Palnadu
-
రెంటచింతలలో దొంగలు హల్చల్
రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. పలు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో తాళాలు పగలుగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని ఆరోగ్యనాథుని మందిరం వద్దనున్న ఆదూరి ఇన్నారెడ్డి నాలుగు రోజుల కిందట వెళంగిని కి వెళ్లగా ఆయన భార్య రజని కొంతకాలంగా గుంటూరులోని మనవరాళ్ల వద్దకు వెళ్లి ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇన్నారెడ్డి విత్తనాల షాపులో పనిచేసే సాగర్ వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాన్ని గ్యాస్ కట్టర్తో కోసి ఇంట్లోని బీరువాను, ఇనుపపెట్టెను పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడవేసిన విషయాన్ని ఇన్నారెడ్డికి తెలిపారు. బీరువా, ఇనుపపెట్టెలో దాచిన 75 గ్రాములు బంగారు వస్తువులు, రూ.70 వేల నగదు అపహరణకు గురైనట్లు ఇన్నారెడ్డి పోలీసులకు వివరించారు. వెండి కిరీటాలు, చిన్నచిన్న వెండి వస్తువులను దొంగలు అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. అలాగే స్థానిక రామాలయం వద్ద ఉంటున్న తాళ్ళూరి సాంబశివరావు భార్యతో కలిసి ఈ నెల 14న హైదరాబాద్లోని కుమారుడి వద్దకు వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాను తెరిచి దానిలో నున్న రూ.1 లక్ష నగదుతో పాటు రెండు బంగారు చెవి దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాలను ఎస్ఐ సీహెచ్ నాగార్జున సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల పాటు ఇల్లు విడిచి పొరుగు గ్రామానికి వెళ్లే సమయంలో స్థానిక పోలీసు స్టేషన్లో తెలియ చేయాలని తెలిపారు. రెండు ఇళ్లల్లో చోరీ బంగారం, నగదు అపహరణ -
విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వినుకొండ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యసేవలు నిమిత్తం గుంటూరు తరలించారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రుడిని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. -
హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన
రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్గేట్ వద్ద నుంచి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. జోరుగా పొట్టేళ్ల పందేలు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని అరికట్టాలని కోరుతున్నారు. -
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు. ప్రకృతి సేద్య ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన కల్పించండి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి సేద్యం చేస్తున్న గ్రామ సంఘాల్లోని రైతులకు ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చెప్పారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ కార్యాచరణ అమలుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, డీఆర్డీఏ శాఖలు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రగతి, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, డీఆర్డీఏ పీడీ విజయ లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక అధికారి నరసింహారావు మాట్లాడుతూ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. రైతులు వట్టిచెరుకూరు ధనుంజయ రావు, అత్తోట బాపయ్య, ఎరుకులపూడి విజయలక్ష్మి ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇఫ్కో కొత్త ఎరువు మార్కెట్లోకి విడుదల కొరిటెపాడు(గుంటూరు): ఇఫ్కో వారు నూతనంగా తయారు చేసిన 28ః28ః0 అనే కాంప్లెక్స్ ఎరువును జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మంగళవారం గుంటూరు రూరల్ మండలం, రెడ్డిపాలెం గూడ్స్షెడ్ వద్ద మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28ః28ః0 ఇఫ్కో వారు తెప్పించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల విభాగం ఏడీఏ కేజేడీ రాజన్, గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు, డీసీఎంఎస్ జిల్లా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం, కొల్లిపర ఏఓ వెంకట్రావు, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20 ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
బంగారం, నగదు స్వాధీనం నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. -
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు మిర్చియార్డుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతోపాటు, రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వివరించారు. రైతులకు అండగా తానున్నాననే భరోసా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మిర్చియార్డుకు వైఎస్ జగన్ ఉదయం 9.30లకు చేరుకుంటారని, మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. కూటమి ప్రభుత్వం విఫలం కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో సీఎం చంద్రబాబు రైతులకు ఒక్క మేలు అయినా చేశారా అని అంబటి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం బస్తా ధర రూ.1200 నుంచి 1300, మిర్చి క్వింటా ధర రూ. 13వేలు కంటే పలకడం లేదని ధ్వజమెత్తారు. -
మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు
ఈ ఏడాది మిర్చి రైతులకు అన్ని విధాలుగా దెబ్బలు తగులుతున్నాయి. నల్లి తెగులు కారణంగా పంట దిగుబడులు సగానికి తగ్గి, పెట్టుబడులు పెరిగాయి. పండిన పంటకై నా మంచి ధర ఉంటుందంటే అది కూడా క్వింటాకు రూ.7వేలు నుంచి రూ.10వేలు వరకు తగ్గిపోయింది. దీంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – జి.చెంచయ్య, రైతు, గోనెపూడి, నరసరావుపేట రూరల్ మండలం కూలి ఖర్చులు కూడా రావడం లేదు నేను రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. మొదటి కోత కోస్తే ఆరు క్వింటాళ్లు వచ్చింది. 170 మంది కూలీలు కోతకు పనిచేశారు. వీరికి కూలి రూ.400 చొప్పున రూ.68 వేలు అయింది. మిర్చి క్వింటాకు రూ.10వేలు చొప్పున విక్రయిస్తే ఆరు క్వింటాళ్లకు రూ.60వేలు వచ్చింది. పంటకు పెట్టిన పెట్టుబడుల సంగతి దెవుడెరుగు కనీసం మొదటి కోతకు కూలీల ఖర్చే రూ.8 వేలు చేతి నుంచి పడిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. –బి.శివరామయ్య, రైతు, గోనెపూడి, నరసరావుపేట రూరల్ మండలం -
ఇంజినీ‘రింగ్ రింగ’
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఇంజినీరింగ్ విద్యార్థులు రింగరింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉండడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందాను ఎకై ్సజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. సోదరుడి దగ్గరకు సాయి కృష్ణ వెళ్లిన సమయంలో అదే రూంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్కుమార్ పరిచయమయ్యాడు. సతీష్కుమార్కు బెంగళూరుకు చెందిన నితిన్తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తుమందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని సతీష్కుమార్, నితిన్ సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండీఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్ లోని సాయి లక్ష్మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా నిర్వహిస్తున్నాడు. గుట్టురట్టు ఇలా.. రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్–2 టౌన్ సీఐ ఎం. యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నా రని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఏడుగురు విద్యార్థులు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయి కృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు బెంగళూరులో గ్రాము రూ.1400 కొని.. ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400 కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదువేలకు అమ్ముతున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతురావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్ఎన్రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వివి చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి వి అరుణ కుమారి, ఏ ఈ ఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. -
అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్సింధు కౌముది, అధికారులు ఉన్నారు. చింతపల్లి మేజర్కుసాగునీరు విడుదలఅచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్కు, ఐదు రోజులు కస్తల మేజర్కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు. న్యాయ సేవాధికార సంస్థ సభ్యులకు దరఖాస్తు చేసుకోండి నరసరావుపేటటౌన్: మండల న్యాయసేవాధికార సంస్థ సభ్యుల నియామాకానికి ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 138 మండల న్యాయ సేవాధికార సంస్థలలో సభ్యులుగా వ్యవహరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా కార్యకర్తలు, న్యాయ సేవలు ప్రజలకు అందించటంలో ఆసక్తిగల వారు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాలువలో కారు బోల్తా అమర్తలూరు(వేమూరు): ఇంటూరు కాల్వలో కారు బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అమర్తలూరు పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈక్రమంలో ఉదయం 6.30 నిమిషాలకు ఇంటూరు నుంచి చెరుకుపల్లి వెళ్లే దారిలో లారీని క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి కారు ఇంటూరు కాల్వలో పడింది. అందులోఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో చెరుకుపల్లిలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది, రేపల్లె వెళ్లినట్లు ఎస్ఐ జానకి అమర్ వర్థన్ తెలిపారు. చిన్నతరహా నీటి వనరుల గణనకు సిద్ధం కండి నరసరావుపేట: జిల్లాలో గ్రామస్థాయిలో చిన్ననీటి వనరులు, రెండో జలాశయాల గణన నిర్వహించాలని రాష్ట్ర అర్ధ గణాంకశాఖ విజయవాడ ఉపసంచాలకులు పి.శ్రీనివాస్, ఉప గణాంక అధికారి జి.రమేష్కుమార్ సంబంధిత అధికారులను కోరారు. మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కార్యాచరణలో భాగంగా సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణలో వారు అధికారులు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా గణాంక అధికారి పి.మాలతీదేవి, ఉప గణాంక అధికారి ఎం.కృష్ణకిషోర్, టి.సూర్యకుమారి పాల్గొన్నారు. -
బాధితులకు పుల్లారావు ఝలక్
నరసరావుపేట టౌన్: నరసరావుపేటలోని సాయిసాధన చిట్ఫండ్ స్కాం కేసు సీఐడీకి బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కేసును సీఐడీకి బదిలీ చేయొద్దంటూ బాధితులు చేసిన ఆందోళనలు, విన్నపాలు వృథా అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సాయిసాధన చిట్ఫండ్ పేరుతో పాలడుగు పుల్లారావు నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో కార్యాలయాన్ని నిర్వహించాడు. చీటీ పాటలు, డిపాజిట్ల పేరుతో సుమారు రూ.400 కోట్ల వరకు పోగేసుకొని చివరకు కుటుంబంతో సహా 20 రోజుల క్రితం ఉడాయించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట, గుంటూరుల్లో పుల్లారావుపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నిందితుడు కోర్టులో లొంగిపోయి ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి తన వద్ద రూ.2.70 కోట్లు డిపాజిట్ల రూపంలో తీసుకొని మోసం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట వన్టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి చీటీ పాటలు, డిపాజిట్ల రూపంలో చెల్లించిన రూ.కోట్లకు సంబంధించిన రశీదు, బాండులను పోలీసులకు అప్పగించారు. వారందరినీ కేసులో బాధితుల జాబితాలో చేర్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణ, విదేశాల్లో సైతం పుల్లారావు బాధితులు ఉన్నారు. చీటీ పాటలకు సంబంధించి 600 మంది సభ్యులు, డిపాజిట్లకు సంబంధించి మరో 400 మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గగ్గోలు పెట్టినా లాభం లేదు..! నిందితుడు పుల్లారావు అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు సత్వరం స్పందించి న్యాయం చేయలేదని బాఽధితులు ఆరోిపిస్తున్నారు. కేసు సీఐడీకి బదిలీ చేస్తే న్యాయం జరగడంలో ఆలస్యమవుతుందని, బదిలీ చేయకుండా స్థానిక పోలీసుల చేతే దర్యాప్తు చేయించాలని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జి మంత్రిని పలుమార్లు బాధితులు కలసి కోరారు. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి సైతం ఇదే విన్నపాన్ని తెలియజేశారు. పుల్లారావు కుటంబం, బినామీల పేర్లమీద ఉన్న ఆస్తులు, నగదు లెక్కల తేల్చి బాధితులకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పుల్లారావు కొల్లగొట్టిన నగదు, బాధితుల సంఖ్య భారీస్థాయిలో ఉండటంతో కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదిలీ చేసినట్టు పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ విషయంపై డీఎస్పీ కె.నాగేశ్వరరావును వివరణకోరగా సీఐడీకి కేసు బదిలీ అయిన విషయం వాస్తవమేనన్నారు.నరసరావుపేటటౌన్: రాజీమార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకొందామనుకున్న బాధితులకు సాయి సాధన చిట్ఫండ్ నిర్వాహకుడు పాలడగు పుల్లారావు ఝలక్ ఇచ్చాడు. తనను కలిసేందుకు జైలుకు వెళ్లిన బాధిత సంఘ ప్రతినిధుల ములాకత్ను తిరస్కరించాడు. దీంతో పుల్లారావు మోసపూరిత నైజం మరోమారు బయటపడినట్లు అయ్యింది. గుంటూరు సబ్ జైల్లో ఉన్న పుల్లారావు గత 20 రోజులుగా తన తరఫున పెద్దల ద్వారా అప్పులకు సమానంగా ఆస్తులు ఉన్నాయని బాధితులను మభ్యపెడుతూ వచ్చారు. చివరకు చర్చల ద్వారా రాజీ చేసుకొని సమస్య పరిష్కరించుకుందామని కోరారు. దీంతో బాధితులంతా తమ సమస్య పరిష్కారం కాబోతుందని ఆనంద పడ్డారు. బాధితులంతా కలిపి ఐదుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకొన్నారు. సభ్యులు ఈ విషయంపై సోమవారం పుల్లారావుతో చర్చించేందుకు సబ్జైల్కు వెళ్లారు. అయితే వారిని కలిసేందుకు పుల్లారావు నిరాకరించాడు. దీంతో గంటల పాటు వేచి ఉన్న కమిటీ ప్రతినిధులు వెనుదిరిగారు. మంగళవారం బాధితులంతా పట్టణంలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు. రాజీకని పెద్దమనుషులను పంపి చివరకు పుల్లారావు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా రోడ్డెక్కి ఆందోళనలు ఉదృతం చేయాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. మంత్రి లోకేష్ను కలిసి వినతిపత్రం అందేజేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర సచివాలయం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చేకూరి సాంబశివరావు, యామని రామారావు, కడియాల రమేష్, ఐనవోలు రాధ, శరత్, ప్రతాప్ పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్ధిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో పర్యటించి పథకాల వారీగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు సర్పంచ్ మొనపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చెన్నంశెట్టి రంగారావు, ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, కేంద్ర టీం సభ్యులు వి.సంధ్యారాణి, లక్ష్మి, లోకేష్, జి.సంధ్యా, భానుచంద్ర, హౌసింగ్ డీఈ ఎన్.శ్రీనివాసరావు, ఏఈ రసూల్, పంచాయతీ కార్యదర్శి బాల పరమేశ్వర రావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శావల్యాపురంలో... శావల్యాపురం: ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యత వహించాలని న్యూఢిల్లీ కేంద్ర సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అధికారి వికాస్ మల్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని శానంపూడి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వ నిధులతో చేపడుతున్న ఉపాధి పనులు పేదలందరు సద్వినియోగం చేసుకొని మంచి ఆర్ధిక ప్రగతి సాధించాలన్నారు. కూలీలు చేస్తున్న పంట కాల్వ పనులను, మస్టర్ను పరిశీలించి ఉపాధి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఏపీవో కె.రామారావు, డీఎఫ్టీ లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. శానంపూడిలో పర్యటించిన కేంద్రం బృందం -
కేంద్రం రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
శిడిబండి సంబరం
వైభవంగా.. ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కను లారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
వేసవిలోనూ కొనసాగు
అనేక లాభాలు రానున్న ఖరీఫ్లో ప్రధాన పంటలు సాగు చేసే రైతులు, రబీ సీజన్ పూర్తి చేసుకున్న రైతులు తమ పొలాల్ని ఖాళీ ఉంచకుండా పీఎండీఎస్కు సిద్ధంకండి. ఈ సాగు వల్ల ప్రధాన పంటలకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఈఏడాది 80వేల ఎకరాల సాగు లక్ష్యం చేసుకున్నాం. – కె.అమలకుమారి, డీపీఎం, ప్రకృతి విభాగం పల్నాడు అధిక దిగుబడులు... ఆరేళ్లుగా ప్రకృతి విధానంలో పది ఎకరాల్లో అన్ని రకాల పంటల్ని సాగు చేస్తున్నాను. ఏటా పీఎండీఎస్ విధిగా చేయడంతో పంట నాణ్యత, దిగుబడి పెరిగాయి. మిర్చి కేజీ రూ.600 విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. – డి.శేషారావు, రైతు, పెదకూరపాడు ●యడ్లపాడు: పీఎండీఎస్(ప్రీ మాన్సూన్్ డ్రై సోయింగ్) విధానాన్ని జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రబీ ముగింపు నుంచి ఖరీఫ్ ప్రారంభం మధ్య కాలంలో ఈ విధానాన్ని అనుసరించి వివిధ రకాల విత్తనాలతో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్, రబీ కాలాల్లోనే కాకుండా ఆ మధ్యలో వచ్చే వేసవిలో పొలాలు ఖాళీగా ఉంచకుండా సాగు చేయడంతో భూమి 365 రోజులు కప్పబడి ఉంటుంది. ఇది నేల నాణ్యతను మెరుగుపరిచే ప్రధాన విధానం. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఈ విధానం ద్వారా 80 వేల ఎకరాల్లో పంట సాగే లక్ష్యంగా ప్రకృతి అధికారులు కృషి చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం పెంపు.. ఇది తొలుత నవధాన్యాలైన 9 రకాల విత్తనాలతో ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో 18 రకాలుగా పెంచారు. ప్రస్తుతం 30 రకాల విత్తనాలను కలిపి పీఎండీఎస్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంతో భూమిలో సూక్ష్మజీవులు వద్ధి చెందుతాయి. నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రధానంగా నేలలో కర్బనశాతం మెండవుతుంది. ఇది చీడపీడలను, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంచుతుంది. పీఎండీఎస్ కిట్ ఇదీ పీఎండీఎస్ విధానంలో పప్పుజాతి, నూనెజాతి, ధాన్యపు జాతి, సుగంధ ద్రవ్యాలు, పచ్చిరొట్ట, ఆకుకూరలు, కూరగాయ రకాలైన తీగజాతి, దుంపజాతి వంటి 30 రకాల విత్తనాలను కలిపి ఒక కిట్గా తయారు చేస్తారు. ఈ కిట్ను ఎకరాకు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందులో బొబ్బర్లు, చిక్కుడు, మినుము, పెసర, నువ్వులు, ఆముదం, వేరుశెనగ, ధనియాలు, మెంతులు, రాగులు, మొక్కజొన్న, సామలు, కొరల్రు, జీలుగ, పిల్లిపెసర వంటి పలు రకాల విత్తనాలు ఉంటాయి. విత్తన సంరక్షణ వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నా వర్షాలు కురవకపోయినా పీఎండీఎస్ విధానంలో విత్తనాలను సంరక్షించుకోవచ్చు. విత్తనాలను బీజామృతం, బంకమన్ను, ఘనజీవామృతం, బూడిదతో మూడు రకాల కోటింగ్ చేయాలి. ఇది చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎలుకలు, ఇతర చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో నేలకు, పైరుకు మేలు 30 రకాల విత్తనాలతో వైవిధ్య సాగు రబీ – ఖరీఫ్ సీజన్ల నడుమ సాగుకు సిద్ధం చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అధికారులు పీఎండీఎస్ వల్ల లాభాలు నేల గుల్లబారటం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి నీటి నిల్వ సామర్థ్యం మెరుగవుతుంది ప్రధానంగా నేలలో కర్బన శాతంపెరుగుదల ఫలితంగా పంటకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునే శక్తి సామర్థ్యం నేల ఉత్పాదక శక్తి లభించి అధిక దిగుబడులు సాధన పీఎండీఎస్ పంట పశువుల పచ్చిమేతకు వాడుకోవచ్చు తద్వారా పాడిఖర్చు తగ్గించుకోవచ్చు పిల్లిపెసర తదితర వాటిని అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు -
రైతు కళ్లు చెమిర్చి..
మిర్చి రైతుకు ప్రభుత్వ ‘మద్దతు’ శూన్యం సాక్షి, నరసరావుపేట: ఎర్ర బంగారంగా పిలిచే మిర్చి సాగుతో లాభాల పంట పండుతుందని సాగుచేసిన రైతుల పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. గతేడాది మిర్చి రైతులకు మంచి దిగుబడులు రావడంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో అధిక ధరలు లభించడంతో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆశగా ఈ ఏడాది మిర్చి సాగుచేసిన రైతులకు ఓవైపు ప్రకృతి మరోవైపు ప్రభుత్వం సహకరించకపోవడంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లారు. లాభాల మాట దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడైనా వస్తే చాలని రైతులు కోరుకుంటుండగా, పరిస్థితి మాత్రం కనీసం కూలీలకు అయిన ఖర్చు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ దశలో ప్రభుత్వమైనా అండగా నిలిచి మద్దతు ధర లభించేలా చూస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. తీవ్ర నిరాశలో ఉన్న మిర్చి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్నారు. రైతన్నల తరఫున ప్రభుత్వానికి వారు పడుతున్న కష్టాలను వివరించి, న్యాయం చేసేలా ఒత్తిడి చేయనున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 40,127 హెక్టార్లలో, రబీలో మరో 3,082 హెక్టార్లలో మిర్చి పంట సాగుచేశారు. ఇందులో ఖరీఫ్లో సాగుచేసిన పంటలు కోతలకు వచ్చాయి. మిగిలిన పంటలతో పోల్చితే మిర్చి పంటకు పెట్టుబడి అధికం. అయితే దిగుబడి, ధర మంచిగా ఉంటే అధిక లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు అప్పులు చేసి మరీ సాగు చేస్తారు. గతంతో పోల్చితే రైతులు అవసరం లేకపోయినా ఎరువులు, పిచికారీ మందుల వాడకం అధికమైంది. దీంతో ఎకరా మిర్చి పంటకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు పెట్టుబడి అవుతోంది. కౌలు రైతులయితే భూమి కౌలు మరో రూ.20–30 వేలు అధికంగా ఖర్చు కానుంది. సాగులో ఉన్న మిరప పైరుఆత్మహత్యే శరణ్యం మిర్చికి ఇదే విధంగా ధర ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. గత ఏడాది రూ.20వేలు పలికిన ధర ఈ ఏడాది రూ.13 వేలు కూడా రావడం లేదు. దిగుబడులు కూడా ఎకరాకు 10–15 క్వింటాళ్లు మించి వచ్చేలా కనిపించడం లేదు. నల్లి తెగులు నివారణ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా రైతులు ఆర్థికంగా నష్టాలు తప్పేలా లేవు. ఽగత ఏడాది ఉన్న ధర కల్పిస్తే రైతులు కొంత వరకు నష్టాల నుంచి బయటపడతారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం –నాగేశ్వరరావు, దుర్గి, మాచర్ల నియోజకవర్గం మిర్చి పంటకు ఖరీఫ్ సాగులో ఉన్నట్టుండి బొబ్బర తెగులు రావడంతో మొక్క ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పటికే ఉన్న పూత, పిందె అర్ధంతరంగా రాలిపోయింది. దిగుబడి సాధారణంగా 30 క్వింటాళ్ల వరకు ఉండగా బొబ్బర వచ్చిన తోటల్లో 10 క్వింటాళ్లు సైతం కష్టమని రైతులు భావిస్తున్నారు. గతంలో మిర్చి ధరలు రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.10వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే ఉంది. దీంతో పండిన అరకొర మిర్చిని కూలీలతో తీసి విక్రయిస్తే కనీసం కూలి, రవాణా ఖర్చులు సైతం రావని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొంతమంది రైతులు పంటలను వదిలేస్తున్నారు. మిర్చి ధర గతేడాదితో పోల్చితే క్వింటాకు ఏకంగా రూ.8 వేల నుంచి రూ.6 వేల వరకు తగ్గిపోయినా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావడంలేదు. రైతులకు మద్దతు ధర లభించేలా కూటమి సర్కారు నుంచి ఎటువంటి చర్యలు లేవు. దారుణంగా పతనమైన ధరలు గతేడాది క్వింటా మిర్చి ధర రూ.20 వేలు – రూ.24 వేలు ప్రస్తుతం రూ.10 వేలు కూడా దక్కని వైనం పెరిగిన చీడపీడలు.. తగ్గిన దిగుబడి భారీగా నష్టపోతున్న రైతులు పట్టించుకోని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు నేడు గుంటూరు మిర్చి యార్డులోవైఎస్ జగన్ పర్యటన పెట్టుబడి కూడా రాని దుస్థితి... పట్టించుకోని ప్రభుత్వం -
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
మహిళ మెడలో చైన్స్నాచింగ్
యడ్లపాడు: మహిళ మెడలోని బంగారు గొలుసుకును లాక్కొని పరారైన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి మల్లేశ్వరి హైవే పక్కన కృష్ణగంగ నూలుమిల్లు వద్ద ఓ బడ్డీకొట్టు నడుపుతోంది. సోమవారం మధ్యాహ్నం బైక్పై ఇద్దరు యువకులు వచ్చారు. ఒకరు బైక్పై ఉండగా, మరొకరు దిగి దుకాణం వద్దకు వచ్చి సిగరెట్, కూల్డ్రింక్ ఆర్డర్ చేశాడు. వాటిని ఇవ్వబోతున్న సమయంలోనే ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరుగున వెళ్లి బైక్ ఎక్కాడు. ఊహించని ఈ ఘటనకు షాక్ అయిన మల్లేశ్వరి కొద్దిసేపటికి తేరుకుని పెద్దగా కేకలు వేసింది. జనం పోగయ్యేలోగా గుర్తు తెలియని ఆ ఇద్దరు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలు యడ్లపాడు పోలీసులకు సమాచారం అందించగా అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. రూ.2.65 లక్షల విలువైన నాలుగు సవర్ల గొలుసు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. పోలీసులు సాంకేతిక సాయంతో రెండు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నరసరావుపేట డీఎస్సీ పర్యవేక్షణలో చిలకలూరిపేట సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ వి బాలకృష్ణ, కానిస్టేబుల్స్ పోతురాజు, వినోద్, సాంబ ఆధ్వర్యంలో కేసు ఛేదించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
మాజీ మంత్రి రజిని మామ కారుపై దాడి నేపథ్యంలో డ్రైవర్ ఫిర్యాదు
చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజిని మామ లక్ష్మీనారాయణ కారుపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ విషయమై కారు డ్రైవర్ ఉప్పుతోళ్ల రాజు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గుండయ్యతోటకు చెందిన ఉప్పుతోళ్ల రాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణను ఆయన నివాసం వద్ద దింపి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కారులో వెళుతున్నాడు. పురుషోత్తమపట్నంలోని వేణుగోపీనాథస్వామి ఆలయం వద్ద టీడీపీ వర్గీయులైన బైరా వెంకటప్పయ్య, బత్తినేని శ్రీనివాసరావు, తోట మనోహర్, తోటపల్లి శ్రీను, తోట సత్యనారాయణ మరికొందరితో కలసి కారును అడ్డగించి ఆపారు. మారణాయుధాలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురించి లక్ష్మీనారాయణ, విడదల రజినికి మాట్లాడే అర్హత లేదంటూ అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. వాళ్లను చంపేస్తాం, బతకనిచ్చేది లేదంటూ దూషణలకు దిగారు. కారు అద్దాలు పగలగొట్టి, చొక్కా పట్టుకొని బయటకు లాగి దాడి చేసేందుకు యత్నిస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకొని పోయాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై అర్బన్ సీఐ పి రమేష్ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఉత్తమ ప్రదర్శన ఇంద్రప్రస్థం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలలో గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. రెండవ ఉత్తమ ప్రదర్శన బహుమతి గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికకు లభించింది. ఉత్తమ నటుడుగా హైదరాబాద్ కళాంజలి వారి అన్నదాత నాటికలో అంకమ్మతాత పాత్రధారి చెంచు పున్నయ్య, ఉత్తమ నటిగా కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష నాటికలో భారతి పాత్రధారి ఎస్.జ్యోతిరాణి, ఉత్తమ విలన్గా వెలగలేరు ఆర్ట్స్ థియేటర్ వారి రాత నాటికలో అజయ్ పాత్రధారి పవన్కళ్యాణ్ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు బహుమతి ఇంద్రప్రస్థం దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి కై వసం చేసుకున్నారు. ఉత్తమ రచనగా రాత నాటిక రచయిత పోలదాసు శ్రీనివాసరావు బహుమతులు అందుకున్నారు. అలాగే క్యారెక్టర్ నటుడిగా చిగురు మేఘం నాటికలో చిన్నయ్య పాత్రధారి కావూరి సత్యనారాయణ, హాస్య నటునిగా పక్కింటి మొగుడు నాటికలో సీతాపతి పాత్రధారి యు.వి.శేషయ్య, ఉత్తమ బాలనటిగా రాత నాటికలో స్వప్నిక పాత్రధారి సురభి వాగ్దేవి, ఉత్తమ మేకప్ శ్రీఉమా ఆర్ట్ కాకినాడ (తితిక్ష), రంగాలంకరణ టి.బాబురావు (తితిక్ష), ఉత్తమ సంగీతం కె.వి.రమణ (పక్కింటి మొగుడు), ప్రత్యేక జ్యూరీ బహుమతి రాత నాటిక బహుమతులు సాధించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నూసుము నాగభూషణం, మానపురం సత్యనారాయణ, షేక్.బాజీ వ్యవహరించారు. కాగా, ఈ ఏడాది రంగస్థలి ప్రతిభా పురస్కారాన్ని నాటక రచయిత, నటుడు, దర్శకుడు చలసాని కృష్ణప్రసాద్కు అందజేశారు. కార్యక్రమాలను రంగస్థలి అధ్యక్షుడు షేక్మహబూబ్సుభానీ, గౌరవాధ్యక్షుడు కిలారు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర బోస్, కోశాధికారి కనపర్తి సూరిబాబు, ఏ.ఏ.మధుకుమార్. పి.శ్రీనివాసాచార్యులు తదితరులు పర్యవేక్షించారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల వద్ద వేంచేసిన గంగాభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి తరలివచ్చే వేలాదిమంది భక్తుల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు ఎస్పీ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ఆయన సత్రశాల దేవస్థానం వద్ద మహాశివరాత్రికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈఓ గాదె రామిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి సూచనలు చేశారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జునతోనూ బందోబస్తు గురించి మాట్లాడారు. పలు సూచనలు చేసి మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రభలను తక్కువ ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని, ప్రభలపై అశ్లీల నృత్యాలు, ఇతరులను కించపరిచేలా, ఇబ్బంది పెట్టేలా పాటలు పాడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా రెంటచింతల పోలీస్స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. ఎస్పీ వెంట గురజాల డిఎస్పీ పి.జగదీష్, కారంపూడి సీఐ టి.వి. శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో అంగన్వాడీలకు నిధులు కేటాయించాలి
సత్తెనపల్లి: బడ్జెట్లో అంగన్వాడీలకు నిధులు కేటాయించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి డిమాండ్ చేశారు. పట్టణంలోని పుతుంబాక భవన్లో సోమవారం జరిగిన పల్నాడు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమావేశానికి ఎస్.కె సుజాత అధ్యక్షత వహించారు. మల్లేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ అహల్య, పద్మ, భవాని, సీఐటీయు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనది హనుమత్ వైభవం తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య పాల్గొన్నారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం చీరాల రైల్వే స్టేషన్ ఫైరాఫీసు గేటు సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఫైరాఫీసు గేటు సమీపంలో వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో ప్రమాద స్థలాన్ని పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని, మృతదేహంపై బ్లాక్ కలర్ చొక్కా, గళ్ల లుంగీ ఉందని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్సై 94406 27646 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. -
అదిగో జాగా.. వేసేయ్ పాగా
నరసరావుపేట రూరల్: భూముల ధరలు పెరిగిపోవడంతో చిన్న జాగా కనిపించినా పచ్చనేతలు వదిలిపెట్టడం లేదు. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు రూ.2.కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాచేసి ఇళ్లు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నైత్తైనా చూడటం లేదు. భూముల ధరలు పెరగడంతో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడంతో భూములు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు పట్టణానికి సమీపంలోని గ్రామాల వరకు వేశారు. ఫలితంగా పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల్లోనూ సెంటు భూమి రూ.5లక్షలకుపైగా పలుకుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విలువైన ప్రభుత్వ భూములపై టీడీపీ నేతలు కన్ను పడింది. ఆయా స్థలాలను దర్జాగా ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అల్లూరివారిపాలెం ఎస్టీ కాలనీలో అల్లూరివారిపాలెం గ్రామంలో నాలుగు దశాబ్దాల క్రితం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలనీల ఏర్పాటు సమయంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 శాతం భూమిని కేటాయించారు. ఎస్టీ కాలనీకి ఈ విధంగా కేటాయించిన భూమి 30 సెంట్ల వరకు ఉంది. ఈ భూమి ఖాళీగా ఉండటంతో స్థానికులు వివిధ అవసరాల కోసం వినియోగించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ భూమిపై స్థానిక టీడీపీ నాయకుల కన్నుపడింది. గ్రామ మాజీ సర్పంచ్తోపాటు మరికొందరు కలసి ఈ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. భూమి విలువ రూ.2కోట్లు పైమాటే! కలెక్టర్ కార్యాలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే అల్లూరివారిపాలెం ఎస్టీ కాలనీ ఉంది. లింగంగుంట్ల కాలనీ నుంచి అల్లూరివారిపాలెంలోని ఎస్టీ కాలనీ వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. దీంతో ఈ భూములకు విలువ వచ్చింది. ఇక్కడ సెంటు రూ.7లక్షల వరకు పలుకుతోంది. ఆక్రమణకు గురైన భూమి దాదాపు 30 సెంట్లు ఉండటంతో దీని విలువ రూ.2కోట్లపైగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. రూ.2 కోట్లు విలువైన భూమి కబ్జా అల్లూరివారిపాలెంలో టీడీపీ నాయకుల ఆక్రమణ కాలనీ అవసరాల కోసం కేటాయించిన భూమిలో నిర్మాణాలు విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం కాలనీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై సమాచారం లేదు. వీఆర్వోను పంపి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు ఉంటాయి. – వేణుగోపాల్, తహాసీల్దార్ -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూరు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు. -
మహాశివరాత్రి తిరునాళ్లకు ముస్తాబు
అమర్తలూరు (వేమూరు): మహాశివరాత్రి తిరునాళ్లు బాల కోటేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అవుతోంది. ఈ తిరునాళ్లకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో వారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి రంగులు వేస్తున్నారు. భక్తులు దేవుని దర్శనం కోసం క్యూలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మహాశివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మరమ్మతులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. -
క్వారీ తిరునాళ్లకు సకల సౌకర్యాలు
చేబ్రోలు: మహారాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తుల అభిషేకాలు, దర్శనాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, ఎలక్ట్రికల్ ప్రభల బరువు, సామర్థ్యం, ఎత్తు, ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్స్ పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులను శాఖల వారీగా విడిది స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులు పాటు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకల్లో మొదటిరోజు పశువుల ప్రదక్షిణలు ఉంటాయని, రెండో రోజు వాహనాల ప్రదక్షిణలు పూజలు ఉంటాయని, మూడవరోజు ఈనెల 26వ భక్తుల అభిషేకాలు మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.ఉమాదేవి, ఈఓపీఆర్డీ టి.ఉషారాణి, ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు, తిరునాళ్ల కమిటీ చైర్మన్ జి.శ్రీకాంత్, 52 శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా -
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
నరసరావుపేట: ఈనెల 27వ తేదిన శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి.అరుణ్బాబు చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. మొత్తం 38 ప్రదేశాలలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. కట్టుదిట్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్గా నరసారావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీని ఎంపిక చేసినట్టు వివరించారు. శిక్షణలో జిల్లా రెవెన్యూ అధికారి ఐ.మురళి, మాస్టర్ ట్రైనర్లు పూర్ణచంద్రరావు, అరుణ్, ఎంవీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
పంట పొలాల్లో చుక్కల జింక మృతి
నరసరావుపేట రూరల్: మండలంలోని యలమంద గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల్లో చుక్కల జింక మృతదేహాన్ని సోమవారం రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నీటి కోసం వచ్చి మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో సుబాబుల్ తోటలు అధికంగా ఉండటంతో అప్పడప్పుడు దారి తప్పి పొలాల్లోకి జింకలు వస్తుంటాయని, ఆ క్రమంలోనే వచ్చి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఆడ జింక కావటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి గర్భిణో కాదో నిర్ధారించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు. -
కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాజ టోల్గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. -
వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది
గురజాల ఆర్డీఓ మురళీ కృష్ణ పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం ముగిసిందని గురజాల ఆర్డీఓ, ఎన్నికల అధికారి మురళీ కృష్ణ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అనారోగ్యంతో మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి చెందటంతో ఖాళీ అయిన స్థానానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించటం జరిగిందన్నారు. ఈ ఎన్నికకు 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని కోరం సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. ఉన్నం భారతిని వైస్ చైర్మన్గా 28వ వార్డు కౌన్సిలర్ గర్నె నాగేశ్వరరావు ప్రతిపాదించగా, 20వ వార్డు కౌన్సిలర్ కొత్త తులసీ సౌజన్య బలపరచటం జరిగిందన్నారు. హాజరైన కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో ఎన్నిక సజావుగా జరిగిందన్నారు. ఉన్నం భారతికి నియామక పత్రాలను అందజేశామన్నారు. మొత్తం 33 మందికి గాను కోరంకు సరిపడా 17 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారన్నారు. కోరం పూర్తి అయిన తర్వాత ఈ ఎన్నికను నిర్వహించటం జరిగిందన్నారు. ఈ ఎన్నికకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ అబ్జర్వర్గా వ్యవహరించారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
చేబ్రోలు: మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు సోమవారం వేకువజామునే నీరుకొండ ప్రాంతానికి మినుము కోత పనులకు ఆటోలో పయనమయ్యారు. దారంతా దట్టమైన పొగ మంచు కమ్మింది. నారాకోడూరు – బుడంపాడు గ్రామాల మధ్యకు వచ్చేసరికి గుంటూరు– 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లంశెట్టి అరుణకుమారి (39), కుర్రా నాంచారమ్మ (40), తోట సీతారావమ్మ (41) అక్కడికక్కడే మరణించారు. వీరితోపాటు ఎం. శివమ్మ, ఎం. శివపార్వతి, జి. మల్లేశ్వరి, ఏ. వెంకట ప్రవీణ, ఆర్. రత్నకుమారిలతో పాటు ఆటో డ్రైవర్ ఇబ్రహీంతో పాటు మరో ముగ్గురుకు గాయాలయ్యాయి. వీరంతా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. సుద్దపల్లి గ్రామంలోని యూపీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న వీరంతా ఊరిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకొండ పరిసర ప్రాంతాలకు కొద్ది రోజులుగా వెళుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజామున ఆటోలో 12 మంది మహిళలు పనులకు బయలుదేరారు. పనులకు వెళ్లొస్తామంటూ చిరునవ్వుతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిన వీరంతా కొద్దిసేపటికి ప్రమాద ఘటనా స్థలంలో మిగతా జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. భయానక వాతావరణం ప్రమాద సంఘటనలో ఆటో నుజ్జునుజ్జుగా మారి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదంతో పొన్నూరు, గుంటూరు రోడ్డుకు ఇరువైపులా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. చేబ్రోలు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని క్రమబద్ధీకరించారు. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి. వెంకటకృష్ణ సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు నారాకోడూరు వద్ద ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి తొమ్మిది మందికి గాయాలు ప్రమాదానికి పొగ మంచే కారణం -
తిరునాళ్లను విజయవంతం చేద్దాం
సమీక్షలో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ నరసరావుపేట: జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో కోటప్పకొండ తిరునాళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్అండ్బీ అధికారి రాజానాయక్ మాట్లాడుతూ 21 నుంచి తిరునాళ్లలో బారికేడ్లు నిర్మిస్తామని, రహదారులు విస్తరణ, పెండింగ్ మరమ్మతులు వంటివి పూర్తి చేస్తామన్నారు. మరో మూడు రోజుల్లో అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు, గ్రావెల్ ప్యాచ్ వర్కులు, జంగిల్ క్లియరెన్స్ పూర్తిచేస్తామని పంచాయతీరాజ్శాఖ అధికారులు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి మాట్లాడుతూ కొండ దిగువ నుంచి పైవరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, 108 వాహనాలు, క్యూలైన్ల వద్ద, మెట్ల మార్గంలో, కొండపైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తమతమ పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. పౌరాణిక, సాంఘిక నాటకాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరుణాళ్ల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కోటప్పకొండను సందర్శించి పనులను పరిశీలించారు. 20 నుంచి పాఠశాలల్లో ‘స్ఫూర్తి’ నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో భయం పోగొట్టేందుకు జిల్లాలో ఈనెల 20 నుంచి ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిపుణలతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులను అనవసర ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ’స్ఫూర్తి’ పోస్టర్ విడుదల చేశారు. జిల్లాలోని బాలికల సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన భద్రత కోసం ‘రక్ష ’ పేరుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎన్నికల పోలింగ్ ఉన్నందున నరసరావుపేటలో పోలింగ్ పూర్తయ్యే వరకూ ప్రభల తిరుగు ప్రయాణానికి ఆంక్షలుంటాయన్నారు. ప్రతి నెలా మూడో శనివారం గ్రామస్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి నెలా ఒక గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. వారంలో ఒక రోజు ఒక సంక్షేమ హాస్టల్లో బస చేస్తామని, ఉన్నతాధికారులు సైతం వారంలో ఒక రోజు హాస్టళ్లలో రాత్రిపూట బస చేయాల్సివుంటుందన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్ఓ ఎ.మురళి, డీఈఓ చంద్రకళ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మహిళల ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన వెలుగు పథకం అవినీతితో అంధకార మయంగా మారుతోంది. మూడు మండలాల్లో రూ.కోట్లు పక్కదారి పట్టడం అధికారుల అవినీతిని తేటతెల్లం చేస్తోంది. బినామీ పేర్లతో రుణాలు.. సరిగా చెల్లింపులు చేయకపోయినా రుణ మంజూరు.. రికవరీని పట్టించుకోకపోవడం.. బదిలీ అయిన సీసీలు రికార్డులు అప్పగించ కుండానే వేరే విధుల్లోకి చేరిపోవడం, వారిపై చర్యలకు తాత్సారం చేయడం తదితర కారణాలతో వెలుగు పథకం లక్ష్యం నీరుగారుతోంది. అమరావతి: మహిళల ఆర్థిక సాధికారత కోసం సుమారు 25 ఏళ్ల క్రితం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రారంభించిన వెలుగు పథకం నేడు కొంతమంది ఉద్యోగుల నిర్వాకం, అవినీతి వల్ల మహిళల జీవితాల్లో వెలుగులు నింపకపోగా చీకటిని మిగిల్చుతోంది. పల్నాడు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న వెలుగు సంస్థలో 36,500 మహిళా గ్రూపులు ఉన్నాయి. వీటిలో సుమారుగా 3,65,500 మంది ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారు. వీఓలు, సీసీలే కీలకం.. వెలుగు సంస్థలో మహిళా గ్రూపుల నిర్వహణలో గ్రామౖ సమైక్య సంఘాలు, వాటిని అన్ని విధాలుగా నడిపించే సీసీలు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు సీసీలు, గ్రామ సమైక్య సంఘాల లీడర్లు (వీఓ) ఇష్టారాజ్యంగా విధివిధానాలు అతిక్రమించి చెల్లింపులు సక్రమంగా లేకపోయినా మళ్లీ రుణాలు మంజూరు చేయడం, అలాగే సీ్త్రనిధి, ఇతర పథకాల వాయిదాల చెల్లింపులలో అవకతవకలు పాల్పడ్డారనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో వెలుగు పథకంలో గత రెండేళ్లుగా బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు తప్ప మదే ఇతర పథకాల నుంచి వచ్చే రుణాలను దాదాపుగా నిలిపివేశారు. వెలుగు పథకంలో బదిలీ అయిన సీసీలు రికార్డులు అప్పగించకుండానే మరొక విధుల్లో చేరిపోవటంతో సమస్య జఠిలమవుతోంది. అసలు ఎటువంటి వేతనాలు, గౌరవ వేతనాలు లేని వీఓ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు డిమాండ్ ఏర్పడిన పరిస్థితి. కొంతమంది యానిమేటర్లు, సీసీలు కొన్ని గ్రామ సమైఖ్య సంఘాలకు నామమాత్రంగా అధ్యక్ష, కార్యదర్శులను నియమించి చక్రం తిప్పి అనినీతి పాల్పడున్నారన్నానే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. న్యూస్రీల్ సీ్త్ర నిధి రికవరీ బకాయిలు సుమారు రూ.13.50 కోట్లు అమరావతి, అచ్చంపేట, ఈపూరు మండలాల్లో రూ.3కోట్లు పక్కదారి అవినీతికి పాల్పడిన ఉద్యోగులకే ఉన్నతాధికారుల ప్రోత్సాహం! జీతం లేని వీఓ పోస్ట్కీ డిమాండ్ పూర్తిస్థాయి విచారణ జరపాలని మహిళల డిమాండ్ సమగ్ర విచారణ జరపాలి రూపాయి, రూపాయి కూడబెట్టుకుని ఆర్థికంగా ఎదుగుదామని డ్వాక్రా గ్రూపుల్లో చేరితే ఇక్కడా మహిళలకు అన్యాయమే జరుగుతుంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా నిర్వహించే వెలుగు సంస్థలో కొన్ని మండలాల్లో అవినీతి జరిగింది. మిగిలిన మండలాల్లో కూడా లావాదేవీలు ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్నతాధికారుల బృందంతో సమగ్ర విచారణ జరిపాలి. అలాగే వీలైనంత వరకు వెలుగు సంస్థలో మహిళా ఉద్యోగులను నియమించాలి – కె.హనుమంతరెడ్డి, సీఐటీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు -
అమ్మభాష ఆనందాలు
యడ్లపాడు: మాటలు, రాతలు, దైనందిన జీవితంలోని ప్రతి వ్యక్తీకరణలో తల్లిభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చాటిచెప్పేదే మాతృభాషా దినోత్సవం. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మాతృభాషను మననం చేసుకునే శుభతరుణం. జాతి మనుగడకు భాషే ప్రధానమని స్మరించుకునే రోజు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు వీటిని నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యాయి. నాలుగు రోజుల పాటు సంబరాలు భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతిని, విలువలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గొప్ప వారసత్వం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాసంస్థలు భాషా సంబరాలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. భాషా అభివృద్ధికి, విద్యార్థుల్లో నైపుణ్యాల వికాసానికి తోడ్పడేలా ప్రభుత్వ బడులు, కళాశాలలు సన్నద్ధమవుతున్నాయి. పోటీల నిర్వహణ ఇలా.. ఈ సంబరాల్లో కథలు చెప్పటం, రచన, చర్చలు, వక్తృత్వం, పాత్రపోషణ, బోధనోపకరణాల తయారీ వంటి పోటీలు నిర్వహించనున్నారు. సంస్కృతంలో చిన్నకథలు రాయడం, శ్లోకాలు, పద్యాలు, ఉర్దూ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రాసలు, గజల్స్ చెప్పే అవకాశం ఉంది. గిరిజన భాషలు సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ నృత్యాలు, పాటలు, ఆటలు కూడా చోటు చేసుకోనున్నాయి. ఈనెల 18వ తేదీన ఆంగ్లం, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాషలు, కన్నడం, తమిళం, ఒరియా 21న తెలుగు భాషకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణకు పాఠశాలకు రూ. 500 కేటాయించినట్లు వెల్లడించారు. నేటి నుంచి బడుల్లో భాషల సంబరాలు 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహణ 18వ తేదీ నుంచి 21 వరకు వివిధ అంశాల్లో పోటీలుసృజనాత్మకతకు చోటు.. భాషా సంబరాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, భాషపట్ల ప్రేమను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. లుప్తమవుతున్న భాషల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ సంబరాల ప్రత్యేకత. ప్రతి పాఠశాలలో వీటి నిర్వహణకు హెచ్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – ఎల్ చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు -
ఐదు, ఇంటర్ తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
అచ్చంపేట: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏపీ సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఐదు, ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసినదిగా పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్ అరుణకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయని పేర్కొన్నారు. ఐదో తరగతికి 80 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపునకు 40 సీట్లు, బైపీసీ గ్రూపునకు 40సీట్లు ఉంటాయని వివరించారు. కుల రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని, ఏప్రిల్ 6, 20025 తేదీలోపు http://apbragcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తులు పంపుకోవలసి ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు 9059660634 నంబరుకు ఫోన్చేసి తెలుసుకోవచ్చని సూచించారు. నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి అయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
‘సీ్త్ర నిధి’.. పక్కదారి
వెలుగు ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏడు పథకాల నుంచి మహిళలకు రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో సీ్త్రనిధి పథకం, గ్రామ సమైఖ్య సంఘాలకు ఇచ్చే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఫండ్, విలేజ్ రివాల్వింగ్ ఫండ్, పూరెస్ట్ ఆఫ్ ది ఫూర్ పథకం, అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం, రైతు కుటుంబాలకు రుణాలు ఇచ్చే ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ల ద్వారా మహిళలు, రైతులు రుణాలు పొంది సబ్సిడీలు పోనూ మిగిలిన నగదు తిరిగి చెల్లించాల్సి ఉంది. గత రెండేళ్లుగా వెలుగు కార్యకలాపాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోయినా పూర్తిస్థాయిలో అవినీతి పెరిగిపోయింది. ఒక్క సీ్త్ర నిధి పథకంలోనే ప్రధానంగా అమరావతి, అచ్చంపేట, ఈపూరు మండలాల్లో సుమారు రూ.3కోట్లు నిధులు పక్కదారి పట్టి లెక్కలు తేలటం లేదంటే అవినీతి ఏ మేరకు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని 25 మండలాల్లో రూ.13.5 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయంటే రికవరీ గురించి వెలుగు అధికారులు మర్చిపోయారనే చెప్పుకోవచ్చు. -
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు
నర్సరావుపేట : టీడీపీ నేతలు బరితెగించారు. పిడుగురాళ్ల వైస్ చైర్మన్ కుర్చీని కుట్రలతో దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అధికారుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చివేశారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి హృదయరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇళ్ల కూల్చివేత ఘటన తనకు తెలియదని, ఆదివారం తాను విధుల్లో లేనని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డార‡ు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
గొప్ప పాలకుడు అన వేమారెడ్డి
మేడికొండూరు: మండల పరిధిలోని జంగుగుంట్ల పాలెం గ్రామంలో కొండవీటి రెడ్డి రాజు (అన వేమారెడ్డి) విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం గ్రా మస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి మాట్లాడుతూ కొండవీటి సామ్రాజ్యాన్ని పాలించిన పాలకుల్లో అన వేమారెడ్డి సుప్రసిద్ధుడన్నారు. అతని పరిపాలన క్రీ.శ.1364 – 1386 వరకు సాగిందని తెలిపారు. ఈయన పాలనలో కవులు, గాయకులకు ఎంతో ఆదరణ లభించిందని, వారికి అనేక విధాలుగా దానధర్మాలు చేసి కళలను పోషించినట్లు చరిత్ర చెబుతుందన్నారు. అనవేమారెడ్డి కొండవీటి పాలకుల్లోనే కాక ఆంధ్ర దేశాన్ని పాలించిన గొప్ప రాజులలో ఒకడని శివారెడ్డి తెలిపారు. ఈయన కాలంలో దశ దిశలా తన దండయాత్ర ద్వారా రాజ్యాన్ని విస్తరింప చేశాడన్నారు. విగ్రహావిష్కరణలో సర్పంచ్ శ్రీదేవి సాంబిరెడ్డి, మెంబర్ సాంబి రెడ్డి, తాళ్లకోటిరెడ్డి, నారసాని జయసూర్య, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల బాపిరెడ్డి, చిర్రా శ్రీనివాసరెడ్డి, చిర్రా శేషిరెడ్డి పాల్గొన్నారు. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి -
విక్రయాలు బక్కచిక్కెన్ !
నరసరావుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షలాది కోళ్లు చనిపోవడం, ఆయా జిల్లాల్లో చికెన్, గుడ్ల విక్రయాలు నిలిపేయడం, జనంలో నెలకొన్న భయాందోళనలు వెరసి వీటన్నిటి ప్రభావం జిల్లాలోని చికెన్ విక్రయాలపై పడింది. జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ లేదని, 100 డిగ్రీల మంటపై వండిన చికెన్ను తినవచ్చని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఆదివారం కొద్ది బేరం తప్పితే చికెన్షాపులు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే మటన్, చేపలు, రొయ్యలు విక్రయించే దుకాణాలు మాంసం ప్రియులతో కిటకిటలాడాయి. పట్టణ పరిధిలోని వినుకొండ రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, పల్నాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు, మాంసం మార్కెట్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చికెన్ దుకాణాలు వెలవెలబోవగా, ఆ పక్కనే ఉన్న మటన్ దుకాణాలు, మినీ వ్యాన్లలో చేపలు విక్రయించే మినీ వ్యాన్ల వద్ద జనం రద్దీ కనిపించింది. ప్రజల్లో బర్డ్ఫ్లూ భయాందోళనలు నెలకొన్నా.. చికెన్ ధరలు స్వల్పంగానే తగ్గడం గమనార్హం. గత ఆదివారం కేజీ రూ.260కు విక్రయించిన వ్యాపారులు ఈ ఆదివారం స్కిన్తో రూ.220, స్కిన్లెస్ రూ.240లని బోర్డులు వేలాడ దీశారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయించగా, చేపలు రాగండి కిలో రూ.180, బొచ్చె రూ.220, కొరమేను రూ.500కు విక్రయించారు. బర్డ్ప్లూ భయంతో చికెన్ దుకాలు వెలవెల మటన్, చేపలు, రొయ్యలవైపునకు మళ్లిన మాంసం ప్రియులు -
పండ్ల వ్యాపారి హత్య
తెనాలి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో పండ్ల వ్యాపారి హత్యకు గురైన ఘటన ఆదివారం సాయంత్రం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని(36) చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. అతడి మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్బాజీకి వచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో మేనకోడలికి రబ్బాని మద్దతుగా నిలుస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న గౌస్బాజీ రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అతన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐ ప్రకాశరావు వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పట్నంబజారు: ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ డివైడర్ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన చింతా రాము (19) కొత్తపేటలోని కుగ్లర్ ఆసుపత్రి వద్ద నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఒక ప్రైవేటు ల్యాబ్లో డెలివరీ బోయ్గా పని చేస్తున్నాడు. ఆదివారం అరండల్పేటలో పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారిపై డివైడర్ను ఢీకొన్నాడు. అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో డివైడర్పై ఉన్న ఇనుప చువ్వలపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీటీ పాటల పేరుతో రూ.15 లక్షలు మోసం లక్ష్మీపురం: చీటీ పాటల పేరుతో నగదు వసూలు చేసుకుని తిరిగి ఇవ్వకుండా పారిపోయిన నిర్వాహకులపై అరండల్పేట పోలీసులు శనివారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలకొండయ్య కాలనీకి చెందిన విజయలక్ష్మి, ఆమె కుమారుడు అనిల్ చీటీ పాటలు వేస్తుంటారు. తల్లీకొడుకులు ఇద్దరు ఆ ప్రాంతంలో 40 మంది నుంచి రూ.15లక్షలు వసూలు చేసి, ఎవరికీ చెప్పా పెట్టకుండా పారిపోయారు. దీంతో బాధితులు దిక్కుతోచక అరండల్పేట పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి పట్నంబజారు: అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుపేటకు చెందిన అంకాల ప్రత్యూష (23) ఏడాది కిందట ఆనందపేటకు చెందిన అంకాల పవన్ కల్యాణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రత్యూష కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. పవన్ కల్యాణ్ మార్కెట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న కల్యాణ్తో మృతురాలు ప్రత్యూషకు తరచూ వివాదం జరుగుతుండేది. ఈనెల 15 రాత్రి పవన్ తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. అతడు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రత్యూష్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముగిసిన నాటిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం నాటిక పోటీలను మద్ది లక్ష్మీశ్వేతా కిషోర్ జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ప్రారంభించారు. కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష, గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికలు ప్రదర్శించారు. మాదక ద్రవ్యాలు సమాజాన్ని నాశనం చేస్తుంటే గంజాయి సరఫరా చేసే కన్న కొడుకునే కడతేర్చి గంజాయి భూతాన్ని తరిమి కొట్టాలనే కన్నతల్లి ప్రయత్నమే కథాంశంగా తితిక్ష నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా మారి వైద్యాన్ని అమ్ముకుంటున్న డాక్టర్ తన తప్పు తెలుసుకొని పేదలకు వైద్యం అందించేందుకు గ్రామ బాట పట్టడం ఇతివృత్తంగా చిగురు మేఘం ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా, శనివారం రాత్రి నాటిక పోటీలకు హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నాటక రంగాన్ని భావి తరాలకు అందించాలని కళాకారులను కోరారు. సత్తా చాటిన నరసరావుపేట కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో విజేత అద్దంకి రూరల్: స్థానిక గీతామందిరంలో ఆదివారం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 6 రాష్ట్రాల నుంచి 650 మంది పాల్గొనగా.. నరసరావుపేట టీం విజయం సా ధించింది. పోటీల చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు మాట్లాడుతూ సొంత ఊరికి పేరు తేవాలని కోరికతోనే అద్దంకిలో నిర్వహించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాయిరాం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చిన్ని మురళీ కృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మలాది శ్రీనివాసరావు, కరాటే మాస్టర్ వెంకట రత్నం పాల్గొన్నారు. -
సేవాలాల్ జయంతి నిర్వహణలో ప్రభుత్వం విఫలం
యడ్లపాడు: శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్ విమర్శించారు. యడ్లపాడు ఎర్రకొండ సమీపన ఉన్న సుగాలీ కాలనీలో ఎస్టీ యూత్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనునాయక్ మాట్లాడుతూ తండాలో జన్మించి నిలువెల్లా సేవాగుణం నిండుకొన్న సంత్ సేవాలాల్ బ్రిటిష్ పాలకులను అడ్డుకున్న ధీశాలి అన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం క్యాజువల్ లీవ్గా ప్రకటించగా, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని, ఇక్కడి కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో విఫలమైందన్నారు. ముందుగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సుగాలి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బాణావతు శ్రీనునాయక్, ముడావతు బాలాజీ నాయక్, హనుమానాయక్, రమావతు శ్రీనునాయక్, అంజినాయక్, దశావతు శంకర్ నాయక్, వెంకట్నాయక్, శివకృష్ణ నాయక్, రావూరి దుర్గానాయక్ పాల్గొన్నారు. ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్ -
ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో తిరిగే హక్కులేదా?
అచ్చంపేట: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు వారి వారి మండలాల్లో తిరిగే హక్కులేదా? తిరిగితే దాడులుచేసి, తప్పుడు కేసులు బనాయిస్తారా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని నియోజకవర్గంలోని ఐదు మండలాల జెడ్పీటీసీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు పెదకూరపాడు మండలంలోని గారపాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లిన పెదకూరపాడు జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి భర్త కంకణాల శివాజీపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. న్యాయబద్దంగా గెలిచిన తాము ప్రజల్లో తిరగకూడదా ..గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రేక్షకుల్లా మారిపోయిన పోలీసులు తమపైనే తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్యాయాలను విచారించాలని, ఎవరో ఏదో తప్పుడు ఫిర్యాదుచేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. తాము ఇచ్చే ఫిర్యాదులుగాని, తాము చేప్పేదిగాని పట్టించుకోకపోవడం ఖచ్ఛితంగా వివక్ష చూపడమేనన్నారు. పోలీసులు శాంతిభద్రతులు కాపాడేలే తప్ప గొడవలు సృష్టించడం, తప్పుడు కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు? అధికారంలోకి వచ్చిన పార్టీవారు ఎవరైనా సరే ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలి, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనేదానిపై దృష్టిపెట్టాలిగానీ, ఎవరిపై దాడులు చేద్దాం, ఎంతమందిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుదాం అనే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా తప్పుడు కేసులను విరమించుకుని, దాడులకు స్వస్తి చెప్పి ప్రజాభివృద్ధి కోసం పాలన కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాల జడ్పీటీసీ సభ్యులు తుమ్మా విజయప్రతాప్ రెడ్డి, కరుణకుమారి, షేక్ జమీల్, గాదె వెంకటరెడ్డిలతో పాటు జిల్లా పరిషత్ కో–ఆప్షన్ సభ్యులు షేక్ సర్థార్ షమి తదితరులున్నారు. పెదకూరపాడు జెడ్పీటీసీ భర్త శివాజీపై టీడీపీ నేతలు దాడిచేయడం దారుణం అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాల జెడ్పీటీసీ సభ్యులు -
రాజీమార్గం ద్వారా పరిష్కరించుకుందాం
నరసరావుపేటటౌన్ : రాజీ మార్గం ద్వారా సమస్య పరిష్కరించుకుందామని పుల్లారావు బాధిత సంఘ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం కమ్మ హాస్టల్లో సాయిసాధన చిట్ఫండ్ బాధితులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పుల్లారావుపై నమోదైన చిట్ఫండ్ క్యాంపు కేసు సీఐడీకి బదిలీ చేస్తే న్యాయం జరగటంలో ఆలస్యం జరుగుతుందన్నారు. పుల్లారావు తరఫున మధ్యవర్తిత్వం వహించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు కాబట్టి బాధితుల తరఫున కమిటీగా ఏర్పడ్డ సభ్యులు వారితో చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపాలన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఐక్యంగా కలిసి పోరాడుదాం అన్నారు. జరిగిన మోసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేవరకు ఆందోళనలు చేద్దామని తీర్మానించారు. కార్యక్రమంలో నాగోతు శౌరయ్య, కడియాల రమేష్, ఇ.ఎం.స్వామి, వి.మధుసూధనరావు పాల్గొన్నారు. న్యాయం జరగని పక్షంలో ఉద్యమం ఉధృతం చేద్దాం సమావేశంలో తీర్మానించుకున్న పుల్లారావు బాధితులు -
మహిళ హ్యాండ్ బ్యాగ్ చోరీ
లక్ష్మీపురం: మహిళ హ్యాండ్ బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయిన ఘటనపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గోరంట్ల గ్రామానికి చెందిన సాయి పూజ ఈనెల 14న అరండల్పేట 5/5లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వచ్చింది. పలు పరీక్షలు చేయించుకునే క్ర మంలో మెడలో ఉన్న 20గ్రాముల బంగారు గొలుసు ను బ్యాగ్లో పెట్టుకుంది. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చింది. ఈ సమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని పరారయ్యారు. దీంతో పూజ కేకలు పెట్టడంతో స్థానికులు పట్టుకునే యత్నం చేసేలోగా పారిపోయారు. సమాచారం తెలుసుకున్న అరండల్పేట పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగ్లో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసు, రూ.1500 నగదు, సెల్ఫోన్ ఉన్నట్లు బాధితురాలు తెరుకుని శనివారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
పిడుగురాళ్ల: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు ఎదురు సిమెంట్ బెంచీ మీద గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెంకన్నకుంటలో గుర్తు తెలియని మహిళ... వెల్దుర్తి: మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామ సమీపంలోని వెంకన్న కుంటలో ఆదివారం సుమారు 30 నుంచి 40సంవత్సరాలలోపు ఉండే గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సమందర్ వలి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని మిట్టమీది పల్లె గ్రామం వద్ద నీటి కుంటలో మహిళ మృతదేహం తేలాడుతుందనే గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి నీటి కుంటలో ఉన్న మహిళ మృతదేహాన్ని వెలుపలకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతురాలి మెడలో పసుపు కొమ్ము, పసుపు తాడు, కాలికి రాగి మెట్టలు ఉన్నట్లు తెలిపారు. ఈ మహిళ మూడు రోజుల కిందట ఈ కుంటలో పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మహిళ ఆచూకీ తెలిసిన వారుంటే వెంటనే వెల్దుర్తి పోలీసు స్టేషన్కు సమాచారమివ్వాలని ఎస్ఐ సమందర్ వలి కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ..బొల్లాపల్లి: మిరప కోతకు వచ్చిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మండలంలోని రావులాపురం – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. బండ్లమోటు పోలీసులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని నల్లదిబ్బల పల్లెకు చెందిన పల్లపు చిన్న (25) మండలంలోని గుమ్మనంపాడు గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మిరప కాయల కోత కూలికి వచ్చాడు. తన ద్విచక్ర వాహనంపై గుమ్మనంపాడు నుంచి రాజులపాలెం వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తుతెలియని వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తల్లి పల్లపు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య స్వాతి, ఒక కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యువకుడు మృతిచెందిన సంఘటన ప్రాంతంలో మండలంలో రెండు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనానికి చెందిన నంబరు ప్లేట్ పడి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పండితులను తీర్చిదిద్దిన సంస్కృత కళాశాల
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు తెనాలి: చరిత్రపుటల్లో తెనాలి సంస్కృత కళాశాల చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రామాయణ ప్రవచన సుధాకర, సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. శతాధిక వసంతాలు నడిచిన తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం స్థానిక రాష్ట్రప్రభుత్వ పెన్షనర్స్ హాలు లో ఘనంగా నిర్వహించారు. పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల జ్ఞాపకాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక ‘మనోరమ’ను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆగమ పండితుడు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్ అధ్యక్షత వహించారు. సంఘం కన్వీనర్ పి.వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్వీ అప్పా రావు, చిలుమూరు రామలింగేశ్వరరావు కె.శ్రీనివాస్ శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి, ఎ.సూర్యనారాయణ, జయప్రద, ఎం.సుధారాణి, సద్యోజాతం శేషవీరేశ్వర శర్మ, ఎం.సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసింహారావు, జె.అరుణ గోపాలచార్యులు మాట్లాడారు. పూర్వజన్మ సుకృతం కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. -
ఇసుక లభ్యత గగనం.. ఇంటి నిర్మాణం కష్టం
అందజేసిన స్థలాల్లో 14,042 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. అసలు 8455 స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలే మొదలు కాకపోగా, మిగతా వాటిలో బేస్మట్టం స్థాయి నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో గృహాలు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎటువంటి చేయూత అందించకపోవటంతో వారిలో నిస్తేజం ఏర్పడింది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానంతో లబ్ధిదారులకు ఇసుక దొరకటమే కష్టంగా మారింది. దీంతో పాటు గత ప్రభుత్వం పేదలకు అందజేసిన ఏ ఒక్క పథకం అమలుచేయకపోవటంతో చేతిలో చిల్లిగవ్వ కన్పించటం కష్టంగా మారింది. దీంతో ఇంటి నిర్మాణం తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వచ్చే మార్చిలోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించని 8455 మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, ఇటీవల కాలనీని సందర్శించిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ లబ్ధిదారులు వచ్చే 2026 డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలు రావని చెప్పటం గమనార్హం. -
పక్కాగా చెక్కేసే పన్నాగం!
పట్టుమని పదవ తరగతి కూడా పూర్తి కాలేదు.. కానీ వందల మందిని ఎలా ముంచాలో మాత్రం నేర్చుకున్నాడు.. లెక్కలు అంతగా చదువుకోలేదు.. కానీ ఎంత కూడబెట్టాలో, ఎంత దోచుకోవాలనే విషయంలో మాస్టర్ చేశాడు.. చట్టాలంటే ఏమిటో కూడా తెలియదు.. కానీ ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసుకున్నాడు. ఇదీ పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆర్థిక నేరగాడు పుల్లారావు భాగోతం. ఏడవ తరగతి చదివిన పుల్లారావు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనను నమ్మి డబ్బులిచ్చిన వారిని ముంచేసి పక్కాగా విదేశాలకు చెక్కేసే పన్నాగం వేశాడు.. దీనికి ముందే గుట్టు రట్టవడంతో కోర్టులో లొంగిపోయాడు. నరసరావుపేట టౌన్: కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్థిక నేరగాడు పాలడుగు పుల్లారావు కేసును పరిశీలించే కొద్దీ విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణ, విదేశాల్లో ఉన్న వారు సైతం సాయిసాధన చిట్ఫండ్లో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో అనేకమందిని నమ్మించి వంచించాడు. మరి కొంత మందికి వడ్డీ ఆశచూపి నిండా ముంచాడు. దాదాపు రూ.400 కోట్ల స్కామ్కు పాల్పడ్డాడు. విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పుల్లారావు గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహి అగ్రి సంస్థ డైరెక్టర్ దండా రాజ్యలక్ష్మి వద్ద విజయలక్ష్మీ టౌన్షిప్ వెంచర్లో రూ.11.62 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీసుకున్న నగదుకు వాటా ఇస్తానని నమ్మబలికాడు. అయితే నెలలు గడుస్తున్నా పుల్లారావు వాటా ఇవ్వకపోవడంతో జరిగిన మోసంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పుల్లారావు ఆర్థిక నేర ప్రపంచంలోని బాగోతాలు ఒక్కొక్కొటిగా బయటపడుతూ వచ్చాయి. ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో కొన్ని నెలలుగా బినామీ పేర్లతో ఆస్తులు కొన్నాడు. బంగారం, వజ్రాల రూపంలో నగదును దారి మళ్లించాడు. చీటీ పాటలు రిజిస్ట్రేషన్ శాఖ అనుమతులు లేకుండానే ఐదేళ్లుగా అక్రమంగా నిర్వహిస్తున్నాడు. అయితే ఈ స్కామ్ బయట పడక ముందే పుల్లారావు విదేశాలకు పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేశాడు. గత ఏడాది డిసెంబర్ నెలలోనే తనతోపాటు కుటుంబ సభ్యుల పాస్ పోర్టులన్నీ రెన్యువల్ చేయించాడు. ఫిబ్రవరిలో తన కుమారుడి వివాహం జరిపించి, దర్జాగా ప్రజల సొమ్ము తీసుకుని ఎంచక్కా విదేశాల్లో స్థిరపడాలని పన్నాగం వేశాడు. ఇది బెడిసికొట్టడంతో కోర్టులో లొంగిపోయాడు. లాయరు లేడంట.. రాలేడంట! గుంటూరు సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పుల్లారావును నరసరావుపేట వన్టౌన్ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరినప్పటికీ చట్టంలోని లొసుగులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇప్పటి వరకు తాను లాయర్ను నియమించుకోలేదనే సాకు చూపుతూ పోలీసు కస్టడీకి రాకుండా తాత్సారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనవద్దకు వచ్చిన బాధితుల వద్ద ముసలి కన్నీరు కారుస్తూ వారిని మరింతగా ముంచేందుకు ఎత్తులు వేస్తున్నాడు. తన వద్ద అప్పులకంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని వారిని మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో సుమారు రూ.400 కోట్లకుపై స్కామ్ జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని, బాధితుల వైపు నిలబడాల్సిందిపోయి పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అన్ని వ్యవస్థలూ తన గుప్పిట్లోనే..బాధితుల ఆవేదన.. ఇళ్లు, వాకిళ్లు అమ్మేసి.. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం పుల్లారావు వద్ద దాచుకున్న సొమ్ము వస్తుందో లేదో అని బాధితులు ప్రతి రోజూ దిగులుతో కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పటికే ఇన్చార్జి మంత్రి, నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఐజీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. బాధితులంతా రోడ్డెక్కినా న్యాయం చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఆర్థిక నేరగాడు పుల్లారావుపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కుటుంబంతో విదేశాలకు పారిపోయేందుకు పుల్లారావు వ్యూహం గత ఏడాది డిసెంబర్లోనే పాస్పోర్టుల రెన్యువల్ కుమారుడి వివాహం అనంతరం గుట్టుగా తప్పించుకునేందుకు యత్నాలు నేరాల చిట్టా బయటపడ్డాక అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు ఇప్పడు పోలీసుల ముందుకు వచ్చేందుకు ఇదే స్కెచ్ అమలు పోలీసుల దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను పుల్లారావు తన చేతుల్లో పెట్టుకున్నాడు. తన ఆర్థిక నేర ప్రపంచం గురించి బయటకు తెలిసినప్పటికీ ఎంచక్కా దర్జాగా కొడుకు పెళ్లి వేడుకలు నిర్వహించాడు. తాను అనుకున్నప్పుడే కోర్టులో లొంగిపోయాడు. దీని వెనుక తన సమీప బంధువైన సీఐ ప్రమేయం ఉందని బాధితులు గగ్గోలు పెడుతున్నా.. కూటమి ప్రభుత్వం కనీసం ఆ సీఐపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయారు. దీన్ని బట్టి పుల్లారావు ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థను మేనేజ్ చేశాడో అర్థమవుతుంది. -
వారమే సమయం.. నత్తేనయం!
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహాత్సవానికి వారం రోజులే సమయం ఉంది. ఏకాదశి ముందురోజు ఆదివారం కావడంతో ఈనెల 23 నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. తిరునాళ్ల ఏర్పాట్లపై నెలరోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా కీలకమైన శాఖలు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొండ దిగువున బారికేడింగ్, లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి పనులపై అధికారులు ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. కొండకు వచ్చే రహదారుల్లో మరమ్మతులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. దగ్గర పడుతున్నా చలనం ఏదీ..? కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది యాత్రికుల కోసం ప్రభుత్వ శాఖలు విస్త్రృత ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకోసం నెలరోజుల నుంచే జిల్లా అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అయితే తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నా పలు శాఖల్లో చలనం కనిపించడం లేదు. కొండ దిగువున శివరాత్రి రోజు రాత్రి జాతరకే లక్షలాది మంది తరలివస్తారు. ఈ ప్రాంతంలో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కొండ దిగువున ప్రధాన రహదారి వెంట బారికేడ్లు ఏర్పాటు చేసే పనిని ఆర్అండ్బీ నిర్వహించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రధాన రహదారులతో పాటు భక్తులు స్నానాలు ఆచరించే చిలకలూరిపేట మేజర్ కాలువ వద్ద విద్యుత్దీపాలు ఏర్పాటు చేయాలి, ఆర్అండ్బీ (ఎలక్ట్రికల్) శాఖ దీనిని చేపటాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. యాత్రికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి కుళాయిలు ఏర్పాటుతో తాత్కాలిక మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్వహిస్తోంది. ఆయా పనుల్లో పురోగతి కనిపిండచం లేదు. ప్రభుత్వ శాఖల స్టాల్స్, పోలీసు ఉన్నతాధికారుల తాత్కాలిక వసతి కోసం సిద్ధం చేసే మైదానాన్ని ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి.. కొండ మీద ప్రధానాలయం కాకుండా ఇతర ఆలయాలకు రంగులు వేసే పనిని నెల రోజుల క్రితం ప్రారంభించారు. ఈ పనులు ఇంకా సాగుతున్నాయి. క్యూలైన్లకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయడం పూర్తయింది. ఽఆలయ ప్రాంగణంలోని ఆర్చీకి రంగులు వేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న క్యూలైన్లకు తాటాకు పందిరి ఏర్పాటు చేస్తున్నారు. తిరునాళ్ల పనుల్లో కనిపించని పురోగతి 23 నుంచి కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం కొండ దిగువున పనులు ప్రారంభించని పలు శాఖలు ఏర్పాట్లలో ప్రధాన శాఖల నిర్లక్ష్య వైఖరి ఆలయంలోనూ కొనసా..గుతున్న పనులు 20వ తేదీ నాటికి ఆలయంలో పనులు పూర్తి ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచే భక్తుల తాకిడి ఉంటుందని భావిస్తున్నాం. అందుకు తగ్గట్టు ఆలయంలో చేపట్టిన పనులు 20వ తేదీకి పూర్తిచేయాలని నిర్ణయించాం. రంగులు వేసే పని మూడు రోజుల్లో పూర్తవుతుంది. ప్రసాదాలు తయారీని ప్రారంభించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డి.చంద్రశేఖరరావు, ఆలయ ఈఓ -
జీబీ సిండ్రోమ్ కలకలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్ (గులియన్బెరి సిండ్రోమ్) కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో ఆదివారం ప్రకాశం జిల్లా అలసానిపల్లెకు చెందిన బి.కమలమ్మ(45) చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీ సిండ్రోమ్తో ఈ నెల 3న జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో అడ్మిట్ అయి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం కార్డియాక్ అరెస్ట్తో చనిపోయింది. వాస్తవానికి ప్రతినెలా గుంటూరు జీజీహెచ్లో పది మందికిపైగా ఈ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన బాధితులు వారు గుంటూరు జీజీహెచ్కు తరలి వస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జీజీహెచ్లో జీబీ సిండ్రోమ్ కేసులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఖరీదైన ఇంజక్షన్లను తక్షణమే ఇస్తున్నట్లు న్యూరాలజీ వైద్యులు తెలిపారు. భయపడాల్సిన పనిలేదు... ఆదివారం చోటు చేసుకున్నది తొలి మరణమేమీ కాదని... గత ఏడాదిలో ఈ ఆస్పత్రిలోనే నలుగురు వ్యాధి బాధితులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఖరీదైన వైద్యం అవసరమే తప్ప భయపడాల్సిన పని లేదని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో గిద్దలూరుకు చెందిన కమలమ్మ మృతి చెందిది. కాగా, నరసరావుపేటకు చెందిన మరో మహిళ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజిస్టులు వెల్లడించారు. నెలకు 10 నుంచి 15 కేసులు న్యూరాలజీ వైద్య విభాగానికి ప్రతి నెల 10 నుంచి 15 జీబీ సిండ్రోమ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఒక్కో పేషెంట్కు ఖరీదైన ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్లో 115 మంది చికిత్స పొందారు. కాగా వీరిలో 66 మందికి మాత్రమే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు చేయడం ద్వారా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతరులు సాధారణ వైద్యం ద్వారానే రికవరీ అయినట్లు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇంజక్షన్లు అవసరం వస్తుందని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. బాధితుల్లో 20 శాతం మందికి మాత్రమే ఈ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 5 నుంచి 7.5 శాతం మంది మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆడ, మగ తేడా లేకుండా జీబీ సిండ్రోమ్ అందరికి సోకుతుంది. ఇది అంటు వ్యాధి మాత్రం కాదు. 25 శాతం మందికి ఈ వ్యాధి సోకడానికి కారణాలు తెలియదు. 20 శాతం మందికి దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, రిస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల సోకుతోంది. గ్యాస్ట్రో ఎంట్రైటీస్ (జీఈ) ఇన్ఫెక్షన్ వల్ల, డయేరియా వల్ల కూడా వస్తోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం. వ్యాధి నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత కాళ్లకు వ్యాధి సోకి తద్వారా శరీరం పై భాగానికి ఎగబాకుతుంది. వ్యాధి నుంచి కొంత మంది గంటల వ్యవధిలోనే కోలుకోవచ్చు. మరికొంత మందికి నెలల సమయం పడుతుంది. జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు వచ్చి తగ్గుతున్న సమయంలో వారికి కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమై కాళ్లు బలహీనపడితే దీనిని జీబీ సిండ్రోమ్గా గుర్తించాలి. తక్షణమే న్యూరాలజిస్టులను సంప్రదించాలి. ఎలా వస్తుందంటే.. గుంటూరు జీజీహెచ్లో బాధితురాలి మృతి ప్రతినెలా సగటున 10 నుంచి 15 మందికి చికిత్స సత్వర వైద్యసేవలు అందిస్తుండటమే కారణం భయపడాల్సిన పనిలేదంటున్న వైద్య నిపుణులు -
సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆర్గనైజర్, కో–ఆర్డినేటర్ సుజాత, రామకృష్ణ పాల్గొన్నారు. ‘రాష్ట్ర సమ్మాన్’ పురస్కారం ప్రదానంతెనాలి: తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో సంస్కృతి కళాక్షేత్ర ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని జీపీ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో జరిగిన భారత్ ఉత్సవ్–2025లో తెనాలికి చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణకు ‘రాష్ట్ర సమ్మాన్’ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళా, సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరై చిన్నారిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని ఘనతలు సాధించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏడాదిన్నర వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న ప్రదీప్నారాయణ మూడేళ్ల వయసులో జాతీయ గీతాన్ని 52 సెకన్లలో ఆలపిస్తున్నాడు. పండ్లు, కూరగాయలు, మనిషి శరీర భాగాలు వంటివి 500 పైగా గుర్తిస్తున్నాడు. తెలంగాణ ‘రాష్ట్ర సమ్మాన్’ సహా ఇప్పటికి ఎనిమిది జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో పది అవార్డులు అందుకున్నాడు. కస్టమ్స్ అధికారులు అవయవదానం లక్ష్మీపురం: కస్టమ్స్ డే వేడుకలలో భాగంగా కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి దంపతులు అవయవదానం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన వేడులలో ఆయన మాట్లాడుతూ బాక్స్ ఆఫ్ కై న్డ్ నెస్ స్థాపకులు ఒకే రోజు 4 వేల మందితో రక్తదానం చేయించారని అభినందించారు. ప్రతిఒక్కరు సేవాభావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. తాను, తన సతీమణి అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రాంగణంలో ఉన్న కస్టమ్స్ శాఖ అధికారులు 36 మంది కూడా అవయవదానం చేస్తూ అంగీకారపత్రం ఇచ్చారు. సెప్ట్క్ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఇంతమంది అవయవదాతలుగా నమోదు కావడం సంతోషకరంగా ఉందన్నారు. డాక్టర్ ప్రజ్ఞాచారికి ‘కళా కిరీటి’ అవార్డు తెనాలి: రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి గోదావరి కల్చరల్ అసోసియేషన్ కళా కిరీటి జాతీయ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని మలికిపురంలోని అల్లూరి సత్యనారాయణరాజు ఫంక్షన్ హాలులో ఆదివారం కళా కిరీటి జాతీయ పురస్కారాలను బహూకరించారు. -
కూటమి కుట్ర
అనర్హుల పేరుతో ఇళ్లు రద్దు చేసే యోచన నరసరావుపేట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని (నూతన పీఎంఏవై, ఎన్టీఆర్ నగర్ స్కీము) లబ్ధిదారుల మెడలపై కూటమి ప్రభుత్వం కత్తి వేలాడతీసింది. ఈ మార్చి 31వ తేదీలోగా ఇళ్లు నిర్మించుకోని వారి స్థలాలు స్వాధీనం చేసుకుంటామని కూటమి నాయకులు చేస్తున్న ప్రకటనలతో బెంబేలెత్తిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లుకూడా మంజూరుచేయని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పొందిన వారికి పార్టీలు అంటగట్టి ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పేదల కోసం కాలనీలు ఇలా.. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే దృక్పధంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జగనన్న కాలనీలకు రూపకల్పన చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 16 ప్రదేశాల్లో 39,625మందికి వేల ఎకరాల ప్రైవేటు భూమి కొనుగోలు చేసి ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇళ్ల పట్టాలతో పాటు గృహాలు కేటాయించింది. ప్రతి పట్టాను మహిళ పేరుతో ఇవ్వటమే గాకుండా ఐదేళ్ల అనంతరం వాటిని విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. వారిపేరుపై ఒక్క రూపాయి ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేసింది. దీనిలో ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఇచ్చే రూ.1.50లక్షలకు తోడుగా తాను రూ.30వేలు అదనంగా ఇవ్వటంతో పాటు ఇసుక, సిమెంట్, స్టీలు ఉచితంగా అందజేశారు. లబ్ధిదారుల మెడలపై కూటమి కత్తి మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాలు స్వాధీనం ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు బెంబేలెత్తుతున్న లబ్ధిదారులు అది మా పనికాదు ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకునే హక్కు మాకు లేదు. అది మా గృహనిర్మాణశాఖ పని కాదు. మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. లబ్ధిదారులను మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కోరుతున్నాం. – ఎస్. వేణుగోపాలరావు, పీడీ, గృహనిర్మాణశాఖపోరాటం చేస్తాం.. పేదలు తమకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చీరాగానే ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి స్థలాలు స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటనలు ఇవ్వటం ఏమాత్రం సముచితం కాదు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలు బేస్మెంట్ స్థాయికే సరిపోతుంది. కనీసం రూ.5లక్షలు సాయం చేస్తేనే నేటి ధరలు, కూలీకి ఇల్లు ఏర్పడుతుంది. ఈవిధంగా సహాయం చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందిపెడతామంటే వారిని కూడగట్టుకొని పోరాటం చేస్తాం. – షేక్ శిలార్ అహ్మద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
మహా శివరాత్రికి భద్రత పెంచండి
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025నరసరావుపేట: ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, సత్రశాల, దైద శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్లు, నేరాల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి, సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేగ నియంత్రికలు, ట్రాఫిక్ సూచనలను తెలిపే సైన్ బోర్డులను, అవసరమైన చోట స్టాఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 112కు వచ్చే కాల్స్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంజాయి రవాణా అరికట్టాలని చెప్పారు. అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, జగదీష్, మహిళా స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, ఏసీబీ సీఐలు సురేష్బాబు, శరత్బాబు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు అమరావతి: అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి మహా శివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్ డానియేల్ అన్నారు. శనివారం స్థానిక ఆలయంలో సమన్వయ కమిటీ రెండో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్నానాల ఘాట్ల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలీసులు తగినంత మంది సిబ్బందిని నియమించాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వేడుకల సమయంలో మద్యం షాపులను మూసివేయాలని ఎకై ్సజ్ శాఖాధికారులను ఆదేశించారు. సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సీఐ అచ్చియ్య, ఆలయ ఈవో సునీల్కుమార్, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రను విజయవంతం చేయండి
నరసరావుపేట: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పిలుపు ఇచ్చారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించాక, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయాలు, ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుతాయని అన్నారు. ప్రతి మూడో శనివారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో.. విజయపురిసౌత్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విజయపురిసౌత్లో శనివారం ఘనంగా నిర్వహించారు. జెన్కో ఈఈ అప్పాజీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ముందుగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏపీ జెన్కో క్వార్టర్స్ వద్ద రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈలు రాజారెడ్డి, అక్బర్, రమణారావు, ఏఈలు గౌతమ్, శ్రీను, శ్రీనివాస్, రేవతి, సల్మా, రాణిబాయి, మనోహరమ్మ, రాణి, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ సత్యమూర్తి, డాక్టర్ రేవంత్, ఉద్యోగులు చందు, రామకృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లాలోని రైతులు అందరూ రైతు సేవా కేంద్రాల ద్వారా 11 అంకెలు గల విశిష్ట సంఖ్యను పొందాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పేర్కొన్నారు. శనివారం జిల్లాలో పలు చోట్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ పథకాన్ని పొందే రైతులు 2.09 లక్షల మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 35వేల మందికి విశిష్ట సంఖ్యను నమోదు చేయటం జరిగిందన్నారు. ఈనెలాఖరు నాటికి 40శాతం వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పథకాలను పొందేందుకు భవిష్యత్లో ఈ విశిష్ట సంఖ్య ఆధారంగానే సులభ సాధ్యమౌతుందన్నారు. ఈ సంఖ్యను పొందేందుకు సమీపంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందికి పొలం వివరాలు, ఆధార్ లింకు అయిన సెల్ఫోన్ నంబరు సమర్పిస్తే ఆ రైతుకు 11అంకెలు గల విశిష్ట సంఖ్యను నమోదు చేస్తారన్నారు. సమస్య ఉత్పన్నమైతే మండల వ్యవసాయాధికారి, 83310 56905, 83310 56911 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఉపకార పరీక్షల్లో 19 మందికి అర్హత
శావల్యాపురం: కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ ప్రతిభ ఉపకార పరీక్షల్లో ఫలితాల్లో 19 మంది శావల్యాపురం విద్యార్థులు అర్హత పొంది పల్నాడు జిల్లాస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ప్రతిభ పరీక్షల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హత పొందారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ. 12 వేలు చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ సందర్భంగా శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఎంపికై న విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. విద్యాకమిటీ చైర్మన్ పాటిబండ్ల శ్రావణ్కుమార్, ప్రధానోపాధ్యాయురాలు బోడ్డపాటి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు కుమ్మరి శ్రీనివాస రాజు, రాగుల రాధాకృష్ణమూర్తి, సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నాటికలకు సమాజమే ఇతివృత్తం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 24వ జాతీయస్థాయి తెలుగు ఆహ్వాన నాటిక పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రెండవరోజు శనివారం నాటిక పోటీలను రంగస్థలి శాశ్వత సభ్యులు నాతాని సురేఖా వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్ కళాంజలి వారి అన్నదాత, వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి రాత నాటికలను ప్రదర్శించారు. రంగస్థలి అధ్యక్షుడు షేక్.మహబూబ్ సుభాని, కిలారు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రబోస్, కార్యనిర్వహణ కార్యదర్శి ఏ.ఏ.మధుకుమార్ తదితరులు పర్యవేక్షించారు. అన్నదాత కడగండ్లకు కారకులెవరు? వ్యవసాయదారుని కడగండ్లు ఇతివృత్తంగా రూపుదిద్దుకున్నది అన్నదాత నాటిక. అన్నం పెట్టే రైతు నోట్లో అందరూ మట్టి కొట్టేవాళ్లే.. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతును పాలకులు, దళారులు, వ్యాపారులు అందరూ మోసం చేస్తూ రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారు. రైతు కష్టాలను కళ్లకు కట్టింది. మన రాత మనమే రాసుకుంటాం... మనిషికి కష్టం వస్తే నా రాతింతే అని తల పట్టుకొని కూచుంటాడు. సంతోషం కలిగితే పరిసరాలను పట్టించుకోడు. మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోంది.. సమాజం ఎటువైపు పోతుంది.. ప్రకృతి అనర్థాలకు కారకులెవరు వంటి ప్రశ్నలకు ప్రతి ఒక్కరే తమకు తామే సమాధానం ఇచ్చికునే పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా రాత నాటిక ప్రేక్షకులను ఆలోచింప చేసింది. మళ్లీ విజృంభించిన వేటపాలెం ఎడ్లు మాచవరం: మండల కేంద్రమైన మాచవరంలో లక్ష్మితిరుపతమ్మగోపయ్య స్వామి వార్ల కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా న్యూ కేటగిరి (సేద్యం) విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి శివకృష్ణ చౌదరి ఎడ్లు 3770.9 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో నిలిచాయి. వజ్రాల తేజశ్వినీరెడ్డి (సంతమాగులూరు, బాపట్ల జిల్లా) ఎడ్లు 3250 అడుగులు దూరాన్ని లాగి రెండవ స్థానంలో, సంపటం వీరబ్రహ్మం నాయుడు (క్రోసూరు, పల్నాడు జిల్లా) ఎడ్లు 3149.7 అడుగులు దూరాన్ని లాగి మూడవ స్థానంలో, తనుబొద్ది శంకర్రెడ్డి (ఉప్పమాగులూరు, బల్లకురవ మండలం, ప్రకాశం జిల్లా) ఎడ్లు 2798.6 దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో, ముక్కపాటి హనుమంతురావు చౌదరి (మాచవరం, పల్నాడు జిల్లా) ఎడ్లు ఐదో స్థానంలో, సిద్ది మల్లేశ్వరావు (మర్రివేముల, పుల్లలచెరువు, ప్రకాశం జిల్లా) ఎడ్లు 2567.3 అడుగులు దూరాన్ని లాగి ఆరో స్థానంలో బహుమతులు అందుకున్నాయి. -
పిడుగురాళ్లలో టీడీపీ అరాచకం
పిడుగురాళ్ల/నరసరావుపేట: ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది. తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ 20 మందిని శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14వ వార్డు కౌన్సిలర్ పులి బాలకాశిని గురువారం రాత్రి పోలీసులు తీసుకు వెళ్లారని ఆయన భార్య రమణ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కాపాడాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులను తట్టుకోలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా ఆమె భర్త షేక్ సైదావలి అజ్ఞాతంలో వెళ్లారు. వీరిని బయటకు రప్పించడం కోసం పోలీసులు సైదావలి సోదరుడు సుభానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సైదావలి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజని భర్త జూలకంటి శ్రీనివాసరావును పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్లి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారాలని వేధించినట్లు వారు తెలిపారు. 13వ వార్డు కౌన్సిలర్ షేక్ సమీరా ఆమె భర్త షేక్ కరిముల్లాను కూడా బెదిరించారు. టీడీపీ నాయకులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. టీడీపీ నేతలు ఇంతగా బరితెగించడం దారుణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల దన్నుతో బరితెగింపుపల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల దన్నుతో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈ నెల 17న జరగబోయే ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సత్రశాలలో మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ బసవ శ్రీనివాసరావు సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని గుంటూరు దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించి సూచనలు చేశారు. సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అర్చకులు మల్లికార్జునశర్మ నీలం మల్లయ్య, మున్నా లింగయ్య తదితరులు ఉన్నారు. పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి డీఎస్పీ రామాంజనేయులు చందోలు(కర్లపాలెం): పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆదేశించారు. చందోలు పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పరిష్కరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకునే విధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలో కోడి పందేలు, పేకాటలపై నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.స్వామి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
మా భూములు చూపించండి సారూ
సంతమాగులూరు (అద్దంకి): తమకు పూర్వార్జితంగా సంక్రమించిన భూమిని చూపాలని కోరుతూ గ్రామానికి చెందిన అర్వపల్లి కుటుంబీకులు శుక్రవారం సంతమాగులూరు మండల తహసీల్దార్ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. సంతమాగులూరు మండలంలో భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆక్రమణదారులు పెచ్చుమీరుతున్నారు. ఇతరుల భూమిని సైతం తప్పుడు రికార్డులు సృష్టించి తమ పేరుతో ఆన్లైన్ చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సర్వే నంబరు 171/1లో తమకు పూర్వార్జితంగా సక్రమించిన 3.50 ఎకరాల భూమి తమ పేరుతో లేకుండా పోయిందని సంతమాగులూరులోని అర్వపల్లి ఇంటిపేరు కలిగిలిన అర్వపల్లి రత్నారావు, వెంకటనారాయణ, పిచ్చయ్య, రామారావు, శ్రీనివాసరావు తదితరులు వాపోయారు. తమ రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమిని ఎవరు ఆక్రమించారో గుర్తించి ఆన్లైన్ చేయాలని.. తమకు ఆ భూమి ఎలా తమకు సక్రమించిందో చూపే పత్రాలను తహసీల్దార్కు అందజేశారు. తహీల్దారు విచారణలో ఈ సర్వే నంబరుకు సంబంధించి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆయా భూములు కలిగిన పట్టాదారుల రికార్డుల విచారణతో పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది. -
ఆలోచింపచేసిన నాటికలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, నరసరావుపేట రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ప్రకాష్నగర్లోని భువనచంద్ర టౌన్హాల్లో 24వ జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. రంగస్థలి శాశ్వత సభ్యురాలు కంజుల విశాలాక్షి జగన్మోహనరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ పోటీలను ప్రారంభించారు. పోటీలలో తొలిరోజు గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం, కొప్పోలు పండు క్రియేషన్స్ వారి పక్కింటి మొగుడు నాటికలు ప్రదర్శించారు. ప్రేమ గొప్పదే.. కానీ.. సృష్టిలో ప్రేమ గొప్పదే.. కానీ ప్రేమలు హర్షించే విధంగా ఉండాలని, జీవితాలు నాశనం అయ్యేలా ఉండకూడదని చెప్పే కథాంశంతో ఇంద్రప్రస్ధం నాటికను ప్రదర్శించారు. ఆదర్శాలు కలిగిన వ్యక్తి తన కుమారుడు ప్రేమించాడని తొందర పడకుండా తన ఇంటితో పాటు అమ్మాయి తండ్రికి అండగా నిలబడుతూ ఇరువురి గృహాలను ఇంద్రప్రస్థంలా వెలిగేలా తీర్చిదిద్దటం ఆలోచింప చేసింది. అతిగా ఆశ పడకూడదు.. అతిగా ఆశ పడితే అనర్ధాలు తప్పవనీ తెలిచేసే ఇతివృత్తంతో ప్రదర్శించిన పక్కింటి మొగుడు నాటిక ప్రేక్షకులకు ఆనందాన్ని పంచటంతో పాటు ఆలోచింప చేసింది. ఆస్తి కోసం తన భర్తను పక్కింటిలోని స్నేహితురాలి భర్తగా చేసి ఆడిన నాటకం ఆనందాన్ని ఇస్తే, బ్లాక్మెయిల్కు పాల్పడ్డ లాయర్కు బుద్ధి చెప్పటం ఆలోచింప చేసింది. రంగస్థలి నాటిక పోటీలు ప్రారంభం -
సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల ధర్నా
కొరిటెపాడు: ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయూ) తరఫున బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ గుంటూరు మాడ్యూల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి తెలిపారు. సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం నిర్వహించిన నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్బీఐ గుంటూరు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్లు బ్యాంకులోని అన్ని విభాగాలలో తగిన రిక్రూట్మెంట్, వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రీజినల్ సెక్రటరీ కె.ఆర్.వి.జయ కుమార్, యు.ఎఫ్.బి.యు. అడ్వైజర్ పి.కిషోర్, ప్రెసిడెంట్ ఇ.రవిచంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ మహమ్మద్ సయ్యద్బాషా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ సెక్రటరీ ఎం.రాంబాబు, బెఫీ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. 24 నుంచి బ్యాంకుల సమ్మెకు నేతల పిలుపు -
దామోదరం సంజీవయ్యకు నివాళి
నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా, తొలి దళిత సీఎంగా సేవలందించిన దామోదరం సంజీవయ్య 105వ జయంత్యుత్సవం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ పి.అరుణ్బాబు సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో ఎ.మురళి, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు మధులత, రమాకాంత్ రెడ్డి, మురళి కృష్ణ పాల్గొన్నారు. సంజీవయ్య చిరస్మరణీయులు నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయుడని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ సత్తి బాబు, ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీరెడ్డి, హోమ్ గార్డు ఆర్ఐ కృష్ణ పాల్గొన్నారు. -
వీఐటీ– ఏపీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
తాడికొండ: వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరాపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ ఆర్థిక శాస్త్ర సీనియర్ సలహాదారు డాక్టర్ ప్రవాకర్ సాహూ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని రూ.2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ప్రభుత్వ దార్శనిక విధానం, స్వర్ణాంధ్రకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్ 2047కు ఇది అనుగుణంగా ఉన్న విధానాలను వివరించారు. వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ అనేక అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలతో చేసుకున్న ఎంఓయూలు తమ వర్సిటీకే తలమానికమన్నారు. తమ వర్శిటీలోని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా విద్యార్థులలోని యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నిధులను కూడా అందజేస్తున్నామని వివరించారు. గౌరవ అతిథులు న్యూకాలజీ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేయా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాన్సిస్కో పోలూచి, ఎడిన్బర్గ్ బిజినెస్ స్కూల్ హెరియట్– వాట్ యూనివర్సిటీ యూకే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ స్వీనీలు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యాపార సామ్రాజ్యం మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, రీసెర్చ్ డీన్ డాక్టర్ రవీంద్ర ధూలి, అసోసియేట్ డీన్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఎ అస్రార్ అహ్మద్, డాక్టర్ సుహైల్ అహ్మద్,భట్, డాక్టర్ మొహమ్మద్, అబ్దుల్ ముఖీత్ మాజ్ పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
పెదకాకాని: చదువుతో పాటు క్రీడల్లోనూ శ్రీలక్ష్మి రాణిస్తూ మన్ననలు పొందుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడి శిక్షణతో ఫుట్బాల్లో రాణిస్తోంది. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఆమె క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్రం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం కూడా పంపింది. పెదకాకాని: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిబోయిన తాతారావు, శాంతి దంపతుల చిన్న కుమార్తె శ్రీలక్ష్మి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తాతారావు సాంఘిక నాటక రచయిత. శ్రీలక్ష్మి బాగా చదువుతోంది. బాలికలోని క్రీడా ప్రతిభను చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినయ్కుమార్ 8వ తరగతి నుంచే ఫుట్బాల్లో శిక్షణ ప్రారంభించారు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో సైతం సత్తా చాటుతోంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన శ్రీలక్ష్మి 13 నుంచి 17వ తేదీ వరకు ప్రోగ్రాంలో పాల్గొంది. క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఢిల్లీలో జరిగిన బాలల హక్కులు, బాల కార్మికులు, బాల్యవివాహాలకు సంబంధించిన సెమినార్కు ఎంపికై ంది. గుంటూరు జిల్లాలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన డిబేట్లో ప్రథమ స్థానం పొందింది. ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. జిల్లా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి డీఈఓ సీవీ రేణుక నుంచి సర్టిఫికెట్ అందుకుంది. ఐఏఎస్ కావడమే లక్ష్యం : శ్రీలక్ష్మి ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల రుణం తీరనిది. ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోను. బాగా చదివి కలెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు. జాతీయస్థాయి ఫుట్బాల్లో జిల్లా బాలిక ప్రతిభ చదువు, ఇతర పోటీల్లోనూ రాణిస్తున్న శ్రీలక్ష్మి జిల్లా ఉన్నతాధికారుల నుంచి పలు ప్రశంసాపత్రాలు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఓడిద్దాం
ఎంఐఎం నాయకుడు పిలుపు నరసరావుపేట: ముస్లిం మైనార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిని ఓడించి ఘోరపరాజయాన్ని బహుమతిగా ఇవ్వాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి పిలుపు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి టీడీపీ కూటమి మద్దతు పలకడం నమ్మక ద్రోహమని పేర్కొన్నారు. పంట ధ్వంసంపై కేసు నమోదు మార్టూరు: రైతు సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలోని పంటను ధ్వంసం చేసిన విషయమై గురువారం రాత్రి మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా వివరాలు.. గుంటూరులో నివాసం ఉండే పెంటేల సత్యనారాయణ మండలంలోని జంగమహేశ్వరపురంలోని తన భూమిని సాగు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో ద్వారకపాడు గ్రామానికి చెందిన కాళహస్తి వాసుదేవ మూర్తి, వలపర్ల గ్రామానికి చెందిన తాళ్లూరి బెన్నయ్య గత బుధవారం ట్రాక్టర్తో సత్యనారాయణ భూమిలోని జొన్న పంట ధ్వంసం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సత్యన్నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని పసుపు యార్డులో శుక్రవారం 758 బస్తాలు అమ్మకాలు జరిగాయి. సరుకు, కాయలు కనిష్ట ధర రూ.10,000, గరిష్ట ధర రూ.11,000 పలికాయి. ఇరువర్గాల ఘర్షణపై కేసు తాడికొండ: బైక్ వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఘటనపై ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ కె.వాసు తెలిపిన వివరాలు.. పొన్నెకల్లులో అద్దెంకమ్మ తల్లి ఆలయం సమీపంలో నివసిస్తున్న మొగిలి రాము ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన ఆవుల మంద వెంకటేష్ బైక్ను ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా యువకులిద్దరికీ తలపై గాయమైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం తాడికొండ: తాడికొండ మండలం బేజాత్పురంలోని పంట పొలాల్లో శుక్రవారం గుర్తు తెలియని 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.ఎరుపు రంగు లంగా, లేత బ్లూ రంగు జాకెట్టు, లేత పచ్చరంగు చీర, తల వెంట్రుకలు తెలుపుగా ఉండి చామన చాయ రంగులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు తాడికొండ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు. స్థానిక వీఆర్ఓ రవి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఓటర్లకు 90 పోలింగ్ స్టేషన్లు
నరసరావుపేట: ఈనెల 27న జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పల్నాడు జిల్లాలో 38 ప్రాంతాలలో మొత్తం 90 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ● జిల్లాలో మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వారిలో 37,832 మంది పురుషులు, 19,129 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్స్ ఉన్నారని తెలిపారు. ● అంతా ఓటుహక్కు సజావుగా వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ● ప్రిసైడింగ్ అధికారులు 108 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 108 మంది, ఓ.పి.ఓ.లు 216 మంది, సూక్ష్మ పరిశీలకులుగా 46 మందిని నియమించినట్లు తెలిపారు. ● పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఐదు రకాల టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ● ఎం.సి.సి., ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు 36 చొప్పున, ఏడు వీడియో సర్వైలెన్స్ టీంలు, 17 మందిని సెక్టార్ ఆఫీసర్స్ రూట్ అధికారులుగా నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ● ముగ్గురు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై శిక్షణ ఇస్తున్నారని, మండల అధికారులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, రెవెన్యూ డివిజినల్ అధికారులు మధులత, రమాకాంత్రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. మొత్తం ఓటర్లు 56,964 మంది ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణ్బాబు -
ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
నరసరావుపేట: ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆర్టీసీ జిల్లా రవాణా అధికారి ఎన్వీ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం గ్యారేజ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో శివనాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహ కల్పించారు. మరో అతిథి సింధూ స్కూలు అధినేత రామకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్ల వల్లే ఆర్టీసీకి మంచి పేరు వచ్చిందని వివరించారు. విధి నిర్వహణలో గుండెపోటు వస్తే వేసుకోవాల్సిన మందులను సింధు విద్యా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ సీపీఆర్ చేసే విధానాన్ని డ్రైవర్లకు వివరించారు. ట్రాఫిక్ సీఐ లోకనాథం మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. అనంతరం 36 ఏళ్లపాటు పనిచేసిన చిలకలూరిపేట డిపో డ్రైవర్ రాఘవరావుతోపాటు మరో 19 మంది ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు. సర్టిఫికెట్లు, పారితోషికాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ ప్రసాదు, డ్రైవర్లు, గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల ముగింపు 20 మంది ఉత్తమ డ్రైవర్లకు సన్మానం -
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణా నది దిగువ ప్రాంతంలోని గేట్ల వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానిక మత్స్యకారులు తాడేపల్లి పోలీసులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జె. శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అతడి వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎస్ఐ మాట్లాడుతూ సుమారు 27 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఖాకీ ఫ్యాంట్ షాట్, వైలెట్ కలర్ ఫుల్హ్యాండ్స్ టీషర్ట్, మాసిన గడ్డం ఉందని, బహుశా ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 086452721865కు ఫోన్ చేయాలని కోరారు. -
పార్ట్ టైం.. ఫుల్ చీటింగ్!
పట్నంబజారు ఇంటి వద్దే పని అని చెప్పడంతో చాలామంది వెంటనే లింకులు క్లిక్ చేసి బోల్తా పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలు, అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో విడతల వారీగా ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. లింకులపై క్లిక్ చేశాక ఫోనులోని ఫొటోలు సేకరించిన సైబర్ దుండగులు మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిల్కు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఒక మహిళకు కూడా ఓ దరఖాస్తు పంపిన దుండగులు అన్నిరకాలుగా ఫోన్లో అనుమతులు కోరారు. ఆమె ఇవ్వడంతోపాటు ఫొటోలను అప్లోడ్ చేశారు. రోజుల వ్యవధిలోనే బెదిరింపులకు దిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమె చెల్లించకపోవటంతో మార్ఫింగ్ ఫొటోలతో వేధించారు. విడతలవారీగా లాగేశారు.. పాత గుంటూరుకు చెందిన ఒక నిరుద్యోగి ‘పార్ట్ టైం ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం అని తొలుత రూ.3 వేలు అడగటంతో కట్టాడు. తర్వాత ఈ చలానా.. ఆ ఫీజు అని చెప్పి సుమారుగా రూ.80 వేల వరకు దుండగులు లాగేశారు. నెల రోజుల పాటు ఈ తంతు సాగింది. అప్రూవల్ వస్తుందని.. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అంటూ పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం మాత్రం రాలేదు. వారి సెల్ఫోన్ నెంబర్లు స్విచ్ఛాప్ అయ్యాయి. అప్పటికిగానీ మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ● బ్రాడీపేటకు చెందిన ఒక బీటెక్ విద్యార్థిని సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం వెతికారు. సైబర్ నేరగాళ్లు వల విసిరారు. వారికి ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించారు. రెండు నెలలపాటు రూ.10 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని రూ.50 వేలు కట్టించుకుని మోసగించారు. ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల లింక్లపై క్లిక్ చేస్తే అంతే సంగతులు వివిధ చార్జీల నెపంతో డబ్బు వసూలు బాధితుల్లో ఉన్నత విద్యావంతులే అధికం పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు నిండా ముంచుతున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఆశల వల విసిరి పెద్దమొత్తంలో కొల్లగొడుతున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో సైబర్ నేరం జరుగుతున్నా చాలామంది అవగాహన పెంచుకోవడం లేదు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్లపై క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అప్రమత్తత చాలా అవసరం. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జి ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – ఎస్. సతీష్కుమార్, ఎస్పీ, గుంటూరు -
వివక్షపై న్యాయ విద్యార్థుల ఆవేదన
● ఏఎన్యూలో విభాగాధిపతి మార్పునకు డిమాండ్ ● లేదంటే తమకు టీసీలిచ్చి పంపించాలని వేడుకోలు ● ఆందోళనకు దిగిన విద్యార్థులతో రిజిస్ట్రార్ చర్చలు ● సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ పెదకాకాని: వివక్షతో న్యాయ శాస్త్రం విభాగాధిపతి, కొందరు ఆచార్యులు తమను మొదటి ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఎల్ఎల్ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం న్యాయ శాస్త్ర విభాగానికి వెళ్లి విద్యార్థులతో, ఆచార్యులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాజరు సరిపోలేదని కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులను విభాగాధిపతి పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకంటే తక్కువ రోజులు క్లాసులకు వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించారని, ఇదేంటని ప్రశ్నించారు. వివక్ష రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభాగాధిపతి, కొందరు ఆచార్యుల వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు టీసీలు సైతం తీసుకొని అర్ధాంతరంగా వెళ్లిపోయారని తెలిపారు. ఈ వైఖరి సరికాదని, దీనిపై విచారణ జరపాలని కోరారు. గత సంవత్సరం కూడా హాజరు సరిపోలేదని 11 మంది విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదని, వారిలో ఎక్కువ శాతం అణగారిన సామాజిక వర్గాల వారే ఉన్నారని గుర్తుచేశారు. దీనిని వర్సిటీ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విభాగంలో ఓ ఆచార్యుడు సుదీర్ఘకాలం సెలవు పెట్టి తరగతులకు రాకపోయినా హాజరైనట్లు చూపించారని, అతడే కొందరు విద్యార్థులకు హాజరు లేకపోయినా పరీక్షలు అనుమతించారని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు వివక్షతోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ కిషోర్ అనే ఆచార్యుడు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అని, ఎంతో ప్రతిభ కలిగిన ఆయన అర్ధాంతరంగా సెలవు పెట్టి వెళ్లిపోవటం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, దీని వెనక కొన్ని వర్గాల కుట్ర ఉందని ఆరోపించారు. అన్ని విషయాలు విన్న రిజిస్ట్రార్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు వివాదాలకు దిగవద్దని ఆదేశించారు. కొందరు అతిథి ఆచార్యులు మాట్లాడుతూ తమ విషయంలో కూడా విభాగాధిపతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమను అవమానకరంగా చూస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. తరగతులకు నిత్యం హాజరుగాని ఓ వర్గం విద్యార్థికి హాజరు వేసి ప్రథమ ఇంటర్నల్ పరీక్ష రాయించిన ఓ అతిథి ఆచార్యుడు వివాదాన్ని ముందుగానే ఊహించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. -
భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (దేవదాయ) సెక్రటరీ వినయ్చంద్ అన్నారు. కోటప్పకొండను శుక్రవారం ఆయన సందర్శించి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్లు, ప్రసాదం తయారీ పోటులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సామాన్య భక్తులు కూడా స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా క్యూలైన్ నిర్వహణ ఉండాలన్నారు. భక్తులకు అందజేసే ప్రసాదాలు సరిపడా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రసాదాలు అందలేదనే మాట భక్తుల నుంచి రాకూడదని, ఇందుకు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. తిరునాళ్ల విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవాంఛనీయ ఘటనలు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, ఆర్డీవో మధులత, డీఎంహెచ్వో రవి, డీపీవో విజయభాస్కరరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, మధమంచిపాడు ఆలయ ఈవో సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రెవెన్యూ(దేవదాయ) కార్యదర్శి వినయ్చంద్ కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
గుంటూరు రూరల్: అప్పులబాధతో పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వరగాని బాబూరావు(60) వ్యవసాయం చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటపని చేస్తుండేది. వీరికి ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉంది. ముగ్గురికి వివాహాలు జరిపించారు. బాబూరావు తనకున్న 40 సెంట్ల భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పంటలకు మద్దతు ధరలు లేక, పంటలు నష్టపోవటంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఈనెల 13వ తేదీన తన చిన్నకుమారుడు రాజుకు ఫోన్చేసి తాను వ్యవసాయం వలన నష్టపోయి అప్పులపాలయ్యానని, అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తమ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫోన్చేసి చెప్పాడు. బంధువులతో కలిసి పొలంవద్దకు వెళ్ళి చూడగా అప్పటికే పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు.. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా భావనాఋషి పెళ్లి కుమారుడి ఉత్సవం
మంగళగిరి: పాత మంగళగిరి భావనాఋషి స్వామి వారి పెళ్లి కుమారుడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఉత్సవాన్ని తిలకించారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్ల్లకు అభి షేకం నిర్వహించి భావనాఋషి స్వామి, శ్రీ భద్రావతి దేవి వార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా పురోహితులు వేదమంత్రాల మధ్య అలంకరించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా డాక్టర్ తాడిపర్తి మురళి వెంకటేశ్వరరావు, విజయభారతి, డాక్టర్ తాడిపర్తి శ్రీనివాసమూర్తి దంపతులు పూజలు నిర్వహించారు. శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా రాజీవ్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు , బాణసంచా కాల్పులు, కళాకారుల నృత్యాలు నిర్వహించబడతాయన్నారు. కార్యక్రమంలో పద్మశాలీయ బహుత్తమ సంఘ ప్రతినిధులు చింతికింది కనకయ్య, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్ర నాఽథ్, రామనాథం పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర లక్ష్మయ్య, జంజనం భిక్షారావు తదితరులు పాల్గొన్నారు. రేపు కళ్యాణ మహోత్సవం -
ముగిసిన గంగాదేవి తిరునాళ్ల
అచ్చంపేట: ఓర్వకల్లులో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వయంభు గంగాదేవి పేరంటాళమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.5,05,497 రాగా, అమ్మవారి దర్శన టిక్కెట్ల రూపంలో రూ.74,340 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.కోటేశ్వరరావు తెలిపారు. ఆలయం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నెమలికల్లుకు చెందిన తుమ్మా నరేంద్రరెడ్డి పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రుద్రవరం గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలకు గంగమ్మతల్లి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సత్తెనపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ వి.లీలావతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష అమర్తలూరు: మహాశివరాత్రి తిరునాళ్ల విజయవంతం చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 11 గంటలకు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. గుంటూరు డీవైఈవోగా ఏసురత్నం గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా నియమితులైన సీనియర్ ఎంఈవో జి. ఏసురత్నంకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో గుంటూరు డీవైఈవోగా పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)పై నియమితులైన జి. ఏసురత్నం డీఈవో రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఏ.తిరుమలేష్, ఎంఈవో అబ్దుల్ ఖుద్ధూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. చిరుమామిళ్లలో ఆలయాల వార్షికోత్సవం నాదెండ్ల: చిరుమామిళ్ళ గ్రామంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం వార్షికోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎస్టీ కాలనీలోని శివాలయం, నాదెండ్ల డొంకరోడ్డులోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను 2019లో గ్రామానికి చెందిన విద్యాదాత నడికట్టు రామిరెడ్డి తన సొంత నిధులతో నిర్మించారు. ప్రత్యేక పూజల్లో నడికట్టు రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు సిరిపురపు అప్పారావు, గ్రామస్తులు యన్నం శివారెడ్డి, మద్దూరి భాస్కరరెడ్డి, అప్పిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, మిట్టపాలెపు వెంకటేశ్వరరావు, భవనం శ్రీనివాసరెడ్డి, కమ్మ సీతయ్య, నర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి పాల్గొన్నారు. రూ.50 వేలు మించి నగదు ఉండరాదు లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉందని, తగిన ఆధారం లేకుండా రూ.50 వేలకు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదని సహాయ రిట ర్నింగ్ అధికారి, డీఆర్ఎం షేక్ ఖాజావలి శనివారం తెలిపారు. నిబంధనలు పాటించకుంటే నగదును జప్తు చేస్తామని పేర్కొన్నారు. -
సత్తాచాటిన వేటపాలెం ఎద్దులు
మాచవరం: మండల కేంద్రమైన మాచవరంలో శ్రీలక్ష్మితిరుపతమ్మగోపయ్య స్వామి వార్ల కల్యా ణోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా ఆరుపళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 4000 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఏటుకూరి శ్రీనివాసరావు (పెదకూరపాడు), రామినేని రత్తయ్య (తోటపాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా) కంబైన్డ్ జత 3773.7 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో, నలమాద ఉత్తమ్పద్మావతి (ఎమ్మెల్యే, కోదాడ, తెలంగాణ) ఎడ్లు 3420.1 అడుగులు దూరాన్ని లాగి మూడవ స్థానంలో, అనంతనేని శ్రీకావ్య, శ్రీమధు ( యనమలకుదురు, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా ఎడ్లు 3396.1 అడుగులు దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో, మేకా అంజిరెడ్డి ( చల్లగుండ్ల, నెకరికల్లు మండలం, పల్నాడు జిల్లా, ఎడ్లు 3023.5 అడుగులు దూరాన్ని లాగి ఐదో స్థానంలో, మన్నెంపల్లి యశస్వణి (మాచవరం, పల్నాడు జిల్లా), వసంతతవరపు శ్రీలాస్య, శ్రీమనోజ్ (పిన్నెల్లి, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) కంబైన్డ్ జత 2339.5 అడుగులు లాగి ఆరో స్థానంలో, యామని రామారావు ( కొత్తపాలెం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 2000 అడుగులు, ముత్న వెంకటరెడ్డి (గోగులపాడు, గురజాల మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 528 అడుగులు లాగి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి వరుస బహుమతులు అందుకున్నాయి. శుక్రవారం న్యూ కేటగిరి (సేద్యం విభాగం) లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆరుపళ్ల విభాగంలో ప్రథమస్థానం కై వసం -
జిల్లాలో బర్డ్ఫ్ల్లూ లేదు
నరసరావుపేట రూరల్: జిల్లాలో బర్డ్ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోళ్ల ఫారాలను పశుసంవర్ధక శాఖ సిబ్బంది సందర్శించి సంబంధిత యజమానులకు బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ విధానాలపై అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 28 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణా విషయంలో చెక్పోస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. కోడి మాంసం, గుడ్లు తీసుకున్నా ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అధిక ఉష్టోగ్రతలో ఈ వైరస్ బతకలేదని తెలిపారు. కోడిమాంసం, గుడ్లు 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికిస్తామని, దాని వలన ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు పోకుండా కోడిమాంసం, గుడ్డును తీసుకోవచ్చని సూచించారు. కోళ్ల ఫారాల నిర్వాహకులు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైరస్ దరిచేరకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తిస్తే పశువైద్య సిబ్బంది సలహాలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు