breaking news
Palnadu
-
బ్రాహ్మణుల అభ్యున్నతిలో ఉద్యోగుల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాహ్మణ సమాజ అభ్యున్నతిలో బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ప్రసాద్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవాసమితి ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో కార్తిక వన సమారాధాన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చి రామ్ప్రసాద్ మట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలను బ్రాహ్మణ కార్పొరేషన్ అందిస్తుందని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అదే విధంగా గుంటూరు నగరంలో విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సేవా సమితి అధ్యక్షుడు జంగాలపల్లి పార్థసారథి మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు ఆర్థిక సహాయంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి సమితి తరఫున కృషి చేస్తున్నామని, సమితి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సభ్యులు సహకరించాలని కోరారు. బ్రాహ్మణులు ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించాలని సూచించారు. బుచ్చి రామ్ప్రసాద్, గంగాధర్లకు జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, సమితి సభ్యులు టి.శివన్నారాయణ, మల్లికార్జునశర్మ, ఈవీ శ్రీనివాస్, జి.వేణుగోపాలరావు, అరుణ్కుమార్, గౌరీనాథ్, కమల్మోహన్, హరగోపాల్, ఏపీ ఎన్జీవో నాయకులు నరసింహమూర్తి, సీతా రమేష్, కె.రాధాకృష్ణమూర్తి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అరంతరం విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ప్రసాద్ -
అమరేశ్వరాలయంలో భక్తుల సందడి
అమరావతి: కార్తిక మాసం రెండో ఆదివారం సందర్భంగా అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజామున భక్తులు తొలుత పవిత్ర కృష్ణా నదిలో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ రేఖ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం, ప్రసాదం అందజేశారు. భక్తులు, సందర్శకులు జిల్లా నలుమూలల వచ్చి అమరావతిని సందర్శించటంతో మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, స్నానఘాట్లు, సాయి మందిరంలో సందడి నెలకొంది. యడ్లపాడు: కొండవీడుకోట సందర్శనకు పర్యాటకులు రావద్దని పల్నాడు జిల్లా అటవీ అధికారి జి.కృష్ణప్రియ తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో కొండవీడు కోట సందర్శకులను అనుమతించని విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండపై నుంచి భారీ బండరాళ్లు జారి ఘాట్రోడ్డుపై పడ్డాయి. వాటిని తొలగించే ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే కొండవీడుకోట సందర్శనకు రావద్దని ఇటీవల ప్రకటించారు. ఆదివారం ఘాట్ రోడ్డులో జరుగుతున్న తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండలపై నుంచి ఊట నీటితోపాటు బండరాళ్లు జారే ప్రమాదం ఉందని తెలిపారు. నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో మొసలి సంచారం కలకలం రేపింది. నకరికల్లు–కారంపూడి రహదారికి ఆనుకొని గుండ్లపల్లి వద్ద చెరువు ఉంది. చెరువు నుంచి రహదారిపైకి శనివారం అర్ధరాత్రి దాటాక మొసలి వచ్చింది. రోడ్డుపై పాకుతూ వెళ్తున్న సమయంలో గ్రామస్తుల కంటపడింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులు ధైర్యం చేసి మొసలి ఇళ్లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుండ్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం.శ్యాం కుమార్ క్రొకోడైల్ క్యాచర్స్ సహాయంతో మొసలిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో తరలించి కృష్ణానదిలో వదిలారు. నూజెండ్ల : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని మున్నయ్య కాలనీకి చెందిన మున్నయ్య(25), ఆనంద్(22) వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చారు. తిరుగు ప్రయాణంలో పసుపులేరు బ్రిడ్జి ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలసుకున్న పట్టణ పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
ప్రత్తిపాడు: తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణబేగం ఆదివారం పరిశీలించారు. మోంథా తుపాను ప్రభావంతో ప్రత్తిపాడు పరిసర ప్రాంతంలోని వంగిపురం, పాతమల్లాయపాలెం, తిమ్మాపురం గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఆదివారం ‘సాక్షి’లో ‘పంటలు మునిగి బురద మిగిలి..!’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఏవో సుగణబేగం సిబ్బందితో కలిసి పాతమల్లాయపాలెం, వంగిపురం గ్రామాల్లో పర్యటించారు. పాతమల్లాయపాలెంలో పూర్తిగా మాడిపోయిన పత్తి పంటతో పాటు వంగిపురంలో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏవో తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతం కన్నా అధికంగా పంట దెబ్బతిన్న రైతులందరి వివరాలను నమోదు చేస్తున్నామని చెప్పారు. రెండు రోజులు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయనున్నారని చెప్పారు. -
తక్షణ చర్యలతో అరటికి రక్షణ
కొల్లిపర: మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం మండలంలో అరటి గెలలు ఉన్న పంటపై అధికంగా ప్రభావం చూపింది. రైతులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటే మిగిలిన పంటను రక్షించుకునే అవకాశముందని తెనాలి ఉద్యానశాఖ అధికారి తోటకూర శ్రీనిత్య తెలిపారు. ● చిన్న మొక్క తోటల్లో మురుగు నీరు బయటకు పోయే విధంగా దారులు చేసి, నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంట పది గంటలకు మించి ముంపునకు గురయితే అధిక శాతం మొక్కలు చనిపోయే అవకాఽశం ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ● పంట తేరుకోవడానికి లీటరు నీటికి 5గ్రాముల పొటాషియం నైట్రేట్ కలపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 3–4 సార్లు పిచికారీ చేయాలి. ఎకరానికి అదనంగా 20 కిలోల యూరియా, 15కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ● అరటి తోటలో అరుదల వచ్చేలా చూడాలి. ట్రైకోడేర్మా విరిడీ జీవ నియంత్రకాన్ని ఎకరానికి 2కిలోల చొప్పున 100 కిలోల పశువుల ఎరువుతో గానీ, వర్మి కంపోస్ట్తో గానీ కలిపి చల్లుకోవాలి. ● మూడు నెలలు కంటే చిన్న వయసు గల మొక్కలు 5–6 రోజులపాటు 2–3 అడుగుల లోతు నీటిలో మునిగినప్పుడు వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయే ప్రమాదముంది. నీరు బయటకు పంపిన వెంటనే మొక్కలను తీసి వేయాలి. నేల ఆరిన తురువాత తేలికపాటి దుక్కి చేయాలి. 45–45–45 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసి టిష్యూ కల్చర్ లేదా విత్తన శుద్ధి చేసిన తెగుళ్లు లేని సూది పలకలను మళ్లీ నాటుకోవాలి. ● ఐదారు నెలల వయసు ఉండి గెలలు వేసే దశలో ఉన్న మొక్కలు ఐదు రోజుల కంటే ఎక్కువగా, మూడు అడుగుల నీటి లోతులో ఉన్న మొక్కల వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోతుంది. ఇటువంటి మొక్కలు నీరు ఆరిన తరువాత కూడా బతకడం కష్టం ● ఐదు రోజుల కంటే తక్కువగా నీటి ముంపునకు గురి అయినప్పుడు వేరు వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింటుంది. ● గాలిలో అధిక తేమ కారణంగా తెల్ల చక్కెర కేళి, గ్రాండైన్, వామన కేళి వంటి రకాలలో సిగటోకా ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి. నేలలో అధిక తేమ వలన బ్యాక్టీరియా దుంప కుళ్లు ఆశించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● అరటి రైతులు సాధ్యమైనంతగా ముంపు నీటిని మురుగునీటి కాల్వల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేయాలి. నేల ఆరిన తరువాత అంతర సేద్యం చేయాలి. మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా, 80గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20–25 రోజుల వ్యవధిలో 3నుంచి 4 దఫాలుగా వేయాలి. ● ఆకులు తడిసే విధంగా ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ ఒక లీటరు నీటికి చొప్పున తగినంత జిగురు కలపి వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి. సిగటోకా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలపి జిగురుతో పాటు పిచికారీ చేయాలి. ● అరటి దుంపలు కుళ్లిపోకుండా నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి లేదా బోర్డో మిశ్రమం ఒక శాతం దుంప చుట్టూ తడిసే విధంగా పోయాలి. ● దుంపకుళ్లు ఆశించిన మొక్కలను గమినించి, వాటి చుట్టూ 25గ్రాముల బ్లీచింగ్ పొడి ఒక లీటరు నీటిలో కలపి మొదలు తడిసేలా పోయాలి. అవసరాన్ని బట్టి 15–20 రోజుల మధ్యలో మళ్లీ పోయాలి. తర్వాత ఈ మొక్కల మొదళ్లలో 50 గ్రాముల సూడోమోనాస్. 250గ్రాముల వేపపిండితో కలపి వేయాలి. ● పూర్తిగా గెలలు విడిచిన, 75 శాతం లోపల గెల తయారీకి వచ్చిన దశలో ఉన్న తోటల్లో ముంపు నీరు వల్ల వేరు వ్యవస్థ పాక్షికంగా, పూర్తిగా దెబ్బ తింటుంది. గెల తయారీకి అవసరమైన నీరు, పోషక పదార్థాలు మొక్క తీసుకోలేదు. తద్వారా గెల పూర్తిగా తయారవ్వకుండా, పక్వానికి వచ్చి నష్టం కలుగుంది. వీలైనంత వరకు మంచి గెలలు పరిశీలించి, మార్కెట్కు తరలించటం మంచిది. ● ముంపు నీటిని సాధ్యమైనంత త్వరగా తోట నుంచి బయటకు పంపి భూమి ఆరే విధంగా చేయాలి. ఆకులు, గెలలు బాగా తడిసే విధంగా లీటరు నీటికి ఐదు గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0–0–52), ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్(13–0–45) ఎరువులను వెంటనే మూడు రోజుల వ్వవధిలో మూడుసార్లు ఒక దాని తరువాత మరొకటి పిచికారీ చేసుకోవాలి. ● నేలకు వొరిగిన గెలలు పక్వానికి పది రోజుల్లో వస్తుంది అని బావిస్తే ఎండిన అరటి ఆకులతో కప్పి ఉంచి, 15 రోజుల్లో మార్కెట్ చేసుకోవాలి. మిగిలి వాటికి వెదురు కర్రతో ఊతమిచ్చి మొక్కలు పడిపోకుండా చేసుకోవాలి. నేలలో మొక్క చుట్టూ గాడిలో 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరియేట్ ఆప్ పొటాష్ వేసుకోవాలి. నిల్వ ఉన్న నీటిని పూర్తిగా బయటకు తీయాలి సరైన ఎరువులు, మందులు వాడాలి తెనాలి ఉద్యానశాఖ అధికారి శ్రీనిత్య సూచనలు -
ఎల్ఐసీ ఏంజెట్ల సమస్యలపై పోరాడిన స్టాలిన్బాబు
విజయపురిసౌత్: ఎల్ఐసీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(లియాఫీ) మాజీ నాయకులు బి.స్టాలిన్బాబు నిరంతరం పోరాటాలు చేశారని ఫెడరేషన్ ఆలిండియా జనరల్ సెక్రటరీ మార్కండేయులు పేర్కొన్నారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ ఈసీ సమావేశం ఆదివారం నాగార్జునసాగర్లో నిర్వహించారు. తొలుత దివంగత నాయకులు స్టాలిన్ బాబు, సోమయ్యలకు నివాళులర్పించారు. సభకు డివిజన్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, జోనల్ ప్రెసిడెంట్ కే. వేణుగోపాల్రెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ, రవీంద్రరెడ్డి, డివిజన్ జనరల్ కోశాధికారి జగన్నాధం, డివిజన్ రెసిడెన్సీ సెక్రటరీ, రఘు, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ రామచంద్రరావు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అలిమియా, డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుతి, గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ఈజె ప్రకాష్, గురజాల అధ్యక్షులు మునీశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏజెంట్లకు కమీషన్ తగ్గింపు విషయమై దేశావ్యాప్తంగా యూనియన్ పోరాటం చేసిన తీరును మార్కండేయులు వివరించారు. బ్రాంచిల్లో సిబ్బంది కొరత, వివిధ బ్రాంచ్ల్లో కొనసాగుతున్న నియంతృత్వ పోకడలను ఎదుర్కొవాలని పేర్కొన్నారు. గ్రాట్యూటీ పెంపు, గ్రూప్ ఇన్స్యూరెన్స్ పెంపు, స్థానిక బ్రాంచ్ సమస్యలు పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అన్నీ బ్రాంచ్ నాయకులు ఏజెంట్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వడ్లమూడి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. -
జిల్లా సిమ్మింగ్ జట్లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ ఫూల్లో ఆదివారం నిర్వహించారు. వివిధ విభాగాలకు జరిగిన ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి 58 మంది స్విమ్మర్లు హాజరయ్యారు. వీరిలో 28 మంది జిల్లా జట్లుకు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సబ్ జూనియర్ విభాగానికి ఎంపికై న 10 మంది ఈనెల 16వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ విభాగానికి ఎంపికై న 15 మంది ఈనెల 22, 23 తేదీల్లో విశాఖలో జరగనున్న రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ పోటీల్లోనూ, మాస్టర్స్ క్యాటగిరీకి ఎంపికై న ముగ్గురు నవంబర్ 9వ తేదీన విజయవాడలో జరగనున్న పోటీల్లో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపిక పోటీలను కోచ్ జి.సురేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు అభినందించారు. వివిధ కేటగిరీలలో 28మంది ఎంపిక -
మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక సందడి
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణం కార్తిక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. కార్తికమాసం రెండో ఆదివారం పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. శివాలయంలో సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణం ఓం నమఃశివాయ నామంతో మార్మోగింది. భక్తులు భ్రమరాంబమల్లేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం త్వరగా జరిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో దాతల సహకారంతో భక్తులకు ఉచితంగా పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. నిత్య అన్నప్రసాద భవనంలో అన్న సంతర్పణ జరిగింది. ప్రతి భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగించి పూజలు చేశారు. వివిధ సేవా కార్యక్రమాలు, ప్రసాద విక్రయాల ద్వారా స్వామివారికి రూ.6,50,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. -
నిధులు నాస్తి..
ఉమ్మడి గుంటూరు జిల్లా ç³ÇçÙ-™ŒæÌZ AÀ-Ð]l–¨® 糯]l$Ë$ ^ólç³-sôæt…-§ýl$MýS$ °«§ýl$Ë$ Ð]lÊÆð‡yýl$, MóSsê-Ƈ$$…-ç³#Ë$ »êÆð‡yýl$ E¯é²Æ‡$$. {ç³fÌS AÐ]l-çÜ-Æ>-ÌSMýS$ A¯]l$-VýS$-׿…V> çÜ…„óSÐ]l$, AÀ-Ð]l–¨® M>Æý‡Å-{MýS-Ð]l*-ÌSMýS$ BǦMýS çÜ…Ð]l-™èlÞÆý‡ ºyðlj-sŒæÌZ Ð]l¬…§ýl$V>¯ól MóSsê-Ƈ$$…-ç³#Ë$ ^ólÔ>Æý‡$. °«§ýl$ÌS ÌS¿ýæÅ™èl Ðól$Æý‡MýS$ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l$…ÌZ 糯]l$Ë$ ^ólç³-sêtÍ. M>± {ç³×ê-ãM>ÌZç³…™ø 糯]l$ÌS Ð]l$…þÆý‡$ ^ólĶæ$-yýl…™ø gñæyîlµ BǦMýS Ð]lÅÐ]lçܦ ¨VýS-gê-Æý‡$-™ø…-¨. A«¨-M>Æý‡ ´ëÈt GÐðl$Ã-ÌôæÅÌS ¯]l$…_ íܸëÆý‡$ÞË$ ¡çÜ$-MýS$-°, °«§ýl$ÌS ÌS¿ýæÅ™èl ^èl*yýlMýS$…yé MýSÒ$çÙ¯]lÏ MøçÜ… CÚët-Æ>-fÅ…V> BÐðl*-¨çÜ$¢¯é²Æý‡$. ç³^èla ¯ól™èlË$, gñæyîlµ O^ðlÆŠḥç³Æý‡Þ¯Œ ¡Æý‡$Oò³ ÑÐ]l$Æý‡ØË$ Ð]lçÜ$¢¯é²Æ‡¬.బడ్జెట్ను మించి పనులకు ఆమోదంతో జెడ్పీలో ఆర్థిక సంక్షోభం అడ్డగోలుగా పనులు మంజూరు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో ప్రాధాన్యత క్రమంలో ఇప్పటికే కేటాయింపులు పూర్తయ్యాయి. అయినప్పటికీ వాటిని దృష్టిలో ఉంచుకోకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా పనుల ప్రతిపాదనలను జెడ్పీ పాలకురాలు నిధులు లేకున్నా ఆమోదించేసి పంపుతున్నారు. దీంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిధులు లేకుండా పనులు ఏ విధంగా చేపట్టాలంటూ వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒత్తిడితో పనులకు అనుమతులు ఇచ్చేస్తే బిల్లుల చెల్లింపు ఏ విధంగా సాధ్యమని వాపోతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జెడ్పీ బడ్జెట్లో వివిధ మార్గాల్లో రూ.71.11 కోట్లు రాబడి అంచనా వేశారు. వీటిలో రూ.69.10 కోట్లు ఖర్చుగా చూపారు. అయితే ఇందులో జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘ నిధులే కీలకంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి రూ.22.61 కోట్లకుగాను రెండో విడత కింద రూ. 9 కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.24 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఆర్థిక సంఘ నిధులపై కేంద్ర నియంత్రణ 15వ ఆర్థిక సంఘ నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను ఆమోదిస్తుండగా, వాస్తవానికి ఆ నిధులపై కేంద్ర నియంత్రణ ఉంటుందని తెలిసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.20 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30 కోట్ల పనులకు అనుమతులు పూర్తయ్యాయి. దీంతోపాటు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘ నిధులు వస్తాయనే అంచనాలతోనే పనులను ఆమోదించడం మినహా, కచ్చితమైన సమాచారం లేదు. జెడ్పీ నిధులతో మంజూరు చేసిన పనులకు సంబంధించిన వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మంజూరు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు సమయంలో ఈ నిధుల లభ్యత ప్రామాణికం కానుంది. gñæyîlµ BǦMýS…V> çÜ…„ø-¿ê°² G§ýl$-ÆöP…-r$¯]l² ™èlÆý‡$-׿…ÌZ Mö™èl¢V> 糯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS…r* A«¨-M>-Æý‡$-ÌSOò³ J†¢yìl ^ólĶæ$yýl… Ððl¯]l$MýS çÜÓ{ç³-Äñæ*-f-¯éË$ Ñ$¯]là {ç³gê {ç³Äñæ*f-¯éË$ ÌôæÐ]l° gñæyîlµsîæïÜ çÜ¿¶æ$ÅË$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. ™èlÐ]l$ Ð]l$…yýl-ÌêÌZÏ ç³¯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS° HâýæÏ ™èlÆý‡-ºyìl Ayýl$-VýS$™èl$¯]l² gñæyîlµ-sîæïÜ çÜ¿¶æ$Å-ÌSMýS$ Ððl¬…yìl-^ðlƇ$$Å ^èl*í³-çÜ$¢¯]l² ´ëÌS-MýS$-Æ>Ë$... sîæyîlï³ GÐðl$Ã-ÌôæÅË$ MøÇ…§ól ™èlyýl-Ð]l#V> Æý‡*.MøsêϨ ÑË$OÐðl¯]l 糯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ$yýl…Oò³ Ð]l$…yìl-ç³-yýl$™èl$-¯é²Æý‡$. Ð]l$…þÆý‡$ ^ólíܯ]l {糆 ç³°-ÌZ¯]l* ç³Æý‡Þ…sôæ-iË$ §ýl…yýl$-MøÐ]lyýl… ¡{Ð]l ^èlÆý‡a-±-Ķæ*…-Ôèæ…V> Ð]l*Ç…-¨. ç³Æý‡Þ…sôæiÌS ÑçÙ-Ķæ$…ÌZ A«¨-M>Æý‡ ´ëÈ-tMìS ^ðl…¨¯]l {ç³gê-{ç³-†-°-«§ýl$-Ë$, O^ðlÆŠḥæç³Æý‡Þ¯Œ MýS$Ð]l$ÃOMðSP¯]lr$Ï BÆøç³× Ë$ E¯é²Æ‡¬. gñæyîlµÌZ Mö¯]l-Ýë-VýS$™èl$² ç³Æý‡Þ…-sôæiÌS Ð]lÅÐ]l-à-Æý‡…Oò³ {糿¶æ$™èlÓ ò³§ýlªË$, E¯]l²-™é«¨-M>-Æý‡$Ë$ §ýl–íÙt ÝëÇ…^èlyýl… Ìôæ§ýl$. ºyðljsŒæ MóSsê-Ƈ$$…-ç³#-ÌSMýS$ Ñ$…_ 糯]l$ÌS Ð]l$…þÆý‡$, {糆 ç³°-ÌZ¯]l* ç³Æý‡Þ…sôæ-iÌS Ð]lÅÐ]l-à-Æý‡…Oò³ çÜÐ]l${VýS Ñ^é-Æý‡×æ fÇ-í³™ól ÐéçÜ¢-ÐéË$ ÐðlË$-VýS$-ÌZMìS Ð]lÝë¢Ä¶æ$° ç³Ë$-Ð]l#Æý‡$ gñæyîlµ-sîæïÜ çÜ¿¶æ$ÅË$ yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æý‡$. -
ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం న్యాయ పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం న్యాయ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేట రెండో లైనులోని సంఘ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఆవుల తిరుమలేష్ అధ్యక్షతన జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం చేపడుతున్న న్యాయ పోరాటానికి ప్రధానోపాధ్యాయులు సమాయత్తం కావాలని కోరారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పదో తరగతి నామినల్ రోల్స్ రూపకల్పనలో సాంకేతిక సమస్యల పరిష్కారం, అపార్ ఐడీలను క్రియేట్ చేసే విషయంలో విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘ వజ్రోత్సవ వేడుకలను రాజధాని పరిసర ప్రాంతాల్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తా శ్రీనివాసరావు -
బీసీలపై కూటమి ప్రభుత్వం కుట్ర
గురజాల/గురజాల రూరల్: బీసీలపై అక్రమ కేసులు బనాయించి కక్ష్య పూరిత రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని తయారు చేయించి వైఎస్సార్ సీపీకి చెందిన జోగి రమేష్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందులలో రమేష్ యాదవ్పై దాడి చేయడం, మహిళ అని కూడా చూడకుండా చిలకలూరిపేట మాజీ మంత్రి విడదల రజినీపై దాడి చేయడం వంటి వాటికి పాల్పడినట్లు ఆరోపించారు. తుఫాన్ వచ్చి ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జరిగితే కూటమి ఖాతాలోకి చెడు జరిగితే వైఎస్సార్ సీపీ మీదకి నెట్టడం కూటమి నాయకులకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి పది మంది మృత్యువాత పడితే మాకు సంబంధం లేదు అని కూటమి ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం భక్తులకు భద్రత కల్పించడంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. కార్యక్రమంలో డీకే, బండ్ల వెంకయ్య, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా కాశీబాబు, మహంకాళీ యశోద దుర్గా, నీలంరాజు పాల్గొన్నారు. బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గాంధీ -
మోంథా దెబ్బకు కోతకు గురైన తీరం
వేటపాలెం: చీరాల, రామాపురం బీచ్లు పర్యాటకులతోపాటు పుణ్య స్నానాలు చేసే భక్తులకు ఆతిథ్యం ఇస్తుంటాయి. ఈ క్రమంలో కార్తిక మాసంలో వచ్చే సోమ, మంగళవారాల్లో భక్తులు స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటీవల సంభవించిన మోంథా తుపాను ప్రభావంతో సముద్రతీరంలో పది రోజులపాటు పోలీసులు సందర్శకులను నిషేధించారు. మోంథా కారణంగా వాడరేవు, రామాపురం, ఇకఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామ చంద్రాపురం సముద్ర తీరాల్లో కోతలు, గుంతలు ఏర్పడ్డాయి. పోలీసులు, గజ ఈతగాళ్లతో తీరప్రాంతాల్లో పరిశీలించి వాతావణం అనుకూలంగా లేకపోవడంతో కార్తిక పౌర్ణమి, సోమవారాల్లో సముద్ర స్నానాలకు వెళ్లకుండా నిషేధించారు. బీచ్లో ప్రమాదకరంగా... ఏడాది పొడువునా బీచ్లకు పర్యాటకులు వస్తుంటారు. వారాంతాలు, సెలవు దినాల్లో వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువ. కార్తిక మాసంలో సుమారు 2 లక్షల మంది సందర్శిస్తుంటారు. సరైన భద్రత చర్యలు చేపట్టకపోవడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చీరాల తీరం కోతకు గురై గుంతలు ఏర్పడ్డాయని మత్స్యకారులు చెబుతున్నారు. అలలు పెద్దగా వచ్చినప్పుడు కాళ్ల కింద ఇసుక కోతకు గురవుతుంది. దీనినే నిపుణులు అండర్ కరెంట్గా పేర్కొంటారు. ఇలా పెద్ద అలలు, కాళ్ల కింద ఇసుక కోత జరిగినప్పుడు సముద్రంలో ఉన్నవారు శరీరంపై నియంత్రణ కోల్పోయి. వెంటనే కొట్టుకుపోతారు. అందుకే బీచ్లల్లో సేఫ్ జోన్ ప్రాంతాలు గుర్తించి భద్రత కట్టుదిట్టం చేసే వరకు సందర్శకులను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. పర్యాటకులకు అనుమతి లేదు బాపట్ల/ చీరాల టౌన్: మోంథా కారణంగా వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో కార్తిక మాస స్నానాలకు ఈ నెల 4 తేదీ వరకు అనుమతి లేదని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. ఆదివారం వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఏర్పడిన గండ్లతో పాటు తీరాన గుంతలు ఏర్పడటంతో స్నానాలకు అనువుగా లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్ కె.గోపికృష్ణ, మత్స్యశాఖ ఏడీ కృష్ణ కిషోర్, మండల ఆర్ఐ శేఖర్, పంచాయతీరాజ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారాలలో సముద్రంలో స్నానాలకు అనుమతి లేదని చీరాల ఆర్డీఓ పి.గ్లోరియా ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు గమనించాలని సూచించారు. మోంథా తుఫాన్ ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురైంది. ప్రమాదకరంగా మారినందున కార్తిక స్నానాలకు అనుమతి నిరాకరించాం. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కార్తిక మాసంలో భక్తులు, పర్యాటకులు సముద్రం వైపు రాకూడదు. – ఏడీ మొయిన్, డీఎస్పీ, చీరాల -
వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి
గుంటూరు వెస్ట్(క్రీడలు): ప్రతి మనిషి ఆరోగ్యంతోపాటు ఉత్సాహంగా ఉండాలంటే తమకిష్టమైన వ్యాయామం సాధన చేయాలని లలితా హాస్పిటల్స్ అధినేత కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవశర్మ తెలిపారు. జీడీఎఫ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 2వ ఓపెన్ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహించారు. రాఘవశర్మ మాట్లాడుతూ ఎంత సంపద, పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆరోగ్యం బాగా లేకపోతే ఉపయోగముండదన్నారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యువతతోపాటు చిన్నారులు కూడా విపరీతంగా మొబైల్కు అలవాటు పడి జీవన విధానంతోపాటు ఆరోగ్యం కూడా పాడుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. పోటీల నిర్వాహకుడు జావెద్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు తీసుకోవడం మాని వ్యాయామం వైపు దృష్టి సారిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బాడీబిల్డర్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. జిల్లా నుంచి జాతీయ , అంతర్జాతీయ బాడీబిల్డింగ్లో పేరు తెచ్చిన వారికి సన్మానం కూడా చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్వజీర్ పాల్గొన్నారు. -
తీరంలో సముద్రస్నానాలు నిలిపివేత
రేపల్లె: మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం కోతకు గురైందని, తీరంలో సముద్రస్నానాన్ని నిషేధించినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్లోని నిజాంపట్నం, దిండి పరిశావారిపాలెం, నక్షత్రనగర్లలో బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈ ప్రాంతాలకు సబ్డివిజన్ ప్రాంతాలతోపాటు దూరప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఆయా బీచ్లకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ కొరిటెపాడు: సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ డైరెక్టర్స్ పి.వి.మల్లికార్జునరావు, సీహెచ్.రామారావు, చిన్నం కోటేశ్వరరావులు పేర్కొన్నారు. గుంటూరులోని కొరిటెపాడులో ఉన్న ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో ఆదివారం సహకార సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ ప్రాధాన్యతను విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. సహకార సూత్రాల కనుగుణంగా అందరి కోసం ప్రతి ఒక్కరూ అనే సూత్రంతో సామాజిక ఆర్థిక సంస్థలుగా సహకార సంఘాలు నిర్వహించకోవడానికి ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ ఎలియన్స్ ఏడు సహకార సూత్రాలు ప్రతిపాదించిందన్నారు. విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ ప్రజల కోసం అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఉచిత ప్రమాద బీమా, విద్యా ప్రతిభా పురస్కారాలను బ్యాంకు సభ్యులకు అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఇ.ఎర్రయ్యరెడ్డి, మేనేజర్ బుల్లికుమార్, కమిటి సభ్యులు కోట మాల్యాద్రి, డి.వెంకటరామయ్య, ఎస్.లక్ష్మీసుజాత, చిన్న, బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు వైఫల్యంతోనే కాశీబుగ్గ మరణాలు
నరసరావుపేట: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమాయకులైన 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. ఈ ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను మరుగుపర్చేందుకు ఏ పాపం ఎరుగని బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ను కల్తీమద్యం కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారన్నారు. భక్తుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ప్రభుత్వానిదే భద్రత బాధ్యత ఈ సందర్భంగా రజిని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయన్నారు. కాశీబుగ్గలో ప్రైవేటు ఆలయమని చంద్రబాబు మాట్లాడటం చాలా దారుణం అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తే భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కచ్చితంగా చంద్రబాబు వైఫల్యమే 9 మంది అమాయక ప్రజలు చనిపోవటానికి కారణం అన్నారు. గతంలో తిరుమలలో ఆరుగురు మంది, సింహాచలంలో గోడ కూలి 8 మంది, ఇక్కడ 9 మంది చనిపోయారన్నారు. న్యాయ విచారణ చేయాలి ఈ సంఘటనపై ప్రజలు బాధపడుతుంటే... నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గం, అన్యాయమని విడదల రజిని అన్నారు. నకిలీ మద్యం తయారీదారులు కూటమి నాయకులేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపులు, పర్మిట్రూమ్లలో ఈ మద్యం విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాకెట్ బట్టబయలు కావటంతో ఆ తప్పును వైఎస్సార్సీపీపై వేసి మాజీ మంత్రి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తద్వారా తమ పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తుఫాన్ కారణంగా రైతులు పంటలు నష్టపోయి అల్లాడుతుంటే దాని నుంచి డైవర్షన్ చేసేందుకు జోగి రమేష్ను అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు వైఫల్యం వలనే జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, యువజన, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.కోటిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నెలటూరి సురేష్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధుడు కోటిరెడ్డి మృతి
కారెంపూడి: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన అవుతు కోటిరెడ్డి(101) ఆదివారం మృతి చెందారు. కారెంపూడి మండలం లక్ష్మీపురం గ్రామం కోనసీమను తలపించే ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. కొల్లిపర మండలం మున్నంగి నుంచి వలస వచ్చిన కోటిరెడ్డి అన్నదమ్ములు మొదట గుడిసెలు వేసుకుని అంకురార్పణ చేశారు. సాగర్ కుడి కాల్వ రాకతో దాని బ్రాంచి కాలువ గ్రామం పక్కనే వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత దానిని గమనించిన ఆయన స్వగ్రామస్తులు ఉన్న ఊరిలో ఉన్న పొలం అమ్ముకుని ఇక్కడ పొలం కొనుక్కొని ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇలా గృహసముదాయాలు ఏర్పాటు కావడంతో దానికి కోటిరెడ్డి లక్ష్మీపురం అనే నామకరణం కూడా చేశారు. దానికి ఉత్తరంలో కాలగర్భంలో కలసిపోయిన వీరలక్ష్మీపురం అగ్రహారం పేరు కలిసి వచ్చేలా ఆయన నామకరణం చేశారు. పల్నాట నూతన గ్రామం నెలకొల్పడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా కోటిరెడ్డికి పేరుంది. పైగా శతాధిక వృద్ధుడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా, నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదివారం భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి సాయంత్రం బయలుదేరి బీసెంట్రోడ్డుకు వెళ్లి షాపింగ్ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ మీదుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో వినాయకుని గుడి సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరారు. ఆ సమయంలో రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్తున్న గవర్నర్పేటకు డిపోకు చెందిన సిటీ ఆర్డినరీ బస్సు ముందు వెళ్తున్న బైక్ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కింద పడిపోయారు. అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిరంగిపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్ అసదుల్లా(52) కొండరాయి పనిచేస్తుంటాడు. పని మీద ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెట్రోలు బంకు సమీపంలో రోడ్డు పక్కన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అసదుల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ శివరామకృష్ణ , ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య షేక్ అస్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అమరావతి–బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభం
క్రోసూరు: ఎట్టకేలకు అమరావతి–బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభమయ్యాయి. 2023 జూన్ నెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2024లో రూ.149 కోట్ల నిధులతో అమరావతి నుండి బెల్లంకొండ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయటంతో పనులు పునఃప్రారంభించినట్లు ఆర్అండ్బీ ఏఈ పున్నారావు శనివారం తెలిపారు. తొలుత రోడ్డు ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగకుండా లెవలింగ్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతాయని ఏఈ వివరించారు. ఏడాదిన్నరగా నిలిచిపోయిన రోడ్డు పనులు -
హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 3న విద్యా కేంద్రం జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అండర్–19 హాకీ జిల్లా జట్ల ఎంపికలు క్రీడా మైదానం అనుకూలత లేనందున వాయిదా వేసినట్లు అండర్–19 ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జట్ల ఎంపిక ఈనెల 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పెద్దింటమ్మతల్లి ఆలయంలో చోరీ అమరావతి: అమరావతి గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి దేవాలయంలో పపూజల అనంతరం పూజారులు తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని అగంతకులు అమ్మవారి ఆలయం గేటుకు వేసి ఉన్న ఐదు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీకి ఉన్న రెండు తాళాలను పగులగొట్టి అందులోని సుమారు రూ.8వేల నగదును దొంగిలించారు. శనివారం ఉదయం ఆలయం తెరవటానికి వచ్చిన పూజారులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అచ్చయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక టీంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
గురజాల: జాతీయ రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పదో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి ప్రియదర్శిని తెలిపారు. స్థానిక కోర్టు భవనాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు, విద్యుత్, వాహన ప్రమాద కేసులు సత్వరం పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయంతోపాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు. జీజీహెచ్లో ఒప్పంద పత్రాలు మార్చుకున్న అధికారులు -
ఎట్టకేలకు బీఈడీ ఫలితాలకు మోక్షం
పెదకాకాని: ఎట్టకేలకు మూడున్నర నెలల తర్వాత బీఈడీ ఫలితాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మూడో సెమిస్టర్ ఫలితాల ను, రెండో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. శనివారం సాక్షి దినపత్రికలో ‘విడుదల కాని బీఈడీ ఫలితాలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. మూడు నెలల తర్వాత బీఈడీ ఫలితాలు విడుదలయ్యాయి. జూలై నెలలో దరఖాస్తు చేసు కున్న మూడో సెమిస్టర్ పునఃమూల్యాంకన ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ సెమిస్టర్ ఫలితాలను కూడా శనివారం ప్రకటించారు. అక్టోబరు 30న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ముగిసింది. దీంతో విద్యార్థులు అధికంగా ఫీజులు చెల్లించారు. అధికంగా ఫీజులు చెల్లించడంపై యూనివర్సిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తేదీని పొడిగిస్తూ నిర్ణయం కూడా జరగలేదు. ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోయారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
వినుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్ అన్నారు. ఇటీవల వివాహ వేడుకల్లో వైఎస్సార్ సీపీకి చెంది 11 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారన్నారు. చిన్నచిన్న సంఘటనలకు కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. శనివారం హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ జబ్బార్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను పోలీసులు కొట్టి వదిలి పెట్టారన్నారు. బాధితుడిని పీఎస్ ఖాన్తోపాటు, పలువురు నేతలు జబ్బార్ను పరామర్శించి, పోలీసుల తీరుపట్ల నిరసన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి
నాదెండ్ల: ఫ్యాక్టరీల్లో జరిగే అగ్నిప్రమాదాలు, నివారణపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని బాపట్ల, పల్నాడు జిల్లాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు చెప్పారు. గణపవరం గ్రామంలోని మద్ది లక్ష్మయ్య టుబాకో కంపెనీలో శనివారం ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫ్యాక్టరీలో ప్రతి షిప్టునకు 438 మంది కార్మికులు విధుల్లో ఉంటారని, ఎమర్జెన్సీ అలారం మోగిన సమయంలో అత్యవసర ద్వారాల ద్వారా కార్మికులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినపుడు స్పందించాల్సిన తీరు, మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు వాటిల్లిన సమయంలో మంటలను ఆర్పే పరికరాల వినియోగంపై కార్మికులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు, కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ బాబూరావు, జనరల్ మేనేజర్ స్వామి, ఫైనాన్స్ డైరెక్టర్ శేఖర్, సిబ్బంది ఉన్నారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు -
సాఫ్ట్బాల్ ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ అండర్–14, అండర్ –17 బాల, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా జట్లను ఎంపిక చేశారు. అండర్ – 17 జట్టుకు ఎంపికై న బాల, బాలికలు ఈనెల 27వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారు. అండర్–14 జిల్లా సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపికై న బాల, బాలికలు ఈ నెల 22వ తేదీ నుంచి కడప జిల్లా పులివెందులలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడా కారులు హాజరయ్యారన్నారు. ఎంపికల్లో పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేష్కుమార్, మాజీ సెక్రటరీ చిరంజీవి, ఏఎంజీ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, సాఫ్ట్బాల్ గేమ్స్ స్టేట్ కార్యదర్శి పి.నరసింహారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చినరామయ్య, పాఠశాల చైర్మన్ ఏడుకొండలుతోపాటు పలువురు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాఫ్ట్బాల్ జిల్లా జట్టుకు ఎంపికై న బాలురు, బాలికలు -
కోదండరామునికి లక్షతులసి దళార్చన
తెనాలిరూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం రాత్రి ఇక్కడి బోస్రోడ్డులోని అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ ఎంవీ సత్యనారాయణ, డాక్టర్ జె.శివప్రసాద్ బాబు సమక్షంలో ఎన్నికలు నిర్వహించగా, 2025–26 కాలానికి అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి గా డాక్టర్ టి.రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి.రవిశంకరరావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి.కోటేశ్వరప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ టి.అఖిలేష్ గెలుపొందారు. నగరం: శ్రీరామ నామస్మరణతో బాపట్ల జిల్లాలోని నగరం గ్రామం మార్మోగింది. గౌడపాలెంలోని రామమందిరం వద్ద శనివారం అభయాంజనేయ స్వామి 13 అడుగుల ఏకశిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకారం ప్రకాష్ శర్మ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రయుక్తంగా విశేష పూజలు జరిపి విగ్రహాన్ని ప్రతిిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఏఎన్యూ(పెదకాకాని): వర్సిటీలోని వివిధ జీవశాస్త్ర విభాగాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హైదరాబాద్లోని ప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్లో ఆరు నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎంపికయ్యారని వీసి ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం వారిని అభినందించారు. వీసీ మాట్లాడుతూ ఈ కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ. 25 వేలు స్టైఫండ్ అందజేయబడుతుందన్నారు. ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, విద్యార్థులకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వేతనంతో శాశ్వత నియామకం కల్పించబడుతుందన్నారు. -
నిండా మునిగాం..
● మోంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన పల్నాడు రైతులు ● పొలాల్లో దెబ్బతిన్న పంటను చూస్తూ అన్నదాతల ఆవేదన ● ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఎవరూ కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం ● రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసి నష్టపోయామని కన్నీరు పెడుతున్న కౌలు రైతులు ● దెబ్బతిన్న పంటలను కాపాడుకునేం దుకు అష్టకష్టాలు పడుతున్న కర్షకులు ● జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటన మిర్చి పంటను కాపాడుకునేందుకు మందులు కలుపుతున్న రైతు సాక్షి, నరసరావుపేట : మోంథో తుఫాన్ పల్నాడు జిల్లాను అతలాకుతలం చేసింది. కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటుతుందని, అక్కడ తీవ్ర నష్టమని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తీరా ప్రకృతి ప్రకోపం పల్నాడు జిల్లా రైతులపై పడింది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చిన మూడు భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అది చాలదన్నట్టు మోంథో ప్రతాపం కూడా జిల్లా రైతులపై పడటంతో కోలుకోలేని విధంగా రైతులు నష్టపోయారు. ‘సాక్షి’ బృందం ఎక్కువగా ప్రభావం చూపిన చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలలోని నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, నరసరావుపేట రూరల్ మండలాల్లో పర్యటించింది. దెబ్బతిన్న పంటలను చూస్తూ రైతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. పూర్తిగా దెబ్బతినగా కొన ఊపిరితో ఉన్న మిర్చి, పత్తి పంటలను బతికించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టుబడి పెట్టిన రూ.లక్షలు కాగా మరోసారి అప్పులు చేసి మందులు పిచికారి చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూలీలను పెట్టి నేలబడిన మిర్చి మొక్కలను నిలబెడుతున్నారు. పొలాల్లో ఉన్న రైతులు తమ నష్టాన్ని నమోదు చేయడానికి ఏ అధికారైనా వస్తాడా అని ఆశగా ఎదరుచూస్తున్నారు. తాము ఇంత కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం, అధికార పార్టీ నేతలెవరూ మా గోడు వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉన్న ఉచిత పంటల బీమా ఉంటే నష్టపరిహారం వచ్చేదని, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి అన్యాయం చేసిందని రైతులు వాపోయారు. ముఖ్యంగా కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం. పంట సాగుకు ముందే కౌలు డబ్బులను యజమానులకు ఇచ్చేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంట దెబ్బతింది. పోనీ ప్రభుత్వం ఇచ్చే అరకొర నష్టపరిహారం అయినా అందుకుందామంటే తమకు కౌలు కార్డు లేకపోవడంతో నష్టపరిహారం భూయజమానులకు వెళ్తుతుందని వాపోతున్నారు. పల్నాడు జిల్లాలో 29,677 మంది రైతులకు చెందిన సుమారు 61,368 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన వ్యవసాయ పంటలను నష్టపోయినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఇందులో అత్యధికంగా 54,145 ఎకరాల్లో పత్తి, 5,253 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగింది. మరోవైపు జిల్లాలో 2,083 మంది రైతులకు చెందిన ఎకరాల్లో 3,282 ఎకరాల్లో ఉద్యాన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఇందులో 3,033 ఎకరాల్లో మిర్చి పంట ఉంది. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. సమగ్ర నష్ట వివరాల సేకరణ పూర్తయితే నష్టపోయిన పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది. నేను ఏడెకరాల్లో పత్తి సాగు చేశాను. ఇంత వరకూ ఒక్క ఒలుపు కూడా పత్తి తీయలేదు. తుఫాన్ కారణంగా పంట దెబ్బతింది. ఏడెకరాలకుగాను సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లింది. తడిచిన పత్తిని కూడా ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయిస్తేనే రైతులకు నష్టం కొంత మేర తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా ప్రకటనేది రాలేదు. వీలైనంత త్వరలో రైతులకు పంట నష్టపరిహారం అందించాలి. –వేములపల్లి రామచంద్రరావు, పత్తి రైతు, నాదెండ్ల మండలం ఈ ఏడాది ఎకరం విస్తీర్ణంలో అరటి పంట సాగుచేశాను. తొమ్మిది నెలల వయస్సున్న పంట ఇప్పుడే కాపు వస్తోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు అరటి పంట 75 శాతం పైగా నేలకొరిగింది. దాదాపు రూ.60 వేలు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టాను. తుఫాన్ కారణంగా పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. –ముప్పాళ్ల కోటేశ్వరరావు, అరటి రైతు, మిన్నెకల్లు ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాం. ప్రస్తుతం రెండు నెలల పంట కాలంలో పూత, పిందె, కాయ దశలో ఉంది. మూడెకరాలు పూర్తిగా నీటమునిగి పంట వేళ్లు కుళ్లి పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. పీకేసి మరో పైరు వేసుకోవాల్సిందే. మిగిలిన రెండెకరాల్లో సుమారు 40 శాతం మేర పంట నష్టం జరిగింది. సుమారు రూ.4 లక్ష దాకా నష్టపోయాం. తుఫాన్ ప్రభావం గోదావరి జిల్లాల్లో ఉందన్నారు. తీరా చూస్తే మాపై ప్రతాపం చూపింది. పంటల బీమా లేకపోవడంతో నష్టపరిహారం వస్తుందా రాదా, వస్తే ఎంత వస్తుంది అనేది తెలియడం లేదు. – పూనాటి అంజనిదేవి, మహిళా రైతు, అమీన్సాహెబ్పాలెం, చిలకలూరిపేట నియోజకవర్గం సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు నుంచి రెండేళ్ల కిందట వలస వచ్చి పొలం కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేస్తున్నా. గతేడాది పంట పండినా ధర లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట చేతికి వచ్చేలా కనిపించడం లేదు. కౌలు రూ.25వేలుతో కలిపి ఇప్పటికే ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. తుఫాన్ కారణంగా నీరు నిలిచి పంట పూర్తిగా ఉరకెత్తింది. –కట్టవరపు వీరయ్య, కొండకావూరు -
బిర్సా ముండా ఆశయాలు యువతకు స్ఫూర్తి
● బాలికల సంక్షేమ వసతి గృహంలో ఘనంగా జన్ జాతీయ గౌరవ దివాస్ ● ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యువతకు సూచించారు. బిర్సా ముండా జయంతి, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జయంతి సందర్భంగా శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత ఆదివాసీ స్వాతంత్య్ర పోరాటానికి జెండా పట్టిన ధీశాలి బిర్సా ముండా అన్నారు. చిన్న వయస్సు నుంచే బ్రిటీష్ పాలకులు, భూస్వాముల దోపిడీపై పోరాటం చేశారని చెప్పారు. బిర్సా ముండా సేవలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జన్ జాతీయ గౌరవ దివాస్గా ప్రకటించిందని తెలియజేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా ఆదివాసీలు, గిరిజనులు ఆత్మగౌరవ వేడుకలు జరుపుకుంటున్నారని వివరించారు. హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటా రు. గిరిజన సంక్షేమ అధికారి సుబ్బయ్య ఉన్నారు. -
పల్నాడు గ్రానైట్ పరిశ్రమలో ‘సీనరేజ్’ రగడ
చిలకలూరిపేటటౌన్: కూటమి ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకుంటే పరిశ్రమల నిర్వహణ కష్టతరమైందని..దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని పల్నాడు జిల్లా గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం తమ గోడును వెల్లడించింది. శనివారం చిలకలూరిపేట మండలం యూటీ జంక్షన్లోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా గ్రానైట్, క్రషర్ యాజమాన్యం కార్మికులతో కలిసి తమ ఆందోళన చేపట్టారు. సంఘం ప్రతినిధి ఒంటిపులి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో భాగంగా యూటీ జంక్షన్, యడవల్లిల్లి, మద్దిరాల, గోపాళవారిపాలెం, మురికిపూడి కూడళ్ల వద్ద ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్పోస్టులను కార్మికులతో కలిసి మూసివేసించారు. ఏఎంఆర్ సంస్థతో చర్చలు సఫలీకృతం అయ్యేవరకు చెక్పోస్టులను తెరవరాదంటూ కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో ఏఎంఆర్ సిబ్బంది, కార్మికుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒంటిపులి ఆంజనేయులు మాట్లాడుతూ రెండేళ్లుగా మైనింగ్ సీనరేజ్ వసూలు బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, క్రషర్ యజమానులు, కార్మికులు ఏకమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. క్వారీల నుంచి ముడిరాయి తరలింపు అనుమతి కోసం ఏఎంఆర్ సంస్థ ప్రారంభ దశ నుంచే చెక్పోస్టులు ఏర్పాటు చేసి, విధివిధానాలు పాటించకుండా అనధికార వసూళ్లు చేస్తోందని గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం ఆరోపించింది. ఏఎంఆర్ సిబ్బంది తమ కార్మికులపై భౌతికదాడులు చేశారన్నారు. కాబట్టే తాము ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. గతంలోనే ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం మధ్య చర్చలు జరిగి చేసుకున్న ఒప్పందాలను ధిక్కరించి అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. పరిశ్రమలకు అన్ని విధాలుగా ఆదుకుని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గ్రానైట్, క్రషర్ పరిశ్రమలపై దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమలకు ముప్పు వాటిల్తుతోందని, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
నేతన్నకు కన్నీళ్లు
● మోంథా తుఫాన్కు మగ్గం గుంతల్లోకి చేరిన నీరు ● పది రోజులుగా నిలిచిన చేనేత పనులు ● భారంగా మారుతున్న చేనేతల బతుకులు ● ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు బతుకు భారంగా మారి... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో .. జిల్లాలో చేనేత సహకార సంఘాలు – పంతంగి ప్రభాకర్, చేనేత కార్మికుడు, సత్తెనపల్లి 19సభ్యులు : సుమారు 2,500 -
స్వచ్ఛత, సమాజం మధ్య నర్సింగ్ విద్యార్థులే వారధి
సాక్షి,అమరావతి: స్వచ్ఛత లక్ష్యాలను సాధించేందుకు ఆరోగ్య వృత్తి నిపుణులు మార్పునకు వారధులుగా వ్యవహరించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర సూచించారు. నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛత, సమాజం మధ్య వారధిగా ఉండాలని పిలుపునిచ్చారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) దేశంగా భారత్ అవతరించడంలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ– 2025 కార్యక్రమాన్ని శుక్రవారం గుంటూరు లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. రమేష్ చంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య మౌలిక వసతుల అభివృద్ధి, అవగాహన పెంపుతోపాటు, వ్యర్థా ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, ఆరోగ్య అంశాలను మెరుగుపరిచి స్వచ్ఛత, సమాజ గౌరవాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేమూరి వసుంధర తరగతి గదులు, హాస్టళ్లలో, కళాశాల ఆవరణ పరిసరాలలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కోసం చేపట్టిన చర్యలను వివరించా రు. గుంటూరులో రెండు రోజులపాటు సాగిన స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా, సీబీసీ గురువారం శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా–2025 కార్యక్రమాలలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థల్లో కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించినట్టు పేర్కొంది.సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏడీ రమేష్ చంద్ర -
మెగా జాబ్మేళాను సద్వినియోగపర్చుకోవాలి
సత్తెనపల్లి: బ్రాహ్మణ నిరుద్యోగ యువత మెగా జాబ్మేళాను సద్వినియోగపర్చుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపవరపు రంగారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్శర్మ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువత కోసం డిసెంబర్ 13న గుంటూరు హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో భారీ స్థాయిలో నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను సత్తెనపల్లిలో శనివారం ఆవిష్కరించారు. రంగారావు మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్వహించనున్న మెగా జాబ్మేళాకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన 50 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. బ్రాహ్మణ వంశీయులు తమ దరఖాస్తులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులకు ఎటువంటి ఎంట్రీ, రిజిస్ట్రేషన్ ఫీజు లేదన్నారు. తమ దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోపరాజు విజయరామారావు, కార్యదర్శి మాటేటి నాగరాజు, నాయకులు ధర్మవళం భుజంగరావు, గుళ్లపల్లి కృష్ణ, పిసపాటి హనుమంతరావు, సత్యా ధ్యాన మందిరం అధ్యక్షుడు సురావధానుల రాజ్యమోహనరావు, ఉన్నవ పూర్ణచంద్ర ప్రసాదరావు, కుమార వెంకటరమణ నాగరాజు, అర్చక సంఘ నాయకులు వేదాంతం రాజాభార్గవనాథ్, యు.రాజశేఖర్, గంగిరాజు రాము తదితరులు పాల్గొన్నారు. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపవరపు రంగారావు -
టెయిల్పాండ్ ప్రాజెక్టును సందర్శించిన జెన్కో సీఈ
సత్రశాల(రెంటచింతల): నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును శుక్రవారం ఏపీ జెన్కో సీఈ విశ్వేశ్వరరావు సందర్శించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఉదయం ప్రాజెక్టు రిజర్వాయర్ను, జల విద్యుత్ కేంద్రాన్ని, రేడియల్ క్రస్ట్గేట్లును స్థానిక జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ప్రాజెక్టుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసినందున విద్యుత్ ప్రాజెక్టులో ఉత్పత్తి గురించి, ఎన్ని రేడియల్ క్రస్ట్గేట్లు ఎత్తి ఎన్ని వేల క్యూసెక్కులు వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేశారు, ఇటీవల కాలంలో ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు వచ్చాయా అని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఈఈలు నాగరాజు, శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు ఇతర అధికారులు ఉన్నారు. -
పంట పొలాల్లోని నీటిని బయటకు పంపాలి
గుంటూరు వెస్ట్: మొంథా తుపాను కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తగిన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. జలవనరుల శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేసి పక్కాగా సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జల వనరుల శాఖ ఎస్ఈ వెంకట రత్నం మాట్లాడుతూ పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు పరుచూరు, ఆలేరు వాగుల నుంచి నీరు చేరి 42,335 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని చెప్పారు. అందుకే ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లో బాగా నీరు చేరిందన్నారు. కొమ్మూరు కాలువకు కూడా గండి పడిందన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద 3,746 హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. ఇందులో కాకుమాను మండలంలో 1,326, పెదకాకాని మండలంలో 460, పెదనందిపాడులో 363, మంగళగిరిలో 265 , తాడేపల్లిలో 92, ప్రత్తిపాడులో 70, చేబ్రోలులో 7 హెక్టార్లు ఉన్నాయన్నారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజా వలి, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
అవినీతి రహిత సమాజానికి కృషి
మాచర్ల రూరల్: అవినీతి రహిత సమాజం నిర్మించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవర్గ్రిడ్ కార్పోరేషన్ డీజీఎం దివాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పవర్ గ్రిడ్ ఉద్యోగుల నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధిలో అవినీతి ప్రధాన ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
జాతీయ ఐక్యతకు పునాది వేసిన పటేల్
నరసరావుపేట: దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు. పంట పొలాల్లో నీటి నిల్వ లేకుండా చేస్తాం జిల్లాలో ఆదివారం నాటికి పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా చేస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. మోంథా తుఫాన్తో రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్క ర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అధికా రులు నీట మునిగిన పంట పొలాలను సందర్శించి నీటిని వెంటనే బయటకి పంపాలని ఆదేశించా రు. జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు పాల్గొన్నారు. పది ఫలితాలలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల సాధనలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండాలని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు సమయపాలన ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ సమష్టిగా పనిచేసి జిల్లాను విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, ఇంటర్మీడియేట్ అధికారులు పాల్గొన్నారు. జన్మన్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయండి జిల్లాలో చెంచుల నివాస ప్రాంతాల్లో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకం కింద 708 ఇళ్లు మంజూరు కాగా 324 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 384 ఇళ్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు కలెక్టర్కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
7న ఆచార్య ఎన్జీ రంగా జయంతి
పొన్నూరు: భారత రైతాంగ నేత, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ. రంగా 125వ జయంతి వేడుకలు ఈనెల 7వ తేదీన లాంలోని ఎన్జీ రంగా యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు రంగా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నిడుబ్రోలులోని రంగా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమాల్లో రంగా జీవిత చరిత్ర ఫొటో ఎగ్జిబిషన్, వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఉంటుందన్నా రు. సమావేశంలో సభ్యులు రామినేని కిషోర్బాబు, డాక్టర్ సజ్జా హేమలత, బొద్దులూరి రంగారావు, ఆకుల జానకిబాబు, షేక్ యాసిన్బాబా, గురుబాలు పాల్గొన్నారు. పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట నూజెండ్ల: కొత్త జడ్డావారిపాలెంలో శ్రీ పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. గ్రామస్తులు రూ.70 లక్షల విరాళాలతో గుడి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రతిష్టా కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని పొంగళ్ళు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సతీమణి ఆదిలక్ష్మి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పారా లక్ష్మయ్య తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల క్యాండిల్ ర్యాలీ నరసరావుపేటరూరల్:అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా పోలీసులు శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి ఏరియా ఆసుపత్రి వర కు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మగాంధీరెడ్డి, అధికారులు పాల్గొన్నా రు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయ స్సుకు అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసు ల త్యాగానికి జోహార్లు అర్పించారు. దేశ భద్ర త, సమాజరక్షణ కోసం అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని తెలిపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు గుంటూరురూరల్: దాసరిపాలెం గ్రామంలో జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ ఽఅధికారులు సంయుక్తంగా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వడ్డే వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన విజయశ్రీ బిల్డింగ్ మెటీరియల్ వాణిజ్య సముదాయంలో తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాల నిమిత్తం వినియోగించే 29 గ్యాస్ సిలిండర్లను చట్ట విరుద్ధంగా చిన్న చిన్న సిలిండర్స్లోకి రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. షాప్లో ఉన్న 29 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక మోటార్ స్వాధీనం చేసుకున్నారు. కేసును స్థానిక సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రావుకి అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీఐ కె.చంద్రశేఖర్, లక్ష్మీమాధవి, మండల సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరావు పాల్గొన్నారు. నేడు ఆరవ కోటి దీపోత్సవం పిడుగురాళ్లరూరల్:కార్తిక మాసం సందర్భంగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీగంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆరవ కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బ్రహ్మశ్రీ యద్దనపూడి బ్రహ్మానందచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. -
పోలీసు అమరవీరుల సేవలు ఎనలేనివి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నగరంపాలెం ఎస్బీఐ బ్యాంక్ ఎదురున్న పోలీస్ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ వారోత్సవాలు పోలీస్ శాఖ అంకితభావం, నిబద్ధత, త్యాగాలకు నిదర్శనమని అన్నారు. అమరవీరులు చూపిన ధైర్యం, త్యాగం, సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి భవిష్యత్ తరాలకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), వీరయ్యచౌదరి (కొత్తపేట పీఎస్) సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), అశోక్ (ట్రాఫిక్ తూర్పు), సింగయ్య (ట్రాఫిక్ పశ్చిమ), ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
మోంఽథా తుపానుతో రోడ్లు ధ్వంసం
నాదెండ్ల: మోంథా తుపాను కారణంగా గ్రామాల్లో లింకు రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. గణపవరం నుంచి కావూరు, లింగంగుంట్ల వెళ్లే డొంక రోడ్డుకు రెండు చోట్ల గండ్లు పడి కోసుకుపోయింది. వెంపలబాబాయ్ చెరువు సమీపంలో రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. మరికొద్ది దూరంలో భారీగా కోతకు గురైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మాత్రమే అతికష్టమ్మీద రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర భారీ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. పలుచోట్ల రోడ్డు పాక్షికంగా దెబ్బతినటంతో రాకపోకలు నరకప్రాయంగా మారాయి. అధికారులు స్పందించి మరమ్మతులు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నరసరావుపేట రూరల్: ఐకమత్యంగా ఉంటేనే బలంగా ఉంటామనే సందేశం అందించడమే ఐక్యత దినోత్సవ ఉద్దేశమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం పటేల్ చేసిన కృషి అపూర్వమైనదని తెలిపారు. దేశం సమైక్యంగా ఉన్నందునే అనేక యుద్ధాలు, ఆర్థిక సంక్షభాలు, ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొందని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(క్రైం) లక్ష్మీపతి, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కారెంపూడి: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎస్కే సైదావలి పశువులకు నీరు తాపడానికి మోటారు వేసిన సమయంలో వైరు తెగి మీద పడింది. దీంతో సైదావలి (50) అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సైదావలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025141 మందికి ఉద్యోగాలు తాడికొండ: సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో 141 మంది ఉద్యోగాలు పొందినట్లు అధికారులు తెలిపారు. 43 మందిని వివిధ కంపెనీలు షార్ట్లిస్ట్ చేశాయని తెలిపారు. జపమాల మాత ప్రదక్షిణ రెంటచింతల:కానుకమాతచర్చిలో రె.ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి నేతృత్వంలో పరిశుద్ధ జపమాల మాత స్వరూపంతో చర్చి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయాలలో అన్నదానం మాచర్ల: కార్తిక మాసం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన పలు ఆలయాల లోను, వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. 7 -
రక్తదానం ప్రాణదానంతో సమానం
బాపట్ల టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సూర్య కాళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, యువతను అభినందించారు. అనంతరం ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దానం చేసే ప్రతి రక్తపు బిందువు మరొకరికి ప్రాణం పోసే అమృత బిందువు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, శస్త్ర చికిత్సల సమయంలో ఎంతో మందికి రక్తం అవసరం ఉంటుందని చెప్పారు. సమాజ శ్రేయస్సు, ప్రజలకు రక్షణ, శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి ఎందరో పోలీసులు ఆత్మార్పణ చేశారని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా స్మృతి పరడ్, అమరవీరుల గ్రామాలను సందర్శించడం, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించడం, పోలీస్ సిబ్బంది అమరవీరుల కుటుంబాలకు మెడికల్ క్యాంపులు, ఓపెన్ హౌస్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీహెచ్ఎంఓ వి.సోమ్లా నాయక్, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఎస్బీ సీఐ జి.నారాయణ, బాపట్ల పట్టణ సీఐ ఆర్. రాంబాబు, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీకాంత్, చీరాల ఏరియా హాస్పిటల్ డాక్టర్లు భరత్, రాజేష్, సిబ్బంది, పట్టణ పోలీసులు పాల్గొన్నారు. పటేల్ జీవితం యువతకు ఆదర్శం బాపట్ల టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, పోలీస్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఆయన పుట్టిన రోజును రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటారని వివరించారు. ఆయన దేశానికీ చేసిన సేవలకు గాను 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారథి, ఎస్బీ సీఐ జి. నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతును ముంచిన అధికారుల నిర్లక్ష్యం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం రైతులను నిండా ముంచింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో పంట పొలాలు మునిగిపోయాయి. ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట నీటిపాలు కావడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో దిగువన ఉన్న గిరిజన తండాల రైతుల భూములు కోతకు గురై, పంటలు కొట్టుకుపోయాయి. జడపల్లి తండా, కంచుబోడు తండాలకు చెందిన మిర్చి రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని, కోతకు గురైన భూములను క్రమబద్దీకరించి తమ భూములను తమకు చూపాలంటూ నినాదాలు చేశారు. బాధిత గిరిజన రైతులు మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి వరద నీరు వదలడం వల్లనే ఈ ఏడాది మూడుసార్లు పంటలు కోల్పోయామన్నారు. వందలాది ఎకరాలలో వేసిన మిర్చి పంట మొత్తం కొట్టుకుపోయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. ఒక్కసారి మిర్చి పంట వేయలాంటే ఎకరాకు కనీసం రూ.50 వేలు ఖర్చు అవుతుందని, అలాంటిది ఇప్పటి వరకు మూడుసార్లు పంటలు కోల్పోయామన్నారు. అధికారులు, ప్రభుత్వం తమపై చిన్నచూపు చూపుతుందన్నారు. పంట నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వమా, ప్రాజెక్టు అధికారులా, రెవెన్యూ అధికారులా ఎవరు తమను ఆదుకుంటారో తేల్చాలని, అప్పటివరకు ఆందోళన విరమించేది లేదంటూ ప్రాజెక్టుపై భీష్మించి కూర్చున్నారు. ప్రాజెక్టు ఈఈ రాకతో శాంతించిన రైతులు విషయం తెలుసుకున్న ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జె.గుణకరరావు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తక్షణమే పైకి ఎత్తిన గేట్లను మూసివేసి, వరద ప్రవాహాన్ని తగ్గిస్తామని, పంటలకు నష్టం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరద ప్రవాహాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇకపై ముందుస్తు సమాచారంతోనే నీటిని వదలుతామని చెప్పడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. సాయంత్రానికి నాలుగు గేట్ల నుంచి లక్ష క్యూసెక్కులలోపు మాత్రమే వరద నీటిని వదలడం ప్రారంభించారు. ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదిలిన ప్రతిసారి గిరిజన తండా వాసులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు ఇలా జరిగింది. కానీ ఒక్కసారి కూడా అధికారులుగాని, పాలకులుగాని వచ్చి చూడలేదు. పంట నష్టాలను అంచనా వేయలేదు. భూములు కూడా కోతకు గురవుతున్నాయి. ఎకరం ఉండాల్సిన భూమి అర ఎకరానికి కుచించుకుపోతుంది. ప్రభుత్వం గిరిజనులపై వివక్ష చూపుతోంది. వెంటనే పంట నష్టాలకు పరిహారం ఇచ్చి, కోతకు గురైన భూములను క్రమబద్దీకరించాలి. – బాణావతు రామకోటేశ్వరరావునాయక్, మాజీ ఎంపీపీ సాగర్ నుంచి వదిలిన వరద పులిచింతలకు చేరడం వల్లనే ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలాల్సి వచ్చింది. అది కూడా బుధవారం సాయంత్రం నుంచే దిగువకు వదిలే నీటిని 50వేల క్యూసెక్కుల నుంచి క్రమంగా పెంచుతూ గురువారం ఉదయానికి 4,83,000 క్యూసెక్కులు వదలాల్సి రావడం అనివార్యమైంది. పంట నష్టం, భూముల కోతపై తమకు అవగాహన ఉండదు. అది ప్రభుత్వం చూచుకుంటుంది. – రాజు, అసిస్టెంటు ఇంజినీరు, పులిచింతల ప్రాజెక్టు -
లంచం ఇస్తేనే ఇంక్యుబేటర్లో పెట్టేది
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో పసికందులను ఇంక్యుబేటర్లో పెట్టటానికి సిబ్బంది లంచం అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో బరువు తక్కువ, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఇంక్యుబేటర్లో ఉంచుతుంటారు. అక్కడ ఉంచేందుకు సిబ్బంది రోగులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తంతు కొన్ని నెలలుగా జరుగుతుంది. వారం రోజుల కిందట అనారోగ్యంతో ఉన్న పసికందును ఇంక్యుబేటర్లో ఉంచేందుకు తీసుకెళ్లారు. ఆ విభాగంలో విధులు నిర్వర్తించే మహిళా సిబ్బంది పేషెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత ఇస్తేనే ఐసీయూ విభాగంలో ఉంచుతామని లేకుంటే ప్రైవేటు వైద్యశాలకు తీసుకు వెళ్లాలని చెప్పింది. దీంతో వారి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డు జోక్యం జేసుకొని ఇద్దరికి నచ్చజెప్పటంతో వ్యవహారం సర్దుమణిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయ్యింది. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్కుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. లంచం అడిగిన సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారం కిందటే ఆమెను విధులు నుంచి తొలగించామన్నారు. -
పెళ్లి కుమారుడైన పాండురంగస్వామి
అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ రుక్మాభాయి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో పాంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారిని పెండ్లి కుమారుని చేసి అర్చకులు ధ్వజారోహణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు ఉత్పవాల గురించి వివరిస్తూ శనివారం చిన్న శేషవాహనం, ఆదివారం ఉదయం దధిమధనోత్సవం, గోపాల బాలోత్సవం, సోమవారం అశ్వవాహనంపై కల్యాణమూర్తులకు ఎదుర్కోల మహోత్సవం ఉంటాయన్నారు. అనంతరం రుక్మాభాయికి, స్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. మంగళవారం స్వామి వారికి లక్ష తులసి పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం వసంతతోత్సవం, చూర్ణోత్సవం, పూర్ణాహుతి ఉంటాయని తెలిపారు. -
దేశ సమైక్యతకు పటేల్ కృషి స్మరణీయం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శుక్రవారం పటేల్ జయంతి సందర్భంగా నగరంపాలెంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఐక్యత దినోత్సవం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీస్ గౌరవ వందనంతో నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఆకాశంలోకి పావురాలు, జాతీయ జెండా రంగుల బెలూన్లను ఎగురవేశారు. ఐక్యత పరుగును జెండా ఊపి ప్రారంభించారు. నగరంపాలెం, కన్నావారితోట, మూడు బొమ్మల కూడలి నుంచి పోలీస్ పరేడ్ మైదానం వరకు ఇది కొనసాగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే బలంగా ఉంటామనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. దేశాన్ని సమగ్రంగా, బలంగా నిర్మించడంలో పటేల్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), అరవింద్ (గుంటూరు పశ్చిమ), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), సీఐలు, ఆర్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఐక్యత దినోత్సవం లక్ష్మీపురం: దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్భుత నాయకత్వం ఎంతో ఉపయోగపడిందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కార్యాలయంలో శుక్రవారం ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ముందుగా డివిజన్ అధికారులు, సిబ్బందితో కలసి డీఆర్ఎం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో ఐక్యత స్ఫూర్తి మరింత బలపడుతుందని అన్నారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయం నుంచి ర్యాలీని నిర్వహించారు. ఏడీఆర్ఎం రమేష్ కుమార్, డివిజనల్ డీపీఓ షహబాజ్ హనూర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కారాలు అన్వేషించడం విద్యార్థులకు ముఖ్యం
తాడేపల్లి రూరల్ : సేవాభావం, సహనం, త్యాగనిరతితోపాటు సవాళ్లకు భయపడకుండా ఉండడం, సమస్యలకు నైపుణ్యంతో పరిష్కారాలను అన్వేషించడం వంటివి విద్యార్థులు పెంపొందించుకోవాలని టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదురయ్యే ప్రతి సంఘటను ఒక పాఠంగా తీసుకుని ఫలితం కన్నా లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం సాధ్యమన్నారు. అనంతరం విద్యార్థుల స్టడీస్ టూర్స్, వర్తమాన సమాజ సమస్యలు, మోటివేషన్ స్పీచ్ వంటి వాటిపై వారు రాసిన అంశాలతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ నిర్వహిస్తున్న అంతర్జాల మాసపత్రిక ‘ప్రజ్ఞ’ను ప్రారంభించారు. యూనివర్సిటీ బీఏ విభాగాధిపతి డాక్టర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్ సర్వీసెస్ సాధించాలనే తపన, లక్ష్యం ఉన్న విద్యార్థుల కోసం బీఏ (ఐఎఎస్) కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగ ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో ఐక్యం చేసి అఖండ భారతాన్ని ఆవిష్కరించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రమాణాన్ని చేయించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, ఎంహెచ్ఎస్ అంతర్జాతీయ సంబంధాల డీన్ డాక్టర్ కిషోర్బాబు, సీఎస్టీసీ అధిపతి శ్రీనివాసరావు, ప్రోగ్రాం కన్వీనర్ మునీష్, స్వాతి, డాక్టర్ రాజీవ్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్టాంపు డ్యూటీ చెల్లించండి మహాప్రభో...
పంచాయతీరాజ్, స్థానిక సంస్థలకు విడుదల కాని స్టాంప్ డ్యూటీ నిధులు గుంటూరుఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వ పాలనలో స్థానికసంస్థలు ఆర్థికంగాకొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీరాజ్, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పనిలేకుండా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జరిగే భూములు, ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల నుంచి స్టాంప్ డ్యూటీ పేరుతో ఆదాయ వనరులను పొందే విధంగా పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి... జిల్లాలో ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే స్టాంప్ డ్యూటీ జిల్లా పరిషత్కు జమ చేయాలి. అయితే తమకు ఇష్టం ఉన్నప్పుడు నిధులు విడుదల చేస్తామనే ధోరణిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్థానిక సంస్థలైన జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్న ప్రభుత్వం దానిని ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. స్టాంప్ డ్యూటీలో 95 శాతం స్థానిక సంస్థలకే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల క్రయ, విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 95 శాతం స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకే చెందుతుంది. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ ఆదాయంలో నూటికి రూ.95 స్థానిక సంస్థలకు బదలాయించాలి. ప్రతి రూ.100లో రిజిస్ట్రేషన్ శాఖ రూ.ఐదు మినహాయించుకుని, జెడ్పీకి రూ.19, మండల పరిషత్కు రూ.19, గ్రామ పంచాయతీకి రూ.57 బదలాయించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. వాస్తవ పరిస్థితుల్లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. స్టాంప్ డ్యూటీ మొత్తం నేరుగా రెవెన్యూ శాఖ ద్వారా ఆర్థిక శాఖకు చేరుతోంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా తిరిగి స్థానిక సంస్థలకు వాటా ప్రకారం ఇవ్వాల్సిన నిధులు వెనక్కు రావడం లేదు. అర్ధ సంవత్సరానికి కేవలం రూ.41.18 లక్షలు ఉమ్మడి జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.18 కోట్లు వస్తుందని బడ్జెట్ ప్రణాళికలో అంచనా వేశారు. ఈ విధంగా అర్ధ సంవత్సరానికి రూ.తొమ్మిది కోట్లు జమ కావాల్సి ఉండగా, ఇప్పటివరరూ రూ.41.18 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతోపాటు గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.35 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ కింద రావాల్సిన నిధులతో పాటు రూ.35 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు పదే, పదే విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం శూన్యం. బకాయిలు చెల్లించడంతో పాటు స్టాంప్ డ్యూటీ నిధులు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ నుంచి కోరుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. నిధులు అందక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విధి నిర్వహణలో నాగరాజు ఆదర్శం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): కస్టమ్స్, సెంట్రల్ ఎకై ్సజ్, జీఎస్టీ విభాగాలలో ఐఆర్ఎస్ అధికారి ఎం.నాగరాజు అందించిన సేవలు ఆదర్శనీయమని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ పేర్కొన్నారు. శుక్రవారం పలకలూరు రోడ్లోని గుంటూరు క్లబ్లో జరిగిన నాగరాజు ఉద్యోగ విరమణ సభలో ఆయన ప్రసంగించారు. రిటైర్డ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ సి.పి.రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ నాగరాజు శాఖాపరంగా ఎన్నో ప్రభుత్వ అవార్డులు, రివార్డులు పొంది శాఖకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యోగుల సంక్షేమానికి మెరుగైన సేవలు అందించారని ప్రశంసించారు. రిటైర్డ్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో దక్షత, సమర్థత, విశ్వసనీయత కలిగిన అధికారి నాగరాజు అని ప్రశంసించారు. నాగరాజును మాజీ ఎమ్మెల్సీ పందుల రవీంద్ర బాబు, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు గాదె శ్రీనివాస రెడ్డి, పలువురు అధికారులు సత్కరించారు. -
అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కృష్ణ చైతన్యరెడ్డి
నెహ్రూనగర్: అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలిగా కాసు కృష్ణ చైతన్యరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నారుపల్లే జగన్మోహన్రెడ్డి, సంఘ మహిళ అధ్యక్షురాలు పొన్నపురెడ్డి శకుంతలరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామభూపాల్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికై న కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సంఘ బలోపేతానికి తగిన కృషి చేస్తానన్నారు. జిల్లాలో రెడ్డి మహిళల సంక్షేమం, అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. -
అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే విడుదల చేయాలి
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్లరూరల్: అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతులకు అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. మండలంలోని గుత్తికొండలో మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓడిపోయిన కాసు మహేష్రెడ్డి పొలాల్లో తిరుగుతున్నాడని, గెలిచిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎక్కడ ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఓడిపోయినా కూడా ప్రతి పక్షంలో ఉండి ప్రజలకు న్యాయం చేద్దామని గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబు సన్నిహితులని విన్నామని.. వారు ఆయనతో మాట్లాడి అన్నదాత సుఖీభవ గత ఏడాది రూ.20 వేలు మంజూరు చేయించాలని కోరారు. ఈ ఏడాది రూ.20 వేలకు రూ.5 వేలు మాత్రమే జమ అయ్యాయని, వెంటనే రూ.35 వేలు రైతులకు అందేలా చూడాలని కోరారు. సీఎం చంద్రబాబు గెలిచినప్పటి నుంచి అమరావతి అంటూ జపం చేస్తున్నాడని, ఆయన అమరావతి దాటి వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంలో పార్టీ విభేదాలు చూపిస్తే సచివాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోంథా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తెనాలి: మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరికి ఎకరాకు రూ.25 వేలు, అరటి, పసుపు, కంద, క్యాలీఫ్లవర్ వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కొల్లిపర, తెనాలి మండలాల్లోని దావులూరు, జముడుపాడు, బుర్రిపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పొలాలను గురువారం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, రైతు సంఘం కొల్లిపర మండల నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు, ముక్కంటి తదితరులతో కలిసి పరిశీలించారు. పంట నష్టానికి సంబందించిన వివరాలను రైతుల నడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు నమోదు చేస్తారని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడా పర్యటించడం లేదనీ, దెబ్బతిన్న పంటల వివరాలు నమోదుచేయడం లేదన్నారు. ఇప్పటికై నా పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి నమోదు చేసి, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పంటల బీమా విధానం మేలు గత ప్రభుత్వం అనుసరించిన పంటల బీమా విధానం రైతులకు ఎంతో మేలు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భాగస్వామ్యం పేరుతో ఉచిత పంటల బీమాకు రైతులను దూరం చేశారని ప్రభాకరరెడ్డి విమర్శించారు. కరువు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటల బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతినటమే కాదు, తుఫాన్కు ముందు కురిసిన అధిక వర్షాల వల్ల కూడా నిమ్మ తోటలు భారీగా దెబ్బతిన్నాయని నిమ్మ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం కొల్లిపర, దుగ్గిరాల మండల నాయకులు ముక్కంటి, బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి ఎస్టీలంటే చిన్నచూపు
మంగళగిరి టౌన్: రాష్ట్ర ప్రభుత్వానికీ, అధికారులకు ఎస్టీలంటే చిన్నచూపు అని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరపరిధిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రీయింబర్స్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్, సబ్సిడీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ గత 5 సంవత్సరాల నుంచి సబ్సిడీ తగిన సమయంలో విడుదల కాకపోవడంతో షెడ్యూల్ ట్రైబ్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 శాతం ఇన్సెంటివ్, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.100 కోట్ల బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కు 6 శాతం ఇన్సెంటివ్ను, వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వారంలో కమిషనర్ మంగళవారం వరకు సమయం ఇచ్చారని, ఇంతవరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఎస్టీ పారిశ్రామికవేత్తలను బలపరిస్తేనే ఆంధ్రప్రదేశ్ బలపడుతుందని అన్నారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ పరమేష్, అసోసియేషన్ ప్రతినిధులు శంకర్నాయక్, రామమూర్తి నాయక్ పాల్గొన్నారు. -
దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా క్రైస్తవులపై, చర్చిలపై దాడులు పెరిగిపోతున్నాయని.. క్రైస్తవుల రక్షణకై వెంటనే ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు డిమాండ్ చేశారు. క్రైస్తవులు, చర్చిల రక్షణకు, పాస్టర్ల, సువార్తికులు, దైవసేవకుల రక్షణకు క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్తో ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చోని క్రైస్తవ అత్యాచర చట్టం రూపొందించేందుకు ప్రభుత్వాలకు తగిన కనువిప్పు కలగాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు మాట్లాడుతూ చర్చిలలో పాస్టర్లు శాంతి సమాధానాలు గురించే బోధించడం జరుగుతుందని, ఎటువంటి హింసాత్మక బోధనలు చేయరని అటువంటి వారిపై నిరంతరం దాడులు జరగడం శోచనీయమన్నారు. క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్యాన్ని దేశానికి అందించారన్నారు. వారు చేసిన సేవల వల్ల భారతదేశంలో పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు సంభవించాయన్నారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ ఆశుతోష్ శ్రీవాస్తవకు అందజేశారు. -
జిల్లాలో 313.8 మిల్లీమీటర్ల వర్షం
నరసరావుపేట: జిల్లాలో బుధవారం ఉదయం 8.30 నుంచి 24గంటల వ్యవధిలో 313.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు గురువారం పేర్కొన్నారు. మండలానికి సరాసరి 11.2 మి.మీ. కురిసిందని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గంలో 34.4 మి.మీ. పడింది. వెల్దుర్తిలో 33.8, దుర్గిలో 13.8, రెంటచింతల 9.4, గురజాల 13.4, దాచేపల్లి 6.6, కారెంపూడి 2.4, పిడుగురాళ్ల 9.0, మాచవరం 9.4, బెల్లంకొండ 6.2, అచ్చంపేట 11.2, క్రోసూరు 8.2, అమరావతి 9.8, పెదకూరపాడు 4.8, సత్తెనపల్లి 6.8, రాజుపాలెం 3.8, నకరికల్లు 2.2, బొల్లాపల్లి 25.8, వినుకొండ 2.8, నూజెండ్ల 2.4, శావల్యాపురం 13.8, ఈపూరు 3.0, రొంపిచర్ల 5.2, నరసరావుపేట 17.2, ముప్పాళ్ల 16.4, నాదెండ్ల 12.2, చిలకలూరిపేట 17.4, యడ్లపాడు 12.4 మి.మీ. వర్షం కురిసింది. పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం నగరంపాలెం: పోలీసుల సేవలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకుని సమాజసేవలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని పోలీస్ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ను జిల్లా ఎస్పీ సందర్శించి, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వినియోగించే ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించడమే ఓపెన్ హౌస్ ఉద్దేశమని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఓపెన్ హౌస్ ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు విధి నిర్వహణలో వాడే పరికరాలు, ఆయుధాలు, సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, జాగిలాలు, లాఠీలు, బందోబస్తు తనిఖీల పరికరాలు, ఆధారాల సేకరణ పరికరాలపై అవగాహన కల్పించారు. జాగిలాల పనితీరుని విద్యార్థులకు పరిచయం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు ఏడుకొండలరెడ్డి (ఏఆర్), అబ్ధుల్అజీజ్ (గుంటూరు తూర్పు) సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), వీరయ్య చౌదరి (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాతగుంటూరు పీఎస్), ఆర్ఐలు శివరామకృష్ణ, సురేష్, శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, పోలీస్ అధికార సిబ్బంది పాల్గొన్నారు. -
పులిచింతలకు 68,172 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు, రెండు యూనిట్ల ద్వారా ఉత్పాదన అనంతరం మొత్తం 68,172 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 59,664 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,508 క్యూసెక్కులు మొత్తం 68,172 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 7.080 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి 66,139 క్యూసెక్కులు వస్తుందని, ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. వీవీఐటీయూలో ‘ఐక్యా 2కే25’ పెదకాకాని: వీవీఐటీ యూనివర్సిటీలో ఐఈటీ ఈ విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో ఐక్యా 2కే25 సాంకేతిక సదస్సు ఘనంగా ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయం ప్రో చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. నంబూరు వీవీఐటీయూలో గురువారం ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సీహెచ్. దినేష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో 30 కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సులో కోడ్ వర్డ్, స్పెల్ బిడ్, ఐక్యా ఇన్నోవేషన్ హాక్ థాన్, హాగ్వార్ట్స్ హంట్ వంటి 15 సాంకేతిక అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దినేష్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్పై దృష్టిసారించాలని తెలిపారు. అకడమిక్ డీస్ డాక్టర్ గిరిబాబు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎం.భానుమూర్తి పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
నరసరావుపేట: మోంథా తుపాను బీభత్సంతో పల్నాడు జిల్లాలో ప్రధానంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులు సర్వం కోల్పోయారని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్లో కొందరు రైతులు ఆమెను కలసి తుపాను వలన దెబ్బతిన్న వరి, పత్తి, ఉల్లి, మొక్కజొన్న, మిరప పంటలను చూపించారు. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. జిల్లాలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున ‘వరద ప్రభావిత ప్రాంతం’గా గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కోలుకోలేని స్థాయిలో తీవ్ర నష్టం... అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. పంట నష్టంతోపాటుతోపాటు జాలాది తదితర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయని చెప్పారు. నాదెండ్ల మండలంలో పశువులు మృతి చెందాయన్నారు. విద్యుత్ లైన్లు, రహదారులు, తాగునీటి వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చేతికందిన పంట పొలాల్లో ఇప్పటికీ నీళ్లు ఇంకా నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది ఇళ్లు కూలిపోయి రోడ్డున పడ్డ విషయం వివరించి, బాధితుల కష్టాలను కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లామన్నారు. చిలకలూరిపేట మండలంలో పత్తి 2000, వరి 100, మొక్కజొన్న 150, యడ్లపాడు మండలంలో పత్తి 4000, వరి 150, మిర్చి 1500, ఉల్లి 100, నాదెండ్ల మండలంలో పత్తి 5000, మొక్కజొన్న 100, మిర్చి 1000 ఎకరాలలో నష్టపోయినట్లు వెల్లడించారు. నీట మునిగిన కాలనీలు నియోజకవర్గంలోని పలు కాలనీలు నీట మునిగాయని, పట్టణంలోని సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలికాలనీ, వీరముష్ఠి కాలనీతోపాటు గణపవరం గ్రామంలోని శాంతినగర్, పసుమర్రులోని ఎస్టీ కాలనీ, యడ్లపాడులోని దింతెనపాడు, బోయపాలెంలోని సుగాలికాలనీ, యడ్లపాడులోని సవళ్ల ప్రాంతాల్లో గృహాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని రజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాలలోని ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. పంట నష్టం అంచనా కోసం సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని తీసుకోవాలని, రైతులకు తగిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. వరద బాధితులకు అదనంగా రేషను సరకులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, తాగునీటి వ్యవస్థ, రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. కలెక్టర్ తగిన తక్షణ చర్యలు చేపడతారని విశ్వసిస్తున్నామని రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఎంపీపీ దేవినేని శంకరరావు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు వలేటీ వెంకటరావు, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు ప్రభుదాస్నాయుడు, రైతులు పాల్గొన్నారు. నష్టంపై నివేదికలు సిద్ధం చేయండి నరసరావుపేట: మోంథా తుఫాన్ నష్టపరిహారం నివేదికలు త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. జిల్లా నిధుల నుంచి కూడా మోంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి చర్యలు చేపడతామని వివరించారు. తుఫాన్ వల్ల మత్స్యకారులకు చెందిన పడవలు, వలలకు నష్టం పారదర్శకంగా ఎన్యూమరేషన్ చేయాలన్నారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలు వాస్తవ ధరల ఆధారంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం మార్కెట్ విలువల సవరణపై సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ కోసం రైతులకు చెల్లించే పరిహారం మార్కెట్ విలువపైనే ఆధారపడుతుందన్నారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, పల్నాడు, గుంటూరు జిల్లాల రిజిస్ట్రార్లు రాంకుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. -
పత్తి రైతుకు ఎక్కువ నష్టం
వైఎస్ జగన్మోహన్రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్లో పిన్నెల్లి సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్తో పిన్నెల్లి మాట్లాడుతూ తమ దగ్గర పత్తికి ఎక్కువ నష్టం జరిగిందని, సగం పంట దెబ్బతిందని తెలిపారు. పెదకూరపాడు, గురజాల, మాచర్లలో పంటలు బాగా దెబ్బతిన్నాయని, పల్నాడు జిల్లాలో రైతులు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో పత్తితో పాటు, మిర్చి ఎక్కువగా సాగు చేస్తారని, రెండింటికీ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఏ మేలూ జరగడం లేదని అన్నారు. ఈ–క్రాప్ లేదని, కాబట్టి, మనం వారికి ధైర్యం చెప్పాలని అన్నారు. నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయ సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి పట్టణానికి చెందిన చిలకల గురవయ్యబాబు వెంకటలక్ష్మి దంపతులు, చిలకల గురవయ్య, వెంకట పద్మావతి దంపతులు రూ.6,00,116 విరాళంగా అందించారు. పూజలు నిర్వహించిన దాతలు గురువారం ఆలయ ముఖ మండపం నాలుగు వైపులా వచ్చే అత్యంత ప్రధానమైన సాల హారం నిర్మాణానికి విరాళం మొత్తాన్ని వినియోగించాలని కోరారు. పిన్నంశెట్టి వెంకటసుధాకర్, ఝాన్సీలక్ష్మి దంపతులు రూ.51,116 విరాళంగా అందించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, వనమా కృష్ణ, కోవూరు శివశ్రీనుబాబు, గజ వల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. దాచేపల్లి: నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో మత్స్యకారుల కాలనీకి ప్రమాదం పొంచి ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలోని మత్య్సకారుల కాలనీకి కూతవేటు దూరంలో కృష్ణానదిలోని వరద నీరు గురువారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసి నుంచి కూడా వరద పెరగటంతో ప్రమాదకరంగా పరిస్థితి ఉంది. మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. ఇక్కడ 50కిపైగా కుటుంబాలు చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో రెండు, మూడు సార్లు కృష్ణానదిలో వరద నీరు పెరిగిన ప్రతిసారి మత్స్యకారులు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళుతున్నారు. ఈ ఏడాదిలో మూడవ సారి ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద తీవ్రత పెరిగితే ఇళ్లను ఖాళీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ కె.శ్రీనివాస్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏఎన్యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 20257నగరంపాలెం: స్థానిక మారుతీనగర్ శ్రీకంచి కామకోటి పీఠం శ్రీమారుతీ దేవాలయ ఆవరణలో కార్తిక మహోత్సవాల్లో భాగంగా శ్రీగౌరీశంకర స్వామి వారికి గురువారం మధ్యాహ్నం సహస్ర మృత్తికా లింగార్చన నిర్వహించారు.చిలకలూరిపేట టౌన్: డాక్టర్ గేయానంద్ రచించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. కొల్లా రాజమోహన్రావు పాల్గొన్నారు.వేమూరు(వేమూరు): జాతీయ త్రోబాల్ పోటీల్లో అమర్తలూరు మండలం పెదపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని తెనాలి తేజస్విని కాంస్య పతకం సాధించింది. టీచర్లు అభినందించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ నేతలు, కార్య కర్తలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. బాఽధిత రైతులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాయం అందించారు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు తమ నియోజకవర్గాల పరిధిలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరద ముంపు ప్రభావం పెరిగిందని విమర్శించారు. -
నిష్పక్షపాతంగా పంట నష్టం అంచనా వేయాలి
నరసరావుపేట రూరల్: మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గోనెపూడి గ్రామంలో తుఫాన్కు దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను గోపిరెడ్డి గురువారం పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో పత్తి కాయ నల్లబారిందని, పూత, పిందె రాలిపోయిందని పత్తి రైతులు వివరించారు. రోజుల వయసు గల మిరప మొక్కలు భారీ వర్షాల కారణంగా నేలవాలాయని రైతు తుమ్మల రామారావు తెలిపారు. రెండు ఎకరాలకు రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టామని పేర్కొన్నారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. పత్తి రైతులు ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి నేడు ఒట్టి చేతులతో నడిరోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. మిరప రైతులు ఎకరానికి రూ.30 వేలు నుంచి రూ.40వేలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. జిల్లాలో 55వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, నరసరావుపేట మండలంలో 2,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా పంట నష్టం అంచనాను అధికారులు ప్రారంభించలేదని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పంట నష్టం అంచనా వేయాలని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. యూరియా బస్తాలు కూడా బ్లాక్లో కొనుగోలు చేసే పరిస్ధితి రాష్ట్రంలో ఏర్పడిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ప్రభుత్వమే ఉచితంగా పంట బీమా చెల్లించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తొలగించి రైతులే బీమా రుసుము చెల్లించుకోవాలని చెప్పడంతో రైతులు స్పందించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు పంటల బీమా కూడా రైతులకు అందే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, పార్టీ మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, పార్టీ మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, సర్పంచ్లు జెక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భవనం నర్సిరెడ్డి, గడిబోయిన రామయ్య, గద్దె బాలకృష్ణ, పోతమేకల మోహనరావు, సుంకర చెంచయ్య, మూరే రవీంద్రారెడ్డి, పొదిలే ఖాజా తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు రైతులను ఆదుకోవాలి
గురజాల/గురజాల రూరల్: మోంఽథా తుపానుకు నష్టపోయిన పల్నాడు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కోరారు. తుపానుతో నీట మునిగిన ప్రాంతాల్ని బుధవారం ఆయన పరిశీలించారు. నగర పంచాయతీ పరిధిలోని వెంకటరావు కాలనీ, మండల పరిధిలోని చర్లగుడిపాడులో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పెట్టుబడులు మొత్తం నీటి పాలయ్యాయని, అప్పుల ఊబిలోకి వెళ్లకుండా ప్రభుత్వం అదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 10 రోజుల్లో కోతకు వచ్చే వరి పొలాలు సైతం నీట మునిగిపోయాయని తెలిపారు. ఇప్పటికై నా ఆ వరుణ దేవుడు కనికరించి వర్షం కురవకుండా చూడాలని ప్రార్థించారు. గతేడాది పంటలు పండినా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ ఏడాది పంటలు బాగున్నాయి అనుకున్న తరుణంలో తుపాను వచ్చి తీవ్ర నష్టం చేకూర్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), జిల్లా ఉపాధ్యక్షుడు వి. అమరారెడ్డి, బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, కొమ్మినేని రవిశంకర్, కలకండ ఆంద్రెయ్య, మన్నెం ప్రసాదరావు, శౌర్రెడ్డి, పోలా సతీష్, కోటిరెడ్డి, బాలిరెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
చిలకలూరిపేట నియోజకవర్గంపై తుపాను ప్రభావం అత్యధికం
యడ్లపాడు: మోంథా తుపాను జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంపై అత్యధిక ప్రభావం చూపిందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని తిమ్మాపురం బైపాస్ వంతెన అండర్ పాస్ ప్రాంతాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే రహదారిపై రాకపోకలకు అడ్డంగా నిలిచిన నీటిని, నక్కవాగు వైపు నీట మునిగిన పొలాలు, హైవే డ్రైనేజీ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. హైవే సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల నుంచి సమస్యకు గల కారణాలు తెలుసుకున్నారు. కేవలం హైవే అధికారుల నిర్లక్ష్యం, డ్రైనేజీ వ్యవస్థను తక్కువ నిడివిలో నిర్మిచడం, వారికి అనుకూలంగా నీటి ప్రవాహ ప్రదేశాలను మళ్లించడంతోనే ఈ సమస్య ఏర్పడిందని రైతులు, ప్రజలు కలెక్టర్కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కారణంగా చిలకలూరిపేటలో 220 మి.మీ., యడ్లపాడులో 170 మి.మీ., నాదెండ్లలో 130 మి.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లాలోనే ఇది అత్యధికమని చెప్పారు. ఈ ప్రాంతాల్లోని కాలనీలు, పంట పొలాలు అధిక వర్షానికి ఎక్కువ శాతం ముంపునకు గురయ్యాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇక బైపాస్ వంతెన కింద వచ్చిన నీటిని మళ్లీంచే క్రమంలో తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తుపాను తగ్గినప్పటికీ పంటల పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని, వాటి నష్టం తదితర వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. డ్రైనేజీల్లోంచి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి హైవే కాంట్రాక్టర్ మురళీకృష్ణను కలెక్టర్ అక్కడకు పిలిపించారు. ఎట్టిపరిస్థితుల్లో బైపాస్ వంతెన కింద నిలిచి భారీ నీటిని పంట పొలాల్లోకి పోకుండా, కేవలం హైవే సర్వీసు మార్గం వెంబడి ఉన్న డ్రైనేజీల్లోంచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి ఇబ్బందులు రాకుండా సంబంధిత శాఖ అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలం పరిధిలో మేజర్ సమస్యలను తహసీల్దార్ జెట్టి విజయశ్రీని అడిగి తెలుసుకున్నారు. మైదవోలులో ఇరిగేషన్ చెరువు కట్ట బలహీనంగా ఉందని, ఇసుక బస్తాలు పెడితే బాగుంటుందని ఇరిగేషన్శాఖ సూచించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ తెచ్చారు. దాన్ని పరిశీలించి తనకు పూర్తి వివరాలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి. హేమలతాదేవి, ఎస్ఐ టి.శివరామకృష్ణ, సర్పంచ్ పి. ప్రభావతి, వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు పలు సూచనలు -
సేంద్రియ సాగుతో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ
నార్నెపాడు(ముప్పాళ్ల): ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. మండలంలోని నార్నెపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలను బుధవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న వరి పంటను, పక్కనే రసాయన వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. సాగులో ఉండే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా పంటలను రక్షించుకోవచ్చని, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. తుపాను నేపథ్యంలో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు చెప్పారు. కుళ్లిన పువ్వులు, కాయలను వెంటనే తొలగించాలని తెలిపారు. మిరపలో అంతర పంటల సాగు ద్వారా చీడపీడల ఉద్ధృతి తగ్గించుకోవచ్చని చెప్పారు. వేప గింజల కషాయం లేదా అగ్నియాస్రం పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎస్.శ్రీధర్రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి ఎన్.శేషుబాబు, పిలిఫ్, పావని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నందకుమార్, మధుబాబు, రైతులు ప్రసాదు, పుష్పలీల, వేమూరి రజిని, కొర్రపాటి సౌజన్య పాల్గొన్నారు. జిల్లా మేనేజర్ అమలకుమారి -
మోంథాకు ఇద్దరి వృద్ధులు బలి
అద్దంకి/అద్దంకి రూరల్: మొంథా తుపాను కారణంగా అద్దంకి పట్టణంలోని 20వ వార్డుకు చెందిన ఇద్దరు వృద్ధులు మంగళవారం రాత్రి మృతి చెందారు. భారీ వర్షం ధాటికి తీవ్ర చలి తీవ్రత పెరగడంతో రేకనార్ లక్ష్మి (70), వనపర్తి హనుమంతరావు (72) మృతి చెందారు. వీరు స్థానికంగా గుడారాల్లో నివశిస్తూ చిన్నా చితకా పనులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటుంటారు. గిరిజన కుటుంబాలకు చెందిన వీరంతా ఒకే చోట నివాసం ఉంటున్నారు. అద్దంకి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ గుడారాల్లో, పూరిపాకల్లో నివశించే వారిని అధికారులు పనరావాసాలకు తరలించి వారికి వసతులు కల్పించాలని డింమాండ్ చేశారు. అనంతరం తుపాను ప్రభావానికి పొంగి పొర్లుతున్న గుండ్ల నది ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. మున్సిపల్ కార్మికుల యోగ క్షేమాలను మున్సిపల్ కమిషనర్ రవీంద్రను అడిగి తెలుసుకున్నారు. -
వరద బాధితులకు భోజనం అందించరా?
నాదెండ్ల: తుపాను బాఽధితులకు కనీసం భోజనాన్ని కూడా అధికారులు కల్పించలేకపోయారని మాజీ మంత్రి విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరం–చిలకలూరిపేట డొంక రోడ్డులోని యానాదుల కాలనీ కుప్పగంజివాగు వరద ఉద్ధృతితో ముంపునకు గురైంది. దీంతో బాధితులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే, అధికారులు భోజన సౌకర్యం కల్పించలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రజిని పార్టీ నాయకులతో కలిసి బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేవలం పునరావాస కేంద్రంలో ఉన్న వారికే ఆహారం అందించి, ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సరఫరా చేయకపోవడంపై తహసీల్దార్ కుటుంబరావును ఫోన్లో సంప్రదించారు. వరద ఉద్ధృతి తగ్గే వరకూ బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వలేటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు ఆదంవలి, తులం సుధాకర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు కాట్రు రమేష్, నాయకులు బొప్పూడి రామారావు, కాటా వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, కుంచాల రాఘవులు, నల్లూరి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, నాగయ్య, శంకరరెడ్డి, అనిశెట్టి కోటేశ్వరరావు, తులం వెంకయ్య, రమేష్ బాబు, అగస్త్య, సాయి, గోపీ, ప్రసన్న, రహంతుల్లా ఉన్నారు. మాజీ మంత్రి విడదల రజిని ముంపు ప్రాంతాల్లో పర్యటన బాధితులకు ఆహారం పంపిణీ -
వరి పంట తీవ్రంగా దెబ్బతింది
పది ఎకరాల్లో వరి సాగు చేశా. ఇందులో ఐదు ఎకరాలు లేత వరి కావడంతో ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేదు, అయితే, మరో ఐదు ఎకరాల్లో పూర్తిగా నేలకొరిగింది. రూ.1.70 లక్షల నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో నాలాంటి రైతులు ఎంతో మంది భారీగా నష్టపోయారు. ప్రభుత్వమే నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి. –వెన్నపూస కొండారెడ్డి, ఎడ్వర్డ్పేట, రొంపిచర్ల మండలం నీళ్ల ఇంజిన్, పైపులు కొట్టుకుపోయాయి కుప్పగంజివాగు సమీపంలో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. గేదెలకు మేతగా మరో రెండెకరాల్లో జొన్న వేశా. తుపాను కారణంగా పత్తి పూర్తిగా దెబ్బతింది. వాగు నీరు ముంచెత్తడంతో నీళ్ల ఇంజిన్, 22 పైపులు కొట్టుకుపోయాయి. రూ.1.20 లక్షల మేర నష్టపోయా. – సమ్మెట మురళీకృష్ణారెడ్డి, రైతు, గణపవరం పత్తికి తీవ్ర నష్టం నాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది సాగు చేశా. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది. బొల్లా మాలకొండయ్య, రైతు, నాదెండ్ల -
దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
రొంపిచర్ల: మండలంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు, బంగారు మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ ఎం. హనుమంతరావు వివరించారు. రొంపిచర్ల మండలంలో వరుసగా జరుగుతున్న దోపిడీల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇందులో నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేట చీకటి కాలనీకి చెందిన దేవరకొండ భవానీ ప్రసాద్, వరవకట్టకు చెందిన షేక్ సుభాని, క్రోసూరుకు చెందిన షేక్ రంజాన్, నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన గుంజి శ్రీనులు ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 23న నరసరావుపేట నుంచి శావల్యాపురం వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి బంగారపు ఉంగరం, ఫోన్ను ఈ ముఠా సభ్యులు దొంగిలించారు. అదే రోజు రొంపిచర్ల నుంచి వడ్లమూడివారిపాలెం రోడ్డులో మోటార్ సైకిల్పై వస్తున్న వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 నగదు, సెల్ఫోన్ను దోపిడీ చేశారు. 27న వినుకొండలో మోటార్ సైకిల్ను చోరీ చేశారు. అదే రోజు రొంపిచర్ల విప్పర్ల రోడ్డులో వ్యక్తిపై దాడి చేసి రూ.1000 నగదును దొంగిలించారు. కర్లకుంట రోడ్డులో భార్యాభర్తలపై దాడి చేసి నగదు చోరీకి పాల్పడ్డారు. ఆయా కేసుల్లో నిందితుల వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, మంగళసూత్రం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న దేవరకొండ భవానీ ప్రసాద్పై 33 కేసులు, షేక్ సుభానిపై మూడు కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఆయా కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ పి. రామకృష్ణ, నరసరావుపేట రూరల్ ఎస్ఐ అశోక్, రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణ పాల్గొన్నారు. -
వేల ఎకరాల్లో పంట నష్టం
మోంథా పల్నాడు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చేతికందిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 53,475 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి, 915 ఎకరాల్లో మొక్కజొన్న, 450 ఎకరాల్లో కంది, 200 ఎకరాల్లో మినుము, మరో 237 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నష్ట వివరాలు సేకరిస్తే ఇది మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
నరసరావుపేట: తుపాను సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడి, బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలైన చంద్రబాబునాయుడు కాలనీ, బరంపేటలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజలకు పులిహోర పొట్లాలు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా మోంథా తుపానుపై ముఖ్యమంత్రి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం బేఖాతరు చేసిందని తెలిపారు. సత్తనపల్లి రోడ్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద వాగు పొంగి 10 లైన్లు, బరంపేటలో నాలుగు లైన్లు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడల స్టేడియం నీట మునిగినా సహాయక చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబించారని విమర్శించారు. చెట్లు విరిగి కరెంటు స్తంభాలు కూలిపోయినా సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని తెలిపారు. నీట మునిగిన చంద్రబాబు నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆహారం వండుకునే పరిస్థితి లేదన్నారు. మున్సిపల్ అధికారులు నామమాత్రంగా కూడా స్పందించలేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట అయినప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీరు సరఫరా చేయలేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు లేచిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతున్నాడే తప్పా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని గోపిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వలంటీర్లను తొలగించి, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే సకాలంలో సహాయక చర్యలను చేపట్టలేకపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో దెబ్బతిన్న ఇళ్లను సర్వే చేయించి, బాధితులకు రూ.6వేలు ఆర్థిక సహాయం అందించినట్లు గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ తరఫున తుపాను ప్రభావిత ప్రాంతమైన చంద్రబాబునాయుడు కాలనీ, బరంపేటలో పులిహార పొట్లాలు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని, తక్షణమే పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షులు షేక్ రెహమాన్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, అచ్చి శివకోటి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కిశోర్, నాయకులు షేక్ ఖాదర్బాషా, చల్లా రామిరెడ్డి, పుల్లంశెట్టి శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన -
జెడ్పీ సమావేశానికి తుపాను ఎఫెక్ట్
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సర్వసభ్య సమావేశానికి తుపాను తాకిడి ఎదురైంది. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం మోంథా ప్రభావంతో వాయిదా పడింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జరగాల్సి ఉంది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాతోపాటు సీఈవో వి.జ్యోతిబసు హాజరయ్యారు. అదే విధంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ ఒక్కరే వచ్చారు. ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు పిల్లి ఓబుల్రెడ్డి, రమావత్ భీమీబాయ్, కల్లూరి అన్నపూర్ణమ్మ, పిల్లా ఉమాప్రణతి, గుండాల స్వీమోన్, పలువురు ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 11.30 సమయానికి సైతం ప్రజా ప్రతినిధులతోపాటు జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు హెనీ క్రిస్టినా ప్రకటించారు. తుపాను అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, సభ్యులు హాజరు కాలేకపోయారని, త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. చర్చించాల్సిన ప్రజా సమస్యలెన్నో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి అన్నారు. బుధవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడిన అనంతరం వైఎస్సార్సీపీ సభ్యులు జెడ్పీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పని చేయడం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటికొకరు చొప్పున అనారోగ్యం బారిన పడి బాధపడుతున్నారని ఆరోపించారు. మండలాల్లోని పీహెచ్సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయని అన్నారు. ఆయా అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. తుపాను ప్రభావంతో వాయిదా పడిన సమావేశాన్ని వీలైనంత త్వరలో మళ్లీ నిర్వహించాలని చైర్పర్సన్ను కోరామని చెప్పారు. -
భారీ వర్షానికి కుప్ప కూలిన ఇల్లు
విజయపురి సౌత్: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మాచర్ల మండలం విజయపురిసౌత్లో ఓ ఇల్లు కుప్ప కూలింది. స్థానిక సీ టైపులోని గండిపోయిన గౌరమ్మ ఇల్లు వర్షానికి పడిపోయింది. మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని పరిశీలించారు. గౌరమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి, పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్వో రవి కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో 2789.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు నరసరావుపేట: తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం ఉదయం 8.30 వరకు 2508.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందనిజిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. సగటున మండలానికి 89.6 మి.మీ. కురిసింది. అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 280.6 మి.మీ. పడింది. సగటున మండలానికి 10 మి.మీ. పడింది. మొత్తం 2,789.2 మి.మీ. వర్షం కురిసింది. మండలాల వారీగా పరిశీలిస్తే...చిలకలూరిపేట 209.4, నాదెండ్ల 162.4, యడ్లపాడు 154.8, శావల్యాపురం 118.8, బొల్లాపల్లి 112.6, నరసరావుపేట 105.0, కారెంపూడి 102.2, పిడుగురాళ్ల 100.6, నూజెండ్ల 98.8, పెదకూరపాడు 98.4, వినుకొండ 96.8, ఈపూరు 96.4, వెల్దుర్తి 87.3, దుర్గి 78.2, బెల్లంకొండ 77.2, గురజాల 72.2, అమరావతి 70.4, మాచవరం 69.8, క్రోసూరు 69.0, మాచర్ల 68.8, రాజుపాలెం 67.4, ముప్పాళ్ల 66.4, రొంపిచర్ల 62.4, సత్తెనపల్లి 61.8, దాచేపల్లి 58.4, రెంటచింతల 50.2, అచ్చంపేట 48.8, నకరికల్లు 43.6 మి.మీ వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి 10గంటల వరకు 138.0, 12గంటల వరకు 114,0, రెండు గంటల వరకు 6.8, నాలుగు గంటల వరకు 1.0, ఆరుగంటల వరకు 20.8 మి. మీ. వర్షం కురిసింది. భట్టిప్రోలు: మోంథా తుపానను ప్రభావంతో కురిసిన వర్షాలకు చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో పనులు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. భట్టిప్రోలు, ఐలవరం, అద్దేపల్లి గ్రామాల్లో బుధవారం పర్యటించి చేనేత మగ్గాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేనేత కార్మికులు పనులు కోల్పోయారని, మరో రెండు, మూడు రోజులు అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని, దీంతో కార్మికులు తిరిగి పనిలోకి వెళ్లడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అన్నారు. నేతన్నలకు ఆర్థిక సహాయం, బియ్యం ఇచ్చేలా జీవో ఉండేదన్నారు. గత ఏడాది మంగళగిరిలో అధిక వర్షాలకు పనులు కోల్పోయిన కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం ఇచ్చారని బాపట్ల జిల్లాను తుపాను ఎఫెక్ట్గా ప్రభుత్వం గుర్తించి కార్మికులకు మంగళగిరి తరహాలో సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు డి. సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు బి.నాగమల్లేశ్వరరావు, పి.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జల దిగ్బంధంలో పెదగంజాం
చినగంజాం: తీర ప్రాంత గ్రామమైన పెదగంజాం వరద నీటిలో మునిగిపోయింది. మూడువైపులా నీరు చేరడంతో మిగతా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దశాబ్దాలుగా తుపానులు వంటి విపత్తులు సంభవించిన సందర్భాల్లో పెదగంజాం నీటి మునుగుతూనే ఉంది. ఉప్పుగుండూరు వైపు నాగన్న వాగు అవరోధం కాగా.. రొంపేరుపై వంతెన నిర్మించినప్పటికీ ఎల్లివాగు కారణంగా సమస్య ఎదురవుతోంది. రొంపేరుపై పెదగంజాం గ్రామం వరకు రోడ్డు వేసి ఎల్లివాగు వద్ద శాశ్వతంగా వంతెన నిర్మాణం చేయాలని మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. జాబ్మేళా తేదీ మార్పు తాడికొండ: ఏపీ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీయే సౌజన్యంతో ఈ నెల 20న నిర్వహించాలని తలపెట్టిన జాబ్మేళా మోంథా తుపాను కారణంగా 31వ తేదీకి మార్చినట్లు సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు తుళ్లూరులోని సీఆర్డీఏ హబ్ కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన 380కి పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
చైర్పర్సన్పై అవిశ్వాసం పెడతాం
వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్లిన చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి అధిష్ఠానం ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టీడీపీకి ఒక్క ఎంపీటీసీ కూడా లేని మండలాల్లో సైతం వైసీపీ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి, వైసీపీ సభ్యులను బెదిరించి కుర్చీని కై వసం చేసుకుంటున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో పూర్తి మెజా ర్టీతో కై వసం చేసుకున్న జెడ్పీ పీఠాన్ని తిరిగి వైఎస్సార్ సీపీ సొంతం చేసుకునేలా ముందుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీలు రమావత్ భీమీబాయ్, కల్లూరి అన్నపూర్ణమ్మ, పిల్లా ఉమాప్రణుతి, గుండాల స్వీమోన్ పాల్గొన్నారు. -
మోంథా తుపాను జిల్లా రైతులను కన్నీటిపాలు చేసింది. వాగులు, వంకలు పొంగి పంట పొలాల్లోకి నీరు చేరింది. చేతికందిన పంట నీటిపాలై తీవ్ర నష్టాలు మిగిల్చింది. వ్యవసాయాధికారులు చెబుతున్న లెక్క కన్నా భారీ స్థాయిలో పంటలు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఒకటీ, రెండు రోజులు వర
సాక్షి, నరసరావుపేట: మోంథా తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 278 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా చిలకలూరిపేటలో 22 సెం.మీ., యడ్లపాడులో 17 , నాదెండ్లలో 13, శావల్యాపురంలో 13, బొల్లాపల్లి 12 సెం.మీ. నమోదైంది. గుండ్లకమ్మ ఉగ్రరూపం మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలుల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా వరద నీరు చేరింది. వినుకొండ రూరల్ మండలంలోని అందుగల కొత్తపాలెం, మదమంచిపాడు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహించడంతో గుంటూరు–ప్రకాశం జిల్లాల రాకపోకలు స్తంభించాయి. దీంతో నక్క వాగు కూడా పొంగింది. సమీప పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. వ చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం వద్ద హైవే బైపాస్ వంతెన కింద మంగళవారం అర్ధరాత్రి ఐదు అడుగుల ఎత్తు మేర వరద నీరు పారింది. దాదాపు 10 గంటల పాటు యడ్లపాడు– తిమ్మాపురం వైపు వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. రహదారిపై భారీగా చేరిన నీరు హైవే సర్వీసు రోడ్డు వెంట నిర్మించిన చిన్నపాటి డ్రైన్లలోకి వెళ్లకపోవడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరింది. బైపాస్ వంతెన నిర్మాణం వల్లే తమ పంట పొలాల్లోకి నీరు చేరిందంటూ రైతులు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాను ప్రభావం పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంపై చూపిందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని తిమ్మాపురం బైపాస్ వంతెన అండర్పాస్ ప్రాంతాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హైవే రహదారిపై రాకపోకలకు అడ్డంగా నిలిచిన నీటిని, నక్కవాగు వైపు నీట మునిగిన పొలాలు, హైవే డ్రైనేజీ ప్రాంతాలను పరిశీలించారు. భరోసానిచ్చిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నేతలు, కార్యకర్తలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాఽధిత ప్రజలకు భరోసానిచ్చి వారిని ఆదుకున్నారు. మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు వారి నియోజకవర్గాలలో తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరద ముంపు పెరిగిందని విమర్శించారు. వృద్ధురాలి మృతి తుఫాను తీవ్రతకు పాత ఇంటి గోడ కూలిపోవడంతో మర్రెడ్డి రావులమ్మ (90)అనే వృద్ధురాలు దుర్మరణం చెందారు. వినుకొండ పట్టణంలోని ఆకులవారి వీధి రామాలయం బజారులో నివాసం ఉంటున్న రావులమ్మపై గోడ కూలి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ●నూజెండ్ల మండలం కొండల్రాయునిపాలెంలో గొర్రెల మందలోకి వరద నీరు చొచ్చుకు రావటంతో 11 జీవాలు మృతి చెందాయి. ●వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన చెంచు గిరిజనుడు గురవయ్యకు చెందిన రూ. 2లక్షల విలువైన 10 మేకలు వాగులో గల్లంతయ్యాయి. ●తుపాను ప్రభావంతో ఐదు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్కు అంతరాయం కలిగింది. సిబ్బంది బుధవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించారు. ఉరకలెత్తిన మిర్చి పదకొండు ఎకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో కంది, నాలులు ఎకరాల్లో మొక్కజొన్న, మూడెకరాల్లో మిర్చి సాగు చేశా. పత్తి తీసే దశలో తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది. కంది, మొక్కజొన్న నేలవాలింది. మిర్చి తోటల్లో నీరు చేరటంతో మొక్కలు ఉరకెత్తాయి. ఈ తుఫానుతో తీవ్రంగా నష్టపోయా. – వడ్లమూడి శ్రీకాంత్, రైతు, గణపవరం -
రోడ్డుపై విరిగి పడ్డ బండరాయి
విజయపురి సౌత్: స్థానిక ఫిషరీస్ ఆఫీస్ సమీపంలో ఘాట్ రోడ్డుపై వర్షం కారణంగా కొండ చరియ విరిగి భారీ బండరాయి పడింది. దీంతో వీఆర్వో రవికుమార్ విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన క్రేన్ సాయంతో బండరాయిని తొలగించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సహాయక చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చిలకలూరిపేట మండల కావూరు–లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని, పరిశీలించారు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు స్టేడియం వద్దనున్న కత్తవ వాగు చప్టాపై ప్రవాహాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్ వేణుగోపాలరావు, కమిషనర్ ఎం.జస్వంతరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పని ఉంటేనే బయటకు రావాలని సూచించారు. కృష్ణా నదిలో చిక్కుకున్న జాలరి బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ముంపు గ్రామం చిట్ట్యాల సమీపంలో కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఓ జాలరి చిక్కుకున్నాడు. తెలంగాణ సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందిన పరసగాని శ్రీను బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. తుపాను కారణంగా కృష్ణా నదిలో చిక్కుకున్నాడు. సమాచారాన్ని ఫోన్ ద్వారా ఒడ్డునున్న వారికి తెలియజేయడంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వారికి సాధ్యం కాకపోవడంతో పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్థానిక ఎస్ఐ ప్రవీణ్, తహసీల్దారు ప్రవీణ్కుమార్లు సిబ్బందితో కలిసి కృష్ణానది వద్దకు చేరుకున్నారు. ఈత గాళ్ల సహాయంతో నదిలో చిక్కుకున్న శ్రీనును ఒడ్డుకు చేర్చారు. నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పని చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. మోంథా తుపాను తీవ్రత కారణంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావం తగ్గడంతో గురువారం నుంచి పాఠశాలలను తెరవాలని ఆదేశించారు. పాఠశాలల్లో నీరు నిలబడటం, తరగతి గదులు మరమ్మతులకు గురవటం, నీటి సరఫరాలో అంతరాయం తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆమె తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎంఈఓ, డెప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని డీఈఓ తెలిపారు. -
జాతీయ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
కందుకూరు రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప జిల్లాలో జరిగిన అండర్–19 బాల, బాలికల రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో క్రీడాకారుల పలు పతకాలు సాధించారు. వచ్చే నెలలో జమ్మూకశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తైక్వాండో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి ఎస్కే అబ్దుల్ సలామ్ తెలిపారు. బాలికల విభాగంలో బి.లక్ష్మీ అక్షర (కందుకూరు), పి.మేరీ స్టెల్లా (చీరాల), బాలుర విభాగంలో ఎం.కల్వరిగిరి (చీరాల), ఓ.సువార్త (చీరాల)లు ఎంపికై న వారిలో ఉన్నారన్నారు. అదే విధంగా జి.దేవకుమార్ (చీరాల) కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. క్రీడాకారులను కోచ్ పి.ప్రశాంత్బాబు, జిల్లా అధ్యక్షుడు వీరస్వామి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ సలాఉద్దీన్ తదితరులు అభినందించారు. -
నగదు పంపిణీపై ప్రచారం
పునరావాస కేంద్రాలకు తరలిన మహిళలు కొల్లూరు: మోంథా తుపాను నేపథ్యంలో కొల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో నగదు, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం హోరెత్తడంతో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. సోమవారం కొల్లూరు బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలోని కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బంది వద్దకు వందల సంఖ్యలో వచ్చిన మహిళలు ఆధార్ కార్డులతో పునరావాసానికి పేర్లు నమోదు చేసుకున్నారు. తర్వాత రూ. 3 వేల నగదు, బియ్యం ఇవ్వాలని పట్టుబట్టారు. అలాంటి కార్యక్రమం ఏదీ లేదని చెప్పినా వినలేదు. వచ్చే మహిళల సంఖ్య అధికం అవుతుండటంతో తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్ఐ జానకీ అమరవర్ధన్ను తహసీల్దారు అప్రమత్తం చేయడంతో ఆయన సదరు కేంద్రానికి చేరుకున్నారు. ప్రార్థనా మందిరాలలోని మైక్ల ద్వారా నగదు, బియ్యం పంపిణీ ఇస్తున్నారని ప్రచారం చేయడంతో తాము తరలివచ్చినట్లు మహిళలు పోలీసులకు వివరించారు. చివరికి నచ్చజెప్పి వారిని పోలీసులు బయటకు తరలించారు. -
బాధ్యత గల పౌరులుగా ఎదగాలి
మంగళగిరి టౌన్: ఉన్నత విద్య పూర్తిచేసిన ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి సూచించారు. మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచస్థాయి సంస్థల్లో కీలకపాత్ర పోషించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. వర్సిటీ ఫౌండర్ చాన్స్లర్ డాక్టర్ టి.ఆర్.పారివేందర్ మాట్లాడుతూ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. డిగ్రీలు అందుకున్న విద్యార్థులు వర్సిటీకి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అనంతరం 2020–2025లో బీటెక్, పీహెచ్డీ, బీఏ, బీకాం పూర్తిచేసుకున్న 1,877 మంది విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబర్చిన వారికి బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ, వైస్ చాన్స్లర్ డాక్టర్ సతీష్కుమార్ పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిలకలూరిపేటటౌన్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లారీ పల్టీ కొట్టింది. వంతెనపై నుంచి వాగులో పడకుండా వంతెన సైడ్ రెయిలింగ్ ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. గోనెసంచుల పరదాల లోడు లారీ నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 6 గంటల సమయంలో కావూరు సమీపంలోని కుప్పగంజి వాగు వంతెన సమీపానికి రాగానే ఒక్కసారిగా లారీ కుడిపక్కకు వాలింది. అప్రమత్తమైన డ్రైవర్ క్లీనర్లు కిందకు దూకేశారు. పక్కకు వాలిన లారీ ఏకంగా వంతెన సైడ్ రైలింగ్పై పడి క్యాబిన్ సగానికి ధ్వంసమైంది. వంతెన రైలింగ్కూడా దెబ్బతింది. రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ను తెప్పించి యుద్ధ ప్రాతిపదికన లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని పీఆర్ఓ వినయ్కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 67236 తెనాలి–గుంటూరు, 67230 గుంటూరు–విజయవాడ, 67249 గుంటూరు–రేపల్లె, 67250 రేపల్లె–గుంటూరు, 67228 మాచర్ల– విజయవాడ, 67238 రేపల్లె–మార్కాపురం, 67239 మార్కాపురం– తెనాలి ప్యాసింజర్ రైళ్ళు, రైలు నంబర్ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్ప్రెస్, 07166 భువనేశ్వర్–సికింద్రాబాద్, 18464 బెంగళూరు–భువనేశ్వర్, 17256 లింగంపల్లి–నర్సాపూర్, 17216 ధర్మవరం–మచిలీపట్నం, 12805 విశాఖ–లింగంపల్లి , 17282 నర్సాపూర్–గుంటూరు రైళ్ళు ఈనెల 29వ తేదీన తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని తెలిపారు. -
దావుపల్లి సర్పంచిపై టీడీపీ కార్యకర్తల దాడి
హనుమంతు నాయక్కు తీవ్ర గాయాలు వెల్దుర్తి: మండలంలోని దావుపల్లి తండా సర్పంచి రమావత్ హనుమంతు నాయక్ పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన ఆర్మీలో పనిచేస్తున్న దేస్వత్ భీక్యానాయక్, సర్పంచి హనుమంత్ నాయక్కు ఇంటి వద్ద ఉన్న స్థలం విషయంలో సోమవారం పంచాయితీ జరిగింది. అది మనసులో పెట్టుకున్న భీక్యానాయక్ వేరే గ్రామాల నుంచి కిరాయి వారిని తీసుకొచ్చి మంగళవారం ఉదయం పొలానికి వెళ్లిన హనుమంతు నాయక్పై భీక్యానాయక్తో పాటు మరో ఐదుగురు కారులో పొలం వద్దకు వచ్చి రాళ్ళు, గొడ్డళ్ళతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. భయపడిన హనుమంతునాయక్ వెల్దుర్తి పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి, మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు రిఫర్ చేశారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
భయపెడుతున్న మోంథా తుఫాన్
నరసరావుపేట: జిల్లాలో తుఫాన్ వర్షం సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగుతుంది. తెరలు తెరలుగా తేలిక పాటి వర్షాలు, గాలులు వీస్తున్నాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో తుఫాన్ ప్రభావం కారణంగా పల్నాడురోడ్డులో పాత బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహంకు వెనుకపైపున సెంట్రల్ డివైడర్లో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభం సాయంత్రం 4.30గంటల సమయంలో కూలి రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవటంతో ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే వినుకొండ రోడ్డులో మూడు చెట్లు కూలి రోడ్డుపై పడగా వెంటనే పొక్లెయిన్తో వాటిని తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు తెలపారు. జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 వరకు 357.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అక్కడి నుంచి 12.00 గంటల వరకు 129.2 మి.మీ,, అక్కడి నుంచి 2గంటలవరకు 33.8 మి.మీ., అక్కడి నుంచి నాలుగు గంటలవరకు 44.6 మి.మీ., అక్కడి నుంచి 6 గంటల వరకు 88.6 మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో బోటింగ్, చేపల వేట నిషేధంనరసరావుపేట: జిల్లాలో బోటింగ్, చేపల వేట బుధవారం వరకు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాగార్జునసాగర్లో బోటింగ్ సర్వీసు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిచిపోనున్నాయి. -
విద్యుదాఘాతంతో పెంకుటిల్లు దగ్ధం
యడ్లపాడు: అగ్నిప్రమాదంలో ఓ పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని ఉన్నవలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలోని పోలేరమ్మ గుడి వెనుక వీధిలోని పెంకుటిల్లు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పల్లపోతుల పోలిరాజు, కుమారుడు ఆ ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తాపీ పనులు చేసుకునే పోలిరాజు ప్రతిరోజు గుంటూరు వెళ్లి పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తాడు. కుమారుడు అయ్యప్పమాలధారణలో ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం పోలిరాజు గుంటూరు వెళ్లగా, కుమారుడు గుడికెళ్లాడు. తెల్లవారుజాము సుమారు 4 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరా గ్రామంలో లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ సరఫరా వచ్చిన కొద్ది సమయానికే ఇంటి నుంచి మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. చిలకలూరిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ లోగా విద్యుత్ అధికారులకు చెప్పి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంటి దూలాలన్నీ కాలిపోయి పైకప్పు కూలింది. ఇల్లంతా మంటలు వ్యాపించడంతో ఫ్రిజ్, టీవీ, బీరువా, డబుల్కాట్, దుస్తులు, వంటసామగ్రి తదితర అన్ని వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు పోలిరాజు చెబుతున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆర్డీఓ దృష్టికీ తీసుకెళ్లామని తక్షణ సాయం అందించి, ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం పూర్తి పరిహారం అందిస్తామని తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు. -
భర్తను హతమార్చిన భార్య అరెస్ట్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భర్తను హతమార్చిన భార్యను అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గంగా వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. గుంటూరు నేతాజీనగర్ ఆరో లైనుకు చెందిన షేక్ ఖాజా అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన హజారాను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారివురికి అమ్మాయి, అబ్బాయి సంతానం ఉన్నారు. ఖాజా ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. భార్య హజారా గుజ్జనగుండ్ల సెంటర్లో వైట్ రోజ్ పేరుతో బ్యూటీపార్లర్ నడుపుతుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల నడుమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈ ఏడాది జూన్ 19వ తేదీ రాత్రి ఖాజా మద్యం తాగి వచ్చి తన సంపాదన అంతా ఖర్చు చేస్తున్నావని గొడవ పడి హజారాను ఇంటిలో ఉన్న కర్రతో కొట్టి, చున్నీతో ఆమె మెడకు బిగించి హతమార్చేందుకు యత్నించగా హజారా విడిపించుకుని సోఫాలో కూర్చుంది. సోఫాలో కూర్చున్న హజారా ముఖంపై సోఫా దిండుతో అదిమిపెట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఈక్రమంలో తన భర్త పెట్టే బాధలు భరించలేక అతన్ని ఎలాగైనా హతమార్చేందుకు నిశ్చయించుకున్న హజారా అదేరోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన బెడ్రూమ్లో మద్యం మత్తులో ఉన్న భర్త ఖాజాను సోఫా దిండుతో ముఖం అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. ఈక్రమంలో ఖాజా ఊపిరి ఆడక, కళ్లు తేలేసి స్పృహ కోల్పోయాడు. ఈక్రమంలో ఏమీ ఎరుగనట్లుగా బయటకు వచ్చిన హజారా పక్క వీధిలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు వచ్చి తన భర్త ఖాజా కింద పడిపోయాడని చెప్పింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారందరూ రాగా ఉన్నట్లుండి, తన భర్త పడిపోయి, కళ్లు తేలేశాడని తెలిపింది. ఈక్రమంలో అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఖాజా కుటుంబ సభ్యులు అతని మరణంపై అనుమానం ఉందని, జూన్ 20వ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి వైద్యులు ఈనెల 26వ తేదీన ఇచ్చిన పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఖాజాను ఎవరో దిండుతో హతమార్చినట్లు గుర్తించి, హజారాను ఈనెల 27న అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారించగా.. భర్త వేధింపులు తాళలేక హతమార్చినట్లు అంగీకరించింది. దీంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు హజారాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. -
డాక్టర్ విజయకు డైమండ్ స్టేటస్ అవార్డు
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ అవార్డు లభించింది. పక్షవాత రోగులకు ఉత్తమ చికిత్సకు గాను వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అవార్డు అందజేసింది. గతంలో నాలుగు పర్యాయాలు వరుసగా అవార్డు అందుకున్న డాక్టర్ విజయ నేడు ఐదోసారి కూడా అంతర్జాతీయ అవార్డు అందుకుని అరుదైన రికార్డు సృష్టించారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు పైగా మూడువేల మంది న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు పాల్గొన్నారు. వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ సదస్సు అక్టోబరు 22 నుంచి 24వ తేదీ వరకు స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో జరిగింది. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ విజయ ఆహ్వానిత స్పీకర్గా పాల్గొని మాట్లాడారు. భారత దేశంలోని ప్రతి జిల్లాలో ఒక స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు, అందుకు ఏర్పడే సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశంపై మాట్లాడారు. భారత దేశంలో పెరుగుతున్నర పక్షవాత భారం, అత్యవసర వైద్య సదుపాయాలు బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత స్కానింగ్ సూస్ ద్వారా వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం మెరుగు పడుతుందని డాక్టర్ విజయ పేర్కొన్నారు. వరుసగా ఐదో సారి అవార్డుకు ఎంపిక -
సీఎంను కలిసేందుకు కేఎల్ రావు కాలనీ వాసుల యత్నం
●అడ్డుకున్న పోలీసులు ●ఆందోళనలో కాలనీవాసులు తాడేపల్లి రూరల్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో నివాసముండే వారి ఇళ్లను తొలగిస్తున్నారని ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు కాలనీవాసులు సోమవారం ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళుతున్న క్రమంలో బకింగ్హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద తాడేపల్లి పోలీసులు అడ్డుకుని వారిని సీఎం నివాసానికి వెళ్లేందుకు నిరాకరించారు. అక్కడ కొంతసేపు మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో రాజధాని నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించేందుకు ఉండవల్లి అమరావతి కరకట్ట నుంచి కేఎల్ రావు కాలనీ మీదుగా బకింగ్ హామ్ కెనాల్ను దాటిస్తూ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సీఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు మీ ఇళ్లు తొలగిస్తాం అంటూ చెప్పడంతో ఆందోళన చెందిన స్ధానిక ప్రజలు నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సీఎంను, మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని భావించి వారి నివాసానికి వెళితే న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నారు. కేఎల్ రావు కాలనీలో సుమారు 1000 కుటుంబాలు ఉన్నా యి. వీరందరూ ప్రతిరోజు విజయవాడలోని మార్కెట్లో హమాలీ పని చేసుకుంటుండగా, మహిళలు పంట పొలాల్లో కూలి పనులకు వెళ్తారు. ఉన్నట్టుండి ఇళ్లు తొలగిస్తే మేము ఎక్కడికి వెళ్లాలి? కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని స్థానిక కూటమి నాయకులకు తెలిపామని, వారు ఇదిగో అదిగో మాట్లాడతామని చెబుతున్నారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్ను కలసి తమ గోడు వినిపించుకుందామని అనుకుంటున్నామని, ఆ అవకాశం మాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మహిళలు వాపోయారు. -
రైతులకు అందుబాటులో ఉండండి
మాచర్ల రూరల్: మొంథా తుఫాను పై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పత్తి, మిర్చి, వరి పంటలు పండించే రైతులకు అందుబాటులో ఉండి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ఆదేశించారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయాధికారులతో ఆయన మాట్లాడారు. రైతులందరూ తుఫాను పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో పంట కోతలు నిర్వహించవద్దని, తుఫాన్ ప్రభావాన్ని బట్టి పంట చేలో కాలువలు తీసి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పత్తి పంట నీటిలో బాగా తడిస్తే మల్టీ కె (13–0–45) యకరాకు కేజీ చొప్పున పిచికారీ చేసుకోవాలని, ఆకులు యర్రబడినా, మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలని కోరారు. మొంథా తుఫాను నేపథ్యంలో వ్యవసాయ శాఖాధికారులందరూ అందుబాటులో ఉండి అన్నీ గ్రామాల రైతులకు సూచనలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఏ వి.జగదీష్రెడ్డి, ఏఓలు డి.పాపకుమారి, కె.లక్ష్మారెడ్డి, వై.అమీర్రెడ్డి, బాలాజి గంగాధర్, టి నరసింహరావులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు -
బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు
● యడ్లపాడు రహదారిపై లారీ పల్టీ ● డ్రైవర్కు తీవ్ర గాయాలు యడ్లపాడు: మండలంలోని 16వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కకు పడిపోయింది. దీంతో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... బాపట్ల జిల్లా ఒంగోలు నుంచి అమరావతికి సబ్బుల్లో వినియోగించే కెమికల్ లోడుతో వెళ్తున్న లారీ యడ్లపాడు మండలంలోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లు వద్ద అదుపుతప్పి పక్కకు పడిపోయింది. వేగంగా వస్తున్న క్రమంలో డ్రైవర్ షడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి హైవేపై అడ్డంగా పడిపోయింది. మండలంలోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లు వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహచ్కు తరలించారు. లారీ బోల్తా పడటం వల్ల ఆ ప్రాంతంలో ఇతర వాహనాలకు ప్రమాదం జరగకుండా పోలీసులు ట్రాఫీక్ను మళ్లించారు. యుద్ధప్రాతిపదికన క్రేన్ను తెప్పించి వాహనాన్ని రహదారిపై అడ్డు లేకుండా తొలగించి రోడ్డుపై పడిపోయిన కెమికల్ బస్తాలను, ఇతర శిథిలాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నిత్యం వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపీరి పీల్చుకున్నారు. -
మానవతా దృక్పథంతో న్యాయం చేయాలి
● వైఎస్సార్ సీపీ తాడికొండ సమన్వకర్త వనమా బాల వజ్రబాబు ●వృద్ధురాలు, మానసిక వికలాంగురాలికి పరామర్శ తాడికొండ: రాజధానిలో కారుణ్య మరణం కోరుకున్న వృద్ధురాలు, మానసిక వికలాంగురాలి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్) కోరారు. సోమవారం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం రాయపూడిలో సీఆర్డీఏ అధికారుల ఒత్తిడికి గురై కారుణ్య మరణం కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన నెల్లూరు శేషగిరమ్మ, మనుమరాలు శ్యామల కుటుంబాన్ని పరామర్శించారు. విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని భరోసా కల్పించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు మైనేని నాగమల్లేశ్వరరావు, నాయకులు చుండు వెంకటరెడ్డి, ఆరేపల్లి జోజి, కొప్పుల శేషగిరిరావు, బెజ్జం రాంబాబు, షేక్ జానీ బాషా ఉన్నారు. -
పునరావాస కేంద్రానికి తరలింపు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): గుంటూరు పట్టాభిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణదేవరాయనగర్, తుఫాన్నగర్ ప్రాంతంలో వర్షం నీరు చేరింది. ఓ ఇంటి గోడ పడిపోయే స్థితిలో ఉన్న విషయాన్ని గ్రహించి తక్షణమే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఐ.రామాంజనేయులు సిబ్బందితో సోమవారం రాత్రి సహాయక చర్యలు చేపట్టారు. మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం శ్రీకృష్ణదేవరాయనగర్, తుఫాన్నగర్ ప్రాంతంలో నిఘా ఉంచారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే సయ్యావు ఖల్నాయక్ దివ్యాంగుడు తన రేకుల ఇల్లు గోడ కూలిపోయే స్థితిలో ఉంది. అతడి కుటుంబంతో పాటు చుట్టుపక్కల నీరు చేరిన నివాస గృహాల నుంచి సుమారు 20 మందిని స్తంభాలగరువు మెయిన్ రోడ్లోని శ్రీమతి మహాలక్ష్మమ్మ పుల్లయ్య మునిసిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. -
నిజాయతీతో అత్యున్నత ప్రమాణాలు పాటించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే సిబ్బంది నిరంతరం నిజాయతీతో పాటు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని గుంటూరు రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ పిలుపునిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ ఎవేర్నెస్ వీక్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అడ్డంకి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్ రంగం వంటి అన్ని వాటాదారులు అవినీతిని నిర్మూలించడానికి కలిసి పని చేయాలని పిలుపు నిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. జీవితంలోని అన్ని రంగాలలో నిజాయతీ చట్ట నియమాలను పాటించాల్సిందగా కోరారు. అనంతరం వివిధ విభాగాల సిబ్బందితో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
మత్స్యకారుల వలవిల
చీరాల టౌన్: తీరం వెంట హైలెస్సో.. హైలెస్సో అంటూ గంగపుత్రులు ఉత్సాహంగా మొదలు పెట్టే వేట ప్రస్తుతం ఆపసోపాల మధ్య సాగుతోంది. తుపాన్ల కారణంగా వర్షాలు కురుస్తుండటంతో వేట సాగక మత్స్యకారుల బతుకులు భారంగా మారాయి. మత్స్యకారులు వరుస తుపాన్లతో సతమతమవుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గంలో కొంత సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంట అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 50 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. తీరప్రాంత గ్రామాల్లో 1549 ఇంజన్ బోట్లు, 2,283 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో 20 వేలు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నెలన్నర నుంచి తుపాన్లు, భారీ వర్షాలతో గంగపుత్రులు పూట గడవక ఆపసోపాలు పడుతున్నారు. వేట ప్రస్తుతం ప్రకృతి విపత్తులతో ఆగిపోతుంది. ఫలితంగా తీరం ఒడ్డున బోట్లు, వలలను నిలుపుదల చేసి అర్ధాకలితో అలమటిస్తున్నారు. వరుస విపత్తులతో సాగని వేట.. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో సముద్రంలో మత్య్స సంపద అధికంగా లభిస్తుంటుంది. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం, కఠారిపాలెం నుంచి మత్స్య సంపదలను బెంగళూరు, కలకత్తా, చైన్నె, విజయవాడ, కేరళ, ఈరోడ్, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. గత నెల నుంచి సముద్రంలో వేట సరిగా లేకపోవడంతో మత్స్య ఉత్పత్తులు ఎగుమతి లేకుండా పోయింది. ఒక్కో బోటుకు ఆరుగురు చొప్పున మత్స్యకారులు డీజిల్ పోయించుకొని రూ.20 వేలు ఖర్చు చేసి వేటకు వెళ్లినా కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.. వేటతప్ప మరో పని తెలియని గంగపుత్రులు గత రెండు నెలలుగా తుపాన్లు కారణంగా వేట సాగక పూటగడవక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి గంగపుత్రలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తుపాన్ల సమయంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మోంథా తుపాను కారణంగా మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశాం. వర్షాలు తగ్గి సాధారణ స్థితికి వచ్చేంత వరకు తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలానే సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకులను అనుమతించడం లేదు. బీచ్లను అన్నింటినీ మూసి వేశాం. పర్యాటకులు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరుతున్నాం. – కుర్రా గోపికృష్ణ, చీరాల తహసీల్దార్ -
పల్నాడు
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కార్తికం.. శివోహంపులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,755 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 57,858 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 587.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,392 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కోటిలింగాలలో ప్రత్యేకపూజలు ఫిరంగిపురం: వేమవరంలోని కోటి లింగాల క్షేత్రంలో భక్తులు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట రూరల్: పవిత్ర కార్తిక మాసం తొలి సోమవారం కోటప్పకొండలో భక్తుల కోలాహలం నెలకొంది. వేలాదిగా భక్తులు త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. అయ్యప్ప, శివయ్య మాలధారులు పెద్దఎత్తున తొలిపూజలో పాల్గొన్నారు. ఓంనమఃశివాయ నామస్మరణతో త్రికూటాద్రి మారుమోగింది. స్వామివారికి పంచామృత ఫల రస సహిత విశేష ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అర్చకులు వైభవంగా జరిపారు. అనంతరం స్వామి వారికి విశేషంగా అలంకరించారు. ఉచిత, శీఘ్ర, ప్రత్యేక, అభిషేక దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఉచిత దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు, మహనందీశ్వరుడు, ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మండపాభిషేకంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. సొఫానమార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకుని భక్తులు కొండమీదకు చేరుకున్నారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కొండమీదకు నడిపింది. ట్రాఫిక్ సమస్య తలత్తెకుండా రూరల్ ఎస్ఐ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. అన్నదాన మండపంలో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ గావించారు. పలు సంస్థలు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశాయి. అమరేశ్వరాలయంలో భక్తజన సందోహం అమరావతి: ప్రపిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి క్షేత్రంలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం మొదటి కార్తిక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కృష్ణా జలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలో దీపారాధనలు చేసి కార్తిక దామోదరునికి విశేష పూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సుమారు 20కు పైగా బస్సులలో పంచారామ క్షేత్ర సందర్శన యాత్రికులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను వివరించారు. ఈవో రేఖ ఉచిత అన్నదానం, ప్రసాదం ఏర్పాట్లను పర్యవేక్షించారు. 7 -
కర్షకుల్లో కలవరం
సాక్షి, నరసరావుపేట : మోంథా తుఫాన్ ప్రభావం పల్నాడు జిల్లాపై పడింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మబ్బులు పట్టింది. రోజంతా ఎండ కాయలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క గురజాల తప్ప అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. గత వారం కురిసిన వర్షాలకు పొలాల్లో నిలిచిన నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో మరోసారి తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు నీరు నిలిచి పంటలు నాశనమయ్యే ప్రమాదముంది. తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండనుందన్న వార్తలు రైతులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల వరి పొట్ట దశలో, మరికొన్ని చోట్ల కంకి దశలో ఉంది. ముఖ్యంగా రెంటచింతల, దుర్గి, గురజాల ప్రాంతాలలో వరి నేలకొరిగే ప్రమాదం అధికంగా ఉంది. పత్తి పంట కాయ, పిందె దశలో ఉన్న ఈ నేపథ్యంలో అన్నదాతలలో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదముంది. సోమవారం రాత్రి గణపవరం వద్ద కొప్పుగంజి వాగు ఉధృతంగా ప్రవహించింది. నేడూ విద్యా సంస్థలకు సెలవు... జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అంగన్న్ వాడీ మొదలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటికి మంగళవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులతో కలెక్టర్ సమీక్ష... భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్లను తొలగించడానికి ట్రీ కట్టర్లు, డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని, తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని తెలిపారు . మానవ, పశు ప్రాణనష్టం ఏదీ జరగకూడదని నిర్దేశించారు. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకుని, పంట నష్టం తగ్గించాలి అన్నారు. అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలని, వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడటానికి సిబ్బందిని సంసిద్ధం చేయాలని కోరారు. జిల్లా, డివిజన్న్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కంట్రోల్ రూములు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. రాబోయే మూడు రోజులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, సెల్ ఫోన్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు. నదులు, నీటి ప్రవాహాల్లోకి దిగవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలలో ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని పీహెచ్సీలకు తరలించాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలోని గర్భిణులు, విభిన్న ప్రతిభావంతులు, చిన్న పిల్లలు, వయోవృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ అనంతరం వరద నీరు పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం, తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయడం జరగదని, సెలవులో ఉన్నవారికి రద్దు చేయడం జరిగిందని, వారు వెంటనే విధులకు హాజరు కావాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ 08647–252999 సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం 08641–233400 నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం 9949067438 గురజాల ఆర్డీఓ కార్యాలయం 9177243579 -
వైభవంగా కావడి ఊరేగింపు
పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసియున్న నాగుల గుడి దేవస్థానంలో సోమవారం కార్తిక శుద్ధ షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ, కావడి ఊరేగింపు నిర్వహించారు. ఉదయం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అలాగే శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. స్వామివారిని ఆదిశేష వాహనంపై విశేష అలంకరణతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగుల గుడి దేవస్థానం నుంచి పట్టణంలోని జానపాడు రోడ్డులో వేంచేసియున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు భక్తులు కావడి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ దేవస్థాన అర్చకులు వెంకటేశ్వర శర్మతోపాటు దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మిర్చి యార్డుకు సెలవులు కొరిటెపాడు(గుంటూరు): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యం, ఉన్నతాధికారుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ, విక్రయాలు జరగబోవని వెల్లడించారు. రైతులు సెలవు రోజుల్లో తమ మిర్చిని యార్డుకు తీసుకురావద్దని కోరారు. యలమంచిలిని పరామర్శించిన హైదరాబాద్ మాజీ మేయర్ గుంటూరు ఎడ్యుకేషన్: రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీని హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల వెంకట కృష్ణారెడ్డి సోమవారం పరామర్శించారు. అస్వస్థతకు గురై, చికిత్సానంతరం గుంటూరు బృందావన్గార్డెన్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న శివాజీని వెంకట కృష్ణారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుకున్నారు. 30న వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం వినుకొండ : పల్నాడు జిల్లా వినుకొండ శ్రీనివాస నగర్లోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం తృతీయ వార్షికంగా శ్రీవారి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అన్నదాన ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ల రామకోటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆర్ఎంగా సామ్రాజ్యం పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు రీజియన్ మేనేజర్గా డి.సామ్రాజ్యం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా ఆర్ఎంగా పనిచేస్తున్న సామ్రాజ్యం పదోన్నతిపై గుంటూరు రీజియన్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్ఎంగా పనిచేసిన సి.హెచ్.విమల బాపట్ల జిల్లాకు ప్రజా రవాణా అధికారిగా వెళ్లారు. ఆర్ఎం సామ్రాజ్యంకు సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే కాసు కృతజ్ఞతలు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తిరస్కరించిన సందర్భంగా..పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కాసు మహేష్ రెడ్డి సోమవారం వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్ణయానికి తలొగ్గి ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించేందుకు ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే ఎప్పుడు స్వాగతిస్తామని కాసు అన్నారు. జాతీయ పాలసీలో భాగంగా పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కాలేజీలను మంజూరు చేయటం జరిగిందన్నారు. ప్రధానంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ, వైఎస్సార్ వైద్యశాలను తమ అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. సుమారు 90 శాతం వైద్యశాల పూర్తి అయిందని, 60 శాతం మెడికల్ కాలేజీ పూర్తి అయిందని, ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రాన్ని కోరటం జరిగిందన్నారు. ప్రైవేటీకరణ చేయటం కుదరదని సుచన ప్రాయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేసే అవకాశం లేకుండాపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను తిరస్కరించటంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ, వైద్యశాలను పూర్తి చేస్తామని మంత్రి చెప్పటం అభినందనీయమన్నారు. గత ఏడాది జూన్ మాసానికి 100 పడకల హాస్పటల్ నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో వైద్యశాలకు సిబ్బందిని నియమించి, వైద్యపరికరాలను ఏర్పాటు చేసినట్లయితే ఎంతో బాగుండేదని, ప్రజలకు ఎంతో మేలు జరిగేదన్నారు. పల్నాడు ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచిత వైద్యసేవలు అందేవని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ కూడా ఈ ఏడాదికి సీట్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికై నా సరే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి వచ్చే ఏడాదికల్లా ప్రజలకు, వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పిడుగురాళ్ల సమీపంలో ఉన్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాల, కళాశాల ప్రైవేటీకరణను తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
బస్సు దగ్ధం మరణాలు ప్రభుత్వ హత్యలే
మద్య వ్యతిరేక వేదిక నేత ఈదర గోపీచంద్ నరసరావుపేట: నారావారి రాక్షస పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం షాపులు, అన్ని గ్రామాలలో వేలాదిగా బెల్ట్ షాపులు వెలసాయని, మొత్తంగా రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమగా విలసిల్లుతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మద్య వ్యతిరేక వేదిక నేత ఈదర గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం, 20 మంది మృతి ఘోరానికి హైవే పక్కనే ఉన్నటువంటి మద్యం బెల్టు షాపులే ప్రధాన కారణంగా తేలటం కూటమి నేతల నికృష్ట పాలనకు నిదర్శనమన్నారు. మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూడబోమని, మద్యపాన వ్యసనాన్ని దశలవారీగా తగ్గిస్తామని గొప్ప సదుద్దేశంతో దశల వారి మద్య నిషేధాన్ని 70 శాతం అమలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను ఈ సందర్భంగా ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారన్నారు. నేటి నారావారి నికృష్ట పాలనలో అన్ని రంగాలలోని అన్న వర్గాల ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారని గోపీచంద్ దుయ్యబట్టారు. ఈ బస్సు ప్రమాద మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించి, ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులన్నింటినీ తక్షణం మూయించి రాత్రిపూట మద్య విక్రయ వేళలు తొమ్మిది గంటలకే కుదించాలన్నారు. హైవేల పక్కనున్న మద్యం షాపులను దూరంగా జరపాలని, ఈ విధమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేశారన్నారు. -
వాసవి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా ‘తడవర్తి’
అమరావతి: అమరావతి వాసవి వాసప్రస్థాశ్రమ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన తడవర్తి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిత్యాన్నదాన సత్రంలో జరిగిన కార్యక్రమంలో తడవర్తి రాంబాబుతో పాటుగా ఉపాధ్యక్షులుగా ఎల్ఎస్ఆర్ ఆజనేయులు, చిత్రిల గురుపెద్దన్న, భవనాశి యల్లారావు, కాంశెట్టి లోకేష్ గుప్తా, టి.చంద్రభాస్కరరావు ప్రధానకార్యదర్శిగా ఎల్.మోహన భాస్కరరావు, సాంబశివరావు, పి. ఎస్.నరేంద్రకుమార్, ఎంఎస్వీ గోపాలకృష్ణ శ్రేష్టిలు కార్యదర్శులుగా, కోశాధికారిగా వి. నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీశైలం, కాణిపాకం అన్నదాన సత్రాల చైర్మన్ గోళ్ళ సుబ్రరత్నం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, క్రేన్ ఇండస్ట్రీస్ అధినేత జీవీఎస్ఎల్ కాంతారావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామకోటేశ్వరరావు, అన్నవరం ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు పేరూరి గాంధీలతో పాటు పలువురు సత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రహదారిద్య్రం
జిల్లాలో అధ్వానంగా గ్రామీణ రోడ్లుకూటమి ప్రభుత్వంలో రోడ్లు అద్దంలా ఉన్నాయి..పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంటూ ఓవైపు అధికారపార్టీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. 2025 సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అంటూ సీఎం, డిప్యూటీ సీఎంలు ఊదరగొట్టారు. సంక్రాంతితో పాటు దీపావళి కూడా పోయింది, మళ్లీ సంక్రాంతి వస్తోంది అయినా జిల్లాలో రోడ్ల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోగా మరింత గుంతల మయమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు ఏవో.. నారు మళ్లు ఏవో తెలియని విధంగా బురదమయంగా మారాయి. అడుగుకో మడుగును తలిపిస్తూ వాహనదారులకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలో రోడ్ల దుస్థితి తెలిపే కొన్ని చిత్రాలు.. – సాక్షి, నరసరావుపేట -
ముదిరాజులు ఐక్యంగా ఉండాలి
దాచేపల్లి: ముదిరాజులు ఐక్యమత్యంతో ఉండాలని ముదిరాజు సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు ముదిరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణపురంలోని మందపాటి నాగిరెడ్డి కల్యాణ మండపంలో 7వ కార్తీకమాస వన సమారాధన జరిగింది. ముదిరాజుల కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముదిరాజులు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. సంఘం మండలశాఖ అధ్యక్షుడు యల్లబోయిన రామకోటయ్య, ఉపాధ్యక్షుడు బొడ్డు పెదనరసింహారావు, నాయకులు నార్ల కాశయ్య, రాగి సైదులు, బొడ్డు నరసింహరావు, గంగయ్య, నరసింహారావు, నీలయ్య, సైదులు, అంజి, సాయి, గుడూరి నాని, తాతనబోయిన మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
పేదలకు విద్య, వైద్యం దూరం చేసే కుట్ర
మాచర్ల రూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ప్రజారోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైద్యశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన బినామీలకు వైద్య కళాశాలలను కట్టబెట్టేందుకు చంద్రబాబు పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మెడికల్ సీట్లు రాకుండా అడ్డుకుంటూ చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త కాలేజీలు ఆపాలన్న కుటిల నీతితో నిర్మాణ పనులు నిలుపుదలచేశారని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీని పూర్తిగా దెబ్బతీసి కోట్ల రూపాయల నిధులను వైద్యశాలలకు చెల్లించకుండా రోగులను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ర్యాలీ నవంబర్ 4కి వాయిదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో తలపెట్టిన ర్యాలీనీ తుపాను కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 4వ తేదీన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు కొమ్మారెడ్డి చలమారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు, ఎస్సీ విభాగం నాయకులు కందుకూరి మధు, మాచర్ల సుందరరావు, జెడ్పిటీసీ మాజీ సభ్యులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు షేక్ అబ్దుల్ జలీల్, బోయ రఘురామిరెడ్డి, పార్టీ నాయకులు పోతురెడ్డి కోటిరెడ్డి, బూడిద శ్రీనివాసరావు, డి శ్రీనివాసరెడ్డి, షేక్ మస్తాన్, చల్లా కాశయ్య, సత్తార్, నవులూరి చెన్నారెడ్డి, పిల్లి కొండలు, అన్నెం అనంతరావమ్మ, మందా సంతోష్, గురవయ్య, పిన్నెల్లి హనిమిరెడ్డి, కొండా శివలింగరాజు, మండ్లి మల్లుస్వామి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
పొగ బట్టిన బస్సు !
కాలం చెల్లిన బస్సులతో... ఆర్టీసీ బస్సు నుంచి వస్తున్న నల్లటి పొగ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం నిర్వహణ లోపంతో విషం చిమ్ముతున్న ఆర్టీసీ బస్సులు దారి పొడవునా నల్లని పొగతో ప్రజల అవస్థలు 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలు సైతం రోడ్లపైకి.. నిద్రావస్థలో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రధాన కేంద్రంలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ సిబ్బంది వారి సచివాలయం పరిధిలోనే ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని, అత్యవసర ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ సరఫరా అంతరాయలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలెక్టరెట్, ఆర్డీఓ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాలతోపాటు అన్నీ మండల కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
మిత్రపక్షాలు పొత్తు ధర్మాన్ని పాటించాలి
సత్తెనపల్లి: పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కడా ధిక్కరించకుండా సహకరించారని, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని హోటల్ కార్తికేయలో శనివారం నిర్వహించిన జనసేన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందంటే జనసేన పాత్ర ప్రాముఖ్యమైనదని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు -
భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం నాగులచవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం వద్ద, తూర్పు గాలిగోపురం దగ్గరున్న నాగేంద్రుని పుట్టలలో పాలు పోసి పూజలు చేశారు. నాగేంద్రునికి ఇష్టమైన నువ్వుల పిండి, సజ్జనానుబాలు, ఆవు పాలు, అరటి పండ్లు, చలిమిడిని పుట్టలో వేసి దీపారాధనలు చేశారు. పుట్టమట్టిని పిల్లల చెవులకు పెట్టి నాగేంద్రుని స్తోత్రాలను పఠించారు. దీనివల్ల చెవి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ నాగులచవితి విశిష్టతను వివరించారు. -
నాగులేరులో పడి విద్యార్థి మృతి
దాచేపల్లి : ప్రమాదవశాత్తు నాగులేరులో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డుకి చెందిన ఉద్దంటి నరేంద్ర కుమారుడు జగదీష్(10) ఈ ఘటనలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేంద్ర, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన జగదీష్ స్నేహితులతో కలిసి నాగులేరు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాళ్లు కడుగుకుంటున్న క్రమంలో చెప్పులు నాగులేరులో పడ్డాయి. వాటిని తీసుకునే క్రమంలో పడిపోయి గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు జగదీష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నాగులేరులో గాలించి జగదీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇప్పటి వరకు ఇంట్లో తమతో ఉన్న కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. -
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు 22 అర్జీలు
దళితులకు రెడ్బుక్ పాలన నుంచి విముక్తి కలిగించండి నరసరావుపేట: రాష్ట్రంలో దళితులను రెడ్బుక్ పాలన నుంచి విముక్తి కలిగించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు పలువురు నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు. దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై కలెక్టర్కు అర్జీ అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపు ధోరణి అధికమైందని తెలిపారు. గత ప్రభుత్వంలో మంజూరైన చర్మకారులు, డప్పు కళాకారుల పెన్షన్లను తొలగిస్తోందని ఆరోపించారు. దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలని కోరారు. రొంపిచర్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటే ష్, వినుకొండ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రెడ్డిబోయిన ప్రవీణ్, శావల్యాపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధార మోషే, మండల ఉపాధ్యక్షులు కాల్పుకూరి వినోద్, కారంపూడి మండల ఎస్సీ సెల్ కార్యదర్శి పేతురు పాల్గొన్నారు. -
జిల్లా పుట్బాల్ జట్లు ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాలబాలికల పుట్బాల్ జట్లు ఎంపిక పోటీలు శనివారం కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, అనుమోలు వెంకయ్య చౌదరి, పోతార్లంక రవి ప్రారంభించారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్కుమార్, గేమ్ ఇన్చార్జ్ చిరంజీవిరావు, వ్యాయామ ఉపాధ్యాయులు కరీముల్లా, సునీత, గౌసియా, షరీఫ్, గంగాధర్, శరత్, అనిల్, వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, యల్లమంద, చినరామయ్య, అలి పాల్గొన్నారు. అండర్–14 జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మదనపల్లెలో, అండర్–17 జట్లు నరనసరావుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని సరేష్కుమార్ తెలిపారు. -
ఆకట్టుకున్న పోలీసు ఓపెన్ హౌస్
నరసరావుపేట రూరల్: పోలీసుల విధులు, ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవరణలో శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రారంభించారు. విదార్థులు ఆసక్తిగా తిలకించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాల నియంత్రణకు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, నేర దర్యాప్తులో తీసుకునే చర్యలు గురించి పోలీసులు విద్యార్థులకు వివరించారు. పోలీసు జాగిలాలు పేలుడు పదార్థాలను గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ మహిళలను గౌరవించడం మన ధర్మం, భారతీయ సంస్కృతని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించి ఇబ్బందికర వీడియోలు పెడుతుంటారని, వాటిని చూడొద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. పేలుడు పదార్థాలను వాసన చూసే సమయంలో జాగిలం ఊపరితిత్తులు దెబ్బతింటాయని, దాని జీవితకాలం తగ్గిపోతుందని వివరించారు. జాగిలాలే ఏమీ ఆశించకుండా రక్షణలో భాగమైనప్పుడు, మనుష్యులు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. పోలీసు బ్యాండ్ ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మా గాంధీ, వెల్పేర్ ఆర్ఐ ఎల్.గోపీనాథ్, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్, ఎంటీఆర్ఐ కృష్ణ, అడ్మిన్ ఆర్ఐ యం.రాజా పాల్గొన్నారు. -
జాతీయ డాడ్జిబాల్ పోటీలకు ఎస్ఎస్ అండ్ ఎన్ విద్యార్థి ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి డాడ్జిబాల్ చాంపియన్షిప్–2025 పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి ఎల్.యుగంధర్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిలుమూరులో నిర్వహించిన 10 ఏపీ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల పోటీలలో పల్నాడు జిల్లా తరపున పాల్గొన్న తమ విద్యార్థి యుగంధర్ ప్రతిభ కనపరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్టు వివరించారు. గుజరాత్లో నవంబర్ 14 నుంచి 17వ తేది వరకు జరగనున్న 10వ సబ్ జూనియర్ నేషనల్ డాడ్జిబాల్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో యుగంధర్ ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. యుగంధర్ను కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్, వైస్ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి తదితరులు అభినందించారు. -
పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా మానం సుబ్బారావు, కార్యదర్శిగా సి.సి.ఆదెయ్య, కోశాధికారిగా ఎంఎస్ఆర్కే ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెన్షనర్స్ భవన్లో శనివారం జరిగిన సంఘం పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షునిగా లంకా రంగనాయకులు, అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.వి.చలపతిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, ముఖ్య సలహాదారునిగా పూజల హనుమంతరావుతోపాటు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు సహాయ కార్యదర్శులు, మరో 25మంది కార్యవర్గ సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకునిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. నూతన కార్యవర్గం మూడు సంవత్సరాలు బాధ్యతలను నిర్వహించనుంది. నూతన అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ సూచనలు, కార్యాచరణ మేరకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
నరసరావుపేట: ఈనెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నాలుగురోజులు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్నీశాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జల వనరులు, రెవెన్యూ, పోలీసు, రవాణా, మృత్య్సశాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, వ్యవసాయ శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్రూమ్ 08647–2529999 ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జనరేటర్లు, తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నిత్యావసర వస్తువుల పంపిణీపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌశలం సర్వే పూర్తి చేయండి: కలెక్టర్ నరసరావుపేట: వచ్చే సోమవారంలోగా జిల్లాలో కౌశలం సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పీఎం అవాస్ యోజన, స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్ర, సిటిజెన్ ఈకేవైసీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం ద్వారా నిరుద్యోగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలిస్తోందని, ఆశావహుల సర్వే, ఈకేవైసీ వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. గోకులం షెడ్ల నిర్మాణాలు డిసెంబరు 15 నాటికి పూర్తిచేయాలని డ్వామా పీడీ సిద్దలింగమూర్తిని ఆదేశించారు. ఉపాధి కూలీల జాబ్ కార్డుల పునరుద్ధరణ (ఈకేవైసీ) మూడు రోజుల్లో పూర్తిచేయాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణాలు, సుందరీకరణ పనులు లక్ష్యం మేరకు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ నాగేశ్వర్ నాయక్, డీఎల్డీవోలు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ సర్దుబాట్లు?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధానిలోని ఏఎన్యూ పాలన వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ తీరు గందరగోళం సృష్టిస్తోంది. అక్టోబరు 8న ఇన్చార్జి ఉపకులపతి ఆచార్య గంగాధర్ వెంటనే రిలీవ్ కావాలంటూ జీవో 91 విడుదల చేసింది. ఈ నెల 24న నూతన వీసీ బాధ్యతలు స్వీకరించే వరకూ ఆయనే కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు 16 రోజుల క్రితం ఒక్క క్షణం కూడా పదవిలో ఉండకూడదనుకున్న మనిషి ఇప్పుడు ఒక్కసారిగా ఇష్టుడుగా ఎలా మారిపోయారన్న చర్చ మొదలైంది. పేరు కూడా లేకుండా ఉత్తర్వులు నూతన వీసీ బాధ్యతల స్వీకరణలో జాప్యం జరిగింది. మరో రెండు వారాలు సాంకేతిక కారణాలతో ఆయన రాలేని పరిస్థితి ఉండటంతో తిరిగి గంగాధర్కు ఈనెల 24న మళ్లీ ఇన్చార్జి వీసీ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు తొలగించిన విద్యాశాఖ అధికారులు నేడు కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా తాత్కాలిక వీసీని కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని, నూతన నియామకాలు చేపట్టవద్దని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆర్థికపరమైన పాలసీలపై నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. దీంతో ఉన్నత విద్యాశాఖకు ఏఎన్యూ పాలనలో జరిగిన తప్పిదాలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నట్టు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. కొందరు వివాదాస్పద అధికారులు తమ అక్రమాలతో ఇన్చార్జి వీసీని పక్కదారి పట్టించారంటూ సమాచారం ప్రభుత్వానికి చేరింది. మంత్రి లోకేష్ పేషీ ఆదేశించినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నత విద్యాశాఖలోని ఒక కీలక అధికారి ఆదేశించినా పట్టించుకోలేదు. పూర్తి స్థాయి వీసీ బాధ్యతలు స్వీకరించడానికి 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. దాదాపు 14 నెలలు తాత్కాలిక వీసీగా వ్యవహరించిన గంగాధర్ హయాంలో అడ్డగోలు నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అనుయాయులకు ఇష్టారాజ ్యంగా జీతాలు పెంచారని, పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో వర్సిటీ అప్రతిష్ట మూటగట్టుకోవడం వంటివి విమర్శలకు తావిచ్చాయి. వివాదాస్పద అధికారుల కనుసన్నల్లో పాలనతో ఏఎన్యూను అప్రతిష్టపాలు చేశారు. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో ఏఎన్యూకి నూతన వీసీగా అక్టోబరు 8న సత్యనారాయణ రాజును నియమించారు. అదేరోజున తాత్కాలిక వీసీ గంగాధర్ను వెంటనే రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త వీసీని నియమించినా విధుల్లో చేరే వరకు పాతవారు తాత్కాలికంగా ఆ బాధ్యతల్లో కొనసాగడం ఆనవాయితీ. అయితే కొత్త వీసీని నియమించిన వెంటనే తాత్కాలిక వీసీగా ఉన్న గంగాధర్ను వెంటనే రిలీవ్ కావాలంటూ ప్రత్యేకంగా జీవో కూడా ఇచ్చారు. -
మెదడువాపుతో బాలిక మృతిపై ఆరా
పెదకూరపాడు : పెదకూరపాడులోని అంబేద్కర్ కాలనీలో మెదడువాపు వ్యాధితో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రాంబాబు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవీంద్రరత్నాకర్, 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరిమళ సందర్శించారు. మృతి చెందిన బాలిక కుటుంబంలో వివరాలు ఉన్నాయా, చుట్టుపక్కల ఏమైనా జ్వరాలు ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. చిన్నారులకు అందుతున్న ఇమినేషన్ ఇంజక్షన్ల గురించి ఆరా తీశారు. అనంతరం 75 తాళ్లూరు ప్రాథమిక వైద్యశాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి సూచనలు అందించారు. -
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
నకరికల్లు: ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మండలంలోని గుండ్లపల్లి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు పనులను శనివారం ఆమె పరిశీలించారు. జాప్యం కావడంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. పరిశోధన కేంద్రాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అఽధికారి ఐ.వెంకట్రావు, నరసరావుపేట హార్టీకల్చర్ ఇన్చార్జి షేక్ నబీరసూల్, తహసీల్దార్ కె.పుల్లారావు, ఎంపీడీఓ జి.కాశయ్య, డెప్యూటీ ఎంపీడీఓ కె.వి.శివప్రసాద్, డెప్యూటీ తహసీల్దార్ కొండారెడ్డి, హార్టీకల్చర్ అధికారులు పాల్గొన్నారు. పత్తి పంటను రక్షించేందుకు చర్యలు చేపట్టండి వెల్దుర్తి: పత్తి పంటను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. వెల్దుర్తిలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పంటలు పాడైపోతున్నాయన్నారు. రైతులకు పలు సూచనలు చేసి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. పత్తి చేలల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపాలని రైతులకు చెప్పారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు పంటలను కాపాడుకునేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి జగ్గారావు, మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డి, వెల్దుర్తి ఏఓ బాలాజీ గంగాధర్, తహసీల్దార్ రాజశేఖర్ నాయుడు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం పనుల పరిశీలన మాచర్ల రూరల్: ప్రతి ఇంటికీ తాగునీరందించే జలజీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం పనుల్లో నాణ్యత లోపించకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. శనివారం మండలంలోని రాయవరంలో పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. వెనుకబడిన పల్నాటి ప్రాంత దాహార్తిని తీర్చేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి పారుదల శాఖ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా -
ఒకే లాడ్జిలో ఏడు జంటలు
పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటింది. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. సింగపూర్ మాటేమోగానీ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటను మసాజ్ సెంటర్లకు అడ్డాగా మారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసరావుపేట.. మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. ఈ «ధోరణి ఇలానే కొనసాగితే అసాంఘిక కార్యకలాపాలకు నరసరావుపేట హబ్గా మారే ప్రమాదముందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకే లాడ్జిలో ఏడు జంటలు నరసరావుపేట నడి»ొడ్డున ఆర్టీసీ బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలను బుధవారం పోలీసులు తనిఖీ చేసి ఏడు జంటలను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నుంచి ఈ లాడ్జిలో ప్రతిరోజూ ఇదే తరహా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని లాడ్జిల్లోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. మరోవైపు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన జూదరులు నరసరావుపేటలోని హోటళ్లను కేంద్రాలుగా చేసుకొని పేకాట ఆడుతున్నట్టు ఆరోపణలు లేకపోలేదు. ‘స్పా’ ముసుగులో... నరసరావుపేట అభివృద్ధి చెందడం ఏమోగానీ థాయ్లాండ్ తరహా మసాజ్ సెంటర్లు వెలిశాయి. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రావిపాడు రోడ్డులతోపాటు ఎల్టీ నగర్, సాయినగర్లలో ‘స్పా’ సెంటర్లు ఏర్పాటు చేశారు. ‘స్పా’ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు అక్కడికి వెళ్లి వచ్చినవారు చెప్పుకొస్తున్నారు. రిలాక్స్ కోసమంటూ వచ్చిన వారికి వలపు వల వేసి జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక్కో స్పా సెంటర్లో గంటల లెక్కన వేల రూపాయలు ధరలు నిర్ణయించారు. వీటితోపాటు వ్యభిచారం కూపంలోకి లాగి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో ప్రత్యేకమైన గదులు, ఆన్లైన్ బుకింక్ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. మనోళ్లే వదిలేయండి.. ‘స్పా’ సెంటర్ల ముసుగులో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అనుమతులు, నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించేందుకు పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినా అధికారం అడ్డుపడుతోంది. పక్క నియోజకవర్గంలో ‘స్పా’ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి నరసరావుపేట పట్టణంలో కూడా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఆ మసాజ్ సెంటర్పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మనోళ్లవే వదిలేయండి.. అంటూ ఓ మంత్రి స్వయంగా సీఐ స్థాయి అధికారిని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్గా, తర్వాత డ్రైవర్గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను దాచేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సు బోల్తామరో ఘటనలో హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. -
తెల్లబోయిన బంగారం
సాక్షి, నరసరావుపేట: తెల్ల బంగారంగా పిలిచే పత్తిసాగుకు పల్నాడు పెట్టింది పేరు. రెండు మూడేళ్లుగా చీడ పీడలు, దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పత్తి సాగుకు రైతులు వెనకాడారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,27,180 ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తికి పునర్వైభవం వచ్చిందనుకునేలోపు వర్షాభా వం ఆ తరువాత అధిక వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మరోవైపు తెగుళ్లు సోకడంతో పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గింది. ఓవైపు వర్షా లు ఆగకపోవడం మరోవైపు పత్తిలో తేమ శాతం పెరుగుతుండటం రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రభు త్వం సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రా రంభించకపోవడంతో ఇదే అదనుగా భావిస్తు న్న దళారులు రైతుల నుంచి తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదముంది. వరుస వర్షాలతో చేటు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదైంది. దీంతో పంటను ఎర్ర తెగులు ఆశించింది. తెగులు నివారణకు రైతులు మందులు అధికంగా పిచికారి చేయాల్సి వచ్చింది. పొలాల్లో వర్షం నీళ్లు ఈ సీజన్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండటంతో చేలు ఉరకెత్తాయి. పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఐదారు క్వింటాళ్లకే పరిమితమైంది. మరోవైపు కౌలు రైతులకు పెట్టుబడి రూ.60 వేల దాకా అవుతోంది. పెట్టుబడి, వర్షాల వల్ల ఓ వైపు పెట్టుబడి పెరగడం, మరోవైపు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దక్కని మద్దతు కేంద్ర పత్తికి ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర రూ.8,110 దక్కినా కొంత నష్టాల నుంచి బయటపడొచ్చని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. వర్షం ఎక్కువగా కురవడం పత్తికి శాపంగా మారింది. నెమ్ము ఎక్కవగా ఉందని ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు పత్తిని నిల్వ చేసుకొనే అవకాశం లేకపోవడంతో తీసిన పత్తిని తీసినట్టు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యమైన పత్తి క్వింటాల్ రూ.5 వేలకు, గుడ్డి పత్తి క్వింటాల్ రూ.3వేలు నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు కనీసం పెట్టుబడి రాకపోగా అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలు త్వరగా తెరిస్తే రైతులకు కొంతమేర మేలు జరుగుతుంది. -
జనజీవనం అస్తవ్యస్తం
నరసరావుపేట: వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. తోపుడు బండ్ల వ్యాపారులు, చిన్న తరహా వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. కక్షిదారులు లేక రిజిస్ట్రార్ కార్యాలయం మూగబోయింది. 28 మండలాల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. అత్యధికంగా మాచవరం మండలంలో 25.2 మి.మీ వర్షం కురవగా అత్యల్పంగా అచ్చంపేట మండలంలో 2.2వర్షం కురిసింది. మిగతా మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే...మాచర్లలో 11.4, వెల్దుర్తి 2.4, దుర్గి 6.6, రెంటచింతల 10.4, గురజాల 5.8, దాచేపల్లి 10.2, కారంపూడి 14.2, పిడుగురాళ్ల 13.4, బెల్లంకొండ 13.4, క్రోసూరు 11.0, అమరావతి 6.4, పెదకూరపాడు 9.0, సత్తెనపల్లి 13.8, రాజుపాలెం 9.8, నకరికల్లు 15.2, బొల్లాపల్లి 7.6, వినుకొండ 19.6, నూజెండ్ల 18.6, శావల్యాపురం 9.4, ఈపూరు 15.8, రొంపిచర్ల 12.4, నరసరావుపేట 8.6, ముప్పాళ్ల 7.8, నాదెండ్ల 9.4, చిలకలూరిపేట 24.2, యడ్లపాడు 17.0 మి.మి వర్షం కురిసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రానున్న మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. శిథిలావస్థ గృహాల్లో నివాసం ఉంటున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నం.08647–252999 ఏర్పాటుచేశామని తెలిపారు. పొంగి ప్రవహిస్తున్న వాగులు రొంపిచర్ల:మండలంలో విస్తృతంగా వర్షాలు కురు స్తున్నాయి. రొంపిచర్లలో గురువారం ఉదయానికి 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం 2 గంటల వరకు ఎడతెరపిలేకుండా కురిసింది. ఈ వర్షాలకు మండలంలోని ఓగేరు వాగు, గాడిదల వాగు, ఏడుగడియల వాగు, కారంపూడి వాగు, ఊర వాగు, ఎద్దు వాగు తదితర వాగులన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాచవరం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించటంతో రెండు గంటల పాటు రాకపోకలు నిలిచాయి. మాచవరం, మర్రిచెట్టుపాలెం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఓగేరు వాగు -
విద్యార్థులకు నోట్బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన టెల్సా
రొంపిచర్ల: మండలంలోని పాఠశాలకు టెల్సా సంస్థ రూ.6,51,500లతో సమకూర్చిన నోట్ పుస్తకాలు, స్టీల్ ప్లేట్లు, జామెంట్రీ బాక్స్లను గురువారం సంస్థ ప్రతినిధి కరిముల్లా, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మేశ్వరరావుకు అందజేశారు. బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు టెల్సా అందించిన నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్లు, స్టీల్ ప్లేట్లను అన్ని పాఠశాలలకు అందజేస్తామన్నారు. టెల్సా సంస్థ ప్రతినిధి కరిముల్లా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎం.సుభాని, పి.రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బగళాముఖి సేవలో బాలస్వామీజీ చందోలు(కర్లపాలెం): ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని పెనుగొండ వాస వీ పీఠాధిపతులు శ్రీబాలస్వామీజీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి ఆలయ పూజారులతో కలసి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవా రి దర్శనం అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్ర దీక్ష అనంతరం బగళా ముఖి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చి నట్లు తెలిపారు. అనంతరం స్వామీజీకి ఆల య మేనేజర్, అభివృద్ధి కమిటీ చైర్మన్, పూజా రులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న మార్కెట్ను సీజ్ చేయాలి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : బుడంపాడు బైపాస్ సర్వీస్ రోడ్డులో అక్రమ లే అవుట్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహా హోల్సేల్ కూరగాయాల మార్కెట్ను వెంటనే సీజ్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ నూతన లీజు దారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కౌన్సిల్ సమావేశం వద్ద బ్యానర్ పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చిలకలూరిపేట టౌన్: ఇద్దరు యువకులు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్ ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిలకలూరి పేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తెనపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఉయ్యాల శ్రీనివాసరావు తన విధుల్లో భాగంగా తిరుపతి నుంచి వయా చిలకలూరిపేట మీదుగా సత్తెనపల్లి వెళ్లే క్రమంలో బస్సును స్థానిన ఎన్ఆర్టీ సెంటర్లో నిలుపుదల చేసి పక్కన ఉన్న టీస్టాల్లో టీ తాగుతున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు డ్రైవర్పై పడ్డారు. వారిని కసురుకున్నందుకు వారిద్దరు వాగ్వాదానికి దిగి డ్రైవర్పై దాడి చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డ్రైవర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ
నరసరావుపేట: టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణంలో జనసేన పార్టీకి చెందిన కరెడ్ల చిన్న సాంబశివరావుపై గురువారం రాత్రి టీడీపీ నాయకుడు ఎం. కొండలు తన అనుచరులతో దాడి చేశారు. అడ్డొచ్చేందుకు ప్రయత్నించిన చిన్న సాంబశివరావు అన్నలు పెద్ద సాంబశివరావు, కోటయ్యలపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని హైస్కూల్ కాంప్లెక్స్లో జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఏడో నెంబర్ షాపులో 20 సంవత్సరాలుగా ఆటోమొబైల్స్ వ్యాపారం చేస్తూ జనసేన పార్టీకి చెందిన కారెడ్ల చిన్న సాంబశివరావు జీవనం సాగిస్తున్నాడు. ఈ షాపును స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తమకు ఇచ్చారని, మీరు వ్యాపారం చేస్తున్నందుకు నెలకు రూ.30 వేలు మాకు చెల్లించాలని కొన్నాళ్లుగా సాంబశివరావును టీడీపీ నాయకుడు వేధిస్తున్నాడు. జిల్లా పరిషత్ వారికి నెలకు రూ.3వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నామని మీకు చెల్లించాల్సిన అవసరం లేదని, మేము జనసేన పార్టీకి చెందిన వారమని సాంబశివరావు చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఈ షాపును మాకిచ్చారు. మీరు షాపు ఖాళీ చేయాలని టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆటోమొబైల్ షాప్ పై దాడి చేసి షాప్లో ఉన్న వస్తువులను రోడ్డుపై పడేసి కొంత సామాన్లు ఆటోలో తరలించారు. అడ్డుకున్న చిన్న సాంబశివరావును చితకబాది రోడ్డుపై పడేశారు. ఈ దాడిలో చిన్న సాంబశివరావుకు చేయి విరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుపడిన సాంబశివరావు సోదరులను కూడా తీవ్రంగా కొట్టి తిరిగి వారిపైనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాడి చేసిన వారే తిరిగి మాపై ఫిర్యాదు చేసి మా వాళ్లని పోలీస్స్టేషన్ కి తీసుకువెళ్లారని ఇదెక్కడి న్యాయం. అసలు జనసేన లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిందా, స్థానిక ఎమ్మెల్యే చెప్తేనే మేము దాడి చేశామని చెప్తున్నారు. రూ.3వేలు అద్దె చెల్లించాల్సిన షాప్కి నెల నెల రూ.30 వేలు చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం. ఇదేనా ప్రభుత్వం చేసే పని అసలు జనసేన పార్టీ వాళ్లను టీడీపీ నాయకులు చులకనగా చూస్తున్నారు. – కారెడ్ల రమణ (చిన్న సాంబశివరావు భార్య), పిడుగురాళ్ల. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న ర్యాలీలు
నరసరావుపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 28న జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ర్యాలీల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ పోస్టర్ను గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి గోపిరెడ్డి ఆవిష్కరించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలకు అనుమతి తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందని తెలిపారు. ర్యాలీలకు అనుమతి లేదు ..కేసులు పెడతామని ఎవరైనా అన్నా భయపడేది లేదని, అనుమతి ఉన్నా, లేకపోయినా ర్యాలీ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, నిడమానూరి సురేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పడాల శివారెడ్డి, గెల్లి చిన్న కోటిరెడ్డి, కనకా పుల్లారెడ్డి, ఎన్కే ఆంజనేయులు, ఉప్పుతోళ్ల వేణుమాధవ్, ఎస్.సుజాతాపాల్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, గెల్లి బ్రహ్మారెడ్డి, నేలటూరి సురేష్, షేక్ రెహమాన్, మర్రిపూడి రాంబాబు, కోటపాటి మనింద్రారెడ్డి, మూరె రవీంద్రారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంతర పంటల విధానాన్ని అవలంబించాలి
నరసరావుపేట రూరల్: ఒకే పంట పద్ధతికి బదులుగా అంతర పంటల విధానం అనుసరించడం ద్వారా చీడపీడల ఉధృతి తగ్గించడంతోపాటు పంట నష్టాలను నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని బృందావన్ మీటింగ్ హాల్లో రైతు శిక్షకులకు రెండు రోజుల శిబిరం నిర్వహించారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని తెలిపారు. రైతు శిక్షకులు తమ పరిధిలోని రైతులు ప్రకృతి పద్ధతులు ఆచరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 190 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్కు రైతు శిక్షకుడిని నియమించినట్టు తెలిపారు. ప్రతి క్లస్టర్లో 125 మంది రైతులు 125 ఎకరాల్లో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతకు ప్రకృతి వ్యవసాయమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్దమనోహరంగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం గాజుల తో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీ య, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజాము న అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతు లు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమా రు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికా రులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితోపాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చు కున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటలపాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించి న గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వాంగ సుందరంగా అలంకరణ గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు. సాయంత్రం పెరిగిన రద్దీ ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రద్దీ తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ పెరిగింది. -
ఎరువుల కొరత లేకుండా చూడండి
మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వ్యవసాయ సిబ్బందితో ఎరువులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అద్దంకి, పర్చూ రు నియోజకవర్గాలకు రబీ సీజన్లో డీఏపీ ఎక్కువ అవసరం ఉంటుందని కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ కమిషనర్ మంజీర్ జిలానీకి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దంకి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం, సుదర్శనరాజు, నియో జకవర్గ వ్యవసాయాధికారులు వెంకటకృష్ణ, రామ్మోహన్రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, వెంకటరామయ్య పాల్గొన్నారు. చీరాల: వృద్ధుడైన తన భర్త కనిపించడం లేదంటూ భార్య గురువారం చీరాల వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు...చీరాల మసీదు సెంటర్లో నివాసం ఉంటున్న జొన్నాదుల కాంతమ్మ తన భర్త రామమూర్తి (70) మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. మతి స్థి మితం సరిగా లేదని, మూడు రోజుల నుంచి కని పించలేదని, పలుచోట్ల గాలించినా కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. -
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
నరసరావుపేట: కార్తిక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్తికమాసం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, దైద, చేజర్ల వంటి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా ఐదు దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని మిగిలిన దేవాలయాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. భక్తులు ఆలయాల సందర్శన, రాకపోకలు, అన్నదానం, ప్రసాదం, దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రతి ఆలయంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, ప్రతి ఆలయానికి బస్సు సౌకర్యం కల్పించటం, నిరంతర విద్యుత్తు ఉండేలా చూడటం, సీసీ కెమెరాల ఏర్పాటు, వర్షాలను తట్టుకునేలా టెంట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. నదుల వెంట ఉన్న ఆలయాలకు భద్రత పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక క్యూలైన్లు, సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, అటవీ శాఖ అధికారిని కృష్ణప్రియ, దేవాదాయశాఖ అధికారులు, ఆర్డీవోలు, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, డీఎస్పీలు, ఈవోలు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం వైద్య సేవలు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షిఫ్టుల వారీగా విధులు కేటాయించి స్టాఫ్నర్సులు అన్ని వేళలా విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, కొరత ఉన్న ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, డీసీహెచ్ఎస్ ప్రసూన పాల్గొన్నారు. -
ఏఎన్యూ దూరవిద్య పరీక్షా ఫలితాలు విడుదల
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన పలు డిగ్రీ, పీజీ కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం ఇన్చార్జి రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, దూరవిద్యా కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు విడుదల చేశారు. డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్), బీబీఏ కోర్సుల 1, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. అలాగే, ఎంఏ ఎకనామిక్స్ 1, 2, 3, 4 సెమిస్టర్ల, బీఎల్ఏఎస్సీ కోర్సుల 1, 2 సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ కోర్సులకు ఒక్కో పేపరుకు రూ.770, పీజీ కోర్సులు ఒక్కో పేవరుకు రూ.960 నవంబరు 11వ తేదీలోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు దూరవిద్యా కేంద్రం వెబ్సైట్లో పొందుపర్చామని అధికారులు తెలిపారు. -
ఏఎన్యూలో ఎస్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
పెదకకాని: ఏపీ ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..ఎస్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్మెంట్, 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లను అప్గ్రేడ్ చేసే ప్రక్రియలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్, నాగార్జున వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాంప్రసాద్, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, పలువురు ముఖ్య అధికారులు, స్పాన్సర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలకు నిలయం కేజీబీవీ
బొల్లాపల్లి: బొల్లాపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) సమస్యలకు నిలయంగా మారింది. ఆర్వో వాటర్ ప్లాంట్ అలంకారప్రాయంగా మారింది. బోరు నీరే దిక్కు అయ్యింది. గదులలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. విద్యార్థినులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. విద్యార్థినులే స్వయంగా గదులను శుభ్రపరచుకుంటున్నట్లు సమాచారం. సోలార్ ప్లాంట్ ఉన్నా పనిచేయదు, కరెంటు పోతే అంధకారం నెలకొంటుంది. కంప చెట్లు పెరిగి విషపురుగులు సంచరిస్తుంటాయి. వీటికితోడు ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అధికారికి బోధన, బోధనేతర సిబ్బందికి మధ్య సఖ్యత లేదని తెలిసింది. సమన్వయలోపంతో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రంలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 240 మంది విద్యార్థినులు విద్య నభ్యసిస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారే అధికం. ఒకరిద్దరూ ఉపాధ్యాయునిలు నామమా త్రంగా తరగతులకు హాజరవుతారని బాలికలు చెప్తున్నారు. సమస్యలపై మాట్లాడితే చర్య ఉంటుందని బాలికలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్ఓకి బోధన బోధనేతర సిబ్బందికి మధ్య సమన్వయలోపంతో, విద్యాలయంలో మౌలిక వసతులు, గురించి పట్టించుకోకపోవడంతో సమస్యలు తిష్ట వేశాయని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో ఇప్పటివరకు జిల్లా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదని, దీంతో కేజీబీవీలో సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కోటిన్నరతో అదనంగా భవనాలు కట్టుబడి చేస్తున్నారు కానీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద మురుగు చేరి దుర్వాసన వెదజల్లు తుంది. వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రత వలన ఇటీవల ఓ ఉపాధ్యాయునిరాలు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. పలుమార్లు సమస్యలను, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాలయంలో తిష్ట వేసిన సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని, నిరుపేద బాలికలకు మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యత రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆరేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాను. పిల్లలను తల్లిదండ్రులతో ఇళ్లకు పంపడం లేదని మాపై నిందలు వేస్తున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయదు, ఇక్కడ బోరు నీరు తాగుతున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపడితే రూ.10 వేలు ఖర్చు అవుతుందని, తిరిగి మరలా రిపేర్కు వస్తుందని మెకానిక్ చెప్పాడు. విద్యార్థులను అడిగితే భోజనం బాగానే ఉందని చెప్తున్నారు. – వి లీలావతి, ఎస్ఓ, కేజీబీవీ కేజీబీవీలో అన్నీ సమస్యలే. ఇక్కడ నిరుపేదలకు చెందిన పిల్లలు అధికంగా చదువుకుంటున్నారు. మౌలిక వసతులు లోపించాయి. ప్రధానంగా జిల్లా అధికార యంత్రం పట్టించుకోకపోవడంతో, ఇక్కడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు వారి దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికై నా సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. కేజీబీవీలో సమస్యలపై పిల్లలు తల్లిదండ్రులకు చెబితే లోపల బెదిరిస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. – బి రామాంజి నాయక్, పేరెంట్ -
దిగుబడి, ధరలు తగ్గాయి
నేను నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వర్షాలు అధికంగా కురవడంతో గూడు, పిందే రాలిపోయాయి. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వస్తుందనుకున్న దిగుబడి కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. మరోవైపు దళారులు ధరలను అమాంతం తగ్గించేశారు. నాణ్యమైన పత్తి క్వింటాల్ రూ.5 వేలకు అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటాల్ పత్తి కనీసం 8 వేలకు అమ్ముకొనేలా చర్యలు తీసుకోవాలి. –బోనం నాగిరెడ్డి, రైతు, కోగంటివారిపాలెం, అచ్చంపేట. నేను రెండెకరాలు కౌలుకు తీసుకొని అందులో ఈ ఖరీఫ్లో పత్తి సాగు చేశాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంటలు కింద కాపు మొత్తం కుళ్లిపోయింది. తేమ అధికంగా ఉండటంతో పూత పిందే విపరీతంగా రాలిపోతుంది. ఆకులు పండుటాకులవుతున్నాయి. పత్తి చెట్లు భారీగా పెరగటంతో రెండు పర్యాయాలు కొమ్మ కొట్టాను. పంట మొత్తం కమ్ముకుపోవటం భూమిలో తడి ఆరకపోవటంతో కాసిన కాపు కూడా పుచ్చిపోతుంది. మరింత వర్షాలు పడితే పంటను వదిలేసుకునే పరిస్థితి ఏర్పడింది. – చింతా బత్తిన బుజ్జిబాబు, పత్తి రైతు, పెదకూరపాడు -
ప్రభుత్వ భూమిలో తమ్ముళ్ల పాగా
లాం (తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి అడ్డదారుల్లో సొంతం చేసుకునేందుకు లీజు డ్రామా ఆడిన తమ్ముళ్ల ఆగడాలను ఈ నెల 8వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి సర్వే నెం 199/ఏలో ఉన్నది ప్రభుత్వ భూమే అంటూ తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ జారీ చేసినందుకు గాను గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అయితే సదరు కార్యదర్శి ఈ విషయం తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎన్ఓసీని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, కనెక్షన్ తొలగించాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ తొలగించకపోవడంతో ఆక్రమణదారులకు పని సులువైంది. బుధవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఎంచక్కా బ్రిక్స్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషినరీని తరలించి యంత్రాల సాయంతో దించి లోపల పెడుతున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకొని అనంతరం ఫోన్లు ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. 199/ఎ సర్వే నంబర్లో ఆక్రమనలు ఉన్నాయి తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేసి నిరుపేదలకు చెందిన 40 ఇళ్లు నిలువునా కూల్చిన నాయకుడే ఇప్పుడు తిరిగి అదే సర్వే నెంబర్లో అర్ధరాత్రి ఆక్రమణకు పాల్పడటం విశేషం. -
ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంకులు
నరసరావుపేట: మండలంలోని కొత్తపల్లి ఇసుక రీచ్కు ట్రాక్టర్లు వెళ్లకుండా దారికి అడ్డంగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నా అది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదు. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుకు తీసుకు వెళ్లవచ్చని దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి నిరాశే ఎదురవుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటనలకు, ఇక్కడ జరుగుతున్న ఘటనలకు పొంతన ఉండటం లేదు. నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా రీచ్ నిర్వహకులు దారికి అడ్డంగా గండి కొట్టడంతో సోమవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కొత్తపల్లి వద్ద ఇసుక రీచ్ నిర్వాహకులు నదిలోకి తమ ట్రాక్టర్లు వెళ్లకుండా ఇలా చేయడం సరికాదని, ఎంతో వ్యయప్రయాసలతో వస్తే అడ్డుకుంటున్నారని ట్రాక్టరు డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు మాత్రమే ట్రాక్టర్లు వెళ్లకుండా చేస్తున్నారని, రాత్రిళ్లు పెద్ద జేసీబీలతో నదిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారీ లారీలలో మోతాదును మించి లోడ్ చేసుకుని ఇసుకను ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ తదితర మండలాల ట్రాక్టర్ల వారు ఇలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలోనే ఏ ఆటంకాలు లేకుండా ఇసుక రవాణా చేసుకునేవారమని ట్రాక్టరు యజమానులు చెబుతున్నారు. -
త్రికోటేశ్వరునికి కార్తిక పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి బుధవారం విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. కార్తిక మాసం తొలిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అయ్యప్ప మాలధారులు, భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సత్రశాల(రెంటచింతల): కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా సత్రశాలలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని బుధవారం భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భ్రమరాంబికాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేల శివశర్మ నేతృత్వంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలతోపాటు పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, చండిహోమాలు నిర్వహించారు. భక్తులకు గుండా వెంకట శివయ్య, చపారపు అంకిరెడ్డి, చపారపు అబ్బిరెడ్డి ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య ప్రారంభించారు. ఈఓ గాదె రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన కేసానుపల్లి సమీపంలోని ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం మేళాకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు మాట్లాడుతూ మేళాలో సుమారు 30కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండవచ్చని తెలిపారు. రామాంజనేయులు, రవీంద్రనాయక్, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కరీమ్ పాల్గొన్నారు. అమరావతి: మండల పరిధి గ్రామాలలో 2017 సంవత్సరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల క్రిమినల్ కేసును కొట్టివేసినట్లు బుధవారం గుంటూరు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శరత్ బాబు తీర్పు వెలువరించారు. కేసు వివరాల ప్రకారం.. 2017 ఆగస్టు 15న అమరావతికి చెందిన మసక లక్ష్మి, బత్తుల ఫణి అనే ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అమరావతి–నరుకుళ్ళపాడు గ్రామాల మధ్య వాగులో మృతదేహాలను పడేశారు. అప్పట్లో అమరావతి పరిసర ప్రాంతాలలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వైకుంఠపురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు. నిందితుడి తరఫున అమరావతికి చెందిన న్యాయవాది మేకల హనుమంతరావు కోర్టులో వాదనలు వినిపించారు. సాక్ష్యాలు చూపి నేరాన్ని నిరూపించ లేకపోవడంతో నిందితుడిని నిర్దోషిగా తేల్చి కేసును న్యాయస్థానం కొట్టివేసింది. పెదకూరపాడు : గారపాడులోని గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు హుండీలను అపహరించారు. ఆలయం బయట ఉన్న హుండీని ఇనుప రాడ్లతో పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగిలించారు. గర్భగుడిలోని హుండీని తీసుకువెళ్లారు. బుధవారం తెల్లవారుజామున వచ్చిన భక్తులు గమనించి దేవాలయం కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కమిటీ సభ్యులు పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరుజిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యాశాఖ నుంచి స్టడీ మెటీరియల్ త్వరగా అందిస్తే జెడ్పీ నిధులతో ముద్రణ ప్రక్రియను వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి పాఠశాలలకు అందజేయగలుగుతామని తెలిపారు. అదే విధంగా టెన్త్ విద్యార్థులకు జెడ్పీ నిధులతో అల్పాహారాన్ని పంపిణీ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, పల్నాడు, బాపట్ల జిల్లాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కౌశల్–2025 పేరుతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ క్విజ్ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. భారతీయ విజ్ఞానమండలి, ఏపీ సైన్స్ సిటీ, అప్కాస్ట్ సంయుక్తంగా తిరుపతిలో నవంబర్ 27న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్విజ్, రీల్ పోటీలతో పాటు, పోస్టర్ కాంపిటీషన్స్ జరుగుతాయని వివరించారు. పాఠశాలస్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 1,2,3వ తేదీలతో పాటు జిల్లాస్థాయిలో నవంబర్ 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్యూబీ సమీపంలోని బ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోట ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలిపాడు. ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోట సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. -
పేద రోగులు విలవిల
పల్నాడుగురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇటు వైద్యుల సమ్మె, అటు ఎన్టీఆర్ వైద్యసేవ బంద్తో కష్టాలు సత్తెనపల్లి: వైద్యులు, ఆస్పత్రుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పేద రోగులకు శాపంగా మారింది. జిల్లాలో గ్రామీణ ప్రాంత రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యులు గత నెల 26వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వైద్య సేవల కోసం చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ వైద్య సేవ నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 110 మంది వైద్యులు పనిచేస్తున్నారు. చాలా మంది డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగి రాకపోవడంతో గత నెలాఖరునుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి సమ్మెలోకి వెళ్లిపోయారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్పై పలువుర్ని పంపించినా చాలామంది వేరువేరు స్పెషలిస్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి అలా చూసి వెళ్లిపోతున్నారని రోగులు చెబుతున్నారు. ఫలితంగా రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. జిల్లాలో ప్రతిరోజు ఎంపిక చేసిన గ్రామంలో 104 ద్వారా సేవలు అందించాలి. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పుడు ఒక వైద్యుడు 104 ద్వారా గ్రామానికి వెళ్లి సేవలందించేవారు. సమ్మెతో 104 వాహనాల్లో వైద్యుడు వెళ్లడం లేదు. వైద్యులు లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధనతో ప్రస్తుతం సిబ్బంది కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇంత దిగజారినా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీల వైద్యులు మండిపడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు ఇచ్చే మందులతోనే సరి పెట్టుకుంటూ రోగులు అవస్థలు పడుతున్నారు. 7సత్తెనపల్లి నియోజకవర్గంలో 6 పీహెచ్సీలు ఉంటే 12 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన ఆరుగురిలో డాక్టర్ సాయితేజారెడ్డి (సత్తెనపల్లి)ని అచ్చంపేటకు, డాక్టర్ వెంకటేశ్వర్లు (కుంకలగుంట)ని కారంపూడి పీహెచ్సీకి పంపారు. డాక్టర్ రవితేజా నాయక్ (రాజుపాలెం) సెలవులో ఉన్నారు. పణిదంలో డాక్టర్ శివలీల, ముప్పాళ్ళలో డాక్టర్ రమాదేవి, కుంకలగుంటలో డాక్టర్ పూజాశ్రీ , సత్తెనపల్లి అర్బన్ పీహెచ్సీ నుంచి డాక్టర్ ధర్మసింగ్శాస్త్రి రాజుపాలెం పీహెచ్సీలో, నరసరావుపేట పీపీ యూనిట్ నుంచి డాక్టర్ రత్నకుమార్ నకరికల్లు పీహెచ్సీలో సేవలు అందిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,320 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 37,709 క్యూసెక్కులు అధికారులు వదులుతున్నారు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 587.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 52,560 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఓ వైపు ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు వైద్యం అందించడం లేదు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు సమ్మెకు దిగారు. దీంతో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రజలకు వైద్యం అందక విలవిల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి పాలకులు చోద్యం చూస్తున్నారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. -
తమ్ముళ్ల దోపిడీకి జీఎంసీ ‘పీ..పీ..పీ..’
రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా ● కార్పొరేషన్ భూములను తమ వారికి కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం ● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని అన్నమయ్య ట్రస్టుకి ఇచ్చేందుకు చర్యలు ● రూ.వందల కోట్ల బడ్జెట్ ఉన్నా రూ. 6 కోట్లు ఖర్చు చేయలేమని సాకులు ● రూ. 70 కోట్ల విలువైన స్థలం 20 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నం ● ఇప్పటికే చిన్మయా, వెంకటేశ్వర బాల కుటీర్కు కార్పొరేషన్ స్థలాలు అప్పగింత ● నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: బృందావన్ గార్డెన్స్లోని ప్రభుత్వ స్థలంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణానికి 1999లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ ఆడిటోరియం ప్రస్తుతం శ్లాబు దశ పూర్తి చేసుకుంది. ఫినిషింగ్ మాత్రమే మిగిలి ఉంది. సుమారు రూ.ఆరు కోట్లు ఖర్చు పెడితే నగరానికే తలమానికంగా మారనుంది. కానీ ఆడిటోరియంపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు తతంగాన్ని పూర్తి చేశారు. రూ.1500 కోట్ల బడ్జెట్ ఉన్న నగరపాలక సంస్థకు రూ.ఆరు కోట్లు ఖర్చు చేయడం పెద్ద పనేం కాదు. కానీ తమ వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీని వెనుక కేంద్ర మంత్రి సహకారం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను చిన్మయా విద్యాసంస్థలు, వెంకటేశ్వర బాలకుటీర్కు అప్పగించిన అధికారులు ఇప్పుడు మరో విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా... గతంలోనే ఈ అంశాన్ని టేబుల్ అజెండాగా పెట్టి చర్చించకుండానే ఆమోదించినట్లు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై వివరాలు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లేఖ రావడంతో దీన్ని మళ్లీ కౌన్సిల్ ముందుకు పెట్టారు. అభివృద్ధి ప్రాజెక్టు పరిధి మరియు వినియోగం, పీపీపీ ఒప్పందపు కాల వ్యవధి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు లభించే ఆదాయం వాటా, నిర్మాణ స్థిరత్వ బాధ్యత, ప్రాజెక్టు హక్కు/హోదా, ఒప్పందం నిబంధనలు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విజయవాడకు చెందిన వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి నివేదిక తెప్పించారు. రూ.8 లక్షలు ఖర్చు చేసి కన్సల్టెన్సీ నుంచి నివేదిక తయారు చేయించారు. ఆడిటోరియం పూర్తి అయిన తర్వాత వచ్చే ఆదాయంలో 60 శాతం కార్పొరేషన్కు, 40 శాతం అన్నమయ్య సేవా సమితికి కేటాయించేలా ఒప్పందం తయారు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఏ సమాచారం కూడా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ నివేదికలో ఏముంది? ఈ ఒప్పందాన్ని మొత్తం మున్సిపల్ కమిషనర్ ఆమోదించారా? ఎవరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు? వంటి అంశాలేవీ ఇప్పటి వరకూ కౌన్సిల్ ముందు ఉంచలేదు. కార్పొరేషన్ తీరు, టీడీపీ నాయకుల వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 37వ వార్డులో పలు అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్ ఆమోదం కోసం చర్చించనున్నారు. కేవలం 37వ డివిజన్లోనే రూ.2.60 కోట్ల వర్కుల ఆమోదానికి అత్యవసర సమావేశంలో అంశాలను చేర్చారు. ఇంత అత్యవసరంగా మేయర్ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, నార్ల ఆడిటోరియం అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. అదే బాటలో గుంటూరు తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల విలువైన స్థలంలో నిర్మాణంలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని ఒక సంస్థకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసం ఏకంగా గురువారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్నే ఏర్పాటు చేసేశారు. -
నిధుల వినియోగంలో సమతుల్యత ముఖ్యం
నరసరావుపేట: ఉపాధి హామీ నిధుల వినియోగంలో అన్ని నియోజకవర్గాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం డ్వామా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రగతి నివేదికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా వినియోగించాలన్నారు. ఇప్పటికే మంజూరైన పనులను గ్రౌండింగ్ చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 103 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రజల సంతృప్తిని తెలుసుకుంటున్నాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి ఈ మేరకు చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పేదలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జిల్లాల విభజన తదితర అంశాలపై చీఫ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పాల్గొన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశం -
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సీఐఎఫ్ నిధులు సక్రమంగా ఉపయోగించుకొని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు అవ్వాలని తెలిపారు. అడ్మిన్ డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ తదితర పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. సంఘ సభ్యులు బాధ్యతాయుతంగా ఉంటూ రుణాలు తిరిగి చెల్లించేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, అడిషనల్ ప్రాజెక్ట డైరెక్టర్ రాజాప్రతాప్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కోయ రజనీకుమారి, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది వాల్మీకి, శోభ, దాసు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్
చిలకలూరిపేట: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు చెప్పారు. మంచినీటి చెరువుల రోడ్డులోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, మారణాయుధాలు కలిగి ఉన్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని సరఫరా చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని వెల్లడించారు. గృహ సముదాయంలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారా ? తదితర అంశాలను కార్యక్రమం ద్వారా పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 103 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పత్రాలు సమర్పించిన 70 వాహనాలను విడుదల చేశారు. మిగిలిన వాహనాలకు పత్రాలు సమ ర్పించాలని, లేనిపక్షంలో సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ పి. రమేష్, రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, సబ్ డివిజన్ పరిధిలోని ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు -
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మహాధర్నాకు గుంటూరు జిల్లా నుంచి వందమందికిపైగా వైద్యులు, వైద్య సిబ్బంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆషా గుంటూరు నేతలు బుధవారం మీడియాకు వెల్లడించారు. పేరుకుపోయిన బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నెటవర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులు 95 ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 700 వరకు చికిత్సలు, ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం సుమారు రూ. 2,700 కోట్లు ఆసుపత్రులకు ఏడాది కాలంగా చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతోపాటుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ క్లయిమ్ అప్రూవల్స్ సుమారు రూ. 670 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క నిధులు చెల్లించకుండా మరోపక్క డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాటు చేసిన గైడ్లైన్స్ కమిటీలో కనీసం తమకు ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం తమను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆషా నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రూ.670 కోట్లు చెల్లించడంతోపాటు గైడ్లైన్స్ కమిటీలో తమను భాగస్వాములను చేయాలనే డిమాండ్తో ఈ నెల 10 నుంచి ఆషా ఆధ్వర్యంలో హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేశారు. గురువారం దర్నాకు ఆషా సభ్యులంతా రావాలని గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకర్ కోరారు. కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించనందుకు నిరసన -
కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలి
కొరిటెపాడు(గుంటూరు): పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్, సీసీఐ కొనుగోలు కేంద్రాలపై గుంటూరు మార్కెట్ యార్డులో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులతో వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 సీసీఐ కొనుగోలు కేంద్రాలతోపాటు మరో 11 మార్కెట్ యార్డుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. పొడవు పింజ పత్తి క్వింటాకు రూ.8,110లు, మధ్యస్త పింజ పత్తి క్వింటాకు రూ.7,710లు చెల్లిస్తామని వివరించారు. కొనుగోళ్ల ప్రారంభ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత మిల్లుకు పత్తిని తీసుకువెళ్లి విక్రయించుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ సమస్యలపై రైతులు వాట్సాప్ హెల్ప్ లైన్ నంబరు 7659954529ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర షా, మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, కాకుమాను శ్రీనివాసరావు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన్నవ హరనాథబాబు తదితరులు పాల్గొన్నారు. -
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్గా (హెచ్వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. పదోన్నతి కౌన్సెలింగ్కు 25 మంది హెచ్వీలను పిలువగా, వారిలో నలుగురు పదోన్నతి వద్దంటూ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో 21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సు (నాన్ టీచింగ్) నర్సుగా పదోన్నతి కల్పించి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్ ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్అనిల్ పాల్గొన్నారు. పదోన్నతి ఉత్తర్వులు అందించిన ఆర్డీకి వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి.. ఒంగోలు మలేరియా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరావుకు ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించి నెల్లూరు మలేరియా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరు ఆర్డీ కార్యాలయంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు. -
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లలితకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి నైతిక విలువలు పతనమవుతున్నాయని అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, న్యాయ కళాశాలల్లో మానవ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. శ్రీశ్రీ, వేమన, కరుణశ్రీ, గురజాడ వంటి కవుల కలం నుంచి జాలువారిన సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతను ప్రభావితం చేస్తోందన్నారు. తన సోదరి ఓల్గా మరణానంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ భాషలు, వాటి సాహిత్య విలువలను విద్యార్థుల్లో ప్రేరేపించే ప్రక్రియలో భాగంగా తొలిసారి వర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. కవులు, విమర్శకులు, సాహిత్యాభిలాషులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఆలోచనల నుంచి వచ్చే నూతన సృజనలకు ప్రాణం పోయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం ఓల్గాను సత్కరించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ప్రేమ్కుమార్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్ డీన్ డాక్టర్ బిష్ణు పథ్, విభాగాధిపతి డాక్టర్ శయంటిన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. సీ్త్రవాద రచయిత్రి పి.లలితకుమారి -
పంటలు నమోదు చేయించుకుంటేనే పరిహారం
అచ్చంపేట: రైతులంతా పంటలను వ్యవసాయ సిబ్బందితో సంబంధిత యాప్లో నమోదు చేయించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాలు, రాయితీలు వర్తించవని జిల్లా వ్యవసాయాధికారి యం.జగ్గారావు తెలిపారు. మండలంలోని చిగురుపాడు, చింతపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పత్తి పొలాల్లో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులతో సంప్రదించి ప్రతి ల్యాండ్ పార్సిల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పంట నమోదుకు ఈనెల 25వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. ఈలోపు సాగులో ఉన్న పత్తి పంటను యాప్లో నమోదు చేయాలని తెలిపారు. రానున్న రబీ సీజన్లో రాయితీపై శనగలు, మినుములు ఇవ్వనున్నట్లు రైతులకు తెలిపారు. ఎరువుల దుకాణాలు తనిఖీ అనంతరం ఆయన అచ్చంపేటలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎమ్మార్పీకి మించి విక్రయించరాదని, రైతు కోరిన ఎరువునే ఇవ్వాలని చెప్పారు. పురుగు మందు కొంటేనే యూరియా ఇస్తామని అనడం సరికాదని దుకాణాదారులను హెచ్చరించారు. దుకాణాల్లో స్టాకు బోర్డులు, వాటి ధరలను పొందుపరచాలని ఆదేశించారు. కొనుగోలు చేసే రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసిన నాణ్యత గల పురుగు మందులు, ఎరువులను విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. నాణ్యతలేని పురుగు మందులు విక్రయించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి పి.వెంకటేశ్వర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు -
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నేటికీ సీ్త్రశక్తి పథకానికి సంబంధించిన రాయితీ బకాయిలు రూ. 500 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. డీజిల్ కొనుగోలుకే నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. సీ్త్రశక్తి పధకం సాఫల్యవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీకి రాయితీ నిధులు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 3 వేల బస్సులను కొనుగోలుచేసి వాటికి 10 వేల మంది సిబ్బందిని అన్నికేటగిరీల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమల్లో కొన్ని డిపోల్లో అధికారులు కండక్టర్లను అనవసరంగా సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలు ఆందోళనకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, జిల్లా కార్యదర్శి విజయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మంగళగిరి డిపో కమిటీ అధ్యక్షులు సాంబశివరావు, జిల్లాలోని జోన్, డిపోస్ధాయి అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు -
పల్నాడు జిల్లాలో యువకుడు కిడ్నాప్!
దమ్మాలపాడు (ముప్పాళ్ళ): పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల పేరుతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన షేక్ నాగూర్ షరీఫ్కు పిడుగురాళ్లలో మెకానిక్ దుకాణం ఉంది. బుధవారం మధ్యాహ్నం పనిలో ఉండగా దుకాణం వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మరింత ఆందోళనకు గురైన నాగూర్ షరీఫ్ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించింది.తన భర్తపై ఎలాంటి కేసులు లేవని, పోలీసులమని చెప్పి మఫ్టీలో వచ్చి ఎలా తీసుకెళ్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. నాగూర్ షరీఫ్ ముప్పాళ్ల మండలం, తొండపి ఎంపీటీసీ బందెల హుస్సేన్బీ అల్లుడు. ఈనెల 28న ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామాకు తెరదీశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ పదవిపై కన్నేసిన టీడీపీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
కాటికాపరి హత్య కేసులో దర్యాప్తు తప్పుదోవ
నరసరావుపేట: కాటికాపరి గాడిపర్తి ఎఫ్రాన్ హత్యకేసులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తనపైన, వైఎస్సార్సీపీ వారిపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తనపైన చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పోలీసులు ఈ హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే ఇప్పటికే మూడుసార్లు ప్రెస్మీట్ పెట్టి మరీ హత్య చేసింది వైఎస్సార్సీపీ వారని, వారిని ప్రోత్సహించానని తన పేరు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. క్రిస్టియన్ పాలెం నుంచి స్వర్గపురి–2 వరకు సుమారు 150 సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి ఫుటేజీలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చి, పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఖాదర్ అనే వ్యక్తిని ఎలాగైనా ఈ కేసును ఇరికించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నరసరావుపేటలో ఏది జరిగినా తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన వెన్న బాలకోటిరెడ్డి హత్య గురించి కూడా అరవిందబాబు మాట్లాడారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున కేసు రీ ఓపెన్ చేసి సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు. ఇదిగో అవినీతి చిట్టా ఇటీవల ఎమ్మెల్యే స్టేడియంలో అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కోటప్పకొండ నుంచి మట్టి తీసుకెళ్లే ఒక్కొక్క లారీకి రూ.800 చొప్పున తీసుకుంటున్నాడని, ఏఎంఆర్ దగ్గర రూ.2 వేలు తీసుకొని టోకెన్ ఇస్తున్నాడని, దీంట్లో రూ.1200 ప్రభుత్వానికి, రూ.800 అరవింద బాబుకు వెళతాయని డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. భవన నిర్మాణాలకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు వచ్చాయన్నారు. కోటప్పకొండ ఇనాం భూముల్లోనే మట్టి తవ్వుకుంటున్నారని చెప్పారు. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులోకి తీసుకు రాలేకపోయారన్నారు. అవిశ్వాయపాలెం – కోటప్పకొండ రోడ్డుకు డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చి ఏడాది గడిస్తే ఇప్పటికీ రోడ్డు వేసిన పాపాన పోలేదని అన్నారు. -
‘వైద్య సేవ’ ఆసుపత్రులకు రూ.650 కోట్లు చెల్లించాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన బకాయిల్లో మొదటివిడతగా రూ.650 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) జిల్లా కన్వీనర్ డాక్టర్ నాగోతు ప్రకాష్ డిమాండ్ చేశారు. బకాయిలు తక్షణమే చెల్లించాలంటూ నరసరావుపేటలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బంది మంగళవారం ప్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆశ ప్రతినిధులతో కలిసి నాగోతు ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది వైద్య కార్డులు ఉండటంతో నగదు చెల్లించి వైద్యసేవలు పొందేవారు చాలా తక్కువగా ఉన్నారన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు అందక, డబ్బులు చెల్లించి వైద్యసేవలు పొందేవారు లేక హాస్పిటళ్ల నిర్వహణ చాలా కష్టంగా మారిందన్నారు. దీంతోపాటు సేవలు పొందే జబ్బులను పెంచారన్నారు. ఆ జబ్బులకు అందజేసే వైద్యసేవలకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ రేట్లు కూడా నేటి ధరలకు అనుగుణంగా లేవన్నారు. సిజేరియన్కు రూ.13 వేల నుంచి రూ.9 వేలు మాత్రమే హాస్పిటళ్లకు చెల్లిస్తున్నారని, ఈ విధమైన ప్యాకేజీలు గిట్టుబాటు కావట్లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ స్కీం తీసుకొస్తామని చెబుతోందని, అయితే ప్యాకేజీలపై నెట్వర్క్ హాస్పిటళ్ల అసోసియేషన్ను ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించకపోవటం శోచనీయమన్నారు. హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించేందుకు నిర్దిష్ట తేదీలు ప్రకటించి.. దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే గురువారం రాష్ట్రస్థాయిలో నెట్వర్క్ హాస్పిటళ్ల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రతినిధి డాక్టర్ అమర్ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మిగతా రూ.2 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం తెలపాలని కోరారు. డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ.. 2007 నుంచి ప్రారంభమైన ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు నెట్వర్క్ హాస్పిటళ్లకు ఇచ్చే ప్యాకేజీ రేట్లలో పెద్దగా మార్పులేమీ జరగలేదని, హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ల ధరలు 90 శాతం పెరిగినా ప్యాకేజీలు 10శాతం కూడా పెరగలేదన్నారు. నెట్వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో వెంటనే 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఎంఏ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరెడ్డి, ప్రతినిధులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరబాబు, వంశీ, నాగిరెడ్డి, బాజిబాబు, అనిరుద్దీన్, హర్ష, రామకృష్ణ, జి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
తీరానికి కార్తిక శోభ
బాపట్ల టౌన్: సముద్రస్నానం అనగానే టక్కున గుర్తుకొచ్చేది సూర్యలంక తీరం. కార్తిక మాసంలో ఈ తీరానికి చేరుకొని సూర్య నమస్కారాలతో కూడిన స్నానాలు చేసేందుకు భక్తులు, పర్యాటకులు పోటీపడుతుంటారు. బుధవారం నుంచి కార్తిక మాసం ప్రారంభం కావడంతో తీరం ముస్తాబైంది. సహజ సిద్ధమైన తీరంగా పేరున్న సూర్యలంకలో స్నానాలు చేసేందుకు సముద్రం అనుకూలంగా ఉంటుంది. దీంతో సూదూర ప్రాంతాల నుంచి పూజలు నిర్వహించేందుకు భక్తులు, విహారయాత్ర చేసేందుకు పర్యాటకులు వస్తుంటారు. కార్తిక పౌర్ణమి రోజున సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో కూడిన గౌరీదేవి పూజలు నిర్వహిస్తే ఆశీస్సులు మెండుగా ఉంటాయనేది భక్తుల నమ్మకం. పోలీసుల ఆదేశాలు సుదూర ప్రాంతాల నుంచి సూర్యలంక తీరానికి చేరుకునే పర్యాటకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. నియమ నిబంధనలను పక్కాగా పాటించాలని పేర్కొన్నారు. మరికొన్ని సూచనలు ఇవీ.. రవాణా సదుపాయం ఇలా.. బాపట్ల నుంచి 9 కిలోమీటర్ల దూరంలో సూర్యలంక సముద్ర తీరం ఉంది. ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బాపట్ల నుంచి నేరుగా సూర్యలంక వరకు ఆటోలు వెళ్తుంటాయి. ఒక్కో మనిషికి రూ. 30 చార్జీ ఉంటుంది. సర్వీసులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో ప్రతి శని, ఆది, సోమవారాలలో బాపట్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నేరుగా సూర్యలంకకు, బాపట్ల పాతబస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం గుంటూరు బస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా సూర్యలంక బస్సులు అందుబాటులో ఉంటాయి. సకల సౌకర్యాలు తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సేద తీరేందుకు వీలుగా ఒడ్డున పర్యాటక శాఖ వారి హరిత రిసార్ట్స్ ఉన్నాయి. పలు ప్రైవేటు రిసార్ట్స్ కూడా పర్యాటకులకు సేవలు అందిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రిసార్ట్స్లోని ఒక్కో రూమ్కు రూ. 2,000 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది. శని, ఆదివారాల్లో రూ. 3,500 నుంచి రూ.6000 వరకు తీసుకుంటారు. బాపట్ల: పర్యాటకులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో బీచ్లు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో వీసీ ద్వారా మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన మాట్లాడారు. పర్యాటక రంగానికి జిల్లా చాలా కీలకం అన్నారు. ఆరు మండలాలలోని తీర ప్రాంతంలో 17 పంచాయతీలలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఎనిమిది పంచాయతీల పరిధిలో తొమ్మిది బీచ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఆదాయ వనరులు పెరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. కార్యక్రమాలు రిసార్డ్స్ వెలుపల నిర్వహిస్తే నామమాత్రపు రుసుము విధానం ప్రవేశపెట్టాలన్నారు. దుకాణాలకు, వాహనాల పార్కింగ్కు ధరలు నిర్ణయిస్తూ పంచాయతీలలో తీర్మానం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పరచాలన్నారు. ప్రతివారం బీచ్లను సందర్శిస్తామన్నారు. బాధ్యతలు నిర్వర్తించకుంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డీపీవో ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
ఆయిల్ మిల్లులపై దాడులు
నమూనాలు సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నరసరావుపేట టౌన్: నూనె తయారీ కేంద్రాలపై మంగళవారం ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ నువ్వుల నూనెల విక్రయాల వ్యవహారంపై ప్రజారోగ్యంపై కల్తీ కత్తి పేరిట సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించి దాడులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు నూనె తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనుమానం కలిగిన రెండు తయారీ కేంద్రాల్లో నూనె శాంపిళ్లను సేకరించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. నరసరావుపేట: కార్తికమాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్ధం పంచరామాలు, మహానంది, యాగంటి, శ్రీశైలం, ఇతర ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక యాత్ర బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామని ప్రజారవాణా జిల్లా అధికారి, ఆర్టీసీ ఆర్ఎం అజితకుమారి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ఆరు డిపోల నుంచి ఎక్స్ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ తరగతుల్లో ప్రత్యేక సదుపాయాలతో నడుపుతున్నామన్నారు. శుభ్రమైన సీటింగ్ సౌకర్యం, ఆన్లైన్ రిజర్వేషన్, సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించబడుతుందన్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం అన్నీ డిపోల నుంచి బస్సుల సౌకర్యం ఉంటుందన్నారు. భక్తులు సమీప బస్స్టేషన్ల ద్వారా రిజర్వేషన్లు పొందవచ్చన్నారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణాచలం క్షేత్ర దర్శనికి కాణిపాకం, అలివేలు మంగాపురం, శ్రీకాళహస్తి, శ్రీనగర్ గోల్డెన్టెంపుల్, శబరి మల యాత్రికులకు అందుబాటు ధరల్లో ప్రత్యేక అద్దె ప్రాతిపదినక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయపురిసౌత్ : నాగార్జునసాగర్లో నూతన ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మాచర్ల మండలం నాగులవరం, పసువేముల గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన భూములను ఎయిర్ పోర్ట్ ప్లానర్స్ అండ్ డిజైన్ కన్సల్టింగ్ ప్రైవేటు లిమిటెడ్ సీఈఓ విక్రమ్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఎయిర్పోర్ట్ స్థలం వద్ద సాంకేతిక లక్షణాలు, గాలి దిశలు, ప్రతిపాదిత భూమి స్వభావం, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, రోడ్ల దూరం, హైవే దూరం పరిశీలించారు. కార్యక్రమంలో మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్, సర్వేయర్లు కేవై రాజు, కసిన్యా నాయక్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 587.80 అడుగులకు చేరింది. ఇది 305.9818 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,800, ఎడమకాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,561, ఎస్ఎల్బీసీకి 1,200, వరదకాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 52,579 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 52,579క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం అమావాస్య మంగళవారం సందర్భంగా రాహు కేతువులకు పూజలు జరిపించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సమయాల్లో పూజలు నిర్వహించారు. ఈ పూజలకు 627 టికెట్లు భక్తులకు విక్రయించినట్లు ఆలయ ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహుకేతు పూజల ద్వారా ఒక్క రోజులో స్వామివారికి రూ. 3,13,500 ఆదాయం సమకూరిందన్నారు. భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
నరసరావుపేటరూరల్: సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు మహావీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. లింగంగుంట్లలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్లో అమరవీరుల సంస్మరణ దినంను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావులు పాల్గొని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి పోలీసులు చేసే సేవ వెలకట్టలేనిదని తెలిపారు. పోలీసు వ్యవస్థ లేని సమాజాన్ని ఊహించలేదమన్నారు. పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డు ఉండదని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారా కాస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 26 మంది పోలీసులు వీర మరణం పొందారని గుర్తుచేశారు. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు సిబ్బంది ఉన్నారని వీరందరికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లాలో వీరమరణం పొందిన ఎస్ఐ, ఎనిమిది మంది సిబ్బంది కుటుంబసభ్యులను సన్మానించారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మాగాంధీ పర్యవేక్షణలో ఆడ్మిన్ ఆర్ఐ ఎం.రాజా పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) సీహెచ్ లక్ష్మీపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, డీఎస్పీలు ఎం.హనుమంతరావు, ఎం.వెంకటరమణ, పోలీసు అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ టి.మాణిక్యాలరావులు పాల్గొన్నారు. -
మహిళ ఉసురు తీసిన పిడుగు
దాచేపల్లి: పిడుగుపాటుకి గురై మహిళ మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో దాచేపల్లికి చెందిన యడ్ల నర్సి భార్య మాణిక్యం(55) మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి సమీపంలోని శంకరపురం దగ్గర ఉన్న పొలంలో పశువులకు మేత కోసం నర్శి, అతని భార్య మాణిక్యం వెళ్లారు. సాయంత్రం 3గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పొలంలో గడ్డి కొస్తున్న మాణిక్యంపై పిడుగుపడింది. దీంతో మాణిక్యం శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన భర్త నర్శి భయాందోళనకు గురయ్యాడు. మృతిచెందిన భార్యని ఎడ్లబండిపై ఇంటికి తీసుకువచ్చాడు. తనతో పాటు ఉండి పిడుగుపాటుకు గురై మృతిచెందిన భార్య మాణిక్యం మృతదేహం వద్ద నర్శి ఏడుస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టిచింది. పిడుగు పాటుతో మృతిచెందిన మాణిక్యం మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మన్నెసుల్తాన్పాలెంలో మరొకరు బెల్లంకొండ: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని మన్నెసుల్తాన్పాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాటూరి జక్రయ్య (25) పిడుగుపడి మృతిచెందినట్లు తెలిపారు. గేదెలు మేపేందుకు పొలానికి వెళ్లిన సమయంలో వర్షం పడుతుండటంతో చెట్టుకిందకు వెళ్లాడు. ఇదే సమయంలో పిడుగు పడడంతో జక్రయ్య మృతిచెందాడు. వడ్రంగి దుకాణాల్లో అగ్ని ప్రమాదం రూ.20 లక్షల ఆస్తి నష్టం నరసరావుపేట టౌన్: అగ్ని ప్రమాదంలో మూ డు వడ్రంగి దుకాణాలు దగ్ధమైన సంఘటన సో మవారం అర్థరాత్రి చోటు చేసుకున్నాయి. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరవకట్ట తారకరామ కాంప్లెక్స్ పక్కన షేక్ జానీబాష, ఖాశిం, సలాంలకు చెందిన వడ్రంగి దుకాణాలు వరుసగా ఉన్నాయి. ఆ దుకాణాల్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమా చారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని కలప, పరికరాలు దగ్ధమయ్యాయి. సంఘటనలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమానులు చెప్పారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ ఫిరోజ్ మంగళవారం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంపై అనుమానాలు ఉన్నట్లు బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్టీం ప్రాథమిక ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి షార్ట్సర్యూట్ కారణమా లేక ఇతరులు ఎవరైనా చేశారా అనే విషయం విచారణలో తేలనుందన్నారు. -
బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
చిలకలూరిపేట: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక పట్టణంలోని ఏఎంజీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. బాలురు, బాలికలకు విడివిడిగా అండర్–14, అండర్–17 విభాగాలలో ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ మహిళా కార్యదర్శి డాక్టర్ పద్మావతి, ఏఎంజీ హై స్కూల్ హెచ్ఎం కె.కృపాదానం ప్రారంభించారు. ఈ పోటీలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్– 14కి ఎంపికై న క్రీడాకారులు నవంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. అండర్–17కి ఎంపికై న క్రీడాకారులు కృష్ణాజిల్లా నూజివీడులో త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు అండర్– 17 బాలుర జట్టు వై బి స్ ఎం అఖిల్, పూండ్ల హైస్కూల్ బాపట్ల, బి ఈశ్వర్ సాయి వర్ధన్, యువ స్కూల్, గుంటూరు, టి.జాన్ రెడ్డి పాల్. శ్రీ చైతన్య హైస్కూల్, నరసరావుపేట, జి.జ్ఞాన విగ్నేశ్వర కార్తీక్,ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, జి.పాల్ టోనీ ప్రత్యూషు, నారాయణ స్కూల్, గుంటూరు, జి.వంశీకృష్ణ, ఏఎంజీ హై స్కూల్ చిలకలూరిపేట, బి.అఖిల్, గుడ్ షెఫర్డ్ వినుకొండ, ఎన్ దుర్గా పవన్, ఆక్స్ఫర్డ్, గుంటూరు, బి.నిర్మలా జోసెఫ్, జడ్పీహెచ్ఎస్ మందపాడు, జె.లక్ష్మీ ప్రవీణ్ రాజు, ఆక్స్ఫర్డ్, పిడుగురాళ్ల, కె.ప్రభాకర్, వేద హై స్కూల్, చిలకలూరిపేట, కె.మణికంఠ, ఎస్.పి.ఎస్ గుంటూరు. అండర్ 17 బాలికల జట్టు.... షేక్ ఫరహానా, వాగ్దేవి నరసరావుపేట, వై.యోగ శ్రీ, గీతాంజలి హైస్కూల్, గుంటూరు, ఎస్డి జుబేరియా జాస్మిన్, మున్సిపల్ గరల్స్ హైస్కూల్, నరసరావుపేట, కె.మానస, మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట, డి.దివ్య, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, పీవీఎస్ శ్రీలక్ష్మి, మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట, కె.ధన్య, ఏఐఎంఈ ఇంటర్నేషనల్ స్కూల్, పాతూరు, ఎస్ఆర్ఎస్వీఎస్ఎన్ఎస్ లక్ష్మి, కేంద్రియ విద్యాలయ, సత్తెనపల్లి, సి.హెచ్.శ్యామ్ శరణ్య, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, ఎస్ సాయి శ్రీ, మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట, ఎస్.సహస్ర, ఎల్.ఎఫ్.ఎల్ స్కూల్, గుంటూరు, బి.ధనలక్ష్మి మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట. అండర్ 14 బాలుర జట్టు ఏ వెంకట నాగ శశాంక్, టి.షణ్ముఖరావు, ఎస్.ఎస్ రాంప్రతాప్, ఎస్ పి ఎస్ హై స్కూల్, గుంటూరు, సి.హెచ్ రిత్విక్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, గుంటూరు, ఎం.శ్రీ మణికంఠ, ఏఎంజీహై స్కూల్, చిలకలూరిపేట, జి.గురు విష్ణు, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, ఏ. రుద్ర, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గుంటూరు, వి.శివ, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, నరసరావుపేట, ఏ అరవింద్ బాబు, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, బి.వంశీ, ఎల్ఎఫ్ఎస్ స్కూల్, గుంటూరు, జి.సాగర్ బాబు, జడ్పీహెచ్ఎస్, మందపాడు, ఎల్. భాస్కర్ నాయక్ ఏఎంజీ హైస్కూల్, చిలకలూరిపేట. అండర్ 14 బాలికల జట్టు... ఎ.వెంకటలక్ష్మి అక్షయ, శ్రీపాటి బండ్ల సీతారామయ్య స్కూల్, గుంటూరు, కె. కావ్య, మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట, కె.రిషిక, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గుంటూరు, టి.లాస్య రెడ్డి, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, ఎం.జాహ్నవి, గుడ్ షెఫర్డ్ స్కూల్, వినుకొండ, వి.మహిమ, జడ్పీహెచ్ఎస్, అంకిరెడ్డిపాలెం, డి.పవిత్ర, ఏఎంజీ హై స్కూల్, చిలకలూరిపేట, జి.హేమ హరిణి, జెడ్పి హెచ్.ఎస్, పేరేచర్ల, పి.సుమ బిందు, జి.జి.హెచ్.ఎస్. గుంటూరు, జి.ఉషశ్రీ, మున్సిపల్ గరల్స్ హై స్కూల్, నరసరావుపేట, పి. దీప్తి, జెడ్.పి.హెచ్ స్కూల్, అంకిరెడ్డిపాలెం, ఐ.షామిని, ఏఐఎంఈ ఇంటర్నేషనల్ స్కూల్, పాతూరు.


