-
‘మహిళా పక్షపాతి వైఎస్ జగన్’
విశాఖ: మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు వరుదు కళ్యాణి. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడారు వరుదు కళ్యాణి. ‘ దేశంలో ఏ నాయకుడు ఇవ్వలేనన్ని పదవులు మహిళలకు వైఎస్ జగన్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళకు 50 శాతం పదవులు, నామినేట్ పనులు కట్టబెడుటు అసెంబ్లీలో చట్టం చేశారు. మహిళలు కోసం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. చట్ట సభల్లో మహిళలకు కీలకమైన పదవులు అప్పగించారు.జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50% పైగా మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలు మహారాణుల్లా బతికారు. మహిళల కోసం దిశ చట్టాన్ని యాప్, పోలీస్ స్టేషన్ తెచ్చారు. కుటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి.. ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలంతా జగనన్నకు రుణపడి ఉంటారు’ అని తెలిపారు. ఇక చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి విమర్శించారు. -
అలా చేస్తే.. అమరావతి ఘోస్ట్ క్యాపిటల్ అవుతుంది: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని.. ఆ విభజన హామీలపై మా పార్టీ పోరాటం చేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కల.. వైఎస్. జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశాం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.‘‘నిరాహార దీక్ష చేస్తున్న నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది. ప్రజల పక్షాన చేసిన పోరాటంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రాణ త్యాగనికైనా సిద్ధమని ఆరోజే చెప్పాను. విశాఖ రైల్వే ఏర్పాటు వైఎస్సార్సీపీ పోరాట ఫలితమే. రైల్వే జోన్ కోసం భూ కేటాయింపు కూడా మా హయాంలోనే చేశాం’’ అని అమర్నాథ్ వివరించారు.‘‘రైల్వే జోన్కు అనుమతులు భూ కేటాయింపులు మా హయాంలోనే జరిగినా శంకుస్థాపన కావాలని చేశారు. జోన్ సాకారం అయినప్పటికీ కీలకమైన కేకే లైన్ను రాయగడ డివిజన్కు కేటాయించారు. ఉత్తరాంధ్రలో ఉన్న కూటమి ప్రజా ప్రతినిధులు చేతకాని దద్దమ్మలు. ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. అమరావతి కోసం మాట్లాడుతున్న కూటమి ఎంపీలు, నేతలు రైల్వే జోన్లో ఆదాయం వచ్చే లైన్ కోసం ఎందుకు మాట్లాడటం లేదు. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ కోసం అవకాశం ఉన్నా కూటమి నేతలు మాట్లాడటం లేదు...రాజధానిపై మావిగన్ ప్రత్తిపాధనపై ప్రజల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఇప్పుడు కారిడార్ పేరుతో కొత్త బాష్యం చెప్తున్నారు. అమరావతికి రూ.50 వేల కోట్లు పనులకు టెండర్లు పిలిచారు. 28 గ్రామాల మినహా ఇంకెక్కడైనా డబ్బులు ఖర్చు చేశారా..? విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్కు అనుమతి తీసుకొచ్చాం.. భోగాపురానికి దారేది అనే ప్రశ్న ఎక్కడ చూసినా వినిపిస్తుంది. పోలవరం ఎత్తు తగ్గించినా.. కూటమి నేతలు దద్దమ్మల్లా ఉన్నారు...డబ్బులన్నీ అక్కడే పెడితే అమరావతి ఘోస్ట్ క్యాపిటల్గా మిగిలిపోతుంది.. అవకాశాలు ఉన్న నగరాలను వదిలేసి అమరావతిని పట్టుకొని వేలాడుతుంది. న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తాను. న్యాయ స్థానంపై గౌరవంతో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదు. స్టీల్ ప్లాంట్పై మా హయాంలో ఎన్ని పోరాటాలు చేసినా ఒక్క కేసు కూడా పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి భాగస్వాములు అయ్యాం...నేను చేసిన పోరాటం ప్రజల కోసమే.. రైల్వే జోన్ కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం ఆరు నెలల జైలు శిక్ష. రైలు పట్టాలపై నా తల పెట్టి అయినా రైల్వే జోన్ సాధిస్తానని ఆరోజే చెప్పా.. సీఎం అంటే 28 గ్రామాలకు మాత్రమే కాదు.. చంద్రబాబు మోసం చేస్తాడని తెలిసి ప్రజలు టీడీపీకి ఓటేశారు. కేకే లైన్ వాల్తేరు డివిజన్ పరిధిలోకి తీసుకోవాలి.. ఇది మా డిమాండ్. కేకే లైన్ సాధించే వరకూ వైసీపీ పోరాటం ఆగదు’’ అని గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. -
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్గఢ్లో నిర్మించిన నవ రాయ్పూర్ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్లో బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయని.. కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు. ‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది. మావిగన్తో మరుసటి రోజే రాజధాని..‘మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మావిగన్ అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు. ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?, రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. మావిగన్ ఆలోచనను పలు దఫాలుగా జగన్ చెప్పారు. జగన్మోహన్రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు. ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అవినీతికి తరగని గనిలా అమరావతి‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్లాంటి క్యాపిటల్ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది. ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్.జగన్ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం. పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారుమావిగన్ను ప్రజలు స్వాగతించారుమావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:మావిగన్ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.ఆ కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది..‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది. అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహంఏబీఎన్లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పైగా ఏబీఎన్ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు వేరేరకంగా మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయిరాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.మావిగన్ పేరు వింటనే చంద్రబాబుకు భయంమావిగన్ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రైతుల కష్టాలు పట్టవని.. రాయలసీమ అంటే మొదటి నుంచి ఆయనకు చులకనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కోఏసం వైఎస్సార్సీపీ పోరును ఉదృతం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. రాయలసీమ అంటే చంద్రబాబు కు ఎందుకు చులకన?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ వంటిదిమాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే తెలంగాణ మాదిరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లో నీరు తీసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 854 అడుగుల్లో నీరు తరలించటం అసాధ్యం. నీటి వాటాలు ఖచ్చితంగా తీసుకొచ్చేందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రాయలసీమ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు తో వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. సీఎం రేవంత్ కోరితే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేస్తారా??. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దొంగ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. దొంగ ప్రాజెక్టు అయితే మీరెందుకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేశారో పయ్యావుల కేశవ్ చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే సీమ ప్రాజెక్టు లకు నీరు అందుతుంది. చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సాగు తాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అదే స్ఫూర్తి ని కొనసాగించేందుకే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన ఘనుడు చంద్రబాబు. హైకోర్టు, ఎయిమ్స్, ఇతర ప్రాజెక్టులను ఇతర ప్రాంతానికి తరలించారు. రాయలసీమ అభివృద్ధి పై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు చిత్తశుద్ధి ఏది?. సీమ వాసులు టీడీపీ కూటమికే పట్టం కడితే... మీరు చేస్తున్నది ఏమిటి?. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదాకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని చాలా మందికి తెలియదు. టీడీపీ కూటమి కి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందిఈ సమావేశంలో.. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్నా.. ఆ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా!
ఎంవీపీకాలనీ (విశాఖ): మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. రాజకీయ ఉనికి కోసం, ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా అంటూ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆనాడు వైఎస్సార్ మరణవార్త తెలిసి తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయని బొత్స చెప్పారు. వైఎస్సార్ మరణం వెనుక జగన్ ఉన్నాడని, మరణించిన సమయంలో ఆయన రాష్ట్రంలో లేడని తాను స్వయంగా చెప్పినట్లు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పడం అతడి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి కొంచమైనా సిగ్గనిపించలేదా అని ప్రశ్నించారు. అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా.. టీడీపీలో ఉనికి కోసం, మంత్రి పదవి కోసం ఇలాంటి నీచరాజకీయాలకు ఒడిగడతావా అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మరణాన్ని గుర్తుతెచ్చుకుని బొత్స కంటతడి పెట్టారు. తనకు వైఎస్సార్తోను, ఆయన కుటుంబంతోను ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుల్లో వైఎస్సార్ ఒకరన్నారు. అలాంటి వ్యక్తి మరణాన్ని ఆయన పాదయాత్ర ముగించిన చారిత్రాత్మక సమయాన్ని స్మరించుకునేప్పుడు రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ అక్కడే ఉన్నారన్నారు. తాను, తన భార్య కలిసి క్యాంపు ఆఫీసు నుంచి స్వయంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. చరిత్ర తెలియకుండా అచ్చెన్నాయుడు రాజకీయ లబ్ధికోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారని చెప్పారు.మావిగన్ పేరు వినిపిస్తే కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని బొత్స చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోందన్నారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మావిగన్ నిలిచిందని పేర్కొన్నారు. దీంతో మావిగన్ పేరెత్తితో కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఈ దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. తనకు నచ్చితే రేణుకా చౌదరి మాదిరిగా కమ్మరావతి బ్యాండ్ కట్టుకోవాలని సూచించారు. సత్తా ఉంటే రాష్ట్రంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. అంతేతప్ప ఇలాంటి నీచవ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. జగన్ను ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మావిగన్ పేరు ఎత్తితే కూటమి నాయకులకు అంత ఉలికిపాటు ఎందుకని బొత్స నిలదీశారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, విశాఖ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
మావిగన్పై ఆగని టీడీపీ డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మావిగన్పై తెలుగుదేశం పార్టీ డైవర్షన్ కుట్రలకు తెరలేపింది. ప్రజలు పాజిటివ్గా చర్చిస్తుంటే అధికార పక్షం ఓర్వలేకపోతోంది. ఎలాగైనా మావిగన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర తీసింది. వైఎస్ జగన్.. మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే సైకో అంటూ టీడీపీ నేత పట్టాభి చిందులు తొక్కారు. జగన్ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. వైఎస్సార్సీపీ నేతల భార్యల గురించి పచ్చపత్రిక అధినేత ఆర్కే రాతరోతలు రాశారు.ఇలా.. రోజుకో డైవర్షన్ స్కీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని తిడుతూ మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ కుట్రలు తెరతీసింది. ఇప్పుడు వైఎస్సార్ మరణంపై అచ్చెన్నాయుడు నీచపు మాటలు మాట్లాడుతూ.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై అభాండాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. మహానేత కుమారుడిపై అభాండాలను తట్టుకోలేక బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొత్స.. భావోద్వేగానికి గురయ్యారు.అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలపై బొత్స మండిపడ్డారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్సార్ ఒకరని.. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నానని బొత్స అన్నారు. -
‘తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి?’
తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్బుక్లో క్యూ ఆర్ కోడ్ పెట్టింది వైఎస్ జగన్ అని, ల్యాండ్ రీ సర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ ఎన్నికలు ముందు ఈ సర్వేలు వద్దన్నారు. నేనొస్తే రద్దు చేస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వే మొదలుపెట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టింది. అసలు తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. రెండు లక్షల కోట్ల అప్పులభారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. మూడు ప్రాంతాలు కలిపితే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుంది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అచ్చెన్నాయుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో సంతకాల సేకరణ చేశారు అంటున్నారు. సంతకాల సేకరణతో సంబంధం లేదని అనేక సందర్భాల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడైనా సింగిల్గా పోటీ చేశారా? అంటూ నిలదీశారు. -
ఇదీ టీడీపీ నేతల చిల్లర వ్యవహారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కుంభకోణంలో తెలుగు దేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. బాధితుడు ఎల్లయ్య కుటుంబ సభ్యుడొకరు తమకు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు కిందే అతని ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి రూ. 8 లక్షలు తీసుకున్నామని ఇప్పుడు కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట కుందా నెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చాక ఫోన్ చూసి ఎల్లయ్యకు మతిపోయే విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసింది. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. ఫేక్ ప్రామిసరీ నోట్తో?విషయం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన కొందరు నేతలే ఈ స్కాంను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్రమార్కులు కొత్త డ్రామాకు దిగారు. బాధితుడు ఎల్లయ్యకు బావమరిది అయిన శశికుమార్కు అప్పు ఇచ్చామని, ఆ సొమ్మునే వడ్డీతో సహా తాము తీసుకున్నామని చెబుతూ ఓ ప్రామిసరీ నోటును చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బాధితుడితోనే బలవంతంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని.. తన బావమరిది నిజంగానే అప్పు తీసుకున్నాడంటూ చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. శశికుమార్ వివరణతో టీడీపీ నేతల చిల్లర వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి అప్పు చేయలేదని.. పైగా ఆ ప్రామిసరీ నోట్లో సంతకం తెలుగులో ఉందని.. తాను ఇంగ్లీష్లో సంతకం చేస్తానని.. ఆ నోట్ ఫేక్ అని శశికుమార్ వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తప్పు మీద తప్పు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.చంద్రబాబుకు సీపీఐ లేఖరాజంపేటలో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో.. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల సంగతి తేల్చాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖ రాశారు. టీడీపీ నేతలకు సీఎం సహాయక నిధి ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ‘‘మీ పార్టీలో ఒక టీం ఇదే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకుంటున్నారు. ఆర్థిక సహాయం ఎంత అందినా.. రూ.6 లక్షలే ఇస్తామని టీడీపీ నేతలు చెబుతుండడం దోపిడీకి పరాకాష్ట. తమకు ఖర్చులు ఉంటాయని.. అందరికీ పర్సంటేజ్లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్న మీ పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’’ అని చంద్రబాబును ఈశ్వరయ్య లేఖలో కోరారు. -
ఇద్దరూ ఇద్దరే
దేశ చరిత్రలో పాదయాత్రలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో లక్ష్య సాధన కోసం యాత్రలు చేసేవారు. ఆ తర్వాత అవి ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం రాజకీయ మలుపు తీసుకున్నాయి. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర, 2017లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్లో చేసిన పాదయాత్ర.. ఈ రెండూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మహానేత, జననేత చేపట్టిన యాత్రలు ప్రజల జీవితాల్లో.. రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. వాటి ఫలితంగా వచ్చిన ఐదు ప్రధాన మార్పులను ఓసారి పరిశీలిద్దాం.విద్యా రంగంవైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం సుమారు రూ.4,000–5,000 కోట్లు ఖర్చు చేశారు. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అనేక మంది డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా మార్గం సుగమం చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ బడులను ఆధునికీకరించారు. అమ్మఒడి, జగనన్న వసతి తదితర పథకాల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించి.. డ్రాపవుట్లను తగ్గించి పేద పిల్లల చదువును కొనసాగించేలా చేశారు. ఒక్క అమ్మ ఒడి పథకం కోసం సుమారు రూ. 35,000 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేశారు. ఈ పాలనలోనే ఇంగ్లీష్ మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్(IB)తో విద్యాభోదన ప్రయత్నాలు మొదలయ్యాయి. తద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని వైఎస్ జగన్ సంకల్పించారు.ఆరోగ్య రంగంవైఎస్సార్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పు ఇది. ఒక అంచనా ప్రకారం.. 2007–2009 మధ్య కాలంలోనే వైఎస్ ప్రభుత్వం రూ.3,500–4,000 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.వైఎస్ జగన్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామీలీ డాక్టర్ కాన్సెప్ట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందేలా చేశారు. ఇందుకుగానూ సుమారు రూ.10 వేల కోట్లకు పైనే ఖర్చు చేశారు.రైతన్న రాజ్యంలో.. వైఎస్సార్ హయాంలో.. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. రైతన్నకు రారాజును చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో పా జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ. 60,000 కోట్లు పైగా ఖర్చు చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. రైతు సంక్షేమం కోసం అదనంగా.. రైతు భరోసా కేంద్రాలు(RBK సెంటర్లు) ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సమాచారం అందించారు. ఇందుకుగానూ.. సుమారు రూ.4 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మునుపెన్నడూ లేని రీతిలో పంట బీమా, తక్షణ నష్టపరిహారం అందజేశారు. ఇక.. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.7,500 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం రూపంలో రైతులకు అందజేశారు.ఇరిగేషన్వైఎస్సార్ హయాంలో.. అనేక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. పోలవరం లాంటి మెగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం ద్వారా 8.2 మిలియన్ ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం దిశగా కృషి చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు. పోలవరం పనులను కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. పోలవరం పనులు కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.15,000 నుంచి 20,000 కోట్ల దాకా కేటాయించారు.పారిశ్రామిక రంగంవైఎస్సార్ హయాంలో.. పారిశ్రామిక వృద్ధికి పునాది వేసి, పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వేల కోట్లు ఖర్చు చేశారు. దానికి తగ్గ ప్రతిఫలం నేటికి కళ్ల ముందు కనిపిస్తోంది.వైఎస్ జగన్ హయాంలో.. పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించారు. భారీ ఎత్తున పెట్టుబడుల్ని, కంపెనీలను రాబట్టగలిగారు. YSR Jagananna Mega Industrial Hub వంటి ప్రాజెక్టులు ప్రారంభించి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ ఇద్దరూ పాదయాత్రలు ప్రజలతో నేరుగా మమేకమై, వాళ్ల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ పాదయాత్రల తర్వాతే ఇద్దరూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనలో అన్నివర్గాల సమస్యలకు చక్కటి పరిష్కారం చూపగలిగారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. జగన్ చెప్పినట్లు.. ఆయా రంగాల్లో వైఎస్సార్ వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరేమో. కానీ, తండ్రి బాటలో పయనించి తన సంక్షేమ పాలనతో ఆ మార్క్ను వైఎస్ జగన్ అందుకోగలిగారనే చెప్పొచ్చు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. -
ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర గతిని మార్చేసిన ఆ ఘట్టానికి నేటితో 23 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆ పాదయాత్ర.. చరిత్రనే తిరగరాసిందని జగన్ పేర్కొన్నారు.2003 ఏప్రిల్ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైఎస్సార్ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని జగన్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆ పాదయాత్రకు మద్దతుగా నిలిచి వైఎస్సార్ను ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన వైఎస్సార్.. రైతులను రాజులుగా నిలిపారని, పేదలకు, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చారని జగన్ గుర్తు చేశారు.అలాగే, వైఎస్ చేపట్టిన సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా విద్యా అవకాశాలు కల్పించారన్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పోలవరం పనులను వేగవంతం చేసిన వైఎస్సార్ ముద్రను ఎవరూ చెరిపేయలేరని జగన్ అన్నారు. తండ్రి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తన ప్రయాణం కొనసాగుతుందని జగన్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన… pic.twitter.com/B8HvVZwFah— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2026ఇదీ చదవండి: YSR Padayatra: మండిన ఎండ.. కరిగిన గుండె -
అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేస్తూ వాటిని దాచిపెట్టి చట్టసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్లోనూ, బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు చేస్తూ వాస్తవ వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. చట్ట సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను మోసగించడమేనని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బొత్స బుధవారం గవర్నర్కు లేఖ రాశారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలతో పాటు శాసన మండలి సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ గవర్నర్కు లేఖ రాశారు. అప్పులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడమంటే ఆర్థిక శాఖ అధికారులు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సభకు సమాధానం ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా, జవాబుదారీతో ఉండాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులకు గట్టిగా చెప్పాలని ఆ లేఖలో బొత్స విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టారు.. 2024–25, 2025–26లో రాష్ట్ర అప్పుల వివరాలపై మండలి గత సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ తప్పుడు గణాంకాలతో సమాధానం ఇచ్చిందని బొత్స లేఖలో పేర్కొన్నారు. 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని ‘కాగ్’ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మార్చి 6వ తేదీన సభకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిందని, అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం 2024–25లో అప్పు రూ.60,485.40 కోట్లుగా పేర్కొన్నారని బొత్స గవర్నర్ దృష్టికి తెచ్చారు. మరోవైపు 2025–26 ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల్లో రూ.85,269.19 కోట్లు అప్పులు చేస్తే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం రూ.53,878.71 కోట్లుగా> సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టి తక్కువగా చూపించినట్లు తేలిందన్నారు. కాగ్ నివేదికతో పాటు బడ్జెట్ డాక్యుమెంట్లలో 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 2024–25, 2025–26లో బడ్జెటేతర అప్పుల వివరాలను వెల్లడించాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయంలో కూడా తప్పుడు సమాచారాన్ని సభకు సమర్పించినట్లు తెలిపారు. రూ.53,878.71 కోట్లు మినహా 2025–26లో ప్రభుత్వం మరే ఇతర రుణం తీసుకోలేదని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. పలు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు చేస్తున్నా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ అధికారి ఇలా చట్టసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఆ శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. తప్పుడు సమాధానాలు ఆర్థిక శాఖ సమగ్రతకు హాని కలిగించమే కాకుండా చట్ట సభ స్థాయిని దిగజార్చి కించపరచడమే అవుతుందని బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బడ్జెటేతర అప్పులను మాత్రమే సమాధానంలో ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పులను దాచి పెట్టడం ద్వారా ఆర్థిక శాఖ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికారులు రాజకీయ వైఖరితో సమాధానాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. జవాబుదారీతనంతో చట్టసభలకు వాస్తవ సమాచారాలను అందించాల్సిన కార్య నిర్వాహక వర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడమేనని బొత్స స్పష్టం చేశారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే 'మావిగన్': వైఎస్ జగన్
చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడ రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్ల వంటి బేసిక్ వసతులు కల్పించడానికే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని నీ అంతట నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు డీపీఆర్లు ఇచ్చావు. మరోవైపు లక్ష ఎకరాల్లో అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అందుకే చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్గా 10 శాతం ఖర్చుతో ‘మావిగన్’ను సూచించాం. కూటమి పాలనలో సగం టర్మ్ అయిపోయింది. అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యం. అంతటా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో ఏడాది దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగబాధ పడిపోతున్నాడు. వైఎస్సార్సీపీ శ్రేణులందరిపై అన్యాయమైన, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు రేప్పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం. వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?వారికైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు. ఈ లోకేశ్ చెప్పడు. ఈ దత్త పుత్రుడు చెప్పడు. సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. ఈ రోజు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. జైళ్లలో పెడుతున్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కొడుతున్నారు. రేప్పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే.. తక్కువగా మాట్లాడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణ భారం పడదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలని.. ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉన్నందున రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యే సరికి ఎన్నో ఏళ్లు, దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని.. దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని.. అందుకే ప్లాన్ బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు. అయితే దీని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్దలవుతాయని చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ గతి తప్పి మన పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామని.. ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మావిగన్.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ‘‘చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు డీపీఆర్లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే రూ.లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ.. లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేసూ్తనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు గడిచాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబూ.. ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు మావిగన్తో మంచి రాజధాని తక్షణమే అందుబాటులోకి వస్తుంది.ప్లాన్–ఏ వద్దన్నారు.. ప్లాన్–బీ ఎందుకు ఆలోచించడం లేదు? ప్లాన్–ఏ వద్దన్నారు సరే.. మరి ప్లాన్–బీపై ఎందుకు ఆలోచన చేయడం లేదు? నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను. ప్లాన్–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నం. అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం. అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ, ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే.. నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అనుకుంటే ఈ ప్రాంతంలో నీవు చేసే పనికి రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా ప్లాన్–బీ కింద మావిగన్ ప్రతిపాదన తెచ్చాం.10 శాతం ఖర్చు చేస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబూ.. మేం కట్టాం. వైఎస్సార్ర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూ సేకరణ చేపట్టాం. మా హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మా హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్గా టై అప్ చేసి 30–40 శాతం వర్క్ కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు.. విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ హైవేకు అటూ ఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్లు ఇక్కడ కడితే బాగుంటుంది. మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వి), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనావిుక్ కారిడార్ను కేపిటల్ కారిడార్గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్లు ఇక్కడ కట్టండి. రూ.రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు.. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.జగన్ ఏం చెప్పినా ససేమిరా..మనమంత బాగా, లౌక్యంగా చెప్పినా ఊహూ అంటున్నాడు. ఎందుకు అహం? ఎందుకు వద్దంటున్నారంటే.. కారణం అక్కడ రూ.రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్ వర్కుల పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకోవచ్చు. మావిగన్లో ఈ ఆదాయాలు ఉండవు కదా.. కాబట్టి మావిగన్ వద్దు. అమరావతిలో అన్నీ స్కామ్లే. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరంటే ఒకరు ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయలరఘు (ఆర్జీవీ), ఇంకొకరు బీఎస్ఆర్ (బలుసు శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినావీులు. వారి సంస్థలకు కాంట్రాక్ట్లు. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్ అంటే అహం.. వైఎస్ జగన్ ఏం చెప్పినా ఊహూ అంటున్నారు. చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ⇒ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాను.. ఇంకా అవి కాకుండా అంతకు మించి సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు కూడా ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ, ఈ రోజు బిర్యానీ పెట్టలేదు.. ఉన్న పలావు కూడా పోయిందని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం కనిపిస్తోంది.⇒ విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఎక్కడా పలాన మంచి చేశామనే చెప్పే పరిస్థితి లేదు. మన ఐదేళ్ల పాలనలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2.73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి.. వారి ఆధార్ నంబర్లు సహా జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ⇒ కానీ ఇదే చంద్రబాబు రెండు సంవత్సరాలు కూడా తిరక్క ముందే రూ.3.52 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఈ అప్పు అంతా ఏమైంది? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలు ఏం జరిగినా రైతులను ఆదుకునే నాథుడు లేడు ⇒ కూటమి పాలనలో ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అంతటా దళారీల వ్యవస్థ. మన హయాంలో ఆర్బీకే, – ఈ క్రాప్, సీఎం యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్) పెట్టి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసే వాళ్లం. ఆ రకంగా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి. నేడు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు.⇒ రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకు వదిలేసిన పరిస్థితి. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాదీ అదే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం ⇒ చదువుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేసే వాళ్లం. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చే వాళ్లం. ఇప్పటికే రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ ఏడాది చేయాల్సిన చెల్లింపులు మరో రూ.2,600 కోట్లు కూడా చూస్తే మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిలు అవుతాయి. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. అందులో ఎంత ఇస్తారో తెలియదు.⇒ పిల్లలతో తల్లిదండ్రులు చదువులు మాన్పించి పనికి పంపిస్తున్న పరిస్థితి. స్కూల్స్లో నాడు–నేడు పూర్తిగా ఆగిపోయింది. పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలనే ఆరాటంతో మనం గోరు ముద్ద అనే కార్యక్రమం తీసుకొస్తే, ఈ రోజు కనుమరుగైన పరిస్థితి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించేవి. ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం. ఆరో తరగతి నుంచి డిజిటలైజ్ క్లాస్ రూమ్లు. గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేటు స్కూల్స్తో పోటీ పడే పరిస్థితికి మన హయాంలో తీసుకొచ్చాం. ఈ రోజు ఆ స్కూల్స్ అన్నీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మన కళ్లెదుటే కనిపిస్తోంది. వైద్యంపై ఆలోచన చేసే నాథుడే లేడు⇒ ఆరోగ్యశ్రీ పరిధి ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షలకు పెంచాం. ప్రొసీజర్లను దాదాపు 3,300కు పెంచాం. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం కోసం పేద, మధ్య తరగతి వాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చేయి పట్టుకుని నడిపించాం. రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు రూ.5 వేలు చేతిలో పెట్టి పంపించాం. ఈరోజు నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తాం.. అని ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈ రోజు కనిపించడం లేదు. ⇒ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో తెలియదు. మూడు డీఏలు పెండింగ్. ఐఆర్ ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ కమిషన్ను రద్దు చేశారు. కొత్త కమిషన్ను ఎప్పుడేస్తారో తెలియదు.మిగిలినవి రెండే బడ్జెట్లు.. హామీల అమలు లేదు⇒ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా నాకన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఇటీవల మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మిగిలి ఉన్నది కేవలం రెండే బడ్జెట్లు. ఈ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు మనకు కనిపించేవన్నీ మోసాలే. ⇒ సూపర్ సిక్సులు.. సూపర్ సెవెన్లు అన్నాడు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల మీద ఈయన (చంద్రబాబు), పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం.. జూన్ 2024 నుంచి ఇవన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చి మోసం చేసిన పరిపాలన చూస్తున్నాం.⇒ మేనిఫెస్టో అన్నది మన హయాంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్లుగా భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం. ఈ మేరకు ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా తలెత్తుకుని చెప్పేలా మన పార్టీ హయాంలో జరిగింది. ఈ రోజు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్లీ చూస్తున్నాం. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి.. జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.అంతా దోచుకో పంచుకో తినుకో.. డీపీటీ⇒ జగన్ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే దానిపై కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కారణం ఒక్కటే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా వచ్చేవి. ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ). రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ వీళ్లు దోచుకోవడానికి, వీళ్లు పంచుకోవడానికి, వీళ్లు తినుకోవడానికే సరిపోతున్నాయి. ⇒ ఈ రోజు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా వీధి వీధినా బెల్ట్ షాపులు. పోలీసులే దగ్గరుండి ఆ బెల్టు షాపుల్లో అమ్మించే కార్యక్రమం. ఎమ్మార్పీ కంటే రూ.10, రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అంతా వీళ్ల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే సరి. లేదంటే చికెన్ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆ స్థాయిలో దోచుకుంటున్నారు. ⇒ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి యూనిట్ ఇచ్చేలా పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో ఆ మేరకు పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీ చేసిన వీళ్లు ఈ రోజు రూ.4.60తో పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి వీరి అక్రమాలన్నీ. ⇒ ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు తన సమీప బంధువు అయిన విశాఖపట్నం ఎంపీకి ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు. అమరావతిలో కళ్ల ఎదుటే యథేచ్ఛగా దోపిడీ ⇒ అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ లెవెల్లో.. ఇటాలియన్ మార్బుల్ వంటి సదుపాయాలతో కట్టినా చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4,500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరు రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది. ఎక్కడా లేని స్కాములు.⇒ ఈ స్కాముల్లో భాగస్వాములు ఎవరంటే ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇంతకు ముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. చంద్రబాబు మనుషులే కాబట్టి ముందుగానే 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల పనులు.. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. పనులు చేయడం కథ దేవుడెరుగు.. మొదట మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?రాక్షస పాలనలో ఇదీ యుద్ధం⇒ ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటి ప్రాజెక్టులు ఆపేయడం కనిపిస్తోంది. రైతులు, పిల్లలు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. స్కీముల కథ దేవుడెరుగు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని దుస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. ⇒ రాష్ట్రంలో ఏ మాదిరిగా పరిపాలన సాగుతుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది. ప్రజల తరుఫున, మంచి తరఫున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్సార్సీపీ ఒకవైపున నిలుచుంటే.. మరోవైపు రాష్ట్రానికి అన్ని రకాలుగా చెడు చేస్తూ.. రాష్ట్రాన్ని దోచుకుని తింటున్న తెలుగుదేశం పార్టీ. ఈ యుద్ధంలో దేవుడు కచ్చితంగా మనపక్షానే నిలుస్తాడు. రేప్పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఫుట్ బాల్ను తన్నినట్టు తంతారు. సింగిల్ డిజిట్ కూడా చంద్రబాబుకు రాకుండా ఉండే పరిస్థితి అతి త్వరలోనే వస్తుంది. ⇒ వైఎస్సార్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే. కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ⇒ ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వీళ్లపై యాక్షన్ ఏదీ?రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని బాధితురాలు ఆందోళన చేస్తుంటే.. న్యాయం చేయమని కంప్లైంట్ ఇస్తే.. ఆమెనే కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కి తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే పోలీసుల సమక్షంలోనే కొడుతున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బాత్రూంలోకి పోయి డోర్ గడియ పెట్టుకున్నాడు. ఎస్పీ ఆఫీసులోకి పోవడమేంటి? బాత్రూంలోకి వెళ్లి డోర్ గడేసుకోవడమేంటి? గడేసుకుని స్ట్రైక్ చేయడమేంటి? తీసుకెళ్లి బొక్కలో వేయకుండా చంద్రబాబునాయుడు పంచాయితీ చేస్తున్నాడు.బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడో మనందరం చూసూ్తనే ఉన్నాం. టీటీడీ చైర్మన్గా ఉండి చేయకూడని తప్పులు చేస్తుంటే ఏం చేయాలి? ఆ మనిషిని టీటీడీ పదవిలో నుంచి ఊడబెరకాలా? వద్దా? చంద్రబాబు పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు. ఇంత దారుణంగా తయారయ్యారు.ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహిళలకు వీడియో కాల్స్ చేసి అశ్లీలంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆడవాళ్లకు ఫోన్ చేసి అశ్లీలంగా వ్యవహరించాడు. అది బహిరంగంగా కనపడుతూనే ఉంది. ఎలాంటి యాక్షన్ లేదు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలపై దారుణంగా లైంగిక దాడులు చేసినా పట్టింపులేదు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీరంతా ఎమ్మెల్యేలు.. ఒకరు తప్పు చేస్తే ఏం యాక్షన్ లేదు.. ఆడి మీద యాక్షన్ లేదు కాబట్టి.. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారులే అని ఇంకొకడు. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు రాక్షసులవుతున్న పరిస్థితి. మహిళను లైంగికంగా వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ.. ఆ పీఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీదే ఎదురు కేసు. ఈ స్థాయిలో రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంటే.. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకరు. -
ఏబీఎన్పై జాతీయ మహిళా కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్.. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధుల్ని అగౌరవ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆమె ఓ లేఖ రాశారు.తమ పార్టీ నేతలతో పాటు మహిళల్ని కించ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో వరుదు కళ్యాణి ఇంకా ఏం పేర్కొన్నారంటే..మీడియా స్వేచ్ఛ పేరుతో ఏబీఎన్ వ్యక్తిత్వ హననంఏబీఎన్ ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యం తమ ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ వీడియో లింక్ : https://youtu.be/nF_9828F18c సహా, అత్యంత అపకీర్తికరమైన, అవమానకరమైన, తప్పుదారి పట్టించే, అనైతిక విషయాలను ప్రసారం చేసినందుకు సంబంధించి తక్షణ జోక్యం, తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇందులో అన్నీ అవాస్తవాలతో పాటు దురుద్దేశపూర్వక, హానికరమైన విషయాలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఇది నిష్పక్షపాత పాత్రికేయ కథనం కాదు. ద్వేషం, హేళన, పక్షపాతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నింపేందుకు ఉద్దేశించిన పక్షపాతపూరిత, ఏకపక్ష కథనమే.వైఎస్సార్సీపీ నేతలపై దారుణ వ్యాఖ్యలుఏబీఎన్లో ప్రసారమైన ఈ కథనంలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం మధ్య ముఖ్యంగా,యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువుకు భంగం కలిగించే భాషను వాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను, మద్దతుదారులను వెన్నెముక లేని వారిగా అభివర్ణించింది. అంతేకాక వారు తమ నాయకుడికి ఆపాదించిన అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలను కూడా గుడ్డిగా నమ్ముతారని అనుకునే విధంగా పలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా చేసింది.రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలు మీ భార్యలు కాదని చెప్పితే, మీరు గుడ్డిగా విశ్వసిస్తారు, అంతేకాదు మీ సొంత భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి, పెళ్లి సంబంధాలకు కూడా చూసుకుంటారు, ఇలాంటి నాయకులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితం, తీవ్ర అభ్యంతరకరం. ప్రజల దృష్టిలో వైఎస్సార్సీపీ నేతల ప్రతిష్టను పలుచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.కనీస బాధ్యత లేని పాత్రికేయంఈ వివాదాస్పద కథనంలో ఏబీఎన్.. వైఎస్సార్సీపీ నేతల్ని తెలివి, హేతుబద్దత, బుద్దీ జ్ఞానం లేని వారిగా చిత్రీకరించింది. అలాగే మా పార్టీ విధానాల్ని పిచ్చి ప్రతిపాదనలు అంటూ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. ఈ కథనంలో యాంకర్ మరింత ముందుకు వెళ్లి తమ పార్టీ నేతల్ని పిచ్చి వాళ్ల సమూహంగా కూడా అభివర్ణించడం దారుణం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన, పరువు నష్టం కలిగించే కథనమే అవుతుంది. ఈ వ్యాఖ్యలకు ఏ విధమైన వాస్తవ ఆధారాలు లేవు. లేదా ధృవీకరించబడిన మూలాలు కూడా లేవు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా సాధారణీకరించి, కేవలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా వండి వార్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో వాడిన భాష కూడా అత్యంత అసభ్యంగా ఉంది. పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక మర్యాదా ప్రమాణాలను కూడా ఉల్లంఘించింది.ఏబీఎన్ కథనం కేబుల్, టెలివిజన్ చట్టం ఉల్లంఘనేఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కథనం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ (నియంత్రణ) చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్ ను పూర్తిగా ఉల్లంఘించింది. ఆ కోడ్ ప్రకారం అగౌరవ, తప్పుడు, అర్థసత్యాలైన విషయాలను ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా నిషిద్దం. ఎందుకంటే ఇది ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేది, తప్పుదారి పట్టించేదిగా ఉంది. అలాగే నిర్లక్ష్యంగా వండి వార్చడంతో పాటు ద్వేషం కలిగించేలా దీన్ని రూపొందించారు. వాస్తవాలను ధృవీకరించకపోవడం, సమతుల్య అభిప్రాయాలు ఇవ్వకపోవడం, లేదా ప్రతిస్పందనకు అవకాశం కల్పించకపోవడం మీడియా బాధ్యత, నైతిక ప్రమాణాల తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. అలాగే ఏబీఎన్ సంస్థ సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లోపించిందని అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యేందుకు అవకాశం లభించింది.తక్షణం ఏబీఎన్ పై కఠిన చర్యలు తీసుకోండిఈ కంటెంట్ డిజిటల్ వేదికలపై కొనసాగుతూ అందుబాటులో ఉండటం వల్ల తమ పార్టీకీ, అధినేత జగన్కు జరిగిన నష్టం మరింత పెరుగుతోంది. ఎందుకంటే ఇది విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండి వారికి పరువుకు భంగం కలిగించేలా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుంది. అలాగే మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై చట్టప్రకారం తగిన చర్యలు ప్రారంభించాలి.అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో ప్రోగ్రామ్ కోడ, పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడాల్సిన అసరం ఉంది. ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఛైర్ పర్సన్ ను కోరుతున్నాం. న్యాయం, నిష్పాక్షికత, వ్యక్తులు, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఆదేశాలను కూడా జారీ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విజ్ఞప్తి చేశారు. -
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమర్థించడం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు కావని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని చెప్పారు.రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ సూచించిన మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే రాధాకృష్ణతో కుట్రలు చేయించారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసే కుట్రవీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైఎస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైఎస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని కూటమి నాయకులకు అర్థమైపోయింది. దాన్నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే ప్లాన్ ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో ఎవరైనా వైఎస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అయితే వారిపై అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసి మావిగన్ అనే పేరెత్తకుండా చేయాలనే పథకం ప్రకారం కుట్ర చేశారు.అవే మాటలను మీకు అన్వయించుకోండిప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు లేదా? వైఎస్ జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? జగనన్న కళ్లలో ఆనందం కోసం వైయస్సార్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారని చెబుతున్న నారా లోకేష్, ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చినందుకా?ఇదేనా భువనేశ్వరి.. లోకేష్కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు. ఆమెకు పదవి ఇచ్చింది జగన్ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టినప్పుడు సై అన్నారు. మోదీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వచ్చి న వ్యాఖ్యలు కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల సమర్థింపుతో కావాలని చేసిన కుట్రేనని తేలిపోయింది.వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్ జగన్ ఆధారాలతో సహా వెలికితీయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తావించిన మావిగన్ మోడల్తో చంద్రబాబు వేల కోట్ల అవినీతి ఆశలు కుప్పకూలిపోయాయి. వాటి నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలు చేస్తున్నారు. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు -
నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
మావిగన్ పంచ్తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
సీఎం రిలీఫ్ ఫండ్లో తమ్ముళ్ల పర్సెంటేజీల గోల
సాక్షి, అన్నమయ్య: రాబందువులుగా మారిన కూటమి పార్టీల నేతలు.. ప్రజలను పీక్కుతిన్నంత పని చేస్తున్నారు. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్లోనూ తెలుగుదేశం తమ్ముళ్లు ప్రదర్శించిన చేతివాటం బాధితుడి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. ఓ బాధితుడికి మంజూరైన సొమ్ములో సగానికి పైగా తమ అకౌంట్లో జమ చేసుకున్నాడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. రాజంపేటకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చి ఫోన్ చూసిన ఎల్లయ్యకు మతిపోయింది. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసి నిలదీశాడు ఎల్లయ్య. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గపు మాటలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మరోసారి స్పందించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గంగా మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడింది తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్లు సమర్థిస్తారా?. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. కూటమి నేతలే మహిళల్ని వేధిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తే.. బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఎస్పీ ఆఫీసులోకి ఎమ్మెల్యే చొరబడడం ఏంటి?. దానికి చంద్రబాబు పంచాయితీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధించిన కూన రవిపై చర్యలేవి?. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్పై చర్యలేవి?. మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారు?. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో ఆడుకుంటే చర్యలు లేవు. పైగా చంద్రబాబు ఆయన్ని తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
రాధాకృష్ణ.. పిచ్చి కూతలు, రాతలు రాస్తే తగలబెట్టేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు. ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్ చేశారు. -
రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది.జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర శాఖల్లోనూ పనులు నడవడం లేదు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో నాకేం పదవులు అవసరం లేదు.. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి పాలనలో కమ్మని ప్రభుత్వం అన్నందుకు ఆదినారాయణరెడ్డిపై కూటమి నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరో మారు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’
తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. ‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. -
ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్ షాక్..
సాక్షి, కడప: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక తనిఖీలు చేసి హడావుడి చేద్దామనుకున్న పచ్చ పార్టీకి ఎమ్మెల్యే.. అక్కడున్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. చేసేదేమీ లేక ముక్కుమూసుకుని బయటకు వచ్చేశారు. దీంతో, కూటమి సర్కార్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో ఓ ప్రజా ప్రతినిధి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన నియోజకవర్గంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగా కడప నగరం ముతరాసుపల్లి జడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితులను చూసి మాధవి రెడ్డి జడుసుకున్నారు. స్కూల్లోని బాత్రూమ్లను చూసి ఒక్కసారిగా ముక్కు మూసుకుని బయటకు వచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. అనంతరం, మండుటెండలో మట్టిలో పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి అవాక్కయ్యారు. నాణ్యత లేని భోజనం పెట్టడాన్ని చేసి ఎమ్మెల్యే ఖంగుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు.. ప్రతి రోజూ భోజనం బాగాలేదు అని మాధవికి చెప్పడం మరో విశేషం. ఇలా ఒక్కో సమస్యను విద్యార్థులు.. మాధవి రెడ్డి దృష్టికి తీసుకురావడంతో రివర్స్లో ఆమెకే షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, చెప్పేది, చేసేదీ ఏమీ లేక మాధవి రెడ్డి అక్కడి నుంచి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్పై నెటిజన్లు మండితున్నారు. రాష్ట్రంలో స్కూల్స్ నిర్వహణపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. -
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం.


