-
‘అద్భుతం అంటూ నమ్మించి.. ఇలా దోచుకుంటున్నారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. సజ్జల ఏమన్నారంటే.. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చిందిఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారుమావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుందిఅది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయిందిఅందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారుఅమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?ఇది చూసి జనం బిత్తరపోతున్నారుబిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయిందిఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనంఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోందిఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదుపాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారటబిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంటదానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదుట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చునగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారుఅమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారుదీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదుగతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదుప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదుఅమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారురెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారుదానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదుకానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదుఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారుమెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదురైతులకు మద్దతు ధర లేదుఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవుకానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారుఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారుఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారురాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందిపేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారుచంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారువారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారుమేము అలాంటి వాటిపై స్పందించంప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాంఅసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారుపూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందిఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పిందిఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమేఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారుఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరుచంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాంఆ శక్తి వైఎస్సార్సీపీకి ఉందితిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధదేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇదిదినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదునెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారుఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారుధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్రఅందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారుఅంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు -
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
లోకేశ్ తీరు... ఏపీకి చేటే!
అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చిన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. అందువల్లే లోకేశ్కు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం. హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్ అనగానే టీడీపీ కేడర్ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలపై నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల అరాచకశక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి మాట్లాడితే జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్ జవాబు ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్ అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే జిందాల్ కు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేక చంద్రబాబు కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీపై మీద అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇప్పుడు అదే గాత్రాన్ని లోకేశ్ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న ఆంగ్ల పదం అక్షరాలలో జి ఉందని, జి అంటే గూగుల్ అని ఆయన అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘16 ఏళ్లలో ఒక్క కాలనీ అయినా నిర్మించారా?’
తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్.. స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు. చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు. -
పూడి శ్రీహరికి ఊరట
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఊరట లభించింది. కుప్పం కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారంటూ ఆయన్ని కుప్పం పోలీసులు నిన్న వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులకు ఈయనే కారణమంటూ అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించి వేధించడం ప్రారంభించారు. ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ అయినట్లు కోర్టుకు చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆ వెంటనే న్యాయస్థానం శ్రీహరికి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
పూడి శ్రీహరిపై ఆగని వేధింపులు
చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూటమి ప్రభుత్వం వేధించడం ఆపడం లేదు. మళ్లీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించింది. అయితే ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించి వేధించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి.. తిరిగి కుప్పం పీఎస్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుప్పం కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. ‘బెంగళూరులో నిన్న ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు అన్నారు. -
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్కెచ్ ప్రకారమే దాడి.. వడ్డీతో చెల్లిస్తాం: ఉమాశంకర్
సాక్షి, విశాఖపట్నం: పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు.మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న వందల కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని? అని ప్రశ్నించారు. స్పీకర్గా ఉన్నాననే అయ్యన్న వన్సైడ్గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి వందల కోట్లు దోచుకుంటున్నారు.నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?. రైతులకు అన్యాయం జరుగుతుంటే కోర్టుకు వెళ్తే నేను హిందూ వ్యతిరేకినా?. కోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్తే మా పై దాడి చేశారు. ల్యాటిరైట్ మీద ఇప్పటి వరకు 400 కోట్లు సంపాదించారు. కొడుకుకు రాజ్యసభ సీటుకోసం అమరావతి నాయకుడుకు కోట్లాది రూపాయలు ఇస్తామని చెపుతున్నారు. రోలుగుంటలో క్వారీల దగ్గర అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు. కొడుకు ప్రమోషన్ కోసం ప్రభుత్వ చెరువులో సృష్టి క్షేత్రం కడుతున్నారు. దానికి నిధులు GMR నుంచి తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా.. సృష్టి క్షేత్రంలో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో అయ్యన్నకు తిరిగి ఇస్తాము. అయ్యన్న, కలెక్టర్, పోలీసుల మీద కోర్టుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.మరోవైపు.. నాయకులు కేకే రాజు మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పని చేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి సవాల్
నరసరావుపేట: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. జూలకంటి బ్రహ్మారెడ్డి చేసే అవినీతి అక్రమాలు, తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ‘జూలకంటి బ్రహ్మారెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఎవరో పిల్లలు గొడవపడి ఆయన కాన్వాయ్ పై సీసాలు వేస్తే అది వైఎస్సార్సీపీకి ఆపాదించడానికి జూలకంటి బ్రహ్మారెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. మా పార్టీకి ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదు. జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు మట్టి, లిక్కర్, గుట్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రింగు లీడర్ గా మారారు. మాచర్లలో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి అరాచకం చేస్తున్నాడు. జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం నాయకులే అసహ్యించుకుంటున్నారు. రెండేళ్లకే జూలకంటి బ్రహ్మారెడ్డి పనైపోయింది’ అని విమర్శించారు. -
కూటమి మొద్దు నిద్ర.. పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నేతల నిరసనలు
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ నిరసనలకు సిద్ధమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసలను పిలుపునిచ్చింది.వైఎస్సార్ జిల్లా..ఏపీలో ఇంధన, గ్యాస్ కొరతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.కేంద్ర పెట్రోల్, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఏపీలో ఏర్పడిన కృత్రిమ కొరత, దానికి గల కారణాలను వివరించిన ఎంపీవెంటనే కేంద్రం కల్పించుకుని ఇంధన, గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని లేఖఈ కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడి.అన్ని రాష్ట్రాల్లో గ్యాస్, ఇంధనాన్ని పూర్తి సామర్ధ్యంతో నిల్వ ఉంచాలని కేంద్రాన్ని కోరిన అవినాష్ రెడ్డి.ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని కోరిన ఎంపీఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీనే పెట్రోల్, డీజిల్ కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరతలేదు.ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. సరఫరాదారులతో కుమ్ముక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తోంది.కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టాలని కోరిన అవినాష్.ప్రజలకు కొరత లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి. కర్నూలు జిల్లా..పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఫైర్రాష్ట్రంలో చేతకాని పాలన నడుస్తోందంటూ తీవ్ర విమర్శలుపక్క రాష్ట్రంలో లేని ఇంధనం కొరత మన రాష్ట్రంలో ఉండటాన్ని చేతకానితనం కాదంటారా?సమృద్ధిగా అన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం ఉందని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహంఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్ళు తెరిచి చూసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్పత్తికొండలో పెట్రోల్ బంకులలో నో స్టాక్ పరిస్థితులపై పరిశీలించిన శ్రీదేవి.తిరుపతి జిల్లారైల్వే కోడూరులో పెట్రోల్ డీజిల్ ఇక్కట్లు..మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసనలువాహనదారులకు మద్దతుగా రానున్న రోజుల్లో భారీ నిరసనలు చేస్తామని ప్రకటనపశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెంలో బంకుల వద్ద రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన.పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు.కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడ..ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..కూటమికి ఓట్లు వేసిన వాళ్లను చంద్రబాబు మోసం చేశాడు..సామాన్యుడు బాధ పడుతున్నారు..రైతులు యూరియా కోసం, పింఛన్ కోసం వృద్ధులు, రేషన్ కోసం మహిళలు, గ్యాస్ కోసం క్యూలో ప్రజలు నిలబడుతున్నారుఓటమి ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళన చేస్తుంది..చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం..ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వలేక పోతుంది..చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది..ఈరోజు నేను ఆలోచించింది రేపు భారత్ ఆలోచిస్తుంది అని చంద్రబాబు చెపుతున్నాడు..మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు..జల్సా లకు, డబ్బా కొట్టు రాజకీయాలకు కూటమి నేతలు వున్నారు.పెట్రోల్ బంక్ వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజలు ఏ విధంగా బూతులు తిడతారో తెలుస్తుంది..జగన్ను చూసి పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలిచేతగానితనాన్ని పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలి..పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉంటేగా రేషన్ పద్దతి..రైతులు ఇబ్బందులు పడుతున్నారు..ఆటో వాళ్ళు, ట్రాక్టర్, రోజు వారి పనులు చేసుకొనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు..తాడేపల్లి..నేడు పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలురాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలుగత ఆరు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు కొరతఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కార్ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వాహనాలుకోత మిషన్లు రాక డెల్టాలో నిలిచిపోయిన వరి కోతలుడీజిల్ లేక 108 సేవలకూ ఆటంకాలుప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు దిగిన వైఎస్సార్సీపీ. -
నర్సీపట్నం ఘటనపై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నర్సీపట్నం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్పై జరిగిన దాడిని ఖండించారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. ‘హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు ఉమాశంకర్ గణేశ్పై దౌర్జన్యం చేశారు. ఉమాశంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో విఫలమైన శాంతిభద్రతలకు ఈ సంఘటన నిదర్శనం. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు నిజాన్ని అణచివేయలేవు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలి. దాడికి దిగిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. ఉమా శంకర్ గణేశ్కు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ అన్నారు. నర్సీపట్నం సృష్టి క్షేత్రంలో తవ్వకాలపై హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట అక్రమంగా పనులు జరుగుతున్నాయి. వాటిని మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ పరిశీలించి.. పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు. ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. ఆపై బరితెగించి ఆయనపై దాడి చేశారు. Tadepalli, April 27:Former Chief Minister and YSRCP President Y. S. Jagan Mohan Reddy strongly condemned the attack on former Narsipatnam MLA Petla Uma Shankar Ganesh in Narsipatnam In a statement released, YS Jagan Mohan Reddy stated that for merely questioning activity being… pic.twitter.com/9cTvqoGaGH— YSR Congress Party (@YSRCParty) April 27, 2026 -
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ తరపున హామీ ఇస్తున్నాం.ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్సీపీ పాలనే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు. -
‘రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. ఏబీఎన్ మూసివేత కోరుకుంటున్నారా?’
వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు సహా వినతి పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భూమన కామెంట్స్..తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ అక్రమ కేసులు పెట్టారురాధాకృష్ణ వైఎస్సార్సీపీపై ఉలుకు పలుకు రాతల్లో రాసిన రాతలు పట్ల సభ్య సమాజం తలదించుకుంటోదిఆయన క్షమాపణ చెప్పకుండా, విచ్చలవిడిగా రాష్ట్రం మీదకు వదిలేస్తున్నారుమాపై విషపు రాతలు రాసే వారికి ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందినేను నిజాయితీకి కట్టుబడి ఉన్నా అని సుద్దులు చెప్తున్న రాధాకృష్ణ..ఆయన మాటలపై ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదురాధాకృష్ణ వాడిన పద ప్రయోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాంవిశాఖ..విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు కామెంట్స్..రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపించలేదు.రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది..ప్రజా సమస్యలను డైవర్షన్ చేయడం కోసం చంద్రబాబు తన అద్దె మైక్లను తెరపైకి తెస్తున్నారు.మావిగన్ అంశాన్ని పక్కతోవ పట్టించడం కోసం రాధాకృష్ణతో తప్పుడు రాతలు రాయించారు.మహిళలను కించపరిచే విధంగా చెత్త పలుకులో రాతలు రాయించారు..సభ్య సమాజం తలదించుకునేలా రాధాకృష్ణ రాతలు రాశారు..రాధాకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సమన్వయంతో వ్యవహరించాము.రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు..పోలీసుల అధికారి పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారు..రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి..కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.పోలీసులు తీరుపై రాధాకృష్ణపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము.గుంటూరు..మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కామెంట్స్...వైఎస్సార్సీపీ కార్యకర్తల సతీమణులు అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే 175 నియోజకవర్గాలలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాంఇప్పటి వరకు రాధాకృష్ణపై ఒక కేసు కూడా నమోదు చేయలేదుపోలీసులు రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటుఅధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్ష పార్టీకి మరోలా పోలీసులు చట్టాన్ని అమలు చేస్తున్నారుఆంధ్రజ్యోతి అక్షరమే మా ఆయుధం అని చెప్పుకుంటుంది ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఆభరణంవెంటనే ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలిక్షమాపణ చెప్పని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏబీఎన్ క్లోజ్ అవుతుందివైఎస్సార్ జిల్లాజిల్లా ఎస్పీని కలిసి ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు కోరిన వైఎస్సార్సీపీ నేతలుజిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డినేతల కామెంట్స్..వైఎస్సార్సీపీ నేతలను నొటికొచ్చినట్లు మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న నేతలుఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం పోలీసు శాఖ స్పందించడం లేదు.ఆయన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు కడుతున్న ప్రభుత్వం..రాధాకృష్ణపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన నేతలువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్రాధాకృష్ణ బూతు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాంకానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదువైఎస్సార్సీపీ వాళ్లు కేకు కోసినా.. మేక కోసినా కేసులు పెడుతున్నారుమాపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారుమా ఇంట్లో మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుమేం ఇచ్చే వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుమా వినతిపత్రం తీసుకోవడానికి సీపీ, డీసీపీ భయపడిపోతున్నారుమహిళలంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిపోలీసులు మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్..పోలీసులు మా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుచంద్రబాబు, టీడీపీ నేతల ఇళ్లలో ఉన్నవారే మహిళలా?.మా ఇంట్లో వారు మహిళలు కాదా. అంబటి రాంబాబును అరెస్ట్ చేసినపుడు ఉపయోగపడిన చట్టం రాధాకృష్ణకు వర్తించదా?.రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయరుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..ఏబీఎన్ ఒక బూతు ఛానల్మా కుటుంబంలోని మహిళలను కించపరిచారుచంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ నేతలకు నాదొక సూటి ప్రశ్నరాధాకృష్ణ మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా?చంద్రబాబు.. నిన్ను అన్నారో లేదో తెలియని మాటలకు గుక్కపెట్టి ఏడ్చావుగారాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోయారుమేం శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తే దాడి చేశారని విమర్శించారుచంద్రబాబు ఇదేనా నీ సంస్కారంచంద్రబాబు ఎల్లవేళలా అధికారంలో ఉంటారనుకుంటున్నారా?.రాధాకృష్ణ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలిలేకపోతే ఏదో ఒకరోజు రాధాకృష్ణకు నడిరోడ్డుపై శిక్ష తప్పదుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలిరాధాకృష్ణ తప్పు చేసినా చంద్రబాబు, లోకేష్, పవన్, టీడీపీ మంత్రులు సమర్థిస్తున్నారుఏ మొహం పెట్టుకుని మీరు రాధాకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారురాధాకృష్ణను చూసి చంద్రబాబు భయపడుతున్నాడుఎక్కడ తన గురించి పేపర్లో రాస్తాడోనని చంద్రబాబు భయపడుతున్నాడుమహిళా బిల్లు వ్యతిరేకించిన ముఖ్యమంత్రితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారుమళ్లీ సిగ్గు లేకుండా మహిళా బిల్లు పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతామంటున్నారుఇప్పటికైనా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిలేకపోతే పోలీసులు రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలి.మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..రాధాకృష్ణ పై ఫిర్యాదు తీసుకోవాలన్నా పోలీసులు భయపడుతున్నారుఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందిప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందితన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారుమీ ఇళ్లలో వారే మీకు మహిళలా?మా ఇళ్లలో వారు మహిళలుగా కనిపించడం లేదాతన తల్లిని ఏదో అన్నారని పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారుఇప్పుడు పవన్ ఏమైపోయారు?.మహిళలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.విశాఖ..వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్..రాధాకృష్ణ ఒక బ్రోకర్.ఇటు వంటి బ్రోకర్ను బొక్కలో వేయాలి.చంద్రబాబు కొంతమంది పిచ్చి కుక్కలను తయారు చేస్తున్నారు..చంద్రబాబు తయారు చేసిన పిచ్చి కుక్కలు ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి..మావిగన్కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది .మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి. -
బాబు.. అంత ద్వేషమెందుకు?
పుట్టినరోజు నాడైనా ఎవరికీ అపకారం చేయకూడదన్నది చాలామంది సెంటిమెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టిన రోజునే సచివాలయ ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున చేశారో తెలియదు కానీ.. ఈ చర్య వల్ల ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు పరపతి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులను పలు రకాలుగా వేధిస్తోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తున్న ఉద్యోగ నేతను డిస్మిస్ చేయడం ఏమిటని చాలా మంది మదనపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 200 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్ అధికారులను ఏదో నెపంతో జైళ్లకు పంపించారు. ఇదంతా కక్ష సాధింపు, రెడ్ బుక్ అరాచకాలలో భాగంగానే సాగుతుందన్న విమర్శలున్నాయి. కొంతకాలం క్రితం తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ చంద్రబాబుకు పరువు నష్టం నోటీసు పంపిన పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండి, అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత విశాల దృక్పథంతో పనిచేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలి. చంద్రబాబు గతంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని చాలామంది అంటుంటారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏమిటి? గత ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏవో కొన్ని బస్ డిపోలలో ప్రచారం చేశారట. ఇది అవాస్తవమని, ఆధారాలు చూపాలని ఆయన కోరుతున్నారు.బస్డిపో మేనేజర్లు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చారని ఆయన అంటున్నారు. అయినా ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. దానికి కారణం ఆయన టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పదే, పదే ప్రశ్నించడమే కారణం. పోనీ తన హయాంలో ఉద్యోగ సంఘ నేతలను టీడీపీకి అనుకూలంగా వాడుకోలేదా అంటే శుభ్రంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఉద్యోగ సంఘ అధ్యక్షుడుగా ఉన్న అశోక్ బాబు, తదితర ఎన్జీవో నేతలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలు అన్నిటిలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన సమక్షంలోనే ప్రధాని మోడీని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయినా వారు తప్పు చేయనట్లు లెక్క. ఆ తర్వాత కాలంలో అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన టీడీపీలో కీలకమైన ఒక నేతగా ఉన్నారు. అంటే చంద్రబాబుకు, ఆయనకు మద్య క్విడ్ ప్రోకో జరిగినట్లు కాదా? ఉద్యోగులను ఎన్నికల సమయంలో ప్రభావితం చేయడానికి కొందరు నేతలు ఆ రోజులలో ప్రయత్నించారా? లేదా? అన్నది అందరికి తెలుసు.అయినా 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ వీరెవ్వరిపైన కక్ష సాధింపులకు దిగలేదు. అంతేకాదు.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి గట్టిగానే కృషి చేసినా సంఘాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కృషి చేసింది తెలియదా? టీఏ, డీఏ లేటు అవుతోందని ఆరోపిస్తూ ఒక కానిస్టేబుల్ ముఖ్యమంత్రి జగన్ను దూషించిన ఘటనలో సస్పెండ్ అయ్యారు. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇదే చంద్రబాబు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరొకటి ఉంది. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ అనే ఆయన టీడీపీ నేత ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై విచారణ చేసి, కావాలని సుధాకర్ అలా దుష్ప్రచారం చేశారని నిర్ణయానికి వచ్చాక సస్పెండ్ చేసింది. దానిని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు.. సుధాకర్ మద్యం సేవించి విశాఖలో రోడ్డుపైన రచ్చ చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ కానిస్టేబుల్ చర్యను కూడా ముఖ్యమంత్రికే ఆపాదించి, చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. అందుకు కూడా జగనే కారణం అంటూ అబద్దపు ప్రచారం చేశారు.అప్పుడేమో ఉద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉన్నట్లు, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడేవారు. అధికారంలోకి రాగానే తనకు గిట్టని, తనను ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నేతను ఏకంగా ఉద్యోగాల నుంచే డిస్మిస్ చేశారు. వెంకట్రామి రెడ్డిని కంట్రోల్ చేస్తే ఇంకెవరూ మాట్లాడరన్నది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కాని దీనివల్ల చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అప్రతిష్ట అయితే తప్పకుండా వస్తుంది. ఉద్యోగులకు కూటమి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నది వెంకట్రామిరెడ్డి వాదన. గతంలో ఎప్పుడూ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో లేవని ఆయన చెబుతున్నారు. జగన్ టైమ్లో వచ్చిన సచివాలయాలను ప్రస్తుతం స్వర్ణ గ్రామాల ఆఫీసులు అని పిలుస్తున్నారు. ఆ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నారని, వలంటీర్లు చేసే బాధ్యతలను ఈ ఉద్యోగులకు అప్పగిస్తున్నారని, చివరికి పార్కింగ్ ప్రదేశాల వద్ద కాపలా పెడుతున్నారని, వీధి కుక్కలను లెక్కించే పని వీరికి అప్పగిస్తున్నారని వెంకట్రామి రెడ్డి అన్నారు.ఈ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడితో గుండెపోటుకు గురైకాని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కాని దాదాపు వంద మంది మరణించారని ఆయన చెప్పారు. వీటన్నిటిని ప్రస్తావిస్తున్ననందుకే ఆయనపై కక్ష కట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారన్నమాట. నిజానికి సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఆధారాలు చూపకుండా ఉద్యోగం నుంచి తీయరాదు. దీనిపై న్యాయ పోరాటానికి ఆయన సిద్దం అవుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి. గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో సోదాలు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని ఆ కేసు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు చేసుకోగలిగారని చెబుతారు. స్కిల్ స్కామ్ కేసులో విచారించడానికి సీఐడీ శ్రీనివాస్ను పిలిస్తే ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్లిపోయారు. దాంతో గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ అభియోగాలన్నిటిని ఎత్తివేసి జీతం బకాయిలతో సహా చెల్లించి ఉద్యోగం ఇచ్చింది. ఇలా చేయడం చట్టబద్దమేనా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళారు. అయితే ఆయన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేయలేదని ఏకంగా పోలీసునే కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. కాని తన మాజీ పీఎస్ విషయంలో ఎందుకు అంత ఉదారంగా ఉన్నారో ప్రజలకు తెలియదా?.అలాగే మరో పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హోదాలో ఉండి టీడీపీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించే వారు. ఈ సంగతి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే పార్టీ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతారు. అది తప్పు కాదా? అవన్ని ఎందుకు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, ప్రజలందరిని సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేశారు కదా! కాని ఆయనే స్వయంగా వైఎస్సార్సీపీ వారికి ఏ పనులు చేయవద్దని ఎలా అధికారులకు బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారు?. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెప్పడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. దేశ రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన కుమారుడు లోకేశ్ ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు. వెంకట్రామిరెడ్డి నిజంగానే వైఎస్సార్సీపీకి ప్రచారం చేసి ఉంటే తప్పే అయితే, అంతకు మించి వీరంతా తప్పు చేసినట్లు కాదా? ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకాలు చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది.టీడీపీ వారు ఏ ఫిర్యాదు చేసినా ఆగమేఘాల మీద కేసు బుక్ చేసి వైఎస్సార్సీపీ వారిని, చివరికి జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తున్నారే. అదే టైమ్ లో వైఎస్సార్సీపీ వారు తమపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదే! మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరబడి టీడీపీ రౌడీలు, గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ఆరోపణ చేసి ఉద్యోగం నుంచి తీసివేసిన ప్రభుత్వం ఈ అకృత్యాలకు బాధ్యత వహించదా!. వీటన్నిటిని ప్రశ్నిస్తూ చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు అంటూ మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పటికైనా వీటన్నిటికి నైతికంగా, చట్టపరంగా జవాబివ్వక తప్పని రోజు ఒకటంటూ రాకుండా ఉంటుందా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?: కేతిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. కూటమి సర్కార్ పాలనపై మండిపడ్డారు.తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన అబ్దుల్లా మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. అనంతరం, పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘గడిచిన 24 గంటల వ్యవధిలో తాడిపత్రిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. గంజాయి, మట్కా, పేకాట క్లబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేస్తున్నారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?’ అని ప్రశ్నించారు. -
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు...టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు...తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్ రూమ్లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు. -
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్ జగన్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
‘చంద్రబాబుది వ్యవసాయం దండగ అన్న ఆలోచనే’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జొన్న, మొక్కజొన్న రైతుల పోరాట దీక్ష చేస్తున్నారు. జొన్న, మొక్కజొన్న మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ దీక్షకు దిగారు. పంటల కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన దీక్షకు రైతులు, మహిళలు భారీ స్థాయిలో తరలివచ్చారు. అంబటి మురళి రైతు పోరాట దీక్షలో పాల్గొని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , పోతిన మహేష్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు హాయాంలో పంటలు పండవు, పండినా ధరలు ఉండవు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు. ప్రభుత్వానికి రైతుల బాధలు తెలియజేయడానికే దీక్ష చేస్తున్నారు. మార్క్ ఫెడ్ను రంగంలోకి దించాలి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతాంగానికి అండగా ఉండాలంటే రాజకీయ అనుభవం అవసరం లేదు. మనసు ఉంటే చాలు.. అది చంద్రబాబుకు లేదు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘చంద్రబాబుది వ్యవసాయం దండగ అన్న ఆలోచనే. రైతుల ఉత్పత్తులన్నీ దళారుల చేతిలోకి వెళ్తున్నాయి. మొక్కజొన్నను మద్దతు ధర 2400 ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారు. మంత్రే డబ్బులు లేవని అంటున్నారు. చేతకాని దద్దమ్మలా పరిపాలన చేస్తున్నారు’ అని మండిపడ్డారు.పోతిన మహేష్ మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రైతులపై దృష్టి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలకు గ్రహణం పట్టింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. దళారుల వ్యవస్థ నడుస్తుంది. జొన్న, మొక్కజొన్న రైతులకు ఉరి వేస్తున్నారు. ఎక్కడన్నా మద్దతు ధరకు కొనుగోలు చేశారో చూపించాలి. పొన్నూరులో ఎమ్మెల్యేనే దళారిగా మారాడు. సంగం డెయిరీ కోసం దళారుల చేత ఎమ్మెల్యేనే కొనుగోలు చేస్తున్నాడు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నాడు. గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ..‘ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే దళారులుగా మారుతున్నారు. రైతుల కన్నీరుతోనే చంద్రబాబు పాలన చేస్తున్నారు అని మండిపడ్డారు. -
‘విద్యుత్ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు’
తాడేపల్లి : విద్యుత్ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ భాబు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది కాకుండా 23 నెలల్లోనే రూ. 20 వేల కోట్ల భారాన్ని జనం మీద మోపారని టీజేఆర్ విమర్శించారు.ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా.. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారన్నారు. ‘విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ 2003లో మహిళలు ధర్నాకు దిగితే గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి మళ్లీ మాయమాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. విద్యుత్ కొనుగోళ్లలోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. సెకీ నుంచి వైఎస్ జగన్ 2.49 రూపాయలకు కొంటే.. చంద్రబాబు 4.49 రూపాయలకు కొన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బయట పెడుతున్నారనే వైఎస్ జగన్ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు నిద్రలో కూడా జగన్ జపమే చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారా?
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కథనమే ఇది. అందులోను ఎల్లో మీడియా ఈ రకమైన స్టోరీలు ఇచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు తగ్గించారని, ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, జాగ్రత్తపడకపోతే అధోగతే అంటూ టీడీపీ పక్షాన పనిచేసే ఆంధ్రజ్యోతి బానర్ వార్తను ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలలో ఆరు నెలలపాటు ముప్ఫై శాతం కోత పెట్టాలని , మూడు,నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపించడానికి ఆ రాష్ట్రం ఈ చర్య చేపట్టింది. .తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం దీనిని క్లూగా వాడుకుని తన మీడియాకు ఒక లీక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంతేనని, అప్పుల భారం అదికం అవుతోందని,అందువల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని రాయండని ఎల్లో మీడియాకు పురమాయించి ఉండాలి.తదనుగుణంగా ఆ మీడియా రాజభక్తితో ఆ కధనాన్ని ఇచ్చి ఉండాలి. విశేషం ఏమిటంటే తమిళనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేంద్రం సహకారంతో ఏపీ బుల్లెట్ వేగంతో అభివృద్ది చెందుతోందని చెప్పారని కూడా ఇదే ఎల్లో మీడియా రాసింది.చంద్రబాబు చెప్పినదానిలో వాస్తవం ఉంటే ప్రభుత్వం పక్షాన పేద ఏడుపులు ఏడుస్తూ ఎల్లో మీడియా ప్రజలను ఎందుకు భయపెట్టింది? చంద్రబాబు అబద్దం చెప్పినట్లా?లేక ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లా?ఇదే ఎల్లో మీడియా 2024 ఎన్నికల సమయంలో కూటమి మానిఫెస్టోకి భజన చేస్తూ అద్భుతం, అమోఘం, చంద్రబాబు సంపద సృష్టించగలరు.తద్వారా సూపర్ సిక్స్ హామీలతో సహా ఎన్నికల మానిఫెస్టో అంతటిని చిటికిన వేలుతో అమలు చేసేయగలరు అని ఎందుకు ప్రచారం చేశారు.అందులో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని, అంటే జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? ఉద్యోగుల ఇతర కోర్కెలను నెరవేరుస్తామని ఎలా చెప్పారు?ఇప్పుడేమో ఆర్ధిక క్రమశిక్షణ అవసరం అని సన్నాయి నొక్కులు ఎందుకు రాస్తున్నారు?ఇది ప్రజలను ,అందులోను ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం కాదా ?అన్న ప్రశ్న వస్తుంది కదా!ఉద్యోగుల జీతాలవల్ల ఆర్దిక భారం అధికంగా ఉందని చెప్పడం తో పాటు సంక్షేమ స్కీముల అమలు వల్ల కూడా బాగా ఖర్చు అవుతోందని, ఇందులో చాలా దుబారా ఉందని ఎల్లో మీడియా అంటోంది. ఇది చంద్రబాబు అభిప్రాయంగా తీసుకునే అవకాశం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది చేసినా ముందుగా ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంటుందా?నెగిటివ్ గా ఉంటుందా?అన్నది చూసుకుంటారు.మొదటిసారి సీఎం అయినప్పుడే ఆయన ఇలాంటి సర్వేలు చేసుకునేవారు.1996 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేయకపోతే నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే సబ్సిడి బియ్యం ధర ఐదు రూపాయలు అవుతుందని ప్రచారం చేసేవారు. తమకు ఎక్కువ సీట్లు వస్తేనే మద్య నిషేధం కొనసాగించగలుగుతామని చెప్పేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో దాదాపు సమానంగా టీడీపీ, సిపిఐ, సిపిఎమ్ కూటమికి సీట్లు వచ్చాయి. తర్వాత ఆయన రూటు మార్చారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త కధ ఆరంభించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, సబ్సిడి బియ్యం రేట్లు పెంచకపోతే ప్రభుత్వం భరించలేదని చెప్పేవారు. అంతకు ముందు ఎన్.టి.రామారావు అమలు చేసిన మద్య నిషేధాన్ని కొనసాగించలేమని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని, దానిని నియంత్రించలేకపోతున్నామని, ఆదాయం కూడా రావడం లేదని ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందేమో ఎన్.టి.ఆర్ అనుమతించిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు.తద్వారా మద్య నిషేధం పై సీరియస్ గా ఉన్నట్లు చంద్రబాబు పిక్చర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాతేమో మొత్తం ఎత్తివేశారు.ఆ టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో!ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనకు అనుకూలంగా ఎక్కువమంది మాట్లాడేలా చూసుకునేవారు.తదుపరి జనం అంతా అలాగే కోరుకుంటున్నారని చెప్పి నిర్ణయాలను మార్చివేసేవారు. ఇదేకాదు.1999లో బిజెపితో కలిసి కూటమి కట్టడంతో మళ్లీ గెలవగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలపై సమీక్షలు చేసి,వాటిలో లాభాలు ఆర్జించని సంస్థలను మూసివేసే ప్రక్రియ ఆరంభించారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశారు.అప్పుడు ప్రభుత్వరంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా మారాయని, వృధా వ్యయం అని పబ్లిసిటీ చేసేవారు.ఆ సంస్థలకు ఉన్న భూములను ప్రైవేటువారికి అప్పగించేశారు.ఆ భూములను ఆ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నాయని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారన్న భావన కల్పిస్తుంటారు.అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు పాలనపై మండిపడుతుండేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే చంద్రబాబు రిటైర్ మెంట్ వయసును 55 ఏళ్లకు తగ్గించబోతున్నారని ఉద్యోగులంతా నమ్మేవారు.నిజానికి ఆ ప్రతిపాదన లేదని అంటారు.కాని చంద్రబాబు ప్రభుత్వ సరళి చూశాక ఉద్యోగులంతా ఆ వదంతిని నమ్మారు.2004లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణం అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిలో విద్యుత్ రంగం ఒకటి.దానిద్వారా తనకు క్రెడిట్ వస్తుందని అనుకున్న చంద్రబాబు ఆ సంస్కరణలు అన్నీ తనవే అని ప్రచారం చేసుకునేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అప్పటి ప్రతి పక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే అలా చేస్తే తీగెలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. తదుపరి వైఎస్ అధికారంలోకి రావడం, దానిని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఘనత తనదేనని కూడా చంద్రబాబు చెప్పుకునేవారు.తదుపరి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఉచిత విద్యుత్ ను కొనసాగించారు.అలా ఉంటుంది ఆయన తీరు.గత టరమ్ లో ఉద్యోగుల జీతాభత్యాలపై ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో ఆయన చేసిన సంభాషణ వీడియో బయటకు వచ్చింది.ఇద్దరూ కూడా ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా ఆ వీడియో ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేసింది.అధికారంలో ఉంటే సంస్కరణలు గురించి మాట్లాడే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫ్రీ అని, ఎక్కడలేని వాగ్దానాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర సుమారు 150 హామీలు ఇచ్చారు.వాటన్నిటి ఖర్చు ఏడాదికి లక్షన్నర కోట్లు అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు తాము సంపద సృష్టిస్తామని, వాటిని అమలు చేసి చూపిస్తామని గప్పాలు పలికేవారు.అధికారంలోకి వచ్చాక మాత్రం తెల్లముఖం వేసి వారి హామీలను నమ్మిన ప్రజలను వెర్రివాళ్లుగా చేశారు.ఇటీవల ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.అంటే జనాన్ని మానసికంగా తయారు చేయడం అన్నమాట.దాని కొనసాగింపుగా ఎల్లో మీడియా దీనిని భుజాన వేసుకుని సంక్షేమంలో చాలా వృదా అవుతోందని అనర్హులకు స్కీములు వెళుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు.అవన్ని అర్జంట్ గా మార్చేయాలని అంటున్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే ఇదే ఎల్లో మీడియా జగన్ పై శరాలను వదిలి, జాకీలుపెట్టి టీడీపీని లేపడానికి యత్నించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగానే ఆ హామీలన్నీ అమలు అవుతాయేమో అన్నంతగా నమ్మేలా ప్రచారం చేశారు. ఇప్పుడేమో యధా ప్రకారం వారి శైలిలో అదంతా వృధా ఖర్చు. వాటిలో కోత పెట్టాలి అంటూ వాదన తీసుకు వస్తున్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు టీమ్ కాని, ఎల్లో మీడియాకాని అమరావతిలో మాత్రం అప్పులు చేసి అయినా లక్షల కోట్లు వ్యయం చేయాలని చెబుతున్నారు.మరి అది ఎవరి ప్రయోజనాల కోసం?ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీల గురించి అడగకుండా, పిఆర్సి, బకాయిల చెల్లింపు మొదలైనవాటి గురించి అడగకుండా ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైన బెదిరింపులు చేశారా అన్న అనుమానం వస్తుంది.జీతాలు ఇస్తే చాలు.. ఉద్యోగాలు ఉంటే చాలు అన్న అభిప్రాయం కలిగిస్తే ఏ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల తరపున డిమాండ్ల ఊసెత్తడానికి గజగజలాడడానికి ఈ కధనాలు సృష్టించినట్లుగా ఉంది. ప్రజలు సంక్షేమ హామీల గురించి అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపైనే మాట్లాడుకోవాలన్నదే వీరి లక్ష్యం. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కూటమితో పాటు ఎల్లో మీడియా పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కధనాలను చూస్తే ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారని అనుకోవల్సిందేనా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


