breaking news
-
ఓరుగల్లు ‘కాంగ్రెస్ లొల్లి’లో నేడు కీలక పరిణామం
వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల ఎపిసోడ్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నేడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అటు ఓరుగల్లులో.. ఇటు గాంధీ భవన్ వద్ద రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి హైదరాబాద్కు బయల్దేరారు. సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో గాంధీ భవన్కు బయల్దేరినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరు కానున్నారు. ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. దీంతో నేటి పరిణామలపై ఉత్కంఠ నెలకొంది.ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా.. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే ఈలోపే అధిష్టానం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. -
‘నేను కదా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ములాఖత్ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. -
ముఖ్యమంత్రి స్థానంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ కూతురు మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించారు.తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కోసం ఇప్పటకే తన అప్పీల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచారు. వచ్చే తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావాలనే టార్గెట్తో నేను పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ దిగిపోయాక.. నేను ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నిస్తాను. ప్రజల దగ్గర అప్లికేషన్ పెడతాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్తోనే నడిచింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాప్ అయిందని చాలా సార్లు చెప్పారు.. పోలీసులే మాకు చెప్పేవారు. గత పదేళ్లు బీఆర్ఎస్.. పరిపాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ మీదే పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్యాపింగ్తోనే పరిపాలన చేశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు రికార్డు చేశారు.కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. కవిత ఓవరాక్షన్ చేస్తున్నారు.. అంత అవసరం లేదు. కేసీఆర్ కూతురు మినహా మీకు ఉన్న అర్హత ఏంటి. కేసీఆర్, కేటీఆర్ రిజెక్ట్ చేసినా పొలిటికల్ ఇమేజ్ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ స్థాయి ఒక్కటే. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే ఆర్థం ఉంది.. కవిత స్థాయి ఏంటి?. కవిత ఒక మాఫియా డాన్ అయిపోయింది. ఆమె వల్ల కేజ్రీవాల్, సిసోడియా ఖతమైపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు 5,6 నెలలకు వేసేవారు. మా ప్రభుత్వంలో 9 రోజుల్లోనే 9వేల కోట్లు జమ చేసాం. వారు చేయలేని పని కాంగ్రెస్ చేసిందనే అసూయతో హరీష్ రావు మాపై విమర్శలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.‘‘అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు.‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్లపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
సాక్షి,హైదరాబాద్: లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే తమ భాగస్వామితో కలిసి జీవిస్తున్నారు. దీనిని లివింగ్ రిలేషన్ షిప్ అని అంటారు.తాజాగా, ఈ లివింగ్ రిలేషన్ షిప్పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లివింగ్ రిలేషన్ షిప్ వల్లే ప్రేమ హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ వీహెచ్ మీడియాతో మాట్లాడారు.‘హై టెక్ సిటీలో కొలివింగ్ను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నా. ఒకే హాస్టల్లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు.హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలి. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం వీటి మీద దృష్టి పెట్టాలి. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి. ఇప్పుడు సొంత భర్తను, కూతురు తల్లిని చంపడం అనేది దారుణం. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుతున్నాయి. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్. సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుంది.నక్షలైట్ల హత్యల విషయంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతారు. ప్రేమ హత్యలపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇలాంటి ప్రేమ హత్యల్ని హ్యూమన్ రైట్స్ టేక్ అప్ చేయాలి. సైకాలజిస్టులు, ఇంటలెక్చవల్స్ ఆలోచన చేయాలి. ఎక్కడో తప్పు జరుగుతుందో తెలుసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. -
మోదీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీపై మాట్లాడాలి: డీకే అరుణ
సాక్షి, నల్లగొండ: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్కు లేదు అని ఎద్దేవా చేశారు.నల్లగొండలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి అందరికీ తెలియాలి. ఆర్టికల్-352ను ఇందిరా గాంధీ దుర్వినియోగం చేశారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. ఎంతో మంది ప్రతిపక్ష నేతలను, లక్షల మందిని జైలుకు పంపించారు. కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ నేతలను జైళ్లలో వేసి హింసించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.విదేశాల్లో దేశం, ప్రధాని మోదీ గురించి అవహేళనగా మాట్లాడటం రాహుల్ అవివేకం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏంటో చూపించాం. ప్రధానిని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్కు లేదు. రైతు భరోసా పేరుతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా రాలేదు. ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ నాయకులందరూ బాధితులే. ఫోన్ ట్యాపింగ్పై ఇంత వరకు ఎందుకు చర్యలు లేవు?. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. -
2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. ‘1994–2004 వరకు పదేళ్లు టీడీపీ, 2004–2014 వరకు పదేళ్లు కాంగ్రెస్, 2014–23 వరకు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇక 2023–33 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా. పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకునే బాధ్యత నాది.మీరు భవిష్యత్తు నాయకులను తయారు చేయండి..’అని సీఎం కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలిచ్చే కార్యక్రమం మంగళవారం గాం«దీభవన్లో జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీ పదవులు పొందిన వారికి అభినందనలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పదవులకు న్యాయం చేయాలి..లేదంటే తప్పిస్తారు ‘పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వంలో మీరూ భాగస్వాములవుతారు. రాజకీయంగా ఎదగడానికి ఈ పదవులు, వేదికలే ఉపయోగపడతాయి. ప్రభుత్వ బాధ్యతల కంటే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వేలాది మంది పోటీ పడినా ఈ పదవులు మీకే దక్కినందుకు వాటికి న్యాయం చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు అంగీకరించలేదు. అంగీకరించి బాధ్యతలు తీసుకున్నవారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయినంత మాత్రాన ఇక రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అవుతుందని అనుకోవద్దు. మీరు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే రాజకీయంగా ముందుకెళతారు. లేదంటే ఎన్నికల ముందు తప్పిస్తారు..’అని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో చాలా అవకాశాలు ‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి, కష్టపడి కార్యకర్తలను గెలిపించిన వారికి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా పరిణామాలు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. 2029లో మీలో చాలామందికి అవకాశాలు వస్తాయి. అప్పటికల్లా సిద్ధంగా ఉండండి..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలా చేస్తే పార్టీకి తిరుగుండదు: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కా లంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్క సంక్షేమ పథకాల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నేతలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అవును..అంతా అక్క కష్టమే..జగ్గారెడ్డి దంపతులపై సీఎం చలోక్తి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క, మహేశ్గౌడ్, సంపత్కుమార్, షబ్బీర్ అలీ, నాయిని రాజేందర్రెడ్డిలు పార్టీలో ఎలా ఎదిగారో సీఎం వివరించారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డికి కీలకమైన టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. జగ్గారెడ్డి అందులో తనదేమీ లేదని అనడంతో.. ‘అవును.. నిర్మలక్కకు పదవి రావడంలో జగ్గారెడ్డికి సంబంధం లేదు. ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కష్టపడ్డారు.. అందుకే పెద్ద కార్పొరేషన్కు చైర్మన్ అయ్యారు. అంతా అక్క కష్టమే..’అంటూ సీఎం చలోక్తి విసిరారు. -
చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్ విసిరారు. ‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. కేసీఆర్ సూచనలతో హరీశ్రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్ మాట్లాడారు. నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం ‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 2018లో వ్యాప్కోస్ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ‘బీఆర్ఎస్ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్ అన్నారు. మీకు ఫామ్హౌస్లు ఎట్లా వచ్చినయ్? ‘కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్లో హరీశ్రావుకు, జన్వాడలో కేటీఆర్కు, గజ్వేల్లో కేసీఆర్కు ఫామ్హౌస్లు ఎట్లా వచ్చినయ్? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా తొలి ప్రాధాన్యత రైతులే ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. కేసీఆర్ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్ సీరియస్
హైదరాబాద్: ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంచార్జ్ మంత్రులకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్.. ఫండ్స్ను సైతం ఇంచార్జ్ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు.ఈరోజు(మంగళవారం, జూలై 24) పీసీసీ రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలo గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి.. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లు,జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. -
‘నిన్ను సాయంత్రంలోగా చంపేస్తాం’.. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
Jubilee Hills By Election: బరిపై మజ్లిస్ గురి!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ‘జూబ్లీహిల్స్’ అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెగ్మెంట్లలోని డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్ధానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీపడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో సత్సంబంధాలు కలిగి ఉన్నా.. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కావడంతో పోటీలో ఉండాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. స్నేహపూర్వకంగానే పోటీ ఇచ్చి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో ఆ పార్టీ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. నవీన్ యాదవ్ మజ్లిస్కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి సుమారు 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్.. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు మజ్లిస్ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ముస్లిం ఓటర్లు మూడో వంతుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రతినిత్యం స్థానిక సమస్యలపై పైదల్ దౌరా (పాదయాత్ర) నిర్వహిస్తుండటంతో ప్రజల్లో కూడా గట్టి పట్టు ఉంది. దీంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మజ్లిస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఉప ఎన్నికల బరిలో గెలుపు గుర్రాన్ని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.ఇటీవల పోటీ చేసిన షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ పెద్దగా ఓట్లు రాబట్టుకోక పోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తోంది. మజ్లిస్ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్తో పాటు దేవబంద్, ఢిల్లీ, షాహీన్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘పరిపాలన చేతకాక, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు’
హైదరాబాద్: ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే.. ఒక కుటుంబం బారినపడి బలి అయ్యిందని మండిపడ్డారు. అవినీతి పాలనతో, దోపిడితో,, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బ తీశారని ద్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా పని చేసిందో మనం చూశామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అప్పులు ఇచ్చే వారు లేరని, తనను నమ్మే వాడు లేడని సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశాడన్నారు. పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
పోలీసులపై కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వాఖ్యలు
సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే కొంతమంది పోలీసులు బల్లకింద చేయి చాచకుండా కథ నడవదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పోలీస్ వ్యవస్థపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సమాజంలో పోలీసులు చేస్తున్న అవినీతి దందాపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీస్ కూడా విధుల్లో ఉండరంటూ షాకింగ్ కామెంట్ చేశారాయన. ‘‘అలాంటి నాయకులకు పోలీసులే భయపడాలి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. బల్ల కింద చేయి చాచనిదే ఏ ఒక్క పోలీసుకూ రోజు గడవదు’’ అంటూ కొప్పుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం(జూన్ 22) తెలంగాణ భవన్ను ముట్టడించడానికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తెలంగాణ భవన్లోకి దూసుకుపోవడానికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం బినామీలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని నిన్న(శనివారం) వరంగల్లో కౌశిక్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను తెలంగాణ భవన్ వేదికగా బయటపెడతాననని కౌశిక్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్ పోయేది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని.. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క స్కాంలో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.‘‘కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారింది. నిజాయితీగా పదకొండేళ్ల నుంచి పాలన చేస్తోన్న మోదీ నుంచి అమిత్ షా అందరూ అదే చెప్పారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులే వందల కోట్లు సంపాదించుకున్నారు. ఈ అవినీతిపై విచారణను రేవంత్ సర్కార్ అధికారులకే పరిమితం చేయొద్దు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నీటి లభ్యత ఎందుకు కనిపించలేదు..?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.‘‘ఈ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో ప్రాజెక్టు కడితే.. ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం ఇజ్జత్ పోయేది. ఇంకా సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదు.. చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ. క్యాబినెట్లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించారో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు..?. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి. రేవంత్ సర్కార్ వచ్చాక వారు విచారణ చేయరు.. సీబీఐకి అప్పగించరు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్కు టచ్లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్ 26న అరెస్టు చేసింది. అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్న నూనె శ్రీధర్ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. నివేదిక రెండు నెలలు కోల్డ్ స్టోరేజీలో.. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. వీరిని కమిషన్ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్ కమిషన్ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్ చేసినట్టు గుర్తు చేస్తున్నారు. -
ఊహించని సాక్ష్యాలతో రేపు ప్రెస్మీట్ పెడతా: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి, వరంగల్: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట లభించింది. కాజీపేట రైల్వే కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆపై శనివారం రాత్రి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపడం కోసం నిన్నరాత్రి నుండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను Ak 47ను అవుతా. తెలంగాణలో మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. రేపు అందరి అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా. ఊహించిన సాక్ష్యాలతో రేపు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పెడతా అని కౌశిక్రెడ్డి అన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం కౌశిక్రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కు తరలించి.. తొలుత ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. తొలుత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఖమ్మం జైలుకు తరలించేందకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో.. రిమాండ్ రద్దు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.కేసు ఏంటంటే.. మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
పాడి కౌశిక్రెడ్డికి రిమాండ్ విధింపు.. ఖమ్మం జైలుకు తరలించే యోచన
సాక్షి, వరంగల్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy)కి కాజీపేట రైల్వే కోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనకు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు ఖమ్మం జైలుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించగా.. వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్ విధించింది.కేసు ఏంటంటే..మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.సుబేదారి పీఎస్ వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో స్టేషన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్పై కేసు పెట్టడం.. కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సిరిసిల్ల అడ్డగా ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావు కారణంగానే అరెస్ట్ అయ్యా’
సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు చాలామంది సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేశారు.పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025 -
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు. -
‘సీఎం కుర్చీలో రేవంత్ను చూడలేకపోతున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్రావుకు కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాళ్ల మామ కేసీఆర్ను హరీస్రావు విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్లు సంగతి పూర్తిగా అర్థమైంది. కేసీఆర్కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. హరీష్ వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు..గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరు?, హరీష్ రావుకి కంటెంట్ కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ. సీఎం కుర్చీలో రేవంత్ను బీఆర్ఎస్ నేతలుచూడలేకపోతున్నారు. నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైంది. బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారు’ అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు. -
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’
వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉండి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు నాయని. కొండా మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బీసీ కార్డు అడ్డుపెట్టుకుని మాట్లాడతామనడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలి. మనమే పార్టీకి నష్టం చేసుకుంటే ఎలా?, ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం’ అని నాయని స్పష్టం చేశారు. కొండా వ్యాఖ్యలపై కాంగ్రెస్లో ప్రకంపనలుకడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిల పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా వ్యాఖ్యలపై అధికార ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్