breaking news
-
‘ ఆ కార్యక్రమంలో నా గురించి మాట్లాడటం బాధాకరం’
ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి. ‘లక్ష్మణ్ కుమార్ తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది. నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా. తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నా. కాంగ్రెస్లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. -
‘రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం.. ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?’
సాక్షి, హైదరాబాద్: యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకొచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ.. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘రేపు ఢిల్లీకి వెళ్తాం. సుప్రీంకోర్టు తలుపు తడుతాం. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మా చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కి తగ్గేది లేదు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నాయి. ప్రధాని దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదు?. బీసీ సంఘాలు బంద్కి పిలుపునిస్తే మద్దతు ఇస్తాం. బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?. బీజేపీ నరనరాన బీసీ వ్యతిరేక పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ విమర్శలు చేశారు. అలాగే,ఆర్టీఐపై కీలక వ్యాఖ్యలు..నేటితో RTI చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ దూరదృష్టి నాయకత్వంలో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చింది. దేశ చరిత్రలో RTI చారిత్రాత్మక నిర్ణయం. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం RTI ద్వారా కల్పించారు. ప్రజలకు RTI జీవన రేఖగా మారింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTIకి తూట్లు పొడుస్తోంది.2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచాయి. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు), సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయి. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం ఇద్దరు కమిషనర్లతోనే పనిచేస్తోంది. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధింపులకు గురవుతున్నారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలి. కమిషన్ల పనితీరుపై నిర్దిష్ట ప్రమాణాలు, ప్రజా నివేదికలు తప్పనిసరి చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
బీసీ రిజర్వేషన్లతో పార్టీల ‘రాజకీయం’!
గాల్లో కత్తులు దూయడం... శూన్యంలో యుద్ధాలు చేయడం రాజకీయ పార్టీలు, నేతలకు అలవాటైన విద్యే. తెలంగాణ స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దీన్నే నిరూపిస్తోంది. అన్ని పార్టీలకూ తుది పరిణామం ఏమిటన్నది స్పష్టంగా తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూంటారు. ప్రత్యర్థులపై పైచేయికి వ్యూహాలు పన్నుతూంటారు. నిర్దిష్ట గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్నికల్లో అధిపత్యానికి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేయాలని సంకల్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలు 56 శాతమని తేల్చారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం 42 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. స్థానిక సంస్థలలోనే కాక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకురిజర్వేషన్లు ఉండాలని కొన్ని రాష్ట్రాల శాసన సభలు తీర్మానాలు కూడా చేశాయి. కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఏభై శాతానికి మించే వీలు లేదు. అయినా తాము అనుకున్న రిజర్వేషన్ల శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది. ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతుందని అంతా అనుకున్నదే. అయినా ఎవరికి వారు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గడిపారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. కాని రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. గవర్నర్ సకాలంలో ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు ఓకే అయిపోయినట్లే అని కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా తాము 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి జీవో ఇచ్చింది. అయినా ఎవరికి ఇది అమలు అవుతుందన్న నమ్మకం లేదు. కాని ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆ జీవోపై హైకోర్టులో ఊహించినట్లే స్టే వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం మరో చిత్రం. తదుపరి హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది. ఈ గేమ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అవడం గమనించదగిన అంశమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్కు తెలియదా? తీర్పు వచ్చాక మళ్లీ రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు కొనసాగించాయి. రిజర్వేషన్ల జీవోను బీజేపీ, బీఆర్ఎస్లే అడ్డుకున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిని ప్రజలలో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు కేడర్కు పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ది ఉందా అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తమకు రావడానికే గేమ్ ఆడారు తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఈ వ్యవహారానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించేవి. రిజర్వేషన్ల అంశంపై మాత్రం అందరూ పోటాపోటీగా 42 శాతానికి మద్దతిస్తున్నట్లు మాట్లాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తే రేవంత్ విమర్శించేవారని, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం నేరమన్నారని బీఆర్ఎస్ ఇప్పడు గుర్తు చేస్తోంది. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తనే రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం ఉందన్నట్లుగా బిల్లు ఆమోదింప చేశారు. జీవో కూడా ఇచ్చేశారు. మరి ఇది చెల్లదన్న సంగతి ఆయనకు తెలియదా? అంటే ఏమి చెబుతాం? కులగణనతో చాలా మార్పులు వచ్చేస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అంటూ దేశంలో పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. తమిళనాడులో మాదిరి షెడ్యూల్ 9 లో చేర్చితేనే రిజర్వేషన్ లకు చట్టబద్దత వస్తుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ బీహారు ఎన్నికలలో ప్రయోజనం కోసం ఈ డ్రామా ఆడిందని మాజీ స్పీకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఉన్న చిత్తశుద్దిని రుజువు చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో స్టే రాకపోతే స్థానిక ఎన్నికలు జరిగిపోయేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచిన పార్టీగా పేరు తెచ్చుకునేది. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేశామనిపించుకునేది. గతంలో కేసీఆర్ కూడా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి ప్రచారం చేశారు.. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయనకు కూడా తెలుసు. అయినా కావాలని అప్పట్లో అలా చేశారన్నది నిష్టుర సత్యం. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పంథాలో సాగిందని చెప్పాలి. బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించి, అటు పాము చావకుండా, ఇటు కర్ర విరగకుండా వ్యవహరించింది. కేంద్రం మీదకు నెట్టాలని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం మీద నెపం ఉండేలా బీజేపీ ప్రయత్నం చేశాయి. జాతీయ పార్టీలను తప్పుపట్టి తానే బీసీలకు అనుకూలం అన్న భావన కలిగించాలని బీఆర్ఎస్ యత్నం.వాస్తవానికి ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయానిపిస్తుంది. కాకపోతే అమాయక గ్రామీణులు కొందరు నిజంగానే ఎన్నికలు వచ్చేస్తాయనుకుని తమ చేతులు కాల్చుకున్నారట. దసరా నాడు వారికి ఎన్నికల ఖర్చు రూపేణా బాగానే చేతి చమురు వదిలిందట. ఏతావాతా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామాగా మార్చడం దురదృష్టకరం. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షిస్తున్న బీసీ వర్గాలకు మరోసారి నిరాశే ఎదురైంది.తాజాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇందుకు భిన్నంగా తీర్పు వస్తే ఒక చరిత్రే అవుతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జూబ్లీహిల్స్ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది. -
‘హరీష్ చెప్పేదాంట్లో వాస్తవాలు లేవు’
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్కుమర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా ఉపయోగించకుండా రికార్డ్ స్థాయిలో పంటలు పండించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు ఉత్తమ్. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) హనుమకొండలో ప్రెస్మీట్ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, సీతక్కలు.దీనిలోభాగంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ బనకచర్ల విషయంలో హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాము. బనకచర్ల ప్రాజెక్ట్కు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వ్యతిరేకం. హరీష్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంతో కోట్లాడుతున్నాము. కృష్ణనది జలాల విషయంలో కేంద్ర జలశక్తి ముందు వాదనలు వినిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. తుమ్మడిహట్టి వద్ద 10 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. సీతారామ ప్రాజెక్ట్ మా హయంలో పూర్తి చేసినం. సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్ట్ విషయంలో అన్ని అనుమతులు సాధిస్తున్నాం. హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్లలో వాస్తవాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ పూర్తిచేసి టెండర్లు పిలిస్తే మనకేమి సంబంధం. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని ప్యతిరేకిస్తాం’ అని ఉత్తమ్ తెలిపారు. -
బిహార్లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్తోపాటు.. తేజస్వీ యాదవ్ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్లో తృతీయ ఫ్రంట్కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్లో పర్యటించారు. సీమాంచల్పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
Konda Surekha: రేవంత్కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్ రూమ్ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్ను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం. -
‘బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించింది’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్పై కాంగ్రెస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం... తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది.ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బిఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థ ల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బిఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటె ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు...బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసింది. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని నిలదీశారు.రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైంది కేటీఆర్బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం తేటతెలలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని, కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిందన్నారు. అందుకే ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం కోర్టు ఆపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక… ఎన్నికల వాయిదా కోసం బిసి రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని విమర్శించారు కేటీఆర్. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఊహించని ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావుకు ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. బొంతు రామ్మోహన్కు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిపారు.అర్వింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుధీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది. -
‘వాగ్దానాలు నెరవేర్చడం చేతకాక.. బీసీలను వాడుకుంటున్నారు’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి వాగ్దానాలు నెరవేర్చడం చేతకాక, బీసీలను వాడుకుంటుందని మండిపడ్డారు. ఈరోజు (గురువారం, అక్టోబర్ 9వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ.. ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ నేతలను ఎందుక అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు ఏమైందని నిలదీశారు అరవింద్, ‘ హరీష్ పాల వ్యాపారం ఏమైంది ? కవిత రాజీనామా ఎందుకు ఆమోదించలేదు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వెనకబడిన తరగతులను అడ్దం పెట్టుకొని దొంగ నాటకాలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. కల్వకుంట్ల కుటుంబంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డ్రామాలు చేస్తున్నారు. వారి మధ్య దోస్తానాలో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత -
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఎవరీ నవీన్ యాదవ్..?
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయింది. రెండుసార్లు పోటీ ⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. ⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది. మజ్లిస్ మద్దతు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. -
జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ వార్ రూమ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహం అమలు, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్చార్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు. ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పండితుల సూచనల మేరకు మంచి ముహూర్తం చూసుకుని మాగంటి సునీతా గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నేత రావుల శ్రీధర్రెడ్డి తదితరులతో పాటు మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా హాజరయ్యారు. నేడు, రేపు బూత్ కమిటీలతో భేటీలుబీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజూ వారీ ప్రచార షెడ్యూలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. వార్ రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదు ను పెట్టాలని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో బూత్ కమిటీలతో డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరి స్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలు నిర్వ హించి ప్రచార వ్యూహాన్ని వివరిస్తారు. ఈ నెల 10 వ తేదీలోగా బూత్కమిటీల సమావేశాలు పూర్తి చేసి 12వ తేదీ నుంచి ప్రచార పర్వంలో అడుగు పెట్టా లని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పక్షంలో ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కూడా ఉప ఎన్నిక ప్రచారంలో భాగస్వాములను చేస్తారు. ప్రచారం ముగింపులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
అభ్యర్థులు స్థానిక ఓటరులై ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తొలిదశ స్థానిక ఎన్ని కలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానుండగా, వెనువెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్ల దాఖలు విషయంలో అభ్య ర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.» ఫారం–4 (అనుబంధం–3)లో ఉన్న నమూనాలో నామినేషన్ పత్రం ఉండాలి» ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారు సంబంధిత ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి» పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరి పేర్లు మండల, జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాల్లో ఉండాలి» ఒక స్థానానికి ఒక అభ్యర్థిని వివిధ వ్యక్తులు ప్రతిపాదించవచ్చు» ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయొచ్చు కాని ఒక దాంట్లోనే పోటీ చేయాలి.» ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయొచ్చు» రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ప్రదేశంలో నామినేషన్లు అందజేయాలి» గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ లేదా రిజర్వ్డ్ చిహ్నం కలిగి రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేస్తున్న అభ్యర్థి, నోటిఫికేషన్ ఫారమ్–2లో ఆ పార్టీ పేరు నమోదు చేయాలి. రాజకీయ పార్టీ నుంచి పొందిన అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్–బీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ సాయంత్రం 3 గంటల లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి» రిజర్వ్ గుర్తు లేని రిజస్టర్డ్ రాజకీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎస్ఈసీ సూచించిన రిజర్వ్ కాని (ఫ్రీ) చిహ్నాల జాబితా నుంచి ప్రాధాన్యతా క్రమంలో మూడు చిహ్నాలను ఎంపిక చేసుకుని నామినేషన్ పత్రంలో సూచించాలి నామినేషన్ ఫారానికి జత చేయాల్సిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీ హోదాకు సంబంధించిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రిజర్వ్ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారం (అనుబంధం–3తో సంబంధిత కులం, తెగ, తరగతికి చెందినవారిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.» ఎస్సీ, ఎస్టీ, బీసీఅభ్యర్థులు పోటీకి డిపాజిట్ చేసే మొత్తంలో రాయితీకి అర్హులు» రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు తాను స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఫారమ్–5లో ప్రచురించాలి. -
నేడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీపై అప్పటికప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో గురువారం.. తొలిదశలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మొత్తం 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహాయించి) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాలతో అధికారులు ఇప్పటికే గెజిట్ విడుదల చేశారు. ఒక్కో దశకు ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నోటీసులు జారీ చేసిన రోజు కలిపితే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడురోజుల పాటు అవకాశం ఉంటుంది. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, గురువారం ఉదయం నుంచి నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ కూడా పూర్తిచేశామన్నారు. 5 దశల్లో స్థానిక సమరం మొత్తం అయిదు దశల్లో జరిగే మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను..తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న) జరగనున్నాయి. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు..సర్పంచ్, వార్డు సభ్యులకు (మొదటి దశ అక్టోబర్ 31న, రెండోదశ నవంబర్ 4న, మూడోదశ నవంబర్ 8న ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న మొదటి దశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ నవంబర్ 11న (రెండు దఫాలకు కలిపి) జరగనుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఎప్పటికప్పుడు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులకారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలరే, వీటిలోని 16 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. నోటిఫికేషన్లకు ఏర్పాట్లు పూర్తి 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ల జారీకి జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల జారీ, నామినేషన్లు స్వీకరణ, ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు.. జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
ఢిల్లీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యమైన నగర ప్రాంత నియోజకవర్గాలలో ఒకటి. నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలుచుకుంది. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ మాత్రం నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. -
‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రబాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పై ప్రభుత్వం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానం పై జరిగింది. కోర్టులో అఫిడవిట్లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం..ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి’అని పొన్నం కోరారు. ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం -
రాహుల్.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం.. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు వాళ్లు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్ చేశారు.గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ.. బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు.రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్-1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాము. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. గ్రూప్-1 పరీక్షపై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ను కలుస్తాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారు.త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి మళ్లీ గ్రూప్-1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
సోషల్ వార్.. పొలిటికల్ పోరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి.ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెస్ర్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనా్రస్తాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి.ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పారీ్టకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిరి్వరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పారీ్టలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. -
ముగిసిన వివాదం.. అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు. సమస్య ముగిసింది: అడ్లూరిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు. టీపీసీసీ కీలక వ్యాఖ్యలు.. అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. -
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్లో నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్