి నేతలు పల్నాడు జిల్లాకు ఆహ్వానిస్తున్నారు. సాక్షి టాస్క్ ఫోర్స్: ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన చరిత్ర జూదానిది. పండగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తుల అమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్నో వేల కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయి. ఎంతోమంది ఐపీ పెట్టారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది. కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో నాయకులు మూడు ముక్కలు...ఆరు ఆటలుగా.. పేకాట దందా నిర్వహిస్తున్నారు. యథేచ్ఛగా క్లబ్లులు తెరిచి అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి. దీంతో తెలంగాణ నుంచి భారీ ఎత్తున పేకాటరాయుళ్లు రోజూ వందల మంది పల్నాడు జిల్లాలో ఆడేందుకు వస్తున్నారు. అంతే కాకుండా బందరు, పశ్చిమగోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల వారూ ఇక్కడికి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహణ గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణ శివారు ప్రాంతాల్లో గ్రామాల్లో, మాచర్ల నియోజకవర్గంలోనే కారంపూడి, మాచర్ల పట్టణంలో, వినుకొండ నియోజవర్గంలోని వినుకొండ పట్టణం, ఈపూరు మండలంలో, పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతిలో భారీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ, మిర్యాలగూడెం ప్రాంతాల నుంచి పేకాట ఆడేందుకు పదుల సంఖ్యలో కార్లు వేసుకొని వందల మంది నిత్యం వస్తున్నారు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజవర్గం పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి చెందిన రెస్టారెంట్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెంకి చెందిన వారిని పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అదే తరహాలో బ్రాహ్మణపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో 36 మందిని పేకాట ఆడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారుగా రూ.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కానీ కూటమి నాయకుల ఒత్తిడితో పోలీసులు వారిని వదిలిపెట్టారా? అనేది చర్చనీయాంశంగా మారింది. బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం అమ్మకాలు చేయాలి. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బార్లు ఉంటాయి. గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలలో అర్ధరాత్రి ఐతే చాలు బార్లు పేకాట నిలయాలుగా మారాయి. పేకాట టేబుళేకల నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు రూ. లక్షల్లో ఆట కొనసాగుతోంది. ఈ విషయం పోలీసులకూ తెలుసని, కమీషన్ ఇస్తుండటంతో అటువైపు చూడడం లేదని సమాచారం. తెలుగు తమ్ముళ్లు నిత్యం ఎక్కడో ఒక చోట పేకాట ఆడిస్తూ జేబులు నింపుకొటున్నారు. ఆడే వారి జేబులు గుల్లవుతున్నాయి. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పల్నాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
డయేరియా కేసులు @100
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో డయేరియా కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. తగ్గుముఖం పట్టకపోగా రోజ రోజుకీ పెరుగుతుండటంతో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయానికి జీజీహెచ్లో బాధితుల సంఖ్య 92కు చేరింది. సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా అధికారులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. కలుషిత నీరు కాదు, కలుషిత ఆహారం వల్లే సమస్య ఏర్పడిందంటూ కమిషనర్ డయేరియా వెలుగు చూసిన రోజే ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారింది. జీజీహెచ్ వైద్యులు మాత్రం కలుషిత నీటి వల్లే ఈ సమస్య ఏర్పడిందని స్పష్టంగా చెబుతున్నారు. బాధితులు సంఖ్య బయటపెట్టని అధికారులు జీజీహెచ్కి వచ్చిన కేసులను కూడా పూర్తిగా బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆర్ఎంపీల వద్దకు వెళుతున్న వారు, ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలను వెల్లడించకుండా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జీజీహెచ్ను అకస్మికంగా తనిఖీ చేశారు. అతిసార, ఇతర బాధితులను పరామర్శించారు. వైద్య సిబ్బంది సందర్శనలు, స్థానికుల తాగు నీటి వసతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజల్లో ఆందోళన 2018లో ఆనందపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే విధంగా డయోరియాతో 30 మంది వరకూ మరణించడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లు మురుగు కాలువల్లోనే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని మురుగు కాలువను అనుకొని వెళుతున్నాయి. వర్షం కురిస్తే చాలు పొంగి వాటర్ పైపులైన్లన్నీ కూడా మునిగిపోతున్నాయి. పైపుల్లోకి మురుగు నీరు చేరుతుందని నగరంలోని రామిరెడ్డితోట, ఆనందపేట, దుర్గానగర్, యానాదికాలనీ, తదితర ప్రాంతవాసులు చెబుతున్నారు. -
దేవీ శరన్నవరాత్రుల వాల్పోస్టర్ల ఆవిష్కరణ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఈ నెల 22 నుంచి చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దేవస్థానంలో శనివారం మహోత్సవాల గోడప్రతులను కమిటీ సభ్యులతో కలసి ఆమె ఆవిష్కరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరగుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి పాల్గొన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ శనివారం కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు, బాలికల అక్రమ రవాణా నిర్మూలనకు ఎన్జీఓలు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. సీనియర్ సిటిజన్లకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించాలన్నారు. హెచ్ఐవీ నిర్మూలనకు, ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు ఎన్జీవోలు తగు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ ఎన్జీఓల ప్రతినిధులు హృదయ రాజు, మీరా, డేవిడ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మొదట న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం రాత్రి ఉరుములతో భారీ వర్షం కురిసింది. నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరండల్పేటలో పైపులైను కోసం తవ్విన గుంతల పక్కన మట్టి రోడ్డుపైనే ఉండటంతో వర్షం నీటితో చిత్తడిగా మారింది. పలువురు పాదచారులు, వాహన చోదకులు జారిపడి గాయపడ్డారు. డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద వర్షపునీటితో రాపోకపోలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట అండర్పాస్ పూర్తిగా నీటి మయం కావడంతో అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మవారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ శనివారం విమర్శించారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. -
పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు
ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు. ఏ మీడియాకు లేని ఆంక్షలు ఒక్క ‘సాక్షి’కే ఎందుకు వర్తిస్తాయో కూటమి సర్కారు జవాబు చెప్పాలి. వాస్తవాలు రాస్తున్నారని ద్వేషమా? నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్నారనే ఆక్రోశంతో చంద్రబాబు, లోకేష్లు రగిలిపోతున్నారు. విలేకరుల సమావేశంలో కూటమి కుట్రల గురించి ప్రస్తావిస్తే.. ‘సాక్షి’పై.. ఎడిటర్పై కేసులు కట్టడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఆలోచించాలి. నిస్సిగ్గుగా మేం ఏం చేసినా అడిగే వాడు లేడన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేసులు పెట్టి కలాన్ని, పాత్రికేయులను నిలువరించలేరు. ఈ వాస్తవాన్ని కూటమి సర్కారు ఇప్పటికై నా గ్రహించాలి. – పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు -
నియోజకవర్గం వేదికగా జూలకంటి కక్ష సాధింపులు
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మాచర్లలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రజలకు స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అభివృద్ధి, సంక్షేమాలను పక్కనపెట్టి తన కక్షసాధింపు చర్యలకు మాచర్లను వేదిక చేసుకున్నాడన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గంలోని 20 గ్రామాలకు చెందిన సుమారు 570 కుటుంబాలు ఊరు వదలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకతో అయినా వారికి స్వేచ్ఛ వస్తుందని భావించానన్నారు. మాచర్లలో అప్రజాస్వామిక పోకడలపై అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చి ఉంటారని, దానిపై స్పందించి ఆ 570 కుటుంబాలు తిరిగి గ్రామాలకు వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నానన్నారు. వెళ్లిపోయిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు ఉన్నాయని, వారికి స్వేచ్ఛగా బతికే అవకాశాలు కల్పించాలన్నారు. వరికపూడిశెలపై ఒక్క ప్రకటనైనా లేదు పల్నాడు ప్రజల చిరకాల కోరికై నా వరికపూడిశెల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను గత ప్రభుత్వంలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారన్నారు. ఎంతో కీలకమైన పర్యావరణ, వన్యప్రాణ అనుమతులను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ తీసుకువచ్చారన్నారు. మొదటి దశ పనులను ప్రారంభించామని, అయితే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నా రు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలోనైనా ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను విడుదల చేసి, పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో చెబుతారని ఈ ప్రాంత ప్రజలు ఆశించారన్నారు. అయితే సీఎం ఆ దిశగా ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. 15 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న చంద్రబాబు వచ్చిన ప్రతిసారి ప్రకటనలు, శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే నిధులు విడుదల చేసి, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వరికపూడిశెల పూర్తి చేసే సత్తా ఒక్క వైఎస్ జగన్కి మాత్రమే ఉందన్నారు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని మాచర్లలో కూటమి నేతలు అక్రమ రవాణా చేసి రూ.కోట్లు సంపాదిస్తున్నారన్నారు. బడుగు బలహీనవర్గాలకు తినడానికి ఒక్క కిలో రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. మాచర్లలో జరుగుతున్న దుర్మార్గాలను సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ స్థానిక నేతలు శనివారం ప్రయత్నించినా అవకాశం దక్కకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నారన్నారు. జూలకంటి అప్రజాస్వామిక పోకడలపై తెలుగుదేశం పార్టీ క్యాడరే రోడ్డుపై వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అక్రమ కేసులు, పీడీ యాక్టులు పెట్టడం, ప్రజలను దోచుకోవడం తప్ప బ్రహ్మారెడ్డి మాచర్లకు చేసిందేమి లేదన్నారు. -
ఫణిదంలో దారుణం
సత్తెనపల్లి: అప్పు తిరిగి చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో అప్పు తీసుకున్న వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో.. ఆ వివాదానికి కారణం తామేనని చెబుతాడనే ఆలోచనలతో రుణదాత కుటుంబం ఆత్మహత్యకు యత్నించడం అందులో తల్లీ కుమారులు నేలబావిలో దూకి చనిపోవడం, రుణదాత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం.. ఈనెల 17న సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారిన విషయం పాఠక విధితమే. అయితే పురుగుమందు తాగి చికిత్సపొందుతూ రుణదాత సైతం చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడటంతో ఫణిదం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబం మొత్తం దూరమవ్వడంతో శ్రీనివాసరావు కుమార్తె వెంకట జ్యోతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమె రోదన చూపరులను సైతం కంటతడికి గురి చేస్తోంది. శ్రీనివాసరావు మృతదేహానికి సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో శనివారం పోస్ట్మార్టం నిర్వహించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు నిర్బంధం
పిడుగురాళ్ల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో, పోలీస్స్టేషన్ వద్ద, ఖలీల్ దాబా వద్ద ఉన్న బైపాస్ రోడ్డులో, బ్రాహ్మణపల్లి బైపాస్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటుచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కారులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా సుమారు 300 మంది మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. వారిలో 50 మందిని పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. 250 మందిని పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో నిర్బంధించారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు వైద్య కళాశాలకు వచ్చే వారిని కవరేజ్ కోసం సాక్షి మీడియా బృందం విధులు నిర్వహిస్తుంటే అక్కడ కూడా పోలీసులు వీడియోలు, ఫొటోలు తీయనివ్వకుండా ఆంక్షలు విధించారు. పోలీస్స్టేషన్లో కూడా విలేకరులు పోలీస్స్టేషన్ బయట నుంచి అదుపులోకి తీసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఫొటోలు తీస్తే పోలీసులు దౌర్జన్యంగా ఫొటోలను డిలీట్ చేయాలని హుకుం జారీ చేశారు. అక్కడికి చేయని పక్షంలో చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోలీసులే తీసిన ఫొటోలను, వీడియోలను డిలీట్ చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారిని తిరిగి గ్రామాలకు వెనుదిరిగాలని లేనిపక్షంలో పోలీస్స్టేషన్కు తరలిస్తామని చెప్పి కొందరిని వెనుదిరిగేలా చేశారు. నాయకుల హౌస్ అరెస్టు పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్తోపాటు కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రునిరామిరెడ్డి, గురజాల నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సాంబశివరావుతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్టు చేసి అడ్డుకున్నారు. అరెస్టు అయిన వారిలో గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, గురజాల నియోజకవర్గ మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ జైలాబ్దిన్, కౌన్సిలర్ కొక్కెర శ్రీను, పాశం వెంకటేశ్వరరెడ్డి(చిన్నోడు), జిల్లా యువజన విభాగ ఉపాధక్షులు జబీర్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఇల్లూరి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరారెడ్డి, కరాలపాడు సర్పంచ్ చల్లా శివారెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు శెట్టుపల్లి పూర్ణ, కామేపల్లి సర్పంచ్ ముప్పూరి వెంకటప్పయ్య, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ పిచ్చిరెడ్డి, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ షేక్మాబు, మాజీ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ ముడేల వెంకటేశ్వరరెడ్డి, ఎన్డీఎల్, పిడుగురాళ్ల పట్టణ ఉపాధ్యక్షులు కందులూరి శివయ్య, చల్లా ఆవులయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు చింతల జానకిరామయ్య, శివరాత్రి నారాయణ, కానాల శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ షేక్ సలాంతోపాటు యువజన, విద్యార్థి విభాగ నాయకులు ఉన్నారు.చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమం విజయవంతం -
మాజీ ఎమ్మెల్యే కాసును అడ్డుకున్న పోలీసులు
దాచేపల్లి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించతలపెట్టిన ‘చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని దాచేపల్లి సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ వద్ద అడ్డుకున్నారు. మిర్యాలగూడ సమీపంలో మహేష్రెడ్డి కారును ఆపిన పోలీసులు నిరసన కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్లాల్సిందేనని మహేష్రెడ్డి పట్టుబట్టారు. పోలీసులు ససేమిరా అన్నారు. మహేష్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా భారీ సంఖ్యలో మిర్యాలగూడ చేరుకున్నారు. ఒక దశలో కార్యకర్తలతో కలసి నడుచుకుంటూ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లేందుకు కాసు ప్రయత్నించారు. సుమారుగా 60 మంది పోలీసులు మహేష్రెడ్డిని చుట్టుముట్టారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రభుత్వానికి సవాలు విసరాలని మహేష్రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కాసును అదుపులోకి తీసుకోని బలవంతంగా కారులో ఎక్కించారు. మిర్యాలగూడ నుంచి హాలియా, నాగార్జునసాగర్ మీదుగా నరసరావుపేట తరలించారు. పోలీసుల తీరు పట్ల మహేష్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన జరుగుతున్న ఈ ఉద్యమానికి పోలీసులు ఆటంకాల సృష్టించడం పట్ల ఆయన మండిపడ్డారు. పొందుగుల చెక్పోస్టు వద్ద భారీ బందోబస్తు రాష్ట్ర సరిహద్దు పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై బారికేడ్లు పెట్టి ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. నగర పంచాయతీలో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలతోపాటు మండలంలో ఉన్న నాయకుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, వైస్ చైర్మన్లు కొమెరాబత్తిన విజయకుమార్, షేక్ ఖాదర్ బాషా, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు కుందూరు తిరుపతిరెడ్డి, జక్కా అశోక్, మునగా శ్రీనివాసరావు, పరిమి బాబు, షేక్ ఇమామ్ వలి, గాదె రామకృష్ణారెడ్డి, జంగాల సింగర్ యాదవ్, మేడతి నరసింహారావు, బొమ్మిరెడ్డి నరసింహారావు, మోమిన్ నాగుల్, మీరా, ముత్యం చెన్నారెడ్డి, అకూరి వీరారెడ్డి, ముడి విక్టర్ పాల్, ఎన్.అనిల్, మందపాటి వీరారెడ్డి, కొండా నాయక్, సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుపరం ఓ పెద్ద స్కామ్
నరసరావుపేట: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో పెద్ద స్కామ్ దాగి ఉందని, దీనికి చంద్రబాబు, లోకేష్లు తెరతీసారని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం కేవలం లంచాల కోసం తన చంచాలకు అప్పచెప్పే ప్రయత్నమని పేర్కొన్నారు. దీని వలన మేనేజ్మెంట్ కోటా కింద ఒక్కో సీటు రూ.2కోట్లకు అమ్ముకుంటారని, సుమారుగా 300 సీట్లతో ఏడాదికి రూ.600 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.2400 కోట్లు దోచిపెట్టే ప్రయత్నమే ఈ మెడికల్ కళాశాల వ్యవహారమని అన్నారు. తనకు అధికారం అప్పగిస్తే సంపద సృషి్ాట్స్తనన్న చంద్రబాబు జగనన్న సృష్టించిన సంపద అమ్ముతూ రాష్ట్రంలో విధ్వంస పాలన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుది సుపరిపాలన కాదని విధ్వంసపాలనగా అభివర్ణించారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారని,. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అప్పచెప్పకుండా పప్పుబెల్లాల్లా అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం ద్వారా ఈ గుడ్డి ప్రభుత్వానికి తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తున్న తమను హౌస్ అరెస్టు చేయటమేమిటని ప్రశ్నించారు. పార్టీ సమన్వయకర్తలైన తనతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజిని, డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడులను హౌస్ అరెస్టు చేశారన్నారు. హైదరాబాదు నుంచి కార్యక్రమానికి తరలివస్తున్న కాసు మహేష్రెడ్డిని మిర్యాలగూడ వద్ద అరెస్టు చేయటం దారుణమని అన్నారు. పిడుగురాళ్లలోని మెడికల్ కాలేజీ 80శాతం పూర్తయిందని, 90 శాతం వైద్యశాల పూర్తయిందన్నారు. కేవలం పది శాతం పూర్తిచేస్తే ప్రారంభించవచ్చన్నారు. 2019కు ముందు కేవలం 11 మెడికల్ కళాశాలలు బాబు కట్టిస్తే జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో 17 కళాశాలల నిర్మాణం చేపట్టారన్నారు. ఉత్తరప్రదేశ్లో 75మెడికల్ కళాశాల నిర్మాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మెడిసిన్ చదివేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఫిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్ లాంటి విదేశాలకు పంపిస్తున్నారని చెప్పారు. 2023–24 నాటికి ఐదు మెడికల్ కళాశాలలు పూర్తిచేసి ప్రారంభించారని, దీని వలన అదనంగా రాష్ట్రానికి 750 సీట్లు కలిసి వచ్చాయన్నారు. వచ్చే 2029 నాటికి మరో నాలుగు మెడికల్ కళాశాలలు సిద్ధమౌతాయ న్నా రు. కూటమి ప్రభుత్వం రాగానే పనులు ఆపేస్తూ జీఓ జారీచేసిందన్నారు. జగన్పై కోపంతో పులివెందులలో సీట్లు వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాశారన్నారు. పది మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అప్పచెప్పేందుకు టెండర్లు ఆహ్వానించిందని, కేవలం సింగిల్ టెండర్దారు వచ్చినా అప్పచెప్పే విధంగా నిబంధనలు సవరించారని, ఇది పెద్ద స్కామ్గా ఆయన అభివర్ణించారు. కేవలం 16 నెలల్లో రూ.2 లక్షలకోట్లు అప్పుచేసిన కూటమి ప్రభుత్వం రూ.5500 కోట్లతో మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ఇన్స్యూరెన్స్ కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో వనరులని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి కోట్లకు కోట్లు దోచుకునే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు, లోకేష్ల దుర్మార్గపు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. -
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హౌస్ అరెస్టు
పెదకూరపాడు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును శుక్రవారం తెల్లవారుజామున క్రోసూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని అక్కడకి వెళ్లకూడదు అంటూ క్రోసూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకరరావుకి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అన్నారు. ప్రైవేటీకరణ నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే పోలీసులు హౌస్అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించా రు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైద్య, విద్యారంగాలను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు
సత్తెనపల్లి: రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యారంగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు మండిపడ్డారు. పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించేందుకు శుక్రవారం బయల్దేరారు. పోలీసులు ఎక్కడిక్కడ చెక్పోస్టులు పెట్టి ఆంక్షలు విధిస్తూ అడ్డుకునే ప్రయత్నాలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చే విద్యార్థి, యువజన విభాగ నాయకులను సత్తెనపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కార్లు, వాహనాలను ఆపేసి విద్యార్థులను దింపేశారు. మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లడానికి వీల్లేదు, నిరసన తెలియజేయడానికి వీల్లేదంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆయా విభాగాల నాయకులు సత్తెనపల్లి తాలూకా సెంటర్లోని పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తుంటే అడుగడుగునా ఆంక్షలు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు.. మేము పోలీసులను అడుగు తున్నామని, అయ్యా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా అని, మీ పిల్లలు చదువు కుంటున్నారన్నారు. గంట సేపు రోడ్డుపై ట్రాఫిక్ ఆగినంత మాత్రాన ప్రజలు ఇబ్బందులు ఏమీ పడరని, మెడికల్ కాలేజీలు ఆగిపోతే రాష్ట్రంలో ప్రజలతోపాటు, కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోతారన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సుమారు ఐదు నెలల్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకు రావడం జరిగిందన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వానికి ఏం అడుగుతారంటే మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని... మెడికల్ సీట్లు కావాలని కోరతారన్నారు. దుర్మార్గం ఏందంటే మన రాష్ట్రంలో మాత్రం మెడికల్ సీట్లు వద్దు, మెడికల్ కాలేజీలు వద్దంటూ డైరెక్ట్గా ఎన్ఎంసీకి లెటర్ రాసిన వ్యక్తి దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ యువజన్ విభాగం గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ కళ్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరసన తెలియజేస్తే కదా విద్యార్థులు ఏం కోల్పోయారు, పేదలు ఏం కోల్పోయారనేది తెలిసేదన్నారు. గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేదని అడ్డుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నామని, కనీసం కొంత మందికై నా అనుమతి ఇవ్వాలని అడిగినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. యువజన విభాగం గుంటూరు టౌన్ అధ్యక్షుడు వై.కోటేశ్వరరావు మాట్లాడుతూ అనుమతి లెటర్ పంపాం, అయితే వారు అనుమతి ఇవ్వలేదన్నారు. నడుచుకుంటూ వెళతామంటే వదల్లేదని, విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే అనుమతిన్ లేదంటున్నారన్నారు. శాంతియుతంగా చేస్తుంటే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సుభాని మాట్లాడుతూ అణచివేత ప్రభుత్వమంటే తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పులివేందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే, నాకు సీట్లు వద్దు, నేను పేదలకు ఉపయోగపడే పని చేయడం లేదని చెబుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెడికల్ కాలేజ్లు ప్రైవేటుపరం చేయడమంటే ఒక వ్యక్తి ధనం ఆర్జించడమేనన్నారు. ఎక్కడిక్కడ విద్యార్థులను ఆపి సత్తెనపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన విభాగం నాయకులు చిన్నాబత్తిని వినోద్కుమార్, బాజీ, కానూరి శశిధర్, పిడతల భానుప్రకాష్, పేటేటి నవీన్కుమార్, రవీంద్ర, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దోచుకునేందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులను అడ్డుకున్న పోలీసులు పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య -
నాగభూషణ్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాచవరం/పిడుగురాళ్లరూరల్: ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారిందని, విద్య కోసం పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి చంద్రబాబు వలన వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం సంయుక్త కార్యదర్శి గజ్జల నాగభూషణ్రెడ్డి అన్నారు. చలో మెడికల్ కాలేజీలో భాగంగా కామేపల్లి గ్రామంలో ఉన్న మెడికల్ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రాంగణంలోకి వెళ్లి సెల్ఫీ దిగారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తి అయిన మెడికల్ కాలేజీని చూపించేందుకు లోపలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు మణిహారంగా పిడుగురాళ్ల దగ్గరలో మెడికల్ కాలేజీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మిస్తే చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. ఏడాదిన్నర అవుతున్నా నిర్మాణం శూన్యమన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు కాలేజీలు వస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందదని, యాజమాన్యం ఫీజుల రూపంలో దోచుకుంటారని ఆయన అన్నారు. ప్రభుత్వ కాలేజీలు వస్తే రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయని అన్నారు. ప్రైవేటీకరణను ఆపేదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనంతరం ఆయన సెల్ఫీ దిగి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. -
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక నిరంకుశ పాలన
చిలకలూరిపేట: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగుతోందని... ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజల గొంతుకగా మారి, ప్రజల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. పిడుగురాళ్లలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పట్టణ పోలీసులు గురువారం రాత్రి నుంచే పహారా ఏర్పాటు చేశారు. శుక్రవారం చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రిని అర్బన్ సీఐ పి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రజిని మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్వహణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ ప్రాంతంలో ఏ కాలేజి నిర్మాణం జరిగిందో అక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడే అధికారం తమకు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించకుండా గృహ నిర్బంధం విధించారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన కాలంలో 17 మెడికల్ కాలేజిలను అనుమతులు తెచ్చి రూ.8,500 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మొదటి విడతగా ఐదు కళాశాలలను పూర్తిచేసి తరగతులను ప్రారంభించినట్లు వివరించారు. రెండో విడతగా మరో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మూడో విడతగా ఏడు మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కళాశాలల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని చెప్పారు. పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం ఈ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కుయుక్తులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అప్పగించి జేబులు నింపుకొనే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు కుప్పాల ప్రభుదాస్, పార్టీ పట్టణ, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, వడ్డేపల్లి నరసింహారావు, పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడదల రజిని చలో మెడికల్ కాలేజీకు హాజరుకాకుండా హౌస్ అరెస్ట్ -
చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు..
వినుకొండ: రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులు మంచివి కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గురువారం రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. బొల్లా మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు జగనన్న సృష్టించిన సంపదను ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ గత ప్రభుత్వం హయాంలో వందల కోట్ల అభివృద్ధి పనులను ఎక్కడ చేశారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు మేము వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి, వరికపుడిశెలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేతకాక తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తామని చంద్రబబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదని ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సరైన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. పేదలకు వైద్యం అందించేందకు, ఏర్పాటు చేసిన కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమానికి వెళుతున్న నాయకులను అడ్డుకోవడంపై మండిపాటు -
విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
నరసరావుపేట ఈస్ట్: అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ లింగిశెట్టి బాలనవ్యశ్రీ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో 77, 107, 108 జీఓలను రద్దు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా జీఓల రద్దు మాట అటుంచి వైద్యవిద్యను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. ప్రైవేటు పరం చేయటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాసరి హేమంత్కుమార్, ఎం.మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి, యువజన విభాగాల నేతలపై కేసు నమోదు సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని చలో ప్రభు త్వం మెడికల్ కళాశాలను సందర్శించేందుకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వ ర్యంలో గుంటూరు నుంచి వస్తున్న నాయకులను సత్తెనపల్లిలో పోలీసులు శుక్రవారం అడ్డుకున్నా రు. తాము శాంతియుతంగా వెళుతున్నప్పటికీ పోలీసులు వాహనాలను నిలిపివేసి పూర్తిగా అడ్డుకోవడంతో ఆయా విభాగాల నాయకులు, విద్యార్థులు పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించారని 7వ సచివాలయ గ్రామ రెవెన్యూ అధికారిణి చిరుమామిళ్ల అరుణ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ జే.శ్రీనివాసరావు 10 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. వారిలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షు డు పానుగంటి చైతన్య, యువజన విభాగం గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ కళ్లం హరికృష్ణారెడ్డి, ఆయా విభాగాల నాయకులు పులగం సందీప్రెడ్డి, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, చిన్నాబత్తిన వినోద్కుమార్, పేటేటి నవీన్కుమార్, షేక్ సుభాని, వై కోటేశ్వరరావు, బీ.రవీంద్ర, కోనూరి శశిధర్ లపై కేసు నమోదు చేసి నోటీసులు అందించారు. -
చలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను అడ్డుకునేందుకు కుట్ర
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఛలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కార్యక్రమానికి నాయకులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డిని నరసరావుపేటలో గురువారంరాత్రి హౌస్ అరెస్ట్ చేసి శుక్రవారం కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి భర్త చల్లంచర్ల సాంబశివరావు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అచ్యుత శివప్రసాద్ ఇళ్లకు తెల్లవారుజామున పట్టణ పోలీసులు వెళ్లి హౌస్ అరెస్ట్ చేసి బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి, వైద్య విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ముక్తార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ మౌలాలి, సత్తెనపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు కొమెర శివశంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు వేర్వేరు మార్గాల ద్వారా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలను సందర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు. సమన్వయకర్త సుధీర్ భార్గవ్రెడ్డితోపాటు ఇరువురు నాయకులు హౌస్ అరెస్ట్ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో తరలిన నేతలు -
యెనుముల హౌస్ అరెస్టు
గురజాల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు–వినుకొండ నియోజవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మెడికల్ కళాశాల వద్ద శాంతియుత ఽనిరసన చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌస్ అరెస్టు చేశారు. 23న సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన సత్తెనపల్లి: పట్టణంలోని లూథరన్ చర్చి ప్రాంగణంలో ఈనెల 23న సాయంత్రం ఆరు గంటలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం శరణం గచ్చామి 769వ నాటక ప్రదర్శన జరుగుతుందని సంఘం జిల్లా కార్యదర్శి జి రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలిపారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు ప్రదర్శిస్తారని తెలిపారు. జిల్లాలో 362.6 మిల్లీమీటర్ల వర్షం నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో 362.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. ఐదు మండలాలు మినహా 23మండలాల్లో వర్షం నమోదైంది. అత్యధికంగా అమరావతి మండలంలో 52.6 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా రాజుపాలెంలో 1.0 కురిసింది. మాచర్ల 4.2, వెల్దుర్తి 15.2, దుర్గి 42.2, రెంటచింతల 20.2, గురజాల 27.2, దాచేపల్లి 12.0, కారంపూడి 7.4, పిడుగురాళ్ల 24.2, మాచవరం 4.2, బెల్లంకొండ 9.6, అచ్చంపేట 40.2, క్రోసూరు 16.0, పెదకూరపాడు 5.0, సత్తెనపల్లి 10.4, బొల్లాపల్లి 6.2, వినుకొండ 12.8, నూజెండ్ల 28.2, శావల్యాపురం 2.4, నాదెండ్ల 5.4, చిలకలూరిపేట 13.8, యడ్లపాడు 2.2 మి.మీ వర్షం కురిసింది. టెయిల్ పాండ్ ప్రాజెక్టును సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ సత్రశాల(రెంటచింతల): నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును, పవర్ హౌస్ను కృష్ణా నదీ జలాల బోర్డు చైర్మన్ బీపీ పాండే శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కమిటీ సభ్యులు కమల్, ఏపీ జెన్కో ఏసీ వెంకట రమణ, శ్రీనివాసులు, ఈఈ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
డాక్టర్ గోపిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నరసరావుపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి గురువారం రాత్రే హౌస్ అరెస్టుచేస్తూ నోటీసులు అందజేశారు. కార్యాలయం ముందు పోలీసులు కాపలాగా ఉన్నారు. అయినప్పటికీ శుక్రవారం ఉదయం నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరేందుకు పార్టీ కార్యాలయం నుంచి బయటకురాగానే సీఐ హైమారావు తన సిబ్బందితో వారిని వారించారు. తమకు సహకరించాలని కోరారు. దీంతో రోడ్డుపై నిలబడి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, డౌన్డౌన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, నాయకులు పొనుగోటి వెంకటరావు, పచ్చవ రవీంద్రబాబు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, అన్నా మోహన్, గంటెనపాటి గాబ్రియేలు, హెల్డా ప్లారెన్స్, గోగుల మనోహరయాదవ్, కొత్తూరి కిషోర్బాబు పాల్గొన్నారు. నిరసన వ్యక్తంచేసిన డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు -
ప్రజాస్వామ్యానికి విఘాతం
పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో ప్రాజాస్వామ్యానికి విఘాతం కలిగిదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ అన్నారు. పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని కామేపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల, వైద్యశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ శుక్రవారం నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయక మెడికల్ కాలేజీ వద్దకు చేరుకోని కాలేజీ, వైద్యశాల భవనాలను పరిశీలించారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వవెంకట్రావు అక్కడకు చేరుకోని నాగార్జున యాదవ్ను అరెస్టు చేసి పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు. అనంతరం స్టేషన్ వద్ద నాగార్జునయాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా.. మూర్ఖపు మంత్రి ఉన్నాడా అని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల వద్దకు వెళితే ప్రస్తుతం మాటలతో చెప్పాం, మరోసారి చేతలతో చెప్పాల్సి వస్తుందని స్వయాన జిల్లా ఎస్పీ చెప్పడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావులు తమ ఉద్యోగ ధర్మాన్ని బాగా నిర్వర్తించారని వ్యంగ్యంగా విమర్శించారు. పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అందాలని సుమారు రూ.600 కోట్లతో పెద్దఎత్తున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, దాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుకు అమ్మేందుకు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ సిద్ధమయ్యారని విమర్శించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని అన్నారు. ఉదయం నుంచి కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ఎస్పీ కృష్ణారావు చర్యలకు చంద్రబాబునాయుడు వద్ద మంచి మార్కులు ఉంటాయి... మీరు పడిన కష్టానికి భవిష్యత్లో చాలా మంచి గిఫ్టులు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ వైద్య కళాశాలను సందర్శించిన యాదవ్ అరెస్టు చేసి స్టేషన్నకు తరలింపు -
పల్నాడుకు మెరుగైన వైద్యం కలేనా!
పల్నాడు ప్రజలకు మెడికల్ విద్య, మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా ఉంది. సకాలంలో మెరుగైన వైద్యం అందక పల్నాడు ప్రాంత ప్రజలు అనేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత విద్యార్థులకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. దీంతో పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో మెడికల్ కళాశాల, ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.500 కోట్లు మంజూరు చేయడమే కాక పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. పల్నాడు ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. అంతేగాక ప్రైవేట్పరం చేసేందుకు యత్నాలు ప్రారంభించింది. పిడుగురాళ్లరూరల్/పిడుగురాళ్ల: పేదవాడికి అధునాతనమైన వైద్యం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలకు దగ్గర ఉండే విధంగా పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామ సమీపంలో వైఎస్సార్ మెడికల్ కళాశాల, వైద్యశాలకు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో ఎంతో మంది పేద ప్రజలు మనకు దగ్గరలోనే అధునాతనమైన వైద్యం అందుతుందని ఆశపడ్డారు. తీరా కూటమి ప్రభుత్వం గెలుపొందటంతో వైఎస్సార్ మెడికల్ కళాశాలకు చంద్ర గ్రహణం పట్టింది. పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఏడాదిన్నర కావస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వైఎస్సార్ సీపీ హయాంలో 90 శాతం పనులు పూర్తి పల్నాడు ప్రాంత ప్రజలంతా ఆరోగ్యం సేవల కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని గుర్తించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించారు. కరోనా వచ్చినా శరవేగంగా పనులు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మెడికల్ కళాశాల, వైద్యశాల పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హాస్పటల్లో 100 పడకల బ్లాక్ పనులు పూర్తి చేయించి పేదలకు వైద్యం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు. 100 పడకల హాస్పటల్కు ఫర్నిచర్ తీసుకొని వచ్చి వైద్యులను, సిబ్బందిని నియమించినట్లయితే మెడికల్ కళాశాలలో వైద్యం సేవలు పేదవాడికి అందేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలంటూ సెల్ఫీ చాలెంజ్లు విసిరారు. దీంతో పట్టణ, పల్నాడు ప్రాంత ప్రజలు, ప్రవాస భారతీయులు సైతం సెల్ఫీ చాలెంజ్లు విసిరారు. దీంతో హుటాహుటిన కూటమి నాయకులు మెడికల్ కళాశాల, వైద్యశాలను పరిశీలించారు. 9 నెలల్లో రూ.9 లక్షలు ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వం పేదవాడికి ఎక్కడ ఖరుదైన వైద్యం అందుతుందోనని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల, వైద్యశాల పనులను సాగనివ్వటం లేదు. పనులు సాగి వైద్యశాల పూర్తి అయితే వైఎస్సార్ సీపీకి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అనే అక్కసుతో పనులను సాగనివ్వటం లేదు. దీనికి సాక్ష్యం తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.9 లక్షలు ఖర్చు చేసిందంటే పల్నాడు ప్రాంత ప్రజలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తుండటంతో వైఎస్సార్ సీపీ యువజన విభాగం, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం పిడుగురాళ్ల పట్టణం నుంచి కామేపల్లి మెడికల్ కళాశాల వరకు మెడికల్ కళాశాల, వైద్యశాల సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయనున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: గుర్తు తెలియని వ్యక్తి మాచర్ల, గుంటూరు ప్యాసింజర్ రైలు కింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులోని రైల్వే గేటు సమీపంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు...గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనటంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 42 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు ఎర్ర రంగు చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని, మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
కలెక్టర్ను కలసిన ఎస్పీ
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. నరసరావుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన రద్దు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధికారులు యథావిధిగా సీఎం పర్యటన ఏర్పాట్లు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు అనధికారిక, కాల్పనిక వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోలుగా నియమితులైన అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులను అందజేశారు. గురువారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పని చేస్తున్న నలుగురు ఏవోలు, ఆరుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, జీ సెక్షన్ ఏవో పూర్ణచంద్రారెడ్డి, మోహన్రావు పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలోని ఎనిమిది బార్లకు ఓపెన్ కేటగిరీలో వచ్చిన 32 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా లాటరీ పద్ధతిలో అభ్యర్థులకు షాపులు కేటాయించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపాల్టీలో ఒకటి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల మున్సిపాల్టీల్లో రెండు చొప్పున, వినుకొండ మున్సిపాల్టీలో మూడు షాపులకు కలెక్టర్ లాటరీ నిర్వహించారు. మొత్తం 30 బార్లకు రీనోటిఫికేషన్ చేయగా కేవలం ఎనిమిది బార్లకే దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన బార్లకు ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.మణికంఠ వెల్లడించారు. జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఆఫీసర్ కె.రవీంద్ర, స్టేషన్హౌస్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురి సౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బీపీ పాండే ఆధ్వర్యంలో సభ్యులు కేకే జాన్గిడ్ తదితరులతో కలిసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రధాన డ్యామ్, గ్యాలరీలు, రైట్ కెనాల్, పవర్ హౌస్, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాన డ్యాం, పైలాన్ పిల్లర్ పార్కులను శుభ్రపరిచారు. పార్కులో మొక్కలు నాటారు. శుక్రవారం లో లెవెల్ కెనాల్, లెఫ్ట్ కెనాల్లను సందర్శించనున్నారు. కేఆర్ఎంబీ ఈఈ శ్రీనివాసరావు, సాగర్ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్ ఆనంద్, ఏఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
కలెక్టర్కు ముందస్తు నోటీసు అందజేసిన జేఏసీ నాయకులు నరసరావుపేట: సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి వస్తుందని పల్నాడు జిల్లా విలేజ్, వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతిక శుక్లాకు తమ సమస్యలపై ముందస్తు సమ్మె నోటీసు సమర్పించారు. విద్యార్హతలకు అనుగుణంగా విధులు అప్పగించాలని, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కలిగించాలని, ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీ చేయాలని, ఆదివారాలు, పండుగలు, సెలవుదినాల్లో బలవంతపు విధులు ఆపాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేసి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, రికార్డు అసిస్టెంట్ కేడర్ను జూనియర్ అసిస్టెంట్ కేడర్గా మార్చాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే 15రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే, ఏపీ విలేజ్, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు కొమ్మాలపాటి ప్రతాపకుమార్, చెన్నయ్య, కరిముల్లా, మేడా నాగేశ్వరరావు, ఆంజనేయులు, జయలక్ష్మి, చింతా ఆంజనేయులు, ఆనందకుమార్, సాంబశివరావు ఉన్నారు.