breaking news
-
‘కూటమి సర్కార్ పబ్లిసిటీ మీద బతుకుతోంది’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు...చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘అన్ని గుర్తు పెట్టుకుంటాం.. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు. -
ఈనాడు సంపాదకీయంపై YSRCP ఎస్సీ సెల్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేదిమరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్ నిప్పులు చెరిగారు.‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్ని ప్రేమిస్తారు..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు హెచ్చరించారు. -
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ జరిగింది..రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
కూటమి గుండెల్లో అప్పుడే గుబులు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘బాబూ.. రైతుల జీవితాలతో ఆటలా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. -
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్ప్లాంట్పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్ప్లాంట్పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు. ఆ ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించడంపై డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్-8 రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువులో ప్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనలో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీపై నిందలు వేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మద్దతుగా వారి తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం..రాజధాని కోసం ప్రభుత్వానికి పొలం ఇస్తే.. అందుకు బదులుగా ఇంత ఎత్తు మునిగిపోయే చోట ప్లాట్ ఇచ్చారని రైతు రామారావు మీతో చెప్పుకున్నాడు. అయినా అతని ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదు. మా ఇల్లు అభివృద్ది కోసమని తీసుకుని ఎక్కడో ఫ్లాట్ ఇస్తే హైదరాబాద్ తరహాలో దొంగలు వచ్చి మా పీకలు కోసే పరిస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేస్తోందో ఇదే నిదర్శనం. వారికి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తుంది వేరొకటి అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మా పై ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టా భూములు తీసుకుని చెరువు భూముల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తే రేపు చట్టబద్దంగా చెల్లుతుందా ?, రైతు మీ మీద నమ్మకంతో తమ భూములిస్తే ప్లాట్లు చెరువుల్లో ఇస్తారా ? దొండపాటు, పిచ్చుకలపాలెంలో చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ రైతులు మనోవేదనతో బాధలో ఉన్నారు. తీవ్ర మనోవేదనలో అమరావతి రైతులు28 వేల మంది రైతులు వాళ్ల పొలాలు ఇస్తే అందులో ఎకరం ఉన్న రైతులు 19,970 మంది ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్లు 4,214 మంది, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్లు 3,200 మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 829 మంది ఉన్నారు. ఈ లెక్కన ఎకరం, రెండెకరాలు ఉన్న 23 -25 వేల మంది రైతులు మీ అభివృద్ధి మాటలు నమ్మి పొలాలు ఇస్తే వాళ్లకు 29 గ్రామాల్లో చెరువులు, వాగులు పూడ్చేసి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువుల్లో ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?, ఈ బాధలన్నీ వాళ్లకూ తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చనిపోయిన రైతు దొండపాటి రామారావు మరణం.రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటంచెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చిన మాట నిజం కాదా?, చెరువును పూడ్చిన చోట ప్లాట్ ఇస్తున్నామని రైతులకు చెప్పారా ?.అది మోసం కాదా ?. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చారా ?. ఇప్పటికైనా బ్యాంకు రుణాలకు పనికొచ్చే పట్టా భూములు ఇవ్వాలి, వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకు రావాలి. చెరువుల్లోనే ప్లాట్లు ఇస్తాం, ఉంటే ఉండండి, పోతే పోవాలని అంటే ఆ రైతుల తరపున వైఎస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఇచ్చిన పొలాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వారికి న్యాయం చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేశారు. -
‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై కూటమి సర్కార్ బురద జల్లడమే పనిపెట్టుకుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట టీటీడీ బోర్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. వరస సెలవులతో భక్తులు ఎక్కువగా వస్తారనే ఇంగితజ్ఞానం లేదా?. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా.. జాగ్రత్తలు తీసుకోరా..?. తిరుమల రావాలంటేనే భక్తులు భయపడేలా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో పాలన చేస్తోంది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘దయచేసి వెంకటేశ్వర స్వామికి రాజకీయాలు ముడిపెట్టకండి. సనాతన ధర్మం మాట్లాడే పవన్ వీటి గురించి పట్టించుకోరా?. ఇంకెన్నాళ్లు గత ప్రభుత్వం అంటూ బురదజల్లుతారు?. భక్తుల రద్దీ దృష్ట్యా చర్యలు తీసుకోలేని బోర్డు ఉండీ ఏం ఉపయోగం..?. భక్తులకు రక్షణ ఇవ్వలేని బోర్డు అవసరమా..?. మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. -
పలమనేరులో రెచ్చిపోయిన కూటమి నేతలు
చిత్తూరు జిల్లా: పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయారు. దారి ఇవ్వలేదని కారణంతో కొబ్బరి చెట్లను కూటమి నేతలు నరికేశారు. బైరెడ్డి పల్లి మండలం మిట్టపల్లిలో ఘటన జరిగింది. నాగిరెడ్డిపల్లికి చెందిన మురుగేశ్ శెట్టి, కిషోర్, జనార్ధన్, నాగరాజు శెట్టి, రాజా, మోహన్, శంకర్లు గురువారం అర్థరాత్రి కొబ్బరి చెట్లను నరికి వేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.హైకోర్టు పరిధిలో విచారణలో ఉండగా తమపై దాడి చేసి.. కొబ్బరి చెట్లు ధ్వంసం చేశారని.. తమ ప్రాణాలకు రక్షణ లేదని మిట్టపల్లికి చెందిన సంపంగి, కృష్ణప్ప, రుద్రప్ప, వేణుగోపాల్ బాధితులు అంటన్నారు. -
మేం వచ్చాక అన్నీ సరిచేస్తాం: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నల్లరాళ్లపల్లై గంగమ్మ గుడి సీసీ రోడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని.. అసంతృప్తితో ఉన్నారన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన ఉచిత హామీలు నమ్మిన ప్రజలు.. ఓట్లు వేసి మోసపోయారు. అబద్ధపు హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ ఐదేళ్లు పాలన ఎలా ఉంది, చంద్రబాబు ఏడాదిన్నర పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. చంద్రబాబు వైఫల్యాలే వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది. కూటమి ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తోంది. మేం వచ్చాక అన్నీ సరిచేస్తాం’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. -
వైఎస్సార్సీపీ ర్యాలీ అడ్డగింత.. మచిలీపట్నంలో ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల ఆంక్షలతో మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వంగవీటి మోహన రంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ర్యాలీని మాత్రమే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైఎస్సార్సీపీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే.. ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల ర్యాలీ ఉందని.. ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. అయితే తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు.వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని.. ఇరవర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాట్లు చేసినట్లు సీఐ ఏసుబాబు వివరించారు. ఈ వివరణతో పేర్ని నాని మండిపడ్డారు. పోలీసుల తీరు.. ‘పచ్చ’పాత ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు పేర్ని నాని డిమాండ్తో దిగొచ్చిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది. -
తాడిపత్రిలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త.. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను టీడీపీకి ఓటు వేసి తప్పుచేశానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను వీడియో చేశారు. దీంతో, సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది.తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడగూరుకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ.. నేను టీడీపీకి ఓటు వేసి తప్పు చేశాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 మాసాలైనా నా తల్లికి పెన్షన్ మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ కోసం ఎంతో పనిచేశాం. నా సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టాను. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాం.కానీ, ఇప్పుడు కార్యకర్తలనే పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు. మాకు అన్యాయం జరుగుతున్నా చూసిచూడని విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు సరిగా అందడం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘రుషికొండ’పై మా అభిప్రాయాలు తీసుకోలేదు: విష్ణుకుమార్ రాజు
సాక్షి, ఏయూ క్యాంపస్: రుషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బీచ్రోడ్డులోని మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. రుషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. రుషికొండను ఆదాయ వనరుగా చూడకూడదన్నారు. ఈ భవనాలను స్టార్ హోటల్స్కు ఇచ్చి సామాన్యులకు దూరం చేయవద్దని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ పరంగా మాట్లాడటం లేదన్నారు. విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. రుషికొండ భవనాల గురించి పునరాలోచించాలని సూచించారు. మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. తనను కానీ, ఇతర ఎమ్మెల్యేలను కానీ ఎవరూ అభిప్రాయం అడగలేదన్నారు.ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పారు. మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తామనడం తగదన్నారు. బడా హోటల్స్కు ఈ భవనాలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వార్తాపత్రికల్లోనే తెలుసుకున్నానని తెలిపారు. ఈ భవనాలను టీటీడీకి ఇచ్చి వివాహ వేదిక నిర్మించి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే వేదికగా నిలపాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. -
నాడు అవాకులు చెవాకులు: నేడు దానిపై రెండు ఫ్లోర్ల నిర్మాణానికి ప్లాన్
చంద్రబాబు నేడు ఏ అంశాన్ని గట్టిగా విమర్శిస్తున్నారంటే నాలుగు రోజుల తరువాత అదే అంశాన్ని ఫాలో అవుతారని అర్థం. వైయస్ జగన్ ఆనాడు అమలు చేసిన సచివాలయ వ్యవస్థను విమర్శించిన బాబు.. నేడు మళ్లీ అదే వ్యవస్థపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు అయిన గ్రామ సచివాలయాలు నేడు పాలనకు పట్టుగొమ్మలైనాయి.ఇది వందల కోట్లు పెట్టి కట్టిన ప్రాసాదం.. ఇది ప్రభుత్వ ఆస్తి కానే కాదు.. వైయస్ జగన్ విలాసాల కోసం నిర్మించుకున్న ప్యాలెస్. ఇందులో బోలెడు లొసుగులున్నాయి. నిబంధనల అతిక్రమణ ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగించి.. కొండలు తొలిచి మరీ నిర్మించారు.. ఇలాంటి భవనాన్ని మనం నిర్వహించలేం. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి.. ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలి అంటూ చంద్రబాబు ఏదేదో చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా మక్కికిమక్కీ ప్రసారం.. ప్రచారం చేయడం ఈ ఏడాదిన్నరలో చూస్తూ వస్తున్నాం. చూసే జనాలకు కూడా అదేదో వైయస్ జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా అనుమానాలు.. కాదు ఏకంగా నమ్మకం కలిగించేలా చంద్రబాబు ఆయన అనుచరులు మాట్లాడారు.ఏకంగా దాన్ని రుషికొండ జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసారు.. అయితే అదే ఇప్పుడు విశాఖ నగరానికి తలమానికం అయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్కు చెందిన జాగాలో గతంలో ఉన్న కాటేజీల స్థానంలో ఈ అధునాతన భవంతిని తక్కువ బడ్జట్లో వైయస్ జగన్ నిర్మించారు. అయితే దాన్ని రకరకాలుగా వక్రీకరించి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత గొప్పగా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఋషికొండ భవనాలపైన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన , స్మార్ట్ మీటర్లపైన, తిరుమల లడ్డూపైన, వివేకా హత్య కేసుపైన, ముఖ్యంగా ఏపీ అప్పులపైన... పనిగట్టుకుని పుకార్లు.. అబద్ధాలు ప్రచారం చేసిన బాబు నేడు అదే రుషికొండ ప్యాలెస్పై ప్రభుత్వ ఆస్తిగా చూపుతూ దాన్ని ఇంకోరకంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.దాన్ని లీజుకు ఇవ్వాలంటూ టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్స్.. లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ల వారు ఈ ప్యాలెస్లను అడుగుతున్నారు. దాన్ని వారు స్టార్ హోటళ్లుగా మార్చుకుని ప్రభుత్వానికి నెలనెలా అద్దె చెల్లించే ప్రాతిపదికన ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం.. తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చినట్లు ఇది నిరర్ధక భవనం కాదని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హోటల్ లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి వాటికి ఎంతగానో పనికొస్తుందని అర్థమవుతోంది.మరోవైపు ఈ భవనం మీద మరో రెండు అంతస్తులు నిర్మించడం ద్వారా దాన్ని మొత్తం 150 గదుల హోటల్గా మారిస్తే దానికి పూర్తి సార్థకత వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంటే వైయస్ జగన్ ఆనాడు నిర్మించిన భవనం ఇప్పుడు ఒక స్థిరమైన ఆస్తిగా మారి విశాఖకు వన్నె తెచ్చిందన్నమాట. మరి ఇన్నాళ్లుగా అది వైయస్ జగన్ సొంత ఆస్తిగా ప్రచారం చేస్తూ వచ్చిన మీడియా.. తెలుగుదేశం నాయకులూ.. దీనిపై ఏమంటారు.. అది జగన్ ఆస్తిగా చెప్పారు కదా మరి దాన్ని ఆయనకు ఇచ్చేస్తారా? లీజు డబ్బు జగన్ కుటుంబానికి అందజేస్తారు అంటూ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రశ్నల పరంపర మొదలైంది. అప్పుడు ఈ భవనం మీద ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నేడు మళ్ళీ అదే భవనాన్ని గొప్పగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం ఆయన అవకాశవాద తీరుకు నిదర్శనం అని అంటున్నారు- సిమ్మాదిరప్పన్న -
బాబూ.. కేసులు కొట్టేస్తే అంతా అయిపోతుందా?: పొన్నవోలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో నియంత పాలన నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కూటమి పాలనలో వ్యవస్థలు కీలుబోమ్మలుగా మారాయని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు కొట్టివేయించుకుంటున్నారు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులన్నింటిపై ఉన్నత న్యాయస్థానంలో కొట్లాడుతాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ ఒక్క నెలలో ఎలా కొట్టివేశారో అర్థం కావడం లేదు. కేసు పెట్టిన వ్యవస్థలే చంద్రబాబు నీతిమంతుడు అని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఐడీ, సిట్ సాక్షాదారాలు లేవని చంద్రబాబుపై ఉన్న కేసులు కొట్టివేశారు.స్కీల్ డెవలప్మెంట్ కేసులో వందల మందిని విచారించి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు అన్ని ఏమయ్యాయి?. ఏపీలో దొంగా పోలీసు ఆట నడుస్తుంది.. దొంగలు వారే.. న్యాయ నిర్ణేతలు వారే. కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబును జైలులో వేసింది. మరి ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి?. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు భవిష్యత్లో దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులపై మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్లాడుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
అరాచకాలకూ ప్రజలు మద్దతివ్వాలా?
‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్ రిజల్ట్’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్బుక్లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా లోకేశ్ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు. మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్బుక్లో భాగమైతే ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేశ్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్బుక్ మూడులో పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా? లోకేశ్ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్బుక్ ప్రభావమని లోకేశ్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు. అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్బుక్ పేరుతో లోకేశ్ బృందం చేసిన నిర్వాకమే కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్ పెత్తనం, పిచ్చి రెడ్బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే రెడ్బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
పసుపు పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే. ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు. మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే. -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?
సాక్షి, తాడేపల్లి: ఏ అంటే ఎటాక్.. పీ అంటే ప్రాపగాండ.. వెరసి చంద్రబాబు, లోకేష్లు ఏపీ అర్థమే మార్చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. అనంతపురం కదిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన.. దానిని వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో టీడీపీ అండ్ కో బోల్తాపడడంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రా కిమ్ నారా లోకేష్. ఆయన రెడ్ బుక్ మంత్రిగా మారారు. అనంతపురం జిల్లాలో జరిగిన కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకున్నారు. అజయ్ దేవ అనే జనసేన కార్యకర్తకి వైఎస్సార్సీపీ ముద్ర వేసి పోలీసులతో కొట్టించారు. సినిమాలో చూపించినట్టు రోడ్డుపై నడిపించారు. అసలు అజయ్ దేవతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.... అజయ్ దేవ జనసేన కార్యకర్త. అతని గ్రామానికే చెందిన జనసేన ఎంపీటీసి అమర్ వాస్తవాన్ని చెప్పాడు. బాధితురాలు, అజయ్ సొంత వదిన మరిదిలే. వారి కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. నారా లోకేష్ అన్యాయంగా జనసేన కార్యకర్తని కొట్టించారు. యోగి ఆదిత్య నాధ్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ పవన్ చెప్పిన 24 గంటల్లోనే లోకేష్ జనసేన మీదనే అమలు చేశారు. ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?. పిచ్చోడి చేతిలో రాయిలాగ లోకేష్ చేతిలో పదవి ఉంది. దీని వలన రాష్ట్రానికే ప్రమాదం’’ అని నాగార్జున యాదవ్ అన్నారు. -
మా అన్న పవన్ వీరాభిమాని: రజిత
సాక్షి, అనంతపురం: కదిరి ఘటనలో ఇంకో ట్విస్ట్ చేసుకుంది. అజయ్కు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అతని సోదరి రజిత స్పష్టత ఇచ్చింది. ఇంతకు ముందు.. ఇదే విషయాన్ని ఎంపీటీసీ అమర్ సైతం ధృవీకరించారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న అజయ్ జనసేన అని ప్రకటించారు. దీంతో ఎల్లో మీడియా ఎలివేషన్లు కాస్త తుస్సుమనిపిస్తున్నాయి. ‘‘మా అన్నకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదు. అతను ముందు నుంచే జనసేనలో ఉన్నాడు. మా అన్న మొదటి నుంచి పవన్ అభిమానే. అందుకే చెయ్యిపై పవన్ కల్యాణ్ టాటూ కూడా వేయించుకున్నాడు(పీఎస్ పీకే). ఎంపీటీసీ అమర్తో మా అన్నకు పదేళ్ల పరిచయం ఉంది. పక్కా జనసేన. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు’’ అని రజిత ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అజయ్పై ఫిర్యాదు చేసిన గర్భిణీ కుటుంబంతో పాత గొడవలు ఉన్నాయని.. తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతుతుండడం గమనార్హం.వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నంలో పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కదిరి తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ బర్త్డేనాడు పటాకులు పేలుస్తున్న వాళ్లను ఓ గర్భిణిపై మందలించిందని.. అందుకు ఆమెను కాలితో తన్ని దాడి చేశాడని.. దీంతో ఆమె ఆస్పత్రిపాలై కడుపులో బిడ్డ కదలికలు సైతం లేవని.. పోలీసులు అతన్ని తమశైలిలో బుద్ధి చెప్పి(కోటింగ్) నడిపించారంటూ అజయ్ దేవ్ గురించి కూటమి అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఏపీలో ఆదిత్యా యోగినాథ్ ట్రీట్మెంట్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్.. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్తే అంటూ ఎల్లో మీడియా కలరింగ్.. అది నమ్మి కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్ను అదుపులోకి తీసుకోవడం.. నాటకీయ పరిణామాలను తలపించింది. చివరకు.. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్లైంది.ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్పినదాని ప్రకారం.. ఈనెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత అజయ్ కూడా కేక్ తిన్నాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంధ్యారాణితో అజయ్కి మాటామాటా పెరిగి గర్భిణి పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్సార్ సీపీ నేత అని.... గర్భిణి పై దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్సీపీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన నేత అని కదిరి పోలీసులు గుర్తించారు. అయితే... మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా ఆరోపణలు నిజం చేసే బాధ్యత తీసుకున్న పోలీసులు అజయ్ని ఊరేగించారు. ఇప్పుడు.. అజయ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అటు జనసేన అమర్ క్లారిటీ ఇవ్వగా.. ఇటు ఫేక్ ప్రచారంపై అజయ్ సోదరి రజిత భగ్గుమంది. -
ఎల్లో మీడియా ఎఫెక్ట్.. జనసేన కార్యకర్తకు పోలీసుల కోటింగ్!
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్కి వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. -
కల్లలైన బాబు ‘రియల్’ మాటలు!
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రచారం చేసిన విషయం ఒకటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆస్తుల విలువలు పెరగవని ప్రజలు, రైతులను బెదిరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కప్పిపుచ్చి భూముల విలువలు పడిపోయాయంటూ ఎల్లోమీడియా కూడా తన కథనాలలో విషం చిమ్మింది. ఏదైతేనేం.. ఎన్నికల్లో ఈ కూటమి అధికారం దక్కించుకుంది. ఇంకేం.. మా భూములు బంగారమవుతాయని అందరూ ఆశించారు. ఇరవై నెలలు గడిచిపోయింది కానీ.. వీరి ఆశలు మాత్రం పెద్దగా నెరవేరలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. 2023-24లో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.9546 కోట్ల ఆదాయం సమకూరింది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25లో మాత్రం ఈ సంఖ్యలు పడిపోయాయి. ఆదాయం రూ.8843 కోట్లు మాత్రమే. 2025-26లో రూ.10169 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా.. అక్టోబర్ నాటికి అయ్యింది రూ.ఏడు వేల కోట్లే. కూటమి ప్రభుత్వం 2024-25లోనూ రూ.11997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కానీ.. ఈ ఏడాది దీన్ని రూ.10169 కోట్లకు తగ్గించుకుంది. ఏటా ఆయా పద్దుల కింద ఆదాయం పదిశాతం వరకూ పెరిగేలా ప్రభుత్వాలు లక్ష్యాలు పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తుంటాయి. ఏపీలో మాత్రం లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్న మాట.రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను ఏభై శాతం మేర పెంచినా ఆశించినంత ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగించేదే. వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాజధాని అమరావతిలో ఖర్చు చేస్తున్నా ప్రజలలో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి తమ వెంచర్ల భవిష్యత్తు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు చాలామందికి నెలలకొద్దీ జీతాలు కూడా అందడం లేదని ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఇల్లు కట్టుకుంటున్నాను అంటూ చంద్రబాబు హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయన్న ప్రచారం రాజకీయ లబ్ది కోసం మాత్రమే చేసిన అబద్ద ప్రచారం అని స్పష్టమవుతుంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత సాగేది. విశాఖపట్నం వంటి చోట్ల జోరుమీద ఉండేది కూడా. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఈ రకమైన చర్యలతో ప్రభుత్వం విశాఖ ఇమేజీని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్న భావన ఏర్పడింది అంటున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే, ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టు వేగం మందగించింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైమ్లో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం అవి 80 దాటడం లేదట. తూర్పు గోదావరి జిల్లాలో 2023-24లో సుమారు 129355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కూటమి వచ్చాక ఏడాది కాలంలో ఇది 61597 డాక్యుమెంట్లకు పరిమితమైంది. కడపలో గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇప్పుడవి ఏభై - అరవై వరకే ఉంటున్నాయి.రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిమెంట్, ఐరన్, కలప పెయింటింగ్, విద్యుత్, ప్లంబింగ్ తదితర రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. జగన్ టైమ్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం, నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి, సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు కొనసాగడానికి ఉపకరించాయి. అయినా అప్పట్లో ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ఏవీ సజావుగా సాగడం లేదు. అమరావతి తప్ప మిగలిన రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురం సహా వివిధ జిల్లాలలో పేదలు, కూలీలు వలసలు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో పెరగలేదు. కానీ, భూముల వేలంపాటల్లో మంచి రేట్లు వస్తుండటంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కోకాపేట పరిసరాలలో ఇటీవల జరిగిన వేలంపాటలో ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్లు వచ్చాయి. అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అణా, బేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో 2020లో రూ.600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. వేలం పాట ద్వారా ఎకరాకు రూ.150 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. కానీ ఏపీకి వచ్చేసరికి సత్వా కంపెనీకి ఏభై కోట్ల విలువైన భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు ఉన్న యూసఫ్ అలీకి చెందిన లూలూ గ్రూపు అహ్మదాబాద్ లో సుమారు 16.35 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖల్లో నామమాత్రపు లీజుకు భూములు ఇచ్చేసింది.అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయ అంచనాలు దారుణంగా బోల్తా పడ్డాయి. వేర్వేరు మార్గాల ద్వారా మొత్తం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా అందిన రూ.7132 కోట్లు ఆశించిన మొత్తంలో 54 శాతమే కాగ్ వెల్లడించింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54వేల కోట్లకు చేరింది. ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తన ప్రభుత్వ అసమర్థతే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


