-
నువు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్
సాక్షి,నారాయణపేటజిల్లా:ఏడాదిగా కొడంగల్లో దుర్యోధనుడి పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సోమవారం(ఫిబ్రవరి10) కోస్గిలో జరిగిన బీఆర్ఎస్ ‘రైతుదీక్ష’లో కేటీఆర్ మాట్లాడారు.‘ఇక్కడ కురుక్షేత్ర యుద్దం సాగుతోంది. 14 నెలలుగా రేవంత్రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడు.అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది. గిరిజనులు తలచుకుంటే రేవంత్రెడ్డి కొడంగల్లో మళ్లీ గెలవడు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి కొడంగల్లో పోటీ చేసి గెలువు.ఇక్కడ మా పార్టీ అభ్యర్దికి 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’అని కేటీఆర్ సవాల్ చేశారు.రైతుదీక్షలో కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రంలో 25 శాతం మంది రైతులకు కూడ రుణమాఫీ కాలేదుతమ హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు వేశాంఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 17 వేల 500 రూపాయలు బాకీ ఉందిఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్ది నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంఇక్కడి కంది రైతుల దాన్యం కొనుగోలు చేయలేని దుస్దితి నెలకొందిరాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్దాయిలో రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాలగచర్లలో భూములకు ఒక్కో ఎకరానికి నీవు ఇచ్చే 20 లక్షలకు అదనంగా పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం రేవంత్ రెడ్డి సొంత పొలాలు కంపెనీలకు ఇవ్వాలితెలంగాణలో ఎక్కడ రైతులకు,పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగినా మేం రక్షణగా ఉంటాంకొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కమీషన్ల కోసమే -
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్పొరేటర్లంతా పూర్తి సమయం కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, ప్రజలకు చేకూరే లబ్ధి, ప్రాజెక్టులు, నిధులను వివరించాలని కోరారు.జీహెచ్ఎంసీ మేయర్ పీఠం సాధిస్తే.. అనంతరం రాష్త్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీపై మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎలా వ్యవహరిస్తాయో చూసి.. దానికనుగుణంగా బీజేపీ వ్యూహం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలకలంబీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్రెడ్డి స్పందించారు. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. -
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ‘చలో కామారెడ్డి’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కులగణన పేరుతో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘కామారెడ్డి డిక్లరేషన్’లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అక్కడే ‘చలో కామారెడ్డి’ పేరిట భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. సుమారు 500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో చలో కామారెడ్డి సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వారం రోజులపాటు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ సభకు అంతరాయం కలగకుండా చలో కామారెడ్డి సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గిలో రైతుల సభలో పాల్గొననున్నారు. కులగణన నివేదిక ఒక చిత్తు కాగితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. పార్టీ బీసీ నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసర్వే చేసి కులాలవారీగా కచ్చితమైన లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. కులగణన నివేదిక చిత్తుకాగితంతో సమానమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇండ్ల కేటాయింపులు, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని ఎంబీసీలు, బీసీలు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన సర్వేను చిత్తు కాగితంతో సమానమని తగులబెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. బిల్లు తేలేదు కానీ.. సొల్లు మాత్రం చెప్పారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల వారీగా ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. -
దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలు, హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు కలసి పోరాడాలన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’సదస్సులో ‘తెలంగాణ రైజింగ్, దక్షిణాది రాష్ట్రాలెందుకు కలసి పనిచేయాల’నే అంశాలపై ప్రసంగించారు. ‘‘ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కారణంగా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందుకు కేంద్ర పెద్దలు దక్షిణాదిని శిక్షిస్తున్నారా? కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన తోడ్పాటు ఇవ్వడం లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది..’’అని రేవంత్ ఆరోపించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణతెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని రేవంత్ చెప్పారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ జీడీపీని 2035 సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ను న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, మూసీ పునరుజ్జీవం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశానికి డేటా సెంటర్, పంప్డ్ స్టోరేజీ హబ్గా తెలంగాణ నిలవబోతోందన్నారు. దేశంలోని నాలుగు దిక్కులకు అనుసంధానమై దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణను దేశానికి లాజిస్టిక్ సెంటర్గా నిలపాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోందిసదస్సులో భాగంగా మాతృభూమి ఎడిటర్ మనోజ్.కె.దాస్తో పాటు పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే..⇒ ‘‘ఎన్నికల్లో జాతీయ నేతలను రంగంలోకి దింపితేనే పెద్ద మొత్తంలో ఓట్లు వస్తాయి. ‘రేవంత్రెడ్డికి ఓట్లేయండి’ అని అడిగితే.. ఆయన రెడ్డి, అగ్రకులం అంటారు. బీసీలు, ఎస్సీలంటూ రకరకాల విభేదాలు సృష్టిస్తారు. జాతీయ నాయకత్వం పేరు చెప్పి ఓట్లు అడిగితే ఈ భావనలు రావు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో అయినా బీజేపీ నరేంద్ర మోదీని చూపించే ఓట్లు అడుగుతుంది. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, మోదీకి ఏం సంబంధం? కాంగ్రెస్ ఆ లింకు మిస్సవుతోందనేది నా పరిశీలన. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాలి. ⇒ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. దక్షిణాది ప్రజలు ఏవిధంగానైనా పోరాడేందుకు ఏకం కావాలి. తప్పనిసరైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా. ⇒ కేజ్రీవాల్ హరియాణాలో కాంగ్రెస్ను దెబ్బతీశారు. ఇది ఆయనకు ఢిల్లీ ఎన్నికల్లో ప్రతికూలమైంది. అంతిమంగా బీజేపీ లాభపడింది. ఈ విషయంలో ఇండియా కూటమి ఆలోచించాలి.⇒ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నియోజకవర్గాలను పెంచాల్సి వస్తే ప్రస్తుతమున్న సీట్ల ప్రకారమే.. ప్రతి రాష్ట్రంలోనూ 50శాతం సీట్లు పెంచాలని ప్రధాని మోదీని కోరాను.⇒ ఒక దేశం–ఒక ఎన్నికను మేం అంగీకరించబోం. జాతీయ స్థాయి ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరు. రాష్ట్రాల ప్రాథమిక హక్కులను హరించలేరు. రాష్ట్రాలన్నింటినీ మోదీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలనుకుంటున్నారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అని రాజ్యాంగం నిర్ణయించింది. కానీ మోదీ మాత్రం అంతా కేంద్రం చేతుల్లోనే ఉండాలంటున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా పసిగట్టడం లేదు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఒక దేశం ఒక ఎన్నిక వంటి అంశాల్లో ప్రజా ఉద్యమం అవసరం.⇒ కేరళ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై పనిచేస్తోందే తప్ప అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించడం లేదు. కేరళకు అనేక అవకాశాలున్నాయి. పర్యాటకం, ఎనర్జీ, పెట్టుబడులపై పాలసీలు రూపొందించుకోవాలి.⇒ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదనేది బీజేపీ, నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన భావన మాత్రమే. ఆ వర్సిటీ అనేక అపోహలను సృష్టిస్తోంది. ఆ మాయాజాలంలో పడొద్దు.’’ -
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్రావు మండిపడ్డారు. -
‘కులగణన నివేదిక చిత్తు పేపర్’
సాక్షి,తెలంగాణ భవన్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక ఓ చిత్తు పేపర్తో సమానమాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ బేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులగణన తప్పుల తడక,కులగణన నివేదిక చిత్తు పేపర్.కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదు. బలహీన వర్గాలను చాలా స్వల్పంగా చూపించారు. కులగణన సర్వే శాస్త్రీయంగా చేయాలి. కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. దున్నపోతుమీద వాన పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైందీ?15 నెలల్లో 15పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు. కులగణనపై రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెప్పొద్దు. బీసీ డిక్లరేషన్లో 42శాతం రిజర్వేషన్ అన్నారు ఏమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం సొల్లు మాటలు చెప్పడం మానాలి. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది.కేసీఆర్ ఎప్పుడో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా టిక్కెట్లు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు రెండు టిక్కెట్లు ఇస్తామని చెప్పి కేవలం 19 మాత్రమే ఇచ్చింది. అందులో పాతబస్తీలో 5 సీట్లు ఇచ్చారు.రాహుల్ గాంధీ,మోదీ కూర్చుని చాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది.రేపటి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీసీల భావజాల వ్యాప్తిలో భాగంగా కార్యక్రమాలు ఉంటాయి. కేసీఆర్,కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.మాపై నెపం నెట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
60 లక్షల మందిని ఏం చేశారు?: బండి సంజయ్
సాక్షి,నల్గొండజిల్లా:తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి9) నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.‘దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులే కరువైంది తెలంగాణలో మాత్రమే.కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్,హరీష్ రావు జైలుకి పోతారని అన్నారు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు,ఫాంహౌస్ కేసులో జైలు అన్నారు ఏమైంది.ఈ ఫార్ములా కేసులో సుప్రీం కోర్టు చెప్పినా ఎందుకు విచారణ ఆగింది.నిరుద్యోగ భృతి నాలుగువేలు ఏమైంది. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 56 వేల అప్పు ఉంది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు.స్కూళ్లలో చాక్పీసులు కొనుగోలుకు నిధులు లేవు. విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్,భగత్ సింగ్,ఆజాద్ వీర్ సావర్కార్ను తయారు చేయాలని అనుకుంటోంది.రేవంత్ సర్కార్ చండ్ర పుల్లారెడ్డి లాంటి నక్సలైట్లను తయారు చేయాలనుకుంటోంది. 317 జీవోపై కొట్లాడి జైలుకు పోయింది మేమే. కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ సకల జనులసర్వే చేయించి రిపోర్ట్ను సంకలో పెట్టుకున్నాడు.కేసీఆర్ సర్వేలో బీసీల శాతం 51 ఉంటే రేవంత్ సర్వేలో 46 శాతం వచ్చింది.కుల గణనే ఒక బోగస్.తెలంగాణలో ఓటర్లు 3.34 కోట్లు ఉంటే జనాభా 3.7 కోట్లు ఉండటం ఏంటి. తెలంగాణలో 4.3 కోట్లు జనాభా ఉండాల్సి ఉంది.మిగతా 60 లక్షల మందిని కాంగ్రెస్ హత్య చేసిందా? ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ముప్పై మంది బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లీంలు గెలిచారు.బీసీ సంఘాలు ఎటుపోయాయి. తెలంగాణలో హిందువులు అడుక్కోవాలా. రేవంత్ రెడ్డి గ్యాంగ్,ఓవైసీ కుటుంబం హిందువులను రాచిరంపాన పెడుతున్నారు’ అని బండి సంజయ్ ఫైరయ్యారు. -
‘బీసీ కులగణనలో ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదు’
మహబూబ్నగర్ దేశంలో కాంగ్రేస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని,ప్రతిపక్ష నేతగా రాహూల్ గాంధీ విఫలమయ్యారని మహబూబ్ నగర్ ఎంపీ,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు డీకే అరుణ.ప్రదాని మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలో ప్రజలు బీజేపీని గెలిపించారని పొగిడిన డీకే అరుణ.. మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఎండగెట్టారని విమర్శించారు.స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్దికోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకోమాట చెబుతుందని,రుణమాఫీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమయ్యిందని,కాంగ్రెస్ ఆరు గ్యాంరెంటీలు అటకెక్కాయని ఆమె విమర్శించారు.ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్ర నిధులు ఇవ్వదని,ప్రధాని ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే కేంద్రం నిధులు ఎందుకిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయలేక స్ధానిక సంస్దల ఎన్నికలపై ప్రభుత్వం హాడావిడి చేస్తోందని ఈఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,బీజేపీని బలపరచాలని పిలుపు నిచ్చారు. బీసీ కులగణనకు బీజేపీగాని,కేంద్రం గాని వ్యతిరేకం కాదని.చేసిన సర్వేలో చిత్తశుద్ది లోపించిందని లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని డీకే అరుణ అన్నారు. -
Hyderabad: మిత్రులెవరో.. ప్రత్యర్థులెవరో?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతివ్వనుంది? ఏ పార్టీ ఎవరితో విభేదించనుంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవలి కాలంలో రాజకీయ పారీ్టల్లో చేటుచేసుకున్న పరిణామాలు. ప్రస్తుత పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికలు పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. రెండు పార్టీలకు పాలకమండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణనలోకి తీసుకొని స్టాండింగ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకుగాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు పోటీ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్– ఎంఐఎం పరస్పర సహకారంతో పని చేసినందున ఆ రెండు పార్టీల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతూ వచ్చారు. ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీకి సైతం ఏ రెండు పార్టీలైతే పరస్పర అవగాహనతో పని చేస్తాయో ఆ పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఎంఐఎం మద్దతు ఎవరికి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్తో జత కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎంఐఎం–కాంగ్రెస్ల మధ్య నెలకొన్న అనుబంధం తెలిసిందే. ఆ రెండు పారీ్టలే పరస్పర సహకారంతో పోటీ చేస్తాయనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి. అదే జరిగితే గతంలో బీఆర్ఎస్ పొందిన స్టాండింగ్ కమిటీ స్థానాలు ఈసారి కాంగ్రెస్కు దక్కుతాయి. లేదా బలాల దృష్ట్యా కాంగ్రెస్ కంటే ఎంఐఎంకు ఎక్కువ మంది సభ్యులున్నందున బలాల దామాషాకు అనుగుణంగా రెండు పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పొత్తు లేకుండా పోటీ జరిగితే? అలా కాకుండా పొత్తు లేకుండా వేటికవే విడివిడిగా పోటీచేస్తే ఎక్కువ సభ్యులున్న పారీ్టకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉన్నా, సీక్రెట్ బ్యాలెట్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఏ పారీ్టకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పే పరిస్థితి లేదు. పార్టీలతో పాటు, పార్టీల కతీతంగా కార్పొరేటర్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు, మద్దతు తదితరమైనవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. బల్దియాలో ఇప్పటి వరకు ఎంఐఎం లేకుండా.. ఏ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్న చరిత్ర లేదు. ఎంఐఎంయేతర పారీ్టల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయాలే ఉన్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ పార్టీ దేనితోనైనా లోపాయికారీ మద్దతు పొందవచ్చనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జనరల్బాడీ సమావేశం ఇందుకు ఉదాహరణ. సభ జరగడానికి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్.. ‘మా పార్టీ బలమే ఎక్కువ. మా వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభ జరపగలరా’ అన్నారు. కానీ.. కారణమేదైనా సభలో బీఆర్ఎస్ మాత్రమే లేకుండా బడ్జెట్, సాధారణ సమావేశాలు జరగడం తెలిసిందే. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లున్నా.. బీఆర్ఎస్కు అందరి కంటే ఎక్కువ సీట్లున్నా పారీ్టల మధ్య పరస్పర సహకారం లేకుంటేనే దానికి ఉపకరిస్తుంది. లేని పక్షంలో ఏ రెండు పారీ్టలైతే జత కడతాయో ఆ రెండు పారీ్టల సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఏం జరగనుందన్నది నామినేషన్లు ముగిసే లోగా స్పష్టత రానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. పోటీ జరుగుతుందా, ఏకగ్రీవమవుతుందా? అన్నది ఉపసంహరణలు ముగిసే 21వ తేదీన వెల్లడి కానుంది. బీజేపీ కార్పొరేటర్లతో నేడు కిషన్ రెడ్డి భేటీ జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు.అవే కీలకం మొత్తం 150 మంది కార్పొరేటర్లకుగాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మరణంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి పోటీ చేసేందుకు, ఓట్లు వేసేందుకూ అర్హులు. ఈ బలం దృష్ట్యా బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలెక్కువ. తర్వాత ఎంఐఎంకు అయినప్పటికీ.. అంతర్గతంగానైనా, బహిరంగంగానైనా ఎత్తులు, పొత్తులు, జిత్తులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. -
అన్ని సీట్లూ గెలవాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) సీట్లనూ గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ఎంపీస్థాయి నేతలు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి, అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, రేవంత్రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించింది. శనివారం ఓ స్టార్ హోటల్లో తొలుత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఆ తర్వాత రాష్ట్రపదాధికారులతో జరిగిన కీలక సమావేశాల్లో.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్– నిజామాబాద్– మెదక్– ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డిలను రాష్ట్ర నాయకత్వం పరిచయం చేసింది. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ బలం పెరిగింది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది’అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ప్రతిఒక్కరూ చైతన్యంతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, పొంగులేటి సుధాకరరెడ్డి, పారీ్టనేతలు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, డా.ప్రకాశ్రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతలు కనిపిస్తే.. జనం కొట్టేలా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునే వారు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం వేర్వేరుగా జరిగిన సిర్పూర్ కాగజ్నగర్,వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏడాది లోపే కాంగ్రెస్ దగాకోరు విధానాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని.. రేవంత్రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని ఆరోపించారు. రేవంత్ ఐరన్ లెగ్ సీఎం.. ‘‘ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకువచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించి ఢిల్లీలో ముగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ, ప్రధాని మోదీకి అతిపెద్ద కార్యకర్తలా పనిచేస్తున్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది చొప్పున గెలిచినా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది శూన్యం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క బీజేపీ ఎంపీ నోరు మెదపలేదేమని ప్రశ్నించారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కేంద్రాన్ని నిలదీసేవారని చెప్పారు. మోసగాళ్లంతా వెళ్లిపోయారు ‘‘మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వడానికి వణికిపోతున్నారు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో పేదల సంక్షేమం కోసం అనేక మంచి పనులు చేసిన కేసీఆర్.. సూర్యుడి తరహాలో కొంతకాలం మబ్బుల చాటుకు వెళ్లారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తమతో కలసి పనిచేసేందుకు అధికార పార్టీ ఆహ్వానాన్ని పక్కనపెట్టి మరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. చిన్న చిన్న తప్పుల వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని పేర్కొన్నారు. మరో పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. గెలిచే అభ్యర్థులకు అవకాశాలు ఇస్తామని, కలసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నేడు బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల భేటీ రాష్ట్రంలో కులగణన లోటుపాట్లను ఎత్తిచూపడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ ఆదివారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కలిపి సుమారు 500 మందికిపైగా ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ బీసీ నేతల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీని గెలిపించిన రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్’’అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. -
‘తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలో రాదన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహేష్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఫలితాలను చూసి తెలంగాణ బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరగదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మా పార్టీకి రక్ష. ఇచ్చిన 6 గ్యారంటీలని అమ్మడు పరుస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిది కాంగ్రెస్. ఈ సంక్షేమ పథకాలే మళ్లీ కాంగ్రెస్ను ెగెలిపిస్తాయి. కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉంది.బిజెపిని అభినందించలేక లోలోపల మునిసిపోతున్నాడు. కేసీఆర్, కేటీఆర్ శకం.. ఈ రాష్ట్రంలో ముగస్తుంది. దేశవ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది, తిరిగి అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
‘ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు’
హైదరాబాద్: ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు.అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి -
కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడిందని,రాజకీయాల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రివాల్ మారారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కిషన్రెడ్డి శనివారం(ఫిబ్రవరి8) మీడియాతో మాట్లాడారు.‘ప్రజల తీర్పుతో కేజ్రీవాల్ నెత్తికి ఎక్కిన అహంకారం దిగింది. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే రాహుల్,కేసిఆర్,కేజ్రివాల్ ఎవరైనా ఓటమి చెందక తప్పదు. ఢిల్లీలో కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోంది. రాహుల్ నాయకత్వం చేపట్టాక వారికి వచ్చిన ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కించడమే సాధ్యమవుతుంది. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్,డబుల్ డక్ కొట్టింది. ఢిల్లీ తీర్పుతో కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నిందితుడని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చింది.కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం.ఆప్ ఓటమిలో ప్రధాన పాత్ర లిక్కర్ స్కామ్దే.తెలంగాణలో రేవంత్రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారో కేటీఆర్ చెప్పాలి.అన్న హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రివాల్ కలుపు మొక్క’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
బీఆర్ఎస్ వల్లే ‘ఆప్’ ఓటమి: కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు. ‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం -
‘మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy)పై మరోసారి ధ్వజమెతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీ పోయి కాంగ్రెస్కు గుండుసున్న తీసుకొచ్చిండని విమర్శించారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని రేవంత్ ప్రారంభించి.. ఢిల్లీలో ముగించాడని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ దాన్ని కొనసాగిస్తారని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.‘రాహుల్ గాంధీ (Rahul Gandhi)దేశంలో బీజేపీని గెలిపించి వస్తున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్గాంధీనే. కాంగ్రెస్ను ఓటేస్తే రైతుబంధుకు చరమగీతం అని కేసీఆర్ ముందే చెప్పారు. ఆయన హెచ్చరించినట్లే జరగింది. తెలంగాణ ప్రజల తిడుతున్నతిట్టు రేవంత్ వింటే తట్టుకోలేడు. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకివ్వడానికి వణికిపోతున్నాడు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్ బాల్ ఆడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. -
కొడంగల్లో కేటీఆర్ ‘రైతు దీక్ష’: పట్నం నరేందర్రెడ్డి
సాక్షి,నారాయణపేటజిల్లా: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈనెల 10వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.‘సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జనవరి 26 తేదీ నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తానంటూ ప్రజలను మోసం చేశాడు. కేవలం మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా వేశారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తమైంది. హామీలు నెరవేర్చాలంటూ కోస్గిలో నిర్వహించబోయే రైతు దీక్షను విజయవంతం చేయాలి’అని నరేందర్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్కు ‘గాడిద గుడ్డు’ మిగిలింది: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం(ఫిబ్రవరి8) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.రాహుల్గాంధీ, రేవంత్లు కలిసి ఢిల్లీలో బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక నుంచి ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలని సూచించారు. -
‘ఆప్’ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను ప్రజలు దూరంగా పెట్టారు. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. భారీ విజయం అందుకునే దిశగా వెళ్తున్నాం.తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఫలితమే రిపీట్ అవుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే’ అని చెప్పుకొచ్చారు. -
ఎటూ తేలని బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి(BJP State new President) ఎన్నిక ఎటూ తేలడం లేదు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శనివారం ఇక్కడకు రావాల్సిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్(Sunil Bansal) పర్యటన వాయిదా పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనుండగా, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో బన్సల్ను ఢిల్లీలోనే ఉండాలని జాతీయ నాయకత్వం సూచించినట్టు సమాచారం. పార్టీకి సంబంధించి రాష్ట్రాన్ని 38 సంస్థాగత జిల్లాలుగా బీజేపీ విభజించింది.వాటిలో 19 జిల్లాలకు అంటే సగం జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేశాక తదుపరి కార్యాచరణను చేపట్టనున్నారు. అయితే తొలుత జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నుంచి బన్సల్ అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకులు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే అధ్యక్షుడి నియామకానికి సంబంధించి మరోసారి రాష్ట్ర నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఈమె నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు అందాక, రాష్ట్ర అధ్యక్షుడి పేరును జాతీయ నాయకత్వం ప్రకటిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సైద్ధాంతిక నేపథ్యమా లేక ప్రజల్లో గుర్తింపా? రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం బీజేపీలో పాత–కొత్త నేతల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న, బలమైన సైద్ధాంతిక నేపథ్యమున్న వారికే అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని పాత నాయకులు కోరుతున్నారు. ఇటీవల కొందరు నాయకులు ఢిల్లీ కూడా వెళ్లి మరోసారి జాతీయ నేతలకు ఈ విషయం విన్నవించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించి, వచ్చే ఎన్నికల్లో అధికారం లోనికి రావాలంటే ప్రజల గుర్తింపుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వారికి అవకాశం కల్పించాలని ఇటీవలి మూడు, నాలుగేళ్ల కాలంలో పార్టీలో చేరిన కొత్త నాయకులు గట్టిగా కోరుతున్నారు.జాతీయ నాయకత్వం సైతం ఈసారి కొత్త వారికి అవకాశం కల్పింస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు జరుపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పాత వారికి అవకాశం కల్పిస్తే, తమకు ఆ పదవిని ఇవ్వాలని కోరుతున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, ఇతర నేతలున్నారు. ఇంకోవైపు నుంచి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, అరి్వంద్ ధర్మపురి, ఎం.రఘునందన్ రావు, ఇతర నాయకులు తమను అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. సామాజిక సమతూకంపై భరోసా ఇప్పటివరకు నియమించిన 19 జిల్లాల అధ్యక్షుల్లో సామాజిక సమీకరణలు సరిగా పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మహిళలకు ఒక్కరికి కూడా అవకాశం లభించకపోగా, బీసీల్లోని కొన్ని కులాలను ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోలేదని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే మిగిలిన 19 జిల్లాల అధ్యక్షుల నియామకం తర్వాత సామాజిక సమతుల్యత నెరవేరుతుందని, మొత్తంగా జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత లభిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.నేడు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై భేటీశనివారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై బీజేపీ కీలక భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు. -
‘వారి సర్వే ఇంటికే పరిమితమైంది.. బయటకు వివరాలు వెల్లడించలేదు’
సిద్దిపేట జిల్లా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Household Survey) ఇంటికే పరిమితమైందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు బయటకు వెల్లడించలేదన్న పొన్నం.. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ాకార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ాపాల్గొన్నారు.‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే(Caste Census Survey)లో కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు పాల్గొనలేదు. వీళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు, కులగణన సర్వే చేపట్టాలి. మా సర్వేలో బీసీల లెక్క తేలింది.. మా ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలి.సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
ఇప్పట్లో లేనట్టేనా?.. కేబినెట్ విస్తరణపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు రావాలని ఖర్గేను ఆహ్వానించారు.కాగా, నిన్న (గురువారం) హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం. -
దరఖాస్తుల పేరిట సర్కారు దగా
సాక్షి, హైదరాబాద్/చిన్నకోడూరు (సిద్దిపేట): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదేపదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభయ హస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు.ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హరీశ్రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. కాగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి ప్రజలను భూ నిర్వాసితులుగా గుర్తించి ఆదుకోవాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్కు హరీశ్రావు గురువారం లేఖ రాశారు.